breaking news
Vizianagaram
-
ఆగి ఉన్న లారీని ఢీకొన్న వేరొక లారీ
బొండపల్లి: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బొండపల్లి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు...గొట్టాం బైపాస్ రోడ్డుపై శనివారం వేకువజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరొ లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ రెల్లి నాయుడు లారీ క్యాబిన్లో ఇరుక్కొనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను రక్షించడానికి ప్రయత్నించడగా ఫలితం లేకపోవడంతో తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి రోప్లు, కట్టర్లతో శ్రమించి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం 108లో జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిద్దాం
విజయనగరం గంటస్తంభం: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలుచేయాలని అన్ని రాష్ట్రాల మీద రుద్దుతోందని, దీనిని వ్యతిరేకిద్దామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ పలుపునిచ్చారు. కె.ఎల్.పురం ఎన్పీఆర్ భవన్లో జిల్లా అధ్యక్షుడు డి.రాము ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేసేదిలేదని అసెంబ్లీల్లో తీర్మానం చేయగా, చంద్రబాబు ప్రభుత్వం మిన్నకుండడం విచారకరమన్నారు. ప్రైవేట్ విద్యా విధానాన్ని పెంపొందించేందుకు పీ–4 విధానాన్ని తీసుకొస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఓ నంబర్ 77 రద్దు చేస్తామని, హాస్టల్ భవనాలు నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామంటూ మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా విద్యార్థిలోకాన్ని మోసం చేశారన్నారు. విద్యార్థులను అణగదొక్కే కూటమి ప్రభుత్వ చర్యలపై ఎదురుతిరగాల్సిన సమయం ఆసన్నమైందని, పోరాటాలకు సిద్ధంకావాలన్నారు. సభలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇ.రాము, సీహెచ్.వెంకటేష్, సభ్యులు శిరీష ,రాజు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు -
రైతులతో రాజకీయ ఆటలు
కూటమి ప్రభుత్వంలో పాలకులు కంటే అధికారులు తీరు ప్రమాదకరంగా మారింది. పాలకుల మెప్పుకోసం అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారు. మడ్డువలస కాలువ ఆయకట్టు పరిధిలో గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ సాగునీటి ఇబ్బందులు రాలేదు. కాలువ గట్లకు వరదలు, వర్షాలతో గండ్లు పడితో ఒక్కరోజు వ్యవధిలో పూడ్చిపెట్టి నీటిని ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ కార్యకర్తల జేబులకు ఓఅండ్ఎమ్ నిధులు మళ్లించేందుకే అన్నట్టు పనులు జరుపుతున్నారు. కాలువ ఆయకట్టులో వేలాది ఎకరాలకు సరిపడే వరి నారుముడులు ఎండిపోతుంటే ఇంతవరకూ నీటిని విడిచిపెట్టకపోవడం శోచనీయం. అన్నదాతలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. – కనకల సన్యాసినాయుడు, మడ్డువలస కాలువ ఆయకట్టు రైతు, ఎంపీటీసీ సభ్యులు, తాలాడ, సంతకవిటి మండలం -
గోడను బైక్ ఢీకొని బాలుడు మృతి
విజయగరం క్రైమ్: విజయనగరం మండలం ధర్మపురి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నింటి ప్రణీత్(15) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటకు చెందిన ప్రణీత్ తన ఇద్దరి స్నేహితులతో బైక్పై ఈ నెల 9న సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భీమిలి రోడ్డు మీదుగా ధర్మపురి రోడ్డులోకి వస్తున్న బైక్ రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి గోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో విజయనగరంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ శనివారం మృతి చెందినటుట రూరల్ ఎస్ఐ అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నీరు రాదు.. మడి తడవదు
రాజాం: కూటమి ప్రభుత్వ పాలన అంతా అబద్ధాలతోనే సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల అమలులోనే కాదు.. చివరకు సాగునీరు విడుదలలోనూ ఏమార్చిన తీరు రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. గొర్లెశ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు ఖరీఫ్లో పంటల సాగుకు వీలుగా కుడి కాలువకు ఈ నెల 7న రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా నీరు విడిచిపెట్టారు. ఖరీఫ్ పంటల సాగుకు ఇబ్బందిలేకుండా సాగునీరు విడుదల చేస్తామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ ఎమ్మెల్యే ప్రకటించడంతో రైతులు సంతోషించారు. సాగునీరు వస్తుందన్న ధీమాతో పొలాల్లో వరి వెదలు, నారుమడుల్లో విత్తనాలు జల్లారు. అయితే, ప్రారంభించిన రోజునే నీటి సరఫరాను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. అంతే.. వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో నారుమడులు, వెద పొలాలు ఎండిపోతున్నాయి. కాలువలో నీటి ప్రవాహం లేకపోవడం, మడితడిచే దారి కనిపించకపోవడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. ● 25వేల ఎకరాల ఆయకట్టు మడ్డువలస కుడి ప్రధాన కాలువ నుంచి వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. రెండో విడతలో మరో 15 వేల ఎకరాల ఆయకట్టుకు కాలువల విస్తరణ జరుగుతుండడంతో ఆ ఆయకట్టులోకి కూడా కొంత ప్రాంతానికి నీటిని అందించాల్సి ఉంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది రైతులు తొలకరి జల్లులు కురవగానే రైతులు వరి సాగు పనులు చేపట్టారు. సకాలంలో సాగునీరు వస్తుందన్న ధీమాతో వరి నారుమడులను అధికంగా సిద్ధంచేశారు. ఇక్కడ నీటికొరత ఉండదని భావించి, నారు ఏపుగా పెరిగిన తరువాత ఇక్కడ నుంచి మిగిలిన ప్రాంతాల్లో పొలాలకు తరలించేందుకు వరి నారుమడులు కాలువ ఆయకట్టు పరిధిలో విస్తారంగా ఏర్పాటుచేశారు. వారంరోజులుగా అటు వర్షాలు కురవకపోగా, ఇటు కాలువ ద్వారా నీరు రాకపోవడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయి. విత్తనాలు సక్రమంగా పంపిణీలేక ఇప్పటికే అవస్థలు పడిన రైతన్నకు నారుమడులు ఇప్పుడు ఎండిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ● నీరు అందేలా చూస్తాం.. మడ్డువలస కుడి ప్రధాన కాలువలో సాగునీరు రాకపోవడంపై ప్రాజెక్టు ఏఈ వెంకట్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా, ప్రస్తుతం కాలువలో 100 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టామని తెలిపారు. వారంరోజుల కిందట విడిచిపెట్టిన నీరు ఇంతవరకూ ఇంకారాలేదని చెప్పగా డామ్ ఇంజినీరింగ్ అధికారులు జాప్యం కారణంగా నీటి విడుదల ఆలస్యమైందని, రెండు రోజుల్లో నీటి ప్రవాహాన్ని పెంచి థైలాండ్ ప్రాంతాలకు కూడా నీరు అందేలా చూస్తామని అన్నారు. సాగునీరు విడిచిపెట్టాక పనులా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలు సంక్షేమం కంటే టీడీపీ కార్యకర్తల జేబులు నింపేందుకే తహతహలాడుతోంది. ఇందులో భాగంగా హుటూహుటినా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి, చైర్మన్ల ఎంపిక చేపట్టింది. వేసవి మొత్తం వదిలేసి, కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీల, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సాగునీటి కాలువలకు మళ్లించింది. ఓఅండ్ఎమ్(ఆపరేషన్ అండ్ మెంటినెన్స్) పేరుతో కాలువల్లో పూడికతీతలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మడ్డువలస కుడికాలువ పరిధిలో 17 టీసీలకు సంబంధించి రూ.1.17 కోట్లు మంజూరీచేసింది. వీటిని ఆయా గ్రామాల పరిధిలోని టీడీపీ కార్యకర్తలకు అప్పగించి కాలువలో పూడికతీతలు చేయిస్తోంది. ఈ పనులు కాలువలోకి నీరు వచ్చిన తరువాత చేసేందుకు వీలు లేకపోవడంతో, ఎలాగోలా ఇప్పుడే కార్యకర్తలు ద్వారా చేయించే పనిలో కాలువల ఏఈలు, డీఈఈలు పడ్డారు. కాలువలో నీటిని నిలుపుదలచేసి, తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. దీంతో కాలువలోకి నీరు రాకుండా నిలుపుదలచేశారు. ఆయకట్టులోని రైతుల వరి నారుమడులు ఎండిపోతున్నా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. -
నిర్లక్ష్యం..!
● గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు ● విద్యుత్ ప్రమాదాలు బారిన పడి మరణిస్తున్న ప్రజలు, మూగజీవాలు ● విద్యుత్ శాఖ ఉద్యోగులు సైతం ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్న వైనం ● 2024–25లో 30 మంది మృతి ● 16 మూగ జీవాల మృత్యువాత మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో పొలంలో కొన్నాళ్ల కిందట విద్యుత్ వైర్లు తెగిపడిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు వాటిని తీయలేదు. అదే గ్రామానికి చెందిన రైతు కోరాడ ఈశ్వరరావు పొలంలోకి వెళ్లగా కాలికి విద్యుత్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై చనిపోయాడు. భర్త రాలేదని పొలంలోకి అతని భార్య ఆదిలక్ష్మి వెళ్లింది. క్రింద పడి ఉన్న భర్తను లేపడానికి ప్రయత్నించగా ఆమె కూడా విద్యుత్ షాక్కు గురై చనిపోయింది.ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యుత్ ఉద్యోగి పేరు రెహమాన్. జామి మండలం శాసనపల్లి గ్రామంలో జేఎల్ఎం(జూనియర్ లైన్మన్ గ్రేడ్ 2)గా పని చేసేవాడు. నెల రోజుల కిందట సోమయాజులపాలెంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో మృతి చెందాడు. అందొచ్చిన కొడుకు మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. నెల్లిమర్ల మండలం అల్తిపాలేంలో కేబుల్ ఆపరేటర్ వడ్డాది ఉమామహేశ్వరరావు విద్యుత్ స్తంభం లైనుకు కేబుల్ వైర్ పెడుతుండగా 11కేవీ వైర్ తగిలి చనిపోయాడు.ఎస్.కోట మండలం వేమాలపల్లి గ్రామంలో లగుడు ప్రదీప్ అనే యువకుడు పొలం నుంచి గడ్డి మోపు తీసుకుని వెళ్తుండగా వేలాడుతున్న విద్యుత్ వైర్ తగలడంతో మృతి చెందాడు. వివాహాం అయిన నెల రోజులకే మృతి చెందడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.చర్యలు తీసుకుంటున్నాం.. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ సమస్యలపై సమాచారం వచ్చిన వెంటనే చర్యలు చేపడుతున్నాం. ప్రజలు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్విజయనగరం ఫోర్ట్: జిల్లాలో విద్యుత్ ప్రమాదాల బారిన పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ప్రజలతో పాటు పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలసత్వం పొలాల్లో తెగిపడిన విద్యుత్ వైర్లు సకాలంలో సరిచేయకపోవడం, ఒరిగిన విద్యుత్ స్తంభాలు సరిచేయకపోవడం, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లును ఇళ్లకు దూరంగా జరపకపోవడం, విద్యుత్ స్తంభాలపై పిచ్చిక గుడులు మాదిరి కేబుల్ వైర్లును అమర్చినా వారిపై చర్య తీసుకోకపోవడం, విద్యుత్ మరమ్మతులు చేపట్టేటప్పడు విద్యుత్ నిలిపివేతలో జాగ్రత్తలు తీసుకోకపోవడం తదితర కారాణాలు వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత స్తంభాల మాదిరిగానే.. విద్యుత్ స్తంభాలను కేబుల్ ఆపరేటర్లు సొంత స్తంభాల మాదిరి వాడుకుంటున్నారు. పట్టణాల్లోను, పల్లెలోను ఇదే పరిస్థితి. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు కట్టలుకట్టలుగా కట్టేస్తున్నారు. దీంతో విద్యుత్ పనులు చేపట్టేందుకు విద్యుత్ సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిత్యం ఈ దృశ్యాలను చూస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో.. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 2024–25లో 30 మంది విద్యుత్ ప్రమాదాలు వల్ల మృతి చెందారు. 16 పశువులు మృతి చెందాయి. 2025–26లో ఏప్రిల్ నుంచి జూన్ నెలఖారు నాటికి ఐదుగురు మృతి చెందగా.. నాలుగు మూగజీవాలు మృతి చెందాయి.నెల్లిమర్ల మండలంలో గుషిణి గ్రామంలో కొద్ది నెలల క్రితం విద్యుత్ పనులు చేపట్టేందుకు జూనియర్ లైన్మన్ ( గ్రేడ్–2)గా పనిచేసే కోటరావు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ లోగా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడక్కడే మృతి చెందాడు. -
పాపం.. పాలిటెక్నిక్ విద్యార్థులు!
చీపురుపల్లి: నేలపైనే నిద్ర.. 30 మందికి రెండే రెండు మరుగుదొడ్లు.. అత్యవసరమైతే ఇక అంతే.. అర్థరాత్రి వేళ ఏదైనా సమస్య ఎదురైతే చెప్పుకునేందుకు వార్డెన్ వంటి వారెవ్వరూ ఉండరు. విద్యార్థులే నెలకు రూ.3వేలు చెల్లిస్తే కళాశాల సిబ్బంది వసతిగృహం నిర్వహిస్తున్న దుస్థితి. ఇదీ చీపురుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థుల వసతి సమస్యకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావు దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం. కౌన్సెలింగ్లో ఇతర జిల్లాలు నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థుల కోసం వసతి సదుపాయం కల్పించలేరా అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి వినిపిస్తోంది. ఇదీ పరిస్థితి: రాజాం రోడ్డులోని జీబీఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఉంది. కళాశాలలో దూరప్రాంతాల కోసం వచ్చే విద్యార్థులు కోసం వసతిగృహ సదుపాయాన్ని గత ప్రభుత్వంలోనే కల్పించారు. చీపురుపల్లి–గరివిడి పట్టణాల మధ్య కళాశాలల వసతిగృహం ఉండడంతో అక్కడి నుంచి దూరమవుతోందన్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాలిటెక్నికల్ కళాశాల ఆవరణలోని ఓ భవనంలో కొద్దిరోజుల కిందట ఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. భోజనం కోసం విద్యార్థులే నెలకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. భవ నం కేటాయించారు తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవు. విద్యార్థులు కటిక నేలపై చాపలు వేసుకుని నిద్రపో తున్నారు. మొత్తం 30 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు సరిపోవడంలేదు. ఇన్వెర్టర్ లేకపో వడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతే చీకటి లోనే గడుపుతున్నామంటూ విద్యార్థులు వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో భవన సదుపాయం గత ప్రభుత్వ హయాంలో రూ.8 కోట్ల నాబార్డు నిధులతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అధునాతన భవనాలు నిర్మాణం జరిపించారు. 2024 ఫిబ్రవరి 4న అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. తరగతి గదులు, ల్యాబ్స్, స్టాఫ్ రూంలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతవరకు కళాశాల అరకొర సౌకర్యాలతో పరాయి పంచన నడిచేది. సొంత ఖర్చులతో హాస్టల్ నిర్వహణ నెలకు రూ.3 వేలు చెల్లించుకుంటున్న విద్యార్థులు నేలపైనే నిద్ర రెండే రెండు మరుగుదొడ్లతో అవస్థలు ఎమ్మెల్యేకు విన్నవించినా పరిష్కారం కాని విద్యార్థుల సమస్యలు -
గంజాయితో ముగ్గురి యువకుల అరెస్టు
గుర్ల: మండలంలోని మణ్యపురిపేట వద్దనున్న తారకరామ తీర్థ సాగర్ కాలువపై గంజాయి అమ్మకాలు చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ పి.నారాయణ రావు శనివారం తెలిపారు. మణ్యపురిపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా కేజీ గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి తరలిస్తున్న వారిలో గరికివలసకు చెందిన ఆవాల రాజేష్, కెల్లకు చెందిన మీసాల రమేష్ , పూసపాటిరేగకు చెందిన మంత్రి రామారావు ఉన్నారని వారిని ఆరెస్ట్ చేసి ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ సీజ్ చేసామని చెప్పారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో గుర్ల పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు అభినందించారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
గజపతినగరం: మండలంలోని భూదేవిపేటకు చెందిన గంధవరపు అప్పాలు(71) శనివారం రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడని బొబ్బిలి రైల్వే హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపారు. అప్పాలు తన సొంత గ్రామం భూదేవిపేట గ్రామం నుంచి ఆరోగ్య తనిఖీ నిమిత్తం మరుపల్లి గ్రామంలో ఉన్న పీహెచ్సీకి బయలుదేరారు. మార్గ మద్యలో రైల్వే ట్రాక్ ఉండడంతో దాన్ని దాటుతుండగా విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్త్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అప్పాలు అక్కడికక్కడే మృతి చెందాడని హెచ్సీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడు గ్రామంలో పూజారిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. -
అమ్మను అక్కున చేర్చుకున్న స్వచ్ఛంద సంస్థలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని దండమారమ్మ గుడి రోడ్డులో అనాథగా పడి ఉన్న ఓ వృద్ధురాలి దీనస్థితిపై ‘అమ్మ రోడ్డున పడింది’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్త స్వచ్ఛంద సంస్థల సభ్యుల హృదయాలను కదిలించింది. మాతృభూమి సేవా సంఘం, సాధన యువజన సంఘం ప్రతినిధులు ఇప్పలవలస గోపాలరావు, దుర్గాప్రసాద్, ఆగుడు రవిలు నిరాశ్రయురాలైన వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు. ఆమెకు స్నానం చేయించి కొత్తదుస్తులు ధరింపజేశారు. శరీరంపై గాయాలను శుభ్రం చేసి, మందుపూశారు. శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓ అమ్మ దీనస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, కన్సల్టెంట్ టి.సుధాకర్ అభినందించారు. సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు కలిసి నిరాశ్రయుల జీవితాల్లో కొత్త ఆశలు నింపగలవని నిరూపించిందన్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో అక్రమంగా నిల్వ వుంచిన 40 బస్తాలు పీడీఎస్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు భోగాపురం సీఎస్డీటీ బీవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రాయితి లక్ష్మి ఇంట్లో వుంచిన పీడీఎస్ బియ్యాన్ని భోగాపురం, రాజాం, గజపతినగరం, గంట్యాడ సీఎస్డీటీలు మురళీకృష్ణ, ఎస్.చిరంజీవి, ఎన్.మూర్తి, కె.తిరుపతి బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించగా అక్రమంగా బియ్యం నిల్వ వున్నట్టు కనుగొని సీజ్ చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని భోగాపురం పౌర సరఫరాలు శాఖ గోడౌన్కు తరలించినట్టు తెలిపారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దాడులలో వారితో పాటు వీఆర్వో టి.ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పాచిపెంటలో..పాచిపెంట: మండలంలో పి.కోనవలస చెక్పోస్ట్ వద్ద శనివారం వాహన తనిఖీలు చేపట్టగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం నవరంగాపూర్కు తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్ సింహాచలం, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ కానిస్టేబుళ్లు పురుషోత్తమ, తిరుపతిరావు మరియు రెవెన్యూ శాఖ అధికారి హేమలత, పాచిపెంట సీఎస్డీటీ పాల్గొన్నారు. -
అన్నదాతలపై అక్రమ కేసులా?
బొబ్బిలి: మామిడి కాయలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన నేరానికి అన్నదాతలపై తిరిగి అక్రమ కేసులు బనాయించడం దేశంలో ఎక్కడా ఇంత వరకూ వినలేదని ఉత్తరాంధ్ర సాధ న సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఇక రాష్ట్రమంతా విస్తరించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. మామిడికి ధరలేకపోవడంతో చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం రైతులు ఎంతో ఆవేదనతో పంటను రోడ్డపై పారబోస్తున్నారన్నారు. ఇటువంటి రైతులను ఆదుకోవడం మానేసి తిరిగి కేసులు నమోదు చేయడం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నామన్నారు. రాజకీయ కక్షలతో కూటమి నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని అసమర్థ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని విమర్శించారు. పోలీసు కార్యాలయాల్లోకి న్యాయవాదులను సైతం అనుమతించకపోవడం కూటమి అనాగరిక చేష్టలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రైతులను నిర్బంధించడం, వారిని ఉన్మాదులుగా చూడడం కూటమి నాయకులకే చెల్లిందన్నారు. నలుగురికీ అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం ముఠా అని అనడం ఎంతవరకూ సబబో ఆ నాయకులే చెప్పాలన్నారు. రైతులకు కూటమి సర్కారు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తమ్మిరెడ్డి కృష్ణ, వజ్జి రమేష్, వజ్జి రవికుమార్, తదితరులు ఉన్నారు. -
క్లౌడ్ సెంటర్గా సెంచూరియన్ విశ్వవిద్యాలయం
నెల్లిమర్ల రూరల్: క్లౌడ్ సెంటర్గా సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని తీర్చిదిద్దామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు అన్నారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లో ఏఐ సాంకేతికతను చేరుస్తామన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న 50 సంస్థలతో తాము ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్పారు. దేశంలో 28 నానో చిప్స్ తయారు చేస్తున్న మొదటి విద్యాలయం సెంచూరియన్ అని తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల శిక్షణలు అందిస్తున్నామని, ఏటా కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రశాంత కుమార్, రిజిస్ట్రార్ పల్లవి, తదితరులు పాల్గొన్నారు. ఇష్టంతో చదివితే విజయం మీదే.. ● రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ నెల్లిమర్ల: కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం వరిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లిమర్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ మత్స్యకార బాలుర గురుకుల పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను రుచిచూశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సిబ్బంది పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జేడీ చినబాబు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు జ్యోతిశ్రీ, శ్రీదేవి, జిల్లా బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ డాక్టర్ కేబీవీ రావు, పాఠశాల ప్రిన్సిపల్ త్రినాథరావు పాల్గొన్నారు. పేరు మార్చడం.. ఏమార్చడమేనా మీ విజనరీ పాలన? ● చంద్రబాబు పాలనా తీరుపై అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ఎద్దేవా గుమ్మలక్ష్మీపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మార్చడం, వాటిని అమలుచేయకుండా ఏమార్చడమే చంద్రబాబునాయుడు విజనరీ పాలన అని అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మ తనూజారాణి ఎద్దేవా చేశారు. జియ్యమ్మవలస మండలంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లికి వందనం పథకాన్ని రూపకల్పన చేసినది విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ అంటూ చెప్పుకురావడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలుచేసిన అమ్మఒడి పథకానికి పేరును మార్చేసి, ఓ ఏడాది పథకం ఎగ్గొట్టి, తీరా తామే రూపకల్పన చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరుమార్చారే తప్ప ఇప్పటివరకు పైసా సాయం రైతన్నల ఖాతాలో జమచేయకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు విజనరీ పాలన అంటే జనాన్ని మోసం చేయడమేనన్నారు. -
జొన్నవలస రైల్వేగేటు వద్ద మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: జొన్నవలస రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు శనివారం గుర్తించారు. 25 – 30 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి నీలి రంగు ఫ్యాంట్, రెడ్ నెక్ టీ షర్ట్ కలిగిన వ్యక్తిగా గుర్తించినట్టు జీఆర్పీ హెచ్సీ కృష్ణ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గుర్తించిన వారు తమను సంప్రదించాలని సూచించారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంశృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధి నవోదయ విద్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు గాయాల పాలయ్యారు. స్థానికులు అందించిన వివరాలు.. మండలంలోని లచ్చందొరపాలెం గ్రామానికి చెందిన కండిపల్లి సుధీర్(18) తన స్నేహితులతో కలిసి బొడ్డవర పంచాయతీ అంబదాసుపాలెం గ్రామానికి చెందిన నిఖిల్ ఆటోలో శుక్రవారం రాత్రి ముషిడిపల్లి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో నవోదయ విద్యాలయం దాటగానే ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సుధీర్ ప్రమాద స్థలంలో మృతి చెందగా, ఆటో నడుపుతున్న నిఖిల్, గణేష్, జగదీష్ గాయపడ్డారు. వీరిని ఎస్కోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వీరిలో గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు
విజయనగరం క్రైమ్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు డ్రోన్ల సహాయంతో కొరఢా ఝళిపిస్తున్నారు. జిల్లాలోని జామి పోలీస్స్టేషన్ పరిధి భీమసింగి, పెదమానాపురం పోలీస్స్టేషన్ పరిధి మానాపురం సంత శివారు ప్రాంతాల్లో శనివారం ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై డ్రోన్ల సహాయంతో శనివారం దాడులు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా డ్రోన్ల సాయంతో దాడులు చేస్తున్నారు. ఇలా మద్యం సేవిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పెదమానాపురం సంత వద్ద కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. -
గుండాం సమీపంలో ఏనుగులు
సీతంపేట: సీతంపేట–కురుపాం మండల సరిహద్దు ప్రాంతమైన గుండాం గ్రామం వైపు ఏనుగులు వెళ్లినట్టు అటవీ శాఖ సిబ్బంది శనివారం తెలిపారు. గత పక్షం రోజులుగా నాలుగు ఏనుగులు మోహన్కాలనీ, గోరపాడు, చిన్నబగ్గ బీట్ పరిధిలో తిరిగి ఫైనాపిల్ పంటలను నాశనం చేశాయి. అరటి చెట్లను విరిచేశాయని స్థానికులు తెలిపారు. పంట నష్ట పరిహారం ఇచ్చే విధంగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. వ్యక్తిపై కేసు వీరఘట్టం: మండలంలోని హుస్సేనుపురంలో కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న స్థల వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ వివాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ జి.కళాధర్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...హుస్సేనుపురానికి చెందిన బంధువులైన వావిలపల్లి సూర్యనారాయణ, బొత్స రామారావులకు కొద్ది రోజులుగా గ్రామంలో ఓ స్థల వివాదం నడుస్తోంది. తన స్థలంలో పూరిపాక వేశారంటూ రామారావు శనివారం ఉదయం ఆ పూరిపాకపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో పూరిపాకలో ఉన్న సూర్యనారాయణ ప్రాణ భయంతో పరుగులు తీశాడు. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ స్వల్పంగా గాయపడ్డాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉండగా ఇలా నిప్పు పెట్టి తనను భయబ్రాంతులకు గురిచేసిన రామారావుపై చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్.ఐ తెలిపారు. గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు విజయనగరం క్రైమ్: జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణ నియంత్రణే లక్ష్యంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. రైళ్లలో గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో లోకల్ పోలీసులు, జీఆర్పీ, ఈగల్, ఆర్పీఎఫ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టినట్టు ఎస్పీ వకుల్ జందల్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి ప్రధానంగా రవాణ అవుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు ముమ్మరం చేసినట్టు చెప్పారు. విజయనగరం వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ సిబ్బందికి ముందస్తుగా కొన్ని సూచనలు చేసి తనిఖీలపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీధర్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి దివ్యాంగుల ఆందోళన
పార్వతీపురం టౌన్: దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం చూపాలని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ముండ్రంగి లచ్చన్న దొర డిమాండ్ చేశారు. శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను నిరసన రూపంలో తెలియజేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నూతనంగా ఏర్పడి మూడేళ్లు అయినా నేటి వరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కింద సహాయక సంచాలకుల వారి కార్యాలయం పార్వతీపురంలో ఏర్పాటు చేయాలేదన్నారు. తద్వారా జిల్లాలో గల దివ్యాంగులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే ఏడీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన ఏఎల్ఐఏంసీవో క్యాంపులలో దివ్యాంగులకు మంజూరైన పరికరాలను వెంటనే ఇప్పించాలన్నారు. నిరసనలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ వద్ద నిరసన -
పాలిటెక్నిక్ కళాశాల మూసివేత ప్రతిపాదనను రద్దు చేయాలి
విజయనగరం అర్బన్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా చూడాలని చింతపల్లి స్థానికులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కోరారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ అయినట్లు వారు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. 2011లో స్థానిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి చింతపల్లిలో సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారని, ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని స్థానికులు తెలిపారు. అయితే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన చైర్మన్ డాక్టర్ శంకరరావు, ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉండాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ఎస్టీ కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. చింతపల్లి ప్రాంతంలో వ్యవసాయ కళాశాల అవసరాన్ని గుర్తించి అప్పట్లో ఈ కళాశాల ఏర్పాటైందని, స్థానికులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి కళాశాల కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్కు వినతి ఇచ్చిన చింతపల్లి స్థానికులు -
సమస్యల పరిష్కారానికే పోలీసు వెల్ఫేర్డే
పార్వతీపురం రూరల్: శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ వెల్ఫేర్డే(గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అలాగే వృత్తి పరమైన, ఆరోగ్యపరమైన, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరిం చడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా శాఖాపరమైన సిబ్బంది సమస్యలను తెలుసుకు ని పరిశీలించి సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న అంశాలపై ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీ సంతోష్ కుమార్, ఆర్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
కొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో శుక్రవారం రాత్రి స్కూటీపై వెళ్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో లక్కవరపుకోట మండలం భూమిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాదాబత్తుల శ్రీను(23) అక్కడికక్కడే మృతి చెందగా అదే గ్రామానికి చెందిన ధనాలకోటి అప్పలనాయుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై హేమంత్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీను తన స్వంత గ్రామం భూమిరెడ్డిపాలెం నుంచి స్నేహితుడు అప్పలనాయుడితో కలిసి స్కూటీపై పెందుర్తి మండలంలో గల తన అక్క ఇంటికి బయల్దేరాడు. అరకు–విశాఖ రోడ్డు మంగళపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా మితిమీరిన వేగంతో గుర్తు తెలియిన వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో శ్రీను రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధికంగా రక్తస్రావం జరగ్గా అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనుక కూర్చున్న అప్పలనాయుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. కాగా మృతుడు శ్రీను విశాఖపట్నం జిల్లా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో బాజీజంక్షన్ వద్ద గల బ్యాంక్ ఆఫ్ బరోడాలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అప్పలనాయుడు చిన్న చిన్న ఎలక్ట్రకల్ పనులను చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై మేమంత్కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించి శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరో యువకుడికి తీవ్రగాయాలు -
అన్నీ రిఫరల్ కేసులేనా..!
● రోగుల రిఫర్పై వైద్యులు, అధికారుల వాదన ● సీరియస్ లేకున్నా జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు ● 108 జిల్లా మేనేజర్ ● రోగికి బాగుందా లేదా అన్నది మేం డిసైడ్ చేస్తాం ● సీహెచ్సీ సూపరింటెండెంట్బొబ్బిలి: మూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా బొబ్బిలి సీహెచ్సీ నుంచే జిల్లాకేంద్రానికి రోగులను రిఫర్ చేస్తున్నారని, ఇక్కడి వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నందున సీహెచ్సీకి వచ్చిన రోగులను ఐపీలో ఉంచేందుకు ఇష్టపడక చిన్న రోగానికి కూడా రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూర్చే విధంగా శుక్రవారం ఓ సంఘటన జరిగింది. ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు, వైద్యులు 108 మూడు జిల్లాల మేనేజర్ల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ప్రతి చిన్న విషయానికి 108కి ఫోన్ చేసి రమ్మంటున్నారని, రోగులు నడిచి వెళ్లగలిగే పరిస్థితుల్లోనూ 108 వాహనాన్ని పిలిచి రోగులను తరలించడం వల్ల వివిధ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు 108 వాహనాలను పంపించలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథరావు అన్నారు. దీనికి ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు మాట్లాడుతూ రోగులను 108లో పంపించాలా? మామూలుగా ఇక్కడే వైద్యం చేయించాలా అన్న విషయాన్ని నిర్ణయించేది మేము. మీరెలా చెప్పగలరు? అని ఎదురు ప్రశ్నించారు. రోగి స్థితి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని, నిలకడగా ఉండదని అలాంటప్పుడు మేం ఎలా రిఫర్చేయకుండా ఉంచుతామన్నారు. మీరు ఒక వేళ 108 పంపించలేమని అనుకుంటే మాకు రాసిచ్చేయండి. మేం ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. పోర్టికో వద్ద జరుగుతున్న ఈ వాదనను రోగులు, ఇతర వైద్యసిబ్బంది వచ్చి చూస్తూ ఉండి పోయారు. మరో వైద్యురాలు మాట్లాడుతూ మీరు వాహనాలు పంపించేందుకు ఇష్టపడకపోతే ఎలా మేం రిఫర్ రాస్తాం. అలాంటప్పుడు రోగికి ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని అన్నారు. ఒక్కో అంబులెన్స్ డ్రైవర్ చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. కంప్లైంట్ ఇవ్వండి ఇక్కడ ఆస్పత్రిలో వైద్యులు రోగులను ఉంచడం లేదు. అందర్నీ రిఫర్ చేస్తున్నారని మీరు కంప్లైంట్ ఇవ్వండి మా కంప్లైంట్ మేం ఇచ్చుకుంటామని సూపరింటెండెంట్ శశిభూషణ రావు అన్నారు. చాలా కేసులకు విజయనగరం వెళ్లి వస్తున్నామని, జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి దాదాపు 6 గంటలు పడుతోందని ఈ లోగా ఏమైనా ఏక్సిడెంట్లు జరిగితే అందుబాటులో ఉండలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథ రావు అన్నారు. రోగుల వైద్యం కోసం ఇలా వాదులాడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
గుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్లో తనిఖీలు
పార్వతీపురం రూరల్: గుంటూరు, రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ఐజీ ఆకె రవికృష్ణ, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరిట శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, జిల్లా పోలీస్శాఖ, డాగ్స్క్వాడ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో జనరల్ బోగీల నుంచి ఏసీ బోగీల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కోసం టోల్ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నంబర్కు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
గృహిణి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని టొంపలపేటకు చెందిన బుసకల మణి(24) కి పూససాటిరేగ మండలం ఎరుకొండకు చెందిన సురేష్తో పైళ్లెంది. వారికి ఒక బిడ్డ ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త సురేష్కు చెప్పాపెట్టకుండా విజయనగరంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్న తన పెద్దమ్మ దగ్గరకు మూడురోజుల క్రితం మణి వచ్చేసింది. ఆ సమయంలోనే విజయనగరం టూటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాస్ ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పుడే మణి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని రెండురోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా విజయవాడకు వెళ్లిపోయింది. దీనిపై ఆమె పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి విజయవాడలో ఆమెను పట్టుకుని శుక్రవారం విజయనగరం తీసుకువచ్చారు. అయితే అంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ పెద్దమ్మ ఇంట్లో ఉంటున్న మణి బాత్రూమ్కు అని చెప్పి వెళ్లి ఇంట్లోనే ఉరేసుకుంది. ఇంట్లో ఉంటున్న పెద్దమ్మకు అనుమానం రావడంతో చూసి మణి కొనఊపిరితో ఉండడంతో చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మణి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఆమె కన్నవారికి ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టోల్గేట్ వేయింగ్ మిషన్ వద్ద అక్రమ వసూళ్లు
● నిర్వాహకులను నిలదీసిన లారీ యజమానులు, సిబ్బందిడెంకాడ: మండలంలోని నాతవలస టోల్గేట్ వద్ద ఉన్న వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఇష్టం వచ్చినట్లు వాహనాల వద్ద అధిక బరువు పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని లారీ యజమానులు, సిబ్బంది వేయింగ్ మిషన్ నిర్వాహకులను నిలదీశారు. అధిక బరువుతో వెళ్తున్న వాహనాలు ఎంత మేరకు అధిక బరువుతో ఉన్నది వేయింగ్ మిషన్ ద్వారా వాహన యజమానులకు తెలుస్తుంది. అయితే వేయింగ్ మిషన్ పని చేయకపోయినా వారికి నచ్చినంత అధిక బరువు పేరుతో నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్నారని లారీ యజమానులు, సిబ్బంది చెప్పారు. వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఎలా అధిక బరువు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. కొంతకాలంగా ఇది జరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిర్వాహకులు, లారీ యజమానుల మధ్య వివాదం చివరకు పోలీసుల వద్దకు చేరింది. ఈ మేరకు భోగాపురం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వివాదంపై చర్చలు జరిగాయి. లారీ యజమానుల తరఫున లారీ ఓనర్ల అసోషియేషన్ రాష్ట అధ్యక్షుడు మహారథి,సెక్రటరీ శేషగిరి, ట్రెజరర్ వీవీ రాజు తదితరులు హాజరవగా, నిర్వాహకులు తరఫున కొందరు హాజరయ్యారు. వేయింగ్ మిషన్ బాగు చేసే వరకూ అధిక లోడ్ చార్జీలు వసూలు చేయరాదని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ నుంచి అధికారులు పనిచేయని వేయింగ్ మిషన్ను పరిశీలించారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనుల పండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంట పంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశా రు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీప కాంతుల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డేవిజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానన్నారు. పోలీసు వెల్ఫేర్ డేలో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని తన చాంబర్లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలవాలివిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు విజయం సాధించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు. అవనాపు భార్గవి ఆకాంక్షించారు. ఈనెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నం రైల్వే స్టేడియంలో జరిగే 6 వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సెల్ దొంగకు దేహశుద్ధిరామభద్రపురం: మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్లో ఆగి ఉన్న బస్లో ఓ వ్యక్తి నుంచి సెల్ దొంగలించి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ బస్టాండ్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన బస్ ఆగి ఉంది. బస్సులోని ఓ వ్యక్తి దగ్గర నుంచి ఇద్దకు యువకులు సెల్ దొంగలించి కిందికి దిగి ఇద్దరూ చెరోవైపు పారిపోతున్నారు. ఇంతలో స్థానికులు వెంబడించి ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.సెల్ పట్టుకుని పారిపోయిన యువకుడు తప్పించుకున్నాడు. దొరికిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిద్దరు అనకాపల్లికి చెందిన వారుగా తెలిసింది. పుస్తెల తాడు చోరీవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండాలపేటలో శుక్రవారం చోరీ జరిగింది. సత్యవతి అనే మహిళ తన పొలంలో వరి ఊడ్పు పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కుని పారిపోయినట్లు బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
20న పారా జూనియర్స్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు రాజీవ్ క్రీడా మైదానంలో జరుగనున్నాయని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను జిల్లా క్రీడాధికారి ఎల్. వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్లతో కలిసి స్థానిక అశోక్బంగ్లాలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టులో 14వ జాతీయస్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2025 పోటీలు జరుగనున్నాయని, ఈ పోటీలకు అర్హత సాధించేందుకు ముందుగా జిల్లా స్థాయిలో ఎంపిక కావాల్సి ఉందన్నారు. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఆగస్టు 9న విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రధానంగా రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నారని, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగ (పారా) క్రీడాకారులంతా ఈ పోటిల్లో పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు. క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు ఫోన్ 9849377577 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రదీప్, పారా క్రీడాకారులు పాల్గొన్నారు. -
నలుగురు ఉపాధ్యాయులకు మెమో
మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి మోడల్ ప్రైమరీ పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులుకు మెమో జారీచేసినట్లు ఎంఈవో శ్యామ్సుందర్ శుక్రవారం తెలిపారు. సాక్షిలో శుక్రవారం ‘పాపం చిన్నారులు..!’ అనే కథనం ప్రచురితమైంది. పేరెంట్స్, టీచర్స్ సమావేశం మాత్రమే నిర్వహించాలి తప్ప, ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టరాదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు పాఠశాల ఎదుట నడిరోడ్డుపై సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభీషేకం నిర్వహించడంతోపాటు, రోడ్డుపై చిన్నారులను, తల్లిదండ్రులును కూర్చోబెట్టి పాదపూజ నిర్వహించడం సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టడంతో పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో డీఈవో రాజ్కుమార్ స్పందించి, నలుగురు ఉపాధ్యాయులకు మెమో ఇవ్వాలని ఎంఈవో శ్యామ్సుందర్కు ఆదేశాలు ఇవ్వడంతో, శుక్రవారం ఆ ఉపాధ్యాయులుకు మెమో ఇచ్చామని, ఉపాధ్యాయుల నుంచి వివరణ రావాల్సి ఉందని ఎంఈవో శ్యామ్సుందర్ తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థి అదృశ్యంవిజయనగరం క్రైమ్: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ అభ్యర్థి అదృశ్యమయ్యాడు. నగరానికి చెందిన పల్లి పైడి నాయుడు(25) ఇటీవల పలు పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యాడు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు కూడా హాజరై రాత పరీక్ష రాశాడు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో పైడినాయుడు ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది కన్నవారికి తాను ఇక భారం అనుకుని ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు పైడినాయుడి మామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
కారులో 300 లీటర్ల సారా స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస: కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం దాసరిపేట గ్రామ సమీపంలో సారా రవాణాపై రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 300 లీటర్ల సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని సందుబడి గ్రామంలో తయారైన సారాను 15 క్యాన్లతో (300 లీటర్లు) టాటా ఇండికా కారులో పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన వడ్డాది సురేష్, జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన బొత్స అనిల్లు తరలిస్తుండగా పట్టుబడ్డారని చెప్పారు. సారాతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకుని పట్టుబడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఆయన వెంట సబ్ ఇన్స్పెక్టర్ జె.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
గర్భిణుల ఆరోగ్యం పట్ల అప్రమత్తం
సీతానగరం: మండలంలోని గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని పీహెచ్సీ డాక్టర్ పి.ఉషారాణి అన్నారు. ఈ మేరకు స్థానిక పీహెచ్సీలో శుక్రవారం గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ మేరకు డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ గర్భిణుల్లో ఎక్కువ మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్) ఉన్నట్లు గుర్తించామన్నారు. రక్తహీనత నివారణకు ఐరన్ సుక్రోజ్ మందులు ఇవ్వనున్నామని, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఐసీడీఎస్ శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పాలు, గుడ్లు, చక్కీలు విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే ప్రతి నెలా పీహెచ్సీల్లో గర్భిణులకు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవ సమయానికి గర్భిణులందరూ చేరాలని కోరారు. అలాగే సీజనల్ వ్యాధులు వస్తున్న కారణంగా వైద్యసిబ్బంది అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియ జేశారు. పీహెచ్సీ ఓపీలో రోజుకు 65 నుంచి 80 మంది రోగులకు సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బిల్లుల భారం మోయలేం బాబూ..!
నెల్లిమర్ల రూరల్: మా ఇళ్లలో ఒక ఫ్యాన్, రెండు బల్బులు, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. పగలంతా పనుల కోసం బయటకు వెళ్లిపోతాం. అసలు విద్యుత్ వినియోగమే ఉండదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కూడా ఉంది. కానీ వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వద్ద శుక్రవారం వాపోయారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ రచ్చబండ కార్యక్రమంలో ఆయనకు విద్యుత్ బిల్లులు చూపించి గగ్గోలుపెట్టారు. తమకు రూ.రూ.4,085 బిల్లు వచ్చిందని బూసరి రాములమ్మ వాపోగా, బూసరి ఎల్లయ్యకు రూ.5,787, బూసరి రాముడుకు రూ.2,219 చొప్పున విద్యుత్ బిల్లులు వచ్చాయని తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో విద్యుత్ బిల్లులు ఎన్నడూ చూడలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమలాగే దళిత కాలనీలో చాలా మందికి వేలకువేలు బిల్లులు వచ్చాయని..న్యాయం చేయాలంటూ బడ్డుకొండ ఎదుట వాపోయారు. బడ్డుకొండ వెంటనే స్పందించి బాధితుల ఎదుటే విద్యుత్ శాఖ ఏఈ పిచ్చయ్యతో ఫోన్లో మాట్లాడారు. నిరుపేదలకు వేలకు వేలు బిల్లులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు అంతమొత్తంలో బిల్లులు ఎలా చెల్లించగలరన్నారు. తక్షణమే బాధితుల మీటర్లను పరిశీలించి బిల్లులను సరి చేయాలని కోరారు.గతంలో చిల్లిగవ్వ కూడా కట్టలేదు గత ప్రభుత్వంలో ఎస్సీలకు రాయతీ విద్యుత్లో భాగంగా చిల్లి గవ్వ కూడా డబ్బులు చెల్లించలేదు. అసలు 200 యూనిట్ల లోపే తామంతా విద్యుత్ను వినియోగిస్తాం. గడిచిన రెండు నెలలుగా వేలాది రూపాయల బిల్లులు వస్తున్నాయి. దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. – బూసరి చంటి, బాధితుడు, ఒమ్మి గ్రామం, నెల్లిమర్ల మండలం రాయితీ సదుపాయం ఉంది ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్లలోపు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ప్రతినెలా ఈ విధానం కొనసాగుతోంది. కాకపోతే ప్రతి నెల బిల్లులో వచ్చిన ఇతర చార్జీలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్ల నుంచి ఇతర చార్జీలు చెల్లించకపోవడంతోనే అధిక మొత్తంలో బిల్లులు చూపిస్తున్నాయి. గ్రామాన్ని సందర్శించి బిల్లులపై పూర్తి వివరణ ఇస్తాం. – పిచ్చయ్య, విద్యుత్ ఏఈ, నెల్లిమర్ల మండలం -
ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తున్న కూటమి
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణలో కలిసి జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చారు. తొలుత జిల్లా ప్రవేశంలోని వై జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏమీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ పీఆర్సీ, హెచ్ఆర్ బిల్లులు, పీఎఫ్, జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.27,500 కోట్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజావసరాల పనులను కర్తవ్యంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని సాధించుకునేందుకు ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్బాబు, కార్యదర్శి ఎ.సురేష్, సహాయఅధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిశోర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్జీఓ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉండాలి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపు -
అమ్మ రోడ్డున పడింది!
ఆమె ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతోంది. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో దండమారమ్మ గుడి రోడ్డులో కాలికి కట్టుతో కదల్లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది అందించిన ఆహారం తింటూ కాలంవెళ్లదీస్తోంది. స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆమెను అక్కున చేర్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – విజయనగరం అర్బన్ ● ఒమ్మిలో ఎస్సీల ఆవేదన ● బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండకు ఫిర్యాదు -
జేఎన్టీయూ జీవీకి ప్రశంసాపత్రం
విజయనగరం అర్బన్: ఢిల్లీకి చెందిన యూజీసీ–మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (యూజీసీ–ఎంఎంటీటీసీ) ఆధ్వర్యంలో ఫిబ్ర వరి 4– 14, జూన్ 3–13 రెండుదశల్లో ఆన్లైన్లో నిర్వహించిన ఎన్ఈపీ ఓరియంటేషన్ ప్రోగ్రాంను జేఎన్టీయూ విజయవంతంగా పూర్తిచేసి ప్రశంసా పత్రాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమతో పాటు యూనివర్సిటీ ఇంజినీరింగ్ అధ్యాపకుల బృందం ప్రోగ్రాంలో పాల్గొంది. ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలి ● ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి విజయనగరం ఫోర్ట్: ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్పీఆర్ భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆశ వర్కర్ల సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024 పిభ్రవరి 9న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఒప్పందాలను అమలుచేయాలన్నారు. ప్రభుత్వ సెలవులతోపాటు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని తెలిపారు. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం
విజయనగరం అర్బన్: జిందాల్ కంపెనీకి భూములిచ్చి పరిహారం అందని రైతులకు వారం రోజుల్లో అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్కు కేటాయించిన భూములపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటి వరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపైనా ఆరా తీశారు. సుమారు 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్ ఉండగా వీరిలో ముగ్గురికి ఇటీవలే చెల్లించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన 11 మందికి వారంలో పరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూములు తీసుకున్న సమయంలో ప్రభు త్వం నిర్ణయించిన పరిహారం మాత్రమే వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. 53 బోరుబావులకు సంబంధించి ఇప్పటికే 28 మందికి నష్ట పరిహారం ఇచ్చామన్నారు. ఇళ్ల స్థలాలు కోల్పోయిన 16 మందికి నిబంధనల ప్రకా రం పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ డి.కీర్తి, ఎస్.కోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, డి–సెక్షన్ సూపరింటిండెంట్ తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు. ప్లకార్డును ప్రదర్శిస్తున్న విద్యార్థినికలెక్టరేట్ ముఖద్వారం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న విద్యార్థులు హామీ ఏమైంది? విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ యువగళం కార్యక్రమంలో జీఓ నంబర్ 117 రద్దుచేసి పాఠశాల విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు. పాఠశాలలు మూతపడుతున్నా స్పందన లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లన్నీ ప్రభుత్వం పరిధిలో ఉంచుతామని హామీ ఇచ్చి నేడు అమ్మకానికి పెడుతున్నారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణం. హాస్టల్ మెస్ చార్జీలు పెంచుతామన్న మాటనూ మర్చిపోవడం విచారకరం. – నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి, విజయనగరం పత్తాలేని ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారింది. పేద విద్యార్ధులకు ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. – ఏ.సుమన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరం సమస్యల పరిష్కారంలో విఫలం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కనీసం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్ధల్లో లక్ష రూపాయల ఫీజు దోపిడీ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. – వి.శ్రావణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి, విజయనగరం● విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ● విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● నిరసనగళం వినిపించిన విద్యార్థులు విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి లోకం గర్జించింది. కల్టెరేట్ను చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. నిరసన గళం వినిపించింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా వందలాది మంది విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రవేశం ద్వారం వద్ద ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తమ డిమాండ్లను వినిపిస్తూ డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్ర చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6,400 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. దీనివల్ల ఇంజినీరింగ్, పీజీ కోర్సులు పూర్తిచేసినా విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ నంబర్ 77, రాష్ట్రవ్యాప్తంగా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను రద్దుచేసి పాత పద్ధతిలోనే యూనివర్సిటీ సెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేసి ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే జీఓ నంబర్ 107, 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వసతులు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు. సమీక్షించిన కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సునీల్ బంట, నాతు సింగ్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, విజయనగరరం మండలాల్లో పర్యటించి పథకాల అమలుపై ఆరా తీసింది. ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు బృందానికి సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
నగర శివార్లలో డ్రోన్లతో నిఘా
విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో భాగంగా నగర శివారుల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ఇటీవల జరిగిన నేర సమీక్షలో ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం రూరల్ పోలీసులు ఈ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సున్నితమైన, మారుమూల ప్రదేశాలైన జమ్ము, నారాయణపురం, పడాలపేట, వైఎస్సార్ నగర్, ఫోర్ట్ సిటీ స్కూల్ వెనక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాకు చర్యలు తీసుకున్నామని రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ప్రతిరోజూ ఈ డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, తద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. -
అర్ధరాత్రి ఒడ్డుకు చేరిన మత్స్యకారులు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న తండ్రీ కొడుకులు దాసరి రాములు, ఆదినారాయణ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గుర్రపుడెక్క తిప్పు కోవడంతో సుమారు 10 గంటల పాటు ప్రాజెక్టులోనే రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. వంగర పోలీసులు రంగప్రవేశం చేయడంతో సహచర మత్స్యకారులు పడవల్లో ప్రాజెక్టు లోపలికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అతికష్టంమీద తండ్రీకొడుకులను ఒడ్డుకు చేర్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, మత్య్సకారులు, అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
చోరీకేసులో నిందితుల అరెస్ట్
గజపతినగరం రూరల్: ఈనెల1వ తేదీన రైల్వేకాలనీలోని పాండ్రంకి గణేష్ ఇంట్లో జరిగిన చోరీకేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు గజపతినగరం సీఐ రమణ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ఏరియాలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తిరుగుతున్నారని వచ్చిన సమాచారం మేరకు వారిని పట్టుకుని విచారణ చేయగా కాలనీలో జరిగిన దొంగతనం తామే చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే అదేరోజు సాలూరులో కూడా ఓ ఇంటిలో దొంగతనం చేశామని అంగీకరించినట్లు చెప్పారు. దీంతో వారి నుంచి 200 గ్రాముల వెండి, రూ.1150 నగదు రికవరీ చేశామన్నారు. చోరీకి పాల్పడిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన చిల్లా సురేష్పై ఇప్పటికే 50కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే విజయవాడకు చెందిన నాగవీరభాస్కరరావు, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, దాసరి సుభాష్లపై కూడా కేసులు ఉన్నాయని, వారు నలుగురు ఒక కారులో మక్కువలోని శంబర గ్రామం వెళ్లారన్నారు. ఆ తరువాత అదే రోజు ఈ రెండు దొంగతనాలు చేసి గుంటూరు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై కిరణ్కుమార్తో పాటు సిబ్బందికి ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేసినట్లు సీఐ తెలిపారు. -
విద్యార్థుల నిరీక్షణ
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 శ్రీ170షెడ్యూల్ ప్రకటించాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలి. ప్రభుత్వ కళాశాలల్లో షెడ్యూల్ విడుదల చేయకపోవడంవల్ల ప్రైవేట్ కళాశాలలు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ కళాశాలలకు తీవ్రనష్టం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – సింహాద్రి కిరణ్కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పార్వతీపురం టౌన్: డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడి రెండు నెలలు గుడుస్తున్నా డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక విద్యార్థులు తమ సమీపంలో గల కళాశాలల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ మొదలైతే ఆ ప్రభావం సాధారణ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలపై పడుతుందని కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, 8 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థుల భవితను ఆలోచించి 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఫలితంగా విద్యార్థుల ప్రవేశాలకు మార్గం సుగమం చేసింది. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఆన్లైన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రవేశాలు పొందేవారు. విద్యార్థికి దగ్గరలో, ఇష్టమైన కళాశాల ఎంపిక సులభతరంగా ఉండేది. సబ్జెక్టులపై తర్జన, భర్జన డిగ్రీలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ సబ్జెక్టు విధానాన్ని డబుల్ సబ్జెక్టుకు మార్చాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తర్జన, భబర్జనలు కొనసాగుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో దేన్ని అనుసరించాలనే అంశంపై ఉన్నత విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయానికి రాలేదు. జిల్లాలో 12680 మంది ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో కొంతమంది డిగ్రీ ప్రవేశాలపై మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు రాని విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గుచూపుతుంటారు. జూలై మొదటి, రెండవ వారంలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాకపోతే విద్యార్థుల్లో పలువురు ఇంజినీరింగ్ లేదా ఫార్మా కోర్సుల్లో చేరే అవకాశాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే కళాశాలల్లో ఎక్కువ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. డిగ్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం రెండు నెలలుగా ఎదురుచూపులు నోటిఫికేషన్ జారీ చేయని ఉన్నత విద్యాశాఖ ఆన్లైన్, ఆఫ్లైన్పై లేని స్పష్టత -
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో జరిగే 6వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల వివరాలు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం వెల్లడించారు. బాలుర విభాగంలో ఎ.మనీష్, ఎస్.విశాల్, పి. దుర్గాప్రసాద్, కె.హేమేష్ వర్ధన్, కె.కత్యేష్ వర్ధన్, ఎ.యశ్వంత్, వై.రేవంత్, కె.గౌతమ్ గణేష్, బి.సచిన్లు ఉన్నారు. అదేవిధంగా బాలికల విభాగంలో బి.మైథిలి, ఎం.ఝాన్సీ, ఎన్.దేవిక, కె.వేణుమాధవి, వి.జాహ్నవి లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్లకు అర్హత సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డోల మన్మథ కుమార్ ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఇందుకూరి అశోక్రాజు, శాప్ బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వరరావులు క్రీడాకారులను అభినందించారు. ఈనెల 12 నుంచి విశాఖలో పోటీలు -
సీజీఆర్ఎఫ్కు 43 వినతులు
వీరఘట్టం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు గురువారం వీరఘట్టం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కారించాలంటూ వినియోగదారులు 43 వినతులు అందజేశారు. ● హుస్సేనుపురం, మొట్టవెంకటా పురం, కిమ్మి గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య వేధిస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. ● చిదిమిలో పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, ఇదే ఫీడర్లో ఏబీ స్విచ్లు లేక విద్యుత్ అంతరాయం ఎక్కువ అవుతోందని, వైర్లు పాతబడిపోవడంతో తరుచూ తెగిపోతున్నాయని ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో పరిష్కారం.. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను 60 రోజుల్లో పరిష్కరిస్తామని చైర్మన్ బి.సత్యనారాయణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ఆర్థిక వ్యవహారాల సభ్యుడు ఎస్.సుబ్బారావు, సాంకేతిక నిపుణులు ఎస్.రాజబాబు, ఎన్.మురళీకృష్ణతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కె.మల్లికార్జునరావు, ఈఈ టెక్నికల్ డి.పురుషోత్తం, పాలకొండ డీఈ కె.విష్ణుమూర్తి, ఎ.డి మోహనచక్రవర్తి, వీరఘట్టం ఏఈ కె.అనిల్కుమార్తో పాటు సర్కిల్ పరిధిలో ఉన్న ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినతులకు 60 రోజుల్లో పరిష్కారం సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ చైర్మన్ డాక్టర్ బి.సత్యనారాయణ -
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరం
విజయనగరం టౌన్: కేంద్ర కేబినెట్, రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి ఆరేళ్లు అయినా ఇంతవరకు విశాఖ కేంద్రంగా సౌత్కోస్ట్ రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరమని సౌత్కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చోడవరపు శంకరరావు ఓ ప్రకటనలో అన్నారు. నోటిఫికేషన్ విడుదలైతే రైల్వేజోన్ తన కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ఇప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు. దీంతో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లపై పర్యవేక్షించే అధికారం లేకపోయిందన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని, రైల్వేజోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆగస్టు 15 నాటికి అయినా కొత్త సౌత్కోస్ట్ రైల్వే జోన్ తన పరిపాలన ప్రారంభించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అక్కరకు రాని జీసీపీఎస్..!
● బాలికలకు 20 ఏళ్లు నిండినా అందని డబ్బులు ● వేలాది మంది ఎదురుచూపులు ● ఇద్దరు ఆడపిల్లలు అయితే రూ.60వేలు ఇవ్వాలి ● ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందాలి ● గడువు దాటినా డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్న లబ్ధిదారులువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు జాగరపు వైదేహి. 2002లో జన్మించింది. ఈమెది విజయనగరంలోని బొబ్బాది పేట ప్రాంతం. ఆదిలక్ష్మి, స్వామినాయుడుల ఏకై క సంతానం. ఒక ఆడపిల్లతో వీరు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసుకున్నారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) పథకం కోసం దరఖాస్తు చేయగా వారికి పథకానికి సంబంఽధించిన బాండు కూడా ఇచ్చారు. 20 ఏళ్లు నిండిన తర్వాత ఈమెకు రూ.లక్ష అందాలి. ప్రస్తుతం ఈమెకు 23 ఏళ్లు వచ్చాయి. అయినా డబ్బులు అందలేదు. ఐసీడీఎస్ అధికారులను అడిగినా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని వైదేహి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈమె ఒక్కరే కాదు. అనేక మంది జీసీపీఎస్ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకం కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూస్తున్నారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ఇంకొంతమంది ఆ డబ్బులు వస్తే వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ పథకం కోసం పేదవర్గాలకు చెందిన వారే అధికశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పడు వారంతా పథకం లబ్ధికోసం నిరీక్షిస్తున్నారు. ఆడపిల్లలను కన్నవారిని ప్రోత్సహించడం కోసం బాలికా సంరక్షణ పథకాన్ని అప్పట్లో ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలైతే రూ.60 వేలు (ఒక్కో ఆడపిల్లకు రూ.30 వేలు చొప్పన) బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత అందివ్వాలన్నది పథకం ఉద్దేశ్యం. వేలాది మంది ఎదురుచూపులు: బాలికా సంరక్షణ పథకం నిబంధనల ప్రకారం జిల్లాలో చాలా మంది బాలికలకు 20 ఏళ్లు నిండాయి. వారందరికీ ప్రభుత్వం డబ్బులు అందజేయాలి. 20 ఏళ్లు నిండిన అమ్మాయిల తల్లిదండ్రులు సీడీపీఓ, పీడీ కార్యాలయాల్లో డబ్బుల గురించి అడిగినా అక్కడి అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,980 మంది జీసీపీఎస్ పథకానికి అర్హులున్నారు. వారిలో చాలా మందికి 20 ఏళ్లు నిండాయి. ఒక ఆడపిల్లకు రూ.లక్ష వస్తుందని తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకున్నారు. పేదవారైతే వివాహ ఖర్చులకు సరిపోతాయిని అశించారు. ప్రభుత్వం నోటీసులో ఉంది బాలికా సంరక్షణ పథకానికి సంబంధించి 20 ఏళ్లు దాటిన వారికి డబ్బుల చెల్లింపు విషయం ప్రభుత్వం నోటీసులో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ పథకం అమలైంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై చర్చిస్తున్నాయి. డబ్బుల చెల్లింపునకు సంబంధించి కొంత సమయం లబ్ధిదారులు వేచి ఉండాలి. తవిటినాయుడు, ఇన్చార్జి, పీడీ, ఐసీడీఎస్ పథకానికి అర్హతలు: జీసీపీఎస్ (బాలికా సంరక్షణ పథకం) ఒకరు, లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు అర్హులు. కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ.90 వేల లోపు ఉన్నవారు ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష అందజేస్తారు. ఇద్దరు ఆడపిల్లలైతే రూ. 60 వేలు ఇస్తారు. -
సాలూరులో అగ్నిప్రమాదం
సాలూరు: పట్టణంలోని పెదహరిజనపేటలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీనిపై ఫైర్ అధికారి రాజారావు తెలిపిన వివరాల ప్రకారం, పెదహరిజనపేటలో నివాసముంటున్న బి.సురేష్ ఇంట్లోని మూడవ అంతస్తులో గురువారం సాయంత్రం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న సామగ్రి, విలువైన సర్టిఫికెట్లు తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా. యువకుడి దుర్మరణం●● గిరిప్రదక్షిణ నుంచి వస్తుండగా ప్రమాదం భోగాపురం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరగ్గా ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సింహాచలంలో గిరిప్రదక్షిణకు హాజరూ ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన యువకుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విద్యుత్ పోల్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని మారికవలస గ్రామానికి చెందిన రావాడ ఉదయ్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్పై వెనుక కూర్చున్న స్నేహితుడు చిన్నారావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం తగరపువలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. వసతిగృహం ఆకస్మిక తనిఖీగంట్యాడ: మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువిషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తు సాధించాలని సూచించారు. అ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారి గొర్లె గోవింద సన్యాసిరావు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
డెంకాడ: మండలంలోని విశాఖ–శ్రీకాకుళం జాతీయ రహదారిపై నాతవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న కుప్పిలి కృష్ణ, సవర ముఖలింగం తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్నారని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉండడం వల్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. స్కూటీ ఢీకొట్టి విద్యార్థినికి.. వీరఘట్టం: స్థానిక బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ డేకు వెళ్తున్న 8వ తరగతి విద్యార్థిని కరజాడ లక్ష్మికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి.హైస్కూల్ ఎదురుగా ఉన్న పాన్ షాపు వద్దకు చాకెట్లు కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటి వెళ్తున్న విద్యార్థిని లక్ష్మిని ఎదురుగా స్కూటీతో వచ్చిన ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో లక్ష్మి కుడి కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన లక్ష్మిని 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు బాలికోన్నత పాఠశాలకు వెళ్లి గాయపడిన బాలిక, తల్లిదండ్రుల వివరాలను హెచ్ఎం కేపీ నాగమణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. -
మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ప్రజలకు మరింత చేరువకావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు గురువారం ఒక రోజు వర్క్షాప్, ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం చాలా సులువైనది, ఖర్చులేనిదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనీ మీడియేటర్స్ వచ్చి న్యాయవాదులందరికీ శిక్షణ అందిస్తున్నారన్నారు. ఈ స్టాల్ జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వలంటీర్స్ నిర్వహిస్తున్నారని, వారు ప్రజలకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది ● పేరెంట్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ ఆవేదన ● ఎమ్మెల్యే ‘కళా’ సమక్షంలోనే సమస్యలపై ఏకరువు ● ప్రసంగం ఆపేయాలని బ్రతిమలాడిన ఉపాధ్యాయులు చీపురుపల్లి: మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తరచూ విద్యార్థులు తల్లిదండ్రులే స్వయంగా వచ్చి చెబుతున్నారు. ఇదేదో తాను వ్యక్తిగతంగా చెబుతున్నది కాదు. తల్లిదండ్రులు అంతా చెబుతుండడంతోనే అందరి ఎదుట చెప్పాల్సి వస్తోంది. దయచేసి మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతీసుకునేలా చర్యలు చేపట్టండి. కొంతమంది విద్యార్థులకు బ్యాగులు కూడా ఇవ్వలేదు. పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు కష్టాలు దూరంచేసేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఎదుట సాక్షాత్తూ అదే పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్ ఏకరువు పెట్టారు. పాఠశాలలో సమస్యలు పరిష్కారమవుతాయనే ఎమ్మెల్యే ముందు చెప్పాల్సి వస్తోందని ఆయన చెబుతున్నప్పటికీ పాఠశాల హెచ్ఎంతో సహా కొంతమంది ఉపాధ్యాయులు ప్రసంగం ఆపేయమని పక్క నుంచి షర్టు లాగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సందర్భంలో మధ్యాహ్న భోజనం బాగుందా లేదా తల్లిదండ్రులే చెప్పాలని సురేష్ మైక్లో ప్రశ్నించగా బాగాలేదని తల్లిదండ్రులు నుంచి సమాధానం రావడం ఉపాధ్యాయులకు మరింత ఇబ్బందికరంగా మారింది. కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ రాష్ట్ర డైరెక్టర్ గద్దే బాబూరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దూసుకొచ్చిన మృత్యువు రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నుంచి ముంబయి వైపు పైపుల లోడుతో వెళ్తున్న ఐషర్ వ్యాన్ రణస్థలం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి అవతల వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న ధర్మల పరమేశ్వర రెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న కనకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి స్వగ్రా మం రాజాం. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ వృత్తిరీత్యా పాత్రునివలస, విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఆయనకు భార్య ఇందు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జామి: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మండలంలోని కుమరాం కేజీబీవీలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పేరెంట్, టీచర్, స్టూడెంట్స్ ముఖాముఖిలో ప్రతితరగతి గదికి వెళ్లి మాట్లాడారు. బాలికలు చదువులో చూపుతున్న ప్రతిభను తెలుసుకున్నారు. పిల్లల గ్రేడింగ్ను పరిశీలించి ముచ్చటించారు. బాలికల తల్లిదండ్రులతో కలిసి టాగ్ఆఫ్వార్ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. పాఠశాల ప్రాంగణంలో తల్లిపేరుతో మొక్కలను నాటించారు. కార్యక్రమంలో ఎంఈఓ అప్పలనాయుడు, కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.జ్యోతి, ఎంఈఓ జయశ్రీ, ఎస్ఎంసీ చైర్మన్ బంగారుతల్లి, కుమరాం సర్పంచ్ పిన్నింటి ఆదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కంది పద్మావతి పాల్గొన్నారు. -
పోలీస్ సంక్షేమ పాఠశాలకు వసతి కల్పన
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కంటోన్మెంట్ పోలీస్లైన్స్లో నిర్వహిస్తున్న శార్వాణి పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎస్పీ వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడి పాఠశాలలో తక్కువ ఫీజులకే పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు వెల్లడించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు 682 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనపు తరగతి గదులను శ్రమదానంతో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఎఆర్) జి.నాగేశ్వరరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఆర్ఐ లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్, టి.శ్రీనివాసరావు, హెచ్ఎం సంధ్య పాల్గొన్నారు. నాలుగు అదనపు గదుల నిర్మాణానికి ఎస్పీ వకుల్ జిందల్ శంకుస్థాపన -
ఇసుక అక్రమంగా తరలిస్తే ఊరుకోం
ఇసుక అక్రమ తరలింపును రేగిడి మండలంలోని కొమెర గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. లారీలకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. గదబపేట వద్ద నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేసి ఒక్కోలారీలో 50 టన్నులు తరలించడంతో బ్రిడ్జిలు కూలిపోతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఖండ్యా బ్రిడ్జి కూలిపోయిందని, కొమెర నుంచి లక్ష్మీపురం, అప్పాపురం, మజ్జిరాయుడుపేట వరకు ఉన్న మరో ఐదు బ్రిడ్జిలు కూడా కూలిపోయే దశలో ఉన్నాయన్నారు. ఇసుకను గ్రామాల మీదుగా తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. సమస్యను కలెక్టర్ అంబేడ్కర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. – రేగిడి -
ఆమె వెళ్లారు.. ఆయన వచ్చారు..!
పూసపాటిరేగ: ఇద్దరి రాజకీయనాయకుల మధ్య పంతం... విద్యార్థులనే కాదు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పరీక్షపెట్టింది. ఒకరు వెళ్లాక మరొకరు రావడంతో రెండుసార్లు సమావేశాలు ఏర్పాటుచేసి వారిచ్చే ఉపన్యాసాలను వినాల్సివచ్చింది. ఈ వింత పరిస్థితి పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సతివాడ మోడల్ స్కూల్లో గురువారం నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురైంది. ఉదయం 10.30 గంటలు సమయంలో ఎమ్మెల్యే లోకం నాగమధవి పూసపాటిరేగ ప్రభుత్వజూనియర్ కళాశాలకు వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడారు. 11.30 గంటలకు వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన 10 నిమిషాలకు అంటే 11.40 సమయంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు అదే కళాశాలకు వచ్చారు. మళ్లీ విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆటల పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నెల్లిమర్ల మండలం సతివాడ మోడల్ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇద్దరి నేతల మధ్య ఆదిపత్యపోరులో కొన్నాళ్లుగా అధికారులు నలిగిపోతుండగా, ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు, గురువుల వంతు వచ్చిందంటూ గుసగుసలాడారు. పాలకుల పంతం తల్లిదండ్రులకు పరీక్ష రెండుసార్లు సమావేశం నిర్వహణ పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సతివాడ మోడల్ స్కూల్లో విసిగి పోయిన తల్లిదండ్రులు -
ఒక్కో బెడ్పై ఇద్దరు రోగులకు వైద్యం
● గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో తప్పని అవస్థలు ● జ్వరాల వ్యాప్తితో ఆస్పత్రికి రోగుల తాకిడి గజపతినగరం రూరల్: గతంలో ఎన్నడూ చూడని విధంగా జిల్లాలో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయి. ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి పెరిగింది. ఓపీ పెద్ద సంఖ్యలో నమోదవుతోంది. ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో బెడ్లు చాలడం లేదు. ఒక్కో బెడ్పై ఇద్దరుముగ్గురికి వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో సేవల తీరే నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ బెడ్లు 56 ఉండగా ఇన్పేషెంట్లు 79 మంది ఉన్నారు. చేసేదిలేక ఒక్కో బెడ్పై ఇద్దరిని ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. అందుబాటులోకి రాని భవనం గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి మెంటాడ, దత్తిరాజేరు, బొండపల్లి, గజపతినగరం మండలాల్లోని 120 గ్రామాల ప్రజల వైద్యసేవలకు ఆధారం. దీని ప్రాధాన్యతను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 100 పడకలకు స్థాయి పెంచుతూ రూ.17కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణాన్ని సుమారు 85 శాతం మేర పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆస్పత్రి మిగులు పనులపై శ్రద్ధచూపలేదు. ఫలితం రోగులకు వైద్యకష్టాలు తప్పడంలేదు. వరండాల్లోను, ఒక్కో బెడ్పై ఇద్దరు చొప్పున ఉంటూ వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జీవనరాణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేవరకు రోగులకు ఇబ్బందులు తప్పవన్నారు. -
వ్యవసాయశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం శూన్యమే..
రాజాం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నా ఉత్తరాంధ్ర రైతులకు విత్తన, ఎరువు, సాగునీటి కష్టాలు తప్పడంలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోందని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతులు సుభిక్షంగా ఉన్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక మామిడిపండ్లను రైతులు రోడ్లమీద పడేస్తే ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం మాత్రం రాయితీ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో చెరకు ఫ్యాక్టరీ ఎత్తివేసే పరిస్థితి వస్తే డీఆర్సీ సమావేశంలో నిలదీయడంతో ఆ పరిస్థితి నుంచి తప్పుకుని పత్రికా ప్రకటన చేశారని, కనీసం రైతులును పట్టించుకోని మంత్రి వ్యవసాయశాఖ మంత్రిగా ఉండడం మన దురదృష్టకరమని విమర్శించారు. రెండేళ్లుగా రైతు భరోసా వేయలేని మంత్రి ఏమని ప్రెస్మీట్లు పెడుతున్నారో అర్థంకావడంలేదన్నారు. -
కదంతొక్కిన కార్మిక, కర్షకలోకం
మూడు లాంతర్లు నుంచి ఎంజీ రోడ్డు మీదుగా కార్మికుల ర్యాలీ విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలు కదంతొక్కాయి. నిరసన గళం వినిపించాయి. లేబర్ కోడ్లు రద్దుచేయాలంటూ నినదించాయి. భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. విధులు బహిష్కరించి దేవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బుధవారం భాగస్వాములయ్యాయి. సమ్మెను విజయవంతం చేయడంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, చిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక, రైతు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం బ్యాంకింగ్, కోల్, రైల్వే, పోస్టల్, స్టీల్, బీమా వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం విచారకరమన్నారు. ఇది భవిష్యత్లో నిరుద్యోగితను పెంచుతుందని, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికులకు కనీస దినసరి కూలీ రూ.670గా ఉండాల్సిందేనని ఆర్థికవేత్తల నివేదికలు తేల్చి చెప్పగా.. వాటన్నింటినీ కాదని కనీస వేతనం రూ.178గా నిర్ధారిస్తూ పార్లమెంటులోని పెద్దలందరూ చప్పట్లు కొట్టి చట్టం చేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్మి సుబ్బారావమ్మ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.జగన్మోహన్ రావు, సీపీఎం నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్, జిల్లా రైతు సంఘం కార్మదర్మి బి.రాంబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్మి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, చిరుద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
సచివాలయాల్లో అక్రమ బదిలీలు!
‘ఓ సచివాలయ అగ్రికల్చర్ సెక్రటరీకి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తను కోరుకున్న మెంటాడ మండలంలోని ఓ సచివాలయానికి బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి తొలి బదిలీ జాబితా విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి రిలీవింగ్ తీసుకోవడం ఆలస్యం కావడంతో మంగళవారం వరకు బదిలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించలేదు. ఇంతలోనే మంగళవారం మరో బదిలీ జాబితా వచ్చింది. ఇంకా జాయిన్ అవ్వని మెంటాడ మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయినట్టు ఆదేశాలొచ్చాయి.’ ఇలా జిల్లాలోని 34 మందికి బదిలీ ఆదేశాలొచ్చాయి. వీరంతా బుధవారం కలెక్టరేట్కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేశారు. న్యాయం చేయాలని కోరారు. అనంతరం వ్యవసాయశాఖ జేడీ తారకరామారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. విజయనగరం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీల్లో నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికార పార్టీ జోక్యం మితిమీరింది. ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అధికారులు తలొగ్గుతూ అక్రమ, అకారణ బదిలీల్లో హద్దులు దాటారాని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని 330 మందికి ఇటీవల బదిలీ ప్రక్రియ చేపట్టారు. వీరిలో 34 మంది బదిలీలపై జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిడి పడింది. ఈ ఒత్తిడిని జిల్లా యంత్రాంగం తొలుత పట్టించుకోలేదు. మార్గదర్శకాల మేరకు అర్హులైన వారిని కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తూ తొలి బదిలీ జాబితాను ప్రకటించినట్టు చెబుతున్న అధికారులు, రెండో జాబితా అంటూ విడుదల చేసిన 34 మందికి స్థానచలనానికి స్పష్టత ఇవ్వడం లేదు. అర్హతలేని వారికి బదిలీ ప్రాధాన్యం నిబంధనల మేరకు కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తికాని మెంటాడ మండలంలోకి ఒక డిజిటల్ అసిస్టెంట్కి రాజకీయ ఒత్తిడితో తను కోరుకున్న డెంకాడ మండలానికి అక్రమంగా బదిలీ చేశారు. విజయనగరం మండలం స్పౌజ్ అర్హత ఉన్న మరో డిజిటల్ సెక్రటరీని విజయనగరం మండలం, సమీప మండలానికి వేయకుండా దూర ప్రాంతానికి బదిలీచేస్తూ ఆదేశాలిచ్చారు’. ఇలా సచివాలయ సర్వే, సంక్షేమ, మహిళా పోలీస్ సిబ్బందికి బదిలీల్లో తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం, రెండేళ్లు సేవాకాలాన్ని పూర్తిచేసిన ఉద్యోగులకే బదిలీ అవకాశం ఉండాలి. కొన్నిచోట్ల 1.5 ఏళ్లలోనే కొందరిని బదిలీ చేయడం, మరికొందరు 4 ఏళ్లుగా అదే చోట పనిచేస్తున్నా బదిలీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, కొందరి ఆదేశాలతో సిఫారసుల ఆధారంగా బదిలీలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినతులు పట్టించుకోని అధికారులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ద్వారా ఆప్లై చేసిన తర్వాత సిబ్బంది ఇచ్చిన అభ్యంతరాలను, కుటుంబ పరిస్థితులను, వైద్య సమస్యల ఆధారంగా ఇచ్చిన విజ్ఞప్తులను సంబంధిత శాఖ అధికారులు పెద్దగా పరిగణలోకి తీసుకోవలేదని బాధితులు చెబుతున్నారు. ‘తమ కుంటుంబ పరిస్థితులే కాదు పిల్లల చదువులు, సంరక్షణతోపాటు ఆరోగ్య సమస్యలను కూడా అధికారులు పట్టించుకోలేదని’ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. నిబంధనలకు పాతర రెండురోజుల్లో రెండో బదిలీ జాబితా విడుదల ఇంకా జాయిన్ అవ్వని స్థానం నుంచి బదిలీ ఆర్డర్లు అర్హత లేని వారికి బదిలీలో ప్రాధాన్యం ఆందోళనలో ఉద్యోగులు మహళా పోలీసుల ఆందోళన సచివాలయాల పరిధిలోని 600 మంది మహిళా సంరక్షణ పోలీసులకు బదిలీ ప్రక్రియలో స్థాన చలనం కలిగింది. వీరిలో 300 మంది వరకు మిగులు పోస్టులు కావడంతో డిప్యుటేషన్పై వేరొక శాఖకు పంపే ఆదేశాలిచ్చారు. మరోవైపు స్పౌజ్ అభ్యర్థులు 150 మంది వరకు ఉండడంతో మిగిలిన వారికి దూరప్రాంతాలకు బదిలీలు జరిగాయి. డిప్యుటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఏపీ విలేజ్ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీసు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహిళా పోలీసులు కలెక్టరేట్కు వచ్చి నిరసన చేపట్టారు. అనంతరం డీఆర్వోకు వినితిపత్రం అందజేశారు. -
డిమాండ్లు ఇవీ..
● నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దుచేయాలి. ● అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి. ● బ్యాంకులు, బీమా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయడాన్ని నిలువరించాలి. ● ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటరీ, వీఏవో, ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● కాంట్రాక్టు, పొరుగు సేవల సిబ్బందిని పర్మినెంటు చేయాలి. ● ఆటో, మోటారు, ముఠా కలాసీలు, భవన నిర్మాణ కార్మికులు, చిల్లర వర్తకులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సమగ్ర పథకాలు అందించాలి. ● మోటారు సవరణ చట్టం 2019ని రద్దు చేయాలి. బీఈపీఎస్ కనీస పింఛన్ రూ.9వేలు ఇవ్వాలి. ● స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ● కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయాలి. -
3250 రేజీల రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు: పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పెదబజార్లో గల బుద్దెపు సురేష్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బియ్యం బస్తాల్లో సుమారు 3,250 కేజీల రేషన్ బియ్యం పట్టుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు ఈ బియ్యం కొని, బయట ఎక్కువ ధరకు అమ్ముతానని నిందితుడు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. పట్టుకున్న బియ్యాన్ని పట్టణ సివిల్సప్లయిస్ అధికారులకు తదుపరిచర్యల నిమిత్తం అప్పగించామని తెలిపారు. -
మత్స్యకారుల హాహాకారాలు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు గుర్రపుడెక్క మధ్యలో బుధవారం చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు పోలీసులు, మత్స్యకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెట్టమగ్గూరు గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు దాసరి రాములు, దాసరి ఆదినారాయణ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేపలు వేటకు వెళ్లారు. ప్రాజెక్టులో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క వీరిని చుట్టుముట్టడంతో పడవ ముందుకు సాగని పరిస్థితి. తండ్రీ కొడుకులు అందులో చిక్కుకోవడంతో తమను రక్షించాలంటూ ప్రాజెక్టు లోపలి భాగం నుంచి కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వంగర పోలీసులు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న పట్టువర్థనం గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులు, మగ్గూరు గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులను ఆరు పడవలతో ప్రాజెక్టు లోపలకు పంపించారు. కటిక చీకటి కావడంతో గుర్రపుడెక్కను తొలగించుకుంటూ వారి వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో అష్టకష్టాలు పడ్డారు. బాధితుల కేకలు వినిపిస్తున్నప్పటికీ దట్టంగా అల్లుకున్న గుర్రుపుడెక్క కారణంగా వారి వద్దకు చేరుకునే పరిస్థితి కానరావడం లేదు. రాత్రి వరకు శ్రమించినప్పటికీ కటిక చీకటి కావడంతో పాజెక్టులో చిక్కుకున్నవారిని చేరుకునేందుకు తోటి మత్స్యకారులకు వీలు పడలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి వారిని బయటకు తీసుకువస్తామంటూ బాధిత కుటుంబీకులకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. మత్స్యకారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలని రాములు కుటుంబ సభ్యులు గంగమ్మతల్లిని ప్రార్థిస్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న మత్స్యకారులు కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, మత్స్యకారులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు -
ఉత్తరాంధ్ర కీర్తిని నిలిపిన నేత
● జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ‘బొత్స’ ● ఘనంగా బొత్స జన్మదిన వేడుకలుచీపురుపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు దక్కిందని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఉత్తరాంధ్ర పేరు చెబితే బొత్స గుర్తుకొచ్చే విధంగా పరిపాలన సాగించారని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ కల్యాణ మంటపంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం హ్యాపీ బర్త్డే బొత్స అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బొత్స నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడాలన్నారు. మెడికల్ క్యాంప్లో 350 మందికి వైద్య పరీక్షలు ఇదిలా ఉండగా ‘బొత్స’ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. శ్రీకాకుళానికి చెందిన జెమ్స్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 350 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించారు. బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టించి, ప్రభుత్వ రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు ఎస్వీ.రమణరాజు, కేవీ.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, రాష్ట్ర రైతు విభాగం కాార్యదర్శి దన్నాన జనార్దనరావు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
రూ.3 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 శ్రీ170విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 3పై ఓ వ్యక్తి నుంచి వెండి ఆభరణాలను జీఆర్పీ సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సోం పేటకు చెందిన ప్రవీణ్ సింగ్ ఒక బ్యాగ్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పది కేజీల వెండి ఆభరణాలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందగా శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చే రైలులో దిగిన ప్రవీణ్ను పట్టుకుని విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో తమదైన శైలిలో విచారణ చేసి రవాణా చేస్తున్న ఆభరణాలకు ఎలాంటి రుసుము, ఆధారాలు లేకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోంపేటకు చెందిన వ్యక్తి అరెస్ట్ -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
● మరొకరికి గాయాలు భామిని: మండలంలోని డోకుల గూడకు చెందిన గిరిజనుడు కొండగొర్రి నాగేష్(49)బుధవారం బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. భామిని నుంచి డోకులగూడవైపు వెళ్తుండగా ఏబీ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడని బత్తిలి పోలీసులు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని నేలమానుగూడలో అత్తవారింటికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో యువకుడు బిడ్డిక సంజీవ్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. భామిని పీహెచ్సీలో ప్రాథమిక వైద్య సేవలు అందించి 108 అంబులెన్స్పై పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యజియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ గ్రామానికి చెందిన గుగ్గిలాపు శంకరరావు(26) బుధవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో విశాఖపట్నంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలం క్రితం శంకరరావు తన భార్య హేమతో కలిసి విశాఖపట్నానికి బతుకు తెరువు కోసం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయితే శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మృతుడికి ఇద్దరు పిల్లలు, తండ్రి రామిశెట్టి, తల్లి సావిత్రమ్మ, అక్క, అన్నయ్య ఉన్నారు. ఉరివేసుకుని మరో వ్యక్తి.. భోగాపురం: మండలంలోని దల్లిపేట గ్రామంలో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దల్లి అప్పలరెడ్డి(38)కి వివాహమై సుమారు 15 ఏళ్లు అవుతోంది. భార్య ఎర్రమ్మ, ఒక పాప ఉన్నారు. మద్యానికి బానిసైన అప్పలరెడ్డి నిత్యం మద్యం తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్య ఎర్రమ్మ మందలించడంతో మనస్తాపం చెంది సమీపంలోని ఓ లే అవుట్లో బుధవారం చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోరపాడు సమీపంలోనే ఏనుగులుసీతంపేట: గడిచిన వారం రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు గోరపాడు సమీపంలో తిష్టవేసింది. దీంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొండపోడు వ్యవసాయంలో పండిస్తున్న పైనాపిల్ పండ్లను ఏనుగులు తినేస్తున్నాయని వాపోతున్నారు. పోడు పనులకు సైతం అటువైపు వెళ్లడం లేదని గిరిజనులు తెలిపారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఏనుగులు తిరిగే వైపు వెళ్లవద్దని గిరిజన రైతులకు సూచిస్తున్నారు. -
పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే పనులు
కూటమి ప్రభుత్వంలో సరిపడా నిధులు వస్తేనే 2026 చివరికై నా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురాగలం. ఈ ప్రాజెక్టు ద్వారానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరందించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం రూ.804 కోట్లకు పెరగడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏ కోశానా సరిపడవు. పై మొత్తం నిధులు విడుదలైతేనే 2026 డిసెంబర్ నాటికి విజయనగరం పట్టణానికి, భోగాపురం విమానాశ్రయానికే కాకుండా సుమారు 20 వేల ఎకరాలకు కూడా నీరందించగలం. – అప్పలనాయుడు, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఈఈవిజయనగరం గంటస్తంభం: రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రాజెక్టు తారకరామ తీర్థసాగర్. 2005 ఫిబ్రవరి 19న ప్రారంభించిన ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచనా వ్యయం పెరుగుతోందే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబునాయుడు ఏనాడూ ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత వైఎస్ జగమోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్లో మిగిలిన పనులను రూ.150.24 కోట్లతో పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో గల 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. భూసేకరణే అసలు సమస్య.. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన 3497.58 ఎకరాల భూమికిగాను 3278.32 ఎకరాలను సేకరించారు. మిగతా 219.26 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కుమిలి రిజర్వాయర్ ప్రాజెక్టులో కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 2,219 కుటుంబాలకు పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం తాజాగా కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది. తాడిపల్లి, కుదిపి, నీలంరాజు పేట గ్రామాల నిర్వాసితులకు పరిహారానికి రూ.75.69 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్కు తాగునీరు సరఫరా అవకాశం కుదురుతుంది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ప్రాజెక్టు కీలకం విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారు 20వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరం. ప్రాజెక్టుకు అరకొరగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. మరి 2026 నాటికల్లా నీరు రాకుండా ఉంటే తాగునీరు సమస్య, అటు పారిశ్రామిక, విమానాశ్రయానికి నీరు లేక వెలవెలబోతుంది. ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఎయిర్పోర్టు అవసరాలకు తాగునీరు, వాడుక నీరు ప్రధానం కావున ఇందుకోసం తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం ఇలా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్కు 27 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇక్కడి నుంచి కుమిలి చానల్ సిస్టం పరిధిలోని 8,172 ఎకరాలను స్ధిరీకరించడంతో పాటు కొత్తగా 16,538 ఎకరాలకు సాగునీందించాలి. వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రాజెక్టు పనులు పట్టించుకోలేదు. 2014 నుంచి 2019 మధ్య పాలన సాగించిన చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనుల ఊసెత్తలేదు. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీ నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేశారు. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు పెడింగ్లో ఉన్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్ను తొలగించి, పనులను మరో కాంట్రాక్టర్కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ మేరకు ప్రతిపాదనలను జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపారు. -
కేజీబీవీలో అగ్నిప్రమాదంపై ఫైర్ ఆడిట్
● విద్యార్థులు ఆందోళన చెందొద్దు ● సోమవారానికి పూర్తిస్థాయిలో తరగతుల ప్రారంభం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● కేజీబీవీని సందర్శించి దుర్ఘటనపై ఆరాకొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై వెంటనే ఫైర్ ఆడిట్ నిర్వహించి, సాయంత్రం లోగా నివేదికను అందజేయాలని కలెక్టర్ డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విద్యుత్, సమగ్రశిక్ష ఇంజినీర్ అదికారులు, జిల్లా ఫైర్ అధికారులను ఆదేశించారు. కేజీబీవీలోని తరగతి గదుల్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కాలిపోయిన తరగతి గదులను, సామగ్రి, చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఉన్న విద్యార్థులకే వసతి సౌకర్యం లేక, తరగతి గదుల్లోనే భోజనం, పడుకోవడం వంటివి చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ తరగతులకు అనుమతులు ఎలా ఇచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడిని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలకు ప్లస్ టూ అనుమతులు ఇచ్చామని ఆయన బదులిఇచ్చారు. దీంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యథావిధిగా మెగా పేరెంట్స్, టీచర్ సమావేశంఅనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలనుంచి వెళ్లిపోయిన విద్యార్థులను వెంటనే రప్పించి తరగతులను యథావిధిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాలలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని విద్యార్థులందరూ పాఠశాలకు తిరిగి రావాలని కోరారు. గురువారం జరిగే మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు.సోమవారం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులను పాఠశాలకు రప్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని ప్రస్తుతం పనులను సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రామారావు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డి.కీర్తి, విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, జిల్లా ఫైర్ అధికారి రామ్కుమార్, ఎస్ఎస్ఏ ఈఈ హరిప్రసాద్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ స్వప్ప, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ రమణయ్య, ఎంఈఓలు శ్రీదేవి, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి, పోక్సో కేసులపై దృష్టి పెట్టండి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఆదేశాలువిజయనగరం క్రైమ్: పెరుగుతున్న గంజాయి కేసుల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, మూడు డివిజన్ల అధికారులతో ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, ఎన్డీపీఎన్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులను, లాంగ్ పెండింగ్ కేసులను ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని ఇందుకు శక్తి టీమ్స్ మరింత విస్తృతంగా పని చేయాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్సు టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలి మహిళలపై జరిగే అఘాయిత్యాలపై పోలీస్స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, స్టేషన్లో ఫిర్యాదుదారులు వేచి ఉండకుండా చూడాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. అనంతరం పలు కేసుల్లో శాఖాపరంగా ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28న మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్
విజయనగరం: కళలకు కాణాచి, విద్యలనగరం, క్రీడలకు పుట్టినిల్లు విజయనగరంలో ఈనెల 28న మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నిర్వాహకుడు కనకల కృష్ణ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కనకల ఎర్రయ్య మెమోరియల్ క్లాసిక్ క్లబ్ నేతృత్వంలో 8 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ.1.20 లక్షల మొత్తాన్ని నగదు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నిర్వహించిన పోటీల్లో 184 మంది పాల్గొన్నారని, ఈ ఏడాది నిర్వహించే పోటీల్లో 200మందికి పైగా వాయ్యామ సాధకులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే వారికి ఉచితంగా భోజన వసతిసదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభినవ భీముడు కోడి రామమూర్తి, నాగమళ్ల పైడిరాజుల స్ఫూర్తితో నిర్వహించే కార్యక్రమంలో క్రీడాభిమానులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరాడ శ్రీనివాసరావు, కోట్ల రమేష్, వంశీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
14న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా
విజయనగరం అర్బన్: ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా (పీఎంఎన్ఏఎం)ను ఐటీఐ విద్యార్థులకు ఈ నెల 14న స్థానిక ఐటీఐ ప్రాంగణంలో నిర్వహిస్తామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, అప్రెంటిస్ అడ్వైజర్ వీవీగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అఽభ్యర్థులకు అప్రెంటిస్ ఇవ్వడానికి ఈస్ట్కోస్ట్ రైల్వేతోపాటు ప్రైవేట్ రంగానికి చెందిన జయభేరి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, భగవతి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూసివ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సాంసంగ్ ఆథరైజ్ సర్వీస్, నవదీప్ ఎలక్ట్రానిక్స్, బోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్బీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, విజయనగర్ బయోటెక్ తదితర ప్రముఖ కంపెనీలు ఎంపిక చేస్తాయని తెలిపారు. ఎంపికై న వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైపెండ్ చెల్లించనున్నట్లు జిల్లా కన్వీనర్ తెలియజేశారు. ఆసక్తిగల అఽభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, రెండు ఫొటోస్తో పాటు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు. పూర్తి వివరాల కోసం పోన్ 9441518355, 9849944654 నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. పేర్లను నమోదు చేసుకోవడానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. -
ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.300 కోట్లు
రామభద్రపురం: జిల్లాలో ఈ ఖరీఫ్లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సుమారు రూ.300 కోట్లు వ్యవపాయ రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని డీసీసీబీ బ్రాంచ్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు ఇప్పటి వరకు రూ.80 కోట్లు వ్యవసాయ రుణాలు అందజేశామన్నారు.జిల్లా సహకార బ్యాంకు ద్వారా రూ.2000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని,ఇందులో రూ.1700 కోట్ల వరకు ఆప్కాబ్లో అప్పుతేగా రూ.300 కోట్లు బ్యాంకువని చెప్పారు. వినియోగదారులకు సేవందించడంలోను, డిపాజిట్స్ పెంచడంలోనూ ఎస్బీఐ, ఏపీజీవీవీ యూనియన్ బ్యాంకులతో పోటీ పడేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న 24 సహకార సంఘాలను మోడరైజేషన్ చేస్తున్నామన్నారు. త్వరలో సహకార సంఘాలకు యూరియా సరఫరా అవుతుందని, ఈ ఏడాది రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జి.చంద్రమోహననాయుడు తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున -
పీఏసీఎస్లకు అనధికారిక పీఐసీ కమిటీలు
విజయనగరం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లకు ఇంతవరకు ఉన్న అధికారిక పీఐసీ (పర్సనల్ ఇన్చార్జ్ కమిటీ)ల స్థానంలో అనధికారిక పీఐసీ కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు జూలై 30, 2025 వరకు, లేదంటే ఎన్నికలు నిర్వహించేవరకు వర్తించనున్నాయని తెలిపింది. చైర్పర్సన్, ఇద్దరు పర్సన్ సభ్యులతో కమిటీని ప్రకటించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 94 పీఏసీఎస్లు ఉన్నప్పటికీ 19 పీఏసీఎస్లకు మాత్రమే కమిటీలను ప్రకటించారు. విజయనగరం జిల్లాలో 12 పీఏసీఎస్లలో గజపతినగరం, సంతకవిటి, సంకిలి, బొబ్బిలి, కారాడ, కోమటిపల్లి, పాల్తేరు, నందిగాం, కొత్తరేగ, రామభద్రపురం, మెంటాడ, జక్కువ, పార్వతీపురం మన్యం జిల్లాలో 7 పీఏసీఎస్లలో బీజేపురం, కొమరాడ, శివిని, కురుపాం, శివరాంపురం, పెదపదం, ఎం.మామిడిపల్లి ఉన్నాయి. మత్తుపదార్థాలు విక్రయిస్తే చర్యలు విజయనగరం క్రైమ్: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో పలు విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, కిరాణ షాపుల్లో మంగళవారం తనిఖీలు జరిపారు. వ్యాపారులు విజ్ఞతతో వ్యవహరించాలని, విద్యార్థుల భవిష్యత్తును నాశనంచేసే విక్రయాలకు స్వస్తి పలకాలన్నారు. ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్ఐలు ప్రసన్నకుమార్, రామగ ణేష్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు. ● జీఓ విడుదల చేసిన వ్యవసాయ సహకార శాఖ విజయనగరంలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ -
పేదల గొంతుక వైఎస్సార్సీపీ
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుమంత్రి ప్రకటించుకున్నారని ఏడాదిలోనే ఎలా ధనికులయ్యారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెబితే వారు కూడా బాగుపడతారని ఎద్దేవా చేశారు. వైస్సార్సీపీలో రానున్న రోజుల్లో కార్యకర్తలే రథసారథులవుతారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హైమావతి, జీసీసీ మాజీ చైర్మన్ స్వాతిరాణి, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నోరు విప్పలేని దుస్థితి కూటమి ఏడాది పాలనలో అన్యాయంపై ప్రజలు నోరు విప్పలేని పరిస్థితి ఉందని ఎస్.కోట నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సూపర్ సిక్స్, ష్యూరిటీ బాండ్లు అన్ని మోసం అని పేర్కొన్నారు. జూన్ 4న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల్లో వచ్చిన స్పందనే కూటమిపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. క్యాలెండర్ ప్రకారం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించేందుకు మనమంతా ఐదు వారాలు పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సి ఉందన్నారు. శృంగవరపుకోట: పేదవాడి గొంతుక, శ్వాసే వైఎస్సార్సీపీ అని, అధికారంలో ఉంటే ప్రజల కోసం... ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరఫున పని చేస్తుందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా జిల్లా నాయకత్వం వెన్నంటి ఉంటుందని, కూటమి చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్.కోటలోని ఎరుకమ్మ పేరంటాలు కల్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి సర్కారు ప్రజలను ఎలా మోసం చేస్తోందో తెలియజేసేందుకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఐదు వారాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించామన్నారు. సూపర్ సిక్స్ ఉత్తిదేనని తేలిపోయిందని ప్రజలు గుర్తించారన్నారు. కూటమి నేతల మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం, 50 ఏళ్లకే పింఛన్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి అన్ని ఉత్తివేనని తేలిపోయిందని ధ్వజమెత్తారు. పచ్చ మీడియా ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని కానీ వాస్తవాలు ప్రజలు గుర్తించారని అన్నారు. మన చేతుల్లో ఉన్న ఫోనే మనకు ఆధారం, సోషల్ మీడియానే మనకు అండ అని చెప్పారు. జిల్లా మంత్రి మాటలు నీటి మూటలని ప్రజలు గుర్తించారన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గత మూడు ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారని, ఆయన హయాంలోనే జిల్లాలో గ్రామీణ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, శారడా, మహామయ వంటి కంపెనీలు, భోగాపురం ఎయిర్పోర్టు వచ్చాయని జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ మంత్రి జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ప్రతిపాదనే లేదని, తాటిపూడి నీటి ప్రస్తావన ఎందుకంటున్నారని మోసపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన శాఖలో ఎం జరుగుతుందో మంత్రికే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తాను ధనికుడని ఇటీవల -
హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూత’
విజయనగరం క్రైమ్: పోలీసు శాఖలో హెూంగార్డుగా విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పని చేసి, ఇటీవల కార్డియాక్ సమస్యతో మరణించిన శ్రీనివాస్ కుటుంబానికి చేయూత’ పేరుతో రూ.3,23,050 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం మృతుడి కుటుంబసభ్యులకు అందజేశారు. హోంగార్డు సిబ్బంది మొత్తం పోగుచేసిన ఒకరోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసినా లేదా ప్రమాదవశాత్తు కానీ ఆకస్మికంగా, అనారోగ్యంతో మరణించిన హెూంగార్డు కుటుంబాలు ఇంటి యజమానిని కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయిన నష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు హెూంగార్డ్స్ అందరూ స్వచ్ఛందంగా ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు. హోం గార్డు మరణానంతరం ఆయన కుమారుడిని హెూంగార్డుగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హెూంగార్డ్స్’ ఇన్చార్జ్ ఆర్.రమేష్ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీస్కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొట్టిశలో ఎకై ్సజ్ శాఖ దాడులు
వంగర: మండల పరిధి కొట్టిశ గ్రామంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రాజాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ ఆర్.జైభీమ్ ఆధ్వర్యంలో మంగళవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అమరాన వెంకటరావు, కల్లూరి గవరయ్య, నూరి పోలిరాజుల నుంచి 29 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సబ్ జైల్ ఆకస్మిక తనిఖీవిజయనగరం లీగల్: విజయనగరం సబ్ జైల్ను జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధికారి ఎ.కృష్ణప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల తోటి ఖైదీలు గానీ, సిబ్బంది గానీ ఎటువంటి వివక్ష చూపించ రాదన్నారు. జైలు క్లినిక్లను సందర్శించే న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు నిర్వహిస్తున్న విధుల పట్ల ఆరా తీశారు. జైల్లో ఉన్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక తనిఖీలో సబ్ జైల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీగా సావిత్రివిజయనగరం టౌన్: డీఆర్డీఏ, వెలుగు ఇన్చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కె.సావిత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఇక్కడ పీడీగా పనిచేసిన కల్యాణ్ చక్రవర్తి సెర్ప్ డైరెక్టర్గా బదిలీ అవడంతో, ఏపీడీ సావిత్రికి పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా అధికారులను, సిబ్బందిని కోరారు. సమష్టిగా పనిచేసి పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కశ్మీరీ పండిట్ గలాటా..!విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కశ్మీరీ పండిట్ మరోసారి స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని పద్మావతి నగర్లో ఉంటున్న కశ్మీరీ పండిట్ తన ఇంటి సమీపంలో అక్రమంగా గోవులను పెంచడం వాటి సంరక్షణపై నిర్లక్ష్యం వహించడాన్ని స్థానికులు, చుట్టు పక్కల వారు ప్రశ్నించిన పాపానికి వారిపైనే తిరిగి దాడులకు దిగాడు. దీంతో వారిలో కొందరు డయల్ 100కు కాల్ చేయగా మరి కొందరు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుటాహుటిన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఈ తరహాలోనే పశువులను అన్యాయంగా తన జాగాలోనే బంధించి చిత్ర వధ చేశాడని స్థానికులు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ కశ్మీరీ పండిట్ నేరుగా సీఐతో కూడా గలాటాకు దిగడంతో కేసు నమోదుకు సిద్ధపడ్డారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాస్ను వివరణ కోరాగా సదరు కశ్మీర్ పండిట్ పిచ్చోడిగా కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. చెక్బౌన్స్ కేసులో దంపతులకు జైలుశిక్షగజపతినగరం రూరల్: సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించక పోవడంతో చెక్ బౌన్స్ కేసులో దంపతులకు జైలుశిక్ష విధించినట్లు గజపతినగరం జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎ.విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురిటిపెంట గ్రామానికి చెందిన గణరాజు అప్పలనరసింహరాజు, జ్యోతి దంపతుల దగ్గర లవుడు అప్పలనాయుడు, లక్ష్మి దంపతులు అవసరం నిమిత్తం కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్ము తిరిగి చెల్లించక పోవడంతో చెక్బౌన్స్ కేసు ద్వారా అప్పలనాయుడికి రెండేళ్లు, లక్ష్మికి ఏడాది జైలుశిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. నగలు, నగదు చోరీపై ఫిర్యాదుపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో చెరువు గట్టు వీధిలో నివాసం ఉంటున్న పిల్లి రాము ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం పట్టణ పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తన రోజువారీ పనుల నిమిత్తం చంటి బయటకు వెళ్లగా తిరిగి వచ్చి చూసేసరికి వేసిన తాళం వేసినట్లు ఉండి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లు పిల్లి రాము గుర్తించారు. ఈ చోరీలో ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.12 వేల నగదు అపహరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
డిపార్ట్మెంట్ ఆప్షన్ లేకుండా బదిలీలా?
బొబ్బిలి: మాకు అన్యాయంగా బదిలీలు, డిప్యుటేషన్లు చేస్తున్నారు. కనీసం డిపార్ట్మెంట్ ఆప్షన్లేకుండా సీనియారిటీ లిస్ట్, ప్రమోషన్ చానల్, పేస్కేల్ లేకుండా రేషనలైజేషన్, ట్రాన్స్ఫర్లు చేయడంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని సచివాలయ మహిళా పోలీసులు హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి ఆవేదన వెళ్లగక్కారు. బొబ్బిలి కోటలో అనితకు వినతి పత్రం అందజేశారు. చాలా మంది చంటి పిల్లలు, పేదరికం వంటి కారణాలతో బదిలీ స్థానాలకు వెళ్లలేక ఉద్యోగాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారన్నారు. బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. సమస్యపై మంత్రి పరిశీలిస్తామన్నారే తప్ప స్పష్టత ఇవ్వలేదంటూ పలువురు వాపోయారు. ● పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఎంపిక చేసిన ఇళ్లకు వెళ్లి కార్యక్రమాన్ని మమ అనిపించారు. హోం మంత్రి వద్ద ఆవేదన వెళ్లగక్కిన మహిళా పోలీసులు -
ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
వంగర: మండల పరిధి మగ్గూరు–మడ్డువలస రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం కొప్పర నుంచి రాజాం మీదుగా పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మగ్గూరు దాటిన తరువాత వెనుక టైరు పంక్చర్ అయి పేలిపోయింది. వెనుక భాగంలో ఉన్న రెండు టైర్లలో ఒక టైరు రోడ్డు వెలుపలికి రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఏ ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఆ సమయంలో సుమారు 50 మంది వరకు ప్రయాణికులున్నారు. -
యుద్ధప్రాతిపదికన సీసీఆర్సీ పంపిణీ జరగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీసీఆర్ కార్డుల పంపిణీ జరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సొంత భూమిలేని కాలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే రెవెన్యూ శాఖ జారీచేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ కార్డులు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేసుకునే అవకాశం ఉందని, పంట నమోదు ఆధారంగా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఇతర వ్యవసాయ పథకాలు అమలవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీసీఆర్ కార్డుల పంపిణీ త్వరగా పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా త్రైమాసికానికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికపుడు తన కు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామ వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఏవీ సాల్మన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి యు.చాందిని, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘హిట్ అండ్ రన్’ వాహనాలను వెంటనే గుర్తించాలి
● ఎస్పీ ఆదేశాలువిజయనగరం క్రైమ్: హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనాలను వెంటనే గుర్తించాలని నమోదైన కేసుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న ’హిట్ అండ్ రన్, గుర్తు తెలియని మృతదేహాల కేసులను ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాన్ని సాధ్యమైనంత వేగంగా గుర్తించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. నేర స్ధలం నుంచి వాహనం వెళ్లే మార్గంలోగల అన్ని సీసీ కెమెరాలను, ఫుటేజులను, టోల్ గేట్స్ రికార్డులను పరిశీలించాలని సూచించారు. కేసుల్లో దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు కేసు డైరీల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఎస్.శ్రీనివాస్, ఎల్.అప్పలనాయుడు, బి.సుధాకర్, వివిధ పోలీసు స్టేషన్ల చెందిన పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని దివ్యాంగుడి మృతి
దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్ స్టేషన్ పరిధి కుంటినవలస రోడ్డులో ఎదురుగా వస్తున్న మూడు చక్రాల వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కుంటినవలస గ్రామానికి చెందిన దివ్యాంగుడు జక్కు సత్యం(69)తలకు తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మెంటాడ మండలం కుంటినవలస గ్రామానికి చెందిన సత్యం దివ్యాంగుడు కావడంతో సోమవారం సాయంత్రం మూడు చక్రాల వాహనంపై మరడాం వచ్చి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా కుంటినవలస నుంచి ద్విచక్ర వాహనంపై మరడాం వస్తున్న వ్యక్తి ఢీకొనడంతో ప్రమాదం జరిగి మృతి చెందినట్లు తెలిపారు. బొలెరో ఢీకొని యువకుడు.. రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస కోల్డ్స్టోరేజ్ సమీపంలో మంగళవారం ఓ బైక్ను ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాచిపెంట గ్రామానికి చెందిన పడాల సంతోష్(24) ద్విచక్రవాహనంపై రామభద్రపురం మీదుగా దత్తిరాజేరు మండలంలోని కృష్ణాపురం తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. సరిగ్గా ముచ్చర్లవలస కోల్డ్స్టోరేజ్ వద్దకు వచ్చేసరికి విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టడంతో సంతోష్ అక్కడక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సంతోష్ విశాఖపట్నంలోని గీతం వైద్యకళాశాలలో పనిచేస్తున్నాడు. -
ఎమ్మెల్యే అదితి పరువును ఫ్లెక్సీకి ఎక్కించి.. కార్యకర్త వినూత్న నిరసన
రాజా సాహెబ్ గారి బిడ్డ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆమె దృష్టిలో పడడమే గొప్ప.. ఆమెతో ఫోటో దిగడమే మహా అదృష్టం.. ఆమెను ఏదైనా ప్రోగ్రాముకు పిలిస్తే ఆమె వచ్చి కొన్ని క్షణాలు అక్కడ నిలబడితే జీవితం ధన్యమైనట్లు భావిస్తున్న రోజులివి. అలాంటి కాలంలో ఒక చిన్న కార్యకర్త.. పేరు ఊరులేని సాధారణ క్యాడర్ ఏకంగా ఫ్లెక్సీ సాక్ష్యంగా ఎమ్మెల్యే పరువును నడిరోడ్డుమీద నిలబెట్టేశాడు.ఎమ్మెల్యే గారు.. మీరు గెలిచి ఏడాది దాటింది.. ఇంతకూ మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పండి.. అసలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ ఇదిగో చూడండి అంటూ ఎండగట్టేసాడు. మీ పనితీరు ఏం బాలేదు.. మీ ప్రోగ్రెస్ కార్డులో సున్నా మార్కులు వేస్తున్నా అంటూ బెత్తంతో కొట్టినట్లు చెప్పాడు. ఈ అంశం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది.తెలుగుదేశం సీనియర్ నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన అశోక్ గజపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విజయనగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం అయితే గెలిచారు కానీ ఆమెకు పట్టణం మీద గ్రామీణ నియోజకవర్గ మీద ఎలాంటి పట్టులేదు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్లడం ఫోటోలు దిగి రావడం మినహా పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఆమెకు ఆమె తండ్రికి మంచి పలుకుబడి ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి కోసం ఆమె ఏమీ చేయడం లేదన్నది ప్రజలకు అర్థమైంది. దీంతోపాటు కార్యకర్తల విషయంలో కూడా ఆమె పెద్దగా ఆసక్తికరంగా లేరని వారి భావన.అయినా సరే అశోక్ గజపతిని, ఆయన కుమార్తె అదితి గజపతిని ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేరు. కానీ విజయనగరానికి చెందిన 28వ డివిజన్ కార్యకర్త తీగల ఆనందరావు అదితి గజపతి పరుగును ఫ్లెక్సీకి ఎక్కించాడు. రాజీవ్ నగర్ కాలనీలో మీరు చేయాల్సిన పనులు లిస్ట్ ఇది.. మీరు గెలిచి ఇన్నాళ్లు అయింది ఏ ఒక్క పని అయినా చేశారా?. దీని కోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ ఆయన పనుల జాబితాతో పాటు ప్రశ్నల పరంపరతో అదితిపై విరుచుకుపడ్డారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ తమ నాయకురాలు అసమర్థతను వీధిలో నిలబెట్టారు. అదితి విధేయులకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ప్రజలు.. ఇతర కార్యకర్తలకు మాత్రం ఆనందరావు హీరోలా కనిపించాడు. ఎవరు ప్రశ్నించకపోయినా ఆయన మాత్రం గొంతు ఎత్తాడు.. అదితి పరువు నడివీధిలో నిలబెట్టారు అంటూ లోలోన సంబరపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
మా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు.. కలెక్టర్కు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
సాక్షి, విజయనగరం అర్బన్: ఏపీలో కూటమి పాలనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు బిగ్ షాక్ తగిలింది. వారి పాలన బాగాలేదంటూ నగరంలోని 28వ వార్డు రాజీవ్నగర్ కాలనీ టీడీపీ సీనియర్ కార్యకర్త తీగల ఆనందరావు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సమస్యలపై ఏడాదిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదన్నారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు మరమ్మతులు చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, సచివాలయ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మించాలని, ప్రభుత్వాసుపత్రి నిర్వహణపై దృష్టిసారించాలని, పార్కులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు అమర్చాలని, రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. అందుకే, తమ కాలనీ సమస్యలను బ్యానర్ రూపంలో ప్రదర్శిస్తూ కలెక్టర్కు విన్నవించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. -
భరతనాట్యంలో కొత్తవలస విద్యార్థినుల ప్రతిభ
కొత్తవలస: మండల కేంద్రంలోని శివశక్తి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అకాడమికీ చెందిన జి.తపస్వి, కె.ధన్విక, జి.ఊర్వజ ఈ నెల 5న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో నటరాజ నర్తనయజ్ఞంలో భాగంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రదర్శనలో మూడు వేల మంది విద్యార్థులు 27 నిమిషాల 31 సెకెన్ల పాటు నృత్యం చేసి ప్రపంచ రికార్డు నమోదు చేశారని మాస్టర్ కేఏ రాజు తెలిపారు. విద్యార్థినులు పలువురు అభినందించారు. పీడీఎస్ బియ్యం పట్టివేత జామి: మండలంలోని భీమసింగి వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను విజిలెన్స్, సీఎస్డీటీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వాకచర్ల నరేష్ అనే వ్యక్తి మీసాల నాయుడు ఆటోలో బియ్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అధికారులు ఆటో సీజ్ చేసి 856 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నరేష్, నాయుడులపై కేసు నమోదు చేసి, బియ్యంను భీమసింగి –1 డిపోకు అప్పటించారు. కార్యక్రమంలో సీఎస్డీటీ వీవీఎస్ మూర్తి, విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, హెచ్సీలు పురుషోత్తం, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను పరిష్కరించాలి
మానవీయ కోణంలో.. ● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ఈ చిన్నారి పేరు సవర రిత్విక్. తల్లి సవర జ్యోతి, తండ్రి తిరుపతి. వీరిది సీతంపేట మండలం రేగుల గూడ గ్రామం. చిన్నతనం నుంచి ఎడమ కాలు పనిచేయడం లేదు. ఈ చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఉంది. అయితే తిరుపతికి ఉద్యోగం లేకపోయినా ఉందని చెబుతూ ఇంతవరకు చిన్నారికి పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసేందుకు తల్లిదండ్రులతో చిన్నారి వచ్చింది.పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులకు మేలు జరగాలని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 109 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సిబ్బందిక సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చిత్తశుద్ధితో 48గంటల్లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్. పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం. సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఆవాల పకీరునాయుడు, తదితరులు కోరుతూ వినతిపత్రం అందజేశారు. ● గోశాల నిర్మాణానికి సంబంధించి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భూమిని సబ్ కలెక్టర్ పరిశీలించారని, అనుమతులు మంజూరు చేస్తే గోశాల పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ తోటపల్లి సర్పంచ్ ఆవాల సింహాచలం, తదితరులు వినతిపత్రం ఇచ్చారు. -
అనుమతుల్లేని పాఠశాలను రద్దు చేయండి
పార్వతీపురం టౌన్: అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలను రద్దు చేయాలని ఏఐఎస్ఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. మక్కువ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతుల్లేకుండానే ఫ్లెక్సీల్లో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్లు ఉన్నట్లు పొందుపరిచి తల్లిదండ్రులను మోసం చేస్తోందన్నారు. పాఠశాలలో పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. సదరు పాఠశాలకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హరికృష్ణ, దుర్గాప్రసాద్, నాయకులు వికాస్, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చే వినతుల పట్ల సక్రమంగా స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు అందించక తప్పదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించి 194 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ లాగిన్ అయి వినతులను పరిశీలించాలన్నారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందాయని చెప్పారు. అక్రమ ఆశీలుపై ఫిర్యాదు జామి మండలంలోని అలమండ సంతలో లైసెన్స్ లేకుండా చిరువ్యాపారుల నుంచిన అక్రమంగా ఆశీలు వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని గంట్యాడ మండలం పెదవేమలి సర్పంచ్ వర్రి పాపునాయుడు అధికారులకు వినతి అందజేశారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్ పంటల సేద్యానికి రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయీస్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడిచిపెట్టారు. తొలి రోజు 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకూ సాగునీటిని అందేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొత్స వాసుదేవరావునాయుడు, పిన్నింటి మోహనరావు, పైల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
సానుకూలంగా స్పందించండి
తక్షణమే చర్యలు తీసుకోవాలి.. పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల్లో వాస్తవం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను తానే స్వయంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మొత్తం 16 వినతులు స్వీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, తదితరులు పాల్గొన్నారు.విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై సానుకూలంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్మం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను సానుకూలంగా విన్నారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా.. ఇందులో భూ తగాదాలకు సంబంధించినవి 13.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు పాల్పడినవి 5.. ఇతర అంశాలకు సంబంధించినవి 18 ఫిర్యాదులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ పీజీఆర్ఎస్లో 40 వినతుల స్వీకరణ -
‘వసుదైక కుటుంబం’ సేవలు శ్లాఘనీయం
బాడంగి: కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన వసుదైక కుటుంబం (యూనివర్సిల్ ఫ్యామిలీ ఫౌండేషన్) స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని వక్తలు కొనియాడారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనాథ బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు డి.శ్రీనివాసరావు, సర్పంచ్ కండి రమేష్, పీఎంసీ కార్యదర్శి శ్రీనివాసరావు, భవిత టీచర్ ఈశ్వరరావు మాట్లాడుతూ.. సంస్థ వ్యవస్థాపకుడు రెళ్ల శ్రీనివాసరావు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంస్థ డైరెక్టర్ సత్యకుమార్ మాట్లాడుతూ.. కేబీఎన్బీఎఫ్సీ సహకారంతో 200 సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరులో వంద మంది విద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 36 పాఠశాలలకు చెందిన బాలికలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. -
జిందాల్ భూములు రైతులవే..
శృంగవరపుకోట: జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. జిందాల్ నిర్వాసితులకు సంఘీభావంగా బొడ్డవర గ్రామంలో ఎమ్మెల్సీ రఘురాజు స్వగృహంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 18 ఏళ్లు గడిచినా పరిశ్రమ స్థాపించకపోతే కంపెనీకి భూములపై ఏ హక్కు ఉంటుందని ప్రశ్నించారు. జిందాల్పై పోరాటం చేస్తున్న రైతులకు ఏపీ రైతు సంఘాలు సమైక్యంగా మద్దతిస్తాయన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి బడా నాయకులు, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహదేవ్ మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు లాక్కుంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. సేకరించిన భూముల్లో కంపెనీలు పెట్టకపోతే మూడేళ్ల తర్వాత ఆ భూములు రైతులకే చెందుతాయని చెప్పారు. ‘లీడర్’ పత్రిక సంపాదకుడు రమణమూర్తి మాట్లాడుతూ, రైతులు భూములు వదులుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమ స్పూర్తితో మనం పని చేయాలన్నారు. నాడు ప్రభుత్వ సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి.. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. రైతులకు అండగా అన్నివర్గాలు నిలుస్తున్నాయని చెప్పారు. జిల్లా రైతుసంఘ అధ్యక్షుడు చల్లా జగన్ మాట్లాడుతూ... పక్షం రోజులుగా రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం బాధాకరమన్నారు. సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల, వర్గాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జిందాల్కు భూములిచ్చిన ఐదు పంచాయతీల రైతులు హాజరయ్యారు. రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి -
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
● కుమారుడికి తీవ్ర గాయాలుజియ్యమ్మవలస రూరల్: మండలంలోని బీజేపురం గ్రామానికి చెందిన కరకవలస రమణమూర్తి (57) ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ కొంతకాలంగా పార్వతీపురంలో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం కుమారుడు దేవీ సంతోష్కుమార్తో కలిసి విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న కుమార్తె గాయత్రి ఇంటికి వెళ్తేందుకు ఏపీ 35కేజీ 9236 నంబర్ గల కారులో బయలుదేరారు. సరిగ్గా ఆనందపురం బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సరికి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు సంతోష్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం సీఐ చింత వాసునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● గ్యాస్ విడిపించి నెలలైనా.. ఖాతాలో పడని నగదు ● జిల్లాలో ఉచిత గ్యాస్ లబ్ధిదారులు 5,02,654 మంది ● గ్యాస్ తీసుకున్న వారు 3,95,419మంది ● ప్రభుత్వం సబ్సిడీ నిధులు విడుదల చేసిందీ 3,40,599 లబ్ధిదారులకు ● ఇందులో 3,38,770 మందికి నగదు జమ ● నగదు జమ కాని లబ్ధి
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తాం.. ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కూటమి సర్కార్ మాట మీద నిలబడలేదనే మహిళలు ఆగ్రహిస్తున్నారు. తొలి ఏడాది మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్తో సరి పెట్టేసింది. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి ఇచ్చే సిలిండర్కు సంబంధించి గ్యాస్ బుక్ చేసుకున్న అందరికి కాకుండా కొంతమందికే ఉచిత గ్యాస్ డబ్బులు జమ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇచ్చిన ఒక్క సిలిండర్ అయినా గ్యాస్ బుక్ చేసినా లబ్ధిదారులు అందరికి సబ్సిడీ (రాయితీ) ఇచ్చారంటే అదీ లేదు. అందులో చాలా మందికి రాయితీ ఇవ్వలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. జిల్లాలో లబ్ధిదారులు 5.02 లక్షలు జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 6 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కోసం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందు లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి ఏప్రి ల్ నుంచి జూన్ నెలాఖరు నాటికి 3,95,419 మంది లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు. ఇందు లో 3,40,599 మందికి ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేసింది. అయితే 3,38,770 మందికి మాత్రమే రాయితీ నిధులు వారి ఖాతాల్లో జమ య్యాయి. 54,820 గ్యాస్ తీసుకున్నప్పటకీ నిధులు విడుదల కాలేదు. గ్యాస్ రాయితీ విడుదల చేసిన దాంట్లో కూడా 1829 మందికి వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. గ్యాస్ రాయితీ కింద రూ. 26,82,16,233 విడుదల చేయగా లబ్ధిదారుల ఖాతాల్లో 16,66,78,779 నిధులు జమయ్యాయి. రూ.15,37,454 నిధులు జమ కాలేదు. గ్యాస్ లబ్ధిదారుల వివరాలు జిల్లాలో గ్యాస్ బుక్ చేసుకున్న భారత్ గ్యాస్ లబ్ధిదారులు 46,949 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వీరిలో రాయితీ నిధులు 30,208 మందికి విడుదల అయ్యాయి. హెచ్పీ గ్యాస్ లబ్ధిదారులు 2,88,232 మందికి గ్యాస్ బుక్ చేసుకున్నారు. వీరిలో 2,64,444 మందికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి. ఇండియన్ గ్యాస్ లబ్ధిదారులు 60,238 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. 45,947 మందికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి. వివిధ కారణాలతో లబ్ధిదారుల్లో కోత వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్ వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నెలాఖరులోగా జమ ఉచిత గ్యాస్ రాయితీకి సంబంధించి 3,95,419 మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు. వీరిలో 3,40,599 మందికి జూన్ నెలఖారు నాటికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి. జూలై నెలాఖరు వరకు సమయం ఉన్నందున మిగతా వారికి కూడా డబ్బులు జమ అవుతాయి. – కె.మధుసూదన్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర
● యూటీఎఫ్ జిల్లా కమిటీ ధ్వజం విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే సంస్కరణలను మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సమావేశ మందిరంలో సంఘం జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూట మి ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం లేదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యను అందించడంపై కాకుండా యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్ల నిర్వహణలౖ పె దృష్టి పెట్టడం సరికాదన్నారు. పాఠశాల సమ యం మొత్తాన్ని బోధనకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకే కేటాయించకుండా తిరిగే విధంగా నియమించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 1500 మంది పొజిషన్ ఐడీలు లేక, క్యాడర్ స్ట్రెంత్ లేనందున జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వీరికి పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న జాతీయ స్థాయి లో జరిగే సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ పూర్తి మద్దతు ప్రకటించిందని, యూటీఎఫ్ సభ్యులు భాగస్వా మ్యం అవుతారని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్కే ఈశ్వరరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయ గౌరి, రాష్ట్ర కమిటీ సభ్యులు జేఆర్పీ పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి పి.కస్తూరి, అకడమిక్ కమిటీ సభ్యుడు డి.రాము, కోశాధికారి సీహెచ్ భాస్కరరావు పాల్గొన్నారు. -
11న కలెక్టరేట్ వద్ద విద్యార్థుల మహాధర్నా
● పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పుల విడుదల కోసం.. ● జీవో 77 రద్దుకు డిమాండ్ ● జిల్లా వ్యాప్తంగా నిరసనలకు ఏఐఎస్ఎఫ్ పిలుపు విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్పుల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో దీనికి సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి లు రూ.4200 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. అలాగే ఎన్నికల సమయంలో జీవో 77 రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని అదీ నెరవేరలేదన్నారు. ఈ జీవో వల్ల పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య తీరని కల గానే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణ మే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 11న జరగనున్న కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు విద్యార్థులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఏస్ఎఫ్ జిల్లా సహాయ కార్యద ర్శి పి.గౌరీశంకర్, పట్టణ నాయకులు నవీన్, సా యి, రాము, రామకృష్ణ, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జంతువుల నుంచి మనుషులకు 70 శాతం వ్యాధుల వ్యాప్తి
● జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వై.వి.రమణ విజయనగరం ఫోర్ట్: సుమారు 70 శాతంకు పైగా వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమిస్తాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వై.వి.రమణ అన్నారు. స్థానిక బహుళార్ధ పశు వైద్యశాల వద్ద ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పెంపుడు జంతువులు పట్ల జంతు ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలన్నారు. 584 పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంటి మహాలక్ష్మి, సహాయ సంచాలకులు డాక్టర్ సన్యాసినాయుడు, వైద్యులు కె.వి.రమణ, ధర్మారా వు, పశు వైద్యులు డాక్టర్ మోహన్, డాక్టర్ హిమజ డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23,24,25 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలతో పాటు, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ చైర్మన్, అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు, ద్వారపురెడ్డి జగదీష్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పోటీలు అండర్–11,13,15, 17, 19 వయస్సుల విభాగాల్లో జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న అండర్–19 విభాగంలో బాల, బాలికలకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో, 24న అండర్–15,17 వయస్సుల విభాగాల్లో, 25న అండర్–11, 13 వయస్సుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అదే రోజు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఏ కేటగిరీలోనైనా 6 జట్ల కన్నా తక్కువ జట్లు వస్తే చాంపియన్షిప్ నిర్వహించకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ప్రక్రియ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9133773485, 79891 99534, 7981111705 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి నున్న సురేష్, ఎంకేబీ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహణ -
వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య?
● మృతుడి భార్య ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులుకొత్తవలస: వివాహేతర సంబందం ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి ఉమాదేవికాలనీకి చెందిన గంగవరపు గౌరీసత్యవరప్రసాద్ (38) ఆదివారం అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్నమెరక సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త మరణానికి తమ్మన్నమెరక గ్రామానికి చెందిన ఒక మహిళ కారణమంటూ మృతుడి భార్య ఎర్నెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివాహేతర సంబంధం ఉన్న మహిళ వేధింపులు గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం నుంచి సుమారు 20 సంవత్సరాల క్రితం ఉమాదేవికాలనీకి కుటుంబంతో వలస వచ్చి ఇటుకల బట్టీ వ్యాపారం చేసుకుంటూ గౌరీ సత్యవరప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఽభార్య ఎర్నెమ్మ, కుమార్తె తోరణశ్రీ, కుమారుడు శ్యామ్సుందర్ ఉన్నారు. అదే ఇటుకల బట్టీలో పనిచేసే తమ్మన్నమెరక గ్రామానికి చెందిన మహిళతో సాన్నిహిత్యం గౌరీవరప్రసాద్కు ఉంది. దీంతో తన సంగతి తేల్ఛాలంటూ సదరు మహిళ తరచూ తన భర్తను బెదిరిస్తూ ఉండేదని మృతుడి భార్య ఎర్నెమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఆదివారం కూడా సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి నిలదీయడంతో చెంతనే గల మామిడి తోటలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గౌరీ సత్యవరప్రాద్ ఉరివేసుకున్న విషయాన్ని సదరు మహిళ మృతుడి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో మృతుడి భార్యతో పాలు కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతిచెంది విగత జీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఉరివేసుకుని మృతి చెందాడా? లేదంటే ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడిదీశారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయనరగం నుంచి ప్రత్యేక క్లూస్టీమ్, డాగ్స్కాడ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి భార్య ఎర్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చుసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. -
యువకుడి అదృశ్యం
రామభద్రపురం: మండలంలోని కోటవిర్లాం గ్రామానికి చెందిన బప్పడాల ప్రభాకర్(34) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వి. ప్రసాదరావు తెలిపారు. ఆ యువకుడు మతిస్థిమితిం లేక ఎటో వెళ్లిపోతుండడం, మళ్లీ తిరిగి ఇంటికి వస్తుండడం చేస్తుంటాడు.గత నెల 25 వ తేదీన మధ్యాహ్నం ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఫోన్లు చేసి వాకబు చేశారు. ఆదివారం వరకు ఇంటికి రాకపోవడంతో అతడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
టీచర్లపై బోధనేతర పనుల భారం తగ్గించాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులపై అధికంగా మోపుతున్న బోధనేతర పనుల భారం తగ్గించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు డిమాండ్లను సాధించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలంటే బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం లీవ్ యాప్లో ‘విట్నెస్’ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని అధికారుల ఆదేశాలున్నాయని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూనిఫారాలు, షూస్, బెల్టులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలపై కోడ్ నంబర్లతో అప్లోడ్ చేయాలన్న సూచనలు ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని వాపోయారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెబుతూ అన్ని పనులు ఒకే యాప్లో పెట్టడం వల్ల ప్రతి క్షణం ఉపాధ్యాయులకు పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భారం లేని అంశాలైన ఆప్షన్ హాలిడేల విషయంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్న విధానం ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతోందన్నారు. సంఘం అధ్యక్షుడు షేక్ బుఖారీ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్ మోమన్రావు, రాష్ట్ర అకడమిక్ సెల్ సభ్యుడు జేసీరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, జిల్లా సబ్కమిటీ సభ్యులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ -
కౌలు కార్డులు అందేనా..?
● కార్డుల పంపిణీ లక్ష్యం 16,250 ● ఇంతవరకు ఇచ్చింది 10,700 ● దరఖాస్తు చేసినా కార్డు రాకపోవడంతో ఎదురుచూపులు ● కార్డు లేక విత్తనాలు, ఎరువులు పొందలేకపోతున్న రైతులువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరపురపు రామునాయుడు. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఈ రైతు విజయనగరం మండలం రాకోడు గ్రామంలో పొలం కౌలుకు చేస్తున్నాడు. కౌలు కార్డు కోసం 20 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతవరకు కౌలు కార్డు ఇవ్వలేదు. దీంతో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు పొందలేక పోయాడు. ప్రైవేట్ విత్తన దుకాణంలో కొనుగోలు చేసుకున్నాడు. ఈ రైతే కాదు. అనేక మంది భూమిని కౌలుకు చేసుకున్న రైతులు కౌలు కార్డులు అందక ఇబ్బంది పడుతున్నారు. కౌలురైతులందరికీ కార్డులు ఇస్తున్నామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కౌలు కార్డులు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైనప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కౌలు కార్డులు రైతులకు ఇవ్వలేదు. కార్డులు లేక పోవడం వల్ల ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు పొందలేక పోయారు. ఈ ఏడాది కౌలు కార్డుల లక్ష్యం16,250 భూమిని కౌలుకు చేసే రైతులను గుర్తించి వారికి కార్డులను ఇస్తారు. 2025–26 సంవత్సరానికి గాని 16,250 మందికి కౌలు కార్డులు ( సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు) అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు 10, 700 మందికి అందించారు. 5550 మందికి ఇంకా ఇవాల్సి ఉంది. కార్డులు అందక నష్టపోతున్న రైతులు కౌలు కార్డులు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. భూమి ఉన్న రైతులు ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు, ఎరువులు వారి వన్వీ లేదా పట్టాదారు పాస్పుస్తకం పట్టుకుని వెళ్లి తెచ్చుకుంటారు. అదేవిధంగా పంటను కూడా విక్రయించుకుంటారు. భూమిని కౌలుకు చేసుకునే రైతులు కౌలు కార్డు పట్టుకుని విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటారు. అలాగే కౌలుకార్డు ద్వారా పండించిన పంటను కూడా విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కౌలు కార్డులు లేక పోవడం వల్ల చాలా మంది కౌలు రైతులు ఈ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. త్వరలో ఇచ్చేందుకు చర్యలు 2025–26 సంవత్సరానికి సంబంధించి 16,250 మంది కౌలురైతులకు కార్డులు ఇవ్వాల ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 10,750 మందికి అందజేశాం. మిగిలిన వారికి కూడా త్వరలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి రక్షణ పొంది, సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. ఏటా చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంతో మృతి చెందుతున్నారని ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైందని చెప్పారు. వాహనాలు నడిపినపుడు ప్రతి వాహనదారు విధిగా నాణ్యత కలిగిన హెల్మెట్ ధరిస్తే, ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతో ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క వాహనదారు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందని చెప్పారు. ప్రజలందరికీ హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై ఎంవీ నిబంధనలు అతిక్రమించినట్లు పరిగణించి ఈచలానాలను విధించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాల నివారణలో పోలీసుశాఖకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ వకల్ జిందల్ విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలు -
ఇంత పెద్ద చేపా..!
సంతకవిటి: మండలంలోని నారాయణపురం ఆనకట్టలో 15 కేజీల బరువుండే భారీ చేప దొరికింది. తోటపల్లి జలాశయం నుంచి నీటిని దిగువకు విడిచి పెట్టడంతో పాటు వర్షాలు కురుస్తుండండంతో ఆనకట్టలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ఆనకట్టలో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ఓ మత్స్యకారుడికి భారీ చేప దొరికింది. దీన్ని చూసేందుకు రంగారాయ పురం గ్రామస్తులు పరుగులు తీశారు. చిన్నబగ్గ–గోరపాడు మధ్య ఏనుగులుసీతంపేట: మండలంలోని చిన్నబగ్గ–గోరపాడు కొండల మధ్య ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. గడిచిన రెండు రోజులుగా గోరపాడు జీడితోటల్లో ఉన్న ఏనుగులు ఆదివారం ఉదయం చిన్నబగ్గ తోటల్లో సంచరిస్తూ కొండశిఖరానికి వెళ్లినట్టు ట్రాకర్లు గుర్తించారు. జీడి, మామిడితోటల కొమ్మలు, అక్కడక్కడ అరటి పంటను నాశనం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎఫ్బీవో కె.దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఏనుగుల గమనాన్ని గుర్తించి తగు సూచనలిస్తున్నారు. వీణ కచేరీతో బాలమురళికి నీరాజనంవిజయనగరం టౌన్: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరంలోని ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతి ఉత్సవంలో విశాఖకు చెందిన డాక్టర్ నిష్టల కృష్ణవేణి చేసిన వీణకచేరీ ఆహూతులను ఆకట్టుకుంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు, సంస్థ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి మృదంగంపై సహకారం అందించి కచేరీని రక్తి కట్టించారు. అసోసియేషన్ అధ్యక్ష్యుడు ధవళ సర్వేశ్వరరావు, సభ్యులు బాలమురళి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి, వారి జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో దూసి శివరాం శర్మ, టి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగవతి చిన్నారులకు నంది, నాట్యమయూరి అవార్డులువిజయనగరం టౌన్: విజయనగరంలోని భగవతి నృత్యకళామందిర్ చిన్నారులు నాట్య మయూరి అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం నృత్యాలయ నాట్యకళా వెల్పేర్ అసోసియేషన్, సిరి ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణా బోనాల సంబరాలు, గురుపూజోత్సవంలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆహూతుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా నంది, నాట్యమయూరి అవార్డులను కై వసం చేసుకున్నట్లు అకాడమీ డైరెక్టర్ వడ్లమాని రమణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు అభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి
విజయనగరం గంటస్తంభం: డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించి, రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే మోటార్ వాహన చట్టం 2021,భారత న్యాయ సంహిత చట్టం 106(1,2)లను రద్దు చేయాలి. 10కోట్ల మంది రవాణా రంగ కార్మికులకు కేరళ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రభుత్వమే యాప్ను నడపాలి. లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఆర్టీవో కార్యాలయం ద్వారా జరగాలి. అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. వాహన కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. వాహన మిత్ర రూ.15000 తక్షణమే చెల్లించాలని కోరుతూ జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ, ఓనర్లు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు ఆదివారం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవన్లోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎ.జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రవాణా రంగంపై పెద్ద ఎత్తున దాడి చేస్తోందన్నారు. ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలను అనుమతించడంతో స్వయం ఉపాధిగా బతుకుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్లకు బేరాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత వాహనాలను అమ్ముకోవడం లేదా ప్రైవేట్ సంస్థల యాప్లకు బందీలుగా మారిపోతున్నారని వాటిని రద్దుచేసి కేరళ తరహాలో ప్రభుత్వం యాప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా కాకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ప్రోత్సహించాలని, వారిౖపై వివిధ రూపాల్లో వేస్తున్న భారాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనుదారులపై భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. రవాణా రంగ డ్రైవర్లకు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పిలుపు -
గూడ్స్ కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
కొత్తవలస: అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపం చెంది కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్కు ఎదురుగా వెళ్లి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా వేపగుంట సమీపంలోని సింహపురి కాలనీకి చెందిన చొప్ప సీతారామయ్య (78) తన కొడుకు వద్ద ఉంటున్నాడు. ఆయన భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడడం మొదలయ్యాయి. ఆదివారం ఉదయం సింహపురి కాలనీ నుంచి బస్సులో కొత్తవసల వరకు వచ్చి జంక్షన్ నుంచి నేరుగా రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ ఎస్సై సిబ్బందితో వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి చేతుల్లో సూసైడ్ నోట్ ఉండడాన్ని గమనించారు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్య సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం తరలించారు. -
నేడు మడ్డువలస నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడిచిపెట్టనున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేపడతామని వెల్లడించారు. ఆయకట్టు వివరాలు ఇలా.. ఈ ఏడాది ఆయకట్టు పరిధి ఆరు మండలాల్లో 30,077 ఎకరాలకు సాగునీటి సరఫరాను అధికారులు చేపట్టనున్నారు. వంగరలో 996 ఎకరాలు, రేగిడిలో 6777 ఎకరాలు, సంతకవిటిలో 10976 ఎకరాలు, జి.సిగడాంలో 6029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలు, లావేరులో 5200 ఎకరాల ఆయకట్టు భూములకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి సాగునీటి విడుదల చేపట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిస్థితి ఇది.. మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది సాగునీటి విడుదల జాప్యమైందని చెప్పకతప్పదు. ఏటా జూన్ నెలలో నీటి విడుదల చేపట్టే పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి విడుదలకు సరిపడ నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడంలో అధికారుల అలసత్వంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సామర్థ్యం.. ప్రాజెక్టులో ఆదివారం 64.62 మీటర్ల లెవెల్లో నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3.008 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 65 మీటర్లు కాగా ఆ స్థాయికి 3.337 మీటర్లు నిల్వ ఉండాల్సి ఉంది. అయితే ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి 00.34 మీటర్ల దూరంలో ఉంది. పుష్కలంగా ఆయకట్టుకు సాగునీరు విడుదలకు అవసరమైన నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. చర్యలు చేపట్టిన అధికారులు -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
● పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల్లో జాప్యంతో తప్పని అవస్థలు ● ఎరువులు, విత్తనాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి ● జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించిన జెడ్పీ చైర్మన్, సభ్యులు ● తాటిపూడి నీటి మళ్లింపుపై ఎటువంటి చర్చ జరగలేదు: మంత్రి కొండపల్లి విజయనగరం: సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు.. పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల పూర్తి.. ఎరువులు, విత్తనాల ధరల నియంత్రణ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదల.. తదితర అంశాలపై విజయనగరం జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు చర్చించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, శ్యాంప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వైద్యం, వ్యవసాయం, విద్య రంగాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ● ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యమా? ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యం చేస్తున్నారని, కురుపాం సీహెచ్సీకి రోగుల తాకిడి పెరుగుతున్నా అవసరమైన భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో తాత్సారం చేస్తున్నారంటూ కురుపాం మండల జెడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సుజాత, ఎంపీపీ శెట్టి పద్మావతిలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కొత్తవలసలో ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ఎన్జీఓ హోంలో రోగులకు సేవ లందిస్తున్నారని, ఒకే గదిలో రోగులకు తనిఖీలు, ఆపరేషన్లు చేస్తున్నారని జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు త్వరలో భవన నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్ యంత్రాలు ఎందుకు పని చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. సర్వజన ఆస్పత్రి నుంచి విశాఖలో కేజీహెచ్కు రిఫరల్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి చెబితే మరింత వేగంగా ఇతర ఆస్పత్రులకు పంపించడం వెనుక అంతర్యమేమటన్నారు. స్పందించిన సూపరిండెంట్ కార్డియాలజీ, గ్యాస్ట్రో తదితర అత్యవసర కేసులను తప్పనిసరి పరిస్థితుల్లో రిఫరల్ చేయిస్తున్నామని, ఆస్పత్రుల్లో అన్ని యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనబంధంగా సర్వజన ఆస్పత్రిని మార్పుచేసే ప్రక్రియపై కళాశాల ప్రిన్సిపాల్తో చర్చించారు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాల వద్దకు ఆస్పత్రిని తరలిస్తే ప్రజలకు దూరం అవుతుందని, అటువైపు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా లేదని, కొన్ని విభాగాలను బోధనాస్పత్రి వద్ద ఏర్పాటు చేసి, పాత ఆస్పత్రినే అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ● అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను కోరారు. మ్యుటే షన్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొందరు రైతులు ఎరువులు, విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయించే వారిపై విజెలెన్స్ అదికారులతో తనిఖీలు చేయించి రైతులకు న్యాయం చేయాలన్నారు. తాటిపూడి నీటి కోసం ఆందోళన వద్దు గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంఎస్ఎంఈ పార్కుకు తాటిపూడి నుంచి నీరందించడంపై ప్రభుత్వ చర్చకు రాలేదని మంత్రి కొండపల్లి స్పష్టంచేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాటిపూడి కేవలం సాగు, తాగునీటి ప్రాజెక్టు అని, జిందాల్ సంస్థ స్వయంగా నీటి వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పాఠశాలలకు కంప్యూటర్ ఆపరేటర్లు లేరని, సచివాలయాల నుంచి డిప్యుటేషన్ వేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనుల తీర్మానాలపై సభలో చర్చ జరిగింది. గ్రామ సభల్లో తీర్మానించిన వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాస్తున్నారంటూ పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికార బలంతో ఎంపీడీఓలను అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల తగ్గుదల ఆందోళన కలిగించే విషయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, సంఖ్య తగ్గకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఇటీవల మెరకముడిదాం మండలంలో తనిఖీ చేసినప్పుడు గత ఏడాది కన్నా 1100 మంది తగ్గారని తెలిసిందని, ఒకే మండలంలో ఇంత మంది తగ్గితే జిల్లా అంతటా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కోవిద్యార్థి నుంచి కట్ చేసిన రూ.2వేలు పాఠశాలల ఖాతాలకు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు తగ్గుదలపై శాసీ్త్రయంగా విశ్లేషణ జరగాలని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని డీఈఓకు మంత్రి కొండపల్లి సూచించారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్స్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ లోపల అడ్మిషన్లు పూర్తిచేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. -
ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ సంస్థల మనుగడ
బొబ్బిలి: ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరం కాకండా కార్మిక వర్గం, ప్రజలు ఐక్యంగా పోరాడా లని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. బొబ్బిలిలో శుక్రవారం జరిగిన సీఐటీయూ మహాసభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోందన్నారు. విశాఖఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యత్నాలపై కూటమిగా ఉన్న టీడీపీ, జనసేనలు కనీసం ప్రశ్నించడం లేదన్నారు. రైల్వే, ఎయిర్పోర్టులను ప్రైవేటీకరణ చేయడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించి అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు రోజుకు రూ.178 ఇస్తే చాలన్నట్టు పొందుపరిచారన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి లేబర్కోడ్ చట్టాలతో కార్మికుల హక్కులకు భంగం కలుగజేస్తున్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కె.సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. స్థానిక గ్రోత్ సెంటర్లో కార్మికులతో కలిసి సమ్మైపె ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాల్లో యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి, సీఐటీయూ, రైతు, పెన్షనర్ల సంఘాల జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఎస్.గోపాలం, శేషగిరి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి, నిర్మల, ఎండీఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ -
సేవలకు సన్మానం
నెల్లిమర్ల రూరల్: మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్ప కళావేదికపై ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబుకు ఘన సత్కారం లభించింది. ఆంధ్రా, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సురేష్బాబును దేశ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో క్షత్రియ సేవా సమితి సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూనియన్ మినిస్టర్లు గజేంద్రసింగ్ సెకావత్, కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. -
ఖాతాలు తెరవండి
విజయనగరం టౌన్: తల్లికి వందనం రెండో విడతలో ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు నిధులు జమచేయనున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు యు.అన్నపూర్ణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతాలను ఆధార్నంబర్తో లింక్ చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు ఆలోచనే లేదు ● మంత్రి కొండపల్లి శృంగవరపుకోట: పరిశ్రమలు తెస్తాం.. జిల్లా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం అంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయింది. ఎస్.కోట మండలం బొడ్డవర ప్రాంతంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన అసలు ప్రభుత్వం చర్చించనేలేదని ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తేల్చిచెప్పారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న జిందాల్ నిర్వాసితుల పోరాటం, జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతిపాదన, జిందాల్కు తాటిపూడి నీరు సరఫరా వంటి అంశాలను మంత్రి కొట్టిపారేశారు. ‘ఈరోజు వరకూ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ పార్క్పై ఎలాంటి చర్చజరగలేదు. దీనిపట్ల ప్రజల్లో ఎందుకు భయాందోళనలు సృష్టిస్తున్నారో అర్థంకావడం లేదు. అక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఆలోచనే లేదు. దానికి తాటిపూడి నీరు ఇస్తారా? ఎలా ఇస్తారన్న చర్చ సాగనేలేదు. అదే విషయాన్ని ఇటీవల తాటిపూడిలో వివరించాం. ఇప్పుడు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ఆధారంగా రైతాంగంలో భయాందోళనలు సృష్టించాల్సిన అవసరం లేదు’ అంటూ మంత్రి కుండబద్దలు కొట్టారు. దీంతో బొడ్డవర వద్ద జిందాల్ సేకరించిన భూముల్లో ఎటువంటి కంపెనీలు రావడం లేదని మంత్రి విస్పష్టంగా తేల్చారు. ఇటీవల జిల్లా కలెక్టర్ జిందాల్కు వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం, ఎమ్మెల్యే లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ కలెక్టర్ వాదనకు మద్దతు ఇవ్వడం, నిర్వాసితులకు పోటీగా టీడీపీకి చెందిన నాయకులు కంపెనీలు కావాలంటూ శిబిరాలు నిర్వహించడం వంటి అంశాలను పరిశీలిస్తే... జిల్లాలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం మైండ్గేమ్ ఆడుతోందా.. ఆడిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
డోలీలో ఐదు కిలోమీటర్లు..
–8లోపడగ విప్పుతున్న మహమ్మారి పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా మహమ్మారి పడగ విప్పుతోంది. విద్యార్థులనూ ఆస్పత్రులపాలచేస్తోంది. కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెదశాఖ పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం పూసనందికి చెందిన గర్భిణి కొండగొర్రి చంద్రమ్మ శుక్రవారం ఒక్కసారి కళ్లుతిరిగి పడిపోయింది. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల రాళ్లదారిలో డోలీలో పెదశాఖ వరకు తెచ్చి అక్కడ నుంచి ఫీడర్ అంబులెన్స్లో కూనేరు రామభద్రపురం పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యకోసం అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అద్దెవాహనంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. పీహెచ్సీలో మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యులు అందుబాటులో లేరని చంద్రమ్మ బంధువులు ఆరోపించారు. జిల్లాకు చెందిన సంధ్యారాణి గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నా విద్య, వైద్య కష్టాలు తీర్చే‘దారి’ చూపడంలేదని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ మల్లయ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మ్యుటేషన్లు త్వరగా పరిష్కరించాలి
● ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ పాచిపెంట: గ్రామసభల్లో వచ్చిన మ్యుటేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. ఈ మేరకు పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో రెవెన్యూ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు పీఓ హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. భూ సవరణలకు సంబంధించి మ్యుటేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో ప్రైవేట్ భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటివనరులున్న భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందన్నారు. రీ–సర్వేలో తప్పులు దొర్లకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. మృతి చెందిన రైతుల మ్యూటేషన్లపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.రవి, ఆర్ఐ రమణారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు వెల్ఫేర్ డే నిర్వహణ
విజయనగరం క్రైమ్: పోలీస్ శాఖ ప్రతి శుక్రవారాన్ని సిబ్బంది సంక్షేమానికి కేటాయించింది. ఈ మేరకు వారంలో ఒక్క రోజు ‘పోలీసు వెల్ఫేర్ డే’ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లో శుక్రవారం వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలపై విజ్ఙాపనలు స్వీకరించారు. సిబ్బంది పనితనం, విధుల్లో ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యక్షంగా తన వద్దకు పిలిచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానని చెప్పారు. వెల్ఫేర్ డే లో సిబ్బంది నుంచి అందుకున్న విజ్ఞాపనలను పరిశీలించారు.అనంతరం, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని సిబ్బందికి హామీ ఇచ్చారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా నోట్ చేసుకున్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఎస్పీ -
అటవీ భూమి ధారాదత్తం
బొబ్బిలి: ఆపరేషన్ కగార్ పేరుతో అంతర్జాతీయ కంపెనీ యజమానులైన అదానీ, అంబానీలకు 9 కోట్ల ఎకరాల అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కుట్ర చేస్తున్నారని అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ అంజమ్మ, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్లు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి పట్టణంలోని మహరాణిపేటలో కామ్రేడ్ గంటి ప్రసాదం 12వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా పీకేఎస్ జెండాను ఆవిష్కరించారు. గంటిప్రసాదం స్మారక భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ మావోయిస్టుల రక్షణలో ఉన్న ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేయడం దారుణ మన్నారు. మావోయిస్టులను అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకూ సుమారు 550 మంది ఆదివాసీలు, మావోయిస్టులను పట్టుకుని అంతమొందించారని ఆందోళన వెలిబుచ్చారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు, ప్రజాసంఘాలు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలకు సిద్ధం అయ్యేలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని కోరారు. అభివృద్ధి చెందుతున్న అమెరికా, రష్యా, జపాన్ తదితర దేశాల్లో దేశంలో40 శాతం అడవులుండాలని చట్టాలుచేసి పర్యావరణాన్ని కాపాడుతుంటే మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులు దీనికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడం దారుణ మని ధ్వజమెత్తారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు గంటి ప్రసాదాన్ని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరులో పొట్టన పెట్టుకుందన్నారు. ఇటీవల ఆపరేషన్ కగార్పేరుతో నంబాల కేశవరావు, చలపతి, సుధాకర్, గణేష్, రేణుక, అరుణ, గాజర్ల రవి తదితరులను కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్షా, చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు కామ్రేడ్ గంటి ప్రసాదం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో పీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి, కామ్రేడ్ అన్నపూర్ణ, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి మెరిగాని గోపాలం, పిల్లా లక్ష్మణరావు, పీకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాయితి సత్యం, తమటాల అప్పలనాయుడు, దాసరి వెంకట రమణ, రెడ్డి కుమార్, ప్రజాకళామండలి రాష్ట్ర ప్రతినిధి తూముల సింహాచలం, నల్లి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
భలే మందుల వ్యాపారం..!
● ఆ ఫార్మా కంపెనీ మందులే రాయాలంటూ హుకుం! ● ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులకు సంబంధిత ఉన్నతాధికారి ఫోన్లో ఆదేశాలు ● ఆ ఫార్మా కంపెనీ కూటమికి చెందిన ఓ ముఖ్యనేతది కావడం గమనార్హం! ● నాసిరకం మందుల అమ్మకాలతో దోపిడీ ప్రయత్నాలు ● రోగుల ఆరోగ్యంతో వ్యాపారం ● తమపై ఇదేమి రుబాబు అంటున్న నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులు ● జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులువిజయనగరం ఫోర్ట్: కూటమి నేతలు ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టేసి ప్రజలను దోచుకునే పనిలోపడ్డారు. ఇసుక, మద్యం బెల్టు దుకాణాల నుంచి రోగుల ఆరోగ్యాన్ని కుదుటపర్చే మందుల వరకు అన్నింటినీ వ్యాపారంగా మార్చేస్తున్నారన్నది జనం మాట. తాజాగా జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఫోన్లో అందిన మౌఖిక ఆదేశాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రోగుల చికిత్సకు అవసరమయ్యే అన్నిరకాల మందులు కూటమి నేత కంపెనీకి చెందినవే వినియోగించాలని ఆదేశించినట్టు సమాచారం. మా కంపెనీ మందులు కాదని ఇతర కంపెనీల దగ్గర కొనుగోలు చేసేందుకు వీలులేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఇది వైద్యవర్గాలతో పాటు మిగిలిన మందుల కంపెనీల యాజమాన్యాలను కలవరపెడుతోంది. పారాసిట్మల్ నుంచి యాంటీ బయోటిక్ వరకు... జ్వరం తగ్గేందుకు ఉపయోగించే పారాసిట్మాల్ మాత్రల దగ్గర నుంచి తలనొప్పి, ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, యాంటీ బయోటిక్స్, కడుపు నొప్పి, గ్యాస్టిక్ మాత్రలు, ప్రోటీన్ పౌడర్లు, విటమిన్, బి–కాంప్లెక్సు మాత్రలు, పలు రకాల ఇంజిక్షన్లు, సర్జికల్ మెటిరీయల్స్ ఇలా అన్నిరకాల మందులు ఆ ఒక్క కంపెనీ వద్దనే కొనుగోలుచేయాలని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు అందాయి. ఆరోగ్యశ్రీకి చెందిన ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సంబంధిత ఫార్మా కంపెనీ చెప్పిన మందులు కొనుగోలు చేయకపోతే ఏమవుతుందోనని మదనపడుతున్నారు. వారు చెప్పినట్టు చేయకపోతే ఆరోగ్యశ్రీ రోగులకు సంబంధించిన బిల్లులు నిలిపివేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు నాణ్యతలేని మందులు రాస్తే రోగులు ఎలా కోలుకుంటారని మదనపడుతున్నారు. ఆ కంపెనీ కూటమి నేతదే.. ఫార్మా కంపెనీ కూటమికి చెందిన ఓ ముఖ్య నేతది. దీంతో సదరు నేత ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు చెందిన ఆరోగ్యశ్రీ అధికారుల ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ ఇదే విధంగా నెట్వర్క్ ఆస్పత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు వైద్యవర్గాల్లో చర్చసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బలవంతంగా కూటమి నేతలు రుబాబు చేయడం పట్ల నెట్వర్క్ ఆస్పత్రుల యాజమానులు ఆవేదన చెందుతున్నారు. ‘విజయనగరంలో ఉన్న ఓ ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) నెట్వర్క్ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఫోన్చేసి ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధి వస్తారు. వారి కంపెనీకి చెందిన మందులే తీసుకోవాలి. రోగులకు వాటినే అందజేయాలి అని ఫోన్లో ఆదేశించారు. ఈ ఫోన్ వచ్చిన అర గంటలో సంబంధిత ఫార్మా కంపెనీ ప్రతినిధి, జిల్లాకు చెందిన ఆరోగ్యశ్రీ సిబ్బందిని వెంట బెట్టుకుని ఆస్పత్రికి వెళ్లి మా ఫార్మా కంపెనీలో తయారు చేసిన మందులను ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాలని చెప్పారు. చేసేది లేక సంబంధిత ఆస్పత్రి వైద్యులు మిన్నుకుండి పోయారు. నాసిరకం, డొల్ల కంపెనీ మందులు రాయాలన్న ఒత్తిడిపై ఇదేమి రుబాబు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.’ భారీ దోపిడీకి కూటమి నేత స్కెచ్ వేశారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద అధిక శాతం మంది శస్త్రచికిత్సలు, చికిత్స తీసుకుంటారు. జిల్లాలోని 25 ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఏడాదికి 60 వేల నుంచి 80 వేల మంది వరకు సేవలు పొందుతారు. వీరికి మందుల కోసం నెట్వర్క్ ఆస్పత్రులు కోట్లాది రుపాయలు వెచ్చిస్తాయి. ఆ మేరకు నెట్వర్క్ ఆస్పత్రులకు నాణ్యతలేని మందులు సరఫరా చేయడం ద్వారా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ. 80కోట్ల వరకు ఆర్జించవచ్చన్నదే కూటమినేత స్కెచ్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధిత ఫార్మా కంపెనీ నుంచి నెట్వర్క్ ఆస్పత్రులకు మందుల సరఫరాకు అంతా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు నెట్వర్క్ ఆస్పత్రులు వారి ఆస్పత్రుల్లో అందించే వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులను వారికి నచ్చిన ఫార్మా కంపెనీల నుంచి తెప్పించుకునేవారు. ఇకపై కూటమి నేతఫార్మా కంపెనీ నుంచి తెప్పించుకోవాల్సిందే. వాస్తవమే... ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధి నెట్వర్క్ ఆస్పత్రులకు వచ్చిన మాట వాస్తవమే. వారి కంపెనీకి చెందిన మందులను తీసుకోవాలని కోరారు. బలవంతం పెట్టలేదు. – డాక్టర్ కుప్పిలి సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
కొనసాగుతున్న డ్రైవర్ల నిరసన
పార్వతీపురం: అద్దె బస్సుల డ్రైవర్ల నిరసన నాలుగవ రోజు కొనసాగుతోంది. శుక్రవారం పార్వతీపురం ఆర్టీసీ డిపో గేటు వద్ద నల్ల బ్యా డ్జీలతో డ్రైవర్లు నిరసనలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డివేణు, జి.వెంకటరమణ, బి.సూరిబాబు తదితరులు మాట్లాడుతూ అద్దె బస్సుల యజమానులు, ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించి అద్దె బస్సు డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అద్దెబస్సు యజమానులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. సమస్యలు పరి ష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అద్దె బస్సు డ్రైవర్లు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు కేవీ చారి, పీడీ ప్రసాద్, ఎ.అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సహస్ర దీపాలంకరణనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుచేశారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి పోలీస్ ‘‘వెల్ఫేర్ డే’’● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: శాఖాపరమైన సేవల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బంది సమస్యలతోపాటు శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ తమ సమస్యలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పోలీసుశాఖ సిబ్బంది పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి స్వయంగా తె లిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తనకు చేరిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అవకాశం ఉన్నంత మేరకు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
పడగ విప్పుతున్న మహమ్మారి
● జిల్లాలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు ● సింగిల్ డాక్టర్లతో నడుస్తున్న పీహెచ్సీలు ● 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ ● గ్రామాల్లో వైద్యశిబిరాలు అంతంతమాత్రమే ● దోమల తెరల పంపిణీ నిల్సీతంపేట/పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా మహమ్మారి పడగ విప్పుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా, అలాగే ఆశ్రమ, వసతిగృహాల్లో జ్వరాల బాధితులతో ఏజెన్సీలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వైరల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువవుతున్నాయి. ఈ సీజన్లో జనవరి నుంచి ఇప్పటివరకు వరకు 1264 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక గణంకాలు చెబుతుండగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 42, ఆరోగ్య ఉపకేంద్రాలు 200 వరకు ఉన్నాయి. ముఖ్యంగా పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు ఇద్దరు చొప్పున ఉండాలి. ఒకరు మెడికల్ క్యాంప్ వెళ్లినా, మరొకరు పీహెచ్సీలో ఓపీ చూడాలి. 14 మంది వరకు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయనే ఆరోపణలు న్నాయి. రోజుకు ఓపీ 50 నుంచి 100 మధ్య పీహెచ్సీల్లో ఉండగా, ఏరియా ఆస్పత్రుల్లో 200 నుంచి 300ల మధ్య ఉంటోంది. మారుమూల గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది. పీహెచ్సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ కేసులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. 550 హైరిస్క్ గ్రామాలు.. జిల్లాలో 1250 పైన గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో సుమారు 550 గ్రామాలను మలేరియా హైరిస్క్ గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగా ఈ గ్రామాల్లో మలేరియా కారక దోమల నివారణకు ఐఆర్ఎస్ 5శాతం ఏసీఎం ద్రావణాన్ని దశల వారీగా పిచికారీ చేస్తున్నారు. మలేరియా నివారణ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ జ్వరాల నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మలేరియా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జనవరి నుంచి ఇప్పటివరకు 1,31,902 మంది రక్తపూతలు సేకరించగా వాటిలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు జూన్ నెలాఖరు వరకు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్నచిన్న క్లినిక్లు, గ్రామాల్లో సంచి వైద్యులు వంటి వారి వద్దకు వచ్చే మలేరియా పాజిటివ్ కేసులు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. కాలం చెల్లిన దోమతెరలు.. దోమతెరల కాలపరిమితి ఐదేళ్లు. అయితే దోమతెరలను ఉతకడం వంటి పనులు చేస్తే మూడేళ్లకే పాడవుతాయని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో దోమతెర లకు కాలం చెల్లాయి. మరికొన్ని చినిగిపోయాయి. ఇప్పటికే పాడైన దోమతెరలను చాలా గ్రామాల్లో చేపలు పట్టడానికి, మొక్కలకు కంచె వేయడానికి వినియోగిస్తున్నారు. -
ధర్నా, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
విజయనగరం క్రైమ్: ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు పోలీసుశాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, ఇతర నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీసుశాఖ నుంచి ముందస్తుగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేనిదే ఎలాంటి నిరసనలైనా చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. ఇందుకోసం ముందుగా సంబంధిత డీఎస్పీ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. శాంతియుతంగా వ్యవహరించాలని, విజ్ఞతతో వ్యవహరించి ముందస్తు అనుమతులతోనే ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అలా కాకుండా, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తూ ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. -
ఎమ్మెల్యేలు డుమ్మా
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–2047’ ప్రణాళిక, పీ–4 కార్యక్రమాల తొలి సమీక్ష సమావేశానికి విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విజన్ ప్రణాళిక అమలులో ప్రతిఒక్కరూ భాగాస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్లలో వ్యవసాయంలో రెట్టింపు అభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యమన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యాన, వాణిజ్యపంటల సాగుకు రైతులు ఆసక్తిచూపేలా చూడాలన్నారు. సర్వీస్ సెక్టార్ కింద పర్యాటక రంగంలో సన్రే రిసార్ట్స్ రూ.150 కోట్లు, జీఎంఆర్ రూ.150 కోట్లు, ఆదాని గ్రూప్ రూ.100 కోట్లతో హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయన్నారు. పీ–4లో భాగంగా నియోజకవర్గం పరిధిలోని 264 పోలింగ్ బూత్ల నుంచి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించారు. సమవేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, రఘురాజు, ఎమ్మెల్యేలు అధితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జేసీ సేతుమాధవన్, ఎస్పీ వకుల్ జిందాల్, సీపీఓ బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళలకు శక్తియాప్ రక్షక కవచం మహిళలకు రక్షక కవచంగా శక్తియాప్ నిలుస్తుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో శక్తి యాప్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ తొలిత శక్తి యాప్ విధి విధానలను పీపీటీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల, ఆడ పిల్లల రక్షణ కోసం రూపొందించిన ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతరకు 1.2 కోట్ల మంది వినియోగిస్తున్నారని, ప్రతి మహిళ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆర్జేడీకి పీఆర్టీయూ నాయకుల వినతి
పార్వతీపురం: పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై రీజనల్ డైరెక్టర్ బి.విజయ్ భాస్కరరావుకు పీఆర్టీయూ నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పార్వతీపురం జీజే కళాశాలను ఆర్జేడీ సందర్శించిన సందర్భంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత కూడా పలు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక బోధనకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆర్జేడీని కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు వి.తవిటినాయుడు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, జె.రామినాయుడు, జి.రామినాయుడు, శంకరరావు, తదితరులు ఉన్నారు. పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలి పార్వతీపురం: పీఆర్టీయూ బలోపేతానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషిచేస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం ఆదేశాలమేరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అందుకు అందరు ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని కోరారు. సమావేశంలో పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం మండలాల నుంచి సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్లలో గురువారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈగల్ స్పెషల్ ఫోర్స్, లోకల్ పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ సమన్వయంతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి తనిఖీలు చేపట్టినట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముందుగా ప్లాట్ఫాంపై వేచిఉన్న ప్రయాణికుల లగేజీలను పలు శాఖల పోలీస్ అధికారులతో కలిసి డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. అనంతరం గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో బోగీల వారీగా ముమ్మరంగా విజయనగరం వరకు సిబ్బంది తనిఖీలు చేశారు. ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల నివారణకు ఈగల్ బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోలీసు శాఖలో పలు బృందాల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేపటుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సాగు, వినియోగం లేకుండా చేయడమే ఈగల్ బృందం ప్రధాన లక్ష్యమన్నారు. తనిఖీల్లో క్రైమ్స్టేషన్ సీఐ అప్పారావు, పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు, మరికొంతమంది ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పలు శాఖల సమన్వయంతో రైళ్లలో సోదాలు ఏఎస్పీ అంకిత సురానా -
రెక్కీ నిర్వహించి హత్య
బొబ్బిలి: తన భార్య చనిపోవడానికి, బిడ్డ అనారోగ్యంతో ఉండడానికి తన పక్కింట్లో ఉంటున్న పిన్నే కారణమని అనుమానించి రెక్కీ నిర్వహించి మరీ ఆమెను హత్య చేశాడో ఓ యువకుడు. బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో కరగాని పద్మ అనే మహిళ గాయాలతో బుధవారం ఇంటి గుమ్మం వద్ద పడి మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా ఇది హత్యేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయమై డీఎస్పీ జి.భవ్యారెడ్డి గురువారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మహిళ మృతి చెందడానికి కత్తిపీటపై పడిపోవడమేనని కుటుంబసభ్యులు చెప్పిన మాటలపై నమ్మకం కలగక దర్యాప్తు చేపట్టామన్నారు. వంటిపై గాయాలుండడం, మెడికల్ రిపోర్టు, క్లూస్టీమ్ వివరాలను సేకరించి హత్య అని నిర్ధారణకు వచ్చామని డీఎస్పీ చెప్పారు. హత్య చేసింది స్వయానా ఆమె బావ కుమారుడు కరగాని సంతోష్ కుమార్ అని తెలిపారు. సంతోష్ కుమార్ భార్య పావని ప్రసవ సమయంలో చనిపోయింది. అలాగే నెలన్నర రోజుల పసిబిడ్డ ఆరోగ్యం కూడా బాగాలేక ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు సంఘటనలకు తన పిన్నే కారణమని భావించిన సంతోష్ గురువారం ఉదయం 11 గంటల సమయంలో రెక్కీ నిర్వహించాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంట్లో పిన్ని ఒంటరిగా ఉన్న సమయంలో పొడిచి హత్యకు పాల్పడినటుల డీఎస్పీ చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం బంధువులకు గురువారం అప్పగించామని, నిందితుడ్ని రిమాండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కె. సతీష్కుమార్, ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళ హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
పాపం పశువులు
పార్వతీపురంటౌన్: పట్టణ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ ఢీకొని 8 వశువులు మృతిచెందాయి. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలంలోని పరశురాంపురం గ్రామం నుంచి పార్వతీపురం సంతకు పశువులను తరలిస్తుండగా పార్వతీపురం సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రాయపూర్ పైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొనడంతో 8 వశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. వెంటనే గూడ్స్ను డ్రైవర్ ఆపి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది ట్రాక్పై ఉన్న పశువులను పక్కకు తొలగించారు. ఈ విషయమై జీఆర్పీ సిబ్బందిని వివరాలు అడగ్గా ఎటువంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఏటీఎంలో ఆవు.. రాజాం: పట్టణంలోని బొబ్బిలి జంక్షన్ వద్ద హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో ఒక ఆవు మృతిచెందింది. రెండురోజుల క్రితమే ఈ ఆవు మృతిచెంది ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా తీసేందుకు వెళ్లిన బ్యాంకు ఖాతాదారులు విషయాన్ని గుర్తించి, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్ సీహెచ్.ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన గోవును పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఏటీఎం కేంద్రంలోంచి బయటకు తీసుకొచ్చి డంపింగ్ యార్డు వద్ద ఖననం చేయించారు. రాజాం రోడ్లపై ఇటీవల ఆవులు అధికంగా సంచరిస్తున్నాయి. వర్షానికి ఏటీఎంలోకి ఆవు చేరి ఉంటుందని, కాలుజారి పడడంతో మృతిచెంది ఉంటుందని శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు కలవని పార్టీ లేదు.. చెప్పని అబద్ధం లేదు
2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడు కలవని పార్టీ లేదు. చెప్పని అబద్ధం లేదు. ఎవరొస్తే వారి కాళ్లు పట్టుకుని సలామ్ కొట్టారు. కూటమిగా పోటీ చేశారు. దగాకోరు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని ఒక్క సిలెండర్తో సరిపెట్టారు. ఎటు చూసినా కోతలు, వాతలే మిగులుతున్నాయి. సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి తల్లికి వందనం నిలిపివేయడం దుర్మార్గం. ఇప్పటికీ రైతన్నఖాతాకు పెట్టుబడి సాయం జమకాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవెలప్మెంట్కు అనుసంధానం చేశామంటున్నారు. ఆడిబిడ్డ నిధి పథకాన్ని పీ–4కు అనుసంధానం చేశామని, ఎవరైనా డబ్బున్న వారు దత్తత తీసుకుంటే ఆ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు పథకాలన్నీ అమలు చేశామని చంద్రబాబు ఎలా చెబుతున్నారో ప్రజలకే అర్థంకాని పరిస్థితి. ప్రజల తరఫున పోరాడే ధైర్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల్లో కొదవలేదు. కూటమి మోసకారి పాలనను వివరిద్దాం. – కురుసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ -
రోడ్డుపై గజరాజుల హల్చల్
మడ్డువలస వంతెన రోడ్డుపై వెళ్తున్న ఏనుగుల గుంపు వంగర: మడ్డువలస వంతెన సమీపంలో రోడ్డుపై ఏనుగుల గుంపు గురువారం ఉదయం హల్చల్ చేశాయి. రోడ్డుపై ఏనుగులు సంచరించడంతో వాహనచోదకులు, రైతులు భయంతో పరుగులు తీశారు. అటవీ సిబ్బంది, ట్రాకర్స్ ఏనుగులను పంటపొలాలు వైపు దారిమళ్లించారు. చెరకు, మొక్కజొన్న, పామాయిల్ పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడతున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆందోళనలో జనం సంగాం పొలాల్లో సంచారం -
ఎస్సీ, ఎస్టీల శ్మశానవాటికలకు స్థలాలు
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికలు లేనిచోట వెంటనే స్థలాలు కేటాయించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. స్థలాలను గుర్తించే ప్రక్రియను వారంపది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డీఓలకు సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటిపై తీసుకున్న చర్యలు, అందించిన పరిహారం, ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లోని సమస్యలు, గత సమావేశపు అజెండాపై తీసుకున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై వెంటనే కేసులు నమోదు చేయాడంతో పాటు, బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సాయాన్ని, పరిహారాన్ని అందించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించి, పరిశుభ్రంగా తయారు చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ ఎస్.సేతుమాధవన్, ఇన్చార్జి డీఆర్వో మురళి, సాంఘిక సంక్షేమశాఖడీడీ ఎం.అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు బసవ సూర్యనారాయణ, సున్నపు రామస్వామి, చంపి సన్యాసిరావు, మజ్జి గణపతి, ఎం.రాము, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్/రామభద్రపురం: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్లో నమోదైన రెండు చోరీ కేసుల్లో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ముద్దాయి జోకాడ భగవాన్(22)కు ఐదేళ్ల 10 నెలల జైలుశిక్ష, రూ.8 వేలు జరిమానా విఽధిస్తూ సాలూరు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే.. 2023లో రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలో వి.కాంతమ్మ ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలోను.. 2024లో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్లోను జోకాడ భగవాన్ చొరబడి రూ.లక్షా 60వేల నగదు, తులం చెవిదిద్దులు, ఒక ల్యాప్టాప్ దొంగిలించాడు. అప్పట్లో బాధితులు ఇచ్చిన సమాచారంపై రామభద్రపురం పోలీసులు రెండు చోరీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జడ్జి నేరం రుజువుకావడంతో గురువారం పైవిధంగా జైలుశిక్ష, జరిమానా విధించారు. కాగా జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు మాసాలు సాధారణ జైలుశిక్షను అనుభవించాలని సాలూరు జైఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పులో పేర్కొన్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. ఈ కేసులో వాదనలు వినిపించిన వీహెచ్కే శర్మ, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభద్రపురం ఎస్సై ప్రసాద్లు సకాలంలో కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
బీసీసీఐ అంపైర్ పరీక్షల్లో తోట విజయ్ ఉత్తీర్ణత
విజయనగరం: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో గత నెలలో అహమ్మదాబాద్లో నిర్వహించిన బీసీసీఐ అంపైర్ల పరీక్షల్లో విజయనగరానికి చెందిన తోట విజయ్ ఉత్తీర్ణత సాధించారు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అంపైర్ల పరీక్షల్లో జిల్లా చరిత్రలో తోట విజయ్ అంపైర్ సర్టిఫికేషన్ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు సాధించారు. అంతేకాకుండా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అర్హత పొందిన ఏకై క అభ్యర్థి కూడా ఆయనే. ఆయన సాధించిన విజయం విజయనగరం క్రికెట్కు గర్వకారణమే కాకుండా భవిష్యత్ అంపైర్లకు ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పటికే విజయ్ అంతర్జాతీయ మ్యాచ్లకు స్కోరర్గా వ్యవహరిస్తున్నారు. తోట విజయ్ బీసీసీఐ అంపైర్ల పరీక్ష ఉత్తీర్ణత కావడంతో ఇకనుంచి దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్, అంతర్రాష్ట్ర క్రికెట్ మ్యాచ్లకు ఎంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా విజయ్కు జిల్లా క్రికెట్ అసోసియేషన్, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధులు, పలువురు కోచ్లు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.పీఎం జుగా నిధులతో పాఠశాలలకు భవనాల నిర్మాణం● సాక్షి కథనానికి స్పందన పార్వతీపురం/మక్కువ: పీఎం జుగా, పీఎం జన్మన్ నిధులు మంజూరైన వెంటనే పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు గురువారం (జూలై 3న) ‘‘సాక్షి’’ దినపత్రికలో ‘‘గిరిజన బిడ్డల చదువుల కష్టాలు’’ శీర్షికన ప్రచురితమైన కథనం పట్ల ఆమె స్పందిస్తూ మక్కువ మండలంలోని ఎర్ర సామంతులవలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గిరిజన ప్రాథమిక పాఠశాల చిలకమెండంగిలో 8మంది విద్యార్థులు చదువుతున్నారని, రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల్లో 352 పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 58గిరిజన ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేనందున పీఎం జుగా, పీఎం జన్మన్ కింద పాఠశాలల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు. వర్షాలకు కూలిన పెంకుటిళ్లుజామి: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలకేంద్రం జామి లో రెండు పెంకుటిళ్లు గురువారం కూలిపోయాయి. గ్రామానికి చెందిన రాజాన సీతారాం, సీరెడ్డి సింహాచలంల పెంకుటిళ్లు వర్షాలకు నానడంతో కూలిపోయాయని గ్రామస్తులు, బాధితులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. తైక్వాండో విజేతలకు సత్కారంపార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం సత్కరించారు. అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్తరఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో జూన్ 23 నుంచి 25 వరకు జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో అండర్ 25 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షణ్ముఖ్ సిద్ధార్థ నాయుడు, అండర్ 48 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బుగత హర్షవర్ధన్, మహిళల విభాగంలో అండర్ 32 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఇజ్జాడ వైష్ణవిదేవిలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. -
ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం
–8లోవిద్యావ్యాపారం..! ఇంటర్మీడియట్ విద్య కోట్ల ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మారింది. వివిధ బ్యాచ్ల పేరుతో దోపిడీ సాగుతోంది. విజయనగరం: ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించేవారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతున్న మోసాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుచేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం మండల స్థాయి నాయకులు గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన అనంతరం ఆ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి కూటమి పాలనను వివరించాలన్నారు. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలే జగన్మోహన్రెడ్డి కావాలో.... చంద్రబాబు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన పూల్బాగ్లోని ఓ కల్యాణమండపంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట ప్రజలను ఏ విధంగా కూటమి నేతలు వంచిస్తున్నారో వీడియోలు ప్రదర్శించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. హామీలను విస్మరించడం దగా చేయడం కాదా..? ఇంత వేగంగా పార్టీ శ్రేణులను కలవాల్సి వస్తుందని అనుకోలేదు. ఐదేళ్లు ప్రభుత్వ పాలనలో ఎన్నికలకు రెండేళ్లు ముందు పార్టీ విధి విధానాలతో ప్రజల్లోకి వెళ్లడం ఆనవాయితీ. ఈ రోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఎన్నికల ప్రణాళికలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలను భగవద్గీతగా, ఖురాన్గా, బైబుల్గా భావించి అమలు చేశాం. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అలానే అమలు చేస్తుందని 5 కోట్ల మంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఏడాది కాలం మాయమాటలతో పబ్బంగడిపేసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారం పక్షం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను మెడలు వంచి అమలు చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామంటూ బాండ్ పేపర్లు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఏడాదిగా ప్రతిజ్ఞను పక్కనపెట్టి మోసం చేస్తున్నారు. ఇది ప్రజలను దగా చేయటం కాదా అని ప్రశ్నిస్తున్నా. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి గ్రామాల్లో చేసిన వాగ్దానాలను ప్రశ్నించాలి కూటమి నాయకులు ఎన్నికలకు ముందు గ్రామాల్లోకి వచ్చి చేసిన వాగ్దానాలపై ప్రశ్నించాలి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను చెప్పేందుకే బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం. జగన్మోహన్రెడ్డి న్యాయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. కూటమి నేతలు మాయమాటలతో పాలన చేస్తున్నారు. 150 హామీలు ఎక్కడ అమలు చేశారో... ఎవరికి చేశారో చెప్పాలి. ప్రశ్నించే వారిపై రెడ్బుక్ పేరిట భయపెడుతున్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను ప్రజల్లో నిలదీయాలి. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు మోసగించినా నమ్ముతారనే భావనలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేయడం అలవాటైపోయింది. ఎన్ని మోసాలు చేసినా ప్రజల నమ్ముతారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అలాంటి పాలనే సాగించారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన జగన్మోహన్రెడ్డిని ఓడించి బాధపడుతున్నారు. ఓడినా ప్రజల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమైన జగన్మోహన్రెడ్డి ధైర్యానికి సలామ్ చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలి. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం సమావేశానికి హాజరైన నాయకగణం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, అల్లాడ సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిరిపురపు జగన్మోహన్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు పి.కృష్ణవేణి, యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి తూర్పటి వరలక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి తూముల అచ్యుతవల్లి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా ఉపాధ్యక్షురాలు మూకల కస్తూరి, జిల్లా అధికార ప్రతినిధులు సముద్రపు రామారావు, రేగాన శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, కందుల రఘుబాబు, రొంగలి జగన్నాథం, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షుడు, నగరాధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో కూటమి వైఫల్యం ప్రమాణాలు చేస్తున్నామంటూ ఇచ్చిన బాండ్లకు విలువ ఎక్కడ..? బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై ఇంటింటా ప్రచారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 5 వారాల బృహత్తర కార్యక్రమం హామీల అమలుపై ప్రజలతో చర్చించి చైతన్యవంతులు చేయండి పార్టీ శ్రేణులకు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు -
కూటమి మోసాన్ని వివరిద్దాం
ఏడాది పాలనలో కూటమి నాయకులను నమ్మి ఓట్లేసిన ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, మోసాన్ని వివరిద్దాం. జిల్లాకు చెందిన మంత్రి ఇచ్చిన పింఛన్ల అమలుకు మూడునెలలైనా దిక్కులేకుండా పోయింది. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సమావేశాలు అనంతరం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవ్వాలి. తద్వారా పార్టీని పునఃనిర్మించుకుందాం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడించేందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుదాం. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. రానున్న రోజుల్లో పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యమిస్తాం. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం -
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోందిఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలసచదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు -
రాజధానికి జిందాల్ సెగ
● షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్కు నిర్వాసితుల వినతి శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ తమతో ఆడుతున్న ఆటలతో అలిసిపోయిన నిర్వాసితులు తమ నిరసన సెగ రాజధానిని తాకేలా చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు జిందాల్ నిర్వాసితులు రాజధాని అమరావతిలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కానందున తమ భూములు తమకివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్కులకు కావాలంటే కొత్తగా భూసేకరణ చేయాలని, తాటిపూడి నీరు తాగునీటి అవసరాలకు కేటాయించాలని, శాంతియుతంగా పోరాడుతున్న తమపై పోలీసుల దమనకాండను నిరోధించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే ప్రజాదర్బార్లోను, జనసేన కేంద్ర కార్యాలయంలోను వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు ఎం.సన్యాసిరావు, జి.ఈశ్వరరావు, ఎం.సన్యాసమ్మ, డి.సింహాచలం, బి.లక్ష్మణరావు, పి.రేవతి, కె.పైడితల్లి, బి,విజయ్బాబు, కేత వీరన్న, కిల్లో అర్జున, కె.సన్యాసిరావు, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు
● ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రుల్లో షెడ్యూల తెగల ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు అఽధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ విభాగాలను, జనరల్ వార్డు, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటిస్కాన్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు, భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఘోషాఆస్పత్రిని సందర్శించి ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు, పోషకాహారం అందించే వార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ.రమణి తదితరులు పాల్గొన్నారు. -
హోటల్స్పై విజిలెన్స్ దాడులు
రాజాం సిటీ: పట్టణంలోని పలు హోటల్స్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ను హోటల్స్లో అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. మూడు హోటల్స్లో రూ.24,432లు విలువ చేసే 10 సిలిండర్లు సీజ్ చేయడంతో పాటు 6ఎ కేసులు నమోదుచేశామన్నారు. ఈ దాడుల్లో హెచ్సీ కామేశ్వరరావు, పురుషోత్తం, కన్నబాబు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 6న చెస్పోటీలుసాలూరు: ఆంధ్రా చెస్ అసోసియేషన్ తరఫున సాలూరు పట్టణంలోని చినబజారు వద్ద గల ఆర్యవైశ్యధర్మశాలలో ఈ నెల 6న చెస్పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కో ఆర్డినేటర్ తిరుమలేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.16 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహించే ఈ పోటీలను బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 8008008272,9182337499 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మహిళలకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణా తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వసతిగృహంలో నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు బుధవారం తెలిపారు. పురుషుల కోసం 30 రోజుల సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసు కోర్సు, లైట్ మోటార్ వెహికల్ ఓనర్ డ్రైవర్ కోర్సులపై శిక్షణ ఉంటుందని తెలిపారు. వసతి భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పించే ఈ కోర్సులకు తెల్లకార్డుదారులు, 45 ఏళ్లలోపున్న గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9959521662, 9985787820 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. అయ్యరకులకు తీవ్ర అన్యాయం●● కులస్తుల రాష్ట్ర అసోషియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎన్ పాత్రుడుకొత్తవలస: కూటమి ప్రభుత్వం అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేటికీ అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని ఆ కులస్తుల రాష్ట్ర ఆసోసియేషన్ అధ్యక్షుడు పీఎస్ఎన్ పాత్రుడు అన్నారు. ఈ మేరకు కొత్తవలస మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామంలో ఆయన స్థానిక విలేకరులతో బుధవారం మాట్లాడారు. అయ్యరక కులస్తులకు ఓసీ రిజరేషన్ ఉండగా అనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేకరరెడ్డి చలించి బీసీ రిజరేషన్ కల్పించి అక్కున చేర్ఛుకున్నారని గుర్తుచేవారు. అదేవిధంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్.జగన్మోహన్రెడ్డి అయ్యరక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్, 11 మంది డైరెక్టర్లను నియమించి సముచిత స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అయ్యరక కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేద వ్యక్తం చేశారు. 2014–19 చంద్రబాబు పాలనలో అయ్యరక కులస్తులను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయినా నేటికీ తమ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేకపోవడం వద్ద తమ కులస్తులను చిన్నచూపు చూసి అవమాన పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అయ్యరక కులస్తులు ఉన్నారని గుర్తు చేశారు. వారంతా తిరగబడకక ముందే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అయ్యరక కార్పొరేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
పనుల పూర్తికి ఆరుమాసాల గడువు
● ఇంజినీర్లను ఆదేశించిన కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, జలవనరులు, ప్రజా ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, ఏపీ ఎంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ, ఏపీ టిడ్కో, గృహ నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టిన పనులన్నీ ఆరు మాసాల్లోగా పూర్తికావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సిద్ధం చేసి శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొన్నారు. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధసమావేశంలో కల్టెర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కార్యక్రమం కింద చేపట్టిన రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన పీఎం జన్మన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ, ప్రతివారం, ప్రతి మాసం సాధించిన ప్రగతి వివరాలను తనకు సమర్పించాలని, ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించి కొనసాగుతున్న పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని తేల్చిచెప్పారు. అలాగే శతశాతం పనులు పూర్తయి ప్రారంభం కాని గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర కట్టడాలను శాసనసభ్యుల ద్వారా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో అవసరమైన పనులను గుర్తించి, వాటి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అటువంటి వాటిని ఆయా నియోజక వర్గ శాసనసభ్యుల ఆమోదంతో ప్రతిపాదిస్తే, వాటికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో పూర్తయిన గృహాలను, అదేవిధంగా లేఅవుట్స్లో పూర్తయిన గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఒ.ప్రభాకరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రక్తహీనత నివారణలో పురోగతి ఉండాలి
పార్వతీపురం రూరల్: రక్తహీనత నివారణే ధ్యేయంగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న ఎనీమియా ఏక్షన్ కమిటీల ద్వారా పురోగతి సాధించే దిశగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలంలోని తాళ్లబురిడి, పెదబొండపల్లిలో నిర్వహించిన ఎనీమియా ఏక్షన్ కమిటీలను(ఏఏసీ) బుధవారం ఆయన పర్యవేక్షించారు. రక్తహీనత నివారణకు ఏ విధమైన కార్యాచరణ చేపడుతున్నారు? చేసిన కమిటీ తీర్మానం, రక్తహీనతగా గుర్తించిన గర్భిణి, బాలింతల వివరాలు అయన రికార్డులో పరిశీలించారు. గతనెలలో రక్తహీనత నివేదికల్లో ప్రస్తుతం పురోగతిపై ఆరా తీశారు. అనంతరం గర్భిణి, బాలింతలకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై వివరించి అంగన్వాడీ కేంద్రం నుంచి అందజేస్తున్న టీహెచ్ఆర్ సద్వినియోగం చేసుకోవాలని, కిల్కారీ మొబైల్ సందేశాన్ని పాటించాలని సూచించారు. ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలన్నారు. గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్ఓ గర్భిణులకు పౌష్టికాహారం అందజేసి సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీపీఎంఓ డా.పీఎల్ రఘుకుమార్, వైద్యాధికారులు డా.కౌశిక్, ధరణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు జరిమానా
నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండను సీతారామునిపేట జంక్షన్ వద్ద పలువురు అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న అంశంపై గత నెల 27న ‘రామయ్యా..చూడవేమయ్యా..! శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించింది. రెవెన్యూ, మైనింగ్, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి బుధవారం వెళ్లి పరిశీలించారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలపై ఆరా తీశారు. తంగుడుబిల్లి గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తికి రూ.15 వేలు జరిమానా విధించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సతీష్, వీఆర్వో షలీమా, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
ఏనుగుల సంచారంతో బెంబేలు
వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా ఒకే ప్రదేశంలో తిష్ఠవేయడంతో అటు ప్రయాణికులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా మడ్డువలస వంతెన ఆవరణలోని పంటపొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాల్లో చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో మడ్డువలస, సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వంగర–రాజాం రోడ్డును ఆనుకుని ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో పలుమార్లు పోలీస్, అటవీశాఖ అధికారులు రోడ్డును బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. రైతులు, వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలిఫెంట్ ట్రాకర్స్, రోడ్డుపై ఉన్న వివిధ శాఖల అధికారుల పరిశీలన అనంతరం ఏనుగులు సంచరించే ప్రదేశాలు దాటుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఏనుగులు సంచరించే ప్రాంతంలో రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హరి రమణారావు తెలిపారు. మడ్డువలస వద్ద ఏనుగుల గుంపును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మడ్డువలస బ్రిడ్జి ఆవరణలో తిష్ఠ -
చిల్లంగి నెపంతో మహిళ హత్య?
బొబ్బిలి: పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ(45) అనే మహిళ హత్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం తాను నివసిస్తున్న ఇంట్లోంచి తీవ్ర గాయాలతో అరుస్తూ వచ్చి గుమ్మం వద్ద పడిపోవడంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో పోస్ట్మార్టం రూమ్కు తరలించారు. పక్క పక్క ఇళ్లలో ఉంటున్న కుటుంబసభ్యులే హతమార్చి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కరగాని పద్మ పలువురి ఇళ్లలో పనులు చేసుకుంటోంది. భర్త పైడిరాజు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లై ఆటోలు నడుపుకుంటూ వేరే చోట ఉంటున్నారు. పద్మ చిల్లంగి పెట్టడం వల్ల తన భార్య చనిపోయిందని, కుమారుడు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీనందటికీ పద్మే కారణమన్న అనుమానంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. డీఎస్పీ పరిశీలన ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ జి.భవ్యారెడ్డి మృతురాలు పద్మ నివసిస్తున్న ఇంటిని పరిసరాలను పరిశీలించారు. ఎస్సై రమేష్కుమార్తో కలిసి కుటుంబసభ్యులు, స్థానికులను విచారణ చేశారు. అనంతరం క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. కత్తిపీటపై పడిపోయిందని.. డీఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను విచారణ చేయగా పద్మ కత్తిపీటమీద పడిపోయిందని, గాయాల పాలై చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్స్కు బకాయి జీతాలివ్వాలి
విజయనగరం ఫోర్ట్: ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ రెన్యువల్ చేసి వెంటనే బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఇప్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాన్ డేస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సస్పెన్షన్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్స్ను విధుల్లోకి తీసుకోవాలని ఎన్ఎంఎంఎస్యాప్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్స్పై పని ఒత్తిడిని పెంచే విధానాన్ని విడనాడాలని కోరు. కార్యక్రమంలో లక్ష్మి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ విజ్ఞప్తి -
రైతన్నకు ఎరువు కష్టాలు!
ఎరువు కోసం మూడు రోజులుగా తిరుగుతున్నాం.. ఎరువు కోసం మూడు రోజులుగా బొబ్బిలికి 12 కిలోమీటర్ల దూరంలోని కమ్మవలస నుంచి బస్సులో వచ్చి వెళ్తున్నాం. యూరియా, డీఏపీ కావాలి. మొక్కజొన్న, వరివెద, తదితర పంటలకు అవసరమైన యూరియా కోసం రోజూ తిరగాల్సి వస్తోంది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. – రాగాల లోకనాథం, కమ్మవలస, బొబ్బిలి మండలం బొబ్బిలి/బాడంగి: రైతన్నకు ఎరువు కష్టాలు ఆరంభమయ్యా యి. ఎరువుల కోసం పల్లెల నుంచి పట్టణాల్లోని ప్రైవేటు దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఆధార్ కార్డులు పట్టుకుని గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఎరువుల కోసం చెప్పులు, సంచులు లైన్గా పెట్టుకునే రోజులను కూటమి ప్రభుత్వం మళ్లీ తెచ్చిందంటూ వాపోతున్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ ముందే రైతన్నకు కావాల్సిన ఎరువు అందేది. ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా ఎరువు ఇంటికి చేరేది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ఏటా పెట్టుబడి సాయం అందేది. పంట సాగుకు ధీమా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, ఆర్బీకేలను ఆర్ఎస్కేలుగా పేరుమార్చడమే తప్ప కూటమి ప్రభుత్వం రైతుకు చేసిన సాయం శూన్యమని విమర్శిస్తున్నారు. పంటల సాగు సమయంలో పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం తిరగాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతన్న ఎరువు కష్టాలను వ్యవసాయ శాఖ ఏడీ ఎం.శ్యాంసుందర్ వద్ద ప్రస్తావించగా యూరియా కొరత లేదని, అన్ని రైతు సేవా కేంద్రాల్లో నిల్వలున్నాయని, వీటిని ఈనెల 5 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు నిల్వ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నారే తప్ప ఇప్పుడు అంత అవసరం లేదన్నారు. -
ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూల్బాగ్లోని జగన్నాథ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. శాసనమండలి విపక్షనేత బొత్ససత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుల ఆధ్వర్యంలో సాగే సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనపై చర్చించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణా ళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, ఎంఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రాజీయే ఉత్తమ మార్గం
విజయనగరం క్రైమ్: రాజీయే రాజమార్గమని, జిల్లాలో ఈ నెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ సిబ్బంది చొరవచూపాలని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ, ఆస్తి, క్రిమినల్, ట్రాఫిక్ కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా కక్షిదారులను ప్రోత్సహించాలన్నారు. కేసుల రాజీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయడంలో సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు. ● లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ● పోలీస్ సిబ్బందికి ఎస్పీ పిలుపు -
● వర్షంలోనూ కొనసాగిన ఆందోళన
జిందాల్ నిర్వాసితులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బొడ్డవరలో బుధవారం ఆందోళన కొనసాగించారు. భూములకు పూర్తిస్థాయి పరిహారం అందజేయాలని, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి, జీవనాధారం లేక, పరిహారం అందక రోడ్డున పడి రోదిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షం వహించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రెడ్కార్పెట్ వేయడం తగదన్నారు. జిల్లా కలెక్టర్, జిందాల్ కలెక్టర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐదు పంచాయతీలకు చెందిన నిర్వాసితులతో పాటు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ పాల్గొన్నారు. – ఎస్.కోట -
● టార్పాలిన్లే రక్షణ
చిత్రంలో కనిపిస్తున్నది లక్కవరపుకోట మండల కేంద్రంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడి అద్దె భవనంలో బ్యాంకు నిర్వహిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కారిపోతోంది. విధుల నిర్వహణకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లపై టార్పాలిన్లు వేసి విధులు నిర్వర్తిస్తున్నారు. రికార్డులు తడిసి ముద్దవుతుండడంతో బ్యాంకు ఉద్యోగులతో పాటు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన బ్యాంకును వేరే భవనంలోకి మార్చాలంటూ ఖాతాదారులు కోరుతున్నారు. – లక్కవరపుకోట -
మంత్రి ఇలాకాలో తప్పని డోలీమోత..
సాలూరు/సాలూరురూరల్: డోలీమోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువకాసాయివలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుల సుమారు 5 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో సువర్ణముఖి నదిని దాటి కురుకూటి పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యసేవల కోసం సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డోలీ మోతలు లేకుండా కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటుచేశామని మంత్రి ప్రకటించిన కరడవలస పంచాయతీ పరిధిలోని ఎగువ కాసాయివలసకు చెందిన ఆశ వర్కర్నే డోలీలో తరలించడం గమనార్హం. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తామన్న మంత్రి సంధ్యారాణి ప్రకటనలకే పరిమితమవుతున్నారని, చేసేదేమీ లేదని సీపీఎం సాలూరు మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఆశవర్కర్ శ్యామలను ఆయన పరామర్శించారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. -
హామీల అమలుపై అబద్ధాలు
● కూటమి ఏడాది పాలనలో చితికిపోయిన పేదకుటుంబాలు ● ప్రజల్లోకి ప్రభుత్వ మోసకారి పాలన ● ఏడాదిలో కనీస అభివృద్ధికి నోచుకోని జిల్లా ● జనాదరణ చూసి ఓర్వలేకే జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు ● ఈ నెల 3న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జగన్పై తప్పుడు కేసులు ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అత్యంత ప్రజాదరణ వస్తుండడం చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. కేవలం భయబ్రాంతులను చేసేందుకు పోలీసులను ఉపయోగించి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా జగన్మోహన్రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. విజయనగరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అబద్ధాలు చెబుతూ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు ఏం మేలు చేశామని ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి నేతలు చెప్పగలరని ప్రశ్నించారు. కూటమి నాయకత్వంపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి సమావేశం పెడితే ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కూటమి ఏడాది పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హమీలను అమలుచేయకుండా చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. హమీల అమలుపై ఎవరైనా నిలదీస్తే ఊరుకునేది లేదంటూ పరుషపదజాలం ప్రయోగించడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హమీలు అమలుపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనపై మోసకారి మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన బాండ్లుతో పాటు, చేసిన హమీలు, బాబూ ష్యూరిటీ భవిష్యత్ గ్యారింటీ ప్రచారాలు ఎంత వరకు అమలు చేశారో ప్రజలతో చెప్పిస్తామన్నారు. ఏడాది కాలంలో బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ అన్న చందంగా పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. హామీల అమలెక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి, ఆడపిల్ల నిధి కింద నెలకు రూ.1500 తదితర హమీలు అమలెప్పుడో చంద్రబాబు చెప్పాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇస్తామన్న రెండేళ్ల పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన 140కు పైగా హమీల అమలుపై ప్రతి ఇంటికీ వెళ్లి అడిగి తెలుసుకుంటామని, వారికి జరుగుతోన్న నష్టాన్ని వివరిస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రేపు ఏడాదిలో ఏం అభివృద్ధి చేశారు...? ఏడాది కూటమి పాలనలో విజయనగరం జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పింఛన్లు కోసం గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మూడు నెలల కిందట స్పౌజ్ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు జీఓ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేకపోయారని చెప్పారు. ఒక్క విజయనగరం జిల్లాలో 4000 మంది లబ్ధిదారులు పింఛను కోసం ఎదురు చూసే దుస్థితి నెలకొందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదని, కనీసం అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరుకాకుంటే సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామంటూ చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఏడాదిలో గణనీయంగా తగ్గిపోయిందో చెప్పాలన్నారు. జిల్లాలోని మెరకమూడిదాం మండలంలో ఏడాది కాలంలో ప్రభుత్వ బడుల్లో 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. అన్ని వ్యవస్థలు, రంగాలను అవినీతిమయంగా మార్చేశారని... ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య సమన్వయం లేకపోవటం దురదృష్టకరమని వాఖ్యానించారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలోని పూల్బాగ్ జగన్నాథ కళ్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, జిల్లా పార్టీ కోశాదికారి సిరిపురపు జగన్మోహన్రావు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారయణ, వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు బూర్లె నరేష్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా వరమా? శాపమా?
అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు... సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ● స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం. ● ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం.విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికై ంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకుంటే ‘ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీఽథింగ్’ అంటూ ఫొటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యామిలీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్ బాక్స్ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు. తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునేవారితోనే సమస్యంతా. మంచికి వాడుకుందాం.. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యువతపై అత్యధిక ప్రభావం సెల్ఫీల మోజు బాగా పెరిగింది..సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వై.సతీష్ కుమార్, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం తల్లిదండ్రులు నియంత్రించాలి.. అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. – ప్రశాంత్ కుమార్ ఎంఎస్సీ సైకాలజీ, విజయనగరం -
కళ్లకు గంతలతో నిరసన
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ కళ్లు మూసి జెల్ల కొట్టిందని, తడి గుడ్డతో రైతుల గొంతు కోసిందని నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రఘురాజు నివాసం వద్ద మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రోడ్డుమీద కళ్లకు గంతలు కట్టుకుని జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిందాల్తో చేతులు కలిపి అన్ని పార్టీల నాయకులు, జిల్లా అధికారులు తమను కళ్లు మూసి జెల్ల కొట్టారని, జిందాల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని, వాపోయారు. జిల్లా పెద్దదిక్కు అయిన కలెక్టర్ తన ఉద్యోగం మరిచిపోయి జిందాల్ ప్రతినిధిలా మాట్లాడటం విద్డూరంగా ఉందని, నాడు నమ్మించి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటికీ ముఖం చూపడం లేదన్నారు. నాడు జిందాల్ ఇచ్చిన హామీలు ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారని అడిగితే చెప్పకుండా ముఖం చాటేయడం న్యాయమా? జీవనోపాధి అయిన భూములు కోల్పోయి న్యాయం అడిగితే మమ్మల్ని పోలీసుల్ని పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్సీ లేఖ జిందాల్ భూసమస్య చుట్టూ తతెత్తుతున్న పరిస్థితి అర్దం చేసుకోవాలని, తొలుత నిర్వాసితుల శాంతియుత నిరసనకు అనుమతించి తర్వాత వారిని అనుమతించక పోవడం వల్ల నిర్వాసితులు తన ఇంటికి వస్తున్నారని, స్థానికుడిని కావడం వల్ల వారిని కాదనలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి అనుమతించి, తనపై ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ రఘురాజు కలెక్టర్, ఎస్పీలకు లేఖలు ఇచ్చారు. జిందాల్ మోసం చేసిందని నిర్వాసితుల ఆందోళన -
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: తాగునీరు, భూమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీ దొందమానుగూడ గ్రామ గిరిజనులు పలువురు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావును కలిసి వినతపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఉన్న చైర్మన్ ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. మంచినీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామస్థాయిలో భూ సమస్యలపై చైర్మన్తో చర్చించారు. పైనాపిల్, కొండచీపుళ్లు, చిరుధాన్యాలు వంటి పంటలకు గిట్టుబాబు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సవర సింహాచలం, హడ్డుబంగి శేషమ్మ ఉన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి -
● రేషన్ కష్టాలు
రేషన్ కోసం వరండాలో నిరీక్షిస్తున్న లబ్ధిదారులు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడంతో లబ్ధిదారులకు ప్రతినెలా కష్టాలు తప్పడం లేదు. పనులు మానుకుని రేషన్ కోసం గంటల తరబడి డిపోల వద్ద నిరీక్షిస్తున్నారు. గతంలో వలే ఇంటివద్దకే వచ్చి సరుకులు అందజేస్తే ఈ కష్టాలు ఉండేవి కావని చెబుతున్నారు. రేషన్ కోసం విజయనగరంలోని ధర్మపురి వద్ద నిరీక్షిస్తున్న లబ్ధిదారులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
● 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్ విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్లో 8వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలిజీ, ఎంబీఏ, 9వ తేదీన పీజీ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా యూనివర్సిటీకి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యవకుల అరెస్టు విజయనగరం క్రైమ్: విజయనగరం సీఎంఆర్ కూడలి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం అరెస్టు చేసినట్టు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గాజులరేగకు చెందిన బెవర గణేష్, పద్మావతి నగర్కు చెందిన బోగి రాహుల్ 300 గ్రాముల గంజాయిని ప్యాకెట్లలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మున్సిపల్ ఉద్యోగుల వినూత్న నిరసన నెల్లిమర్ల: కూటమి ప్రభుత్వ తీరుపై నెల్లిమర్ల నగర పంచాయతీ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకుని వినూత్నరీతిలో మంగళవారం నిరసన తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ తారక్నాథ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గోవింద్, బాబూరావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. దొంగతనానికి వెళ్లి.. అక్కడే నిద్రపోయి.. బొబ్బిలి: ఓ ఇంటిలో ఐదు రోజులుగా దొంగతనం చేస్తూ అదే ఇంటింలో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి పట్టణం గొల్లపల్లి అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న శీర శ్రీనివాసరావు వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట స్వగ్రామమైన అలజంగి వెళ్లారు. ఈ విషయాన్ని కనిపెట్టిన పిరిడి గ్రామానికి చెందిన కె.కృష్ణ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న వెండి, ఇత్తడి సామాన్లు దొంగిలించి విక్రయించడం, కొనకపోతే తాకట్టు పెట్టడం చేసి మద్యం కొనుగోలు చేసి ఆ ఇంట్లోకే వెళ్లి తాగుతూ, తింటూ గడిపాడు. ఐదు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఇంటి యజమాని మరో రెండు రోజులు రాడనుకున్నాడో ఏమో మంగళవారం కూడా మరికొన్ని సామాన్లు విక్రయించి పూటుగా మద్యం తాగి ఎప్పటివలే చల్లగా ఉందని ఇంటి గచ్చుపై నిద్రపోయాడు. స్థానికులు దొంగను గుర్తించి అలజంగిలో ఉన్న శ్రీనివాసరావుకు సమాచారమందించారు. ఈ లోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న ఎస్ఐ ఆర్.రమేష్ కుమార్ తన సిబ్బందితో వచ్చ దొంగను పట్టుకున్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో పిరిడిలోని కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. అతడిని ఇంటికి పంపొద్దంటూ కుటుంబ సభ్యులు తిరిగి పోలీసులను వేడుకోవడం గమనార్హం. కేసు నమోదు చేయడమా, లేదంటే దొంగకు కౌన్సెలింగ్ ఇవ్వడమా అన్నది బుధవారం తేల్చుతామని ఎస్ఐ తెలిపారు. -
మీ సేవలు వెలకట్టలేనివి
● ఎస్పీ వకుల్ జిందల్ ● ఉద్యోగవిరమణ పొందిన ఐదుగురు అధికారులకు ఘన సన్మానం విజయనగరం క్రైమ్: సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించిన పోలీస్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐలు సర్దార్ ఖాన్, ముడసాల వేణుగోపాలస్వామి, కుచ్చర్లపాటి తిరుమలరాజు, జామి ఏఎస్ఐ ఆర్వీఏ నర్సింగరావు, ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ఎస్ఐ ఊయక గుంపస్వామిలను జిల్లా పోలీస్శాఖ తరఫున జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే క్లిష్టపరిస్థితులు, విభిన్న వాతావరణంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధచూపేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఐదుగురు అధికారులు పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించడంతో పాటు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విశ్రాంత జీవితాన్ని ఆనందంగా సాగించాలని, సమాజానికి సేవ చేయాలని, పోలీస్ శాఖ తరఫున ఎలాంటి సాయం కావాలన్నా సంప్రదించాలని సూచించారు. అనంతరం ఉద్యోగుల దంపతులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. జిల్లా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున గిఫ్ట్ చెక్కులను అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను అందించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ ఏఆర్ జి.నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ వై.రవీంద్రారెడ్డి, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.కె.చౌదరి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్. గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్.రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొంతమందికే ప్రోత్సాహకం..!
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు జేఎస్వై లబ్ధి ● ఏప్రిల్ నుంచి జూన్ 26వరకు 1842 మంది ఆన్లైన్లో నమోదు ● 1232 మందికి మాత్రమే నగదు జమ ● ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిన కూటమి సర్కారువిజయనగరం ఫోర్ట్: మాతాశిశు సంక్షేమానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలను ప్రోత్సహించడం కోసం అందించే జేఎస్వై ప్రోత్సాహకాలు అందించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందరికీ కాకుండా కొంతమందికి ఇచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద ఇచ్చేది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవాలు జరిగే ఆస్పత్రులు జిల్లాలో ఎస్.కోట, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి సీహెచ్సీలు, ఘోషాఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతాయి. అదేవిధంగా జిల్లాలో ఉన్న 48 పీహెచ్సీల్లోనూ ప్రసవాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే బాలింతలకు జననీ సురక్ష యోజన కింద ప్రోత్సాహకం (జేఎస్వై) అందజేస్తారు. గ్రామీణ ప్రాంత తల్లులకు రూ.1000, పట్టణ ప్రాంత తల్లులకు రూ.600 ఇస్తారు. 1842మంది తల్లుల నమోదు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి జూన్ 26వతేదీ నాటికి ఎంఎస్ఎస్ పోర్టల్లో 1842 తల్లులు వివరాలు అప్లోడ్ చేశారు. అందులో 1232 మందికి మత్రమే నగదు జమ అయింది. 610 మందికి జేఎస్వై ప్రోత్సాహకం అందాల్సి ఉంది.మిగిలిన వారికి త్వరలో అందజేతజేఎస్వై కింద గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంత మహిళలకు రూ.600 చొప్పన ప్రోత్సాహకం అందించనున్నాం. ఈ ఏడాది ఇంతవరకు 1842 మందికి గాను 1232 మందికి ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగతా 610 మందికి కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతుంది. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం విజయవంతం చేద్దాం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ముఖ్యనాయకులతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 5న శనివారం మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రంలో గల రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన వైఎస్సార్సీపీ శ్రేణులతో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబులు హాజరవుతారని తెలియజేశారు. పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనాయకులు హాజరు కానున్నారన్నారు. అందరూ హాజరుకావాలి ఈ సమావేశానికి పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో గల మూడు మండలాలు, పురపాలక సంఘం నుంచి పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొంగు చిట్టిరాజు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బంకురు రవికుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తప్పెట ప్రసాద్, అధికార ప్రతినిధి మువ్వల సత్యం నాయుడు, జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పీఎస్ఆర్ నాయుడు, ఎంపీటీసీలు బడే రామారావు, వై.రమణ, సర్పంచ్లు తీళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు -
డాక్టర్ దీనకుమార్కు సత్కారం
సీతానగరం: పార్వతీపురం బదిలీ అయిన పశుసంవర్థక ఎ.డి డాక్టర్ సీహెచ్ దీనకుమార్ను పశువైద్య సహాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు. దీర్ఘకాలంగా మండల పశువైద్యాధికారి, సీతానగరం పశువైద్య శాఖసబ్ డివిజినల్ ఎ.డిగా డాక్టర్ దీనకుమార్ సేవలందించిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు కావడంతో పార్వతీపురం సబ్డివిజన్ ఎ.డి గా బదిలీ అయినందున పశువైద్య సహాయకులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సన్మాన గ్రహీత డాక్టర్ దీనకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు అనివార్యమే అయినా విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. సుదీర్ఘకాలం మండలంలో పశువులకు సేవలందించే సదవకాశం తనకు దక్కిందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు. ,శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
పోటాపోటీగా పింఛన్ల పంపిణీ
● రెండు ప్రాంతాల్లో రెండు వర్గాలుగా అందజేత ● టీడీపీలో రాజుకుంటున్న గ్రూపుల కుంపటి శృంగవరపుకోట: మేజర్ పంచాయతీ ఎస్.కోటలో మంగళవారం అధికార టీడీపీ నేతలు రెండు వర్గాలుగా, పోటాపోటీగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే లలితకుమారి తన అనుయాయులతో కలిసి కోటవీధిలో, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు తన అనుయాయులతో కలిసి పుణ్యగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపటికి ఇది నిదర్శనం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి రెండు గ్రూపులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్యే సీటు కోసం ఆశించి భంగపడి, డీసీఎంఎస్ చైర్మన్గిరితో సరిపెట్టుకున్న గొంప కృష్ణ రెండు వర్గాలుగా ఉన్నారు. గొంప కృష్ణ వర్గానికి ఎంపీ భరత్ ఆశీస్సులు మెండుగా ఉన్న విషయం విదితమే. కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నారా లోకేష్ హామీతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్.కోట సర్పంచ్ సంతోషికుమారితో పాటు కొందరు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అసంతృప్తిలో మూడో వర్గం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైస్ ఎంపీపీ సుధారాజు వర్గం అధికార పార్టీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కార్యక్రమాలు వేటికీ తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని మధనపడుతున్నారు. నాడు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచుతున్నారని కలత చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నిధులు, విధులు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఎక్కడా తమ మాట చెల్లడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ దగ్గకు పంచాయితీ? తమకు తగిన గౌరవం దక్కడం లేదని నేరుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసి, నాడు ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని సుధారాజు వర్గం యోచిస్తోంది. ఇందుకోసం లోకేష్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, త్వరలోనే అధిష్టానం పెద్దలకు వాస్తవాలు చెప్పేందుకు అమరావతి వెళ్లనున్నట్లు కచ్చితమైన సమాచారం.