Vizianagaram
-
బ్యానర్...
నిరుపయోగంగా ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించిన భూములు రామభద్రపురం: అదిగో ఉద్యోగం.. ఇదిగో నిరుద్యోభృతి.. అదిగదిగో పరిశ్రమలు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం చేయడం.. హడావిడిగా శంకుస్థాపనలు చేయడం.. ఆ తర్వాత మిన్నకుండడం.. నమ్మిన నిరుద్యోగులను, ప్రజలను మోసంచేయడం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు వెన్నతోపెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. ఊరించడం.. ఉసూరుమనిపించడం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం, ఔత్సాహికులను ప్రోత్సహించడంలో ఏ ఒక్కరిలోనూ, ఒక్కచోట పరి‘శ్రమ’ కనిపించదు. దీనికి 11 నెలల కిందట రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని కాకర్లవలస వద్ద ఏపీఐఐసీకి చెందిన 20 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలు వచ్చేస్తున్నాయని, ఈ ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు స్థానిక ఎమ్మెల్యే బేబినాయిన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఊదరగొట్టారు. తీరా చూస్తే ఒక్క యూనిట్ కూడా ఏర్పాటుకాలేదు. మరోవైపు ఇప్పటికీ ముళ్లచెట్లతోనే ఆ స్థలాలు దర్శనమిస్తుండడం పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. మరింత భూమి సేకరణకు సన్నాహాలు.. ఎంఎస్ఎంఈ పార్కులో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటుకాకపోగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.. మరింత భూమిని సేకరించాలని నిర్ణయించడంపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, కలెక్టర్ రాంసుందరరెడ్డి, జేసీ సేతు మాధవన్ తదితరులు కారకర్లవలస వద్ద డీ పట్టా భూములు పరిశీంచారు. ప్రభుత్వ భూమి లేకుంటే జిరాయితీ భూములు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ఆర్డీవో, తహసీల్దార్లకు సూచించినట్లు తెలిసింది. ఇదే విషయంపై రామభద్రపురం తహసీల్దార్ అజురఫీజాన్ స్పందిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి రూ.7.48 కోట్లు డబ్బులు ఇచ్చి ఏపీఐఐసీ భూములు కోనుగోలు చేసిందన్నారు. ఆ భూములు ఏపీఐఐసీకి చెందుతాయని, మళ్లీ రైతులు పరిహారం అడగడం సబబుకాదన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపనే తప్ప పరిశ్రమల ఏర్పాటుకు నేతల చొరవ శూన్యం 11 నెలల్లో ఒక్క యూనిట్ ఏర్పాటుకాని వైనం రోడ్లు, కాలువల కోసం రూ.7కోట్లు నిధులు మంజూరు ఒక్క అడుగు ముందుకు కదలని అభివృద్ధి పనులు ముళ్లచెట్లతో దర్శనమిస్తున్న కాకర్లవలస ఎంఎస్ఎంఈ పార్క్ పాలకుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా భూములు రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ... మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి అప్పగించింది. సుమారు ఏడాది కిందట చంద్రబాబు ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించిది. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుచేసి చిన్న పెద్ద పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామంటూ గతేడాది మే నెల 10వ తేదీన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. 300 చదరపు గజాలతో 139 ప్లాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లు, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించారు. అయితే, పార్క్ అభివృద్ధికి చిన్నపనికూడా చేపట్టకపోవడం గమనార్హం. 50 శాతం రాయితీపై పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తామని ఏపీఐఐసీ ప్రకటించినా ఆసక్తిచూపేవారు కరువయ్యారు. మరోవైపు పరిశ్రమల కోసం భూములు సేకరించి ఏళ్లతరబడి వృథాగా విడిచిపెట్టడం, తమ కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉపాధి చూపలేదంటూ ఆ భూములను గిరిజన రైతులు సాగుచేయడం ఆరంభించారు. ఈ వివాదం కొనసాగుతోంది. -
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు స్పందన
● 228 వినతుల స్వీకరణ..విజయనగరం అర్బన్: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలపై వేగంగా స్పందించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ వినతులపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని.. మాట్లాడిన తేదీ, సమయం నమోదు చేయాలని సూచించారు. మొత్తం 228 వినతులు అందగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడం విశేషం. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గాలివాన
తెర్లాం మండలం పెదపాలవలసలో ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు తెర్లాం/మెరకముడిదాం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. గాలి దాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హోర్డింగ్లు, రేకులు ఎగిరిపడ్డాయి. మామిడి, మొక్కజొన్న పంటలకు అపారనష్టం వాటిల్లింది. రబీలో సాగుచేసిన వరి పంట కొన్నిచోట్ల నేలవాలగా, మరికొన్నిచోట్ల కోసిన చేను తడిసిముద్దయింది. ● తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన కాబోతుల రాము అనే రైతు ఎద్దు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. తెర్లాం ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ దాటిన తరువాత, డి.గదబవలస–పణుకువలస రోడ్డు మధ్యలో చెట్లు నేలకూలాయి. ఆమిటి గ్రామంలో పశువుల శాలలు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ● మెరకముడిదాం మండలం సోమలింగాపురం గ్రామ కూడలిలోని ఓ హోటల్ పైకప్పు, పలు షాపులకు చెందిన పైకప్పు రేకులు చెల్లాచెదురయ్యాయి. విద్యుత్తీగలు తెగిపడ్డాయి. సోమలింగాపురం, మెరకముడిదాం, బుధరాయవలస, గర్భాం, చినబంటుపల్లి తదితర గ్రామాల్లో కోసిన వరిచేను తడిసిపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మామిడి, మొక్కజొన్న రైతులకు అపార నష్టం తడిసిన రబీ వరి -
పిడుగు పడి మహిళ మృతి
వంగర: మండల కేంద్రమైన వంగర గ్రామానికి చెందిన ఇనమల నరసమ్మ (48) పిడుగుపాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. సహచర మహిళా కూలీలతో కలిసి నరసమ్మ వ్యవసాయ పనులకు సోమవారం ఉదయం వెళ్లింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అప్పటికే కూలీలు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా నరసమ్మపై పిడుగు పడింది. దీంతో మహిళా కూలీలు, రైతులు ఆమెను గ్రామంలోని పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాజాం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త రాము, కొడుకు సన్యాసినాయుడు ఉన్నారు. నెల రోజుల కిందటే కుమారుడు సన్యాసినాయుడుకు వివాహం జరిగింది. ఇంతలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై షేక్ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయరాంపురంలో ఎద్దు .. తెర్లాం: మండలంలోని విజయరాంపురంలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాబోతుల రాము అనే రైతు తన రెండు ఎద్దులను మేత కోసం సోమవారం సాయంత్రం పొలానికి తోలుకొని వెళ్లాడు. పొలంలో ఎద్దులు మేత మేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతును ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బూరి మధుసూదనరావు కోరారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉపాధ్యాయుడి సత్తా..
కొమరాడ: మండలంలోని గుణదతీలేస్ పంచాయతీ బిన్నిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు. రెండు రోజులుగా రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించడంతో పలువురు ఆయన్ను అభినందించారు. సుందరపేట సీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్సపూసపాటిరేగ: భోగాపురం మండలం సుందరపేట సీహెచ్సీలో సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే.. చోడిపిల్లిపేటకు చెందిన చోడిపిల్లి దేవి ప్రసవం కోసం సుందరపేట ఆస్పత్రిలో చేరింది. పురిటినొప్పులు రావడంతో వైద్యులు ప్రసవం జరిపించగా.. బిడ్డ సగం వచ్చి నిలిచిపోవడంతో వెంటనే వైద్యులు అలేఖ్య, సునీల్ స్పందించి అతి కష్టంమీద శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్కు రిమాండ్ బొండపల్లి: మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులతో పట్టుబడిన ఆటో డ్రైవర్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గజపతినగరం ఫస్టక్లాస్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయ్ రాజ్కుమార్ సోమవారం తీర్పు చెప్పారని ఎస్సై యు. మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన తలే నారాయణ రెండు రోజుల కిందట ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తూ మండల కేంద్రంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో ఆయన మద్యం మత్తులో ఉండడంతో పాటు ఆటోకు ఇన్సూరెన్స్ కూడా లేదు. దీంతో ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి నిందితుడ్ని సోమవారం కోర్టులో హాజరుపరచగా..న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన కొక్కిరెడ్డి గణేష్ (32) ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. మద్యం తాగుతూ బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడంటూ తల్లి దుర్గమ్మ, మేనత్తలు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరిలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనున్నానని...
పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయాడానికి కలెక్టరేట్కు చేరుకున్నాడు. కార్యాలయంలోకి వచ్చేందుకు అవస్థలు పడుతున్న పోతురాజును గుర్తించిన కలెక్టర్ నేరుగా అతని వద్దకే వెళ్లి వినతిపత్రం స్వీకరించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ..ఆరు వేల రూపాయలున్న అతని పెన్షన్ను రూ. 15 వేలకు పెంచాలని ఆదేశించారు. -
పారదర్శకంగా పదోతరగతి మూల్యాంకనం
● మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ విజయనగరం అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. పీఎస్ఆర్ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆయన సోమవారం తనిఖీచేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను టీచర్ల టేబుళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. మూల్యాంకనంలో పాల్గొంటున్న అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈలు), స్పెషల్ అసిస్టెంట్లు, చీఫ్ ఎగ్జామినర్ల పనితీరును సమీక్షించారు. మూల్యాంకన కేంద్రంలో మౌలిక వసతులు, భద్రతా చర్యలు, రికార్డు నిర్వహణలో ఎలాంటి లోపాటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర పరిశీలకులు తహేరా సుల్తానా, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు, విద్యాశాఖ అధికారులు, క్యాంప్ అధికారులు ఉన్నారు. జేఎన్టీయూ జీవీలో జలసంరక్షణ చర్యలు విజయనగరం అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా జలసంరక్షణ కార్యక్రమాన్ని జేఎన్టీయూ జీవీలో సోమవారం వీసీ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో నీటిలభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో నీటి వనరులను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. వర్సిటీలో భవనాలపై పడే వర్షపు నీటిని నిల్వ చేయడం, ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్ల నిర్మాణం వంటి చర్యలు చేపడతామన్నారు. వర్సిటీ ప్రాంగణంలో నీటినిల్వకు గుంతులు తీయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డైరెక్టర్లు, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నీటి సంరక్షణకే ‘జలధార’పూసపాటిరేగ: జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందరరెడ్డి అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలం చెరువుకొమ్ము గొల్లపేట గ్రామంలోని రాజుచెరువు వద్ద కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉడతూ జిల్లాలో నీటి భద్రతను సాధించడంలో సాగునీటి సంఘాల పాత్ర కీలకమన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో చేపట్టవలసిన పనులు ప్రాధా న్యత క్రమంలో గుర్తించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, నార్త్కోస్టు చీఫ్ ఇంజినీర్ ఎస్.స్వర్ణకుమార్, ఇరిగేషన్ ఈఈ ఎం.వి.రమణ, డీఈఈ ఎం.గోవిందరావు, ఎంపీడీఓ స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు. విశాఖలో గుణుపూరుపేట వాసుల ఆందోళన డెంకాడ: వీఎంఆర్డీఏ రోడ్డు అలైన్మెంట్ను డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామ పరిధిలోని నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలంటూ విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయం వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. గ్రామంలోని యాతపేట, బీసీ కాలనీ మీదుగా మొదటి అలైన్మెంట్ రోడ్డు వెళ్తే పేద కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతారన్నారు. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములను కాపాడుకునేందుకు పేదల ఇళ్లపై నుంచి రోడ్డు నిర్మించేందుకు పట్టుబడుతున్నారని వీఎంఆర్డీఏ చైర్మన్ వి.ప్రణవ్గోపాల్, అధికారులకు గోడు వినిపించారు. -
జీఎంఆర్లో ఫీజుల పంచాయితీ
రాజాం: రాజాంలోని జీఎంఆర్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజుల ‘పంచాయితీ’ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షల వేళ కలవరపెడుతోంది. గత ఏడాదికాలంగా చంద్రబాబు ప్రభుత్వం ఐటీ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలచేయలేదు. ఫీజులు చెల్లించకపోవడంతో జీఎంఆర్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల ఇయర్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి హాల్ టిక్కెట్లు తీసుకోగా, మరికొంతమంది తమకు తెలిసిన పెద్దలతో గడువుతీసుకుని యాజమాన్యాన్ని ఒప్పించారు. ఇంకొంతమంది కళాశాల వద్ద సోమవారం నిరసన తెలిపారు. రోడ్డెక్కేందుకు సిద్ధంకాగా, కళాశాల ప్రొపెషర్లు కలుగుచేసుకుని రెండురోజులు గడువు ఇచ్చి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమనిగించారు. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థులకు తప్పని తిప్పలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమచేసేది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కళాశాలల ఖాతాల్లోకి ఫీజులు చెల్లించే జీఓ తెచ్చినా సకాలంలో జమచేయడం లేదు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులు వద్ద ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఫీజులు చెల్లించనివారికి హాల్టికెట్లు ఇవ్వడంలేదు. ఆందోళనకు దిగితే ప్రాక్టికల్స్ మార్కులు తగ్గిస్తామంటూ బెదిరిస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. జీఎంఆర్ఐటీలో ఒక ఏడాదికి 4500 మంది విద్యార్థులు చదువుతుండగా, జీసీఎస్ఆర్ కళాశాలలో మరో 1500మంది చదువుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతో వీరందరికీ చేతిచమురు వదులుతోంది. జీఎంఆర్ఐటీ యూనివర్సిటీలో ఫీజులు వసూళ్లపై ఐటీ డీన్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మాట్లాడేందుకు ఇష్టపడలేదు. విడుదలకాని ఫీజురీయింబర్స్మెంట్ నిధులు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై వర్సిటీ అధికారుల ఒత్తిడి హాల్టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ ఆందోళనకు దిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు -
తంపటాపల్లిలో అగ్ని ప్రమాదం
● రెండు పూరిళ్లు దగ్ధంపాలకొండ రూరల్: మండలంలోని తంపటాపల్లిలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో వారాడ రమణమ్మ, బెజ్జిపురపు అప్పలనాయు డుకు చెందిన పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. దేవుడి పటం ముందు పెట్టిన దీపాన్ని ఎలుకలు పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. ఒక్కసారిగా మంటలు రావడంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. -
తమ్మన్నశెట్టికి నివాళులు..
విజయనగరం: ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు కోలగట్ల వెంకట నాగ తమ్మన్నశెట్టి సంస్మరణ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నయ్య అయిన తమ్మన్నశెట్టి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం స్థానిక ఎస్వీఎన్ నగర్లో గల సుజాత కన్వెన్షన్ హాల్లో తమ్మన్నశెట్టి సంస్మరణ సభ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బి. చంద్రశేఖర్, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా యువజన విభాగం నాయకుడు జి. ఈశ్వర్కౌశిక్, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, తదితరులు తమ్మన్నశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ్మన్న శెట్టి లేని లోటు తీర్చలేనిదని నాయకులు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాదులు , ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ మంచి వేదిక
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ మంచి వేదికని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ కల్యాణ్చక్రవర్తితో కలసి 113 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కరించాలని సూచించారు. వినతుల్లో కొన్ని.. ● రహదారి సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని కురుపాం మండలం నాయుడుగూడ గ్రామానికి చెందిన వి. మన్మధరావు, తదితరులు వినతిపత్రం అందజేశారు. ● శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్వతీపురం మండలం పెదబొండపల్లి పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ● సైనికుల కోటా కింద అలమండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న బంజరభూమిని ఇప్పించాలని కోరుతూ జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన జి. మన్మధరావు వినతిపత్రాన్ని అందజేశారు. -
మట్టి పరీక్ష.. రైతుకు రక్ష
పోషక లోపాలను భర్తీ చేయాలి భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్ష ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 30,265 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 2500 పరీక్షలు చేశాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే లోపు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందజేస్తాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్ లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. – జి. శ్రీనివాస్, ఎ.డి, భూసార పరీక్ష కేంద్రంవిజయనగరం ఫోర్ట్: మట్టి పరీక్ష (భూసార పరీక్ష) ఫలితం ప్రకారం ఎరువులు వినియోగించడం వల్ల రైతుపై ఆర్థిక భారం తగ్గుతుంది. దీంతో మట్టి పరీక్ష రైతుకు రక్షగా మారిందనే చెప్పాలి. భూసార ఫలితాల ప్రకారం ఏయే భూములకు ఏయే ఎరువులు వేయాలో అధికారులు వివరిస్తారు. దీంతో అదనపు ఎరువుల వినియోగం ఉండదు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 30,265 మట్టి నమూనాలు ( శాంపిల్స్) సేకరించి, పరీక్షించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం కాగా ఇప్పటికే నమూనాలు సేకరించారు. ఇందులో 2,500 పరీక్షలు కూడా పూర్తి చేశారు. భూసార పరీక్ష కోసం 15 సెం.మీ లోతులో వి షేప్ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించారు. 13 రకాల పరీక్షలు.. సేకరించిన ప్రతి మట్టి నమూనాకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. నేల స్వభావం, ఉదజని సూచిక (పీహెచ్), లవణ సూచిక (ఈసీ), సేంద్రియ కర్బనం ( ఓసీ) లభ్య నత్రజని (ఎన్), లభ్య భాస్వరం’, లభ్య పొటాష్, లభ్య గంధకం, లభ్య జింకు, లభ్య ఇనుము, లభ్య మాంగనీసు, లభ్య రాగి, బోరాన్ పరీక్షలు చేపడతారు. వీటిల్లో ఏ లోపం ఉన్నా సంబంధిత రైతుకు తెలియజేసి, లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారు. గతేడాదిలో 28, 392 పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం సిబ్బంది 2025 – 26లో జిల్లా వ్యాప్తంగా 28, 392 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా జిల్లా వ్యాప్తంగా భూముల్లో నత్రజని లోపం 92 శాతం, సేంద్రియ కర్బనం 86 శాతం, జింక్ లోపం 36 శాతం ఉన్నట్టు గుర్తించారు. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంట ఎదుగుదల లోపించడంతో పాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువులు గత్తం, వర్మీకంపోస్టు పొలాల్లో వేసుకోవాలి. లేదంటే జీలుగ, కట్టి జనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూముల్లో కలియ దున్నాలి. సేంద్రియ కర్బనం లోప నివారణకు ఏడాది పొడవునా ఏదో ఒక పంట సాగు చేయాలి. జింక్ లోపం నివారణకు ప్రతి మూడేళ్లకోసారి ఎకరానికి 20 కిలోల జింక్ వేసుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో నత్రజని, సేంద్రియ కర్బనం, జింక్ లోపం ఉంది. జిల్లా వ్యాప్తంగా చేయాల్సిన పరీక్షల లక్ష్యం 30,265 ఇప్పటికే మట్టి నమూనాల సేకరణ పూర్తి ప్రస్తుతానికి 2500 నమూనాల పరిశీలన గతేడాది 28,392 భూసార పరీక్షలు చేసిన అధికారులు -
యువకుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్: కొద్ది రోజులుగా తమ కుమారుడు నారంశెట్టి గణపతి (16) కనిపించడం లేదని తండ్రి వెంకటరమణ సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం పాలిటెక్నికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న గణపతి 20 రోజుల నుంచి కాలేజీకి వెళ్లడం లేదు. ఇదే విషయమై కొడుకును తండ్రి వెంకటరమణ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన గణపతి ఈ నెల 2వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంతవరకు ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఎస్సై అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం.. విజయనగరం క్రైమ్: గుర్ల మండలం జమ్ముపేటకు చెందిన రమణమ్మ (54) కనిపించడం లేదని అతని కుమారుడు రవికుమార్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఆభరణాల కొనుగోలు నిమి త్తం ఈ నెల ఒకటో తేదీన విజయనగరం గంటస్తంభం ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి ఇంతవరకు ఇంటికి చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమీప ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కలెక్టరేట్ సోమవారం వివిధ వర్గాల ప్రజల ధర్నాలతో దద్దరిల్లింది. భవన నిర్మాణ కార్మికులు, పట్టణ కాలనీల నివాసితులు, రైతులు, మహిళలు, ప్రజా సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం నినదించారు. ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక సంక్షేమం ఏది ‘బాబూ’ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని, అంగవైకల్య పరిహారం, స్కాలర్షిప్స్, వివాహ, ప్రసూతిసహాయం వంటి అన్ని పథ కాలు అమలుచేయాలని భవననిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్మి బి.రమణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.అసరప్పడు, జిల్లా కోశాధికారి ఎ.జగన్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. ––––––––––––––––––––––– ––––– మౌలిక సదుపాయాలు కల్పించండి విజయనగరం సమీపంలోని గుంకలాం జగనన్న కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు, ఆస్పత్రి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు. ––––––––––––––––––––––– ––––– ధరల కట్టడి ఎప్పుడు? గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమస్యలతో ‘తల్లి’డిల్లుతూ... చిత్రంలోని మహిళ పేరు పోలిపల్లి జగదీశ్వరి. జామి మండలంలోని భీమసింగి గ్రామం. భర్త మరణించాడు. కూలిపనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఆమెకు తెలుపురేషన్కార్డు ఉన్నా ఇన్కంట్యాక్స్ పేయర్గా నమోదుకావడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం వంటి పథకాలు అందడం లేదని, సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వేడుకుంది. ––––––––––––––––––––––– ––––– రీసర్వే లోపాలపై రైతుల ఆందోళన రీసర్వేలో జరిగిన తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రాకోడు గ్రామ రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రైతుల సమక్షంలో రీ సర్వే నిర్వహించి భూ రికార్డులు సరిచేయాలని డిమాండ్ చేశారు. ––––––––––––––––––––––– –––––డంపింగ్ యార్డు తొలగించాలి కొత్తవలస మండలం రాజన్న కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాయు కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నామని, తక్షణమే డంపింగ్యార్డును తొలగించాలని కోరుతూ కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కార్యక్రమంలో వబ్బిన సన్యాసినాయుడు, మొగ్గ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్ విజయనగరం
రాజాం సిటీ: జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ స్టేట్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఎనిమిది కేటగిరీల్లో మహిళలు, పురుషులు వేర్వేరుగా తలపడ్డారు. మహిళల సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో...అలాగే పురుషుల జూనియర్ విభాగంలో విజయనగరం క్రీడాకారులు విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకున్నారని వీసీ డాక్టర్ జె.గిరీష్ తెలిపారు. ఈ ఎనిమిది కేటగిరీల్లో ప్రథమ స్థానం పొందిన క్రీడాకారులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు అమలాపురంలో జరగనున్న జాతీయస్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలు .. జూనియర్ విభాగంలో.. రెండో రోజు వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో పురుషులు తమ పవర్ చూపించారు. 53 కిలోల విభాగంలో వి.శరత్ (విజయనగరం), టి.అభిశంకర్ (శ్రీకాకుళం), ఎం.రేవంత్ (కృష్ణా ) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో వై.భరత్ (విశాఖ), ఎ.యశోధర్ (బాపట్ల), సీహెచ్. శ్రీరామ్ (కోనసీమ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. 66 కిలోల విభాగంలో ఎన్.కార్తికేయ (విశాఖ), పి.అఖిల్ (పార్వతీపురం మన్యం), ఐ.ప్రవీణ్కుమార్ (అనకాపల్లి).. 74 కిలోల విభాగంలో జె.లవకుమార్ ( అనకాపల్లి), బి.అంజినా సంపత్ (శ్రీకాకుళం), బి.శ్రీమనోజ్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో ఎం.కౌశిక్ (విజయనగరం), పి.భానుచంద్ర (కోనసీమ), కె.దుర్గాశివ (కోనసీమ) విజేతలుగా నిలిచారు. సబ్ జూనియర్ విభాగంలో.. సబ్ జూనియర్ విభాగానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో పోటాపోటీగా తలపడిన పోటీల్లో 53 కిలోలకు సంబంధించి ఎస్.జీవన్కుమార్ (విశాఖ), బి.నాగహర్ష (కోనసీమ), కె.కార్తీక్ (పల్నాడు) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే 59 కిలోల విభాగంలో డీజీ వర్థన్ (కృష్ణ), బి.ఆర్యన్రావు (విశాఖ), బి.దీపిక (ప్రకాశం).. 66 కిలోల విభాగంలో జె.జితేంద్రదొర (కోనసీమ), ఎస్.సింయోను (కోనసీమ), ఎ.జగదీష్ (విజయనగరం).. 74 కిలోల విభాగంలో ఎంఎస్ఎస్డీ ప్రసాద్ (తూర్పు గోదావరి), కేబీఎస్ మణికంఠ ( కోనసీమ), జి.దినేష్ప్రసాద్ (కోనసీమ).. 83 కిలోల విభాగంలో కె.వరుణ్ (కాకినాడ), కె.నాని(కోనసీమ), ఎం.ధనుష్ (అనకాపల్లి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
కూటమి నాయకుల ‘గయ్యాళి’ అవతారం
● భూములను ఆక్రమించుకున్న నాయకులు ● ఆన్లైన్ చేయాలంటూ తహసీల్దార్పై ఒత్తిడి ● ససేమిరా అనడంతో కబ్జా, ఆపై లీజుకు.. బొబ్బిలి రూరల్: కూటమి నాయకులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఇతరులకు లీజుకిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ వెంకటరాయుడుపేట రెవెన్యూలో గిరిజనులైన గేదెల జోగులు తండ్రి సన్యాసి పేరిట సర్వే నంబర్ 43–2, 47–30, 47–4లో దాదాపు ఐదెకరాల పట్టా భూమి (గయ్యళి భూమి) ఉంది. ఆ భూమిని గతంలో వారు సాగు చేయగా ప్రభుత్వ పట్టా మంజూరు చేసింది. అయితే సన్యాసికి జోగులు ఒకడే కుమారుడు. జోగులుకు కూడా ఒక్క కుమార్తె ఉంది. సన్యాసి, జోగులు మరణానంతరం జోగులు కుమార్తె వారసత్వ సర్టిఫికెట్ తీసుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరి కళ్లు ఆ భూమిపై పడ్డాయి. తహసీల్దార్కు తాయిళాల ఆశ జూపి ఆ భూమిని తమ పేరుమీద ఆన్లైన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఆయన ససేమిరా అంటూ ఇది ప్రభుత్వ భూమని బోర్డు ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి ఏడాదైంది. తాజాగా వారం రోజుల కిందట ఆ భూమిని కొందరు కూటమి చోటా నాయకులు ఆక్రమించారు. జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేసి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరికి ఏకంగా లీజుకు ఇచ్చేశారు. దీంతో లీజుకు తీసుకున్న వ్యక్తి కొద్ది రోజులుగా ఆ భూమిలో పనులు చేపడుతున్నారు. తోటల పెంపకానికి అనువుగా భూమిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ ఎం. శ్రీను వద్ద ప్రస్తావించగా.. ఆ భూమి ప్రభుత్వానికి చెందిన గయ్యాళి భూమి అని, ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరు ఆక్రమించుకున్నా చర్యలు తప్పవన్నారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
విజయనగరం టౌన్: అన్నమాచార్య సంకీర్తనలపై అందజేస్తున్న వేసవి ఉచిత శిక్షణను ఐదేళ్ల వయసు నుంచి చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు కోరారు. ఈమేరకు కళాపీఠం ఆవరణలో వేసవి ఉచిత సంగీత శిక్షణ కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. -
వరల్డ్ స్కిల్ చీఫ్ ఎక్స్పెర్ట్గా శ్రీహరి
బాడంగి: మండలంలోని ముగడ కాలనీకి చెందిన రుత్తల శ్రీహరి వరల్డ్ చీఫ్ ఎక్స్పెర్ట్గా ఎంపికయ్యాడు. ఈ నెల 2,3 తేదీల్లో ఢిల్లీలో నాస్కమ్ ప్రతినిధులు నిర్వహించిన ఇండియా స్కిల్ పోటీల్లో శ్రీహరి ఇండియా తరఫున సైబర్ సెక్యూరిటీ విభాగంలో చీఫ్ ఎక్స్పెర్ట్గా వ్యవహరించారు. ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన వారిని గెలిపించి వరల్డ్ చీఫ్ ఎక్స్పెర్ట్గా ఎంపికయ్యాడు. రానున్న సెప్టెంబర్లో చైనాలోని షాంఘైలో జరగనున్న సైబర్ సెక్యూరిటీ పోటీలకు భారత్ బృందానికి తర్ఫీ దు ఇవ్వనున్నట్లు శ్రీహరి తెలిపారు. కాశీపేటలో అగ్ని ప్రమాదం సీతానగరం: మండలంలోని కాశీపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పశువుల శాలలు దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు వెన్నెల అప్పలస్వామి, వెన్నెల పరిశినాయుడు లబోదిబోమంటున్నారు. పశువులు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. పశువుల శాలల మీదుగా వెళ్తున్న ఎల్టీ విద్యుత్ తీగల రాపిడి వల్ల నిప్పులు పడి ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. రైలు పట్టాలపై మృతదేహం చీపురుపల్లి: చీపురుపల్లి – బాతువ గ్రామాల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించినట్లు శ్రీకాకుళం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని.. నీలం రంగు జీన్స్, సర్ఫ్ కలర్ టీ షర్ట్ ధరించాడని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 91103 05494 నంబర్ను సంప్రదించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రేగిడి: మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వి.బాలకృష్ణ అందించిన వివరాల మేరకు.. బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెందిన కోండ్రు గోవింద (29) ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి గళావల్లి వైపు వెళ్తున్నాడు. కాగితాపల్లి సమీపంలోకి వచ్చే సరికి రాజాం వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో గోవింద అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురుపై కేసు నమోదు కొత్తవలస: మండలంలోని తాడివానిపాలెం గ్రామానికి చెందిన కుడిత కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేశుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన డి.గాయత్రి ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్, గాయత్రి కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి గాయత్రి తల్లిదండ్రులు గతంలో ఒప్పుకోవడంతో ఆమె చదువు, ఇతర అవసరాలకు సుమారు ఏడెనిమిది లక్షల రూపాయలను కార్తీక్ ఖర్చు చేశాడు. తీరా పెళ్లి సమయం వచ్చే సరికి గాయత్రి తల్లిదండ్రులు ప్లేటు ఫిరాయించి, వేరొక వ్యక్తితో కుమార్తెకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కార్తీక్ ప్రశ్నించగా.. గాయత్రి, ఆమె కుటుంబ సభ్యులు కులంపేరుతో దూషించారు. దీంతో కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన హ్యాక్థాన్ పోటీలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజు లుగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హ్యాక్థాన్ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. మొత్తం 290 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏకధాటిగా 18 గంటలు శ్రమించి వ్యాపారం, ప్లేస్మెంట్, ఆరోగ్యం, సామాజిక సంక్షే మ రంగాలకు సంబంధించి వినూత్న ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు జట్లుకు రూ.2లక్షల నగదు బహుమతి ప్రధానం చేశారు. ఇటువంటి హ్యాక్థాన్లు విద్యార్థుల నైపుణ్యంతో పాటు పరిశ్ర మస్థాయి అనుభవాలను అందిస్తాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఐటీడీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, మైక్రోసాఫ్ట్ ఏఐ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవితేజ, బి.సౌమ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు
విజయనగరం: నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఆండ్ర జలాశయం నుంచి అదనపు జలాలు తెప్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి ఆదివారం తెలిపారు. వేసవి నేపథ్యంలో నగరవాసులకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాయకులు, కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు స్పందించి, ఆండ్ర నుంచి జలాలు విడుదల చేశారన్నారు. అక్కడి నుంచి నీరు నెల్లిమర్ల హెడ్ వాటర్ వర్క్స్, చంపావతి, కుదిపి రిజర్వాయర్లకు అక్కడి నుంచి పిట్టాడ, లక్ష్మీపురం, సాలిపేట గజపతినగరం, డోలపేట గంగచోలవలస, తమ్మిరాజుపేట, గరివిడి, మొయిద ప్రాంతాల మీదుగా మూలస్టేషన్కు అక్కడి నుంచి నెల్లిమర్ల పంప్హౌస్కు నీరు వస్తుందన్నారు. మరో వారం రోజుల్లో ఆండ్ర నుంచి నెల్లిమర్ల రిజర్వాయర్కు అదనపు జలాలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేందుకే..?
రామభద్రపురం: కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తూ జూన్ నెలలో ప్రారంభమయ్యే అకడమిక్ విద్యా సంవత్సరాన్ని మార్పు చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకెండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అలా కాకుండా విద్యా వ్యవస్థలో మార్పులు కంటే కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 18, కేజీబీవీలు 26, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు 13, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు 8, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఈ విద్యార్థులకు 2026–27 అకడమిక్ ఇయర్కు సంబంధించి సెకెండియర్ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్ను జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సైతం అమలు చేస్తున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్ ఇయర్ను ఎలా ప్రారంభిస్తారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు.. ఇంటర్మీడియట్ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు తెరవనున్నారు. అయితే ఏప్రిల్ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు జిల్లాకు ఒక్క నోటుబుక్కు గాని, పాఠ్యపుస్తకం గానీ చేరలేదు. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గమనార్హం. వారికి మేలు చేసేందుకే ముందస్తు అనుమతులు.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభిస్తూ ప్రభుత్వం షెడ్యూల్ జారీచేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. ఆ తర్వాత సుమారు 20 రోజులకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడం వల్ల కార్పొరేట్ కళాశాలల వారికి ఎక్కువ సమయం లభిస్తోంది. దీంతో వారు క్యాంపెయిన్లు చేసుకుంటూ విద్యార్థులను లాక్కెళ్లిపోతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుండడం వల్ల ప్రైవేట్ కళాశాలల వారు కూడా విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా దర్జాగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కాలేజ్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్కరణల పేరుతో ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకు బ్రిడ్జ్ కోర్సు పేరిట తరగతులు పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు నిర్వహిస్తున్న వైనం నేటి నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభం పది పరీక్ష ఫలితాలు రాకముందే అడ్మిషన్లు విద్యార్థికి నష్టం లేదు.. ఈ నెల ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకం లేనంత మాత్రాన విద్యార్థికి నష్టం లేదు. ఏదో ఒక అంశం మాత్రమే బోధిస్తారు. మొత్తం సిలబస్ మారలేదు. 20 శాతం మాత్రమే సిలబస్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్ట్లో రెండు పాఠాలు మాత్రమే బోధిస్తారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. కాని ఇంతవరకు పుస్తకాలు రాలేదు. ఈ నెల 19 నాటికి పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పదో తరగతి ఫలితాలు రాకపోయినా పర్వాలేదు. ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు ఈ 23 రోజుల పాటు సబ్జెక్ట్లు వింటే తర్వాత ఏ గ్రూపు ఎంపిక చేసుకోవాలో ఉపయోగపడుతుంది. – ఎస్. తవిటినాయుడు,ఆర్ఐఓ, విజయనగరం -
పిడుగుపాటుకు మహిళ మృతి
వీరఘట్టం: పిడుగు పాటుకు మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పైల అనసూయమ్మ(60) ఆదివారం మృతి చెందారు. గ్రామ శివారులో ఓ రైతు పొలంలో మొక్కజొన్న పంటలో కంకెలు కోసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో కుప్పకూలిపోయింది. ఆమె ముక్కు, చెవి నుంచి రక్తం రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై షణ్ముకరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎం.సీతారాంపురంలో పిడుగు.. వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం గ్రామంలో బొద్దాన ఆదినారాయణ ఇంటిపై పిడుగు పడింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి ముందు భాగంలో పిడుగు పడడంతో గచ్చుకు రంధ్రం ఏర్పడింది. ఆ ఇంట్లో శుభకార్యం కారణంగా బంధువులంతా ఒకేచోట కూర్చుని ఉన్నారు. వారి కళ్ల ముందరే పిడుగు పడడంతో ఓ వ్యక్తి కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సపర్యలు చేయడంతో కోలుకున్నాడు. -
విజయనగరం
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం ఫోర్ట్: ఏప్రిల్ తొలి వారంలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమికి వేడుగాలులు వీస్తుండడంతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకునే వారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మొండి ధైర్యంతో ఎండలోనే పనులు చేస్తున్నారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 6 గంటలకే.. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం వేతనదారులు ఉదయం 6 గంటలకే పనికి వెళ్లి 10 గంటలకు తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు. పని ప్రదేశంలో తాటి కమ్మలతో టెంట్లు వేసుకున్నా.. భానుడి ప్రతాపం ముందు నిలబడటం లేదు. గీత కార్మికులు సాధారణంగా కళ్లు గీయడానికి మధ్యాహ్నాం వెళ్లేవారు. ఎండ తీవ్రతకు భయపడి వారు వెళ్లడం లేదు. జిందాల్, మహామాయ వంటి పరిశ్రమలలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎండ వేడి తోడవ్వడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటుక బట్టీ కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు పరిస్థితి చెప్పనక్కర్లేదు. జనం అవస్థలు ఉదయం 8 గంటలకే ఎండ సెగలు కక్కుతుండడ తో ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఒకే విధంగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. ఓ వైపు భగభగలు.. మరోవైపు ఉక్కపోత ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజువారి కూలీల పరిస్థి తి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఇంకోవైపు ఉక్కపోత కూడా ఎక్కువైంది. దీంతో ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోతతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అల్లాడిపోతున్నారు. శీతల పానీయాలను డిమాండ్ ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి జనం శీతల పానీయాలకు ఆశ్రయిస్తున్నారు. సరబత్, జ్యూస్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే విధంగా మంచినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ వంటివి తీసుకుంటున్నారు. గొడుగు నీడలో ఇలా... ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఎండలో తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, వణుకు పుట్ట డం, మగతనిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షికంగా అపస్మాకర స్థితి వడదెబ్బ లక్షణాలు గా ఉంటాయని ఈ లక్షణాలు కనపడితే వెంట నే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటలలోపు పనులు ముగించుకోవాలి. 11 గంటల తర్వాత ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో టోపీ ధరించాలి, గొడుగు పట్టుకుని వెళ్లాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. వడదెబ్బ నీళ్లు లక్షణాలు కనిపిస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
విశేష సత్కారం
● ఒకే వేదికపై 30 మంది ఉపాధ్యాయులకు సన్మానం చీపురుపల్లి: సాధారణంగా బదిలీ జరిగిన వారినో.. ఉద్యోగోన్నతి పొందిన వారినో సత్కరించుకోవడం ఆనవాయితీ. అలాగే ఇటీవల కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట విద్యార్థులు ఒక్కటై తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. తాజాగా వీటికి భిన్నంగా మండలంలోని బైరెడ్డిపేట వాసులు మాత్రం తమ పాఠశాలలో నాలుగు దశాబ్దాలుగా బోధించిన ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం విశేషం. బైరెడ్డిపేటలో 1986లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంతటి విశేషమున్న ఈ పాఠశాలలో అప్పటి నుంచి పని చేసిన ఉపాధ్యాయులను సత్కరించాలని ప్రస్తుత హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు గోపి సంకల్పించారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు కూడా తెలియజేయడంతో వారు కూడా సహకరించారు. దీంతో పాఠశాల ఏర్పాటు నుంచి నేటి వరకు పని చేసిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించారు. కొంతమంది వివరాలు తెలియకపోయినప్ప టికీ, దాదాపు 30 మంది ఉపాధ్యాయులను గ్రామానికి తీసుకువచ్చి ఘనంగా సత్కరించా రు. అలాగే ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పలువురు విద్యార్థులను సైతం సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒక్కటై పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయాలను కొనసాగిద్దాం..: కలెక్టర్
విజయనగరం అర్బన్: బడుగు బలహీన వర్గాల నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ 119వ జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని జగ్జీవన్రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల విద్యార్థులు జగ్జీవన్రామ్ జీవిత విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రద ర్శించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లా డుతూ రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఉన్నత స్థాయికి చేరిన బడుగు వర్గాలకు చెందిన అధికారు లు, ఉద్యోగులంతా తమ తోటి పేద కుటుంబాల వారికి చేయూతనిచ్చి వారు కూడా ఉన్నతస్థాయికి చేరుకునేలా సహాయం అందించిన నాడే డాక్టర్ జగ్జీవన్రామ్కు సరైన నివాళి కాగలదన్నారు. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, దేశానికి ఆహార భద్రతను అందించిన హరిత విప్లవ సారధి అన్నారు. బడుగువర్గాల వారు విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం పొందగలుగుతార ని ఈ విషయాన్ని గుర్తించి విద్యతో ఉన్నత శిఖరాలను చేరే ప్రయత్నాలు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, సాంఘిక సంక్షేమ డీడీ అన్నపూర్ణమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ దేవిప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రన్న బీమాకు మంగళం!
● అయోమయంలో కాల్ సెంటర్ సిబ్బంది ..! ● సిబ్బందిని జెడ్పీకి పంపిన అధికారులు ● మళ్లీ వెనక్కి వచ్చేసిన వైనం విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు అంతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్ర న్న బీమాకు టీడీపీ సర్కార్ పూర్తిగా మంగళం పాడేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రన్న బీమా పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన చంద్రన్న కాల్ సెంటర్ సిబ్బంది అయోమయంలో కొట్టుమిట్టుడుతున్నారు. చంద్రన్న బీమా పథ కం అమలులో లేకపోవడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ పథకంలో పని చేసే నలుగురు ఉద్యోగులను డీఆర్డీఏ అధికారులు జిల్లా పరిషత్కు పంపించారు. అక్కడ ఆరు నెలలు పాటు పని చేసిన మీదట తిరిగి డీఆర్డీఏకు ఇటీవల వచ్చేశారు. అధికారులు కూడా వారిని ఏ విధంగా వినియోగించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలియవచ్చింది. చంద్రన్న బీమా పథకం అమలులో కాల్ సెంటర్ సిబ్బందికి పని ఉంటుంది. బీమా ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు నుంచి వచ్చిన ఫోన్లు స్వీకరించడం, వారికి బీమా వర్తింపజేయడానికి అవసరమైన పత్రాలు స్వీకరించడం, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇప్పడు బీమా అమల్లో లేకపోవడంతో అక్కడ వారికి పని లేక పోయింది. వేరే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. చంద్రన్న బీమా కాల్ సెంటర్లో పని చేసే నలుగురిని జెడ్పీకి ఆరు నెలలు కిందట పంపించాం. తిరిగి వారు ఇటీవల తిరిగి వచ్చేశారు. వారు డీఆర్డీఏలో పని చేస్తున్నారు. – శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏ -
దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: దళితుల్లోని క్రైస్తవుల హక్కులను కాపాడాలని అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి డిమాండ్ చేశారు. ఇదే విషయమై రూపొందించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేడ్కర్ సామాజిక భవనంలో ఆదివారం ఆవిష్కరించారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఆర్టికల్ 15, 17, 25, 26ల ప్రకారం సమానత్వం, మతస్వేచ్ఛ హక్కులు ఉన్నప్పటికీ ఈ తీర్పుతో దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్ల పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని పట్టుబట్టారు.కార్యక్రమంలో డి.వెంకటేష్, వి.వంశీ, సయ్యద్ ఇఫ్రాన్ అలీ పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ మహనీయుడు
విజయనగరం క్రైమ్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆదివారం స్థానిక మహిళా పోలీస్స్టేషన్లో బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో పాటు హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్రామ్ ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. కేంద్రంలో కమ్యునికేషన్, రవాణా, రైల్వే, రక్షణ, వ్యవసాయ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి, దేశ ప్రగతికి బాటలు వేశారన్నారు. దేశ చరిత్రలో 28 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి, ఉత్తమ పార్లమెంటేరియన్గా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆనాటి కాలంలో చదువుకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న దళితుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. అక్టోబర్ 19, 1935లో దళితుల ఓటుహక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారని, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, సీఐలు ఈ నర్సింహమూర్తి, ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, సీహెచ్. సూరినాయుడు, ఆర్ఐ పి. శ్రీనివాసరావు, ఎస్సై శిరీష, సిబ్బంది లక్ష్మణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
లోక రక్షకుడు క్రీస్తు
వాడవాడలా ఈస్టర్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శిలువ మరణం పొందిన మూడో రోజున సమాధి నుంచి పునరుత్థానుడై(మళ్లీ జన్మించి రావడం) జీసస్ తిరిగి రావడాన్ని పురస్కరించుకుని, ఏటా ఈస్టర్ పండుగ జరుపుకుంటుండడం తెలిసిందే. ఏసుప్రభువు రాకను స్వాగతిస్తూ క్రైస్తవ విశ్వాసులంతా చర్చిల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ర్యాలీలు చేపట్టి, క్రీస్తు పునరుత్థాన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు ఒక్కరేనని, ఆయన బోధనలు అనుసరణీయమని ఫాదర్లు, పాస్టర్లు అన్నారు. మన పాపాల నుంచి మనల్ని రక్షించేందుకు క్రీస్తు తన రక్తాన్ని అర్పించారని, ఇప్పుడు మళ్లీ మనల్ని పాపాల బారినపడకుండా చేయడానికి మరణాన్ని జయించి వచ్చారన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల దయ, శత్రువుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండాలని ప్రభువు సూచించారని, ఆయన మార్గాన్ని అనుసరించి ప్రపంచ శాంతికి దోహదపడాలని కోరారు. –విజయనగరం టౌన్ -
మూల్యాంకన వేళ.. నిరసన గోల
కొన్నేళ్లుగా ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా టీచర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా ఉపాధ్యాయులు చేపడుతున్న మూల్యాంకన విధులను నల్ల బ్యాడ్జీలతో చేపట్టి నిరసనలు తెలపాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహించి తొలిత ఈ రూపంలో నిరసనలు తెలుపుతాం. పెండింగ్ డీఏలు వంటి ఆర్థిక బకాయిల చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. – పాలతేరు శ్రీనివాస్, జిల్లా చైర్మన్, ఫ్యాప్టో జిల్లా కమిటీ బోధనేతర పనులతో నిత్యం బిజీగా ఉంటూ బోధన తరగతులను నిర్వహించలేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ఏర్పడింది. హైస్కూళ్లలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజ న పథకం పరిశీలన, డేటా ఎంట్రీ, సర్వే తదిత ర పనులతో బిజీగా ఉండటంతో తరగతులు సమగ్రమంగా నిర్వహించలేకపోతున్నాం. దీని వల్ల విద్యార్థుల హాజరు తగ్గినట్టు గుర్తించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – డి.శ్యాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటంతో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా ఫలి తం లేకపోవడంతో తాడోపేడే తేల్చుకునేందుకు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. గతేడా ది అక్టోబర్లో విజయవాడ ధర్నా చౌక్లో ఐక్య పో రాటానికి ప్రభుత్వం దిగొచ్చి ఒక డీఏను విడుదల చేసి చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే మలిదశ ఉద్యమంగో భాగంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగ తి మూల్యాంకనానికి నల్ల బ్యాడ్జీలతో హాజరు కావాలని నిర్ణయించింది. ఈ నెల 9న స్పాట్ కేంద్రంలో, ఈ నెల 25, 26, 27న విజయవాడలోని ధర్నాచౌక్లో చేపట్టనున్న మూడు రోజుల రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభు త్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆ కార్యాచరణ నిరసనలు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో జిల్లా కమిటీ ప్రకటించింది. టీచర్లకు ఇవ్వాల్సిన డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల తో పాటు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయకపోవడం. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించకపోవడం. సీపీఎస్ రద్దుపై స్పష్టత లేపోవ డం. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరగడం. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం. బదిలీల వ్యవస్థలో గందరగోళం. ఈహెచ్ఎస్, మెడికల్ బిల్లుల సమస్యలు, పాఠశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం. ఫ్యాప్టో పిలుపుతో ఆందోళనలు ఉధృతం ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం స్థానిక సంస్కృత ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. జిల్లా చైర్మన్ పాలతేరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించిన దశలవారీ ఆందోళన కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాల ని సమావేశంలో తీర్మానించారు. అనంతరం కార్యాచరణ నోటీసును డీఈఓ యు.మాణిక్యంనాయుడుకి అందజేశారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ సీహెచ్ భాస్కరరా వు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్, శివప్రసాద్, ఎన్వీ పైడిరాజు, జి.సూర్యనారాయణ, అప్పారావు, సీహెచ్ తిరుపతిరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పీఎఫ్ ఖాతాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదు
● జెడ్పీ సీఈఓకు పీఆర్టీయూ జిల్లా కమిటీ ఫిర్యాదు విజయనగరం అర్బన్: జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రాజాం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించకపోవడం తగదని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ ఖాతాలు జిల్లాలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ బీఏ సత్యనారాయణకు శనివారం విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ వసూళ్లలో లక్ష్యాలు సాధించాలి ● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై సమీక్షించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, గనులు, భూగర్భ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అటవీ శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన వసూళ్లు, పురోగతి శాతం, లోటుపాట్లపై చర్చించారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థలు స్థానికంగానే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తవలస, తెర్లాం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిన విషయంపై విచారణ జరపాలన్నారు. శ్రీశ్రీ మేనకోడలి ‘మాటామంతి’ విజయనగరం టౌన్: మహాకవి శ్రీశ్రీ మేనకోడలు, ప్లేబ్యాక్ సింగర్, కవయిత్రి ఉపద్రష్ట లక్ష్మి మాటామంతి కార్యక్రమాన్ని మహాకవి గురజాడ స్వగృహంలో శనివారం నిర్వహించారు. యువస్పందన, నరసం శాఖల ప్రతినిధులతో సాహిత్యపరమైన విషయాలను చర్చించారు. అనంతరం జిల్లాకు చెందిన మానాప్రగడ సాహితి, దాసరి పద్మ, గురజాడ మునిమనవరాలు గురజాడ ఇందిర, చిన్నాదేవి, చీకటి చంద్రిక తదితరులు ఆమెను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సచివాలయంలో సర్కారుబడి కొత్తవలస: మండలంలోని మంగళపాలెం ప్రాథమిక పాఠశాలను ఆ గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. పాఠశాలను రెండేళ్ల కిందటి వరకు స్థానికంగా ఉన్న మిషనరీ సంస్థ నడిపేది. పాఠశాల నిర్వహణ భారం కావడంతో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివే 36 మంది విద్యార్థులతో ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం ఇక్కడి చిన్నారులకు చదువుచెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అయితే, పాఠశాలకు వసతి లేకపోవడంతో సచివాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతుల బోధ నకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సచివాలయానికి వివిధ పనులపై వచ్చేవారివల్ల బోధనకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల భవనాలు నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కులాలను మార్చేస్తున్నారు..
జియ్యమ్మవలస రూరల్: రెవెన్యూ శాఖలో గ్రామస్థాయి వీఆర్ఓలు రైతుల పొలాలనే కాకుండా కులాలను కూడా ఇష్ట్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మండలంలోని చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామానికి చెందిన వాండ్రాసి అన్వేష్కు (తండ్రి గౌరు) మంజూరైన కులధ్రువీకరణ పత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్వేష్ కులధ్రువీకరణ పత్రం కోసం సచివాలయానికి వెళితే బలిజ (బీసీ డీ) సర్టిఫికెట్ మంజూరైంది. కుల ధ్రువీకరణ పత్రం చూసిన అన్వేష్ ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వాస్తవానికి అతడు రజక (బీసీ ఏ) కులానికి చెందిన వాడు. అలాగే తురకనాయుడువలస గ్రామానికి చెందిన 25 ఎర్ర గొల్లల కుటుంబాలకు వీఆర్ఓలు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. దీంతో వారంతా మూడేళ్లుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తమ కుటుంబాల్లో 25 మంది వరకు విద్యార్థులు ఉన్నారని.. వీరికి తమ కులానికి సంబంధించిన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని వారంతా కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ ఎం. అప్పారావు వద్ద ప్రస్తావించగా.. విచారణ చేపట్టి సరైన కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు. -
ఫీజు చెల్లించలేదని ఎండలో నిలబెట్టారు..?
● తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన డీఈఓ బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల సురేష్ స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు ఫీజు చెల్లించలేదని కొంతమంది విద్యార్థులను మూడు రోజులుగా ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అన్ని ఫీజులు చెల్లించామని.. బస్సు ఫీజు కొంత బకాయి ఉంటే విద్యార్థులను ఎండలో ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. విద్యార్థులు వడదెబ్బకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తల్లిదండ్రులు డీఈఓ యు. మాణిక్యంనాయుడుకు ఫిర్యాదు చేయగా.. ఆయన సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంఈఓ – 2 అల్లు వెంకటరమణను ఆదేశించారు. ఎడ్ల బండిని ఢీ కొట్టిన లారీ ● ఎద్దు మృతి ● ఒకరికి గాయాలు సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై కాశీపేట – చినబోగిలి గ్రామాల మధ్య పెట్రోల్బంక్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైతుకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఆర్ వెంకంపేట గ్రామానికి చెందిన రైతులు సువర్ణముఖీనది నుంచి ఇసుక తరలించడానికి ఆరు నాటుబళ్లతో సీతానగరం వస్తున్నారు. సరిగ్గా పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చే సమయానికి బొబ్బిలి వైపు నుంచి వస్తున్న లారీ ఓ నాటుబండిని ఢీ కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఎద్దు మృతి చెందగా.. బండి యజమాని కర్రి రాముకు గాయాలయ్యాయి. వెంటనే సహచరులు స్పందించి క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కుక్కల దాడిలో లేగదూడ మృతి రాజాం సిటీ: పట్టణ పరిధి బుచ్చెంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి వీధి కుక్కలు దాడిలో ముద్దాడ అప్పన్నకు చెందిన లేగ దూడ మృతి చెందింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువుగా ఉందని, గతంలో కూడా పశువులు మృత్యువాతపడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను వీధుల్లోకి తీసుకురావాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. కుక్కల బారి నుంచి పశువులు, మనుషులను రక్షించాలని అధికారులను కోరారు. ఉపాధిహామీలో అవకతవకలు ● రూ. 6.08 లక్షల రికవరీకి ఆదేశం వంగర: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు బయటపడ్డాయి. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 2024–25లో చేసిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 30 పంచాయతీల్లో 1031 పనులకు గాను ఉపాధి వేతనదారుల ద్వారా రూ. 8 కోట్ల 88 లక్షల 39 వేల 282 రూపాయలు ఖర్చుచేయగా, మెటీరియల్ రూపంలో రెండు కోట్ల 59 లక్షల 40 వేల 690 రూపాయలతో కలిపి మొత్తం 11 కోట్ల 49 లక్షల 79 వేల 972 రూపాయలు ఖర్చుచేశారు. ఎస్ఆర్పీ కె.చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక తనిఖీ బృందాలు సోషల్ ఆడిట్ నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో చూపుతున్న పనులకు, చేసిన ఖర్చుకు తేడా ఉండడంతో రికవరీలకు ఆదేశించినట్లు ఏపీడీ రమామణి తెలిపారు. మొత్తం 29 పంచాయతీల్లో రూ. 24 లక్షల అవకతవకలను తనిఖీ బృందాలు గుర్తించగా 6,08,701 రూపాయల రికవరీకి అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, మండల ప్రత్యేకాధికారి చంద్రకుమారి, ఎంపీడీఓ తులా రాజారావు, డీఆర్డీఏ సిబ్బంది, ఏపీఓ ఎస్.హరినాథ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
భూములు సిద్ధం చేయండి
విజయనగరం ఫోర్ట్: మొక్కలు నాటేందుకు అవసరమైన భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఉద్యాన, వ్యవసాయాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మిషన్ హార్టివిజన్ కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో 7,260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూరగాయలు, ఆకుకూరలు, డ్రాగన్ ఫ్రూట్, తదితర ఉద్యాన పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 7,260 ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం కాగా.. ప్రస్తుతానికి 2,714 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు. మిగిలిన భూమిని కూడా గుర్తించి సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు 275 బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి బ్లాక్లో కనీసం ఐదు ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ..
రాజాం సిటీ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ కనబరచాలని జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక యూనివర్సిటీలో 13వ ఏపీ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే ఉత్తమమైన క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. మొదటి రోజు మహిళా క్రీడాకారులకు పోటీలు నిర్వహించగా 80 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.... జూనియర్ స్ట్రాంగ్ గర్ల్ విభాగంలో ఎం.షానూన్ (గుంటూరు), యు.నాగప్రగతి (విశాఖపట్నం), ఎన్.జ్ఞానదివ్య (గుంటూరు) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అలాగే సబ్ జూనియర్ విభాగంలో జి.షరోన్ (కోనసీమ), వి.సువర్ణ (ఎన్టీఆర్), ఇ.లక్ష్మీవినయ్శ్రీ (గుంటూరు) విజేతలుగా నిలిచారు. జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్. -
టీఏ, డీఏలపై నీలినీడలు..!
విజయనగరం ఫోర్ట్: ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు. వైద్యులతో పనిచేయించుకున్న చంద్రబాబు సర్కారు వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు మాత్రం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. వైద్యులతో పనిచేయించుకుని ఏడాదికి పైగా అవుతున్నా వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట టీడీపీ సర్కారు సదరం రీ వెరిఫికేసన్ పేరిట సదరం క్యాంపులు నిర్వహించింది. అయితే ఈ క్యాంపులకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులను కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర ఆస్పత్రులనుంచి వైద్యులను రప్పించి సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ చేయించారు. ఇందుకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాజాం, పార్వతీపురం, గజపతినగరం, చీపురుపల్లి ఆస్పత్రులకు చెందిన వైద్యులు హాజరయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో సదరం క్యాంపులు.. జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురపల్లి, ఎస్. కోట, రాజాం, సాలురు ఏరియా ఆస్పత్రులతో పాటు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో క్యాంపులు నిర్వహించి వైద్యులు రీ వెరిఫికేషన్ చేయించారు. 2025 జనవరిలో ప్రారంభం.. 2025 జనవరి నెలలో సదరం రీ అసెస్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారరాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినప్పటికీ.. ఇంతవరకు వారికి ఇవ్వాల్సిన టీఏ,డీఏలు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 వేల మందికి పైగా.. జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ చేశారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్మెంట్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఎముకులు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి సుమారు 30 వేల మందికి పైగా దివ్యాంగులకు వైద్యులు పరీక్షించారు. ఈ క్యాంపుల్లో పాల్గొన్న వైద్యులకు సుమారు రూ. 1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. సదరం క్యాంప్లకు వెళ్లిన వైద్యులకు అందని టీఏ, డీఏలు 16 నెలలైనా పట్టించుకోని ఉన్నతాధికారులు వైద్యులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 1.50 కోట్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు అధికారులకు తెలియజేశాం.. దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నిధులు త్వరలోనే వైద్యుల ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ పద్మశ్రీ రాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
ఆగిఉన్న లారీనీ ఢీకొన్న వ్యాన్
● ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు ● వెదుళ్లపాలెం వద్ద ఘటన ● క్షతగాత్రులు విజయనగరం జిల్లా వాసులు నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్లో ఒంగోలు వెళ్లారు. అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కకడే మరణించాడు. వ్యాన్లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి, కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి, గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఎమ్మెల్సీకి సత్కారంరేగిడి: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎమ్మెల్సీ ఎంతో సహకరించారని ఈ సందర్భంగా సర్పంచ్లు కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సుతో భవిష్యత్ ● గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ సౌమ్య రాజాం సిటీ: కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ భవిష్యత్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని బెంగుళూరుకు చెందిన గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్–2 బి.సౌమ్య అన్నారు. జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ డే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, వాటి స్వభావాన్ని మార్చుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. విద్యార్థులు అవకాశాలను వినియోగించుకుని ఉద్యోగార్థులుగా కాకుండా క్రియేటర్స్గా రాణించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ జె.గిరీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రొగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, గణితం వంటి మౌలిక అంశాలలో పట్టు సాధించాలన్నారు. అలాగే సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ కూడా అవసరమేనని చెప్పారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. 1100 మందికి ఆఫర్లు రాగా 850 మంది వివిధ ఉద్యోగాల్లో నియమితులయ్యారని కెరీర్ డవలప్మెంట్ సెంటర్ సభ్యుడు కిరణ్కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, డాక్టర్ ఏవీ రమణ, డాక్టర్ పి.రమణ, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ శశికుమార్, డాక్టర్ గణేష్ ప్రభు, డాక్టర్ ఆర్ఎల్ నాయుడు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పరామర్శ
విజయనగరం లీగల్: రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభావతి,సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభధ్రస్వామి చిన్న అన్నయ్య, న్యాయవాది కోలగట్లతమ్మన్నశెట్టి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు కె.మన్మథరావు, ఎం.బాలాజీ , బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్కుమార్ శనివారం పరామర్శించారు. మృతికి కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
● గరివిడిలో..
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పాలకొండ మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అయ్యా.. ఆ దుకాణాలే మా బతుకులు
అయ్యా.. 50 ఏళ్లుగా ఆ దుకాణాలే మా బతుకులు... వాటిపై వచ్చిన ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాం... ఇప్పుడు వాటిని తొలగిస్తే మా బతుకులు రోడ్డున పడతాయంటూ పలువురు మహిళలు కన్నీరుపెట్టారు. రామభద్రపురం మండలం ఆరికతోట కూడలిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన దుకాణాలు తొలగించవద్దంటూ అధికారులను వేడుకున్నారు. తన భూమికి దుకాణాలు అడ్డుగా ఉన్నాయంటూ ఓ వ్యక్తి కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మండల ప్రత్యేకాధికారి ప్రశాంత్కుమార్, తహసీల్దార్ అజూరఫిజాన్లు జాతీయ రహదారి అధికారులతో కలిసి దుకాణాల తొలగింపులో భాగంగా రోడ్డుపై మార్కింగ్ ఇచ్చారు. దుకాణాలు తీసేయాలని సూచించడంతో దుకాణదారులు గగ్గోలుపెట్టారు. – రామభద్రపురం -
55 కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్/ఎల్.కోట: అరకు–విశాఖపట్నం జాతీయరహదారిపై కారులో శుక్రవారం తరలిస్తున్న 55 కిలోల గంజాయిని ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామ కూడలిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ శనివారం మీడియాకు తెలిపారు. ఒడిశా నుంచి విశాఖపట్నానికి కారులో గంజాయిని తరలిస్తున్నట్టు ఎల్.కోట పోలీసులకు అందిన పక్కా సమాచారంతో రంగరాయపురం కూడలిలో తనిఖీలు చేపట్టారు. కారును నిలిపి అందులోని 22 ప్యాకెట్లలో ఉన్న 55 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అరుకు మండలం, బోసుబెడ్డకి చెందిన సోనై రాజబాబు, కారుకు పైలట్గా స్కూటీపై వెళ్తున్న ఒడిశా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పాడువ మండలం, హట్టగూడకి చెందిన నంజయ్ హంతల్, ఒడిశా రాష్ట్రం, పూరి జిల్లా, తలజంగాలోని మధుబనబాలియకి చెందిన సంజీబ్ కుమార్ మహంతి (40) ఉన్నారు. వారి నుంచి గంజాయితో పాటు కారు, మూడు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన పింకూ, దాదా అనే మరో ఇద్దరు పరారిలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఎల్.కోట ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పరారీలో మరో ఇద్దరు నిందితులు ఒడిశా నుంచి విశాఖకు గంజాయి తరలింపు వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్ -
విద్యుదాఘాతంతో గిరిజన విద్యార్థి మృతి
● రోధిస్తున్న తల్లిదండ్రులు, బంధువులుసాలూరు రూరల్: మండలంలోని కరకవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కర్రా దిలీప్ శనివారం పాఠశాలకు వచ్చి తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో పక్కనే ఉన్న అరటి తోటలోకి పాఠశాల గోడ దూకి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వచ్చేందుకు గోడ దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గోడ ఎత్తుగా ఉండడంతో పక్కనే ఉన్న వ్యవసాయ పంపుసెట్ బాక్సు మీద నుంచి గోడ ఎక్కేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ తీగ తగిలి పడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు గమనించి విద్యార్థిని మామిడిపల్లి పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి సాలూరు కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిహారం ఇవ్వాలి: మాజీ డిప్యూటీ సీఎం విద్యుదాఘాతంతో మృతి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ కుటుంబానికి ప్రభుత్వం రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ విషయంలో గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ విద్యార్థి మృతి చెందిన సంఘటనా స్థలాన్ని సబ్ కలెక్టర్ వైశాలి శనివారం సాయంత్రం పరిశీలించారు. విద్యుత్ తీగలను పరిశీలించి, పూర్తి నివేదిక అందజేయాలని రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. -
● గజపతినగరంలో..
టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు గజపతినగరంలో ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును విధుల నుంచి తొలగించకుండా వత్తాసు పలుకుతున్న చంద్రబాబు తీరు సిగ్గుచేటుగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రాజేశ్వరి, గార తౌడు, వర్రి నరసింహమూర్తి పాల్గొన్నారు. -
వైభవంగా కాశీ విశ్వేశ్వరాలయ పునఃప్రారంభోత్సవం
సంతకవిటి: మండలంలోని కొత్తూరు రామచంద్రాపురంలో పునర్నిర్మించిన కాశీ విశ్వేశ్వరాలయం పునఃప్రారంభోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శాంతి హోమాలు, శిఖర ప్రతిష్ఠ, కళావికర్షణ, పునఃకళాకర్షణ, శాంతి కల్యాణం, విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. -
అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
పాచిపెంట: మండలంలోని పెద కంచూరు గ్రామ సమీపంలో అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. రెవెన్యూ సర్వేయర్, అటవీశాఖ అధికారులతో మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై గల అవకాశాలపై ఆరా తీశారు. వీరి వెంట పరిశ్రమల అధికారి సీతారామ్, పాచిపెంట మండల తహసీల్దార్ రవి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి బ్రహ్మాజీ, ఏపీఐఐసీ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మామిడి చెట్ల నరికివేతపై దర్యాప్తు
సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి స్వప్న మామిడితోటలో చెట్ల నరికివేతపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు డీఎస్పీ,తదితరులు తోటను పరిశీలించి, చెట్ల నరికివేతపై ఆరా తీశారు. ఆయనతో పాటు రాజాం టౌన్ సీఐ, ఎస్సై ఆర్.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. క్లూస్టీమ్ పరిశీలన సీతంపేట: మండల పరిధిలోని వేంకటేశ్వర ఆలయం పక్కన జల్జీవన్ మిషన్ పైపులు గురువారం దగ్ధం కావడంతో క్లూస్ టీమ్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం ● ముగ్గురికి గాయాలు పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నాగురు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ముగ్గురిని గాయపరిచింది. గుడ్ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో తల్లిదండ్రులతో కలిసి స్థానిక చర్చికి వచ్చిన రెండేళ్ల మండంగి లిఖిత అనే చిన్నారి బయట ఆడుకుంటుండగా, కుక్క ఒక్కసారిగా ఆమె తలపై తీవ్రంగా గాయపరిచింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చింతల అప్పలనాయుడు, అక్కేన చంద్రశేఖర నాయుడు (చినబాబు) కూడా కుక్క కాటుకు బలయ్యారు. అనంతరం వీధుల్లోకి పరుగు తీసిన ఆ శునకం అక్కేన సింహచలం సహా మరొకరికి చెందిన దూడలను గాయపరిచింది. క్షతగాత్రులు జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 50 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్ లక్కవరపుకోట: అరకు – విశాఖ జాతీయ రహదారిపై రంగరాయపురం జంక్షన్ సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. స్థానికులు, టాస్క్ఫోర్స్ పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. ఒడిశా ప్రాంతానికి చెందిన ఇద్దరు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒకరు 50 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఒకరు ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. కారులో ఉన్న వారు గంజాయితో వెనుక వెళ్తున్నారు. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు రంగరాయపురం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎక్కడకు తరలిస్తున్నారు..అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోసగాడి అరెస్ట్ విజయనగరం క్రైమ్: ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయనగరం ఉడా కాలనీకి చెందిన దాసరి ఉత్తేజ్ ఆర్సీ 200 మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఓఎల్ఎక్స్లో చూసి గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలో రూ. 60 వేలు జమ చేసి మోసపోయాడని తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సాయిరామ్ అనే వ్యక్తి కూడా ఓఎల్ఎక్స్లో పల్సర్ 150 సీసీ వాహనాన్ని చూసి గుర్తు తెలియని వ్యక్తికి రూ. 75 వేలు పంపించి మోసపోయాడని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితుడు చల్లా శంకర్ను వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి అరెస్ట్ చేశారన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం సీవీ కండ్రిగకు చెందిన నిందితుడిపై ఇప్పటికే తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక హత్య.. కృష్ణా జిల్లా పెనములూరు పీఎస్ పరిధిలో ఇంటి దొంగతనం కేసు నమోదైందని తెలిపారు. -
సామ్రాజ్యవాద దురహంకారంతోనే యుద్ధం
బొబ్బిలి: సామ్రాజ్యవాద దురహంకారంతోనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడు లు చేస్తున్నాయని, ఈ ప్రభావం భారత దేశంపై పడుతున్న భారాలు చాలా దారుణంగా ఉన్నాయని గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి అన్నారు. ప్రజలకు ఈ విషయమమై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న నిర్వహించనున్న సెమినార్కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం సాయంత్రం స్థానిక తాండ్రపాపారాయ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విడుదల చేశారు. సెమినార్కు ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో అధ్యయన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. విపత్తులపై అవగాహనే ప్రధానం డెంకాడ: విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని విపత్తు నిర్వహణ 5వ ఏపీఎస్పీ బెటాలియన్ విపత్తు ప్రతిస్పందన దళం ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకునే పద్ధతులను చంద్రశేఖర్ వివరించారు. 25 మంది దళం సభ్యులు తుఫాన్, వరదలు వంటి విపత్తు సమయాల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించారు. నదులు, సముద్రాల్లో చిక్కుకునేవారిని రక్షించే పద్ధతులను తెలియజేశారు. ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, రైలు ప్రమాదాల సమయాల్లో భద్రతా చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్లు జి.శివప్రసాద్, కె.భాస్కరరావు, ఎన్ఎస్ఎస్ పీఓ ఎన్.షణ్ముఖరావు, జి.ఆంజనేయులు, వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 20న శిలాస్థాపన పార్వతీపురం రూరల్: లోక కల్యాణార్థం పార్వతీపురంలో నిర్మించనున్న ‘శ్రీరామకోటి స్తూప’ నిర్మాణ పనులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఊపందుకున్నాయి. శ్రీ విద్యా సర్వమంగళ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ శిలాయాత్ర భక్తిప్రపత్తులతో కొనసాగుతోంది. స్థానిక దుర్గ చెట్టు ప్రాంగణంలో నిర్మించనున్న ఈ స్తూపానికి సంబంధించిన శిలకు సూర్యపీఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకుడు బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి, కాళిదాసు శర్మ మాట్లాడుతూ.. ఈ పవిత్ర శిలకు ఈనెల 5వ తేదీ నుంచి 7 వరకు శ్రీశైల క్షేత్రంలో ఉంచి పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన అనంతరం ఏప్రిల్ 20న ఉదయం 10:56 గంటలకు మిథున లగ్నంలో శిలాస్థాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
దాడితల్లికి సహస్ర ఘటాభిషేకం
బొబ్బిలి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న దాడితల్లి అమ్మవారికి శుక్రవారం సహస్రఘటాభిషేకం నిర్వహించారు. అర్చకులు పిండిప్రో లు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన గుర్ల: మండలంలోని కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాల్లో ఏర్పాటుకానున్న స్టీల్ ప్లాంట్ భూములను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ సుధారాణి శుక్రవారం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇటీవల 1085 ఎకరాలు కేటాయించిన సంగతి తేలిసిందే. భూముల వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములను పరిశీలించిన వారిలో తహసీల్దార్ ఆదిలక్ష్మి, సర్వేయర్ శివ ఉన్నారు. -
ఉద్యమబాటలో సమగ్రశిక్ష ఉద్యోగులు
● 15న మంత్రి లోకేశ్ ఇంటివరకు కుటుంబ సభ్యులతో మహోపాదయాత్ర విజయనగరం అర్బన్: సమగ్రశిక్ష ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 15న విజయవాడలో వినూత్నరీతిలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర చేపడతామని ఎన్పీఆర్ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఈ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ తేజేశ్వరి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జయగణేష్, కృష్ణమూర్తి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!
విజయనగరం ఫోర్ట్: వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల నియామక విషయంలో టీటీపీ ప్రభుత్వం వ్యవహారించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉద్యోగాలకు ఎంపికై న వారికే ఎసరు పెట్టేవిధంగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. 2024 డిసెంబర్లో నోటిఫికేషన్.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2024 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 17 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 17 జనరల్ డ్యూటీ అటెండెంట్ (జీడీఏ), స్టోర్ అటెండర్ పోస్టులు –2, ఒక ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు కూడా 2024 డిసెంబర్లో జాయింట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే కొద్ది రోజుల కిందట ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. కాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో ఆయా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తీ పక్రియలో తీవ్ర జాప్యం.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన 16 నెలల వరకు భర్తీ పక్రియ చేపట్టలేదు. ఎట్టకేలకు భర్తీ పక్రియ చేపట్టారంటే నియామక ఉత్తర్వులు (అపాయింట్మెంట్ ఆర్డర్స్) ఇవ్వకుండా జాప్యం చేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సంబంధించి 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తారనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎంపికై న అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. ఏజెన్సీకి కట్టబెట్టేందుకే.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులను ఔట్పోర్సింగ్ పద్ధతిలో కాకుండా ఏజెన్సీకి కట్టబెట్టేందకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పోస్టుల భర్తీ పక్రియను అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఏజెన్సీల ద్వారా పోస్టులు భర్తీ చేపడితే పోస్టుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ బాధ్యత ఏజెన్సీలకు కట్టబెట్టే యత్నం నియామక పక్రియ పూర్తయినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని వైనం నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు ఆందోళనలో ఎంపికై న అభ్యర్థులు వైద్య కళాశాల పోస్టులకు ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేతఆర్డర్స్ ఇవ్వొద్దనే ఆదేశాలు వచ్చాయి.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులకు ఎంపికై న వారికి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్స్ వచ్చేవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఆప్కోస్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆర్డర్లు ఇవ్వలేదు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
రాజధాని పేరుతో డైవర్షన్ రాజకీయం..
బొబ్బిలి: అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేశామని చెబుతున్న కూటమి నాయకులు.. మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన చేసిన సర్పంచ్లను శుక్రవారం స్థానిక శ్రీసూర్య రెసిడెన్సీలో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అమరావతికి చట్టబద్ధత అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి కుట్రలు పన్నుతారన్నారు. రాజధానిలో భవనాలు నిర్మించామన్నారు.. రంగులేశామన్నారు..ఇప్పుడేమో పార్లమెంట్లో చట్టబద్ధత చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత చేశారంటే..మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మొక్కజొన్న దిగుబడిని కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల కష్టాలను తీర్చలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గ్యాస్ లేక మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎక్కడబడితే అక్కడ గ్యాస్ దొరుకుంతుందని చెప్పడం విచారకరమన్నారు. అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం లేక పల్లెలు డీలా పడ్డాయన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే మళ్లీ వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు చట్టబద్ధత అంటే.. ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా..? ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి నాయకులు జిల్లాలోని ఎమ్మెల్యేలు రైతుల కష్టాలు తీర్చలేని దద్దమ్మలు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుజగన్ మోహన్రెడ్డి ధైర్యశీలి.. : పరిశీలకుడు జగన్నాథంవైఎస్సార్సీపీ బొబ్బిలి పరిశీలకుడు రొంగలి జగన్నాథం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనాను ధైర్యంగా ఎదుర్కొని సమర్థ పరిపాలన సాగించిన ధైర్యశీలి జగన్ మోహన్రెడ్డి అని కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్లతో గాంధీ కలలుగన్న సుపరిపాలన తీసుకువచ్చాడన్నారు. అటువంటి వ్యక్తిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్లను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, ఎంపీపీలు చొక్కాపు లక్ష్మణరావు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు పెద్దింటి రామారావు, శాంతకుమారి, సరస్వతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్నాయుడు, బొబ్బిలి, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి దామోదరరావు, యామలి శివప్రసాద్, సీనియర్ నాయకులు మర్రాపు జగన్నాథం, నర్పుపల్లి బాబ్జీ, తెర్లాం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జి. చంద్రవదన, డబ్ల్యూవీఎల్ఎన్ రాయలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మీరే మళ్లీ సర్పంచ్లు: మాజీ ఎంపీ బెల్లాన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలనలో భాగస్వామ్యులైన సర్పంచ్లందరూ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని మాజీ సర్పంచ్లకు సూచించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది..? : మాజీ ఎమ్మెల్యే శంబంగి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. నలబైభె ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేపో మాపో పదవీకాలం పూర్తయ్యే సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తగా వచ్చిన సర్పంచ్లకు ఇవ్వాల్సిన శిక్షణను రెండు నెలల్లో పదవీ విరమణ చేసే వారికి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. -
జల్జీవన్ పైపులు దగ్ధం
సీతంపేట: స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కన పడి ఉన్న జల్జీవన్ మిషన్ పైపులు దగ్ధమయ్యాయి. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు వేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ 37 కిలోమీటర్ల పొడవు గల పైపులు గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంచేశారు. గురువారం అకస్మాతుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖాధికారి జామి సర్వేశ్వరరావు అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. గవరమ్మపేటలో గజరాజులు జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, రామినాయుడువలస పంట పొలాల్లో గజరాజులు గురువారం దర్శనమిచ్చాయి. ఉదయం గవరమ్మపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గజరాజులు మధ్యాహ్నానానికి రామినాయుడువలస, పెదమేరంగి చెరువులోకి చేరుకున్నాయి. రాత్రి సమయంలో గ్రామంలోకి చొచ్చుకువస్తాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రబీ వరి పంట పొట్ట దశలో ఉండడంతో పంటలను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ను ప్రారంభించిన ఎస్పీ గుర్ల: స్థానిక పోలీస్స్టేషన్లో నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్, పార్కింగ్ షెడ్, ఫిర్యాదుదారులు వేచి ఉండే గదిని ఎస్పీ దామోదర్ గురువారం ప్రారంభించారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం మెంటాడ: మండలంలోని మెంటాడ గ్రామంలో మండలవారి వీధిలో మండల సత్యవతి పెంకుటిల్లు గురువారం దగ్ధమైంది. సత్యవతి ఇంట్లో నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పెంకుటిల్లు కావడంతో కలపకు మంటలు అంటుకొని భారీగా మంటలు చెలరేగి కాలిపోయింది. ప్రమాదంలో తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, బట్టలు, నిత్యావసర సరుకులతో పాటు రూ.76 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు సత్యవతి తెలిపారు. విజయనగరం అర్బన్: డీఎల్ఎడ్ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫీజుల చెల్లింపుల షెడ్యూల్ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం విడుదల చేశారు. 2024 – 26 బ్యాచ్తో పాటు ఒకసారి ఫెయిల్ అయిన 2022 – 24, 2023 – 25 బ్యాచ్ల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. పరీక్ష ఫీజులను నిర్ణీత గడువులోపు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులు వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 5వ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం ఉంది. అదే ప్రిన్సిపాల్ ద్వారా చెల్లించవలసిన వారికి మాత్రం ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ముందుగా ఫీజులను ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించి, అనంతరం అవసరమైన వివరాలను సంబంధిత కళాశాలలకు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజులు నాలుగు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. -
వ్యక్తిపై కేసు నమోదు
వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్పై అదే గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ్ సెలూన్ షాపులో ఉన్న కత్తితో దాడి చేయడంపై వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు.. శింగరాయి గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్, లక్ష్మణ్ గతంలో అండమాన్లో బాగానే ఉండేవారు. లక్ష్మణ్ కాస్త డబ్బులు సంపాదించి సాయికుమార్కు చెప్పకుండా శింగరాయి వచ్చేసి వేపాడలో రెండు నెలల కిందట సెలూన్ షాపు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యాహ్నం వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్న లక్ష్మణ్ వద్దకు సాయికుమార్ వచ్చి అండమాన్లో ఉన్నప్పుడు లక్ష్మణ్ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లక్ష్మణ్ తన షాపులో ఉన్న షేవింగ్ కత్తితో సాయి మెడపై గాయపర్చినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గాయపడిన సాయికుమార్ను 108లో ఎస్.కోట తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. దీనిపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరాకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వీఆర్ఓ కొండమ్మ, సిబ్బంది ఉన్నారు. -
అమరావతి పేరుతో అక్రమాలు
● ఎమ్మెల్సీ విక్రాంత్ రాజాం: అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న భూదందాలు, అక్రమాలు అడ్డుకోవడమే వైఎస్సార్సీపీ అజెండా అని, అక్కడి రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రాజాంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధానిగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని, రాజధాని అవ్వకుండా వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందన్న కూటమినేతల ప్రచారం అనైతికతకు నిదర్శనమన్నారు. 2014–19 మధ్య కాలంలో అమరావతిని రాజధానిగా చేసి, పాలనచేసిన టీడీపీ పదేళ్ల తరువాత మళ్లీ అమరావతి రాజధాని అంటూ తీర్మానాలు చేయడం, పచ్చమీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంటగ్యాస్ లేక రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిన్నచిన్న టిఫిన్, టీ షాపులు, పాస్ట్ఫుడ్ సెంటర్లు మూసేశారని, గ్యాస్ డిమాండ్పై ప్రభుత్వం చేతకాని తనాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ దృష్టిని మళ్లించేందుకు అమరావతిని తెచ్చేశాం అంటూ కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ప్రజాసంక్షేమం చేతకాని చంద్రబాబుపై రెండేళ్లకే ఓటర్లు అసహనంతో ఉన్నారని, అది హద్దులు దాటకుండా కూటమి జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. -
ఫలితాలివ్వని పీ–4
విజయనగరం అర్బన్: పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు దాతల నుంచి నేరుగా సహకారం అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రకటించి అమలు చేస్తున్న పీ 4 (జీరో పావర్టీ) కార్యక్రమం ఫలితాలు క్షేత్ర స్థాయిలో భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం చూపుతున్న దిశ, వాస్తవ ఫలితాలు మధ్య భారీ అంతరం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీ 4 ద్వారా వచ్చిన దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగిస్తూ పథకం లక్ష్యాన్ని దారి మళ్లిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పీ 4 వార్షికోత్సవంలో అలాంటి దాతలను ఉత్తమ మార్గదర్శకులుగా మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించి సత్కరించడం కనిపించింది. జిల్లా, నియోజకవర్గ స్థాయి అవార్డుల వివరాలు చూస్తే ఈ కార్యక్రమం ప్రధానంగా విరాళాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంపై ఆధారపడుతున్నదన్న విషయం స్పష్టమవుతోంది. స్వచ్ఛంద సంస్థ విరాళాలే అధికం గజపతినగరం నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ రూ.71.61 లక్షలతో పాఠశాల, ఆస్పత్రికి సదుపాయాలు కల్పించగా, మరో సంస్థ రూ.39.10 లక్షలతో మార్కెట్, పాఠశాలలు, గ్రామాలకు సహాయం చేసింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.12.64 లక్షలు, పుష్పగిరి ఫౌండేషన్ రూ.4లక్షలతో సేవలు అందించాయి. ఇవి చూస్తే ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగించి పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని పక్కన పెట్టిందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు. లక్ష్యానికి తగ్గ విస్తృతి లేకపోవడం పీ–4 లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా పేదరిక నిర్మూలనే అయినప్పటికీ అమలు మాత్రం కొన్ని నియోజనవర్గాలు, కొన్ని సంస్థలకే పరిమితమవుతోంది. జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా కేవలం 19,410 కుటుంబాలు మాత్రమే దత్తత పొందాయి. అంటే దాదాపు 75 శాతం కుటుంబాలు ఇంకా సహాయానికి దూరంగానే ఉన్నాయి. వీళ్లలో కొంతమంది 27 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా వాటి సహాయ కార్యక్రమాలు ఆయా గ్రామాలకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో లక్షలాది మంది పేదలు ఉన్న నేపథ్యంలో లక్షల్లో విరాళాలు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా 2,897 మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం, కార్యక్రమంపై దాతలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. పీ–4తో బాధ్యతల నుంచి దూరంగా ప్రభుత్వం లక్షల్లో బంగారు కుటుంబాలు.. ప్రకటించింది 82,426 27 గ్రామాలను దత్తత తీసుకున్నా.. కనిపించని సహాయక పనులుప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు – ప్రచారం – వాస్తవం పీ–4లో ప్రభుత్వం మార్గదర్శక పాత్రలో మాత్రమే ఉండి అమలు బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, దాతలపై మళ్లిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలన వంటి కీలక అంశంలో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడి పర్యవేక్షణ లేకపోవడం మేధావుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో భాగంగా అందిస్తున్న సహాయం పరిమిత స్థాయిలోనే ఉండటమే కాకుండా పేదరిక నిర్మూలనకు వినియోగించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చివరకు ఇది ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రిటైర్డ్ జవాన్కు ఘనస్వాగతం
బాడంగి: రక్షణశాఖలో 17ఏళ్ల పాటు సేవలందించి మార్చి 31న ఉద్యోగ విరమణ చేసిన సైనికుడికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.మండలంలోని అచ్చియ్యపేటకు చెందిన లచ్చుపతుల ప్రవీణ్కుమార్ అస్సాంలోని మిలటరీ బెటాలియన్లో సిగ్నల్ టెక్నీషియన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. గురువారం ఆయన గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు,యువత మండల కేంద్రం బాడంగి వచ్చి పూలమాలలు వేసి స్వాగతించారు.ప్రోటోకాల్ ప్రకారం తహసీల్దార్ వరప్రసాద్, ఎస్ఐ తారకేశ్వరరావు అక్కడికి చేరుకొని జాతీయ జెండా ఎగురవేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గ్రామస్తులు ప్రవీణ్కుమార్ని గ్రామానికి ప్రత్యేక వ్యాన్పై మెయిన్రోడ్డు మీదుగా ఊరేగిస్తూ అచ్చియ్యపేటకు తోడ్కొనివెళ్లారు. గ్రామంలో సభ ఏర్పాటుచేసి సన్మానించారు. ప్రవీణ్కుమార్ గతంలో జమ్ముకశ్మీర్ బూటాన్,హైదరాబాద్, తదితర ప్రదేశాల్లో పనిచేశారు. -
సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలి
● ఉపాధిలో సమయపాలన పాటించేలా చూడాలి ● ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి ● డ్వామా పీడీ రామచంద్రరావుసీతానగరం: ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సాంకేతిక సహాయకులు తరచూ క్షేత్ర స్థాయిలో సందర్శించాలని, వేతనదారులు చేస్తున్న పనులు పరిశీలించి నివేదికలు తయారు చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్ అధ్యక్షతన ఉపాధి హామీ అధికార సిబ్బందితో ఉపాధి పనుల నిర్వహణపై గురువారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల వద్ద సదుపాయాల నిమిత్తం సంబంధత ఏఎన్ఎం నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుని పని వద్ద ఉంచాలన్నారు. ఎన్ఎంఎంఎస్ పంపించే సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఏపీపీలో ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉత్పన్నమైన సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏపీఓ ఊణ్ణ బాలకృష్ణ, జేఈ సోమేశ్వరరావు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. -
యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం
విజయనగరం: యేసు క్రీస్తు ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని, సర్వ మానవాళి పాప విమోచనం కోసం తన ప్రాణాలను బలిదానంగా అర్పించిన కరుణామయుడు యేసు అని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధకులకు గుడ్ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. శత్రువులను సైతం ప్రేమించాలని, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం, ఆచరించిన జీవితం విశ్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో కూడా అటువంటి శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నిరుపేదల సంక్షేమంకోసం కృషిచేయాలన్నారు. ప్రజలందరిపైనా క్రీస్తు దీవెనలు ఉండాలన్నారు. మట్టి అక్రమ రవాణాపై చర్యలు తప్పవు రామభద్రపురం: మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ అజురఫీజాన్, ఎస్ఐ వి. ప్రసాద రావు హెచ్చరించారు. పదిరోజులుగా మండలంలో రాత్రింబవళ్లు మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయని ఫిర్యాదు వచ్చిందని, తక్షణమే నిలుపుదల చేయాలని జేసీబీ, ట్రాక్టర్ యజమానులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో మైన్స్ అధికారులు, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు, ట్రాక్టర్, జేసీబీ యజమానులతో సమావేశం ఏర్పాటుచేశారు. అక్రమ తవ్వకాలను నియంత్రించాలని అధికారులకు తహసీల్దార్ సూచించారు. పొలాలకు మట్టి వేసుకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దన్నారు. సిబ్బందికి ప్రశంసలు విజయనగరం క్రైమ్: గతేడాది విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యకేసులో నిందితుడు గాజులరేగకు చెందిన కర్నపుసాయి (20)కి శిక్షపడేలా అభియోగపత్రాలు దాఖలు చేసిన, సాక్షులను ప్రవేశపెట్టిన విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఏఎస్ఐ జి.అర్జున్, మహిళా కానిస్టేబుల్ టి.లక్ష్మిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. -
రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించాలి : జేసీ
పార్వతీపురం రూరల్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఇండెక్స్ రిజిస్టర్లు, పెండింగ్లో ఉన్న దస్తావేజులను నిశితంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులతో నేరుగా మాట్లాడి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో అనవసర జాప్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూలు లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
‘సీతం’లో పాలిసెట్ ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో పాలిసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్టు సత్య విద్యా సంస్థల కరెస్పాండెంట్, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఈ నెల 4 నుంచి 24వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్స్, బాలురు, బాలికలకు హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన సన్నద్దత కల్పించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో శిక్షణ అందిస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాలిసెట్ కోచింగ్కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం 9533545689, 7989040214 నంబర్లను సంప్రదించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి సూచించారు. -
● గ్యాస్ కోసం పడిగాపులు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ కాలనీలో భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. స్థానిక భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉదయం 11 గంటల నుంచే వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సాయంత్రం వరకు వాహనం రాకపోవడంతో ఎండలోనే పడిగాపులు కాశారు. చివరకు సాయంత్రం వేళ సాలూరు నుంచి ఒక బొలెరో, ఆటోలో అరకొరగా సిలిండర్లు చేరుకున్నాయి. వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని క్రమబద్ధీకరించారు. భారీ క్యూ ఉండటం, స్టాక్ తక్కువగా రావడంతో తమ వరకు గ్యాస్ అందుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు..
జామి: తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది ఓ విద్యార్థికి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భీమసింగి పంచాయతీ పీతలపాలెం గ్రామానికి చెందిన బొట్ట వెంకటేష్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి వెంకటేష్ తల్లి దేముడమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఏం చేయాలో తెలియని పుట్టెడు దుఃఖంలో కూడా వెంకటేష్ గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యాడు. -
రైతులకు విరివిగా రుణాలు అందించాలి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: రైతులు నిరంతర ఆదాయం పొందేందుకు పాడి పరిశ్రమ, ఉద్యాన పంటల సాగుకు అవసరమైన రుణాలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం సూర్యఘర్, సీసీఆర్సీ కార్డులు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, మహిళా సంఘాల రుణాలు, ముద్ర రుణాలు, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) తదితర అంశాలపై సమీక్షించారు. ఆవులు, గేదెలు, మెకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. నాబార్డు రూపొందించిన 2026–27కు సంబంధించిన ప్రొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ వార్షిక నివేదికను కలెక్టర్ ఆవిష్కరించారు. నాబార్డు సహాయ జనరల్ మేనేజర్ నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రూ.7,806.89 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1,714.52 కోట్లు, ఇతర రంగాలకు రూ.2,157.20 కోట్లు రుణాలు అందించాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. సమావేశంలో మెప్మా పీడీ చిట్టిరాజు, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఎల్డీఎం వీవీరమణమూర్తి, డీపీఓ మల్లికార్జునరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్ : ఎల్.కోట – మళ్లివీడు రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గురువారం గుర్తించారు. దీనికి సంబంధించి జీఆర్పీ హెచ్సీ ప్రసాద్ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 50 నుంచీ 55ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మళ్లివీడు రైల్వేస్టేషన్ వద్ద గుర్తించామన్నారు. సదరు మృతదేహం సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామన ఛాయ రంగుతో ఉందన్నారు. సదరు మృతదేహంపై లేత వైలెట్ రంగు ఫుల్ హాండ్స్ షర్టు, కాఖీ కలర్ ప్యాంటు ధరించి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
గజపతినగరం: విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. గజపతినగరం–2 గ్రామ సచివాలయాన్ని, పురిటి పెంట–1 అంగన్వాడీ సెంటర్ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సేవలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పి.సత్యవతి విధుల్లో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా సీడీపీఓ, సూపర్ వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ పీడీను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఆయన వెంట గజపతినగరం ఇన్చార్జి తహసీల్దార్ శోభారాణి ఉన్నారు. -
చిన్నారుల దాహం తీర్చే దారేదీ?
ఈ చిత్రాలు చూశారా... కుళాయి వద్ద తాగునీటిని పడుతున్నది రామభద్రపురం మండలం కారేడువలస గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులు. పాఠశాలలో బోరునీరు అందుబాటులో లేక దాహంవేస్తే వీధి కుళాయిలను ఆశ్రయిస్తున్నారు. అలాగే, పాఠశాలలో భోజనం వండే సదుపాయం లేక నిర్వాహకురాలు ఇదిగో ఇలా పిల్లలకు ఇంటివద్దనే వంట చేస్తోంది. మరోవైపు పాఠశాలలోని మరుగుదొడ్లు మూలకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడికి సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చూపుతోందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. – రామభద్రపురం ఇంటి వద్ద మధ్యాహ్న భోజనం వండుతున్న నిర్వాహకురాలు ఆదిలక్ష్మి -
● గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం వల్ల జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసినా సకాలంలో అందడం లేదు. ఫలితం... గ్యాస్ గొడౌన్లు, ఆఫీస్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్యాస్ లారీ వచ్చిన వెంటనే క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సిలిండర్ ఇచ్చాక నెత్తిన, బైక్లపై అష్టకష్టాలు పడుతూ ఇంటికి చేర్చుతున్నారు. దీనికి విజయనగరంలోని చింతలవలస గ్యాస్ గౌడౌన్ వద్ద గురువారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. గ్యాస్ కష్టాలు లేవంటూ పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తివే అనేందుకు వినియోగదారుల పాట్లే నిదర్శనం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం తప్పని ఇక్కట్లు భుజాన సిలిండర్తో..చిన్నారికీ తప్పని సిలిండర్ కష్టాలు -
మామిడి చెట్లు నరికివేత
సంతకవిటి: అనుమానమే పెనుభూతమై మామిడి చెట్లు నరికివేతకు దారితీసిన పరిస్థితి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) ఇటీవల కాలిన గాయాలతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. జోగులు మృతి విషయంలో ఆయన పొలం పక్కన ఉన్న మామిడి తోట యజమాని.. పుల్లిట గ్రామానికి చెందిన వ్యక్తే కారణమని భావించి మామిడి తోటను మృతుడు కుటుంబీకులు కొందరు నరికేసినట్టు తోట యజమాని భార్య పిన్నింటి స్వప్న బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదిలా ఉండగా పుల్లిటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవిపై విచారణ జరపండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి ఎన్.రాంసుందర్రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారికంగా చూపించిన లెక్కలకు, వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకు చెందిన మిరాకల్ సాఫ్ట్వేర్ సిస్టం సంస్థలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.వేతనాల రౌండ్ ట్రిప్పింగ్ తీరిది ఫిర్యాదు ప్రకారం.. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతినెలా ఇచ్చే జీతం కాకుండా అదనంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు జమ అయ్యేది. తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి వెనక్కి తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేశారు. నిజానికి ఈ వ్యవహారంపై సదరు మాజీ ఉద్యోగి తొలుత భోగాపురం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అయితే ఆర్థిక అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలు లేవంటూ కేసును మూసివేశారు. అనంతరం ఆయన ఇదే అంశంమీద విజయనగరం డీఎస్పీ, ఏఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మార్చి 31న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పకడ్బందీగా మనీ లాండరింగ్కు పాల్పడిన ఎమ్మెల్యే నాగమాధవి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కూటమి ఎమ్మెల్యేగా మున్ముందు మరిన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కాలుష్య కోరల్లో ఉత్తరాంధ్ర
చికెన్● లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీవిజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కాలుష్యం పెరుగుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలు క్రమంగా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో స్థాపితమైన ఫార్మా కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించడం కంటే ఎక్కువగా కాలుష్యాన్ని అందిస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు కంపెనీలకు జబ్బులు ప్రజలకు అనే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జాతీయ రహదారిపై రద్దీ అధికమైందని తెలిపారు. ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయనున్నట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. సమావేశంలో లోక్సత్తా నాయకులు మూర్తి, నాగభాస్కరం, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచండి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, కేఆర్సీ ఎస్డీసీ ఈ.మురళి పాల్గొన్నారు. మెరుగైన ర్యాంకులు సాధించాలి స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా టాప్–100లో స్థానం దక్కేలా ప్రత్యేకంగా విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇతర మున్సిపాలిటీలు కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లు, పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, తదితరులు పాల్గొన్నారు.విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సేవలు, భూసర్వే ప్రక్రియ, ప్రజల అర్జీల పరిష్కారంలో అధికారులు మరింత వేగంగా స్పందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మ్యుటేషన్లలో ఐదు రకాల సవరణలను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ స్థితిగతుల ఆధారంగా కరెక్షన్స్ చేయాలని స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి జిల్లాలో అందిన 22ఏ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం–8 జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై కూడా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. అన్ని సేవలపైనా 90 శాతం కంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని సాధించేలా పనితీరు ఉండాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ.. వెబ్ల్యాండ్ పోర్టింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్–4 పరిధిలోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ 96,779.71 ఎకరాల వరకు పూర్తయిందని.. మిగిలిన పనులు -
బాధ్యతల స్వీకరణ
విజయనగరం లీగల్: విజయనగరం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా నళితం రమేష్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఉపాధ్యక్షులుగా పి. బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శిగా గడి మురళి, సంయుక్త కార్యదర్శిగా పి. వరలక్ష్మి, కోశాధికారిగా పి. రామచంద్రరావు, స్పోర్ట్స్ కార్యదర్శిగా జేవీఎస్ఎన్ మూర్తి, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చంద్రశేఖర్, వి. రత్నకుమారి, ఎస్. రమేష్, బి.పార్వతి, వి. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. డివిజన్లు పెరిగాయ్.. విజయనగరం: నగర పరిధిలో ఉన్న 50 డివిజన్ల సంఖ్యను 62కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల పెంపు నేపథ్యంలో అవసరమైన కసరత్తును తక్షణమే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్ బొండపల్లి: ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నలపై దాడి చేసిన తమ్ముడు, అతని భార్యను బుధ వారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళి తే.. మండలంలోని కొండకిండాంలో గత నెల 30న జరిగిన ఆస్తి తగాదాలో కలిశెట్టి గౌరునాయుడు తన ఇద్దరు అన్నలైన సత్యనారాయణ, బంగారునాయుడుపై కత్తితో దాడి చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరునాయుడు, అతనికి సహకరించిన భార్య జయశ్రీలను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నెలివాడలో దొంగతనంబొండపల్లి: మండలంలోని నెలివాడలో ఓ ఇంటిలో బుధవారం వేకువజామున దొంగతనం జరిగింది. ఎస్సై యు.మహేష్ తెలియజేసిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన షేక్ రసూల్ దొంగలు ప్రవేశించి, పావు తక్కువ రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్ట్యాప్ను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని వయసు సుమారు 50 ఏళ్లు ఉంటాయని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. నలుపు రంగు ఫ్యాంట్, బిస్కెట్ కలర్ షర్ట్తో ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా శాఖ బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష శిబిరం నిర్వహించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని.. అంతవరకు 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఆమోదించేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని.. జీఓ 57 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్, సీనియర్ నాయకులు కె.విజయగౌరి, డి.రాము, సహాధ్యక్షురాలు జి.పార్వతి, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమేష్ చంద్రపట్నాయక్, ఈశ్వరరావు, కె..శ్రీదేవి, ఎన్.సత్యనారాయణ, ఎస్.వెంకటరావు, కిల్లాడ అప్పారావు, గంట సుశీల, నిర్మల, శశికళతో పాటు మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎంఎస్పీ సేవలు వినియోగించుకోండి..
● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం క్రైమ్: పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్హెచ్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను మహిళా సంరక్షణ కార్యదర్శుల సహకారంతో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు పరిధిలోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించాలని.. వారు ఏ ప్రాంతం వారు, ఎందుకు, ఎక్కడ నుంచి వచ్చిందీ తెలుసుకోవాలన్నారు. గ్రామల్లో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణకు అండగా ఉండే చట్టాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. వారంలో ఒక రోజు ఎంఎస్పీలతో సంబంధిత ఎస్హెచ్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. -
పైడితల్లిని దర్శించుకున్న ప్రముఖ గాయని జానకమ్మ
విజయనగరం టౌన్: ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకమ్మ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లిని బుధవారం దర్శించుకున్నారు. మూ డులాంతర్లు జంక్షన్ వద్దనున్న బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించిన అనంతరం జానకమ్మకు వేదాశీస్సులు, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకుడు బీఏ నారాయణ, డాక్టర్ జి.సన్యాసమ్మ, గాయనీ, గాయకులు పాల్గొన్నారు.తల్లిదండ్రుల చెంతకు బాలికవిజయనగరం క్రైమ్: వన్టౌన్ స్టేషన్ పరిధి తోటపాలెంలో అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఎస్సై లీలావతి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 31న తోటపాలెంనకు చెందిన ఓ బాలిక అదృశ్యమైందంటూ తండ్రి వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లీలావతి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోన్ నంబర్ను ట్రేస్ చేయగా విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన ఎస్సై లీలావతి తన బృందంతో విశాఖ వెళ్లి బాలికను తీసుకొచ్చి కన్నవారికి బుధవారం అప్పగించారు. బాలిక ప్రేమికుడితో వెళ్లినట్లు తేలడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో హెచ్సీ రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలోని పాత్రికేయులంతా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఎ.డి పి.గోవిందరాజులు, తిరుమల మెడికవర్ ఎం.డి డాక్టర్ తిరుమల ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.జీవనరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సాయిరాం, తిరుమల మెడికల్ సెంటర్ హెడ్ పవన్కుమార్, ఐఈయూ ఇన్చార్జ్ డాక్టర్ ఎ.జగదీష్, కార్డియాలజిస్ట్ శ్రీకిరణ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పీఎస్ఎస్వీ ప్రసాదరావు, బూరాడ శ్రీనివాసరావు, డివిజన్ పీఆర్ఓ ఎస్.జానకమ్మ, పీఆర్ఓ మజ్జి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సురక్షిత నీరు
● కలెక్టర్ రాంసుందర్రెడ్డివిజయనగరం ఫోర్ట్: ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓ ప్లాంట్ లేని పాఠశాలలు, వసతిగృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది సుధీర్ఘ ఎల్నినో ప్రభావం వల్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీఎంహెచ్ఓ జీవనరాణి, డీపీఓ మల్లికార్జునరావు, విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
వీబీ జీ రామ్జీ మరింత ఆలస్యం..
విజయనగరం ఫోర్ట్: వీబీ జీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ ) పథకం అమలు మరింత జాప్యం కానుంది. వాస్తవానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ పథకం (ఉపాధి హామీ పథకం) అమలు కావాల్సి ఉంది. అయితే పథకం నిర్వహణకు సంబంధించిన గైడ్లైన్స్ నేటికీ జిల్లాకు చేరకపోవడంతో పథకం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీబీ జీ రామ్జీ పథకంగా మార్పు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పేరుతో పథకాన్ని అమలు చేస్తామని జిల్లా నీటియాజమన్య సంస్థ ( డ్వామా) అధికారులు కూడా నిన్న, మొన్నటి వరకు తెలిపారు. కొత్తగా పని దినాలు పెరుగుతాయని.. గ్రామాల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. 125 రోజుల పనిదినాలు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజులు పనిదినాలు కల్పించేవారు. కొత్తగా పథకం పేరు మార్చిన తర్వాత పనిదినాల సంఖ్య పెంచారు. ఒక్కో కుటుంబానికి 125 రోజుల పాటు పని కల్పించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పున నిధులు కేటాయించేవి. అయితే పథకం పేరు మార్చిన తర్వాత కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకోవడంతో రాష్ట్రంపై భారం పడనుంది. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు.. జిల్లాలో ఉపాధిహామి పథకానికి సంబంధించి 3.45 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వేతనదారులు 6.26 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలకు మాత్రమే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనదారులకు 44.44 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో చెరువులు, గుంతలు, కాలువల్లో పూడికతీతలు, జంగిల్ క్లియరెన్స్, చెరువు గట్టు ఎత్తు పెంచడం, చెరువు లోతు చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది కాని నేటికీ రాని గైడ్లైన్స్ పనుల కోసం ఎదురుచూస్తున్న వేతనదారులుగైడ్లైన్స్ రాలేదు.. ఏప్రిల్ నెల కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంగానే అమలు కానుంది. ఏప్రిల్ నెలకు పనిదినాల సంఖ్య 44.44 లక్షలుగా నిర్దేశించారు. వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా రాలేదు. – ఎస్. శారదా దేవి, పీడీ, డ్వామా -
బెట్టింగ్ల మాయాజాలంలో చిక్కుకోవద్దు..
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో యువత ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల మాయాజాలంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే స్వార్థపరుల ఆశల వలలో పడి బంగారు భవితను అంధకారం చేసుకోవద్దన్నారు. వినోదం పంచాల్సిన ఆటలు.. కుటుంబాల్లో విషాదం నింపేలా మారకూడదని హితవు పలికారు. బెట్టింగుల వ్యసనానికి బానిసలై అప్పులపాలవుతున్నారని, ఆ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో కొందరు దొంగతనాలు, ఇతర నేరాల బాట పడుతుంటే.. మరికొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో పెట్టాలని కోరారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే డయల్ 112 లేదా 100 నంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. -
ఏడుకొండలు మృతికి అధికారులదే బాధ్యత
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాడని జెడ్పీటీసీ గార తవుడు, సర్పంచ్ బెల్లాన త్రినాధరావు ధ్వజమెత్తారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏడుకొండలు జాతీయ రహదారి మెయిన్రోడ్డులో ఉన్న డివైడర్ను దాటుకుంటూ వెళ్తున్న సమయంలో హైవే పోల్స్, లైటింగ్కు సంబంధించిన కంట్రోలింగ్ బాక్స్ తెరిచి ఉండడం వల్లే విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడని ఆరోపించారు. సెట్బాక్స్ మూసి ఉంటే విద్యుత్ తీగలు బయటకు వచ్చేవి కాదని, బాక్స్ తెరిచి ఉండడం వల్లే ఏడుకొండలు విద్యుత్ షాక్కు గురయ్యాడని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని వారు మండిపడ్డారు. ఏడుకొండలు మృతిపై సంఘటనా స్థలం నుంచే విద్యుత్, పంచాయతీ శాఖలు, నేషనల్ హైవే అధికారులకు సమాచారమివ్వగా తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రెక్కాడితేగాని పొట్ట నింపలేని ఏడుకొండలు కుటుంబాన్ని అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
సీతం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్కు గుర్తింపు
● ప్రతిష్టాత్మక కోర్సుకు నలుగురు ఎంపికవిజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాల క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్కు గౌరవం దక్కింది. ఆ కేంద్రానికి చెందిన నలుగురు సభ్యులు వైజర్, క్యూబైటెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక క్వాంటం అల్గారిథమ్స్ కోర్సుకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో మొదటి సంవత్సరం విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలత, గణితశాస్త్ర విభాగం అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శ్రీచందన్, సీఎస్ఈ చివరి సంవత్సరం విదార్థిని ఎం.త్రివేణి, విద్యార్థి సి.పూర్ణచంద్ర శేఖర్ ఉన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవతో వైజన్, క్యూబైటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం ఫండమెంటల్స్ ఈ నలుగురు విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పొందిన సుమారు 67 వేల మంది విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కేవలం 3 వేల మందిని మాత్రమే ఈ ఉన్నత స్థాయి కోర్సులకు ఎంపిక చేయడం విశేషం. ఎంపికై న సభ్యులు సీతం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం కంప్యూటింగ్ శిక్షణా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తమ నిబద్దతను చాటుతున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉన్న క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందంజలో నిలవడానికి సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ వీజీప్రసూన, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి.వేణుమాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పుచ్చ...
ఆరోగ్యానికి భలే రక్షసీజనల్ వ్యాపారం మూడు నెలలు పాటు ఈ పుచ్చకాయల వ్యాపారం ఉంటుంది. ఈ ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకొంటున్నాం. ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎండ సమయంలో ఇవి ముక్కలుగా కోసి ఉంచితే అమ్ముడైపోతాయి. – పి.శ్రీనివాసరావు, వ్యాపారి, పార్వతీపురంపార్వతీపురం: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటితే చాలు వేడి గాలులు. అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు తప్పని పాట్లు. ఈ సమయంలో దారి పొడవునా నేనున్నానంటూ అటు దాహార్తిని, ఇటు ఆకలిని తీర్చేస్తుంది పుచ్చకాయ. సాధారణ వ్యక్తి కూడా కొనుగోలు చేసి తినగలిగే దివ్య ఫలంగా పుచ్చకాయ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా ఈ వేసవిలో పుచ్చకాయ కనిపిస్తే చాలు తినని మనిషి, రుచి చూడని జిహ్వ ఉండదు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస, పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, వీరఘట్టం, భామిని తదితర మండలాలలో సుమారు 300 ఎకరాలలో కర్బూజా పంటను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాలకే పరిమితమైన ఈ పంట ఇప్పుడు అన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగు చేసిన రైతులకంటే వ్యాపారులకే లాభసాటిగా ఉంటుందని రైతులంటున్నారు. శుభ కార్యక్రమాలలో.. పుచ్చకాయ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరు పుచ్చకాయని తింటారు. ఇప్పుడు కొత్తగా వివాహాలు, శుభ కార్యక్రమాలు జరిగిన సందర్భంలోనూ, తమ ఇండ్ల వద్ద నిర్వహించే ఫంక్షన్లలో పుచ్చకాయలను ముక్కలుగా కోసి వచ్చేవారికి ఇస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఇళ్లలో ఈ వేసవిలో పుచ్చకాయలు నిల్వ ఉంచుకుంటున్నారు. వేసవిలో దాహార్తి తీర్చే దివ్య ఫలం కిలో రూ.25లు ధరలో లభ్యం దారి పొడవునా విక్రయాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు -
అంగన్వాడీల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సునీత, ప్రభావతి డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం అర్బన్ ఐసీడీఎఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమ్మె చేస్తున్న సమయంలో కూటమి నేతలు వచ్చి తొందరలోనే మన ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఇప్పుడు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ వచ్చి 20 నెలలైనా వేతనాలు పెంచలేదన్నారు. పదోన్నతుల విషయంలో రాజకీయ జోక్యం సరికాదన్నారు. యూనియన్ నాయకులు బి.పైడిరాజు, చిట్టితల్లి, సత్యవతి, రత్నం, కరుణ, జయ, రమ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, బొబ్బిలి, రాజాం ఆస్పత్రుల భవనాల పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్, అగ్నిమాపక పరికరాలు, ఏసీలు ఏర్పాటు, అంతర్గత రోడ్లు, జనరేటర్లు ఏర్పాటు, పేషేంట్లు వేచి ఉండే గదులు, ఫర్నిచర్, ప్రహరీ, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీల పట్ల వివక్ష తగదు
చీపురుపల్లి: సబ్ జైళ్లలో ఉన్న ఖైదీలు పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి అన్నారు. పట్టణంలోని సబ్ జైల్ను మంగళవారం బోర్డు ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్ బృందం పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనేర్స్ ఏర్పాటు చేసిందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీలు నేర ప్రవత్తిని విడిచి మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. సబ్జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను తనిఖీ చేశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నపూర్ణమ్మ, చీపురుపల్లి ఆర్డీఓ ఎం.సుధారాణి, డీఎస్పీ ఎస్.రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు సచిన్
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు విజయనగరానికి చెందిన బి.సచిన్ ఎంపికయ్యాడు. ఇటీవల విశాఖలో జరగిన జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన సచిన్ 70–75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు నాగపూర్లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. క్రీడాకారుడు సచిన్కు సీనియర్ బాక్సర్, ఎల్ఐసీ డెవెలప్మెంట్ ఆఫీసర్ బి.దివాకర్ రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు.కోమటిపల్లిలో అగ్నిప్రమాదం బొబ్బిలి రూరల్: మండలంలోని కోమటిపల్లి జంగాల వీధిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొతి గౌరికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోగా పక్కనే ఉన్న మొతి సాంబయ్యకు చెందిన పెంకిటిల్లు ముందుభాగాన ఉన్న రేకులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. గౌరి ఇంటి వద్ద కట్టెల వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నికీలలు చెలరేగి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. ప్రమాదంలో గౌరికి చెందిన ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోగా సుమారు లక్ష రూపాయిల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదుగజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యంతోనే సోమవారం మృతి చెందాడని మృతుడి తండ్రి గౌరినాయుడు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు అవకాశం విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సమాన పదోన్నతుల కోసం సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపా ధ్యాయులు సరైన ఆధారాలతో ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా సమర్పించాలని సూచించారు. రూ.46 కోట్ల పన్ను వసూలు విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పన్నుల రూపేణా రూ.46 కోట్ల 16లక్షల 59,248లు మంగళవారం సాయంత్రానికి నగర పాలక సంస్థకు సమకూరిందని కమిషనల్ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పన్నులపై వడ్డీని 50 శాతం వరకు తగ్గించడంతో పన్ను చెల్లింపులు ఈసారి అధికంగా జరిగాయన్నారు. గత సంవత్సరం రూ.40కోట్ల 89లక్షల 97వేల, 281లు వసూలు కాగా ఈ సంవత్సరం ఆరు కోట్లు అదనంగా వసూలైందన్నారు. దీర్ఘకాల బకాయిలు, అధిక మొత్తం పన్నులు రాబట్టేందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు నేతృత్వంలో బృందం పన్ను వసూలను, ప్రచారాన్ని ముమ్మరం చేయడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం ఆస్తి పన్నులు రూ.37 కోట్ల 23లక్షల 65వేల 479లు ఈ సాయంత్రానికి వసూలు అయ్యాయన్నారు. ఖాళీ పన్నుల రూపేణా రూ.6కోట్ల53లక్షల 65వేల,103లు, నీటి చార్జీలు రూ.2కోట్ల 39లక్షల 28వేల 666లు వసూలు అయ్యాయన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పూర్తి
పార్వతీపురం రూరల్: స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ముగిసింది. జిల్లా వ్యవసాయ మేనేజర్ జి.సత్యవతి అధ్యక్షతన జరిగిన సదస్సులో జిల్లాలోని 4 డివిజన్ల నుంచి ఏడీఏలు, 15 మండలాల్లో పని చేస్తున్న ఎంఏఓలతో పాటు డీఆర్డీఏ ఏపీడీ జయశ్రీ, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు త్వరలో మండల స్థాయిలో వీఏఏ, వీహెచ్ఏ, ఎఫ్.ఎమ్.టిలు, కృషి సఖీలకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మూడు రోజులు తరగతి గది శిక్షణ, రెండు రోజులు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ప్రాచీన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూసారంతో పాటు మానవ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు నవధాన్యాల సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన్యం జిల్లాలో ఉద్యాన పంటలు ఇప్పటికే ప్రకృతి సిద్ధంగా సాగువుతున్నాయని డీహెచ్ఓ సత్యం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయం పొందేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పంటల ప్రణాళికను సిద్ధం చేసినట్లు రీజనల్ థీమాటిక్ లీడ్ ప్రకాష్ తెలిపారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింపజేసే ‘ఆఫ్ మూన్ డ్రాట్ ప్రూఫింగ్’ నమూనాను ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ మేనేజర్ ఎం.శ్రావణ్ కుమార్నాయుడు, రీజనల్ టెక్నికల్ అధికారి హేమసుందర్, ఏడీఏలు శారద, శంకరరావు, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖకు డ్రోన్ వితరణ
విజయనగరం క్రైమ్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అత్యంత అవసరమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా బొబ్బిలికి చెందిన హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ను మంగళవారం డీపీఓలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్దాస్ను శాలువాతో సత్కరించి, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యక్రమాల కట్టడి, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నిరోధక చర్యలు, విపత్తుల సమయంలో శోధన, రక్షణ చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగే సభలు, ఉత్సవాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో చిత్రీకరణకు డ్రోన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. వితరణ చేసిన డ్రోన్ను ఎస్పీ బొబ్బిలి పోలీసుస్టేషన్ సీఐ కె.నారాయణరావుకి అందజేసి నేర నియంత్రణలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాలిన గాయాలతో వృద్ధుడి మృతి
● మృతిపై అనుమానాలు ● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం, డీఎస్పీసంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) మంగళవారం కాలిన గాయాలతో పొలంలో శవమై కనిపించాడు. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాలు.. జోగులు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళవారం పుల్లిట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వచ్చి జోగులు పొలం కాల్చడం వలన తన పొలం కూడా కాలిపోయిందని తెలపడంతో కుటుంబీకులు వెళ్లి వెతకగా అక్కడ కాలిన గాయాలతో జోగులు చనిపోయి కనిపించడంతో కుమారుడు చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి వెళ్లింది. ఇదిలా ఉండగా మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది సహజ మరణమా? ఇంకేదైనా కారణం ఉందా.. అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘువులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఆయన వెంట రాజాం టౌన్ సీఐ, చీపురుపల్లి సీఐ ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్షణకు పటిష్ట చర్యలు : కలెక్టర్
పార్వతీపురం: ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అమలుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలవడమే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. శ్మశాన వాటికల అవసరాలను గుర్తించి మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. కేసులు పెండింగ్లో వుంటే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ, సామాజిక సంక్షేమ, ఆదివాసీ సంక్షేమ విభాగాలు పరస్పరం సమన్వయంతో పని చేయాలన్నారు. చట్ట ఉల్లంఘన కలిగించే ఏచర్యనైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బి.విజయచంద్ర మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పెదబొండపల్లి సందర్శించిన సందర్భంగా దళిత రైతులు ఆక్రమణలపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ చర్యలు లేవన్నారు. తొలుత జిల్లాలో కేసుల పురోగతిని, విచారణ తీరును, నిందితులకు ఖరారైన శిక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నల్ జగన్నాధ్, డీఆర్ఓ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు
శృంగవరపుకోట: చంద్రబాబు సర్కారు సమస్యలను గాలికొదిలేసింది. డీఆర్సీ సమావేశానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. తేదీ నిర్ణయిస్తారు. మళ్లీ కాదంటారు. డీఆర్సీ సమావేశాల్ని మొక్కుబడి తంతుగా మార్చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఎస్.కోటలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ రైతు సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని మొత్తుకున్నా దిక్కులేదని, క్వింటాకు రూ.2,400 మద్దతుధర రైతుకు అందడం లేదని, దళారులకు రూ.1500లకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నిన్నటిదాకా ఎరువుల కొరత ఉంటే నేడు జిల్లాలో గ్యాస్ కొరత. గ్యాస్ కొనలేక అవస్థ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. జిల్లా బడ్జెట్ ఒట్టి డొల్ల, సాగునీరు, పరిశ్రమలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు, తాగునీరు, సాగునీటికి, ట్రైబల్యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కేటాయింపుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ‘లైన్’ క్లియర్
● వీటీ అగ్రహారం, దాసన్నపేట మధ్య ఇంటర్ లింకింగ్ లైన్ అనుసంధానం పూర్తి సాక్షి, ప్రతినిధి, విజయనగరం: విజయనగర వాసులకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు లో–వోల్టేజ్ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. వీటీ అగ్రహారం 132/33 కేవీ సబ్స్టేషన్ నుంచి దాసన్నపేట వరకు నిర్మించిన 5 కిలోమీటర్ల సరికొత్త 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.లక్ష్మణరావు, ట్రాన్స్కో ఎస్ఈ వరప్రసాద్, తదితరులు ఈ నూతన లైన్న్ను ప్రారంభించారు. టౌన్ డివిజన్ పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఇంటర్ లింకింగ్ లైన్వల్ల విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఏర్పడినా వినియోగదారుల ఇళ్లలోని ఉపకరణాలకు ఎటువంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. తుఫాన్ల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు నిమిషాల వ్యవధిలోనే ప్రత్యామ్నాయ మార్గంలో సరఫరాను పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఈ లైన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. -
డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ సీరియస్
డెంకాడ: డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీ వైద్యులు ఇద్దరిలో ఎం.శివరామకృష్ణ ఎఫ్పీ క్యాంప్కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన మరో డాక్టర్ ఎన్.అనూష లంచ్కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఫోన్చేసి డాక్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ రూమ్ను పరిశీలించారు. ఐరన్ మాత్రలతో రక్తహీనత నివారణ ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు అందజేయాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి వైద్యసిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మాతా,శిశు మరణాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్ గర్భణులు ప్రసవమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం చూపే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఐఓ ఆర్.అచ్చుతకుమారి, వైద్యులు దీపక్ కుమార్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు. జూన్ లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: గృహ నిర్మాణాలను ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాల ప్రగతిపై హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. జిల్లాలోని వివిధ లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో వ్యక్తిగతంగా మంజూరైన మరో 3,161 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. టిడ్కో కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యంచేయొద్దన్నారు. సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్, వివిధ మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
● దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బీసీ స్టడీ సర్కిల్
రైల్వే గ్రూప్–డి పరీక్షలకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్–డి 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ జిల్లాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి జే.జ్యోతిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి రెండునెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుందని వివరించారు. ఎంపికై న వారికి ఏప్రిల్ 8వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, 10వ తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రైల్వే గ్రూప్–డి దరఖాస్తు ప్రతులు, రెండు పాస్ఫొటోలు జతచేసి ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టీడీ సర్కిల్, మున్సిపల్ కస్పా స్కూల్ సమీపం, పైడితల్లమ్మ గుడి దగ్గర, విజయనగరం కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్: 96035 57333 నంబర్ను సంప్రదించాలన్నారు. -
● అంగన్వాడీల ఆందోళన
తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రాజాం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వంపై నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అంగన్వాడీ సిబ్బందిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం అమలుచేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, తక్షణమే జిల్లాలో ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీచేయాలని, పాఠశాలల వలే అంగన్వాడీలకు సెలవులు ప్రకటించాలని, సరిపడా సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్తో కలిసి సీడీపీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, రూపవతి, సెక్టార్ లీడర్లు దమయంతి, సుశీల, సుజాత, సునీత, ఈశ్వరమ్మ, వనజాక్షి, కుమారి, రాంబాబు, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు. – రాజాం -
కాలువలో పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం. బూర్జివలస గ్రామానికి చెందిన పిట్ట అప్పలనాయుడు (36) ప్రమాదవశాత్తూ సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో సహా ఈ నెల 21న దైవ దర్శనానికి తిరుమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24న రాత్రిపూట బొబ్బిలి రైల్వేస్టేషన్గా భావించి రాజమండ్రి స్టేషన్లో దిగిపోయాడు. బొబ్బిలి చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పలనాయుడు దిగకపోవడంతో వెంటనే ఫోన్ చేయగా.. తాను పొరపాటున రాజమండ్రిలో దిగిపోయానని, ప్రస్తుతం మరికి వద్ద ఉన్నానని చెప్పాడు. వెంటనే మరికి వెళ్లిన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతగ్గా ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు తెలిపారు. పోలీసులు అతని ఆచూకీ కోసం గాలించగా వాడపల్లి సమీపంలోని సాగునీటి కాలువలో శవమై కనిపించాడు. అప్పలనాయుడు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. శవపంచనామాను పూర్తిచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజమండ్రిలో దిగిన వ్యక్తి వాడపల్లి వైపు ఎందుకు వెళ్లాడో అర్థం కావడం లేదని.. ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అప్పలనాయుడు మృతదేహానికి సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. మృతుడికి భార్య పోలమ్మ, తొమ్మిదేళ్ల కుమారుడు శివ ఉన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి ..గజపతినగరం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని భైరిపురం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మికాపల్లికి చెందిన ఆకుల ఏడుకొండలు తన సోదరి వివాహం నిమిత్తం వస్తువులు కొనుగోలు చేసేందుకు భైరిపురం జంక్షన్కు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. సెంట్రల్ లైటింగ్ బాక్సుకు సంబంధించిన విద్యుత్ తీగ అతనికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రచార ఆర్భాటమే ఎక్కువ..
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేశామని పాలకులు చెప్పుకున్నారు. అయితే ప్రజాప్రతినిధుల ప్రకటనల్లో వాస్తవం ఎంతవరకు ఉందన్న టాపిక్పై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026 – 27 బడ్జెట్ అవుట్ రీచ్ పేరుతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వ్యవసాయం – ప్రత్నామ్నాయాల కొరత మాటల్లోనే పారిశ్రామికాభివృద్ధి..? జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో పేర్కొన్నప్పటికీ.. ఇప్పటివరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంలో గణనీయమైన పురోగతి కనిపించలేదు. ‘ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త’ అనే లక్ష్యం ప్రకటించినా వాస్తవానికి స్వయం ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయనేది బహిరంగ సత్యం. అంతా ప్రచారమేనా..? బడ్జెట్ అవుట్ రీచ్ లక్ష్యాలు – గతం, ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ .. అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునేలా ఉందన్న విమర్శలు వినిపించాయి. ఆర్థిక పరిమితులున్నా.. నిధులు మంజూరు చేశామని చెప్పుకున్న పాలకులు నిధుల విడుదలలో ఆలస్యం : అధికారులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిత, మంత్రి కొండపల్లి సమక్షంలో ‘బడ్జెట్ అవుట్ రీచ్’ -
ఆస్తి కోసం ఘాతుకం..
● అన్నలపై దాడి చేసిన తమ్ముడు ● ఒకరి పరిస్థితి విషమం ● పరారీలో నిందితుడుబొండపల్లి: ఆస్తి వివాదంలో తోడబుట్టిన అన్నలపై దాడి చేశాడో ప్రబుద్ధుడు. చాకుతో హత్యాయత్నానికి పాల్పడడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కొండకిండాంలో సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేస్, గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కలిశెట్టి రామునాయుడు, చిన్నప్పలమ్మలకు ముగ్గురు కుమారులు సత్యనారాయణ, బంగారునాయుడు, గౌరునాయుడు ఉన్నారు. రామునాయుడు పది సంవత్సరాల కిందట చనిపోగా, చిన్నప్పలమ్మ ఐదు సంవత్సరాల కిందట కన్నుమూసింది. అప్పటి నుంచి తల్లి చిన్నప్పలమ్మకు సంబంధించిన భూమితో పాటు బంగారం విషయమై అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుండగా.. గౌరినాయుడు క్షణికావేశంలో చాకుతో అన్నదమ్ములపై దాడి చేశారు. పెద్ద అన్నయ్య సత్యనారాయణ కడుపులో పొడవంతో పేగులు బయటకు రాగా.. రెండో అన్నయ్య బంగారునాయుడు ఛాతిపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బంగారునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమం.. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ, బంగారునాయుడులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్లూస్టీమ్ సభ్యులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
తక్షణమే చర్యలు
● డీటీసీ డీఎస్పీ వీరకుమార్ ● పీజీఆర్ఎస్లో 31 ఫిర్యాదుల స్వీకరణవిజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీటీసీ డీఎస్పీ వీరకుమార్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, 31 వినతులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, మోసాలకు సంబంధించినవి 3, ఇతర అంశాలకు సంబంధించిన 16 ఫిర్యాదులున్నాయి. అనంతరం డీఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వాటి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ సీఐ వైకుంఠరావు, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది అర్జీల స్వీకరణ.. పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తొమ్మిది అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ..ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాటి నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలను సకాలంలో పరిష్కరించండి
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ● పీజీఆర్ఎస్లో 111 వినతుల స్వీకరణపార్వతీపురం: పీజీఆర్ఎస్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని, అలాగే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో డీఆర్ఓ కె.హేమలత, తదితర అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 111 అర్జీలు స్వీకరించారు. ఇందులో 25 అర్జీలు రెవెన్యూ శాఖవి కాగా.. 86 ఇతర శాఖలకు సంబంధించినవి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులనుఆదేశించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని ఇలా.. ● కురుపాం మండలం దొమ్మిడి గ్రామం నుంచి జలగెడ్డ వరకు రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు దరఖాస్తును అందజేశారు. అలాగే కురుపాంలో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు వెళ్తున్నాయని.. వాటిని సరిచేయాలని కోరుతూ పలువురు వినతిపత్రం అందజేశారు. ● అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఆర్. భాస్కరరావు అర్జీ సమర్పించాడు. ● ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించాలని కోరుతూ గరుగుబిల్లి మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రౌతు రామినాయుడు అధికారులను కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
ఉత్కంఠభరితంగా మహిళా కబడ్డీ పోటీలు
లక్కవరపుకోట: ప్రేక్షకుల కేరింతల మధ్య రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మండలంలోని భీమాళి గ్రామంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలను ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతితో కలిసి ప్రారంభించారు. గ్రామదేవత పరదేశమ్మ పండగను పురస్కరించుకుని కమిటీ సభ్యులు ఈ పోటీలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన క్రీడాకారులుపాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఆర్గనేజింగ్ కార్యదర్శి ఎన్.లక్ష్మణరావు, రిఫరీలు మురళి, రామారావు, రవి, తిరుపతిరావు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, సర్పంచ్, ఉప సర్పంచ్లు కొయ్యాన కృష్ణ, గణేష్, వైస్ ఎంపీపీ ఎం.శ్రీనురాజు, మాజీ సర్పంచ్ గుల్లిపల్లి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపిన కొడుక్కి జీవిత ఖైదు
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది నమోదైన హత్య కేసులో గాజులరేగకు చెందిన నిందితుడు కర్నపు సాయి(20)కి జీవిత ఖైదుతో పాటు రూ. 2 వేల జరిమాన విఽధిస్తూ విజయనగరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.బబిత తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. సోమవారం ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులరేగకు చెందిన సాయి తండ్రి లచ్చన్న వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రాయాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అందుకు తండ్రి లచ్చన్న నిరాకరించడంతో కక్ష పెంచుకున్న సాయి 2025 ఫిబ్రవరి 13న రాత్రి ఇంటికి తాగి వచ్చి మంచంపై పడుకున్న తండ్రి గుండెలపై బలంగా గుద్ది చంపేశాడు. దీంతో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి టూటౌన్ ఎస్సై మురలి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుత సీఐ శ్రీనివాస్ హత్య కేసుగా నమోదు చేసి నిందితుడు సాయిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. సాయిపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి జీవితఖైదు, జరిమాన విధిస్తూ తీర్ప చెప్పారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: విజయనగరం శివారు సారిపల్లి జంక్షన్ వద్ద సుమారు అరవై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు సోమవారం గుర్తించారు. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు చామన ఛాయ రంగులో ఉన్నాడని, గోధుమ రంగు షర్టు, నలుపు రంగు గళ్ల లుంగీ కట్టుకున్నాడదని సీఐ తెలిపారు. వివరాలు తెలిసిన వారు 91211 09420 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. -
మళ్లీమళ్లీ అవే సమస్యలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని హోమ్ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత పేర్కొన్నారు. మళ్లీమళ్లీ అవే సమస్యలపై చర్చించాల్సి రావడంపై అసహనం వ్యక్తంచేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ)లో కీలక అంశాలపై చర్చ జరిగినా అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్న సమాధానమే వచ్చింది. వేసవిలో నీటికొరత రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గతంలో జరిగిన సమావేశాల్లో సూచించినా మళ్లీ జిల్లాలో అవే సమస్యలు కనిపిస్తున్నాయి. తాగునీటికోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని సమావేశంలో మంత్రి ప్రకటించినా క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. పూసపాటిరేగ ప్రాంతంలో మహిళల్లో అల్సర్ కేసులు పెరిగిన తర్వాత అధ్యయనం చేపట్టడం ప్రభుత్వ తీరును ఎత్తిచూపింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ పి.సూర్యనారాయణరాజు (సురేష్బాబు), గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు కళావెంకటరావు, కోళ్ల లతిత కుమారి, బేబీనాయన, అదితి గజపతిరాజు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ పాల్గొన్నారు. -
రాములోరి హుండీల ఆదాయం రూ.18.08 లక్షలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ అధికారులు సోమవారం లెక్కించారు. మొత్తం 41 రోజులకు రూ.18,08,722 ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. కొట్టాం గ్రూప్ దేవాలయం ఈఓ జి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవా భక్తులు, దేవస్థానం సిబ్బంది, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సబ్జైల్ తనిఖీ విజయనగరం క్రైమ్: రాష్ట్ర హోం మంత్రి అనిత విజయనగరం కంటోన్మెంట్లో ఉన్న సబ్జైల్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. అక్కడ చెత్తకుండీలు ఉండడంపై స్టేషన్ సిబ్బందిని మందలించారు. ఆమె వెంట ఎమ్మెల్యే అదితి, ఎస్పీ దామోదర్ ఉన్నారు. ● విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్ జట్టి పార్వతీపురం రూరల్: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుంచి తమను తాము రక్షించుకోవాలని విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘హెల్మెట్ అవగాహన ర్యాలీ’ని సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... రహదారి ప్రమాదాల్లో మరణి స్తున్న వారిలో 50 శాతం మంది హెల్మెట్ ధరించని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా, బాధ్యతగా భావించాలని కోరారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పర్యవేక్షణ లో పట్టణంలోని చర్చి కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, నాలుగురోడ్ల కూడలి మీదుగా పాతబస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఐజీ హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషారెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, స్థానిక సీఐ లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
● మందుబాబులకు అడ్డాగా సచివాలయం
ఈ చిత్రాలు చూశారా... కొత్తవలస మండలం చింతలపాలెం ప్రజలకు సేవలందించే సచివాలయం ఇది. సాయంత్రమైతే చాలు సచివాలయం పోర్టుకో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఊరిలోని బెల్టుషాపుల వద్ద కొనుగోలుచేసిన మద్యం, తాటికల్లును ఇక్కడ తాగుతూ సచివాలయం ఆవరణను బార్గా మార్చేస్తున్నారు. ఖాళీ సీసాలు, తినుబండారాల కవర్లను అక్కడే ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. దీంతో వివిధ సేవలకోసం వచ్చే గ్రామస్తులతో పాటు సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు అడ్డుకట్టవేయాలని, సచివాలయాల వద్ద మద్యం తాగడాన్ని అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. – కొత్తవలస -
లక్ష్యం నెరవేరేవరకు ప్రకృతితో సాగుదాం
విజయనగరం ఫోర్ట్: పంటల సాగులో అధిక రసాయనిక ఎరువుల వినియోగం అనర్థదాయకం. భూమి నిస్సారమవుతుంది. చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి పెరగడంతో పాటు రైతుకు నష్టం వాటిల్లుతుంది. అనారోగ్యకర ఉత్పత్తులే చేతికందుతాయి. వీటిని వినియోగించిన వారు వ్యాధుల బారిన పడతారు. అందుకే... ప్రకృతి సాగును వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తిచేయడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చీడపీడల నివారణకు వినియోగించే కషాయాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యకర సమాజనిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాగు పద్ధతులపై అవగాహన ప్రకృతి సాగులో భాగంగా పంటలు వేసే ముందు నవధాన్యాలైన మినుము, పెసలు, నువ్వులు, ఉలవలు, రాగి, బొబ్బర్లు, శనగలు, కందులు, కట్టెజనుమును ఒక్కొక్కటి కేజీ చొప్పన 9 కేజీలు ఎకరా విస్తీర్ణంలో సాగుచేయాలి. సుగంద ద్రవ్యాలైన మెంతులు, ఆవాలు, ధనియాలు 100 గ్రాములు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలైన తోటకూర, గోంగూర, ఆనప, బీర, విత్తనాలు 100 గ్రాములు చొప్పున వరి పంట సాగుకు 45 రోజుల ముందు పొలంలో చల్లాలి. విత్తనాలు చల్లిన 45 రోజులు తర్వాత పొలంలో కలియదున్నాలి. ఆ తర్వాత వరి పంట సాగుచేయాలి. ఎలాంటి ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయని ప్రకృతిసాగు విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రకృతి సాగు పద్ధతిలో 1.03 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. దీనికోసం 93,595 మంది రైతులను గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది 67,467 ఎకరాల్లో ప్రకృతి సాగు పద్ధతిలో పంటలు సాగుచేశారు. గత ఏడాది కంటే ఈఏడాది 32,896 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని పెంచారు. ప్రోత్సహిస్తున్నాం.. ప్రకృతి సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుత తరుణంలో ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం ఉత్తమం. ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. – ఆనందరావు, మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం రైతులు మొగ్గుచూపే పంటలివే.. ప్రకృతి సాగు పద్ధతిలో జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, కూరగాయాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. రసాయనిక ఎరువులు లేకుండా పండించడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్ చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం (అగ్రహారం)కు చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. -
ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర
● వేడుకగా న.ర.సం. ఉత్తరాంధ్ర మహిళల సదస్సు ● ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు ● హాజరైన పద్మభూషణ్ యార్లగడ్డ విజయనగరం టౌన్: సాహితీ సౌరభాలకు నిలయమైన విజయనగరంలో అడుగు పెట్టడమే ఓ ఆనందం. ఇది ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర అంటూ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న.ర.సం) ఉత్తరాంధ్ర మహిళల సదస్సు, జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సుమారు 80 మంది విద్యార్థినులు తమ కవితలను చదివి వాటిని కవన కూజితాలు రూపంలో అందించడమనేది చాలా విశేషమన్నారు. భావితరాలకు తెలుగు అందుతుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ్యవహారిక భాషపై మహాకవి గురజాడ, గిడుగు చేసిన కృషిని శ్లాఘించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ న.ర.సం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సాహిత్య కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమానికి ముందు నర్తనశాల అకాడమీ డాక్టర్ భేరి రాధికారాణి నేత్రత్వంలో విద్యార్థినులు నృత్య నీరాజనం సమర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో విశాఖకు చెందిన డాక్టర్ చిలుకూరి శాంతమ్మ, డాక్టర్ కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ దేవులపల్లి పద్మజ, డాక్టర్ అయ్యగారి సీతారత్నం, బాలబాట స్వరాజ్యం (రమణమ్మ), గిడుతూరి రామలక్ష్మి, విజయనగరానికి చెందిన పాకలపాటి రమణమ్మ, మహేంద్రవాడ లక్ష్మీరామదాసు, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, కెకె.భాగ్యశ్రీ,, కె.అనురాధ, వి.ఉషారమణి, శ్రీకాకుళానికి సంబంధించి డాక్టర్ పిలకా శాంతమ్మ, తులాల సవరమ్మ, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గుడ్ల అమ్మాజీ, రావాడ కృష్ణకుమారి ఉన్నారు. వీరితో పాటూ విజయనగరం పుర ప్రముఖులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్ష్యతన నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జివి.పూర్ణచంద్, న.ర.సం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ చిన్న లక్ష్మీకళావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, గౌరవధ్యక్షురాలు తేళ్ల అరుణ, గౌరవ సలహాదారు డాక్టర్ నూనె అంకమ్మ రావు, జిల్లా అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి, అధిక సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
మాకవరపాలెం: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
అంతరాయం లేకుండా..
ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. వినియోగదారులకు అంతరాయం లేకుండా అవసరానికి సరిపడేలా సరఫరాను అందించే దిశగా ప్రణాళికలు రూపొందించాం. కొద్ది రోజుల వ్యవధిలోనే 9 ఎంయూ నుంచి 9.5 ఎంయూ మేర విద్యుత్ వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పెరుగుల 10 ఎంయూకు దాటే అవకాశం ఉంది. వ్యవసాయ విద్యుత్ సర్వీసుల ట్రాన్స్ఫార్మర్లు పాడైతే తక్షణమే మార్చేందుకు 150 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసినా తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంది. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ -
పొద్దు తిరుగుడులో.. యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
● తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ● వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త వెంకటరావుసీతంపేట: ప్రస్తుత రబీ సీజన్లో ఎక్కువగా సాగవుతున్న పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. ఈ సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని స్థానిక వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త పి. వెంకటరావు తెలిపారు. ఈ నేపథ్యంలో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆయన వెల్లడించిన వివరాలు.. సాగు మొదటిలోనే ఆకులు తినే పురుగులు గుంపులుగా చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరను (పది కిలోల తవుడు, కిలో బెల్లం, ఒక లీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఒక కిలో కార్బరిల్ 50 శాతం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారు చేసుకుని) మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. లేదా 0.5 ఎం.ఎల్ స్పైనోసాడ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారి గొంగళి పురుగు.. తల్లి పురుగు ఆకులపై గుడ్లను గుంపులుగా పెడుతుంది. లార్వాల శరీరం లేత పసుపు రంగుతో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఈ లార్వాలు ఆకుల్ని తిని తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. పురుగుల ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారుతాయి. గుడ్లు, తొలిదశ గొంగలి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నపుడు ఏరి పారేయాలి. అలాగే వేప గింజల ద్రావణాన్ని (5 శాతం) పిచికారీ చేయాలి. పెద్ద లార్వాలు ఉన్న ఏడల ఎండోసల్ఫాన్ లేదా క్లోరిఫైరిపాస్ 2 మి.లీ లేదా డైక్లోరావాస్ ఒక ఎం.ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పరుగు.. పొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఆశిస్తుంది. లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ పాస్, క్లోరిపైరిపాస్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు.. దీపపు పరుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపీ ఆకంతా ఎర్రబడి ముడుచుకుని దోనెల్లాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ లీటర్ నీటికి 2 మి.లీ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. తెల్లదోమ ఆకుల అడుగుభాగం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పంటను మొదటి దశ నుంచీ నాశనం చేస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు మోనోక్రోటాపాస్ 1.6 మి.లీ. లీటర్ నీటిలో కలపి పిచికారీ చేయాలి. పిండినల్లి గుడ్లు ఆకులు, మొగ్గ కింద భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. తద్వారా మొక్క పసుపు వర్ణంలోకి మారి ఎక్కువగా ఆశించినట్టయితే చనిపోతుంది. దీని నివారణకు గాను పంటలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ లేకుండా చూసుకోవాలి. అధికంగా ఆశించిన మొక్కను పీకి పారేయడం మంచిది. ఈ పురుగును నివారణకు ప్రొఫినోఫాస్ 50 శాతం ఈసీ 2 మి.లీను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పక్షుల బెడద.. ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి నివారణకు పైరును పెద్ద కమతాలలో వేయాలి. మెరుపు రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బనుపై పడేటట్టు ఉత్తర, దక్షిణ దిశగా కట్టాలి. అలాగే దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పక్షుల బెడదను తగ్గించవచ్చు. విత్తనోత్పత్తి.. పొద్దు తిరగుడులో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టుటకు రబీ కాలం అనువైనది. విత్తనోత్పత్తి చేపట్టేందుకు సుమారు వెయ్యి మీటర్ల వరకు ఎలాంటి పొద్దుతిరుగుడు పంటలేని నీటి సదుపాయం గల సారవంతమైన పొలాన్ని ఎన్నుకోవాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఆడ, మగ వరుసలను 3:1 నిష్పత్తిలో నాటుకోవాలి. ఆడ మొక్కలలో పుప్పొడి వెదజల్లే మొక్కలను గుర్తించి తీసివేయాలి. పూత దశలో ఉదయం పూట మగ మొక్కల పువ్వుల నుంచి పుప్పొడిని మొత్తటి గుడ్డతో రుద్ది.. అదే గుడ్డను తర్వాత ఆడ మొక్కల పువ్వులపై రుద్దాలి. దీని ద్వారా ఫలదీకరణం చెంది ఎక్కువ గింజ కట్టడానికి అవకాశం ఉంది. పొలం దగ్గర తేనెటీగలు పెంచడం ద్వారా కూడా గింజ కట్టే శాతాన్ని పెంచవచ్చు. కోత సమయంలో ఆడ,మగ పువ్వులను వేరుచేయాలి. ఆడమొక్కల నుంచి వచ్చిన విత్తనం హైబ్రిడ్ విత్తనం. -
రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?
● ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే ● పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే ‘పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం ● నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు ● నేడే పోర్టుకు పోదాం పదండి భారీ బహిరంగ సభ టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహిస్తున్న ‘పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్ వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్రెడ్డి, ఎన్.భీమారావు, ఎస్.సత్యం, కె.సతీష్, జి.గురునాధ్యాదవ్, కె.అజయ్, ఎ.మురళి, కె.జీవన్, బి.రాజేష్, వి.శ్రీధర్రెడ్డి, బి.కార్తీక్, ఆర్.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యా య ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రావాడ అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ భవనంలో మహే ష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యద ర్శి నల్లా బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లా బాలకృష్ణ ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో అప్పలనాయుడును నియమించారు. ఈ ఎన్నిక ప్రక్రియకు రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వ తి పరిశీలకురాలిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కా రం కోసం అన్ని మండల శాఖలను సమన్వ యం చేసుకుంటూ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు కురుపాం: మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన గౌడు సాయి కుటుంబ సభ్యులతో కలిసి నూకాలమ్మ గుడికి వెళ్లారు. వారు పూజలో ఉండగా.. ఓ పిచ్చికుక్క వచ్చి చిన్నారి ఉత్తేజ్పై దాడి చేయడగా కంటిపై గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే శివ్వన్నపేటకు చెందిన ప్రసాద్ అనే యువకుడిపై కూడా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష వితరణ పాలకొండ రూరల్: పట్టణంలోని సత్యసాయి సేవా మందిరం ద్వారా కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన విజయదుర్గ హోటల్ యజమాని కొత్తకోట ప్రసాదరావు (బుల్లి), సులోచన దంపతులు ఆ దివారం రూ. లక్ష వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. సేవలు మరింత మెరుగ్గా అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఆర్.కిశోర్, సభ్యులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పెద్ద రెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం.సింహాచలం ఫెడరేషన్ జమా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను వివరించారు. అనంతరం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల కార్గిల్ పార్క్ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికుల్లో స్ఫూర్తిని నింపడంపై నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, గౌరవ ప్రెసిడెంట్లు తమ్మినేని కృష్ణారావు, టి.కృష్ణారావు, ఎస్.ఎల్.రావు, మహిళా సెక్రటరీలు కె.జగ్గమ్మ, డి.భారతి, అడ్వైజర్లు ఎ.వి.జగన్మోహన్రావు, పి.రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి.జమున, మెట్ట ఈశ్వరమ్మ, డి.రత్నమాల, బి.రాంబాబు, డి.వాసుదేవరావు, ఎన్.లక్ష్మీ నారాయణ, ఎం.రాములు, పి.శ్రీనివాసరావు, పి.చిన్నారావు, ఎం.నాగభూషణరావు, ఎస్.అప్పలసూరి, కె.రాజశేఖర్, వి.గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026వేసవి ప్రారంభమైంది. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా ఉదయం 7 గంటల నుంచే భానుడు సుర్రుమంటున్నాడు. –8లోగ్యాస్ దొరకడం లేదు. నూనె కొనలేం. ప్రతి దుకాణంలో రేట్లు పెరిగాయి. యుద్ధం పేరుతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. ఇలా ఉంటే ఎలా బతికేది. – ఎజ్జివరపు సత్యం, గుమ్మడాం వ్యాపారులను ధరల పెరుగుదలపై అడిగితే యుద్ధం ప్రభావం అంటున్నారు. దీంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇలాగైతే ఎలా జీవించేది. – బొడ్డు సన్యాసమ్మ, విజయనగరం విజయనగరం ఫోర్ట్/గంటస్తంభం: పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి వ్యాపారులు మార్కెట్లో నిత్యావసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వర కు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన పాలక ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుంది. కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్ అయి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటరుకు రూ.30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్ట డి చేయాల్సిన అధికారుల పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్య క్తం చేస్తున్నారు. ఓ వైపు పాలకులు యుద్ధ ప్రభా వం ఏమీ లేదని చెబుతుంటే మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. కొనుగోలు చేయలేని దుస్థితి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా.. నూనె కనీస అవసరం. నూనె లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్తో సరిపెట్టుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం. కావాలని ధరలు పెంచిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ధరల కట్టడికి చర్యలు చేపడతాం. – బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ పప్పు, నూనెల ధరలు బాగా పెంచేశారు. పది పదిహేను రోజుల కాలంలో ధరలు బాగా పెంచేశారు. ఏది కొనాలన్నా ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు ఉన్నాయి. దీంతో ఇబ్బంది పడుతున్నాం. – భవాని, గృహిని, లోతుగెడ్డ, మెంటాడ మండలం -
మౌన విస్ఫోటనం పతంజలి స్వరం
విజయనగరం టౌన్: మౌన విస్ఫోటనం పతంజలి స్వరమని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ పేర్కొన్నారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కార స్వీకర్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా? అన్న ప్రశ్న అలమండ గ్రామ కేంద్రంగా తలెత్తినా, అది విశ్వవ్యాపిత చర్చగా నేడు మారడం గమనించదగ్గ విషయమన్నారు. తన కవితలో ఫ్లైఓవర్ని ‘ఆకాశ వంతెన’ అని రాసినందుకు పతంజలి ఫోన్ చేసి ప్రశంసించిన విధానం తనలో సమాజం పట్ల మానసిక క్రమశిక్షణకు దోహదపడిందన్నారు. అనంతరం వేదిక ప్రతినిధులు కుప్పిలి పద్మకు పతంజలి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ అనేక రుగ్మతలతో బాధపడుతున్న సమాజానికి తన అక్షరాలతో వైద్యం చేసిన హోమియోపతి పతంజలి అని కొనియాడారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఆయన రచనలు సజీవమన్నారు. ఇప్పటికే పాత్రికేయ రంగంలోనూ, సాహిత్యంలోనూ తమదైన శైలిలో పతంజలిని అనుసరించిన వారిని ఎంపిక చేసి చిరు పురస్కారంతో గౌరవించుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సాహితీవేత్త ఆల్తి మోహన్ మాట్లాడుతూ రాజ్యాంగానికి గల నాలుగు ప్రధాన అంగాల్లో లోపభూయిష్ట వ్యవహారాల మీద తన అక్షరాలతో దండెత్తారన్నారు. ప్రజాసేవ పేరిట భూవ్యాపారం చేస్తారని ఆనాడే ఊహించిన దార్శనీకుడు పతంజలి అని రచయిత మహమ్మద్ ఖదీర్బాబు వివరించారు. ఎన్కె.బాబు, విఎంకె.లక్ష్మణరావు, భళ్లమూడి నాగేంద్రప్రసాద్, పతంజలి కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రతాప్ వర్మ పాల్గొన్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
విజయనగరం రూరల్: శ్రీరామ వసంత నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో సీతారాముల దేవతామూర్తులకు సోమవారం ఊంజల్ సేవ వేడుకలా నిర్వహించారు. అర్చకులు, ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం నాగేశ్వరరావు, సీతారామయ్య, శ్రీనివాస్లు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. ఇవటూరి మెహెర్గత ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరం రూరల్: విజయనగరం నియోజకవర్గం జీరో పోవర్టీ పీ – 4 వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పీ – 4 కార్య క్రమ ప్రగతి, విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
మెనూ అమలు.. మావల్ల కాదు...
రామభద్రపురం : అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న చిన్నారులకు రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం అందించేలా ప్రభుత్వం తాజాగా మెనూలో మార్పులు చేసింది. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ 6 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం కింద శనగ చిక్కీ, వేరుశనగ నూనెతో కూడిన పిండి నెలకు 2.50 కిలోల చొప్పున్న ఇంటికే ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా ఇంటికే రేషన్ పంపిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలలోనే వంట చేసి వారంలో ఒక రోజు పులిహోర పెడుతున్నా రు. ఆ స్థానంలో రెండు మార్పులు చేశారు. తాజాగా వారంలో రెండుసార్లు (మంగళ, శనివా రం) మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్రైస్ను చిన్నారులకు వండి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మిగతా నాలుగు రోజులు అన్నం పెట్టనున్నారు. మంగళ, శనివారాలు స్నాక్స్ కింద ఉడికించిన శనగలు, మిగ తా నాలుగు రోజులు పాటు ఉడికించిన కోడిగుడ్డు అందించనున్నారు. రోజూ 100 మి.లీ, చొప్పున్న యధావిధిగా ఇస్తారు. ఒంటిపూట కేంద్రాల నిర్వహణ అమల్లోకి రావడం, మరోపక్క కేంద్రాలకు శనగలు సరఫరా కాకపోవడంతో స్నాక్స్ అమలుకు సంబంధించి మరి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. వండలేక.. సొమ్ములు చాలక.. మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు, బాలల భవిష్యత్కు పునాదులు వేసే అంగన్వాడీ కేంద్రాలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతల కు పౌష్టికాహారం అందించాల్పిన అంగన్వాడీలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచకుండా తాత్సారం చేస్తోంది. కాలానుగుణంగా నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధర సైతం పెరగడమే కాకుండా ప్రస్తుతం గ్యాస్ దొరకడం గగనంగా ఉంది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలను పెంచకుండా గత ప్రభుత్వంలో 2023లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తోంది. పెరిగిన ధరలతో నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు వండి వడ్డించాలంటే వర్కర్లకు నానా పాట్లు తప్పడం లేదు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలోనే వండాల్సి ఉండటంతో కూరగాయలు, పసుపు, కారం, ఆకు కూరలు, ఉల్లి పాయలు, పొపు దినుసులు తదితర సామగ్రిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశించిన కొత్త మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్రైస్ చేయాల్సి ఉంది. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకొక్కరికి రోజుకు కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కలిపి ప్రభు త్వం మైదాన ప్రాంతాల వారికి రూ.2.10పైసలు గిరిజ న ప్రాంతాలలోని అంగన్వాడీ చిన్నారులకు రూ. 2.30పైసలు మాత్రమే చెల్లిస్తోంది. ఇందులోనే 50 పైసలు గ్యాస్కు, రేషన్ దుకాణాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు మైదాన ప్రాంతాలోని వారికి 10 పైసలు, గిరిజన ప్రాంతాల వారికి 30 పైసలు కేటాయించింది. అంటే కూరగాయలు తదితర సామగ్రి కోసం ఒక్కో చిన్నారికి రోజుకు కేటాయించింది రూ.1.50 పైసలు మాత్రమే. దీంతో పిల్లవాడికి పౌష్టికాహారం పెట్టడం ప్రశ్నార్ధకంగా మారింది. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం తెచ్చేందుకు ఒక్కొక్కరికి రోజుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మైదాన ప్రాంతాలలో 25 పైస లు. గర్భిణులు, బాలింతలకు రూ.27 పైసలు, గిరిజన ప్రాంతాలలో చిన్నారులకు 27 పైసలు, గర్భిణులు, బాలింతలు 30 పైసలు చొప్పున్న చెల్లిస్తోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్కు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము 50 పైసలు సరిపోవడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఇచ్చే మెనూ చార్జీల బిల్లులు కూడా రెగ్యులర్గా రావని, ఆరు నెలలు, ఏడాదికోసారి ఇస్తుండడంతో వర్కర్లు తమ జేబులో నుంచే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు ఎందుకూ చాలడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలకు అనుగుణంగా పెరగని మెనూ చార్జీలు పెంచాలని కోరుతున్నారు. మెనూ చార్జీలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాను. ప్రభుత్వం ప్రస్తుతం కొత్త మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారానికి రెండు రోజులు (మంగళ, శనివారం) ఎగ్ ఫ్రైడ్రైస్ చేసి పిల్లలకు పెట్టాల్సి ఉంది. అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలిస్తున్నాం. – కేవీ బాలామణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం -
రక్తదానం..ప్రాణదానం
నెల్లిమర్ల: రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని సాధన యువజన సంఘం అధ్యక్షుడు పాలుబోతు దుర్గాప్రసాదరావు అన్నారు. మండలంలోని జరజాపుపేటలో దివంగత తాడుతూరి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. 22 మంది శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలను అభినందించి, సత్కరించారు. రక్తదానం చేస్తే సన్నబడిపోతామన్న అపోహ అందరిలో ఉందని, నిజానికి రక్తం దానం చేస్తే సన్నబడిపోరని ఆరోగ్యవంతులైన వారు ప్రతి మూడు నెలలకోసారి రక్తం దానం చేయవచ్చన్నారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడమే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి గొప్ప మేలు చేసిన వారమవుతామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రక్తదాత ఇచ్చిన రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తం దానం చేస్తే మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందన్న విషయం తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ
తెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ జిల్లా పీడీ బాలామణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ప్రీ స్కూల్ పిల్లల హాజరు, స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యకర్తలు, హెల్పర్లు సమయపాలన పాటించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని రికార్డులను ఆఫ్లైన్లోను, ఆన్లైన్లోను ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో లోపాలుంటే చర్యలు తీసుకొనేందుకు వెనుకాడేది లేదని పీడీ హెచ్చరించారు. ఆమెతో పాటు పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. -
మందుల దుకాణాల్లో వైద్యం..!
● కొన్ని చోట్ల దుకాణాలను క్లినిక్లుగా మార్చేస్తున్న వైనం ● ఆపరేషన్లు మినహా మిగిలిన వైద్యసేవలు చేసేస్తున్నారు..ల్సిన వారు ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టుగా వైద్యం చేసేస్తున్నారు. డాక్టర్ చీటి ప్రకారం మందులు ఇవ్వాల్సిన వారు డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. మెడికల్ షాపులే చిన్న తరహా క్లినిక్లు మాదిరి మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అనేక చోట్ల మందుల దుకాణాల్లో ఆయా నిర్వాహకులే చిన్నచిన్న రోగాలకు తమకు తెలిసిన మందులు ఇచ్చి వైద్యం చేస్తూ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న వైద్యం రోజురోజుకు పెరుగుతుంది. మందులు మాత్రమే విక్రయించా -
కల్తీ ఆహారంపై అవగాహన
విజయనగరం: నగరంలోని ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో కల్తీ ఆహారాన్ని గుర్తించే విధానాలపై వినియోగదారుల సంఘ సభ్యులు, వలంటీర్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా సహాయ ఆహార భద్రత నియంత్రణాధికారి ఎస్.ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జిల్లా ఆహార భద్రత అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ నిత్య జీవితంలో వినియోగించే పాలలో నీరు, యూరియా, స్టార్చ్, డిటర్జెంట్ వంటి హానిక పదార్ధాలు కలపబడే ప్రమాదాలపై వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛమైన ఆహారం అత్యవసరమన్నారు. ఇంటి వద్దే సులభమైన పరీక్షల ద్వారా పాలలో కల్తీని ఎలా గుర్తించవచ్చో సభ్యులకు వివరించారు. ఆహార పదార్ధాల్లో కల్తీకి పాల్పడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చికెన్, మటన్కు సంబంధించి ఫుడ్పై కలర్ కోటింగ్ వేయడం కూడా ఫుడ్ సేఫ్టీ ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, లేదా వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపాలని సూచించారు. ఆహార భద్రత అధికారి నాగుల్ మీరా ఆహార భద్రత చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాప్కో జనరల్ సెక్రటరీ హెచ్.ఎస్.రామకృష్ణ, విజయనగరం జిల్లా వినియోగ సమాచార కేంద్రం ఇన్చార్జ్ చదలవాడ ప్రసాద్, సీడ్ వాలంటీర్ సంస్థ తరఫున విజయనిర్మల, జనార్దనరావు, ఎం.వి.ఆర్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారికి పెద్ద కష్టం
● అవసరమైన సాయం చేయండి.. ● బోన్ కేన్సర్తో బాధపడుతున్న వైష్ణవి ● వైద్యం చేయించేందుకు దాతల కోసం ఎదురుచూపురాజాం సిటీ: తమలా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. వారు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఇద్దరు పిల్లల్లో పెద్దదైన కుమార్తె పదో తరగతి చదువుతుంది. పరీక్షలు దగ్గర పడుతుండడంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అనుకున్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. పరీక్షలపై బెంగ అనుకున్న ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపిస్తే అనుకోని విధంగా రోగమొచ్చిందని కుమిలిపోయారు. నయం అవుతుందేమోనని తమ స్థోమతకు మించిన అప్పులు చేసి విశాఖపట్నం ఆస్పత్రికి తరలించి మరిన్ని పరీక్షలు చేయించారు. అక్కడ చిన్నారికి బోన్మారో కేన్సర్ అని తెలియడంతో విలవిలాడిపోయారు. చిన్నారి వైద్యానికి రూ.లక్షల మేర ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటు దాతల దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన పత్తిరి వైష్ణవి అనే చిన్నారి బోన్మారో కేన్సర్ బారిన పడింది. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సనందించి విశాఖపట్నం తరలించారు. అక్కడ క్యూ1 ఆస్పత్రిలో అన్ని పరీక్షలు అనంతరం చిన్నారి వైష్ణవికి బోన్మారో కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడ అస్పత్రిలో రోజువారీ చికిత్స నిమిత్తం చిన్నారిని జాయిన్ చేసి వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా చిన్నారి తల్లిదండ్రులు పత్తిరి ధనలక్ష్మి, శివ రోజువారీ వ్యవసాయ కూలీలు. ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగించే ఈ కుటుంబంలో వైష్ణవి బోన్ కేన్సర్ బారిన పడడం గండంగా మారింది. జీవనోపాధి లేక తల్లడిల్లుతున్న ఆ కుటుంబం తన కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వైద్య ఖర్చులు నిమిత్తం రూ.20లక్షలు అవసరం ఉండడంతో వైద్యం చేయించలేక దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని దాతలను వేడుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా.. చిన్నారి వైష్ణవి బొద్దాం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివింది. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు ఆమె రాయాల్సి ఉండగా బోన్మారో కేన్సర్ వ్యాధి సోకడంతో పరీక్షలకు దూరమైంది. వైష్ణవిని ఉన్నత చదువులు చదివించి మంచి జీవితాన్ని ఇద్దామని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువు విషయం పక్కన పెడితే తమ కుమార్తె ప్రాణాలతో ఉంటే చాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని, ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు 9618897442 నంబరుకు సాయమందించాలని కోరుతున్నారు. -
తమ్మనశెట్టి మృతికి ప్రముఖుల సంతాపం
● కోలగట్ల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్విజయనగరం: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉప సభాపతి, విజయనగరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మనశెట్టి ఆకస్మిక మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేడాడ తిలక్, వైఎస్సార్సీపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు స్వరూప్ తదితర నాయకులు కలిసి విజయనగరంలోని వారి నివాసానికి శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు తమ్మనశెట్టి చిత్రపటానికి నివాళులర్పించి, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ్మనశెట్టి అత్యంత వినయశీలి అని, సేవాభావం కలిగిన వ్యక్తిగా సమాజంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. ఆయన మృతి కోలగట్ల కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికే తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కోలగట్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి ‘పుట్టపర్తి’
● జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్విజయనగరం: బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని, బహుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు బహుబాషా కోవిదుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముందుగా నారాయణాచార్యులు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి అమోఘమని తెలిపారు. చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారని, సంగీతం, సాహిత్యం, నాట్య రంగాలలో రాణించటంతో పాటు తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారని, పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం సాధించినట్టు గుర్తు చేశారు. పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన వధీ భాష నుంచి తులసీదాస్ రామాయణం, బ్రజ్ భాష నుంచి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలతో పాటు ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్.సత్తిబాబు, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి దేవి ప్రసాద్, సెట్విజ్ సీఈఓ వి.విశ్వేశ్వరరావు, సెట్విజ్ మేనేజరు కె.వెంకటరమణ, సూపరింటెండెంట్ కె.అక్కారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డబ్బు కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి అరెస్టు : ఎస్పీపార్వతీపురం రూరల్: అప్పుల బాధ నుంచి గట్టెక్కేందుకు ఓ వ్యక్తి తన బంధువైన వృద్ధురాలిని హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం మేలపువలస గ్రామానికి చెందిన మేలపు సింహాచలం (67) ఈ నెల 20న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలడంతో కేసును హత్యగా మార్చి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చోంగలి ఈశ్వరరావు జూదం, మద్యం వ్యసనాలకు బానిస కావడంతో పాటు సుమారు రూ.1.50 లక్షల అప్పుల్లో ఉన్నాడు. ఒంటరిగా ఉంటున్న మృతురాలు సింహాచలం వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన నిందితుడు, ఈ నెల 20న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో తలదాచుకుంటాననే నెపంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమైపె దాడి చేసి, ముక్కు, మెడపై నొక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు. బయట అలికిడి కావడంతో భయపడి కేవలం బంగారు గొలుసును మాత్రమే తీసుకుని పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని నుంచి 11.700 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సెక్షన్ 305(ఎ) బీఎన్ఎస్ కింద అదనపు అభియోగాలు నమోదు చేశారు. సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్ పోటీల విజేతలకు అభినందన
విజయనగరం: జిల్లా స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం నగరంలోని బాడీ ఫిట్నెస్ జిమ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో విజేతలుగా నిలిచిన మహరాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని అభిలాషించారు. జాతీయ స్థాయిలో రాణించిన వారికి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకుని విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, నమ్మి ప్రసాద్, డి.సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అంబటివలస గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. అంబటివలస గ్రామానికి చెందిన తాళ్లపూడి అప్పలనాయుడు(35) తాపీమేసీ్త్రగా పని చేస్తూ జీవనం చేస్తున్నాడు. మృతునికి భార్య ధనలక్ష్మితో పాటు మూడేళ్లు, ఆరేళ్లు వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై గ్రామానికి ఆనుకొని ఉన్న తన బంధువుల మామిడితోటకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు. -
శ్మశానం లేక.. దారిలోనే మృతదేహం ఖననం
జియ్యమ్మవలస రూరల్: శ్మశానవాటిక ఆక్రమణకు గురికావడంతో ఓ దళిత వృద్ధురాలి మృతదేహాన్ని మార్గంమధ్యలో ఖననం చేసిన హృదయ విదారకమైన ఘటన జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 72 ఏళ్ల అనాథ వృద్ధురాలు అమ్మాజమ్మ ఈ నెల 27న (శుక్రవారం) మరణించారు. ఆమె శవాన్ని స్థానికులు ఊరికి 100 మీటర్లు దూరంలో ఆక్రమణకు గురైన శ్మశానవాటికకు తీసుకెళ్లలేక దారిలోనే పూడ్చిపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ అక్కడి రైతులు తహసీల్దార్ ఎన్.అప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు. ఇదీ పరిస్థితి... తురకనాయుడువలస గ్రామానికి వంద మీటర్లు దూరంలో సుమారు 4 సెంట్లు శ్మశానవాటిక ఉంది. దీనిని అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. దీనిపై దళితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇటీవల పర్యటించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు కూడా సమస్యను వివరించారు. అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలంలేక సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. దళితుల 4 సెంట్లు శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించిన అధికారపార్టీ కార్యకర్తలు దారి మధ్యలో వృద్ధురాలి మృతదేహం ఖననం తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన -
చంద్రబాబువి డైవర్షన్ పాలిట్రిక్స్
–IIలోచిన్నారికి పెద్ద కష్టం చక్కగా చదువుకుంటూ పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న చిన్నారికి పెద్దకష్టం వచ్చింది. బోన్ కేన్సర్తో మంచం పట్టింది. విజయనగరం: కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, అమరావతి రాజధానిపై అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడమంతా డ్రామా అంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుంటున్నా అభివృద్ధి చేయడంలో అలసత్వం ఎందుకుని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో శఽనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనపై దుమ్మెత్తిపోశారు. గడిచిన రెండేళ్లలో అమరావతి రాజధాని పేరిట అవినీతికి పాల్పడడం, అక్కడి రైతులను మోసం చేయడం, ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పబ్బంగడుపుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే 2028 చివరికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అసమర్ధపాలనను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అత్యవసర తీర్మానాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న చంద్రబాబును ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారని, రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ చేస్తామన్నారే తప్ప రాజధానిగా అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయం గుర్తెరగాలన్నారు. కూటమి ప్రభుత్వం తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీపై దుష్ఫ్రచారం చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. అమరావతి పేరిట దోపిడీని వ్యతిరేకిస్తాం.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్సీపీ అమరావతిగా రాజధాని నిర్ణయానికి వ్యతిరేకం కాదని, కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీని మాత్రమే ఎత్తిచూపుతున్నట్టు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సుమారు ఎకరాకు రూ.2కోట్ల చొప్పున అభివృద్ధికి ఖర్చు అవుతుందని, ఇలా 50వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం రోజువారి పాలనకే అప్పులు చేస్తోన్న ప్రభుత్వం, ఇంత ఖర్చు ఎలా భరిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మాయమాటల చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఇటువంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి పేరుచెప్పి రూ.47వేల కోట్ల అప్పులు తెచ్చి అవినీతి కార్యక్రమాలు చేపట్టారే తప్ప అభివృద్ధి చేయలేదని, తాజాగా అమరావతి రాజధాని అంటూ డైవర్షన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణ పనులు చూస్తున్న మంత్రితో ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో ఇదే విషయం తేటతెల్లమైందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రెండేళ్లుగా మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. అమరావతిలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తామని, బుల్లెట్ ట్రైన్లు నడుపుతామని, ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని, మరో 50వేల ఎకరాలు భూసేకరణ చేయాలంటూ మాయమాటలు చెప్పడం తప్ప భూములిచ్చిన రైతులకు ఒక్కఫ్లాట్ ఇవ్వని దుర్భర స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికారంలోకి రామనే భయంతోనే... 2029 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరల అధికారంలోకి రాలేమన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం అభద్రతా భావంతో రాజధానిగా అమరావతి తీర్మానం చేసిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని అమరావతిలో ఇప్పటికే సొంత ఇళ్లు కట్టుకుని ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం సాధ్యంకాని హామీలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. కేవలం అవినీతి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. వైఎస్సార్సీపీపై నిందలు మోపడం తప్ప ప్రభుత్వం చెప్పిన హైటెక్ మాటలు, సింగపూర్ డిజైన్లు సాధ్యంకానివని చెప్పారు. రెండేళ్ల ప్రభుత్వ అసమర్ధ, అవినీతి పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తాము చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా కొత్త అభివృద్ధి లేదన్నారు. నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయని, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చివరికి కర్రల పొయ్యపై వంటలు చేసుకోవాలన్నా వాటి ఖరీదు ఆకాశన్నంటుతోందన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరుమార్చుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అమరావతి రాజధానిపై అసెంబ్లీ తీర్మానం అంతా డ్రామా అధికారంలోకి రామనే భయంతోనే అత్యవసర తీర్మానాలు రెండేళ్ల కూటమి పాలనలో అవినీతి, మోసం, మాయమాటలే... అమరావతి పేరిట దోపిడీకి మాత్రమే వైఎస్సార్సీపీ వ్యతిరేకం రాజధాని నిర్మాణానికి జగన్మోహన్రెడ్డి అడ్డు చెప్పలేదు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
ముమ్మరంగా వాహన తనిఖీలు
విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణకు ప్రతిరోజు పది ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమరవాణ, రోడ్డు ప్రమాదాల నియంత్రనలో భాగంగా విజిబుల్ పోలీసింగ్, ఆకస్మిక వాహన తనిఖీలను ఒక నిరంతర ప్రక్రియగా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనదారులకు, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రోడ్డు భద్రతతో పాటు ప్రజలకు వివిధ చట్టాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతతకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, నేరాలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన వారికి ఈ– చలానాలను విధిస్తున్నామని చెప్పారు. పార్వతీపురం సుందరీకరణకు శ్రీకారం పార్వతీపురం రూరల్ : పర్యావరణ హితమే లక్ష్యంగా పార్వతీపురం నగర సుందరీకరణ పనులకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం గెడ్డ వీధి కాలువ వంతెన సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం కాలువ వంతెన అంచున (ఎడ్జ్ భాగంలో) కొబ్బరి మొక్కలను నాటారు. సోమవారం నుంచి వంతెన రెండో వైపు కూడా మొక్కలు నాటే పనులు కొనసాగనున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్య గల డివైడర్లలో ఆకర్షణీయమైన ‘బోగన్ విల్లియా’ మొక్కలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో సబ్–కలెక్టర్ వైశాలి, పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ అధికారులు
గజపతినగరం: విజయనగరం జిల్లా మెంటాడ మండలం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఏఈఈ) పల్లి గౌతమ్ నాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ (వర్క్ ఇన్స్పెక్టర్–అవుట్సోర్సింగ్) పెది రెడ్ల సంతోష్ లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మెంటాడ పంచాయతీలో రూ.5.20 లక్షల విలువైన సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనం పనులను పంచాయతీ జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేశారు. పనుల బిల్లుల కోసం మెంటాడ గ్రామ సర్పంచ్ రాంబాబు పంచాయతీరాజ్ అధికారులను సంప్రదించారు. బిల్లులు చెల్లించాలంటూ పలుసార్లు విన్నవించారు. దీనికోసం ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ కలిసి రూ.లక్షా30వేలు డిమాండ్ చేశారు. ఆయన రూ.లక్షా20వేలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య వలపన్నారు. పథకం ప్రకారం గజపతినగరం ఉపఖజానా కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో రూ.లక్షా 20వేలును సర్పంచ్ నుంచి ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్లు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య, సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్సై కె.వాసునారాయణరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేశారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.5.20లక్షల విలువైన పనులకు.. రూ.1.30 లక్షల లంచం డిమాండ్ లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీరాజ్ ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ -
వైభవంగా రాములోరి పట్టాభిషేకం
● రామతీర్థంలో శాస్త్రోక్తంగా సాగిన వేడుక ● యాగశాలలో పూర్ణాహుతి ఘట్టం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రప్రభువు పట్టాభిషేక మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, వేద పండితుల సమక్షంలో వేకువజామునుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో పూర్ణాహుతిని వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం ఆస్థాన మండపంలో శేష వాహనంపై సీతారామచంద్ర స్వామిని ఆశీనులను చేసి మహాపట్టాభిషేకం సజావుగా సాగాలని ముందుగా విశ్వక్సేనుడి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూజాద్రవ్యాలకు పుణ్యాహవచనం గావించి తిలకించే భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపారు. అష్టోత్తర సహస్ర నామార్చనలతో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు జరిపించారు. రామాయణంలో శ్రీ రామ పట్టాభిషేక ఘట్టాన్ని విన్నపం చేసి పంచామృతాలతో స్వామికి అభిషేకాలు జరిపారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారికి బంగారుకిరీటధారణ చేశారు. రామాయణంలో ఆఖరి ఘట్టం పట్టాభిషేకం.. రామరాజ్య స్థాపనే ధ్యేయంగా శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహిస్తారని, దేవుళ్లలో ఒక్క శ్రీరామునికే మాత్రమే ఇది సాధ్యమని ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయిరామాచార్యులు తెలిపారు. ఏటా స్వామివారి కల్యాణం మరుసటిరోజు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి పట్టాభిషేకాన్ని కనులారా వీక్షిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయన్నారు. రామాయణంలో ఆఖరి ఘట్టమే పట్టాభిషేకమని చెప్పారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, వ్యాఖ్యాత హాయగ్రీవాచార్యులు, అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్, పవన్, రామగోపాల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్గా ధనలక్ష్మి
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్గా తిరుపతి వేంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో క్లినికల్ హెడ్గా విధులు నిర్వహించిన డా.ఎన్.ధనలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇక్కడకు ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఇక్కడ అసోసియేట్ డీన్గా విధులు నిర్వహించిన డాక్టర్ మక్కేన శ్రీను గన్నవరం వెటర్నరీ కళాశాల క్లినికల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీన్ ధనలక్ష్మి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తానని చెప్పారు. విద్యార్థులు చదువులో ఉత్తమంగా రాణించి ఉద్యోగ అవకాశాలు అందుకునేలా బోధన అందించడమే లక్ష్యమన్నారు. ఆర్టీఈ ఉచిత ప్రవేశాల లక్కీడ్రా ఫలితాలు విడుదల ● డీఈఓ యు.మాణిక్యంనాయుడు విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉచిత సీట్ల ప్రవేశాల తొలివిడత లక్కీ డ్రా (లాటరీ) ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ యు.మాణిక్యంనాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద ప్రవేశాల కోసం మొత్తం 3,305 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. తొలివిడత లాటరీ ప్రక్రియలో 1,503 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరికి జిల్లాలోని 240 ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యాహక్కుచట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు తమ ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని సూచించారు. బంగారు కుటుంబాల వేడుకలు రేపు పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బంగారు కుటుంబాలకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమవారం సంబరాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. మండల, నియో జకవర్గ స్థాయిలో సంబరాల్లో పాల్గొనేలా ఆహ్వానించాలన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్గా ముఖాముఖి చర్చించే అవకాశం ఉందన్నారు. -
రామాలయ నిర్మాణానికి స్థల వితరణ
వేపాడ: సొంతూరు రుణం తీర్చుకోవాలన్న వారి కల రామాలయ నిర్మాణానికి స్థలం వితరణగా అందజేయడం ద్వారా తీర్చుకున్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. వేపాడ మండలం సోంపురం గ్రామ సర్పంచ్ మురిపిండి గంగరాజు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దివంగత తల్లావఝుల రామజోగినరసింహం, పార్వతీ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు వరహానరసింహామూర్తి, రాధాకృష్ణ, పురుషోత్తం, విజయగోపాలం, కుమార్తె లక్ష్మి జన ఐదుగురు తమకు వారసత్వంగా దఖలు పడిన 16 సెంట్లు(రూ.50లక్షల విలువైన) స్థలాన్ని గ్రామంలో రామాలయ ప్రాంగణానికి వినియోగించేలా వితరణగా అందజేశారు. వీరంతా కొల్కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్థిరపడడంతో జన్మనిచ్చిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో స్థలాన్ని వితరణంగా అందజేశారని సర్పంచ్ గంగరాజు, ఎంపీటీసీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వితరణ స్థలంలో శిలాఫలకం ఏర్పాటు చేసి శుక్రవారం ఆవిష్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి రాజాం వస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం పొగిరి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న డి.శశిభూషణ్, కె.మంగలతో పాటు మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ధర్మ చైతన్య శంఖారావం
పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా ‘శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర’ శుక్రవారం ప్రారంభమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర దంపతులు యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి, లోగోను ముఖ్య అతిథులు యిండుపూరు గున్నేశ్వరరావు, బెలగాం జయప్రకాష్ నారాయణ తదితరులతో కలసి కాళిదాసు శర్మ యాజీ నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ ఉద్యమంలో భాగంగా ‘రామ స్థూప నిర్మాణ మహాసంకల్పాన్ని’ చేపట్టినట్టు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కాళిదాసు శర్మ యాజి తెలిపారు. ‘ఒక గ్రామం – ఒక రాయి’ నినాదంతో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల భాగస్వామ్యంతో శిలలను సేకరించి రామ స్థూపాన్ని నిర్మించనున్నట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆకాంక్షించారు. ఈ యాత్రను తొలుత మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ కేవలం సాంప్రదాయాలకు విలువనిస్తూ లోక కల్యానార్ధం రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమం శ్రీరాముని భక్తుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలుసుకున్నారని.. ఆయన కూడా కార్యక్రమంలో తన వంతు భాగస్వాములు అవుతారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జగన్మోహన్రెడ్డిని కలసి పూర్తి వివరాలను కాళిదాసు శర్మతో కలసి వివరిస్తున్నట్టు రాజన్నదొర తెలిపారు. రామ రాజ్య గ్రామోద్యమానికి అంకురార్పణ ‘ఒక గ్రామం – ఒక రాయి’ సంకల్పంతో రామ స్థూప నిర్మాణం మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, కాళిదాసు శర్మ -
మిట్టల్ ప్లాంట్తో లక్ష ఉద్యోగాలు బూటకం
● విశాఖ ఉక్కును బలహీనపరిచే కుట్ర ● ప్రభుత్వం నిధులు కేటాయించి బలోపేతం చేయాలి : సీపీఎం విజయనగరం గంటస్తంభం: నక్కపల్లి వద్ద మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం పూర్తిగా అసత్యమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎల్బీజీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న చర్యగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. 8.3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని కూటమి ఎమ్మెల్యేలు చెప్పడం ఒట్టి బూటకం అని విమర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమలో 7.2 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా, సుమారు 15 వేల మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో నక్కపల్లి ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పడం వాస్తవానికి దూరమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు కేటాయిస్తే మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చని సూచించారు. కానీ ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చూపుతూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని విమర్మించారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమకు వెళ్లాల్సిన నీటిని మిట్టల్ ప్లాంట్కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ఐదేళ్లుగా కార్మికులు, ప్రజా సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను రూ.25వేల కోట్ల విలువతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేయడానికి తక్షణమే నిధులు కేటాయించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి శంకరరావు, టి.వి.రమణ పాల్గొన్నారు. -
బిల్లుమడ పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు
భామిని: మండలంలోని బిల్లుమడ పంట పొలాల్లో ఏనుగులు గుంపు ప్రవేశించింది. బిల్లుమడ – నేరడి మధ్య మొక్కజొన్న పొలాల్లో ఏనుగులు ప్రవేశించి ధ్వంసం చేశాయి. ఆహారం కోసం పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట సమీపంలోని వంశధార నదిలో దిగి జలకాలాడుతున్నాయి. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి రైల్వే పట్టాలను దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన ఈర్లి శ్రీరాములు(55) గరుడుబిల్లి వద్ద రైలు ట్రాకును దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అండర్– 19 క్రికెట్ జట్టు ఎంపికలు రేపు విజయనగరం: అండర్ – 19 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 29న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రం శివారు బాబామెట్ట విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్ తీసుకు రావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని తెలిపారు. సాలూరు: పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసా ద్, సీఐ అప్పలనాయుడు తదితరుల ఆధ్వర్యంలో బస్సుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి సాలూరు మీదుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాల లభ్య త, అత్యవసర ద్వారాల పనితీరును అధికారులు తనిఖీ చేశారు. బస్సుల పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికె ట్లు, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు డ్రైవర్ల లైసెన్సుల ను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. బస్సు ల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అక్రమంగా సరుకు రవాణా తదితర అంశాలపై పోలీస్లు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట గ్రా మ కళ్లాల్లో పశువుల మేత కోసం ఉంచిన వరి గడ్డికుప్పలు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమా దంలో దగ్ధమయ్యాయి. డి.కృష్ణంనాయుడు, పి.గోపినాయుడు, ఆర్లి గోపినాయుడుకు చెంది న గడ్డికుప్పలు కాలిపోయాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గడ్డికుప్పల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. -
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి : ఎస్టీయూ
విజయనగరం అర్బన్: సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక అమర్ భవన్లో శుక్రవారం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆరోగ్య భద్రత కల్పించాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. అదే విధంగా సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తూ మిగిలిన ఉపాధ్యాయులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సీనియారిటీని గుర్తిస్తూ అగ్నివేర్ పథకం మాదిరిగా రిటైర్మెంట్ ప్రయోజనాలను సింగిల్ సెటిల్మెంట్ రూపంలో అందించాలని పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని సమావేశం కోరింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్దొర, ఎంటీఎస్ నాయకులు టి.రామారావు, గోపీనాధ్, శ్రీనివాసరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
మోసపోతున్న మొక్కజొన్న రైతులు
● రైతుల గోడు పట్టని చంద్రబాబు ● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం ● 45,590 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న మెరకముడిదాం: ఆరుగాలాలు పాటూ శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చింది. ఇక అమ్ముకుందామనేసరికి ధర తగ్గిపోతే ఆ రైతులు ఆవేదన వర్ణానాతీతంగా వుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో మొక్కజొన్న పంట పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట 45,590 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఇప్పుడు ఈ పంట రైతులు చేతికి వస్తుంది. ఎన్నో అవరోధాలను దాటుకొని పంటను సాగు చేసిన రైతులు తమ పంటకు మంచి ధర పలుకుతుందన్న ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2,400 లను మద్దతు ధరగా ప్రకటించింది. మద్దతు ధర బాగానే వుందని తమ పంటను అమ్మకుందామని ఆశపడ్డ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వుండగా ఇంతవరకూ జిల్లా వ్యాప్తంగా ఒక్కమొక్కజొన్న కేంద్రాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర తమకు ఇప్పట్లో దక్కేటట్టు లేకపోవడంతో పాటూ వాతావరణంలో మార్పులు రావడంతో ఏ సమయంలో వర్షం కురిస్తే కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అవుతుందేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో కొందరు రైతులు దళారులకు క్వింటా 17 వందల నుంచి 18 వందలలోపు అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో క్వింటాకు రూ.600ల వరకూ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. హెక్టారుకు సుమారు 44 వేల రూపాయలు వరకూ నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 37 వేల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పండుతుందంటే రూ.లక్షల్లో రైతులు నష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. – రామారావు, వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం చిన్నచూపు సరికాదు.. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదు. మొక్కజొన్న కొనుగోలుకు ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత వరకు సమంజసం. రైతులు ఎలా విక్రయిస్తారు. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటా రూ.2400లకు కొనుగోలు చేయాలి. – శిరువూరు సీతారామరాజు, ఎంపీటీసీ, సోమలింగాపురం -
గ్యాస్ బుకింగ్లో ఏజెన్సీ కిరికిరి
పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగలో హెచ్పీ గ్యాస్ బుకింగ్లో ఏజెన్సీ అవకతవకలకు పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పేరిట గ్యాస్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు గ్యాస్ బుకింగ్ తేదీతో పాటు ఓటీపీ వచ్చినా గ్యాస్ సరఫరా చేయడం లేదు. వినియోగదారులు నంబరుతో గ్యాస్ బుక్ చేసిన తరువాత ఓటీపీ వచ్చి గ్యాస్ బుక్ అయినట్లు వినియోగదారులకు మేసేజ్ వచ్చినప్పటికీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పూసపాటిరేగ మండల పరిధిలో వందల సంఖ్యలో వినియోగదారులు గ్యాస్ బుక్ చేసినప్పటికి గ్యాస్ సరఫరా కాకపోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 50 వేల కనెక్షన్లు వున్నాయి. వాటి పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాలు వున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా గ్యాస్ కనెక్షన్లు ఇక్కడ వున్నప్పటికి సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వున్నాయి. పూసపాటిరేగకు చెందిన కోరాడ రమా వినియోగదారుని నంబరు 651205 కు ఈ నెల 24వ తేదీన గ్యాస్ బుక్ చేశారు. బుక్ అయినట్టు ఓటీపీ 6375 అనే నంబరు మెసేజి వచ్చింది. ఇదే మాదిరిగా పూసపాటిరేగ కారిపివాని కల్లాలకు చెందిన కారిపి లక్ష్మినాయుడు వినియోగదారుని నంబరు 627181 అనే నెంబరు ద్వారా ఈ నెల 24న గ్యాస్ బుక్ చేశారు. ఓటీపీ 1584గా వచ్చింది. నక్కానపేటకు చెందిన కోండ్రు రాములమ్మ వినియోగదారుని నంబరు 647878 ద్వారా బుక్ చేయగా ఓటీపీ 9358గా వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే వున్నా బుకింగ్ చేసుకున్న గ్యాస్ వినియోగదారుడు గ్యాస్ కార్యాలయానికి వెళ్లగా బుకింగ్ కాలేదని నిర్వాహకులు బదులు ఇవ్వడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇదే మాదిరి వందల సంఖ్యలో లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ కాలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో తప్పని పరిస్థితిలో ఉసురుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సదరు గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ స్టాక్ పూసపాటిరేగలో ఓ ప్రభుత్వ స్థలంలో లారీలు నిలుపుదల చేసి విక్రయాలు చేయడంతో పలు అనుమానాలను వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని చోట గ్యాస్ వుంచి విక్రయాలు చేయడంతో ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఎవరు బాధ్యులు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు గ్యాస్ స్టాక్ పాయింట్ ఎక్కడ అనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మురళినాధ్ వద్ద సాక్షి ప్రస్తావించగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అన్నారు. గ్యాస్ బుక్ అయినట్లయితే గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు. గ్యాస్ బుక్ చేసినా కాలేదని బదులిస్తున్న నిర్వాహకులు నిరాశతో వెనుదిరుగుతున్న వినియోగదారులు గ్యాస్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు -
నేటి నుంచి విలేకరులకు ఆరోగ్య పరీక్షలు
విజయనగరం: జిల్లాలోని అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షల వివరాలు ఈ నెల 28వ తేదీ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో బ్యాచ్ల వారీగా ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో భాగంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో (గుండె సంబంధిత), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) వంటి కీలక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, న్యూరో, ఆర్థో, గ్యాస్ట్రో నిపుణుల ద్వారా తనిఖీలు చేయిస్తారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలనుకునే జర్నలిస్టులు తమ పేరు, పని చేస్తున్న పత్రిక, అక్రిడిటేషన్ నంబరుతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమాచార శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ నెల 28వ తేదీలోపు 9553147746 , 9441285176, 9491616264 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు, వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆస్పత్రికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పి.గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలపై నిరసన
● ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ కురుపాం: ఆదివాసీ గిరిజన నాయకులు, ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్ డిమాండ్ చేశారు. టెకరకండి గ్రామం వద్ద మన్యం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న వారు ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలను ఖండిస్తూ నినదించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి ఆదివాసీ గిరిజన జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా వారిపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంలో మండిపడ్డారని ఇది సరికాదన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన పదవిలో కొనసాగే హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అశోక్ వెంటనే రాజీనామా చేసి గిరిజన నాయకులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై భవిష్యత్లో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. నిరసనలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్.అప్పారావు, లక్ష్మణరావు, సన్యాసిరావు, ఎం.రమణ, సీతారాం, మండంగి శ్రీను, కె.గంగునాయుడు, ఎన్వై నాయుడు, ఇందిర, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
మా ఊరి మా‘స్టార్’
కొత్తవలస మండలంలోని అర్థన్నపాలెం పరిస్థితి 1984కు ముందు అధ్వానం. చెడు వ్యసనాలకు బానిసలైన వారే అధికంగా కనిపించేవారు. ఆ సమయంలో అక్కడి ప్రాథమిక పాఠశాలకు వంగర మండలం నీలయ్యవలస గ్రామానికి చెందిన జగన్మోహన్రావు బదిలీపై వచ్చారు. గ్రామ పిల్లలతో పాటు పెద్దల్లోనూ మార్పు అవసరమని గుర్తించారు. ఓ వైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే మరోవైపు పెద్దలకు కళారంగంలో ప్రోత్సహించారు. భజనలు, భక్తి గీతాలాపనలు, కోలాట ప్రదర్శనలు, లఘనాటిక ప్రదర్శనల్లో తర్ఫీదు ఇచ్చారు. సామాజిక చైతన్యం నింపారు. లఘు నాటికలతో చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతే... గ్రామస్తుల్లో మార్పుమొదలైంది. ఓ వైపు యువత ఉద్యోగబాట పట్టగా... పెద్దలందరూ కళారంగంలో తరిస్తున్నారు. పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. ఐక్యంగా ఊరిని బాగుచేసుకుంటున్నారు. వీటన్నింటికీ జగన్మోహన్రావు మాస్టారే కారణమని భావించి తమ భజనమండలికి, పాఠశాల భవనానికి, కోలాట బృందానికి ఆయన పేరు పెట్టారు. శ్రీరామనవమి పర్వదినాన.. జగన్మోహన్రావు, ఇందిర దంపతులను శుక్రవారం ఊరేగింపుగా తీసుకొచ్చి ఘన సన్మానం చేశారు. జ్ఞాపికలు అందజే శారు. మా ఊరి మా మంచి మా‘స్టార్’ అంటూ కొనియాడారు. ఆయన విశ్రాంతి పొందినా.. మా ఊరి బాగుకు ఆయనే ప్రధాన గురువుగా పేర్కొన్నారు. ఈ రోజు అందరం సంతోషంగా ఉన్నామంటే ఆయన విత్తిన విద్యా, సామాజిక చైతన్య విత్తనాలే కారణ మని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. – కొత్తవలస -
నయవంచకుడిని పట్టుకోండి!
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా నగదును వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో శుక్రవా రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యోగం నిమిత్తం చెన్నై వెళ్లగా అక్కడ సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది. తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా తనతో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. రెండేళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆరు నెలల క్రితం మరో మహిళ పరిచయం కావడంతో తనను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని, దీంతో తాను ప్రశ్నించగా తనపై దాడులు చేస్తూ చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఈ విషయమై తాను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం.. విజయనగరం వెళ్లి సాయి కుటుంబ సభ్యులతో విష యం చెప్పేందుకు ప్రయత్నించగా అక్కడ సాయి తండ్రి బొబ్బిలి ముత్యాలనాయుడు టీడీపీ ఎంపీపీకి ప్రధాన అనుచరుడని తెలిసిందని, అక్కడి టీడీపీ కార్యకర్తలు తానున్న హోటల్కు వచ్చి సాయికిరణ్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని బాధి తురాలి వాపోయింది. నార్సింగ్ సీఐ హరికిషన్ నిందితుడికి వత్తాసు పలుకుతూ తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. -
మహిళా వేషంలో వచ్చి చైన్ స్నాచింగ్
● ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించి మరీ స్నాచింగ్బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఈ నెల 3న జరిగిన చైన్ స్నాచింగ్ వివరాలను సీఐ కె.నారాయణ రావు విలేకర్లకు గురువారం వివరించారు. మల్లంపేటకు చెందిన కోడి బంగారమ్మ(80) అనే మహిళ ఇంటికి మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి ఆడ వేషంలో వచ్చి మీ కోడలు పంపిందని మాయమాటలు చెప్పి మెడలో గొలుసు తెంపుకు పోయినట్టు తెలిపారు. చైన్ విలువ 23 గ్రాములుంటుందన్నారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో విచారించి నిందితుడ్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో గొడ్డు వాసు అనే తారకరామా కాలనీ వాసి నిందితుడని గుర్తించి పట్టుకున్నారు. ఇతనిపై చెక్ బౌన్స్ కేసుందన్నారు. అలాగే బెట్టింగ్లకు పాల్పడుతున్నాడన్నారు. చివరికి ఇంటిని కూడా అమ్మేశాడన్నారు. అమ్మగా వచ్చిన ఇతని వాటా రూ.3లక్షలతో బెట్టింగ్ ఆడేశాడన్నారు. చివరగా చెక్బౌన్స్ కేసు, మరో పక్క అప్పులు వెంటాడుతుండటంతో దొంగతనానికి పాల్పడ్డాడన్నారు. మల్లంపేటలో వృద్ధురాలి ఇంటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించాడన్నారు. వృద్ధురాలు ఒక్కరే ఉంటారని తెలుసుకుని మహిళ వేషంలో వెళ్లి చైన్ దొంగతనం చేశాడన్నారు. తిరిగి వెనక్కు వచ్చి మహిళ దుస్తులు విప్పేసి విశాఖ వెళ్లిపోయాడన్నారు. అక్కడ తెలిసిన వారి సాయంతో ముత్తూట్ కంపెనీలో కుదువ పెట్టాడన్నారు. ఆ తరువాత మళ్లీ ఆ వస్తువును విడిపించి హైద్రాబాద్ వెళ్లిపోయేందుకు రైల్వేస్టేషన్కు వెళ్లి తచ్చాడుతుండగా తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. కేసులో పురోగతి సాధించిన సిబ్బందిని సీఐ కె.నారాయణ రావు అభినందించారు. ఎస్సై ఆర్.రమేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడి దుర్మరణం
మక్కువ: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెరందిన ఘటన మక్కువ – దుగ్గేరు రహదారి మధ్యలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పనసభద్ర పంచాయతీ దిగువమెండంగి గ్రామానికి చెందిన సీదరపు శంభు(20) గురువారం పని నిమిత్తం మండల కేంద్రానికి వచ్చాడు. పనుల ముగించుకుని మక్కువ నుంచి ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి తిరుగు పయనమయ్యాడు. కొండ బుచ్చింపేట గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మక్కువ పీహెచ్సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన శంభుకు వైద్యులు ప్రథమ చికిత్స అందించినా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బస్టాండ్లు బాగుండాలి.. సేవలు మెరుగుపడాలి!
పార్వతీపురం రూరల్ : జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ప్లాట్ఫారమ్లు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు, పారిశుధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా ముచ్చటించి ఆర్టీసీ సేవలపై వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బస్టాండ్ ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకూడదని, చెత్తాచెదారం లేకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని, బస్సుల రాకపోకలపై సిబ్బంది మర్యాదపూర్వకంగా కచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. బస్ స్టేషన్ అనేది ప్రజలకు ఒక దేవాలయం వంటిదని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దుకాణాల్లో గడువు ముగిసిన వస్తువులను విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజా స్పందనలో ప్రయాణికులు శత శాతం సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాస రావు, డీఎం ఎస్.లక్ష్మణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రాంగణంలో కలెక్టర్ తనిఖీ -
రెండు పశువుల శాలలు దగ్ధం
తెర్లాం: మండలంలోని నందబలగ పంచాయతీ పరిధిలోని జనార్థనవలస(చిన నందబలగ) గ్రామంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు పశువుల శాలలతో పాటు, పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ పూర్తిగా దగ్ధం కాగా, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి తహసీల్దార్ జి.హేమంత్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనార్థనవలసలో గురువారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామానికి చెందిన యామలాపల్లి రాము, గేదెల శ్రీరాములుకు చెందిన రెండు పశువుల శాలలు పూర్తిగా కాలిపోయాయి. బాడంగి మండలం జీకేఆర్ పురం నుంచి జనార్థవలస గ్రామానికి తాపీ పని చేసేందుకు వచ్చిన మేసీ్త్ర తన మోటార్ సైకిల్ను పశువుల శాలలో ఉంచాడు. అగ్ని ప్రమాదంలో పశువుల శాలలో ఉన్న ఒక మోటార్ సైకిల్తో పాటు, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్ కాలిపోతుండడంతో దానిని తీయడానికి వెళ్లిన కె.ప్రభాకరరావు అనే వ్యక్తి చేతులు కాలిపోయి గాయాలయ్యాయి. అతన్ని బొబ్బిలి సీహెచ్సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వీఆర్ఓ ఆమిటి శ్రీనివాసరావు వెంటనే గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న బొబ్బిలి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలు అదుపు చేశారు. -
రేపటితో ముగియనున్న చెరకు క్రషింగ్
రేగిడి: మండల పరిధిలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో ఈ నెల 28న చెరకు క్రషింగ్ ముగియనున్నదని యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది 2.25 లక్షల మెట్రిక్ టన్నులు చెరకు గానుగ ఆడడం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి చెరకు క్రషింగ్ సీజన్ ముగియనున్న దృష్ట్యా రైతులు త్వరపడి చెరకును కటింగ్ చేసి కర్మాగారానికి తరలించాలని కోరింది. పొలాల్లో ఉన్న మిగులు చెరకు మొత్తాన్ని సరఫరా చేస్తే క్రషింగ్ చేయడం జరుగుతుందని వెల్లడించింది. అందుకు అవసరమైన కటింగ్ ఆర్డర్లను సంబంధిత సిబ్బందికి చెప్పినట్టు పేర్కొంది. క్రషింగ్ను సమయానికి పూర్తి చేయడంలో సహకరించిన రైతులు, సిబ్బంది, వాహన డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపింది.


