Vizianagaram
-
బతుకు నేర్పిన.. బామ్మలు
విజయనగరం గంటస్తంభం: నేటి సమాజంలో పాతికేళ్లు కూడా నిండని యువకులు తమ చిన్నచిన్న అవసరాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. చేతిలో పనిఉన్నా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు జీవిత పోరాటానికి దూరంగా ఉండి సులభమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆ కోవలో తప్పుదారి పడుతూ అప్పులపాలవుతున్నారు. మరికొందరు ఈజీ మనీకోసం తప్పుదారి పడుతున్నారు. బతుకులను దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ వయసు పైబడినా ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోకుండా చెమటోడ్చి బతుకుతున్న ఈ బామ్మలే నిలువెత్తు స్ఫూర్తి. వయస్సు 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నా, శరీరం ముడతల పడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయనగరం పట్టణంలో చిరు వ్యాపారులు చేస్తూ తమ సంపాదన తమదే అని నిరూపిస్తున్నారు. ఒకరికి పెట్టేచేతులే కాని చాచే చేతులు కావని చెబుతున్నారు. ప్రతిరోజూ వచ్చిన కొద్ది సంపాదనే తమకు రూ.కోట్లతో సమానమని గర్వపడుతున్నారు. చేయి చాచడం కంటే పని చేయడం మేలు... ఒకప్పుడు కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టిన చేతులు ఇవి. పిల్లలను పెంచి పెద్ద చేసి, బంధువులు, అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన గౌరవం మాది. అలాంటి చేతులు ఇప్పుడు తమ అవసరాల కోసం ఎవరిముందూ చాచడానికి సిద్ధంగా లేవు. వయసు పెరిగిందనే కారణంతో ఇతరులపై ఆధారపడాలని భావించడం లేదు. తమకు చేతనైనంత వరకు నిజాయితీగా కష్టపడి సంపాదించి తినడమే గౌరవమని నమ్ముతున్నారు. సమాజం నుంచి జాలి కోరడం కాదు. తమ శ్రమకు తగిన గౌరవం కోరుతున్నారు. మా వయసు కాదు... మాధైర్యం చూడండి.. వీరిలో ప్రతి ఒక్కరి జీవితం ఒక పాఠం. ప్రతి అడుగు ఒక సందేశం. ప్రతి చెమట చుక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎండను లెక్కచేయకుండా రోడ్డుపక్కన కూర్చుని సరుకులు అమ్ముకుంటున్న వీరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఈ వయసులో ఎందుకమ్మా ఈ కష్టం అని అడుగుతుంటారు. అప్పుడు వారి సమాధానం జీవితానికి అర్ధం చెప్పేలా ఉంటుంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, కాలక్షేపాలతో రోజులు గడిపే యువతకు ఈ బామ్మలు నిశ్శబ్ద సందేశం ఇస్తున్నారు. పని చిన్నది కాదు.. వయసు అడ్డంకి కాదు.. ఆత్మగౌరవమే అసలు సంపద అని చేతలతో చెబుతున్నారు. కష్టపడే మనిషికి వయసుతో సంబంధం లేదని, గౌరవంగా బతకాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు కూడా ఓడిపోతాయని నిరూపిస్తున్నారుసంకల్పానికి సలాం చేయాల్సిందే.. ఎండలు మండుతున్నా, ఒంట్లో ఓపిక లేకపోయినా ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోను. నా ముఖం మీద ముడతలు నా వయసునే చూసిస్తాయి కానీ మనసులోని కష్టపడే తత్వాన్ని కాదు. ఎవరి ముందైనా తలవంచి నిలబడడం కంటే, ఇలా రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ గౌరవంగా బతకడమే ఇష్టం. – జాగులు రాములమ్మ(73), గుణపూరుపేట ఈ చేతులు శ్రమిస్తాయే కానీ సాయం కోసం చాచవు ఈ చేతులు ఒకప్పుడు ఎందరికో అన్నం పెట్టాయి నాయనా... ఇప్పుడు నా ఒక్కదాని కడుపు నింపుకోలేనా.. చేతిలో కర్ర పట్టుకున్నా బతుకుపోరాటంలో వెనకడుగు వేయను. ఎవరి ముందైనా చేయిచాచి యాచించడం కంటే, ఈ మల్లెపూలు, తమలపాకులు అమ్ముకుంటూ వచ్చే పది రూపాయల సంపాదనతోనే నా ఆత్మగౌరవం నిలుస్తోంది. – సోము ఆదిమ్మ(75), కోరాడ వీధి, విజయనగరం ముడతలు పడిన చర్మం.. మురిసిపోయే ఆత్మాభిమానం కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే ఈ వయసులోనూ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నా. నా పిల్లలను, కుటుంబాన్ని నేనే రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశా. ఈ చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకూడదన్నదే నా కోరిక. నా కష్టార్జితంతో తినే బువ్వే నాకు కొండంత తృప్తిని ఇస్తుంది. – గోక అప్పయ్యమ్మ(78), ఎల్బీకాలనీ, విజయనగరం -
అర్హత ఉన్నా డీఎస్సీలో పోస్టు రాలేదు
విజయనగరం అర్బన్: నిబంధనల ప్రకారం డీఎస్సీ–2025లో దరఖాస్తు చేసుకుని మెరిట్లో నిలిచిన అభ్యర్థులను నట్టేట ముంచేశారని, అదే తప్పుడు సమాచారంతో వ్యవస్థను మోసం చేసేవారికి రెడ్కార్పెట్ పరిచి ఉద్యోగం ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పీఈటీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలతో పోస్టుకు దూరమయ్యాయని వాపోయారు. ఆయన ఏమన్నారంటే... ‘‘విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక్క పీఈటీ పోస్టు ఉంది. ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందు వరుసలో ఓ యువతి, నేను ఉన్నాం. వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆ యువతికి పోస్టు దక్కింది. అయితే, ఇక్కడ ఒక పెద్ద అక్రమమే చోటుచేసుకుంది. ఆమెది పాఠశాల రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1992 సెప్టెంబర్ 20. పోటీలకు సరిపోయేందుకు సృష్టించిన తప్పుడు పుట్టిన రోజు 1992 మార్చి 10. పాఠశాల విద్య రికార్డుల్లో ఉన్న అసలు పుట్టిన రోజు ప్రకారం చూస్తే... ఆమె పాల్గొన్న సదరు జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆమెకు అసలు వయస్సే సరిపోదు (అర్హత లేదు). ఆ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా వయసును మార్చుతూ పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆ తప్పుడు పత్రంతోనే రిజ్రస్టేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇప్పుడు అవే పతకాలను చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీలో పీఈటీ కొలువును దక్కించుకున్నారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్... స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్పై స్పష్టమైన ఆధారాలతో సహా డీఎస్సీ నిర్వహణ ఉన్నతాధికారులకు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. దానిపై ఎలాంటి విచారణ చేయలేదు. వేర్వేరు పుట్టిన రోజులతో ఎలా చలామణి అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం ఆ పత్రాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా ఏ స్థాయిలోనూ చేయలేదు. ఆమె తప్పుడు పత్రాలతో పతకాలు కొట్టి, ఆ అర్హతతోనే డీఎస్సీ పోస్టుకు ఎంపికైంది. దీంతో తర్వాత స్థానంలో ఉన్న నాకు పోస్టు దూరమైంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నాకు జరిగిన నష్టమే నిదర్శనం’’ అని నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం» వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ వెల్లడి» డీఎస్సీ– 2025లో ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలి» కృష్ణా జిల్లా టాపర్ నవీన్ ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి» డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదు?» ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి విమర్శలు చేయించడం తగదుసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటి నిర్ణయించింది. అక్రమాలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీలో అక్రమాల కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం కొనసాగించాలని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని నిర్ణయించారు. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్గా నిలవడం, అయినా డీఎస్సీలో ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొందరు ఉన్నతాధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డీఎస్సీ– 2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ? » మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి » ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో » అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు » న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు వినతి యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తూనే ఉంది. మెగా డీఎస్సీ–2025లో ఉమెన్స్ కోటాలో అర్హత ఉన్నప్పటికీ ఓ ఎస్టీ మహిళకు పోస్టు దక్కలేదు. ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో తనకు దక్కాల్సిన పోస్టు ఇతరులకు ఏ విధంగా కేటాయించారని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని పాతచెరువు తండాకు చెందిన మూడ క్రాంతి ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మెయిల్ ద్వారా శనివారం వినతి పత్రం పంపింది. అందులో.. ‘‘నేను డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్) పోస్టుకు ప్రకాశం జిల్లాలో ఎస్టీ (ఉమెన్) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఏపీ మెగా డీఎస్సీ ప్రకారం మహిళల రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రూపంలో అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్)గా ఎస్టీ కేటగిరిలో 5 పోస్టులు కేటాయించినా ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు తగిన విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలైందా? అనే అంశంపై సందేహం ఉంది. నేను ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మెరిట్ జాబితాలో 2వ ర్యాంక్ సాధించినా నాకు ఉద్యోగం రాలేదు’’ అని పేర్కొంది. రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో సరైన విధానం అనుసరించారో లేదో పరిశీలించాలని, ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్) పోస్టులకు పూర్తి రోస్టర్ వివరాలు వెల్లడించాలని, ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలును పరిశీలించి ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారం తనకు న్యాయం చేయాలని క్రాంతి కోరింది. ప్రతి 100 రోస్టర్ సైకిల్లో ఎస్టీలకు మొత్తం 6 రోస్టర్ పాయింట్లు ఉంటాయని, వాటిలో 2 పాయింట్లు ఎస్టీ ఉమెన్గా గుర్తించబడ్డాయని క్రాంతి తెలిపారు. జిల్లాలో ఉన్న 92 పోస్టుల్లో 8, 58వ రోస్టర్ పాయింట్ ఎస్టీ ఉమెన్కు దక్కాల్సి ఉండగా 58వ పాయింట్(తనకు దక్కాల్సిన పోస్టు) ఓపెన్ కేటగిరీలో చేర్చి ఎస్టీ అభ్యరి్థకి పోస్టు ఇచ్చారని ఆమె తెలిపింది. -
విద్యార్థుల కలలకు లీకేజీ గండి
● నీట్ లీకేజీపై భగ్గుమన్న విదార్థులు ● ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం విజయనగరం గంటస్తంభం: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం విజయన గరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి బందెల నాసర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తు అని శ్చితిలో పడిందన్నారు. గతంలోనూ నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్మించారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని, విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, జిల్లా నాయకులు వి.గణేష్, సత్యనారాయణ, చరణ్ తేజ, మాధవి, రాము, తదితరులు పాల్గొన్నారు. -
‘యోగాంధ్ర’ వేడుకలకు ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026ను పురస్కరించుకొని జిల్లాలో ఈ నెల 21న చేపడుతున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6.45 నుంచి 7.30 గంటల వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ/వార్డు సచివాలయాల్లో యోగా శిక్షణా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14న 500 మంది ఉపాధి హామీ వేతనదారులతో ‘థిమేటిక్ యోగా’, 18, 20 తేదీల్లో రామనారాయణం, చింతపల్లి బీచ్ వద్ద 500 మందితో ‘టూరిజం యోగా’, జిల్లాలోని 6 ప్రముఖ దేవాలయాల్లో ‘టెంపుల్ యోగా’ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం రాజీవ్ స్టేడియంలో మూడు వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో భారీ ఎత్తున ‘మెగా యోగా’ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9న గ్రామస్థాయి, 10న మండల స్థాయి, 14న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తామని, విజేతలు ఈ నెల 18న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని, జిల్లా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో డిజిటల్ నమోదు చేసుకొని యోగాంధ్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. విలువ ఆధారిత ఉత్పత్తులతో ఆదాయం ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఆదాయం పొందాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి–సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం కింద ఏర్పాటుచేసే యూనిట్లకు 10 శాతం అర్జీదారుడు పెట్టుబడితే బ్యాంకుల నుంచి మిగిలిన 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. రూ.10 లక్షల విలువైన యూనిట్కు 35 శాతం వరకు రాయితీ అందుతుందన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి, కనీస విద్యార్హత కలిగిన వ్యక్తులు, సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 547 యూనిట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. 1100 మంది చెరకు రైతులకు రూ.1.58 కోట్ల రుణం మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సమాఖ్యలను ప్రోత్సహించాలన్నారు. సంఘాల వద్దకే అధికారులు వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఉద్యానశాఖాధికారి కె.చిట్టిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు
● కేంద్రీయ గిరిజన వర్సిటీ ఇన్చార్జి వీసీ శ్రీనివాసన్ విజయనగరం రూరల్: కేంద్రీయ విశ్వ విద్యాలయం పేరుతో సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల్లో కొన్ని నకిలీ నియామక ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల సమాచారంతో తప్పుడు సందేశాలు ప్రచారంలో ఉన్నట్లు విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అభ్యర్థులు నకిలీ ప్రకటనలు నమ్మొద్దని, తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలకు సంబంధించి ధ్రువపత్రాలు అందించవద్దని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపొద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు, సంస్థలు సంప్రదిస్తే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో జరిగే అన్ని నియామకాలు, ఉద్యోగ ప్రకటనల సమాచారం విశ్వ విద్యాలయం వెబ్సైట్లో అధికారికంగా జారీచేస్తామన్నారు. -
ఇదెక్కడి ఘోరమయ్యా...
మేము నిరుపేదలం... మా ఇల్లు చూడండి.. కూలి చేస్తేగానీ కడుపునిండదు.. మేము రాజకీయాలు చేయగలమా?.. మాపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులమంటూ రాజకీయ ముద్రవేశారు. రోడ్డు పక్కన చిన్నస్థలంలో పూరిపాక వేసుకుని తొమ్మిదేళ్లుగా ఇద్దరు పిల్లలతో జీవిస్తుంటే ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసి ఖాళీ చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా.. ఇదెక్కడి ఘోరమయ్యా.. పేదలం ఎలా బతకాలయ్యా.. గూడుకు చోటుకూడా కరువేనా?.. ఇక్కడేమైనా ఆఫీసులు కడతారా?.. అంటూ బాధితురాలు ఎన్నికల సీత విలేకరుల ముందు వాపోయింది. తమ కష్టాల జీవనాన్ని చెబుతూ విలపించింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని గ్రామబహిష్కరణకు పూనుకోవడం సరికాదంటూ వాపోయింది. ఇప్పటికిప్పుడు ఎక్కడకు పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి గూడు చూపాక ఖాళీచేయించాలంటూ ప్రాథేయపడింది. -
విచారణ జరుగుతోంది
విజయనగరం మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. రామభద్రపురంలో మేట్లు రూ.100 అడుగుతున్న అంశంపై కూడా విచారణకు ఆదేశించాం. వేతనదారుల్లో కూడా మార్పు రావాలి. పనిచేసిన దానికి సంబంధించి వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాంటిప్పుడు డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలని వేతనదారులు ప్రశ్నించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయగలం. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా● బినామీ మస్తర్లతో ఉపాధిహామీ నిధుల దోపిడీ ● అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు శూన్యం ● విచారణ పేరుతో సాగదీత ● అధికార బలంతో నిధుల కై ంకర్యం ● ముఖ ఆధారిత హాజరు ప్రవేశపెట్టినా ఆగని ఆక్రమాలు విజయనగరం ఫోర్ట్: పథకం ఏదైనా ‘అధికార’ బలంతో నిధులు కొల్లగొడుతున్నారు. జేబులు నింపుకుంటున్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రెండేళ్లుగా ఉపాధిహామీ పథకంలో అక్రమాలు కో కొల్లలుగా కనిపిస్తున్నా చర్యలు శూన్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్లు వేసి వేతనదారుల నుంచి అక్రమవసూళ్లు, పనిచేయకుండానే చేసినట్టు రికార్డుల్లో ఏమార్చి నిధులు పెద్దమొత్తంలో కై ంక్యర్యం చేయడం పరిపాటిగా మారింది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న’ సామెత చందాన అధికార పార్టీ నాయకులు ఉపాధిహామీ నిధులతో దోచుకునే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి కొందరు అధికారులు సైతం సాయంచేస్తూ వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరును తప్పనిరిసరి చేసినా వివిధ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని నిధులు కాజేస్తుండడం ఉన్నతాధికారులను కలవరపెడుతోంది. ● పని కల్పించేందుకు చేయి తడపాల్సిందే... ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఉపాధి హామీ పథకం మేట్ (మేసీ్త్ర)ల ద్వారా వేతనదారుల నుంచి పని కల్పించడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. మేట్లు అడిగినంత ఇవ్వకపోతే పని కల్పించమని చెప్పడంతో చేసేది లేక వేతనదారులు అడిగినంత ముట్టజెపుతున్నారు. చాలాచోట్ల ఒక్కో వేతనదారు నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే రేపటి నుంచి పని కావాలంటే ఇవ్వు.. లేదంటే మానేయ్ అన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాచోట్ల పాత మేట్లను తొలగించి అధికారపార్టీకు అనుకూలంగా ఉన్నవారిని నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ● సిబ్బంది సహకారంతోనే.. అధికార పార్టీ నాయకుల దోపిడీకి కొందరు ఉపాధిహామీ సిబ్బంది సహకరిస్తున్నట్టు సమాచారం. బినామీ మస్తర్లు వేయడం, వేతనదారుల ఖాతాల్లో జమైన డబ్బులను తిరిగి తీసుకుని కొందరు అధికారులు, పాలకులు పంచుకుంటున్నారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. అధికార పార్టీ వారు కావడంతో చేసేది లేక ఉపాధి హామీ సిబ్బంది కూడా తలాడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులకు మస్తర్లు వేయాలని కొన్నిచోట్ల ఒత్తిడి వస్తున్నట్టు డ్వామాకు చెందిన ఓ అధికారి సైతం చెప్పడం గమనార్హం. రామభద్రపురం మండలంలో ఉపాధి పని కల్పించడానికి మేట్లు వారానికి ఒక్కో వేతనదారుడి నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు ఆరోప ణలు ఉన్నాయి. విచారణలో అంతా సక్రమమే అంటూ అధికారులు తేల్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం మండలంలో కూడా మస్తర్ వేయడానికి ఒక్కో వేతనదారుడు నుంచి వారానికి రూ.100 చొప్పన వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఒక ఏపీఓ రూ.58 లక్షల వరకు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అతనిపై విచారణకు ఆ శాఖ అధికారులు ఆదేశించారు. రెండేళ్లవుతున్నా ఆయనపై చర్యలు లేవు. విచారణ సా...గుతూనే ఉండడంపై ఆ శాఖలోనే చర్చసాగుతోంది. విజయనగరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సుమారుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఉపాధి హామీ ఉన్నతాధికారులకు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. సుమారు 8 నెలలు అవుతున్నా చర్యలు శూన్యం. -
జిందాల్ భూముల పరిశీలన
శృంగవరపుకోట: మండలంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రతిపాదించిన జిందాల్ భూములను శనివారం ఏపీఐఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్కుమార్, జెడ్ఎం కృష్ణప్రసాద్తో కలిసి పరిశీలించారు. జిందాల్ భూముల వెనుకున్న ట్రస్టు గురించి ఆరా తీయగా అది పార్కు బయట ఉందని స్థానిక అధికారులు చెప్పారు. మాస్టర్ప్రింట్లో ముందుగా 150 ఎకరాలు మార్కింగ్ చేయాలని సూచించారు. భూ విస్తరణ, నీటి వనరుల లభ్యత, తాటిపూడి రిజర్వాయర్ ఎంత దూరంలో ఉంది వంటి వివరాలపై ఆరా తీశారు. జిందాల్ ప్రతినిధులు విక్టర్, శివారెడ్డిలు మోడల్ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ఫేజ్లో 550ఎకరాలు అభివృద్ధి చేశామని, ఇప్పటికే రోడ్లు, కాలువలు, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామన్నారు. 540ఎకరాలు, మరో ప్యాచ్లో 160 ఎకరాలు మొత్తంగా 700 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించామని, ఐదు ప్రాంతాల్లో మొత్తం జిందాల్ భూములు 1166 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. తహసీల్దార్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్కుకు ఒకవైపు 516బి విశాఖ–అరుకు హైవే, మరోవైపు 516ఇ విజయనగరం–అరుకు హైవేలు ఉన్నాయని చెప్పారు. తిరిగివెళ్తున్న సమయంలో ఎం.డి.దినేష్కుమార్ సీఎం ప్రొగ్రాం ఎప్పుడు ఫిక్స్ చేశారని అడగ్గా, జిందాల్ ప్రతినిధి విక్టర్ స్పందిస్తూ ‘సార్ వస్తామన్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు’ అంటూ బదులిచ్చారు. ఈ నెల మూడవ వారంలో ముఖ్యమంత్రి జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు భూమిపూజ చేసేందుకు వస్తారని రెవెన్యూ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్క్ భూములు ఎలా ఉన్నాయి.. ఎక్కడున్నాయి.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న వ్యూహరచన కోసమే అధికారుల పరిశీలనల హడావిడి అన్న ప్రచారం సాగుతోంది. ఏడాది గోడు గాలికేనా? ఏడాది కాలంగా జిందాల్ నిర్వాసితులు చేస్తున్న పోరాటాలు, వారి గోడు గాలికేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిందాల్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానంటూ రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన హామీ మట్టిలో కలిసిపోయినట్టేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇటీవల ఇచ్చిన భరోసా కూడా నీటిమూటగానే మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్వాసితులను ఆదుకునే పరిస్థితి కనిపించడంలేదన్న వాదన వినిపిస్తోంది. -
రాజుల పాలనలో పేదలకు కష్టాలు
బొబ్బిలిరూరల్: బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పైత్యం పెచ్చుమీరుతోంది. మూడుపూటలూ తిండికి లేక, నిస్సహాయులైన నిరుపేద గిరిజన కుటుంబాలపై జలుం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో ఏళ్లతరబడి నివాసముంటున్న పూరిపాకలను ఖాళీ చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో పూజారి రాపాక జోగినాయుడు కుటుంబం పంచాయతీ స్థలంలో నివసిస్తోందంటూ గెంటే యత్నం చేయగా, ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో అలాంటి దుశ్చర్యకు మళ్లీ పూనుకున్నారు. గ్రామంలో గెడ్డ పోరంబోకు స్థలంలో చిన్న పూరిపాకను వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఎన్నికల కళ్యాణ్, సీతపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి కక్షసాధింపులకు దిగారు. గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమంగా పూరిపాక వేసుకున్నారని, దానిని తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశా రు. చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతతో ఒత్తిడి చేయించారు. ఆర్డీఓ ఆక్రమణను సీరియస్గా తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని, వారికి నోటీసులు పంపాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు శనివారం ఆర్ఐ రామకుమార్, వీఆర్వో సుధాకర్, పోలీసులు అక్కడకు చేరుకుని పూరిపాకను తొలగించాలంటూ నిరుపేదకుటుంబానికి నోటీసులిచ్చారు. రెండు రోజుల్లో ఖాళీ చేయకుంటే తామే పూరిల్లును కూల్చేస్తామని, బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని కళ్యాణ్ భార్య సీతకు నోటీసులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమయం ఇవ్వలేమని, వెంటనే ఖాళీ చేయాల్సిందేనని హుకుంజారీచేశారు. దీంతో బాధిత కుటుంబం గగ్గోలుపెడుతోంది. ఉన్నఫలంగా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తల్లడిల్లుతోంది. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, సభ్యసమాజం తలదించుకునే పనులకు పూనుకుంటున్నారంటూ గ్రామస్తులు పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డుపక్కన చాలా పూరిపాకలు, పశువుల శాలలు ఉండగా కేవలం గిరిజన కుటుంబం పూరిపాకనే ఖాళీ చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొబ్బిలిలో అరాచక పాలన.. బొబ్బిలిలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోంది. అధికార బలంతో పదవులను లాక్కోవడమే కాదు పేద గిరిజనులు సాగుచేస్తున్న భూములను దౌర్జన్యంగా కాజేస్తున్నారు. వారి ఇళ్లను కూలదోస్తున్నారు. పథకాలు అందకుండా చేస్తున్నారు. రాజరికం కాదు మాది రాక్షసపాలన అంటూ చేతల్లో చూపిస్తుండడంపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. పేదలను ఆదుకోవాల్సిన చేతులు కష్టాలపాలచేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. కోటలు చూసి మురిసిపోవడం కాదని... పేదల కష్టాలు చూడాలని, వారిపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వీరు పూర్వీకుల వలే రాజులు కాదు.. రాక్షసులంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి నిలువ నీడలేకుండా గెంటే యత్నం పూరిపాకను కూల్చివేయాలని కలెక్టర్కు ఫిర్యాదు రెవెన్యూ అధికారుల నోటీసుతో ఆందోళనలో గిరిజన కుటుంబం తిండికి లేనివారం రాజకీయాలు చేయగలమా అంటూ నిట్టూర్పు ఆదుకోవాలంటూ వేడుకోలు డొంగురువలసలో పూరిపాక ఖాళీచేయాలని గిరిజనురాలిని హెచ్చరిస్తున్న ఆర్ఐ రామకుమార్, సిబ్బంది -
అక్కడ రూ.21,500.. ఇక్కడ రూ.15 వేలు..
● సర్వజన ఆస్పత్రి ఈసీజీ టెక్నీషియన్ల ఆవేదన ● మిగతా జిల్లాలో కంటే వీరికి తక్కువ జీతం చెల్లిస్తున్న వైద్యాధికారులు ● ప్రతినెలా రూ.6,500 చొప్పున నష్టపోయే పరిస్థితి విజయనగరం ఫోర్ట్: రోగుల గుండెలో ఉన్న లోపాలను ఈసీజీ తీసి నిర్ధారించే టెక్నీషియన్లను వేతన వ్యత్యాసం ఆవేదన కలిగిస్తోంది. వారి వేతన కష్టాలు తీర్చే నాథుడే కరువయ్యాడు. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమే. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లు అందరికీ ఒకలా జీతం వస్తే, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆస్పత్రి పరిధిలోని ఘోషా ఆస్పత్రిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం మరోలా జీతం రావడం గమనార్హం. వాస్తవంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు రూ.21,500 జీతం చెల్లించాలి. రాష్ట్రంలో విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను రూ.21,500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన, ఘోషాస్పత్రిల్లో పనిచేస్తున్న ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం రూ.15 వేలు చెల్లిస్తున్నారు. నెలకు రూ.6,500 చొప్పున ఏడాదికి రూ.78వేలు నష్టపోతున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులను ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిపాదనలు పంపించాం ఈసీజీ టెక్నీషియన్లకు మిగతా జిల్లాలో కంటే తక్కువ జీతం వస్తున్నమాట వాస్తవమే. వీరికి కూడా రూ.21,500 జీతం చెల్లించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే వీరికి కూడా వేతనం పెరుగుతుంది. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
స్కూల్ బస్సులపై కొరడా..!
● జిల్లాలో 518 స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ● 90 బస్సుల్లో లోపాల గుర్తింపు..నోటీసులు జారీ ● స్కూల్స్ తెరుచుకునేలోపు ప్రతి బస్సుపై నిఘాపిల్లల ప్రాణాలపై ప్రయోగాలు వద్దు స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్వషర్, ఎమర్జెన్సీ డోర్, సురక్షిత సీట్లు, సరైన బ్రేక్ వ్యవస్థ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కేవలం పత్రాల పరిశీలనతో సరిపెట్టకుండా వాహనం రోడ్డుపై ఎలా పనిచేస్తోందో కూడా పరీక్షించాలని కోరుతున్నారు.తూతూ మంత్రం తనిఖీలు వద్దంటున్న తల్లిదండ్రులు: గతంలో కొన్ని సందర్భాల్లో తనిఖీలు కేవలం నామమాత్రంగా జరిగాయనే విమర్శలు వినిపించాయి. ఈసారి మాత్రం ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ మీద సర్టిఫికెట్ ఇచ్చేయడం కాకుండా బస్సు నిజంగా సురక్షితమా కాదా అనేది చూడాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
ఫిజియో టీ20 లీగ్ విజేత ’హంగ్రీ చీతాస్’
● మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పార్వతీపురం వైద్యుడు ఉమాకాంత్ పార్వతీపురం రూరల్: ఆంధ్ర ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులోని డీఎస్ఏ, ఎంఎస్కే మైదానాల్లో ఐదు రోజుల పాటు జరిగిన ’ఆంధ్ర ఫిజియో క్రికెట్ లీగ్ టీ20 (సీజన్–1)’లో గుంటూరుకు చెందిన హంగ్రీ చీతాస్ జట్టు విజేతగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు చెందిన పది ఫిజియోథెరపీ డాక్టర్ల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లో 59 పరుగులు చేసిన హంగ్రీ చీతాస్ ఆటగాడు, పార్వతీపురం వాసి డాక్టర్ జీరు ఉమాకాంత్ రెడ్డి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు. ఈయన పార్వతీపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి చిన్న కుమారుడు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ పోటీల్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన గుంటూరు చంద్ర హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవితేజ చేతుల మీదుగా విజేత జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు. -
పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి
● ఏపీఐఐసీ అధికారులకు ఎం.డి దినేష్ కుమార్ ఆదేశాలు బొబ్బిలి: స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామమోహన రావు, ఏపీఐఐసీ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమందికి భూములు కేటాయించారన్న వివరాలను నోట్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం భూములను తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆర్వీఆర్ పరిశ్రమలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి సంబంధించి ఎవరూ ఉండడం లేదని, సమస్యలు తెలుపుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నీరు, విద్యుత్ సమస్య ఉందని వాపోయారు. వెంటనే ఆర్డీఓ రామమోహన రావుతో ఎం.డి మాట్లాడుతూ ఇక్కడ తహసీల్దార్ స్థాయి అధికారిని స్పెషలాఫీసర్గా నియించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వచ్చి అలా వెళ్లపోతారా? ఏపీఐఐసీ ఎం.డి లాంటి అధికారి ఎన్నో సమస్యలున్న గ్రోత్ సెంటర్కు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, మండల కార్యదర్శి సింగిరెడ్డి గోపాలం విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక గ్రోత్సెంటర్లో కార్మికులకు తాగునీరు లేక, పరిశ్రమలకు విద్యుత్, నీటి వసతి, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఎవరిని కలిసి వినతిపత్రం ఇద్దామన్నా ఎవరూ లేని పరిస్థితుల్లో ఎం.డి వచ్చి వెంటనే వెళ్లిపోవడం, కనీసం మీడియాకు కూడా సమాచారం లేకపోవడం దారుణమన్నారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యం:
ఫైలేరియా వ్యాధి ఒక రోజులో వచ్చేది కాదు. దీని ప్రభావం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వైద్య సిబ్బంది పంపిణీ చేసే ఫైలేరియా నియంత్రణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఒమ్మితో పాటు అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. –డాక్టర్ అనిల్కుమార్, వైద్యాధికారి, సతివాడ పీహెచ్సీ -
అమ్మో ఫైలేరియా..!
● చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ● 45 గ్రామాల్లో మొత్తం 169 మంది బాధితులు ● ఒక్క ఒమ్మి గ్రామంలోనే 69 కేసులు ● ప్రజల్లో కొరవడిన అవగాహన నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు అరుదుగా కనిపించే ఫైలేరియా వ్యాధి ఇప్పుడు నెల్లిమర్ల మండలంలో ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మండలంలోని 45 గ్రామాల్లో ప్రస్తుతం 169 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఒమ్మి గ్రామంలోనే 69 మంది బాధితులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితులపై ఈ గణాంకాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రెండు పీహెచ్సీల పరిధిలో బాధితులు ఇలా మండలంలో రెండు పీహెచ్సీలు ఉండగా..సతివాడ పీహెచ్సీ పరిధిలోని 31 గ్రామాల్లో 149 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అందులో ఒమ్మిలో అత్యధికంగా 69 మంది బాధితులుండగా, సతివాడలో 21 మంది, మిగిలిన 28 గ్రామాల్లో 59 మంది బాధితులు ఉన్నారు. కొండవెలగాడ పీహెచ్సీ పరిధిలోని 15 గ్రామాల్లో మరో 20 కేసులు ఉన్నాయి. అందులో కొండవెలగాడలోనే 11 మంది బాధితులు ఉండడం గమనార్హం. ప్రజల్లో కొరవడిన అవగాహన ఫైలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని లింఫ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మొదట్లో సాధారణ జ్వరం, వాపు వంటి లక్షణాలు కనిపించినా, క్రమంగా కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాలు అసాధారణంగా వాపుగా మారతాయి. వ్యాధి తీవ్రమైతే బాధితులు జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు గ్రామాల్లో తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపు లైన్ల వద్ద లీకులను అరికట్టకపోవడంతో ఆ నీరే మురుగుగా మారే పరిస్థితి ఉంది. ప్రజల సహకారం కూడా లేకపోవడం వ్యాధి వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం, కాలువలను ఆక్రమించి భవనాలు కట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమల సంతతి పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎంపీపీ చొరవతో ప్రైవేట్ కంపెనీ సేవలు: ఒమ్మి గ్రామంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏంఎసీ మాజీ చైర్మన్ శ్రీరాములు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీకి చెందిన కంపెనీ ప్రతినిధులను సంప్రదించడంతో వారు మూడేళ్లుగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా గతంలో వ్యాధి తీవ్రతపై ఎన్నో అధ్యయనాలు చేశారు. దోమ తెరలు, దోమలను ఆకర్షించే అధునాతన బుట్టలు ఇంటింటీకీ పంపిణీ చేశారు. కాలువల వద్ద దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు కొంత కాలం పాటు నిర్వహించారు. కలెక్టరేట్లో ఫిర్యాదుతో ఫైలేరియా పరీక్షలు: ఇటీవల ఒమ్మి గ్రామానికి చెందిన పలువురు.. ఫైలేరియా వ్యాధి విజృంభణపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల స్పందనతో ఎన్ఎఫ్సీపీ యూనిట్ జిల్లా అర్బన్ రూరల్ బృందాలు ముమ్మరంగా రక్త నమూనాల సేకరణ చేపట్టారు. సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. -
జర్మన్ సంస్థతో జేఎన్టీయూ జీవీ ఒప్పందం
విజయనగరం రూరల్: ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా స్థానిక జేఎన్టీయూ జీవీ కీలక ముందడుగు వేసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రోత్లాంగేన్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కెఎఫ్ఆర్యు)తో శనివారం విద్యా సహకార ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నుంచే అంతర్జాతీయ సమగ్ర డిగ్రీ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు కేవలం ఐదేళ్లలోనే భారతీయ డిగ్రీతోపాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జర్మన్ ఎంఎస్సీ డిగ్రీని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుందని జేఎన్టీయూ జీవీ ప్రతినిధులు తెలి పారు. పలు కోర్సులు అందుబాటులో ఉంటాయ ని, నాణ్యమైన విద్య, తక్కువ ఫీజు, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానం, ప్రపంచ ప్రఖ్యా త పరిశ్రమల్లో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వాటికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7288873337 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై జీఆర్పీ ఎస్ఐ బాలాజీ రావు చెప్పిన వివరాల ప్రకారం...ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ లు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం పాత హుబ్లీ, ధర్వాద్ జిల్లాలకు చెందిన అఖిలేష్ యార్మశల్, షబాజ్ రఫీ అమ్మద్ ఖాతిబ్లు ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచీ పది కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాట్ ఫాం లపై తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి వారు కంగారు పడటంతో జీఆర్పీ ఎస్సై బాలాజీరావుకు అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ సిబ్బందితో ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్ట్ కు తరలించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.లారీ బోల్తా● త్రుటిలో తప్పిన ప్రమాదం జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపాన గల గౌరవంపేట మలుపు వద్ద మామిడి పండ్లతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం విజయనగరం నుంచి ఒడిశా మీదుగా ఢిల్లీ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో అటువైపు వస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని స్థానికులు తెలిపారు. పిడుగు పడి ఆవు మృతిజామి: మండల కేంద్రమైన జామిలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద్ద వర్రి వాని కళ్లాల వద్ద శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు కె. పరసన్న ఆవు మృతిచెందింది. పశువైద్యాధికారి సంతోష్కుమమార్ మృతి చెందిన ఆవును పరిశీలించారు. సుమారు రూ. 60వేలు ఖరీదు అయిన ఆవు మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి పరారీబొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామానికి చెందిన బండారు వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్ల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా పరారీ అయినట్లు అంబటివలస గ్రామానికి చెందిన నరవ సత్యం వాపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బి.రాజేరు గ్రామానికి చెందిన వెంకటేష్ అదే గ్రామానికి చెవిన ఇసినిగిరి బంగారమ్మ, ధర్మవరపు పార్వతిల నుంచి నాలుగు లక్షల రుపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుంచి పరారీ అయ్యాడు. వెంకటేష్ మామ గ్రామంలోనే ఉన్నా, తనకు అప్పుకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నాడని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తి ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారని నరవ సత్యం చెప్పాడు. తన కూతుళ్ల వద్ద తీసుకున్న అప్పుకు గ్రామంలో గానీ, పోలీసుల వద్ద గానీ ఎటువంటి న్యాయం జరగలేదని న్యాయం చేసేలా చూడాలని కోరాడు. -
కింగ్ కోబ్రా చేతుల్లో ప్రభుత్వ భూములు..!
చీపురుపల్లి: దాదాపు రూ.25 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం అటువైపు చూడడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నప్పటికీ రికార్డులు చూస్తున్నారు తప్ప భూముల పరిరక్షణను పట్టించుకోవడం లేదు. బహుశా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదనేనేమో భీమిలికి చెందిన ఓ కింగ్ ఆ ప్రభుత్వ భూముల్లో గెస్ట్హౌస్, ప్రహరీ, గేటు ఏర్పాటు చేసి రైతులను పంట పొలాలకు సైతం వెళ్లనీయకుండా అడ్డంగా గోడ నిర్మాణం చేశాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇంత జరుగుతున్నా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. సదరు కింగ్ వెనుక అధికార టీడీపీలోని ఓ పెద్ద తలకాయ అండదండలు ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం అటు వైపు చూడడం లేదనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించింది కానీ ఇక్కడ 87.34 ఎకరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగానికి కనిపించకపోవడం వెనుక ఆ పెద్ద తలకాయ అండదండలే కారణమని చర్చ జరుగుతోంది. సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలు భూమిగా పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి గతంలో ఎలాంటి పట్టాలు మంజూరు చేయలేదు. రికార్డుల్లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ భూములు మాత్రం వేరే వ్యక్తుల చేతుల్లో ఉండడం గమనార్హం. పంట పొలాలకు వెళ్లకుండా గోడ నిర్మాణం మండలంలోని కర్లాం, నిమ్మలవలస, మోదుగులపేట తదితర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో వ్యవసాయ భూములు సైతం కలిసే ఉంటాయి. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మూడు గ్రామాల రైతులు సర్వే నంబర్ 408 లో నుంచే వెళ్లి వస్తుంటారు. అయితే ఈ భూముల్లో నుంచి రైతులను వెళ్లనివ్వకుండా సదరు కింగ్ అడ్డంగా గోడ నిర్మించారు. దీంతో రైతులు భూములకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే ఆ భూమి తనదేనని రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేదని సదరు కింగ్ బదులిస్తున్నాడు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం పంట పొలాలకు దారి లేకుండా గోడ నిర్మించడం, ప్రభుత్వ భూములను చేతిలో ఉంచుకోవడంపై గ్రీవెనన్స్ సెల్ ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం ఎక్కడా లేని భూములను సేకరించిన ప్రభుత్వం కర్లాంలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ వదిలేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సదరు కింగ్ మాత్రం ఆ భూములు తనవేనని తాను కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల్లోనుంచి రైతులు వెళ్లకుండా ‘ఆడ్డుగోడ’..! ఆ భూముల్లో గెస్ట్ హౌస్, ప్రహరీ నిర్మాణం కర్లాంలో 87.34 ఎకరాలు ప్రభుత్వ గయాలు భూములు87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే. రెవెన్యూ రికార్డుల ప్రకారం 87.34 ఎకరాలు గయాలు భూములుగా నమోదై ఉన్నాయి. అందులో ఎలాంటి పట్టాలు మంజూరు కాలేదు. ఆ భూముల్లో అక్రమ కట్టడాలపై ఇంతవరకు మా దృష్టికి రాలేదు. – డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి -
అన్నింటా ఆమెదే ‘విజయ’ం
● తెలంగాణ లా–సెట్లో స్టేట్ ఫస్ట్ ● ఇటీవల గ్రూప్–2 పరీక్షలోనూ విజయం ● డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ● నెల్లిమర్ల యువతి అరుదైన ఘనతన్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యం నా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మిల ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గనెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం..సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం రామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం.. పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు. -
పీహెచ్సీల్లో ప్రసవాలు ఎక్కువగా జరగాలి
తెర్లాం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ జీవన్రాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని తెర్లాం, పెరుమాళి పీహెచ్సీలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెర్లాం పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను, ల్యాబ్లో అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. ప్రతినెలా ఎంతమంది గర్భిణులకు ప్రసవాలు చేయిస్తున్నారని పీహెచ్సీ డాక్టర్లు రెడ్డి స్వాతి, వంశీలను అడిగారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీలో ప్రతీ గర్భిణి తప్పనిసరిగా ప్రసవం చేయించుకునేలా వారికి వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుమాళి పీహెచ్సీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రోగులకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కేన్సర్ వ్యాధి నివారణ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు డాక్టర్ వెంకటేశ్, మనోజ్ఞరమణిలను ఆదేశించారు. యోగా డే విజయంతమైయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది యోగా డేలో పాల్గొనేలా చూడాలని పెరుమాళి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాస్కు సూచించారు. పీహెచ్సీలో గల ల్యాబ్ ద్వారా చేస్తున్న పరీక్షలపై ల్యాబ్ టెక్నిషియన్ శివను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి -
11మందికి గంజాయి పరీక్షలు
● ఏడుగురికి పాజటివ్ ● గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గుర్తింపువిజయనగరం క్రైమ్ : గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గంజాయి వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నామని యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి వినియోగం అరికట్టేందుకు ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. గంజాయి డిటెక్షణ్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, మూత్ర పరీక్ష ద్వారా కేవలం ఒక నిమిషంలోనే వ్యక్తి గంజాయి వినియోగించాడో లేదో అని నిర్ధారణ చేయవచ్చన్నారు. గంజాయి వినియోగించే వారిని గుర్తించేందుకు యాంటీ గంజాయి టీమ్, ఈగల్ టీమ్ గంజాయి డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 11మందికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, వాళ్లంతా గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను సేకరించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఓణీల ఫంక్షన్కు కలెక్షన్ల తంటా..!
● పాలకురాలి కమార్తె ఫంక్షన్ కోసం అధికారులపై ఒత్తిడి ● మండలాల వారీగా టార్గెట్లు ● విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే మరి... మన నాయకురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది.. మనమంతా దారుకోవాలి.. పూనుకోవాలి.. రాసుకోవాలి.. పూసుకోవాలి అని పూనకాలు తెచ్చుకున్న పచ్చపార్టీ నాయకులు అలవిమాలిన స్వామిభక్తిని చాటుకోవడం.. దీనికోసం మండలాల వారీగా అధికారులకు టార్గెట్లు ఇవ్వడం మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అసలే గిరిజన ప్రాంతం... ఆపై ప్రైవేటు కార్యక్రమానికి టార్గెట్లు ఇవ్వడం ఉద్యోగ వర్గాలను కలవరపెడుతోంది. అమ్మగారి ఇంటిలో ఓణీల ఫంక్షన్ ధూమ్ధామ్ అయిపోవాలి.. మూడు జిల్లాల్లో హోరెత్తిపోవాలి.. ‘ఈశ్వరి’ని ఆశీస్సులు అందేలా.. రెండు మూడు తరాలు చెప్పుకునేలా ఉండాలి అంటూ వేపకొమ్మలతో కొట్టుకునే రేంజిలో పచ్చపార్టీ నేతలు ఊగిపోవడం... ఆ ఖర్చు భరించాలంటూ ఉద్యోగులపై రుద్దడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా నియోజకవర్గ నేత ఇంటిలో ఇటీవల ఐదు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి రూ.4లక్షల చొప్పున కలెక్షన్ చేయాలంటూ టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. మండలాధికారులకు టార్గెట్లు అంటే అది ఆయన పరిధిలోనే ఉపాధి హామీ సిబ్బందితోపాటు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడిపడుతుంది. మండలాధికారి ఆదేశాల మేరకు ఆయా ఉద్యోగులు చందాలు వేసుకుని ఆ నాలుగు లక్షలు పోగేసి ఇవ్వా ల్సిన పరిస్థితి. ఇప్పటికే పంచాయతీరాజ్ , గ్రామీణాభివద్ధి శాఖల ఉద్యోగులు అలవిమాలిన పని ఒత్తిడి.. దండగమారి సర్వేలు, సమీక్షలతో నలిగిపోతున్న తరుణంలో ఓణీ ఫంక్షన్ కోసం ఇప్పుడు ఏకంగా చందా వసూళ్ల బాధ్యతలు పెట్టడంతో వారు అవుననలేక.. కాదనలేక లోలోన కుమిలిపోతున్నారు. మొత్తం మీద అమ్మవారి ఇంట ఫంక్షన్లో డీజేల ముందు డ్యాన్స్లు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా కార్యకర్తలు ముందుకు నెడుతున్నారంటూ కొందరు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇదెక్కడి తీరు.. పచ్చపార్టీ కార్యకర్తలు.. నాయకులకు రోకు ఉంటే వాళ్లువెళ్లి టెంట్లువేయాలి... పందిరి బొంగులు పాతాలి.. గాడి పొయ్యిలు తవ్వాలి... నీళ్ల కావిళ్లు మోయాలి కానీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేమెందుకు ఈ పాలేరు పనిచేయాలంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి చందాల సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎవరైనా నాయకుల ఇళ్లలో ఫంక్షన్ ఉంటే అధికారులు తమ భక్తికొద్దీ త్రుణమోపణమో సీక్రెట్గా సమర్పించుకుని వచ్చేవారు. ఇప్పటిలా ఏకంగా సిబ్బంది మొత్తం పులివేషాలు వేసుకుని ఆటాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని మండలాధికారులు ఆలోచనలు చేస్తుండగా, కొత్తగా ఓ మండలానికి వచ్చిన అధికారి ఆ స్థాయిలో కలెక్షన్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో టార్గెట్లో రూ.లక్షన్నర తగ్గించారట. మరికొన్ని శాఖలకు కూడా వేర్వేరుగా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఊరి సొమ్ము రాంభజన అన్నట్లుగా ఉద్యోగుల చందాలతో ఫంక్షన్ చేసేందుకు పూనుకున్న నేత ‘ఛీప్’ట్రిక్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం కోసం పిలవాలే గానీ చందాలు పట్టుకుని భోజనానికి రండి అంటూ ఆర్డర్వేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మగారింట్లో ఫంక్షన్ అటు నాయకులకు మోదం.. ఉద్యోగులకు ఖేదంగా మారింది. -
49 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
గజపతినగరం రూరల్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై గజపతినగరంలో మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు చేసి మూడు ఆటోలతో తరలిస్తున్న 49 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం నుంచి మూడు ఆటోలతో వేరువేరు ప్రాంతాలకు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం ఉదయమే పకడ్బందీగా ప్లాన్ చేసిన విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో దాడులు చేసి లింగాలవలస బ్రిడ్జి, గజపతినగరం పీఏసీఎస్, గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో మూడు ఆటోలతో తరలిస్తున్న 48 బస్తాలు పట్టుకున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి పట్టుబడిన బియ్యాన్ని లింగాలవలస రేషన్ డిపోకు, ఆటోలను గజపతినగరం పోలీసులకు అప్పగించారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే దాడుల్లో, 10 బస్తాల రాగులు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడుల్లో గజపతినగరం పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చిరంజీవి, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాజాంలో.. రాజాం: పట్టణంలోని చీపురుపల్లిరోడ్డులో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఎస్డీటీ అనంత్కుమార్ తెలిపారు. మండలంలోని గడిముడిదాం గ్రామం నుంచి గణపతి అనే వ్యక్తి ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు. శుక్రవారం చీపురుపల్లి రోడ్డులో ఆర్ఐ మహేష్తో కలిసి వాహనాలు తనిఖీచేయగా బియ్యం పట్టుబడ్డాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 5 క్వింటాళ్ల బియ్యం దొరకగా బియ్యాన్ని సీజ్ చేసి, ఎంఎల్ఎస్ గోదాంకు తరలించామని, ఆటోను సీజ్చేసి, పోలీసులకు అప్పగించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు సీఎస్డీటీ పేర్కొన్నారు. -
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: సుపారీ ఇచ్చి సొంత అన్ననే హత్య చేయాలని తమ్ముడు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్ను విజయనగరం టూటౌన్ పోలీసులు పక్కా ప్రణాళికతో శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం..గుర్లకు చెందిన బుచ్చినాయుడికి విజయనగరంలో కొన్ని భవనాలు ఉన్నాయి. వాటి మరమ్మతుల కోసం ఫోన్ ద్వారా కుమార్, శివ, బాలు అనే ముగ్గురిని సంప్రదించాడు. వారు చెప్పిన స్థలం రింగ్ రోడ్లో గల లెజెండ్ బార్ లైన్ లోకి వచ్చిన బుచ్చినాయుడిని వారు ముగ్గురూ చితక్కొట్టి రూ.15 వేలు లాక్కుని పారిపోయారు. దీంతో హాస్పిటల్ పాలైన బుచ్చినాయుడు ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుచ్చినాయుడికి తమ్ముడు పిన్నింటి రాముతో ఊరిలో భూ తగాదాల ఉన్న కారణంగా సొంత అన్ననే అంతం చేయాలనుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాల్ డేటా ఆధారంగా పిన్నింటి రాముతో పాటు దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. -
ఐఎన్ఐ–ఎస్ఎస్ ఫలితాల్లో మెరిసిన ‘బోధన్’
● ఢిల్లీ ఎయిమ్స్లో సూపర్ స్పెషాలిటీ చేయడమే లక్ష్యం విజయనగరం అర్బన్: వైద్యవిద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ–ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విజయనగరం పట్టణానికి చెందిన డాక్టర్ ముడిలి సాయిబోధన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. డీఎం క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో 3వ ర్యాంక్ సాధించారు. పూల్బాగ్ కాలనీకి చెందిన సాయిబోధన్ చిన్నతనం నుంచే చదువులో దిట్ట. పదో తరగతి వరకు బాబామెట్ట కేంద్రీయ విద్యాలయంలో చదివారు. ఇంటర్ కార్పొరేట్ సంస్థలో చదివి నీట్లో 1,500 ర్యాంక్ సాధించి తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నారు. పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 305 ర్యాంక్ సాధించి భువనేశ్వర్లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తిచేశారు. తాజాగా ఐఎన్ఐ ఎస్ఎస్ పరీక్షలో ప్రతిభ చూపి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో డీఎం పూర్తిచేయాలనే తన జీవిత కలను నిజం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే చదువులో రాణించగలిగానని బోధన తెలిపారు. కుమారుడు చదువులో రాణించడంపై తల్లిదండ్రులు జ్యోతి(టీచర్), నాగభూషణరావు, విశ్రాంత హెచ్ఎం అయిన తాతయ్య లక్ష్మణరావు సంతోషం వ్యక్తంచేశారు. -
డంపింగ్ యార్డు కథ మొదటికి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా.. ’చెత్త’ కథ మళ్లీ మొదటికే వచ్చింది. గుత్తేదారు సంస్థ కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలను, యంత్రాలను తీసుకుని వెనుదిరిగింది. పార్వతీపురం పట్టణంలో సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్ యార్డు సమస్య పట్టణ వాసులను ఏళ్లుగా వేధిస్తోంది. గతంలో పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల కిందట యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. చెత్తను నాలుగు భాగాలుగా ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. వ్యర్థాలను మళ్లీ పట్టణంలోనే పారబోయడంపై విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. తాజాగా సదరు సంస్థకు అప్పగించిన కాంట్రాక్టు ముగియడంతో పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తదుపరి మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా వెంకటరమణ
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడిగా కంది వెంకటరమణ ఎన్నికయ్యారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ప్రొసీడింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, రాష్ట్ర పరిశీలకులుగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు వ్యవహరించారు. వైస్ చైర్మన్గా డాక్టర్ కేపీ వరలక్ష్మి, కోశాధికారిగా డాక్టర్ పొగరు విశ్వేశరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా బి.రామకృష్ణారావు, ఎస్. రాజు, పి.దుర్గాప్రసాద్, డి.సూర్యారావు వై.వీర్రాజు, కె.ఎర్నాయుడు, వెన్నెల చంద్రశేఖర్, ఎం.తిరుపతిరావు, బీవీ గోవిందరాజులు ఎన్నికయ్యారు. పదో తరగతి షార్ట్మార్క్స్ మెమోలు విడుదల విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మార్స్క్ మెమోలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసి, సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్క్స్ మెమోల్లో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారం విషయంలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని స్కూల్ లాగిన్లో సరిచేసుకునేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు వివరాలను పరిశీలించి, తప్పులు ఉంటే వెంటనే సవరించాలని డీఈఓ సూచించారు. పల్స్పోలియోను విజయవంతం చేయండి సంతకవిటి: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని మండవకురిటి పీహెచ్సీని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో నమోదైన ఓపీ, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు తప్పనిసరి విజయనగరం అర్బన్: జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జేసీ సేతుమాధవన్ సూచించారు. థియేటర్ల నిర్వహణ, ఎన్ఓసీ నమోదు, ప్రభుత్వ ప్రజా అవగాహన చిత్రాల ప్రదర్శన తదితర అంశాలపై తన చాంబర్లో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లు విధిగా ఏపీఎస్ఎఫ్టీవీడీసీ వద్ద నమోదు చేసుకొని ఎన్ఓసీ పొందాలని స్పష్టం చేశారు. ఫారం–బీ లైసెన్స్ మంజూరుకు, అలాగే దాని పునరుద్ధరణకు ఎన్ఓసీ కచ్చితంగా తీసుకోవాలన్నారు. సమావేశంలో సీ–సెక్షన్ పర్యవేక్షకులు డి.శేఖర్, జిల్లాలోని పలు సినిమా థియోటర్ల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం: జిల్లాలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంజర్ పార్క్, 20న పాలకొండ, పార్వతీపురం, సాలూరులలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి
● లక్ష్యాలు చేరుకోకపోతే కఠిన చర్యలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బూత్స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో పురోగతిసాధించకపోవడం, రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా వెనుకబడడంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ఇంటింటి ఓటర్ల సర్వేకు ముందే మ్యాపింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత 2025 ఓటర్ల జాబితాతో కచ్చితంగా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నిక విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ● రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద ఉన్న ఏపీఐఐసీ పరిధిలోని 64.67 ఎకరాల భూమిని రాధిక వెజిటబుల్ ఆయిల్స్ కంపెనీకి రిజిస్టర్ చేసి అప్పగించినట్లు పరిశ్రమలశాఖ సమీక్షా సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. సమావేశంలో పరిశ్రమ శాఖ మేనేజర్ కరుణాకర్, విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్, చీపురుపల్లి ఆర్డీఓ సుధారాణి, ఏపీఐఐసీ లైజన్ అధికారి సత్యనారాయణతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు -
దివ్యాంగులపై కక్షసాధింపు..!
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో నలిగిపోతున్నారు. మొన్నటివరకు దివ్యాంగత్వం నిర్ధారణ కోసం జిల్లాలోని సుమారు 35వేల మంది ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వ్యయప్రయాసలకు గురయ్యారు. దివ్యాంగత్వ నిర్ధారణను పూర్తిచేసుకున్నారు. పింఛన్ పొందేందుకు అర్హత సాధించారు. తాజాగా గజపతినగరం నియోజకవర్గంలో కొందరు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి మళ్లీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లను తొలగించేందుకు పూనుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మంత్రి ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు... రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్స్ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారని టీడీపీ నేతలు ఏపీ రాష్ట్రసోషల్ ఆడిట్ అథారిటీ( ఏపీఎస్ఏఏటీ) డైరెక్టర్కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సోషల్ ఆడిట్ అథారిటీ టీమ్ ఇద్దరు సభ్యులను క్షేత్రస్థాయి తనిఖీల కోసం పంపించింది. కేవలం గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు అయిన దివ్యాంగులు 16 మంది ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతోనే తరచూ తనిఖీలు చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ నిట్టూర్చుతున్నారు. పింఛన్లను అన్యాయంగా తొలగిస్తే న్యాయస్థానం తలపుతట్టేందుకు దివ్యాంగులు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల క్షేత్రస్థాయి తనిఖీ విషయం తెలియదన్నారు. ఏపీఎస్ఏఏటీ డైరెక్టర్ నేరుగా తనిఖీ బృందాన్ని పంపించి ఉండవచ్చన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్ ప్రభుత్వం నిర్వహించిన పింఛన్ రీవెరిఫికేషన్ పూర్తి ప్రజాప్రతినిధి ఒత్తిడితో మళ్లీ దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు ఆందోళనలో దివ్యాంగులు -
ముడతలు పడిన చర్మం.. మురిసిపోయే ఆత్మాభిమానం
విజయనగరం గంటస్తంభం: నేటి సమాజంలో పాతికేళ్లు కూడా నిండని యువకులు తమ చిన్నచిన్న అవసరాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. చేతిలో పనిఉన్నా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు జీవిత పోరాటానికి దూరంగా ఉండి సులభమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆ కోవలో తప్పుదారి పడుతూ అప్పులపాలవుతున్నారు. మరికొందరు ఈజీ మనీకోసం తప్పుదారి పడుతున్నారు. బతుకులను దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ వయసు పైబడినా ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోకుండా చెమటోడ్చి బతుకుతున్న ఈ బామ్మలే నిలువెత్తు స్ఫూర్తి. వయస్సు 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నా, శరీరం ముడతల పడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయనగరం పట్టణంలో చిరు వ్యాపారులు చేస్తూ తమ సంపాదన తమదే అని నిరూపిస్తున్నారు. ఒకరికి పెట్టేచేతులే కాని చాచే చేతులు కావని చెబుతున్నారు. ప్రతిరోజూ వచ్చిన కొద్ది సంపాదనే తమకు రూ.కోట్లతో సమానమని గర్వపడుతున్నారు. చేయి చాచడం కంటే పని చేయడం మేలు... ఒకప్పుడు కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టిన చేతులు ఇవి. పిల్లలను పెంచి పెద్ద చేసి, బంధువులు, అతిథులకు ఆతిఽథ్యం ఇచ్చిన గౌరవం మాది. అలాంటి చేతులు ఇప్పుడు తమ అవసరాల కోసం ఎవరిముందూ చాచడానికి సిద్ధంగా లేవు. వయసు పెరిగిందనే కారణంతో ఇతరులపై ఆధారపడాలని భావించడం లేదు. తమకు చేతనైనంత వరకు నిజాయితీగా కష్టపడి సంపాదించి తినడమే గౌరవమని నమ్ముతున్నారు. సమాజం నుంచి జాలి కోరడం కాదు. తమ శ్రమకు తగిన గౌరవం కోరుతున్నారు. మా వయసు కాదు... మాధైర్యం చూడండి.. వీరిలో ప్రతి ఒక్కరి జీవితం ఒక పాఠం. ప్రతి అడుగు ఒక సందేశం. ప్రతి చెమట చుక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎండను లెక్కచేయకుండా రోడ్డుపక్కన కూర్చుని సరుకులు అమ్ముకుంటున్న వీరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఈ వయసులో ఎందుకమ్మా ఈ కష్టం అని అడుగుతుంటారు. అప్పుడు వారి సమాధానం జీవితానికి అర్ధం చెప్పేలా ఉంటుంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, కాలక్షేపాలతో రోజులు గడిపే యువతకు ఈ బామ్మలు నిశ్శబ్ద సందేశం ఇస్తున్నారు. పని చిన్నది కాదు.. వయసు అడ్డంకి కాదు.. ఆత్మగౌరవమే అసలు సంపద అని చేతలతో చెబుతున్నారు. కష్టపడే మనిషికి వయసుతో సంబంధం లేదని, గౌరవంగా బతకాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు కూడా ఓడిపోతాయని నిరూపిస్తున్నారుకూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే ఈ వయసులోనూ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నా. నా పిల్లలను, కుటుంబాన్ని నేనే రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశా. ఈ చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకూడదన్నదే నా కోరిక. నా కష్టార్జితంతో తినే బువ్వే నాకు కొండంత తృప్తిని ఇస్తుంది. – గోక అప్పయ్యమ్మ(78), ఎల్బీకాలనీ, విజయనగరం వయసు నిండుగా... ఆత్మాభిమానం మెండుగా.. ముదిమి వయసులోనూ శ్రమనే నమ్ముకున్న బామ్మలు ఇవి ఒకరికి పెట్టే చేతులే కానీ సాయం కోసం చాచేవి కాదన్న సందేశం -
‘పచ్చని చెట్లు –ప్రగతికి మెట్లు
● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయ మూర్తి విజయ కల్యాణి విజయనగరం లీగల్: పచ్చని చెట్లు–ప్రగతికి మెట్లు అని మొక్కలను నాటి పెంచి పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని, రోజురోజుకూ పెరుగుతున్న వేడి వాతావరణం తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను పెంచాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి విజయ కల్యాణి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం‘ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. భూమి మీద వేడి ని కొంత మేరకు అయినా తగ్గించగలమని, ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఏర్పడిన గ్లోబల్ వార్మింగ్ ను నివారించగలమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వాటి నుంచి మొక్కల పెంపకం కొంత వరకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషనన్స్ జడ్జి, ప్లాపూస్ చైర్మన్ జి.దుర్గయ్య, సీనియర్ సివిల్ జడ్జి అండ్ ఇన్చార్జి రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి. శ్రీనివాసరావు, బీబీఆర్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మాజీ, సెక్రటరీ గడి.మురళి, ప్రభుత్వా న్యాయవాది రెడ్డి సత్యనారాయణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గేదెల సత్యం, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ బెల్లాన రవి, సీనియర్ అడ్వకేట్ బొడ్డు సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఇతర జూనియర్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు పాలనపై ప్రజాగ్రహం
సాక్షిప్రతినిధి, విజయనగరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్గా చరిత్రలో నిలిచిపోయారని జనం మండిపడ్డారు. నాడు పిల్లనిచ్చిన మామ దివంగత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుచి పార్టీని, పదవిని లాక్కున్న చంద్రబాబు.. నేడు ఎన్నికలకు ముందు ప్రజలకు సాధ్యం కానీ హమీలు గుప్పించి వాటిని అమలు చేయకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ రెండేళ్లుగా వెన్నుపోటు పొడుస్తున్నారని దుమెత్తిపోశారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు గురువారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి పంచిన బాండ్లతో పాటు సూపర్ సిక్స్ పేరిట ప్రకటించిన మేనిఫెస్టో జాబితాలను దహనం చేశారు. చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి.. వెన్నుపోటుబాబు.. చంద్రబాబు... ఇచ్చిన హమీలన్నీ తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ● ఎగసిన నిరసన సెగ చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జనం ఆందోళన చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. మాకొద్దీ రాక్షసపాలన అంటూ నినదించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన బాండ్లు, ప్రకటించిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్లీడర్ శెట్టి వీరవెంకటరాజేష్, తదితరులు పాల్గొన్నారు. ● మీ పాలనకో దండం ఎన్నిల్లో లబ్ధికోసం ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారంటూ రాజాం నియోజకవర్గ ప్రజలు మండిపడ్డారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. రెండేళ్లుగా దగాకోరు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పొనుగుటివలస కూడలిలో మానవహారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్ట్రోపతులను చించివేసి నిరసన తెలిపారు. సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, జెడ్పీ వైస్చైర్మన్ సిరిపురపు జగన్మోహనర్రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు నాడు పిల్లనిచ్చిన మామకు... నేడు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను వంచిచుస్తున్న వైనం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం -
● బొబ్బిలిలో నిరసన హోరు
అధికారం కోసం ఉత్తుత్తి హామీలిచ్చి.. ఓట్లు దండుకున్నాక జనాన్ని నిలువునా ముంచేశారంటూ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంపై జనం నిప్పులుచెరిగారు. సూపర్ సిక్స్ అంటూ జనానికి మోసం ఫిక్స్చేశారన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్టీ బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు సమక్షంలో బొబ్బిలిలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, బాండ్లను దహనం చేశారు. ప్రజలను చంద్రబాబు వంచిస్తున్న తీరును వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యులు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి ధామోదరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.వి.మురళీకష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. -
● దగాకోరు పాలన ఇంకెన్నాళ్లు?
ప్రజలను మోసం చేసే దగాకోరు పాలన మాకొద్దు.. కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగ, మహిళ, విద్యార్థి లోకాన్ని వంచిస్తున్న చంద్రబాబు సర్కారును గద్దెదించుతాం అంటూ జనం నినదించారు. ఎస్.కోట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఉత్తుత్తి గ్యాస్గా మార్చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్లుగా సాగిస్తున్న వెన్నుపోటు పాలన తీరును ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల పార్టీ నేతలు మోపాడు కుమార్, మమ్ములూరు జగ్గుబాబు, గుమ్మడి సత్యనారాయణ, మాజీ జెడ్పీ చైర్పర్సన శోభ స్వాతిరాణి, తదితరులు ఎండగట్టారు. మేనిఫెస్టో ప్రతులు, ప్రజలకిచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. -
‘ఎఫ్ఎన్ఎన్’ ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభం
● 10 కేంద్రాల్లో 1,980 మంది టీచర్లకు శిక్షణ ● తొలిరోజున అసౌకర్యాల నడుమ ‘శిక్ష’ణ విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమెరసీ–ఎఫ్ఎల్ఎన్) మెరుగుపరచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఆరు రోజులపాటు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో మొత్తం 10 కేంద్రాల్లో 1980 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణను డీఈఓ యు.మాణిక్యంనాయుడు సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం, బోధనా పద్ధతులు, గ్రూప్ యాక్టివిటీస్, శిక్షణ సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. గణిత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. అసౌకర్యాల ‘శిక్ష’ణ ఆరు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తొలిరోజున అసౌకర్యాల నడుమ జరిగిందని ఉపాధ్యాయులు వాపోయారు. పట్టణంలోని పూల్బాగ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇరుకు గదులు, పిల్లలకు వినియోగించే బెంచీలు, తిరగని ఫ్యాన్ల నడుమ శిక్షణ ఇవ్వడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అయితే, పదో తరగతి సప్లిమెంట్ పరీక్షల కారణంగా తరగతి గదులు ఖాళీగా లేవని, 5వ తేదీ తర్వాత సమస్య ఉండదని సమగ్రశిక్ష అధికారులు తెలిపారు. -
సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి ఏడీగా ఎర్రాజీరావు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్)గా సుంకర ఎర్రాజీరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడీగా పనిచేసిన పి.ఎన్.అప్పారావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలను ఎర్రాజీరావుకు అప్పగించారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయం ఉద్యోగులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. ఆదాయార్జనలో వెనుకబాటు తగదు ● వివిధ శాఖల అధికారులపై కలెక్టర్ సీరియస్ విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయ వనరుల సమకూర్పులో వివిధ ప్రభుత్వ శాఖలు వెనుకబడడం సరికాదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. నిర్దేశించిన వార్షిక లక్ష్యాల సాధనలో వెనుకంజలో ఉన్న శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్, ఎకై ్సజ్, అటవీ, వాణిజ్య పన్నలశాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్ బుధవారం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నత్తనడక తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ టార్గెట్లు రీచ్కాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు, సాంకేతిక వైఫల్యాల వల్లే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని మండిపడ్డారు. సమావేశంలో నోడల్ అధికారి రేవతి, రవాణా డిప్యూటీ కమిషనర్ మణికుమార్, ఎకై ్సజ్ కమిషనర్ బి.శ్రీనాథుడు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలాజ్యోతి, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. ‘జలధార–జలహారతి’ పనులపై సమీక్ష జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి– పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వర్చుల్గా సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ (రిమ్స్) యాప్లో నమోదైన పనుల వివరాలను పరీశీలించారు. పరిపాలన ఆమోదం పొంది ఇంకా ప్రారంభం కాని 2,815 పనులు వెంటనే గ్రౌండ్ అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, జిల్లా పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మెరకముడిదాం వీఏఏ సస్పెన్షన్● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ● ఎరువుల డబ్బులు మార్క్ఫెడ్కు చెల్లించకపోవడమే కారణం మెరకముడిదాం: స్థానిక సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మల్లేడ భాస్కరరావుపై సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం మెరకముడిదాం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మల్లేడభాస్కరరావు ఎరువుల పంపిణీకి చెందిన రూ.1 లక్షా 25 వేలు మార్క్ఫెడ్కు చెల్లించకపోవడంతో మార్క్ఫెడ్ అధికారులు పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరారు. అయితే వీఏఏ భాస్కరరావు తరచూ వాయిదాలు వేస్తుండడంతో మార్క్ఫెడ్ అధికా రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ భాస్కరరావుపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భాస్కరరావు సస్పెన్షన్ విషయాన్ని మండలానికి చెందిన అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
● ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు
ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు, కూటమి నాయకులు మోసం చేశారంటూ జనం మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కుమారుడు డా.బొత్ససందీప్, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో కుమార్తె బొత్స అనూష పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్సిక్స్ హామీ ప్రతులను చింపి నిరసన తెలిపారు. హామీలు అమలుచేయలేని చేతగాని నాయకులు గద్దె దిగాలంటూ నినదించారు. కూటమి వెన్నుపోటు పాలనను అనూష ఎండగట్టారు. -
విద్యుత్ షాక్తో విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (వీఈడబ్ల్యూ) లోచర్ల సాయిబాబు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సాయిబాబు సిరుగుడుపేట వద్ద గల ఏబీ స్విచ్ను ఆఫ్ చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్ పక్కనే ఉన్న హెవీ లైన్కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ ప్రమాదానికి గురైన సాయిబాబును రాజాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సాయిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సాయిబాబు చీపురుపల్లి ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 20 ఏళ్లుగా సొంత గ్రామంలోనే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో భార్య, పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇరవై ఏళ్లుగా చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉన్నప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్తో మరణించిన సాయిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న వీఈడబ్ల్యూలు, జేఎల్ఎమ్, ఎనర్జీ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. -
వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి
నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్ కుమార్, బూర అశోక్ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్ స్టేషన్లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి..
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి సెంటర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జోళ్ల గూడ గ్రామానికి చెందిన ఎన్. జగన్, మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇరిడి వెళ్తుండగా.. తోలుఖర్జ గ్రామానికి చెందిన పాలక సహదేవుడు గుమ్మలక్ష్మీపురం వస్తుండగా మార్గమధ్యంలో ఇరిడి గ్రామం దాటాక ఇరిడి సెంటర్ సమీపంలో రెండు వాహానాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సహదేవుడు (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ద్విచక్ర వాహన చోడకుడు జగన్కు తీవ్ర గాయాలవడంతో భద్రగిరి ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. కాగా సహదేవుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రగిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్విన్ పేట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరొకరికి గాయాలు -
నేటి మొక్క రేపటి ఊపిరి..!
● మొక్కలు నాటుదాం..పుడమి తల్లికి కానుకిద్దాం ● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ ● నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం విజయనగరం గంటస్తంభం: మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అసలు ఒడి మాత్రం ప్రకృతిదే. గాలి, నీరు, నీడనిచ్చేది ప్రకృతి. అలాంటి ప్రకృతినే మనిషి తన చేతులతో నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు ఊరి బయట పెద్ద పెద్ద మర్రిచెట్లు ఉండేవి. వాటి కింద రైతులు సేద తీరేవారు. ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు గూళ్లు కట్టుకునేవి. ఇప్పుడు ఆ చెట్ల స్థానంలో సిమెంట్ కట్టడాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిండుగా కళకళలాడిన చెరువులు ఇప్పుడు ఎండిన మైదానాలుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని దూరం చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతిని కోల్పోతే అభివృద్ధి కూడా నిలవదనే విషయాన్ని మరిచిపోతున్నాడు. ప్రకృతి విలాపం వినిపించదా? ఈ వేసవిలో విజయనగరం జిల్లాలో మండిపోయిన ఎండలకు మధ్యాహ్నం పూట రోడ్లపై జనాలు కనిపించలేదు. చెట్టు నీడ కోసం వెతికే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు..ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరిక. మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడం సహజమే. కానీ స్వార్థం కోసం దోచుకోవడం ప్రమాదకరం. చెట్లు నరికేస్తున్నాం. అడవులను మాయం చేస్తున్నాం. ప్లాస్టిక్తో భూమిని నింపేస్తున్నాం. అయినా ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. కానీ తన బాధను ఎండల రూపంలో, తుఫాన్ల రూపంలో, వరదల రూపంలో మనకు చూపిస్తోంది. 2026 థీమ్..ప్రకృతే భవిష్యత్తుకు దారి ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ‘ఇన్స్పైర్డ్ బై నేచర్..ఫర్ క్లైమేట్...ఫర్ అవర్ ఫ్యూచర్’’ అంటే ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని వాతావరణ మార్పులను ఎదుర్కొని భావితరాలకు సురక్షిత భవిష్యత్తు అందించాలన్నదే ప్రధాన సందేశం. చెట్లు, అడవులు, చెరువులు, జీవవైవిధ్యం రక్షించడమే వాతావరణ సంక్షోభానికి అసలైన పరిష్కారమని ఈ థీమ్ చెబుతోంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, కరువు పరిస్థితులు, వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పచ్చదన ఉద్యమం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో అటవీశాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కల నాటడం, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవుల విస్తీర్ణం పెంచడం, చెరువులను సంరక్షించడం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చని భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయండం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే భావితరాలకు పచ్చని భవిష్యత్తు అందించగలం. నాటిన మొక్కను కాపాడితే పర్యావరణానికి మేలు.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో లక్షలాది మొక్కల పెంపకానికి లక్ష్యాలు నిర్దేశించాం. పచ్చదనం పెరిగితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రతి ఇంటి ముందూ ఒక మొక్క, ప్రతి గ్రామంలో ఒక పచ్చని ఉద్యమం అవసరం బిర్లంగి రామ్నరేష్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం -
ఇంటింట పింఛన్ల పంపిణీకి మంగళం..!
● అందరికీ ఒకే చోట అందజేస్తున్న పరిస్థితి ● వృద్ధులనూ పంచాయతీ కార్యాలయాలకు రప్పిస్తున్న సిబ్బంది ● సర్కారు తీరుతో విస్తుపోతున్న పింఛన్దారులు ● వైఎస్సార్సీపీ హాయంలో ఉదయం 5 గంటలకే తలుపుతట్టి అందజేతఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వాలి అందరినీ ఒకచోటకు పిలిచి పింఛన్లు పంపిణీ చేయకూడదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి అలా ఎక్కడైనా అందజేయకపోతే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస పాణి, డీఆర్డీఏ పీడీ ఒకేచోటకు రప్పించి అందజేత ప్రస్తుత టీడీపీ సర్కార్ పింఛన్దారులను రచ్చబండ వద్దకు, పంచాయతీ కార్యాలయం వద్దకు, లేదా వీధిలో ఒకచోట కూర్చుని వారి వీధిలో ఉన్న పింఛన్ దారులందరినీ పిలిపించి అక్కడ ఇస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను సైతం రప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇబ్బందికరమైనా పింఛన్దారులకు తప్పని పరిస్థితి. జిల్లాలో 2,68,072 ఫించన్లు జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన పింఛన్లు 2,68,072 ఉన్నాయి. వాటిలో వృద్ధాప్య 1,28,623, వితంతు 73,727, దివ్యాంగ 35, 538, అభయహస్తం 10,044, ఒంటరి మహిళలు 5,117, డప్పు కళాకారులు 4,005, చేనేత 2,844, గీతకార్మికులు 2,876, మత్య్సకారులు 2,129, చర్మకారులు 1548, డీఎంహెచ్ఓ 870, డయాలసిస్ 469,కళాకారుల 253, టాన్స్జెండర్స్ 26, సైనిక్ వేల్ఫేర్ పింఛన్లు 3 ఉన్నాయి. -
8న అంబేడ్కర్ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో (జోన్–1 పరిధిలో) వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 8న జిల్లాలోని చీపురుపల్లిలో గల డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తరగతుల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా.. 5వ తరగతి ప్రవేశాల్లో బాలుర పాఠశాలల్లో 255 సీట్లు, బాలికల పాఠశాలల్లో 341 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రవేశాల్లో భాగంగా బాలుర కళాశాలల్లో 224 సీట్లు, బాలికల కళాశాలల్లో 202 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బ్యాక్లాగ్ సీట్లుగా 6వ తరగతి బాలుర పాఠశాలల్లో 162, బాలికల పాఠశాలల్లో 169 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతిలో బాలుర పాఠశాలల్లో 47 సీట్లు, బాలికల పాఠశాలల్లో 86, 8వ తరగతి బాలుర పాఠశాలల్లో 19, బాలికల పాఠశాల్లో 84, 9వ తరగతి బాలుర పాఠశాలల్లో 45, బాలికల పాఠశాలల్లో 9 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. సీట్లు అన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రమే అని, అర్హత ఆసక్తిగల విద్యార్ధులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఈ నెల 8న చీపురుపల్లిలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల కౌన్సెలింగ్ కేంద్రానికి నేరుగా హాజరుకావాలని ఆమె కోరారు. -
పిడుగుపాటుతో మూగజీవాలు..
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి తొమ్మిది మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను మేకలను మేతకోసం కొండగంగుబూడి గ్రామం సమీపంలో విజయరామసాగరం చెరువు వద్దకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి రెండు మేకపోతులు, ఏడు మేకలు చనిపోయాయి. కె.జి.పూడి గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావుకు చెందిన ఒక మేక పిడుగుపాటుతో చనిపోయింది. జీవాల మరణంతో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
4.5 కిలోల కణితి తొలగింపు
మహారాణిపేట (విశాఖ): కేజీహెచ్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రశేఖర్, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.జులై 1న డీఈఈ సెట్● ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు నెల్లిమర్ల: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈ సెట్) జులై 1వ తేదీన జరుగుతుందని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 11 నుంచి తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. జులై 4న ఫలితాలు వెలువడతాయన్నారు. 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షనన్ కోసం అవకాశం ఉంటుందన్నారు. 16న సీట్ల కేటాయింపు, 19 నుంచి 23 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్కు గాయాలుగజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారి వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సాలూరు నుంచి వస్తున్న లారీ, ఎదురుగా విజయనగరం నుంచి వస్తున్న లారీ మధుపాడ జాతీయరహదారి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాలూరు నుంచి వస్తున్న కేరళ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. ఫుట్బాల్ ఏపీ జట్టు కెప్టెన్గా నవీన్విజయనగరం అర్బన్: జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా స్థానిక సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్ధి పి.నవీన్ ఎంపికయ్యాయడని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి తెలిపారు. అనంతపురం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగ్స్’ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో నవీన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచి విజేతగా నిలిచాడు. త్వరలో జెంషెడ్పూర్లో జరగబోయే జాతీయ స్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో నవీన్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణ్రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. -
వెన్నుపోటుపాలనపై పోరు సాగిద్దాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెర్లాం: చంద్రబాబు వెన్నుపోటు పాలనపై జిల్లాలోని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న పోరులో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)పిలుపునిచ్చారు. తెర్లాం మండలంలోని వెలగవలస గ్రామంలో మండల వైస్ ఎంపీపీ చేపేన సత్యనారాయణ ఇంటివద్ద బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పార్టీ మండల నాయకులతో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆ జీఓను వెనక్కితీసుకోండి
పూసపాటిరేగ: భోగాపురంలో డేటా సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 30ని వెనక్కి తీసుకోవాలని, బడాబాబులు ఎస్సీల భూముల కాజేతను నిరోధించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు భోగాపురం ఎస్సీ రైతులు బుధవారం విజ్ఞప్తిచేశారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీల సమస్యలపై సీతారాం వినతులు స్వీకరించారు. 12 మంది దళితులకు చెందిన ఇళ్ల స్థలాలను బడాబాబులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుపై విచారణ జరిపారు. ముంజేరు సిద్ధార్ధనగర్ కాలనీలో కొంత కాలంగా ఉన్న మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. భోగాపురం మండలకేంద్రంలో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రానికి స్థలం కేటాయించాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లుగా ఎస్సీల ఆధీనంలో ఉన్న డీ పట్టా భూములను 22ఎ నుంచి తొలగించాలని కోరారు. అర్హులైన ఎస్సీలు, డప్పు కళాకారులు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఎస్సీలపై రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు వెనుక్కి తీసుకొని క్షమాపణ చెప్పేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.హేమంత్కుమార్, ఎంపీడీఓ డి.స్వరూపారాణి, ఐసీడీఎస్ పీఓ లావణ్య, ఎంఈఓ రమణమూర్తి, ఏపీఓ భాగ్యలక్ష్మితో పాటు ఎస్సీ సంఘం నాయకులు గంటాన అప్పారావు, పాండ్రింకి వెంకటరమణ, ఎరుకొండ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. భోగాపురంలో రిలయన్స్ డేటాసెంటర్ పేరుతో దళితుల భూముల కాజేత తగదు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఎదుట పలువురు ఏకరువు -
రాజాం ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పన్షన్
విజయనగరం ఫోర్ట్: రాజాం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.హరిబాబు పై సస్పెన్షన్ విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్గౌర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న గజపతినగరం ఏరియా ఆస్పత్రికి ఓ విచారణ నిమిత్తం డాక్టర్ హరిబాబు వెళ్లారు. అసమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారు కలెక్టర్కు, డీసీహెచ్ఎస్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డాక్టర్ హరిబాబుపై సస్పెన్షన్ విధించాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి డీసీహెచ్ఎస్ ప్రతిపాదనలు పంపించారు. దీంతో హరిబాబుపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఖరీఫ్ ప్రణాళికను రూపొందించాలి ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ కోసం పకడ్బందీగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి రైతును దృష్టిలో పెట్టుకుని రైతు సేవా కేంద్రం వారీగా , గ్రామ మండల స్థాయి ప్రణాళికలను రుపొందించాలన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక అమలు, ఉత్పాదకాల నిర్వహణ, ఉద్యాన పంటల సాగు పెంపుపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మిషన్ హార్టీ విజన్ కింద మొత్తం 4,388 మంది రైతులను, 9,358.35 ఎకరాల విస్తీర్ణం గుర్తించినట్లు తెలిపారు. ఇందులో బోరుబావి, విద్యుత అనుసంధాన సౌకర్యాలు ఉన్న మొదటి విభాగం కింద 1154 మంది రైతుల సమ్మతి పత్రాలు సేకరించి ప్రాజెక్టు అమలుకు సిద్ధం చేశామన్నారు. బోరుబావి ఉండి విద్యుత్ అనుసంధానం లేని రెండవ విభాగం కింద 655 మంది రైతుల్లో 333 మంది నుంచి అంచనాలు స్వీకరించి 172 మంది సమ్మతి పత్రాలు సేకరించామన్నారు. బోరుబావి, విద్యుత్ రెండూ అవసరమైన 2,579 మంది రైతుల్లో 990 అంచనాలు, 271 సమ్మతి పత్రాలు సేకరించినట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి రామారావు, ఉద్యానశాఖ అధికారి చిట్టిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి పాల్గొన్నారు. మక్కువ: ఏనుగుల గుంపు సంచారంతో ప్రజల కు, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ ప్రసూన అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు. మక్కువ మండలం మా ర్కొండపుట్టి పంచాయతీ వీరాడవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును ఆమె బుధవారం పరిశీలించారు. ఇంతవరకు పంటలు, ప్రజలకు కలిగిన నష్టం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు దిశ మార్చిన తర్వాత పంటల నష్టం వివరాలను సేకరిస్తున్నామని డీఎఫ్ఓకు వివరించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
శృంగవరపుకోట: కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఓ కారులో గంజాయితో వస్తున్నారన్న సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి నిఘా వేసి కారును నిలువరించారు. కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. గంజాయి తూకం వేయించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 32.485కిలోల గంజాయి కారులో ఉన్నట్లు నిర్ధారించారు. నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన 53 యేళ్ల ముస్తఫా, 33యేళ్ల శరత్లాలాగా గుర్తించారు. రిమాండ్ నిమిత్తం నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ నారాయణమూర్తి చెప్పారు. -
అటవీభూములను గుర్తించి నివేదికలివ్వాలి
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ● ఆర్డీవోలతో వెబెక్స్లో సమీక్షవిజయనగరం అర్బన్: జిల్లాలోని అటవీభూములను త్వరితగతిన గుర్తించి వాటికి సంబంధించిన సమగ్ర నివేదికలను తక్షణమే సమర్పించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆర్డీఓలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ లోపల భూ పరిపాలన ప్రధాన కమిషన్ (సీసీఎల్ఏ)కు నివేదిక పంపాల్సి ఉన్నందున అధికారులు వేగంగా స్పందించాలన్నారు. జిల్లాలోని అటవీ భూములు, కొండపోరంబోకు స్థలాలు, ఉద్యాన వనాలు, అడవిలా కనపడే జంగిల్ ప్రాంతాలు, నదిపరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను క్షుణ్ణంగా గుర్తించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ అంశంపై సంబంధిత తహసీల్దార్లు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, నివేదికలను వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై గౌరవ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని అటవీ భూముల పూర్తి వివరాలను ప్రభుత్వానికి అత్యవసరంగా పంపాల్సి ఉందన్నారు. ఇందులో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సోమసుందర్ నేరుగా పాల్గొనగా వెబెక్స్ ద్వారా ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రాంమోహన్రావు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
నీట్ అవకతవకలపై విద్యార్థులఆగ్రహం
విజయనగరం గంటస్తంభం: నీట్, యూజీ తదితర ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పరీక్షల నిర్వహణ పేరుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెడుతోందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ కూడలి వద్ద బుధవారం ఆందోళన చేశారు. ర్యాలీ, మానవహారం చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పూడి రామ్మోహన్రావు మాట్లాడుతూ లీకేజీల విషయంలో వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ఎన్నిసార్లు ప్రశ్నపత్రాలు లీకవుతున్నా ప్రభుత్వం మాత్రం నిందితులను శిక్షించడం కంటే వివరణలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని విమర్మించారు. కోట్లాది మంది విద్యార్థుల కష్టం, ప్రతిభ, ఆశయాలను కొందరి అక్రమాలకు బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పరీక్షల అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు వి.చిన్నబాబు, గర్ల్స్ కన్వీనర్ ఆర్.శీరీష, ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, సహాయ కార్యదర్ములు ఎస్.సోమేశ్, పి.రమేష్,జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వెన్నుపోటుకు చిరునామా చంద్రబాబు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: వెన్నుపోటు పదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామాగా నిలిచారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటుపొడిచారన్నారు. రేగిడి మండలం లక్ష్మీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్లో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అటకెక్కిందని, ఫీజు రీయింబర్స్మెంట్ను అందజేయడంలేదని, 50 సంవత్సరాలకే పింఛన్ హామీ ఎండమావిగా మారిందని, కార్పొరేషన్ రుణాల మంజూరు జాడ కనిపించడంలేదని ఆరోపించారు. మహానాడు పేరుతో చంద్రబాబు సభలు పెట్టుకోవడమే తప్ప రెండేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మాత్రం రోజురోజుకూ పెంచుతున్నారన్నారు. అమరావతి పేరుతో అప్పులుచేసి కమీషన్ల రూపంలో లూటీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండేళ్ల మోసకారి పాలనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాలుగా చేస్తుందని, అన్ని గ్రామాల్లోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పోలేటి వెలమ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ కింజరాపు సురేష్, ఎంపీటీసీ సభ్యుడు ఎర్నేన అప్పలనాయుడు, సంకిలి సొసైటీ మాజీ చైర్మన్ కెంబూరి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్లు పాడి లక్ష్మునాయుడు, కెంబూరి వెంకటేశ్వరరావు, మొయ్యి కృష్ణమూర్తినాయుడు ఉన్నారు. -
సమరశంఖం
వెన్నుపోటు పాలనపై విజయనగరం: అధికార దాహంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీనికి నిరసనగా బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ సమరభేరి మోగించేందుకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు పిలుపుమేరకు ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలోని రింగ్రోడ్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి దీనికి సంబంధించిన వాల్పోస్టర్లతో పాటు రెండేళ్లలో హమీలు అమలు తీరుపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, వాటిని రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమాల షెడ్యూల్ను వెల్లడించారు. రైల్వే జోన్ క్రెడిట్ వైఎస్సార్సీపీదే... రైల్వే జోన్ సాధనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని.. రైల్వేజోన్ కోసం వైఎస్సార్ సీపీ నాడు పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగా వచ్చిందన్నారు. ఆ పోరాటాల కారణంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై నమోదైన కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తున్నాయని, అది వైఎస్సార్సీపీ క్రెడిట్ అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. తమ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన కంటకాపల్లి వద్ద యాభై ఎకరాల్లో ఏర్పాటైన అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ట్రయల్రన్ పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. నాడు వివక్షకు తావు లేకుండా... గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల సుపరిపాలనలో తనమన వివక్షకు తావులేకుండా అందరికీ సంక్షేమ పథకాలను అందచేశారని జెడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. విద్యా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. నాడు–నేడు, ఆంగ్ల బోధన, అమ్మ ఒడి తదితర సంస్కరణలు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేస్తే, కూటమి ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిన ఉద్యోగాలు ఇవ్వడం కేవలం ఆరోపణలుగా కొట్టిపారేస్తున్న అధికారులు, వాటిని ఆధారాలతో చూపలేకపోతున్నారన్నారు. అసోసియేషన్లు, ఫెడరేషన్లు చెబితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో యూరియా, విత్తనం కావాలంటే రైతులు లాఠీ దెబ్బలు తినాలని, పంటలకు బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు ప్రభుత్వం రైతును ఆదుకున్న పరిస్థితులు లేవని జెడ్పీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. పద్దెనిమిదేళ్ల మహిళలకు ప్రతినెలా ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న రూ.1500 హామీ అసలు అమలే కాలేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎటువంటి ఆర్థికఆసరా లేనివారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పథకంలో రెండేళ్లలో ఒక్క కొత్తవారికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రెండేళ్లలో దాదాపు 11 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారన్నారు. ఉపాధిహామీ పథకం స్వప్రయోజనాల పథకంగా అధికార పార్టీ నేతలు మార్చేశారని విమర్శించారు. జిల్లా వాసులు తాగునీటికి తహతహలాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటేలా 200–300 శాతం పెరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది తప్పితే, ధరలను నియంత్రించే చర్యలను చేపట్టడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కలనాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్; జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, మేధావుల విభాగం అధ్యక్షుడు సత్యారావు , ఉపాధ్యాయుల విభాగం అధ్యక్షుడు గంగారావు, గుర్ల జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అయ్యింది.. 2024 ఎన్నికలకు ముందు , అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి వెన్నుపోటు పొడిచిందని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. సూపర్ సిక్స్తో పాటు మరో 125 హమీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏమైందని, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీగా మిగిలిందని ఎద్దేవాచేశారు. రెండేళ్ల పాలన అంతా అవినీతి, అరాచకాలే.. దీనిపై 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు 8, 9 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజా అవగాహన సభలు 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు ప్రజాక్షేత్రంలో కూటమి మోసకారి పాలనను ఎండగడదాం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ వాల్పోస్టర్ల ఆవిష్కరణ -
నిరసన కార్యక్రమాలు ఇలా..
కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి, మోసగించి గెలిచిన జూన్ 4న అన్ని మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు నివాలులర్పించిన అనంతరం టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికాప్రకటన కాపీలను దహనం చేస్తారు. ● ఈ నెల 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రెండేళ్ల కూటమి మోసకారి పాలనను వివరిస్తూ పెద్దఎత్తున ప్రజా అవగాహన సభలు నిర్వహిస్తారు. ● కూటమి ప్రభుత్వం అధికారంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలోను, మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. -
బరితెగించిన ఇసుకాసురులు
● ఆందోళనకు దిగిన పుర్లి గ్రామస్తులు రేగిడి: ఇసుక అక్రమ తరలింపుతో కాసుల ఆర్జనకోసం వ్యాపారులు బరితెగిస్తున్నారు. అధికార బలంతో రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ఇసుక తరలింపునకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా రేగిడి మండలం పుర్లి గ్రామం వద్ద ఇసుక అక్రమ రవాణాకు వీలుగా ఎన్నోఏళ్లుగా ఉన్న నాగావళి నది కరకట్టను పొక్లెయిన్తో తవ్వేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పొక్లెయిన్పై నిల్చొని నిరసన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో నిర్మించిన కరకట్ట వల్ల తమ గ్రామంతో పాటు మరో పది గ్రామాలకు ముంపు సమస్య తప్పిందని, ఇప్పుడు ఇసుక అక్రమ తరలింపుకోసం కరకట్టను ఎలా తవ్వేస్తారంటూ ఇసుక వ్యాపారులను నిలదీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కరకట్టను తవ్వేయడం వల్ల సాయన్నచానల్కు నీటి ప్రవాహం పెరిగి రేగిడి, సంతకవిటి మండలాల్లోని 11వేల ఎకరాల ఆయకట్టు ముంపునకు గురవుతుందని గగ్గోలుపెట్టారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కరకట్టను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పాలకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమవ్యాపారం సాగడం విచారకరమన్నారు. ఆందోళనలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాలవలస సూర్యారావు, ఖండ్యాం నీటి సంఘం సభ్యులు పాలవలస ప్రసాదరావు, సురేష్, షన్ముఖరావు, బలగ లక్ష్మునాయుడు, పాలవలస రామినాయుడు, శ్రీనివాసరావు, గౌరీశంకర్, రవికుమార్, నేనుగుల దుర్గారావు, తేగల సిమ్మయ్య, పుర్లి, పరిసర గ్రామాల రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
2027 మార్చినాటికి రీ సర్వే పూర్తి చేయాలి
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను 2027 మార్చి నాటికి పూర్తిచేసి ప్రతి రైతుకు పూర్తి భూ వివరాలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న లక్షా ఏడువేల జాయింట్ ఎల్పీంలను ఈ ఏడాది జూలై 15 నాటికి సరిచేయాలని ఆదేశించారు. నాలుగో విడతలో 126 గ్రామాలు, ఐదో విడతలో 100 గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తిచేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందిన అర్జీలు, మ్యుటేషన్లు, 22ఏ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్ఓ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: భారత ప్రభుత్వం 2027 సంవత్సరంలో ప్రదానం చేసే ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్’ అవార్డుల కోసం అర్హత గల పిల్లల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ, ధైర్యసాహసాలు కనబరిచిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామాజికసేవ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, ధైర్యసాహసాలు, తదితర రంగాలకు చెందినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాలు మించని భారతీయ బాలబాలికలు మాత్రమే పురస్కారానికి అర్హులని పేర్కొన్నారు. జూలై 31 లోపు ‘అవార్ుడ్స.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. వైద్య విద్యార్థుల పరిశోధనకు పార్ధివదేహం అప్పగింత విజయనగరం ఫోర్ట్: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసకు చెందిన దాట్ల సూర్య అప్పలరాజు (87) వృద్ధాప్య సమస్యతో మంగళవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానంచేశారు. మృతదేహాన్ని కూడా అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థుల పరిశోధన కోసం వైద్యకళాశాల ప్రిన్సిపాల్కు మంగళవారం అప్పగించారు. మృతుని కుమార్తె రమాదేవిని వైద్య సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎనాటమీ హెచ్ఓడీ డాక్టర్ గీతాదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ టి.సురేఖ, అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పిల్లలకు వైద్య విద్యా వరం ● ఈఎస్ఐసీ కళాశాలల్లో ప్రవేశాలువిజయనగరం గంటస్తంభం: కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ ఐసీ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ వైద్య కళాశాలల్లో ఐపీ(ఇన్స్యూర్డ్ పర్సన్) కోటా కింద 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కోటా ద్వారా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నీట్–యూజీ 2026లో అర్హత సాధించడంతో పాటు ఈఎస్ఐసీ జారీ చేసే వార్డ్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబరు 30 నాటికి ఈఎస్ఐసీ సభ్యత్వం కలిగిన కార్మికుల పిల్లలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈఎస్ఐసీ వెబ్సైట్ ద్వారా ఐపీ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం ఎంసీసీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈఎస్ఐసీ, ఎంసీసీ వెబ్సైట్లను సందర్శించాలని, సందేహాల నివృత్తికి ఫోన్ 94922 55500నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. -
సచివాలయాల్లో హైసెక్యూరిటీ పేపర్ల కొరత!
● ధ్రువపత్రాల కోసం సచివాలయాలచుట్టూ తిరుగుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మా దృష్టికి రాలేదు స్వర్ణ గ్రామ, వార్డు సచివాయాలుగా మార్చడం వల్ల ప్రస్తుతం ఉన్న హైసెక్యూరిటీ పేపర్స్ స్టాక్ను పూర్తి చేస్తున్నాం. అందువల్ల స్టాకు రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కువ స్టాకు ఉన్న సచివాలయం నుంచి తీసుకుని ధ్రువపత్రాలు జారీ చేయాలని సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓలకు ఆదేశించాం. కొత్త స్టాకు ఈ నెల 10వ తేదీలోపు జిల్లాలకు చేరుతుంది. మండలాల్లోని సచివాలయాలకు పంపిస్తాం. ఇప్పటి వరకు సచివాలయాల్లో స్టాకు లేదన్న విషయం మా దృష్టకి రాలేదు. – రోజారాణి, డీఎల్డీఓ, విజయనగరంనా పేరు చింతాడ లక్ష్మణరావు. రామభద్రపురం మండలం మిర్తివలస. మా మనవడు శరత్ ఏడో తరగతి చదువుతున్నాడు. వాడి చదువుకు అవసరమైన కులం, ఆదాయ ధ్రువపత్రాలకు రొంపల్లి సచివాలయంలో రూ.100 చెల్లించి దరఖాస్తు చేశాను. ధ్రువపత్రాల కోసం సిబ్బందిని అడిగితే హైసెక్యూరిటీ పేపర్లు అయిపోయాయి. కొద్ది రోజులు సమయం పడుతుందని చెబుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా ప్రయోజనం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటికి తెచ్చి ధ్రువపత్రాలు ఇచ్చేవారు. రామభద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాల్లో కోతలేకాదు.. విద్యార్థులు, రైతులు, వినియోగదారులకు వివిధ ధ్రువపత్రాల కోసం వినియోగించే హైసెక్యూరిటీ పేపర్లకూ కటకటలాడాల్సిన దుస్థితి. పేపర్లు లేక సచివాలయ సిబ్బంది ధ్రువపత్రాల మంజూరుకు చేతులెత్తేస్తున్నారు. పేపర్లు లేవు.. వారం రోజులు తరువాత రావాలని నచ్చజెబుతున్నారు. జిల్లాలో 666 గ్రామ, వార్డు సచివాయాలు ఉన్నాయి. చాలా సచివాలయాల్లో హైసెక్యూరిటీ పేపర్ల కొరత వెంటాడుతోంది. దీంతో కులం, నివాస, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీకాక ప్రజలు వారంరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్, పాలిసెట్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఈ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో ధ్రువపత్రాలు పొందేందుకు వేలాదిమంది విద్యార్థులు సచివాలయాల్లో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల పరిశీలన అనంతరం ధ్రువపత్రాలు మంజూరు చేసినా హైసెక్యూరిటీ పేపర్లు లేక విద్యార్థుల చేతికి ధ్రువపత్రాలు అందడం లేదు. విద్యాసంవత్సర ఆరంభ సమయంలో సచివాలయాలకు అవసరమైన పేపర్లు సరఫరా చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సచివాలయ సేవలను నిర్వీర్యం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. గత జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, ధ్రువపత్రాలను వలంటీర్లే ఇంటికి తెచ్చి ఇచ్చేవారని గుర్తుచేసుకుంటున్నారు. -
మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. యాంటీ మలేరియా మాసోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంఓ వి.ఎస్.కె.రఘువంశీ, డీఎల్ఓ కె.రాణి, తదితరులు పాల్గొన్నారు. నాలుగు ఆస్పత్రులకు రూ.24 లక్షల పెనాల్టీ విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని తిరుమల మెడికవర్, సాయి, గాయత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్వైద్య సేవ)ట్రస్టు అధికారులు రూ.24 లక్షలు పెనాల్టీ విధించారు. అవసరమైన వ్యాధి నిర్ధారణ రిపోర్టులు సరైనవి పెట్టకుండా క్లయిమ్లు పొందారనే అంశంపై పెనాల్టీలు విఽధించినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులను దారిలోకి తెచ్చుకోవడం కోసం టీడీపీ సర్కార్ పెనాల్టీలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించక పోవడంతో రెండు పర్యాయాలు సమ్మె చేపట్టారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేశారు. ఇంకోసారి నెట్వర్క్ ఆస్పత్రులు గొంతు ఎత్తకుండా అణిచివేయడం కోసమే గతంలో ఎన్నడూలేని విధంగా పెనాల్టీలు విధించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ. 24 లక్షలు పెనాల్టీ విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రావడం వాస్తవమేనని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం తెలిపారు. -
వైఎస్సార్ నగర్లో భారీ చోరీ
● సుమారు 30 తులాల బంగారం అపహరణ ● క్లూస్ టీమ్తో టూటౌన్ పోలీసుల దర్యాప్తు విజయనగరం క్రైమ్: స్థానిక టూటౌన్ స్టేషన్ పరిఽధి వైఎస్సార్ నగర్లో ఫ్లాట్ నంబర్ 15 లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 తులాల బంగారం అపహరణకు గురైంది. చోరీ సొత్తు విలువ దాదాపు రూ.70 లక్షలకు పైగా ఉంటుంది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు, ఫిర్యాదుదారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టా వీరవెంకటస్వామి తన భార్య గౌరితో వైఎస్సార్ నగర్లోని శ్రీ సత్యనగర్లో 8 ఏళ్ల నుంచి సొంత ఇంటిలో ఉంటున్నారు. భార్య గౌరి ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తుండగా వీర వెంకటస్వామి స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వారి పిల్లలు ఉన్నత చదువుల కోసం పై ఊళ్లలో ఉండగా భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. ఈనెల 30న భార్యాభర్తలు అన్నవరం దర్శనానికి వెళ్లి 31న సాయంత్రానికి ఇంటికొచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. తలుపు తీసి చూడగా బీరువా తాళం తెరిచి ఉండడం, మాస్టర్ బెడ్రూంలోని మంచంపై చిందరవందరగా బీరువాలోని వస్తువులు కనిపించడంతో ఇల్లు గుల్ల య్యిందని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తన ఐడీపార్టీ బృందంతో సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీమ్తో ఇల్లు మొత్తం ఆధారాలు సేకరించారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ,పోయిన సొత్తు తిరిగి ఫిర్యాదుదారులకు అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పెట్రోల్,డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన విజయనగరం గంటస్తంభం: డ్రైవర్స్ డే సందర్భంగా ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. విజయనగరం కోట కూడలి వద్ద ఆటోలను తాళ్లతో లాగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, సీఐటీయూ నగర కార్యదర్మి బి.రమణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీలో అవకతవకలపై నిరుద్యోగుల ఆగ్రహజ్వాల
డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయనగరం కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులు, యువతవిజయనగరం గంటస్తంభం: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పోర్ట్స్ కోటాతో సహా పలు విభాగాల్లో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి అధిక మార్కులు సాధించిన నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. పోస్టులను డబ్బులకు అమ్మేశారంటూ ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ముందుగా విజయనగరం కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ నుంచి రాజీవ్ యువకేంద్రం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ డౌన్డౌన్, తక్షణమే రాజీనామా చేయాలంటూ నినదించారు. మెగా డీఎస్సీ కాదు... ఇది దగా డీఎస్సీ, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు, మెరిట్ లిస్ట్ ఎందుకు దాచారు?, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎవరికిచ్చారు? అంటూ నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యువత, డీఎస్సీ అఽభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరుబాట సాగిస్తామని స్పష్టంచేశారు. ర్యాలీ అనంతరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు వినతిపత్రం అందజేసి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌశిక్, బొత్స చైతన్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వాకాడ సతీష్, పైడిపునాయుడు, శంకరరావు, వావిలిపల్లి రమణారావు, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కరుమజ్జి సాయి, టౌన్ అధ్యక్షుడు చెల్లూరి భార్గవ్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎస్సీ సెల్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన విజయనగరంలో మహాధర్నా పాల్గొన్న వేలాదిమంది నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ యువజన నాయకులు మెరిట్కు టీడీపీ సమాధి కట్టిందంటూ మండిపాటు మెరిట్లిస్ట్ ఎందుకు దాచారు?..డేటా ఎందుకు తొలగించారు? ప్రభుత్వాన్ని నిలదీసిన యువత డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ కోరుతూ జేసీ సేతు మాథవన్కు వినతిపత్రం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో అన్యాయం డీఎస్సీ నియామకాల్లో సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో కనీస గడువు ఇవ్వకుండా అఽభ్యర్థులను తిరస్కరించడం అన్యాయం. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్మనం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. – కోలగట్ల శ్రావణి, మాజీ డిప్యూటీ మేయర్ యువత ఆశలకు గండి ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన యువతకు డీఎస్సీ ఒక ఆశాకిరణంగా కనిపించింది. నియామకాల ప్రక్రియలో వచ్చిన ఆరోపణలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. యువతకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. డీఎస్సీపై వచ్చిన అన్ని ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలి. – శోభా స్వాతిరాణి, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు -
ఇలాగైతే.. ఎలా...!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్డి లేక చిన్నారు లు అవస్థలు పడుతున్నారు. సీ్త్ర, శిశు సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు ప్రభు త్వం గొప్పలు చెబుతుంది. కానీ జిల్లాలో పదుల సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాల్లో వాస్తవ పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నదానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ కేంద్రాలకు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు కూడా వెళ్లి వస్తుంటారు. ప్రభుత్వం అందజేసే పలు రకాల పౌష్టికాహార పదార్ధాలు తీసుకునేందుకు గర్భిణులు, బాలింతలు వెళ్తుండగా.. చిన్నారులు పగటి పూటంతా అక్కడే ఉంటారు. మ రి ఇటువంటి కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ఉండాలి? కానీ ఆ దిశగా ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వసతు ల లేమితో ఈ కేంద్రాలో అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, రాజాం, ఎస్.కోట, వియ్యంపేట, విజయనగరం ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. 292 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2207 ఉన్నాయి. వీటి పరిధిలో 7,652 మంది గర్భిణులు, 7,284 మంది బాలింతలు, ఆరు నెలల్లోపు పిల్లలు 6625 మంది ఉన్నారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 35,630 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 20,314 మంది ఉన్నారు. సౌకర్యాల్లేక చిన్నారుల అవస్థలు అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయినప్పటకీ చిన్నారులకు తప్పనిసరి పరిస్థితి. పిల్లలకు సురక్షితమైన తాగునీరు కూడా అందివ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. నిర్మాణంలోనూ అలసత్వమే.. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణంలోనూ అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు 538 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 366 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. 139 నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లును కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరుగుదొడ్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు వీటిని నిర్మిస్తున్నాం. జిల్లాలో చాలా వరకు నిర్మాణం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ భవనాల్లో నిర్వహి స్తున్న 566 అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. 388 కేంద్రాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. మిగతా కేంద్రాలకు ఈ కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాం. కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం. – కె.వి.బాలామణి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి -
సాహిత్యంలో నాటకం గొప్పది
● పద్మశ్రీ యడ్ల గోపాలరావు రాజాం సిటీ: భాష ఏదైనా నాటక రచన గొప్ప ప్రక్రియ అని పద్మశ్రీ యడ్ల గోపాలరావు అన్నారు. నాటకంలోని సాహిత్యం సాహితీవేత్తలను అలరిస్తే, ప్రదర్శన సమయంలో నటుల నటన పండితుల్ని, సామాన్యుల్ని కూడా రంజింపజేస్తుందని కొనియాడారు. ఆదివారం స్థానికంగా రాజాం రచయితల వేదిక 136వ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దివంగత కాకినాడ పూజ్యనాథం ఆచారి రచించిన ‘రావణబ్రహ్మ’ పద్య నాటక పుస్తకాన్ని గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప కవులు రాయబట్టే గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు నేటికీ నిలిచి ఉన్నాయన్నారు. రావణబ్రహ్మ నాటకం కూడా వాటి కోవకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రచయిత భార్య కాకినాడ సర్వలక్ష్మిని రాజాం రచయితల వేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. రంగస్థల నటుడు, సంస్కృత పండితులు బౌరోతు శంకరరావును రంగస్థల నాటక సేవలను గుర్తించి సత్కరించారు. గార రంగనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులుగా ద్విశతావధాని మరడాన శ్రీనివాసరావు, మేడూరి సత్యనారాయణమూర్తి, పాటోజు బ్రహ్మాజీరావు, లంక సూర్యారావు, ప్రముఖ వైద్యులు గార రవిప్రసాద్, కోడ పురుషోత్తం, డాక్టర్ ఆల్తి మోహనరావు, పిల్లా తిరుపతిరావు, గార సీతారత్నం, లంక విజయభాస్కర్, ఒమ్మి రమణమూర్తి, పొట్నూరు కోటిబాబు, రాజాపు శాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం పటిష్టతకు చర్యలు
నెల్లిమర్ల: జిల్లాలోని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఉద్యోగుల సంఘం బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కోసూరు రాంబాబు అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటలోని ఓ కల్యాణ మంటపంలో ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆ సంఘం నెల్లిమర్ల నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యకలాపాలు మూడు దశాబ్దాలుగా కేవలం జిల్లా కేంద్రానికి పరిమితమయ్యాయని, ఇకనుంచి ఆ కార్యకలాపాలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. తొలుత నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు వేసేందుకు జిల్లా వ్యాప్త పర్యటనలు చేస్తున్నామని వివరించారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఉద్యోగులందరూ ఏకాభిప్రాయంతో, ఐక్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనా ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెదురుపర్తి గీత సత్య ఉమాపతి, కోశాధికారి కెల్ల సోమ శేఖర్, సంఘం జిల్లా నాయకులు కుప్పిలి శ్రీనివాస్, మంతెన అప్పలరాజు, సంభాన లక్ష్మణరావు, కుప్పిలి మోహన్ బాబు, పట్నాల బాలసుబ్రహ్మణ్యం, చంద్రమౌళి, తాతాచారి, నెల్లిమర్ల నాయకులు ఆరిపాక శ్రీనివాసరావు, కృష్ణమాచారి, కడలి ప్రకాశరావు, సత్య సాయి గణేష్,ఆరిపాక రాము, బాబు విశ్వేశ్వరరావు, కడలి రమేష్ కుమార్, కొమ్మోజు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోసూరు రాంబాబు -
ఘనంగా పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, అర్చకుడు నేతేటి ప్రశాంత్లు అమ్మవారికి పూజాదికాలు, యాగప్రక్రియను నిర్వహించారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. -
లైన్మన్కు తీవ్రగాయాలు
● విద్యుత్ స్తంభంపైనుంచి జారిపడి ప్రమాదం వీరఘట్టం: మండలంలోని తెట్టంగిలో జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్న సవర సోమేష్ ఆదివారం విద్యుత్ పనులు చేస్తుండగా స్తంభంపై నుంచి జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు,,,ట్రాన్స్కో సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్తంభం పైన ఉన్న సర్వీస్ వైర్ పరిశీలించేందుకు ఎక్కాడని, ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న ఇన్వర్టర్ సప్లై రిటర్న్ రావడంతో సోమేష్కు స్వల్ప షాక్ తగిలి కింద ఉన్న సీసీ రోడ్డుపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో లైన్మన్ సోమేష్ తల సీసీ రోడ్డుకు బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వీరఘట్టం ఏఈ సోమేశ్వరరావు, సహచర సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం లైన్మన్ను తరలించారు.ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆపరేషన్ చేస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నట్లు ఏఈ సోమేశ్వరరావు తెలిపారు. సీతంపేట మండలం చాకలిగూడకు చెందిన సోమేష్ రెండేళ్ల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడని ఏఈ తెలిపారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనవిజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం ప్రాంగణంలో ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. పౌర్ణమి రోజును పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీ వర్థి నృత్యాలయం బృంద చిన్నారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
పోషక రేడు..నేరేడు
నేరేడు పండ్లతో ప్రయోజనాలు నేరేడు పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఎ.సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. ● మూత్ర సమస్యల నియంత్రణతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరుస్తుంది. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపర్చడంతో పాటు శుభ్రపరుస్తుంది. ● నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ● దంతాలు, చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది. ● కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి, పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలను కరిగించడానికి ఈ నేరేడు పండు దోహదపడుతుంది. ● నేరేడుపండులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారిస్తుంది. అన్ని వేళలా ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది.● ప్రస్తుత సీజన్లో విరివిగా లభ్యం ● ఆరోగ్య ఫల ప్రదాయినిగా గుర్తింపుపాలకొండ రూరల్: ప్రకతి ప్రసాదించే పండ్లజాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫల ప్రదానియగా పిలిచే నేరేడు పండును సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు చేయడంతో పాటు శరీరంలో ఏర్పడే అనేక అనారోగ్య సమస్యలను, రుగ్మతలను దూరం చేస్తుంది. రుచిలో మేటిగా ఉండే నేరేడు పండు తినడం వల్లే కాదు ఆకులు, చెట్టు బెరడు కూడా శరీరానికి చక్కని మేలు చేకూరుస్తాయి. నేరేడుపండులో అత్యధిక పోషకాలు ఉన్న క్రమంలో పండు రూపంలోనే కాకుండా ఆరోగ్య పానీయాలు, జామ్లు, ఐస్క్రీమ్లు తయారు చేసుకోవచ్చు. నేరేడు కాయలను వెనిగర్, వైన్ తయారీలో ఉపయోగిస్తారు. నేరేడుపండ్లు కోయడం చాలా శ్రమతో కూడుకున్నది కావడంతో ధర కూడా అదే విధంగా ఉంటుంది. రైతు దగ్గర దళారులు కేజీ రూ.90కి కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారు లకు రూ.120 వరకూ విక్రయిస్తారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధాన పరంగా అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉన్న నేరేడుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. నేరేడు పండు తింటే వ్యాధులకు, రోగకారక సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. నేరేడుపండ్లు తినడంలో నియంత్రణ లేకుంటే దుష్ఫలితాలు సంభవించవచ్చు. వగరు రుచి కలిగిన నాణ్యత లేని నేరేడుపండ్లు భుజిస్తే గొంతు నొప్పి సంభవించవచ్చు. సీజన్ మారే సమయంలో ఈ పండ్లను మితంగా తినాలి. ఉబ్బసం రోగం ఉన్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినరాదు. దీర్ఘకాలికమైన శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నేరేడుపండ్లలో ఉండే అత్యధిక లవణాలు, పోషకాల వల్ల బలహీనమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి తరచూ కడుపునొప్పి సంభవించే అవకాశం ఉంది. -
17న ‘ది ఆఫీసర్స్ క్లబ్’ నూతన కమిటీ ఎన్నికలు
విజయనగరం అర్బన్: పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ది ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ కమి టీ ఎన్నికలను జూన్ 17న నిర్వహించనున్న ట్టు ఎన్నికల అధికారి, సహకార శాఖ జిల్లా అధికారి పి.రమేష్ తెలిపా రు. ఈ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ఆదివారం వెల్లడించారు. ఈ క్లబ్ నిర్మాణంలో భాగంగా కమిటీకి అధ్యక్షు డి గా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. కమిటీలో కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. కార్యవర్గ సభ్యులుగా అధికారుల విభాగం నుంచి నలుగురిని, నాన్ అఫీషియల్స్ విభాగం నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ నూతన కమిటీ ఏర్పాటవుతుంది. క్లబ్లో రెండు విభాగాల్లో కలిపి ప్రస్తుతం 300 మంది సభ్యులు ఉన్నారు. వీరికి సంబంధించిన ఓటర్ల జాబితాను ఇప్పటికే క్లబ్ ఆవరణలో ప్రదర్శించారు. క్లబ్లో కనీసం ఐదేళ్ల పాటు సభ్యత్వం పూర్తి చేసుకున్న వారు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి నియమ నిబంధనలపై చర్చించడానికి వీలుగా ఎన్నికల కంటే ముందే జూన్ 7న క్లబ్ సభ్యులందిరితో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి రమేష్ తెలిపారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. స్థానిక ఓ పాఠశాలలో జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సైద్ధాంతిక శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత నుంచి శాశ్వత మినహాయింపు ఇచ్చేలా విద్యా చట్టానికి అవస రమైన సవరణలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించడానికి అడ్డంకిగా మారిన వివాదాస్పద జీఓ 223ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం వెంటనే కొత్త పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆలోగా ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న సరెండ ర్ లీవ్ బకాయిలతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ ఐ క్లైమ్లు, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, వీవీజే సుబ్రహ్మణ్యం, ఆర్థిక కార్యదర్శి ఎ. తాతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రమణ, కె.సంతోషలక్ష్మి పాల్గొన్నారు. పార్వతీపురం: జిల్లా జాయింట్ కలెక్టర్గా సేవలందించిన సి. యశ్వంత్కుమార్ రెడ్డికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ కావడంతో కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ పదవులు తాత్కాలికమైనవైనా, ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వత గుర్తింపు ను తెస్తాయన్నారు. జిల్లా అభివృద్ధికి యశ్వంత్ కుమార్రెడ్డి అందించిన సేవలను ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత తదితర అధికారులు ఆయన పరిపాలనా నైపుణ్యాన్ని కొనియాడారు. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..!
● బస్సు ప్రమాదంలో జె.గుమడాం మహిళ మృతిబొండపల్లి: బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయంలో ఇంటి యజమాని మృత్యువాత పడ్డాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లకు తల్లే అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుతూ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకుని జీవితం హాయిగా సాగుతున్న సమయంలో బస్సు ప్రమాదం ఆ తల్లిని మృత్యుఒడిలోకి తీసుకువెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండలంలోని జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈఽశ్వరమ్మ(57) ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆదివారం వేకువ జామున విశాఖపట్నంలోని గాజువాకలో మృతి చెందింది. ఈశ్వరమ్మకు భర్త వెంకటరమణతో పాటు ఇద్దరు కూతుళ్లు లక్ష్మి,దివ్య లు ఉన్నారు. భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతిచెందగా ఇద్దరు కూతుళ్లకు తానే పెళ్లిళ్లు చేసింది. చిన్న కూతురు దివ్యను రాజమండ్రిలో గల యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. మనుమడు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి రాగా మనుమడిని కూతురి ఇంటికీ దిగబెట్టేందుకు ఈశ్వరమ్మ వెళ్లి తిరుగు ప్రయాణంలో పార్వతీపురం డిపోకు చెందిన బస్సులో రాజమండ్రి నుంచి వస్తుండగా టైరు పంక్చర్ అయి నిలిపి ఉంచిన టిప్పర్ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్ట్మార్టంనిమిత్తం విశాఖపట్నంలోకి కేజీహెచ్కు తరలించారు. మొదట తండ్రి, తర్వాత తల్లి మృతి చెందడంతో వారి ఇద్దరి కూతుళ్ల రోదనలు సంఘటనా స్థలం వద్ద చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ఇదే ప్రమాదంలో సాలూరుకు చెందిన రాయంపిల్లి రాంబాబు (50) మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా గాజువాక శ్రీనగర్ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న ఆర్టీసీ బస్సును ఆయన పరిశీలించారు. పూసపాటిరేగ : మండలంలోని కందివలస జంక్షన్ సమీపంలో జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వివరాలలోకి వెళ్తే.. శ్రీకాకుళంలో ఉంటున్న తన చెల్లి ఇంటికి విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన కోన రమ (44) స్కూటీపై వెళ్తుండగా పూసపాటిరేగ మండలం కందివలస సంత సమీపంలో తాను ప్రయాణిస్తున్న స్కూటీకి ప్రమాదం జరగడంతో కిందపడి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమ భర్త కోటేశ్వర్రావు గతంలోనే చనిపోయారు. ఇద్దరు పిల్లలతో తండ్రి వద్దనే చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు అనుకోని విధంగా మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. సెల్ఫ్ ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా వాహనం తగిలి ప్రమాదం జరగడంతో కింద పడి మృతి చెందిందా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వ్యసనాలతో జీవితాలు నాశనం
● డీఎస్పీ రాఘవులు ● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పొగాకు నిషేధ దినోత్సవ అవగాహన ర్యాలీవిజయనగరం టౌన్: వ్యసనాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని విజయనగరం డీఎస్పీ ఎస్.రాఘవులు సూచించారు. ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం భారీ మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా పోలీస్శాఖ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ పొగాకు, డ్రగ్స్, గంజాయి వినియోగంతో కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయని వాటన్నంటికీ ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు, డ్రగ్స్, గంజాయితో వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్రహ్మకుమారీస్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీఐలు, ఎస్సైలు జిల్లా నలుమూలల నుంచి బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మహానాడు కాదు దగా నాడు
● అంతా లోకేష్, దేవాన్ష్ల భజనే ● హామీలు అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్చీపురుపల్లి: టీడీపీ రెండు రోజులు నిర్వహించిన మహానాడు పేరును కాస్త దగానాడు అని పెట్టుకుంటే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీరామారావు ను వెన్నుపోటు పొడిచి, పిల్లను ఇచ్చిన ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు దగానాడు అని పేరు పెట్టుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహానాడులో తీర్మానం చేయడం తరువాత వదిలేయడం బాబుకు అలవాటేనన్నారు. మహానాడు లో లోకేష్, దేవాన్ష్ భజన తప్ప ఇంకేం లేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి చేసింది చెప్పలేక రానున్న మూడేళ్లలో ఏం చేస్తామో చెప్పుకోలేక మహానాడు వేదికగా ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం ఇటీవల డీఎస్సీ నియామకాల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుందని ఆరోపించారు. డీఎస్సీలో అర్హత సాధించడానికి అర్హత పరీక్ష ప్రామాణికం అయినప్పటికీ స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో ఎన్నడు లేని విధంగా, నిబంధనలకు విరుద్ధంగా శాప్ నుంచి ఇచ్చిన బోగస్ ధ్రువీకరణలతో ఉద్యోగ నియామకాలు చేపట్టడం దారుణమని విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
మత్తు బాబులకు ‘మూత్ర’ పరీక్ష!
● నిమిషాల్లోనే గంజాయి గుట్టురట్టు ● చైన్నె నుంచి వచ్చిన ప్రత్యేక కిట్లు ● జిల్లా పోలీసుల సరికొత్త ప్రయోగంపార్వతీపురం రూరల్: గంజాయి మహమ్మారికి కళ్లెం వేసేందుకు, మత్తు రక్కసి కోరల నుంచి యువతను కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు సరికొత్త వ్యూహానికి పదునుపెట్టారు. గంజాయి అక్రమ రవాణాదారులను అడ్డుకోవడంతో పాటు, ఆ మత్తులో మునిగితేలుతున్న వారిని సైతం పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు వినూత్న శాసీ్త్రయ విధానానికి శ్రీకారం చుట్టారు. ‘రాపిడ్ యూరిన్ టెస్ట్’ (శీఘ్ర మూత్ర పరీక్ష) ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే మత్తు బాబుల బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఈ పరీక్షల ఆధారంగా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేస్తుండడంతో గంజాయి ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గంజాయిలో ఉండే ‘టెట్రా హైడ్రో కెనాబినాల్’ (టీహెచ్సీ) అనే రసాయన ఆనవాళ్లను పసిగట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లతో పోలీసులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల నుంచి మూత్ర నమూనాలను సేకరించి, ఈ కిట్లో రెండు చుక్కలు వేయగానే ఫలితం కళ్లకు కడుతుంది. కిట్లో ఒకే ఎరుపు గీత కనిపిస్తే గంజాయి పీల్చినట్లు (పాజిటివ్)గా, రెండు గీతలు వస్తే నెగిటివ్గా నిర్ధారిస్తున్నారు. ఎవరైనా వారం రోజుల క్రితం గంజాయి పీల్చినా సరే..ఈ కిట్ ద్వారా దొరికిపోతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె నుంచి ప్రత్యేక కిట్లుఈ సరికొత్త తనిఖీల కోసం రాష్ట్ర పోలీసు శాఖ నేతృత్వంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తమిళనాడు రాజధాని చైన్నె నుంచి ప్రత్యేక కిట్లను రప్పించారు. సుమారు రూ.450 విలువ చేసే ఒక్కో కిట్లో పది టెస్ట్ స్ట్రిప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ నూతన విధానం ద్వారా పరీక్షలు నిర్వహించి, ఇప్పటికే గంజాయి పీల్చిన ఇద్దరిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పార్వతీపురం సీఐ బెండి వెంకటరావు వెల్లడించారు. అనుమానితులను పరీక్షించి వారు గంజాయి పీల్చారో? లేదో? తేల్చడంతో పాటు, అసలు వారికి ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి లభ్యమవుతోంది? దీని వెనుక ఉన్న శక్తులెవరు? అనే కోణంలో కూపీ లాగుతున్నట్లు ఆయన వివరించారు. యువత మత్తు వలయంలో చిక్కుకోకుండా నివారించేందుకు పోలీసుల చేతిలోని ఈ శాసీ్త్రయ అస్త్రం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
జలధార – జలహారతితోనైనా.. సాగునీటి కష్టాలు తీరేనా..!
రామభద్రపురం: జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు ఆధారమై న చెరువులు, ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్ పూడికలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. మదుము లు, చెక్డ్యాంలు పూర్తిగా శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు దశాబ్ద కాలంగా వాటి నిర్వహణ ఊసే లేకుండా పోయింది. 2014 – 19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద ఉపాధి హామీ నిధులతో కొన్ని చోట్ల మదుములు, చప్టాలు, చెక్డ్యాంల పనులు చేయకుండానే చేసినట్టు, మరికొన్ని చోట్ల పనులు నాసిరకంగా చేసి రూ.కోట్ల నిధులు అప్పట్లో ఆయా నాయకులు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఉపాధి హామీ పథకం కింద చెరువు పనులు చేసినా తూతూ మంత్రంగానే తప్ప రైతులకు ఉపయోగపడేలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మదుముల దుస్థితి చూస్తే సాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చెరువులలోని సాగునీటిని పంట పొలాలు మీదుగా చెరువులకు చేరుస్తూ నీటితో కళకళలాడాల్సిన పంట కాల్వలు నేడు మురుగు కాల్వలను తలపిస్తున్నాయి. 5–6 అడుగుల లోతులో ఉండాల్సిన సాగునీటి కాల్వలు వ్యర్థాలు, చెత్త చెదారంతో పూ ర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం ఈ కాల్వలు ముళ్లపొదలు, చిన్న చిన్న చెట్లు, వ్యర్థాలతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. వ్యర్థాలతో పూర్తిగా పూడి కపోయాయి. కనీసం నీటి చుక్క వెళ్లే మార్గం లేదు. కొద్ది నెలల క్రితం కూటమి ప్రభుత్వంలో అధికారు లు పూర్తిగా పోయిన వాటికి ప్రతిపాదనలు పంపించినా అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దాంతో ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడి చెరువుల నిండి నా చెరువులకు సంబంధించిన ఆయకట్టు పండేలా కనిపించడం లేదు. చెరువుల్లో కళ్ల ముందు నీరు ఉన్నా రైతులు పంటలకు సరఫరా చేసే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతూ పూర్తిగా వరి సాగు వదిలేసి వర్షాధార పంటలు, ఆరు తడి పంటలైన కూరగాయలు, పత్తి సాగు చేసుకుంటున్నారు. జలధార – జలహారతితోనైనా సాగునీటి కష్టాలు తప్పేనా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జలవనరుల సంరక్ష ణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియో గం లక్ష్యంగా జలధార – జలహారతి కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.659.3 కోట్లతో 7062 చెరువులు, రూ.100.44 కోట్లతో 4801 ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్ తదితర ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలు, చెరువులను శుభ్రం చేసి భూగర్భ జల మట్టాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయకట్టుకు ఉపయోగ పడేలా చెరువులు, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్లో పూడికతీత, పనులతో పాటు మదుములు, చెక్ డ్యాంలు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టేందుకు వెసులుబాటు ఉంది. వర్షాలు పడక ముందే కాలువ ల్లో నిండిపోయిన తుప్పలు, డొంకలు, పూడికలు, మదుముల ఆధునీకరణ తదితర పనులు ఉపాధి హామీ ద్వారా చేపడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. జలధార – జలహారతితో రైతులకు సాగునీటి కష్టాలు ఎంత మేరకు తీరుతాయో వేచి చూడాలి. మడకవాని చెరువుకు సంబంధించి రెండు, వెంకయ్యబందకు సంబంధించి రెండు మదుములు పూర్తిగా కుంగిపోయి పాడైపోయాయి. ఎనిమిదేళ్లుగా సాగు నీటికి అవస్థలు పడుతున్నాం. అలాగే ఆ చెరువుకు ఆధారంగా ఉన్న పంట కాలువలు పూర్తిగా తుప్పలు, డొంకలు, వ్యర్థాలతో పూడికపోయాయి. అధికారులు వెంటనే బాగు చేయకపోతే ఆయకట్టు పంట పొలాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించాలి. – చొక్కాపు పైడిపునాయుడు, రైతు, రామభద్రపురం జలవనరుల సంరక్షణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియోగమే లక్ష్యం. జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో చెరువుల అభివృద్ధ్ది, ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్, మదుముల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పనులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. – ఎస్.శారదా దేవి, డ్వామా పీడీ -
అంతర్జాతీయ చెస్ పోటీలకు కంచరాం విద్యార్థిని
రాజాం: మండలంలోని కంచరాం జెడ్పీ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని కలిశెట్టి పావని అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి.దుర్గయ్య ఆదివారం తెలిపారు. జూన్ 1 నుంచి 8 వరకూ అమరావతి విట్లో జరిగే ఇంటర్నేషనల్ పైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026 క్రీడల్లో ఆమె పాల్గొంటుందని వెల్లడించారు. అండర్ 15 విభాగంలో రాష్ట్ర క్రీడాకారిణిగా ఎంపికై ందని, ఇటీవల రాజాంకు చెందిన పలుశాఖల అధికారులు అందించిన ఆర్థికసాయంతో ఎంట్రీ ఫీజు చెల్లించిందని వెల్లడించారు. ఆమె ఎంపికపట్ల పాఠశాల హెచ్ఎం వై. గౌరునాయుడు, పీఈటీ బీఎన్ నాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు లెంక శ్రీనివాసరావు, పండూరి వేణుగోపాలరావు, పి.మహేష్, వై.భాస్కర్, అరుణ తదితరులతో పాటు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కేజీన్నర గంజాయితో ఇద్దరు నిందితుల పట్టివేతవిజయనగరం క్రైమ్: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై బాలాజీ చెప్పిన వివరాల ప్రకారం విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సంయుక్తంగా విజయనగరం రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్పై ఆదివారం తనిఖీలు చేస్తుండగా విజయనగరానికి చెందిన మజ్జి కార్తీక్, అమలాపురం జిల్లాకు చెందిన పలివెల దుర్గా ప్రసాద్ నాగరాజులు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతం నుంచి రూ.75,000 విలువైన 1.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టుకు తరలించామని ఎస్సై బాలాజీ తెలిపారు. ఐదు ఇసుక ట్రాక్టర్ల సీజ్వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల నాగావళి తీరంలో ఇసుక దందా జోరుగా సాగుతోందని పత్రికల్లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఏఎస్.కామేశ్వరరావు శనివారం రాత్రి తమ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేశారు. ఈ సందర్భంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ట్రాక్టర్లను వీరఘట్టం పోలీసు స్టేషన్కు అప్పగించినట్లు తహసీల్దార్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి డెంకాడ: మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పాసైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి సి–ప్రోగ్రామింగ్పై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో సి–ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. థియరీ తరగతులతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని, ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. శిక్షణకు వస్తున్న వారు ఫోన్ 9441663201ను ఆశ్రయించి, పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పుస్తక పఠనంపై తర్ఫీదు గరుగుబిల్లి: మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులలో పఠన అలవాట్లు పెంపొందించేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీలు, భక్తి గీతాలు, స్పోకెన్ ఇంగ్లిష్, కథలు చెప్పడం, పద్యాలు, గద్యాల పఠనం వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రతిభను వెలికితీశారు. క్రీడా పోటీలలో భాగంగా క్యారం బోర్డు, బిజినెస్, లూడో, చదరంగం వంటి ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి శాఖాగ్రంథాలయ నిర్వాహకులు ఎన్.మధుసూదనరావు పాల్గొని విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. -
రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో డాక్టర్ ఆశిష్ ప్రథమం
బొబ్బిలి: పట్టణానికి చెందిన సుంకర పల్లి ఆశిష్ చండీగఢ్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంసీహెచ్ రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ కేవీ అప్పారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కంటి ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది అరుదైన విషయమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఈ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అబ్బుర పరిచిందన్నారు. చండీగఢ్ యూనివర్సిర్శిటీలో గోల్డ్మెడల్ సాధించి బీజేఓ, ఏఏఓ వంటి జర్నల్స్లో 15కు పైగా పరిశోధనా వ్యాసాలు రాసిన ఘనత ఆశిష్ సొంతమన్నారు. దక్షిణభారత దేశం నుంచి ఎంసీహెచ్ రెటీనాలో ఈ ర్యాంకు ద్వారా సీటు సాధించిన అభ్యర్థులలో ఆశిష్ మొదటి వ్యక్తి అని ప్రశంసించారు. ఆగస్టులో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థ ప్రారంభం:బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ జంక్షన్లో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థను ఆగస్టు 13న ప్రారంభించనున్నట్లు డాక్టర్ కేవీ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ వైద్య సంస్థకు డాక్టర్ ఎస్.ఆశిష్, డాక్టర్ విజయలు సారథ్యం వహిస్తారని తెలిపారు. -
మత్స్యశాఖ డీడీగా లావణ్య
విజయనగరం ఫోర్ట్: మత్స్యశాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్)గా ఎం.లావణ్య శనివారం బాధ్యతలు స్వీకరించా రు. కాకినాడ మత్స్యశాఖ కార్యాలయంలో ఏడీ(అసిస్టెంట్ డైరెక్టర్)గా పనిచేసిన ఈమె ఉద్యోగోన్నతిపై విజయనగరానికి వచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు సిబ్బంది అభినందనలు తెలిపారు. ఆరోగ్యశ్రీ టీమ్లీడర్కు షోకాజ్ నోటీస్ విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)లో టీమ్లీడర్గా పనిచేస్తున్న ఆర్.ఎం.నాయుడు టీడీపీ నిర్వహించిన మహానాడులో మంత్రితో పాటు చిందులు వేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ‘మహానాడులో చిందేసిన ఆరోగ్యశ్రీ ఉద్యోగి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు. టీమ్ లీడర్ ఆర్.ఎం.నాయుడుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం తెలిపారు. 21న ‘రీ–నీట్’ ● జిల్లాలో 7 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 1,901 మంది విజయనగరం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న ‘రీ–నీట్’ ప్రవేశ పరీక్షకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అఽధికారి సత్తిబాబు తెలిపారు. తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జిల్లాలోని 7 పరీక్ష కేంద్రాల్లో నీట్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,901 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నప్రత్రాల భద్రత, గోప్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. సమావేశంలో నీట్ సిటీ కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోదీతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపాల్స్, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వడదెబ్బతో వేతనదారు మృతి బొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన వేతనదారు ఇంటికి వచ్చే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యులు, వేతనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన తెలుగు అప్పన్న (53) గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు శనివారం వెళ్లారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇంటికి చేరే క్రమంలో ఎండకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ కొద్ది క్షణాల్లో మృతి చెందారు. ఆయనకు భార్య బంగారమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఎర్రయ్యమ్మ ఉన్నారు. ఇంటిపెద్ద వడదెబ్బకు గురై మృతిచెందడంతో కన్నీరుపెడుతున్నారు. -
కలెక్టర్ గారూ కనికరించండి..!
చిత్రంలో ఖాళీ బిందెలతో నిల్చుని దండాలు పెడుతున్న గిరిజనులు ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని పల్లపు దుంగాడ వాసులు. కుళాయిల నుంచి తరచూ తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కూడా చుక్కనీరు రాకపోవంతో ఖాళీ బిందెలతో నిల్చొని దండాలు పెడుతూ ‘కలెక్టర్ సారూ కనికరించండి.. తాగడానికి నీళ్లు ఇప్పించండి.. చలమల నీళ్లు తాగి రోగాల పాలవుతున్నాం.. కుళాయిలు వేశారు.. బిల్లులు చేసుకున్నారు.. నిధులు మింగేశారు. మమ్మల్ని గాలికొదిలేశారు’ అంటూ గోడువినిపించారు. – శృంగవరపుకోట -
నగుళ్లుదబ్బగడ్డలో ఏనుగుల గుంపు
మక్కువ: మండలంలోని నగుళ్లుదబ్బగడ్డ నీలాటిరేవు సమీపంలో ఏనుగుల గుంపుమ సంచరిస్తోంది. శుక్రవారం సాయంత్రం లోవరకండి సమీపంలో సంచరించిన ఏనుగులు శనివారం ఉదయానికి నగుళ్లుదబ్బగడ్డ సమీపంలోని రామకృష్ణ అనే రైతు పామాయిల్ తోటలోకి ప్రవేశించాయని ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. పామాయిల్ తోటలోని వాటర్ ట్యాంక్ను, పైపులను .. అలాగే నగుళ్ల గ్రామంలో జానకమ్మకు చెందిన మొక్కజొన్న పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని చెప్పారు. దీంతో కోన, గోపాలపురం, నగుళ్లుదబ్బగడ్డ, డి.శిర్లాం, లోవరఖండి, తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. వేర్వేరు చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్ ● సుమారు 22 తులాల బంగారం రికవరీ విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు చోరీలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు వేర్వేరుగా శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాల్లో బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులతో కలిసి ఎస్పీ ఏఆర్ దామోదర్ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. బొబ్బిలి, రామభద్రపురంలలో ఫ్లిప్కార్డ్ ఉద్యోగిగా పని చేస్తున్న మణికంఠ ఇంటింటికీ వెళుతూ పగలు పూట రెక్కి నిర్వహించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడేవాడని ఎస్పీ తెలిపారు. అతని నుంచి దాదాపు 20 తులాల బంగారం రికవరీ చేశామన్నారు. ఇక ఎస్. కోట పీఎస్ పరిధిలో రవి అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ మధ్యానికి బానిసై డబ్బుల కోసం దొంగతనాలు చేసేవాడని, అతని వద్ద నుంచి సుమారు మూడు తులాల బంగారం రికవరీ చేశామన్నారు. అలాగే భోగాపురం పీఎస్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. సమావేశంలో ఎస్. కోట సీఐ నారాయణ, బొబ్బిలి సీఐ మూర్తి, భోగాపురం ఎస్సై అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్మన్ల ఆత్మీయ భేటీ
విజయనగరం: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని చిన్న శ్రీను క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ ఆత్మీయ భేటీలో ఇరు జిల్లాల జెడ్పీ చైర్మన్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్ సీపీ సంస్థాగత కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును చిత్తూరు జెడ్పీ చైర్మన్ పట్టు శాలువాతో ఘనంగా సత్కరించి, తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిన్న శ్రీనును మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ
చికెన్రాజాం సిటీ: పట్టణంలోని పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ డివిజనల్ ఇంజినీరు పంచాది వెంకటప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. యథావిధిగా శనివారం ఉదయం ఆయన విధులకు రాగా తాళాలు బద్దలుగొట్టి ఉండడాన్ని చూసి, ఆఫీస్ గదిలో పరిశీలించారు. ఆ గదిలో 20 బ్యాటరీలు, రాగి వైరు, ఒక మొబైల్ అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 35 వేల విలువగల సామగ్రిని దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్టీమ్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
ముత్యాలమ్మ కొండను కాపాడండి!
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు పతివాడ, రాయుడుపేట గ్రామస్తుల వినతి విజయనగరం: తమ గ్రామ ప్రజలకు జీవనాధారంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ముత్యాలమ్మ కొండను అక్రమ తవ్వకాల నుంచి కాపాడాలని పూసపాటిరేగ మండలం పతివాడ, రాయుడుపేట గ్రామస్తులు కోరారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వే నంబర్ 77లో ఉన్న ముత్యాలమ్మ కొండపై ఏటా అమ్మవారి పండగను నిర్వహిస్తామన్నారు. పశువులు, జీవాల మేతకు కొండే ఆధారమన్నారు. ఇప్పుడు కొందరు కాంట్రాక్టర్లు కొండను యంత్రాలతో తవ్వేసి కనుమరుగుచేస్తున్నారని, తక్షణమే స్పందించి తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: పరిసరాల పరిశుభ్రత ప్రజలందరి బాధ్యతని లెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా కణపాక వద్ద కాలువల్లో పూడికలు తొలగించే ప్రక్రియను శనివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీలైనంత వరకు పాలిథిన్ను, తడిచెత్తను వేరుచేయాలని, తడిచెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడంలో మున్సిపల్ సిబ్బందికి పౌరులు తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ నగరంలోని సుమారు 392 కిలోమీటర్ల మేర కాలువలు, డ్రైన్లను పూర్తిగా శుభ్రపరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ కె.అప్పలరాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాంబమూర్తి, ఇతర అధికారులు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చెరువుల పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని చెరువుల పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక శివాలయం చెరువు వద్ద సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్స్వీప్’ పనులను, నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను పరిశీలించి, ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడనున్న నేపథ్యంలో పట్టణ పరిధిలోని డ్రెయిన్లు, వరద నీటి కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం జల వనరుల సంరక్షణపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో స్థానికులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, మెప్మా పీడీ నాగభూషణరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వానాది శ్రీహరి, మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకర రెడ్డి -
బరువెక్కిన పచ్చిరొట్ట ..!
విజయనగరం ఫోర్ట్: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించిండి.. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయండంటూ టీడీపీ సర్కార్ పదేపదే గొప్పలు చెబుతోంది. కాని ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రకృతి సాగును ప్రోత్సహించే క్రమంలో భూసారాన్ని పెంచేందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువుల ధరలను తగ్గించి రైతులకు అందించాలి. అవసరమైతే ఉచితంగానైనా ఇవ్వాలి. కాని కూటమి ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువు ధరలను పెంచేసింది. ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతుల సాగుకు వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట ఎరువుల ధరల పెరగడం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 3409 క్వింటాళ్లు కేటాయింపు.. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి జిల్లాకు 3,409 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. ఇందులో జీలుగ విత్తనాలు 1,819 క్వింటాళ్లు , జనుము విత్తనాలు 1137 క్వింటాళ్లు, పిల్లిపెసర విత్తనాలు 453 క్వింటాళ్లు ఉన్నాయి. జిల్లాపై రూ. 1.27 కోట్ల భారం.. కూటమి సర్కార్ పచ్చిరొట్ట ఎరువు ధరల విత్తనాలు పెంచడం వల్ల జిల్లాపై కోట్లాది రుపాయల భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా రైతాంగంపై రూ.1.27 కోట్ల భారం పడనుంది. జీలుగ, కట్టిజనుము,పిల్లిపెసర విత్తనాలపై క్వింటకు రూ. 3,700 నుంచి 4,500 రూపాయల వరకు పెంచారు. పచ్చిరొట్ట ఎరువు ధరలు పెంచేసిన టీడీపీ సర్కార్ ఖరీఫ్ సీజన్కు 3,409 క్వింటాళ్ల విత్తనాలు కేటాయింపు విత్తనాల ధరలు రూ. 3700 నుంచి 4,500 రూపాయల వరకు పెంపు పచ్చిరొట్ట ఎరువుతో అనేక ప్రయోజనాలు..పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసరల్లో ఎదో ఒకటి వరి పంట సాగు చేయడానికి 40 రోజులు ముందు పొలంలో సాగు చేయాలి. పంట పెరిగిన తర్వాత పంటను బాగా కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. భూమికి కావాల్సిన నత్రజని లభిస్తుంది. దీని వల్ల యూరియా వాడకం తగ్గుతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. – ఎ. శ్రీనివాసరావు, ఏఓ, విజయనగరం -
గడువులోగా అభివృద్ధి పనులు
పార్వతీపురం: జిల్లాలో కొనసాగుతున్న భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సంబంధిత శాఖాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. జూన్ 12 నాటికి పూర్తయిన భవనాలను వెంటనే ప్రారంభించి, సంబంధిత శాఖలకు అప్పగించాలని ఆదేశించారు. వన్స్టాప్ సెంటర్ భవన నిర్మాణం పనులు వేగవంతం చేసి జూన్ 30లోగా అప్పగించాలన్నారు. పనుల పురోగతిపై వారానికి ఒకసారి నివేదికలు సమర్పించాలని సూచించారు. టెట్ తప్పనిసరి తీర్పును పునఃపరిశీలించాలి విజయనగరం అర్బన్: ఇన్సర్వీసు టీచర్లకు టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మదన్మోహన్, పి.శ్రీనివాస్లు ఓ ప్రకటనలో శనివారం విజ్ఞప్తి చేశారు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన అవసరం లేదని గతంలో ఎన్సీటీఈ(జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు. అయినా సుప్రీం ధర్మాసనం మాత్రం ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. మరోసారి తీర్పుపై పునరాలోచన చేయాలని, టెట్ నుంచి ఇన్సర్వీసు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనకు ఏర్పాట్లు
● కలెక్టర్ను ఆదేశించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ యువరాజ్ విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో నిర్మించనున్న ‘మెసర్స్ జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్’ శంకుస్థాపనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన ప్రస్తుత ప్రగతి, భూసేకరణ, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుకు సంబంధించిన నివేదికను, ఇప్పటివరకు సాధించిన పురోగతిని సెక్రటరీకి వివరించారు. భూసేకరణ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పన పనులను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాను అడ్డుకుందాం
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాకు చెక్ పెట్టి జిల్లాను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు రెవెన్యూ, పోలీస్ అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫనార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వినియోగం చాలా వరకు తగ్గిందని.. ఒడిశా, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేవంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఈగల్ ఎస్సై స్వీటీ పాల్గొన్నారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ ముఠాలపై నిఘాపెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. యువత మొబైల్ ఫోన్లను తనిఖీ చేసి బెట్టింగ్ యాప్లను తొలగించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
పొగబారుతున్నారు..
● స్మోకింగ్ ప్రమాదకరం ● వ్యసనానికి బానిసలవుతున్న యువత ● అలవాటు మానుకోవాలంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంవిజయనగరం ఫోర్ట్: స్మోకింగ్ (పొగ తాగడం) ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్గా మారిపోయింది. పెద్దవాళ్లు చుట్టలు, బీడీలు కాల్చితే, యువత సిగరెట్స్, ఈ సిగరెట్స్ తాగుతున్నారు. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపిస్తాయి. అయినప్పటకీ పొగ తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంల్లో పొగే తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. చుట్టులు, బీడీలు, సిగరెట్ల రూపంలో తెగ కాల్చేస్తున్నారు. ముఖ్యంగా అడ్డ పొగ (రివర్స్ స్మోకింగ్) తాగేవారు ఎక్కువుగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. పొగ తాగేవారితో పాటు, వారి పక్కనుండే వారు వ్యాధుల బారిన పడుతున్నారు. పొగ తాగడంవల్ల వచ్చే వ్యాధులు.. పొగ తాగడం వల్ల సీఓపీడీ, నిమోనియా, క్రానిక్ బ్రాంక్టైస్, గొంతు క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె పోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం బాధితులేనని నివేదికలు చెబుతున్నాయి. మధమేహం ఉన్న వారు పొగ తాగడం వల్ల వ్యాధి అదుపులో ఉండదు. దీని వల్ల ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది. యువత అలవాటు పడుతున్నారు.. ఒకరి నుంచి మరొకరు పొగ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు వారు ఎక్కువుగా పొగ తాగుతున్నారు. కొంతమంది సిగరెట్స్ స్థానంలో ఈ సిగరెట్స్ ఎక్కువుగా తాగుతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఊపిరిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి. గతంలో నిరక్ష్యరాస్యులు, గ్రామీణ, గిరిజన ప్రాంత వాసులు ఎక్కువుగా చుట్టలు, సిగరెట్లు తాగేవారు. కానీ నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్మోకింగ్కు అలవాటు పడుతున్నారు. ఇదిలా ఉంటే అడ్డపొగ మరీ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.అత్యంత ప్రమాదకరం.. పొగతాగడం అత్యంత ప్రమాదకరం. పొగాకు ఉత్పత్తులు నమలడం వల్ల కూడా జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. ఊపరితిత్తులు, గొంతు క్యాన్సర్తో పాటు మూత్రాశయం, లివర్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగ తాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి నెలా 1500 నుంచి రెండు వేల మంది వరకు ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్నారు. వీరంతా పొగాకు బాధితులే. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
కస్తూరిబా ఉద్యోగిని అక్రమాలపై ఫిర్యాదులు
రాజాం: వంగర మండలంలోని ప్రభుత్వ కస్తూరీబా గాంధీ విద్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న కెంబూరు సరస్వతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చింపేటలో సరస్వతి తాత్కాలికంగా నివసిస్తుండగా, ఈమె స్వగ్రామం రేగిడి మండలం మజ్జిరాముడుపేట గ్రామం. ఈమైపె మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరణం శ్రీనివాసరావు ఆన్లైన్లో ప్రజా ఫిర్యాదుల వేదికకు ఈనెల 28న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఏడాదికి రూ.2.88 లక్షల జీతం తీసుకుంటున్న ఈమె 2020–21 ఏడాదిలో తప్పుడు వివరాలతో పీఎంఏవై పథకం ద్వారా రాజాం పట్టణంలోని కంచరాం సమీపంలోని లేఅవుట్ –1లో 574 నంబర్తో ఇంటి పట్టా పొందిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజాం రెవెన్యూ అధికారులు శనివారం ఫిర్యాదుదారుని వద్ద వివరాలు సేకరించడంతో పాటు కేజీబీవీ ఉద్యోగిని కెంబూరు సరస్వతిని కూడా విచారించారు. రాజాం తహసీల్దార్ ఎం.రాజశేఖరం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, ఈమె మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో ఆ కార్యాలయానికి ఈ ఫిర్యాదులు పంపిస్తున్నామని ఆర్ఐ మహేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగినిపై ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తప్పుడు వివరాలతో అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ఉద్యోగిని, ఆమె కుటుంబీకులు మోసగించారని ఆరోపించారు. -
చుక్కవలసలో సరికొత్త దోపిడీ
● పండ్ల తోట ముసుగులో ఉపాధిహామీ నిధుల కై ంకర్యం చీపురుపల్లిరూరల్(గరివిడి): ఉద్యాన పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో అందిస్తోంది. దీనినే ఆసరాగా చేసుకుని గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగు ముసుగులో ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో కాజేశారు. మొత్తం 11 మంది రైతుల పేర్లతో సమారు 5.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు జరిగినట్లు అధికారిక రికార్డుల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 2 నుంచి 3 ఎకరాల మధ్య మాత్రమే డ్రాగన్ఫ్రూట్ తోటలు కనిపిస్తున్నాయి. మరోవైపు సాగుచేసిన ఆ విస్తీర్ణంనే కొత్త రైతుల పేర్లతో ఏటా రికార్డుల్లో నమోదుచేస్తూ ప్రోత్సాహకాలను కై ంకర్యం చేయడం గమనార్హం. మరోవైపు డీ పట్టా భూముల్లో సాగుచేసిన తోటలను జిరాయితీ భూముల్లో సాగుచేసినట్టు పేర్కొని నిబంధనలకు విరుద్ధంగా నిధులు కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా 50 సెంట్ల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ తోటలను సాగుచేసే రైతుకు సుమారు రూ.2లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. దీనిని టీడీపీ నాయకులు అధికార బలంతో అందిపుచ్చుకున్నారు. పంట సాగుచేయకుండా రికార్డుల్లో చూపుతూ నిధులను కొట్టేశారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో ఇప్పటికే పాత రైతులు సాగుచేసిన తోటలనే చూపించినట్టు సమాచారం. గ్రామానికి కేటాయించిన ఉపాధిహామీ నిధులన్నీ తోటల పేరుతో దొడ్డిదారిని దారిమళ్లిస్తూ, పని కల్పించడంలేదని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు మూడురోజుల కిందట వేతనదారులు ఫిర్యాదు చేశారు. నిధుల దోపిడీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
విజయనగరం అర్బన్: పింఛన్ల పంపిణిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రతి నెలా సజావుగా జరుగుతున్నప్పటికీ, సానుకూల ప్రజాభిప్రాయం విషయంలో జిల్లా వెనుకబడి ఉండడంపై కలెక్టర్ విశ్లేషించారు. పింఛన్లు ఇళ్ల వద్దకు వెళ్లే ఇవ్వాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలతో మ ర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సకాలంలో పారిశ్రామిక ప్రాజెక్ట్లు.. జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాజెక్ట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందింరలో రెవెన్యూ, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల పెంపు దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
సీతం అధ్యాపకుడికి జాతీయ స్థాయి గుర్తింపు
విజయనగరం అర్బన్: స్థానిక సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సీతం) ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. సీఎస్ఈ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.దినేష్కుమార్ భాగస్వామ్యంతో రూపొందించిన ఒక వినూత్న ఎమ్మార్ఐ స్కానింగ్ పరికరం డిజైన్కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం అధికారికంగా ‘డిజైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (పేటెంట్) మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు శుక్రవారం మాట్లాడుతూ.. కళాశాలలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి ఇటువంటి జాతీయ స్థాయి విజయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు, పరిశోధనలకు సంస్థ తరఫున మద్దతిస్తామని చెప్పారు. అనంతరం డాక్టర్ దినేష్కుమార్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డైరెక్టర్ వై.నరేంద్రకుమార్, చీఫ్ అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాయిరాం పట్నాయక్, ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.సతీష్కుమార్, సివిల్ హెచ్ఓడీ డాక్టర్ రవికిషోర్, తదితర అధ్యాపక సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు. -
మరో ఎనిమిది శాఖలు ఏర్పాటు చేస్తాం
● వీసీడీఎల్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు రాజాం: తమ బ్యాంక్ కొత్తగా ఎనిమిది శాఖలను ఏర్పాటు చేయనుందని విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు అన్నారు. పట్టణ కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన స్థానిక బ్రాంచ్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాఖలతో సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. మరణించిన 1006 మంది ఖాతాదారుల కుటుంబాలకు రూ. 255 లక్షల మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంలో ఉన్న కొన్ని మోసపూరిత ఆర్థిక సంస్థలో పెట్టుబడులు పెట్టవద్దని, అలాగే రుణాలు తీసుకోవద్దని సూచించారు. తమ బ్యాంక్ ప్రజల బ్యాంక్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. అనంతరం ఉత్తమ ఖాతాదారులుగా ఎంపికై న వాండ్రంగి కొండలరావు, తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ ఎం.దీప్తి, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
● కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జి మువ్వల బొబ్బిలి: గడచిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు బేబీనాయన ఇచ్చిన అఫిడవిట్లో పొందుపరిచిన భూములకు, ప్రస్తుతం ఆయన తనవి అంటున్న భూములకు తేడాఉందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జి మువ్వల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. బేబీనాయన ఈసీకి ఇచ్చిన భూముల వివరాలతో సంబంధం లేని గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 619/2బి, 621/2బిలోగల భూ హక్కులు తనవిగా చూపిస్తూ మల్లంపేటకు చెందిన ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేయించారన్నారు. ఆ భూములు తనకు ఏ విధంగా దఖలు పడ్డాయో ఈసీకి బేబీనాయన వివరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఏడుగురు రైతుల భూములను ఆక్రమించుకుని పోలీసు కేసు పెట్టి ప్లాట్లుగా వేసి విక్రయించుకుంటున్నారన్నారు. ఆ భూములపై నుంచి విద్యుత్ వైర్లు వేసినందుకు బెర్రీ కంపెనీ రైతులకు పరిహారం ఇచ్చిందనీ, వారికి రైతు భరోసా నిధులు కూడా వచ్చాయన్నారు. సమావేశంలో వేణు, తదితర రైతులు పాల్గొన్నారు. -
ఇంధనభారం మోయలేం
● పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆటోవాలాల ఆందోళన ● విజయనగరంలో భారీ ర్యాలీ విజయనగరం గంటస్తంభం: పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్టీయూ (న్యూ) అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేశారు. ధరల పెంపునకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మయూరి కూడలి మీదుగా మెసానిక్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ ప్రధాన ద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు, కార్యదర్మి ఎన్.అప్పలరాజు మాట్లాడు తూ, ఇంధన ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపకుండా ఇంధన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెన్నా ధర్మారావు, గేదెల నారాయణరావు, కంది రాము, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
ధారగంగమ్మ జాతర ఆదాయం రూ.5.80లక్షలు
శృంగవరపుకోట: పట్టణ ప్రజల కొంగుబంగారం ధారగంగమ్మ అమ్మవారి జాతర ఆదా యం రూ.5,80,741లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి జాతర ఆదాయా న్ని శుక్రవారం లెక్కించారు. మూడు రోజుల పాటు జరిగిన జాతరలో దర్శన టికెట్ల విక్రయంతో రూ.2,11,511లు, హుండీల నుంచి రూ. 3,69,230 సమకూరిందన్నారు. రెండేళ్ల కిందట 2024 నాటి జాతరలో టికెట్ల అమ్మకాల వల్ల రూ.1,99,841, హుండీల ఆదాయం రూ. 3,11,767 వచ్చినట్టు చెప్పారు. ఈ సారి టికెట్ల వల్ల రూ.16,670, హుండీల ఆదాయం రూ. 57,463 పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ కె.నాగేంద్ర, సీఐ శ్యాంప్రసాద్, అర్చకుడు రాజగోపాలాచార్యులు, శ్రీవారి సేవకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. బీఎల్ఓలకు కిట్ల పంపిణీ విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్లిష్ట సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందజేసే ప్రత్యేక కిట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శుక్రవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓవర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటినీ సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో వారికి ఉపయోగపడేలా అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 మంది బీఎల్ఓలకు ఈ కిట్లను తక్షణమే పంపిణీ చేయాలని కలెక్టర్ డీఆర్ఓకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సత్తిబాబు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. స్కానింగ్ రిపోర్టులను ఆన్లైన్ చేయాలి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్చేసిన ప్రతి కేసు వివరాలను ఆన్లైన్, ఆఫ్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు స్కాన్ సెంటర్లు ఎవరైనా కొత్తగా మిషన్లు కొనుగోలుచేసినా, తొలగించినా వాటి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. పీసీపీఎన్డీటీ వెబ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ కె.రాణి, ఆర్డీఓ సుధాసాగర్, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు. మహానాడులో చిందేసిన ఆరోగ్యశ్రీ ఉద్యోగి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ.. కొందరు ఉద్యోగులు అధికార టీడీపీ సేవలో తరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, నాయకులతో కలిసి చిందేయడం వివాదాస్పదంగా మారింది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ)లో టీమ్ లీడర్గా పనిచేస్తున్న ఆర్.ఎం.నాయుడు బొండపల్లి మండలం దేవుపల్లిలో గురువారం నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. తప్పెడుగుళ్లు కళాకారుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్టెప్పువేయగా... టీమ్లీడర్ విజిల్ వేస్తూ చిందేశారు. ట్రస్టు ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొడమే తప్పని, ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. -
భోగాపురంలో రీసర్వేను బహిష్కరించిన రైతులు
పూసపాటిరేగ: భోగాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్వహించే రీ సర్వేను బాధిత రైతులు స్వచ్ఛందంగా బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎస్.సుధాసాగర్ భోగాపురం తహసీల్దార్ కార్యాలయానికి హుటాహుటిని చేరుకొని రీసర్వేపై తహసీల్దార్ హరితో చర్చించారు. భోగాపురంలో నిలిపివేసిన భూసర్వేపై అధికారులతో సమాలోచన చేశారు. అనంతరం పోలిపల్లికి చెందిన పలువురు బాధిత రైతులతో తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భోగాపురం మండలంలో రిలియన్స్ డేటాసెంటర్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు కోరారు. రైతుల సమ్మతి లేకుండా, కనీసం సమాచారం లేకుండా జీఓ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. తరతరాలుగా జీవనాధారమైన భూమిని ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నించడంపై నిలదీశారు. రిలయన్స్ డేటా సెంటర్ ఇచ్చిన జీఓను ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలన్నారు. అనంతరం భోగాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి శిబిరం వద్దకు బాధిత రైతులను కలవడానికి బయలుదేరిన ఆర్డీఓ అక్కడకు వెళ్లకుండానే భోగాపురంలో రీసర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ రైతులు ఎవరూ లేకపోవడంతో వెళ్లి పోయారు. ఆయన వెంట తహసీల్దార్ హరి, ఆర్ఎస్డీటీ రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, తదితరులు ఉన్నారు. డేటా సెంటర్కు ఇచ్చిన జీఓ రద్దుచేసిన తరువాతే సర్వే చేయాలి ఆర్డీఓను కలవాలని ప్రయత్నించిన బాధిత రైతులు నిరసన శిబిరం వద్దకు రాకుండానే వెళ్లిపోయిన ఆర్డీఓ -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
11 అర్జీల స్వీకరణ పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిమిత్ర హల్లో శుక్రవారం నిర్వహించిన గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 11 అర్జీలు అందినట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ ఎ.దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సంతకవిటి: మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ఆర్జీదారులు పోటెత్తారు. భూ సమస్యలపై 15, సంక్షేమ పథకాలు, తాగునీరు, కాలువలు, ఉపాధి, తదితర అంశాలపై 63 వినతులు వచ్చాయి. వాసుదేవపట్నం పంచాయతీ పోతుల జగ్గుపేట గ్రామ సమీపంలో కోళ్లఫారం ఏర్పాటు చేస్తున్నారని, వాటివల్ల రోగాలు సంభవించే అవకాశం ఉన్నందున ఫారాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తమ అధీనంలో ఉన్న భూమికి సంబంధించి వన్బీ మంజూరు కావడం లేదని తాలాడ గ్రామానికి చెందిన డోల అప్పలరాము, డోల లక్ష్మున్నాయుడు, డోల చిలకారావు, డోల కృష్ణ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పింఛన్ మంజూరు చేయండి.. గుళ్లసీతారాంపురం గ్రామానికి చెందిన ముగడ లక్ష్మి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వినతి ఇచ్చింది. ఏడాది కిందట తన భర్త మృతి చెందాడని, అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. దివ్యాంగుడి వద్దకు కలెక్టర్.. జావాం గ్రామానికి చెందిన బార్నాన సూర్యనారాయణ అనే దివ్యాంగుడు ట్రై సైకిల్ మంజూరు చేయాలని వినతి ఇచ్చేందుకు రాగా..కలెక్టర్ అతని వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తల్లికి వందనం అందడం లేదు.. తల్లికి వందనం పథకం తమకు అందడం లేదని ముకుందపురం గ్రామానికి చెందిన కోరాడ జ్యోతి, బొద్దూరు గ్రామానికి చెందిన వల్లూరు సంధ్య, వల్లూరు శ్రీనివాసరావు వినతిపత్రాలు అందజేశారు. డీఈఓతో మాటాడి సమస్య పరిష్కరిస్తానన కలెక్టర్ అర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోమన్, జేసీ సేథుమాధవన్, ఆర్డీఓ సుధారాణి, సంతకవిటి, రాజాం తహసీల్దార్లు బి.సుదర్శనరావు, రాజశేఖర్, ఎంపీడీఓ కె.సురేష్కుమార్, మండల ప్రత్యేకాధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 78 వినతులు స్వీకరించిన అధికారులు -
హ్యాండ్బాల్ టోర్నీ విజేత విజయనగరం
విజయనగరం: నగరంలోని రాజీవ్ మైదానం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. హోరాహోరీగా జరిగిన తుది పోరులో విజయనగరం జట్టు విజేతగా నిలిచి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. కృష్ణా, కడప జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ముగింపు కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరాజు, అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల శేఖర్, వి.మల్లేశ్వరరావు, శాయ్ అకాడమీ విశ్రాంత కోచ్ దేవేందర్, ఒలింపిక్ సంఘ నాయకుడు సీహెచ్.వేణుగోపాలరావు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కోరాడ గోపాలరావు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కమలనాభరావు, చింతాడ రవికుమార్, సీనియర్ అథ్లెట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్పులపై అవగాహన కల్పించండి విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘ఎస్ఈటీయూ’ ప్రీ–ెమెట్రిక్, పోస్ట్–మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికీ ఈ స్కాలర్షిప్ అందేలా విద్యాసంస్థలు, సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూఎంఏఎన్జీ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా వన్టైమ్ రిజిస్ట్రేషన్, ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్కాలర్షిప్ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమయ్యేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ప్రక్రియ కోసం బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలని సూచించారు. మక్కువ పరిసరాల్లో ఏనుగులు మక్కువ: మండలంలోని ఏనుగుల గుంపు ప్రవేశించిందని ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దబ్బగెడ్డ పంచాయతీ విజయరాంపురం పరిధిలో ఏనుగులు సంచరిస్తున్నాయని, దీంతో సమీప ప్రాంతాలైన కోన, గోపాలపురం, దబ్బగెడ్డ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు ఆరుబయట నిద్రించరాదని, అలాగే పశువులను ఒంటరిగా కట్టరాదని సూచించారు. భోగాపురంలో దొంగతనం పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఓ ఇంటిలో దొంగలు పడి నాలుగున్నర తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు 60 కిలోల ఇత్తడి సామాన్లు దోచుకుపోయారు. సీఐ దుర్గాప్రసాద్ తెలియజేసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన క్యాసినకుర్తి సత్యనారాయణ ఇంటిలో గురువారం రాత్రి దొంగలు పడి విలువైన సొత్తు పట్టుకుపోయారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన బమ్మిడి గురునాథ్ ఇత్తడి సామాన్లతో వెళ్లిపోతుండగా.. సత్యనారాయణ, తదితరులు శుక్రవారం ఉదయం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వి. పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొండను కట్టబెడితే ఊరుకోం
శృంగవరపుకోట: ఇప్పటికే అధికార బలంతో కొండ భూములు, ప్రభుత్వ బంజరు, ఢీ పట్టా భూములు, చెరువులు కబ్జాచేశారు.. జీవాల మేతకు ఆధారమైన 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండను ఇప్పుడు పర్యాటకాభివృద్ధి పేరుతో ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకు చూస్తున్నారు.. ఇదెక్కడి అన్యాయం... కొండజోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పారు. సర్వే నంబర్ 38లో 30ఎకరాల ప్రభుత్వ భూమిని కె.వి.ఎన్.గోవిందరావు అనే వ్యక్తికి ఎకో టూరిజం పేరుతో కట్టబెట్టే చర్యలు మానుకోవాలని, గ్రామసభను నిర్వహించి, గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కృష్ణాపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకాధికారి కె.రవీంధ్ర అధ్యక్షతన తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడే క్రమంలో వేలుచూపి మాట్లాడడంతో గ్రామపెద్దలు ‘బెదిరింపులకు దిగటం సరికాదు. బెదిరించి భూములు లాక్కుని, ఎవరికో వత్తాసు పలకటానికి గ్రామసభ పెట్టారా’ అంటూ ధ్వజమెత్తారు. గ్రామానికి చెందిన న్యాయవాది వారాది ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎం.యామినీదేవి, వేండ్రపు శ్రీనివాసరావు, కర్రి తాతారావు, సింగంపల్లి శ్రీను, కె.ఎరుకునాయుడు తదితరులు మాట్లాడుతూ ‘గతంలో గ్రామంలో భూములు కొనుగోలుచేసిన గోవిందరావు బంజరు భూములు, చెరువులు, డీ పట్టా భూములను కబ్జాచేశారు. కొండగెడ్డ నుంచి వర్షపునీరు చెరువులో చేరకుండా చేపల చెరువులు తవ్వారు. అతని భూములను ఆనుకుని ఉన్న మా భూముల్లోకి వెళ్లనీయకుండా గేటువేసి, కంచె వేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండ ఉందంటూ రైతుల నుంచి బెదిరించి భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడి జీవాల పెంపకం దారులకు కొండే ఆధారం. అదికూడా లాక్కుంటే ఊరుకునేది లేదు. తరాలుగా ఇక్కడే పుట్టాం, పెరిగాం, చస్తాం.. కాదని కొండ జోలికొస్తే ఉద్యమిస్తాం అంటూ గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామస్తుల ఆందోళనతో ఎకో టూరిజం కోసం దరఖాస్తు చేసిన గోవిందరావు సభ నుంచి జారుకున్నారు. ప్రత్యేకాధికారి కె.రవీంద్ర గ్రామస్తుల నిర్ణయాన్ని తీర్మానంగా రాయించి గ్రామస్తుల సంతకాలు తీసుకున్నారు. దీనిని కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. రెవెన్యూ అధికారులకు తేల్చిచెప్పిన కృష్ణాపురం గ్రామస్తులు పర్యాటకం ముసుగులో కొండను కాజేయొద్దు జీవాల మేతకు కొండే ఆధారం -
రోడ్డు ప్రమాదంలో ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్/పాలకొండ: మండలంలోని వెలగవాడ సమీపంలో తోటపల్లి సాగునీటి కాలువలో ఉపాధి పనులు చేసుకుని ఇంటికి వస్తున్న వేతనదారు మేదరమెట్ల సావిత్రి (62) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం పనులు చేసుకుని ఇంటకి వస్తున్న క్రమంలో హెరిటేజ్ పాల లారీ సావిత్రిని ఢీ కొనడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న సీఐ ఆమిటి ప్రసాద్, ఎస్సై డోల వెంకన్న, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరి ఆశాజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు తమతో పనులు చేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సహచర వేతనదారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు ఢీకొని వ్యక్తి..రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వేగావతి నది బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన తెర్లి సింహాచలం (71) రామభద్రపురంలోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి గురువారం (ఈ నెల 28న) ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే ఎంతకీ బంధువుల ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకసాగారు. ఇంతలో కొట్టక్కి వేగావతి నది వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు గాయపడ్డారన్న విషయం తెలియడంతో అక్కడకు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో ఉన్న సింహాచలం కనిపించాడు. వెంటనే అతడ్ని సాలూరు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లోకేశ్ రాజీనామా చేయాలి
ఎన్నో అక్రమాలు, అవకతవకలతో నిర్వహించిన మెగా డీఎస్సీతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలి. తన పదవికి రాజీనామా చేయాలి. అనర్హులు మెరిట్ జాబితాలో ముందుండం శోచనీయం. మెగా డీఎస్సీ అని ఉద్యోగాలు అమ్మేసుకుంటారా? ఇదేనా మీ ప్రభుత్వం తీరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. – బమ్మిడి కార్తీక్, చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యా విభాగం అధ్యక్షుడు -
పారా అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారుల సత్తా..
విజయనగరం: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ –2026 పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు సత్తా చాటినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ ఎంపికల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన కిల్లక లలిత (టి–11) 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్స్.. కరణం గౌతమ్ (టి–12) లాంగ్జంప్లో సిల్వర్, 100 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించగా.. కొత్తింటి పైడిరాము (ఎఫ్–51) డిస్క్త్రోలో బ్రాంజ్ మెడల్ సాధించారని చెప్పారు. అంతర్జాతీయ ర్యాంక్ల ప్రకారం ఏషియన్ గేమ్స్కు ఎంపికై న వారి వివరాలు త్వరలో తెలుస్తాయని తెలిపారు. జిల్లా కీర్తి ఇనుమడింపజేసిన ముగ్గురు క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. -
అల్లాడిపోతున్న మూగజీవాలు
● ఎండ వేడిమికి తగ్గిన పాల దిగుబడి ● పశువులను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న పాడి రైతులువిజయనగరం ఫోర్ట్: భానుడి ప్రతాపానికి మానవులతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలను ఎన్నడూ దాటలేదు. అలాంటిది ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైబడే నమోదవుతోంది. దీనికి తోడు వడగాల్పులు తోడవ్వడంతో జనంతో పాటు మూగజీవాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇళ్లలో సైతం ఉండలేని పరిస్థితి. ఎండవేడిమికి గుంతలు, చెరువులు సైతం ఎండిపోతున్నాయి. చాలా తక్కువ చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి నీరు ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. చెరువుల్లో నీరు లేక పోవడం వల్ల మూగజీవాలకు అవసరమైన తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. అనారోగ్యం బారిన పశువులు ఎండ తీవ్రత చాలా ఎక్కువుగా ఉండడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఆవులు కంటే గేదెలు ఎక్కువుగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గేదెలు నల్లగా ఉండడం వల్ల వాటిపై ఎండ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. పాడి పశువులకు వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు 27 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉంటే నోట్లో లాలాజలం తగ్గిపోతుంది. దీంతో నెమరవేసుకోవడానికి పశువులు ఇబ్బంది పడతాయి. దాహం ఎక్కువుగా ఉండడం వల్ల నీరు తాగి మేత సరిగ్గా తినవు. దీంతో శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గిపోయి పశువులు నీరసించిపోతాయి. పాల్ప ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతాయి. రక్షణ ఇలా.. వడదెబ్బకు గురైన పశువులు తూలుతూ నడుస్తాయి. ఇటువంటి వాటిని గుర్తించి చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. ఐస్ ముక్కలను తలపై ఉంచాలి. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే సోడియం సాలిసిలైట్, పారాసిట్మాల్ ఇంజిక్షన్లు చేయాలి. ఎండ తీవ్రతను తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. షెడ్ల చుట్టూ అవిసె, సుబాబుల్ చెట్లను వేయడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. పశుగ్రాసం కూడా లభిస్తుంది. పాకల పైకప్పులను తాటాకులతో గాని గడ్డితో గాని కప్పాలి. పశువులను రోజుకు రెండు, మూడు సార్లు కడగాలి. సులువుగా అరిగించుకునే జావ, గంజి వంటివి తాగించాలి. పచ్చిగడ్డి ఎక్కువుగా ఇవ్వాలి.ముందుకురాని రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు కూటమి సర్కారు చెబుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన వారికే వీటిని కేటాయించడం, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం కారణంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడి పశువుల వివరాలు.. జిల్లాలో 4,75,725 పాడి పశువులు ఉన్నాయి. ఇందులో ఆవులు 3,77,880 కాగా గేదెలు 97, 845 ఉన్నాయి. ఈ పశువుల ద్వారా ఏడాదికి 7.68 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండడం, పచ్చిమేత దొరకకపోవడం, తాగునీరు సరిపడా అందివ్వలేకపోవడంతో పాల దిగుబడి తగ్గిపోతోంది. ఒక్కో పాడి పశువు దగ్గర లీటరు నుంచి లీటరున్నర వరకు పాల తగ్గిపోతున్నాయి. పాల ఉత్పత్తి తగ్గింది.. నాకు రెండు గేదెలున్నాయి. రోజుకి 12 లీటర్ల పాలు కేంద్రానికి వేసేవాడిని. ఎండ వల్ల పాలు తగ్గిపోయాయి. రోజుకి 9 లీటర్ల పాలు మాత్రమే ప్రస్తుతం వస్తున్నాయి. ఎండకు ఉండలేక గేదెలు ఇబ్బంది పడుతున్నాయి. పి.రమణ, రైతు, పెదవేమలి, గంట్యాడ మండలం గడ్డి విత్తనాలు సిద్ధం.. పశుగ్రాసం కొరతను తీర్చేందుకు రైతుసేవా కేంద్రాలు, పశు వైద్యశాలల వద్ద 22 టన్నుల గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా 534 టన్నుల పశువుల దాణాను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్. దామోదరరావు, పశుసంవర్థకశాఖ జె.డి పచ్చిమేత కొరతే కారణం.. వర్షాకాలం, శీతాకాలాల్లో పచ్చిమేత, నీరు సమృద్ధిగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వేసవికాలంలో నీరు, పచ్చిమేత కొరత ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది. పచ్చిమేత సాగు చేయడానికి కూడా సరిపడా నీటి సౌకర్యం లేదు. -
అంధకారంలో విజయనగరం
విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఎలుగుబంటి వారి వీధి డీసీసీబీ బ్యాంక్ వద్ద రాత్రి సమయంలో ఇలా.. విజయనగరంలో రెండు రోజులుగా అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా లేక పలు వీధులు, కాలనీల ప్రజలు ఉదయం భగ్గుమంటున్న ఎండలు, వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రివేళ చీకటిలో మగ్గుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసి రెండు రోజులవుతున్నా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలనా యంత్రాంగం నిద్ర మేల్కొని, పలు ప్రాంతాల్లో విరిగిపడిన విద్యుత్ స్తంభాలను సరిచేసి, తక్షణమే అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
రెండేళ్లలో 22 మందికి కఠిన శిక్షలు
● ‘ఆపరేషన్ దండాయన’తో వేగవంతమైన దర్యాప్తు ● మన్యం జిల్లాలో 39 మందిపై హిస్టరీ షీట్లు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవ్రెడ్డి పార్వతీపురం రూరల్: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 22 మంది ముద్దాయిలకు రెండేళ్లలో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ దండాయన’లో భాగంగా సకాలంలో దర్యాప్తు చేపట్టి, కోర్టు ట్రయల్ మానటరింగ్ ద్వారా ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, సాక్షులకు ధైర్యం కల్పించడం వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయన్నారు. గడచిన రెండు సంవత్సరాల్లో మొత్తం 19 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. మహిళల హత్యకు సంబంధించిన మూడు కేసుల్లో ముగ్గురికి జీవిత ఖైదు పడిందన్నారు. అలాగే అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన ఐదు కేసుల్లో ఏడుగురికి శిక్షలు పడగా.. వారిలో నలుగురికి 20 ఏళ్లు, ఒకరికి పదేళ్లు, మరొకరికి మూడేళ్లు, ఇంకొకరికి రెండేళ్ల జైలు శిక్ష పడిందని తెలిపారు. పోక్సో చట్టం కింద నమోదైన నాలుగు కేసుల్లో ఇద్దరికి ఏడేళ్లు, ఇద్దరికి మూడేళ్లు.. అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసుల్లో నలుగురికి పదేళ్లు, ఒకరికి ఏడాది జైలు శిక్ష పడిందని చెప్పారు. వరకట్న వేధింపుల కేసుల్లో ఇద్దరికి రెండేళ్లు, మహిళల వేధింపుల కేసులో ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షను న్యాయస్థానాలు విధించాయన్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 39 మందిపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే నేరాలు పునరావృతం కావని, అఘాయిత్యాలకు పాల్పడే వారు కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. -
సీబీఐ విచారణ జరపాలి
ఎన్నో అక్రమాలు జరిగిన డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరపాలి. చంద్రబాబు సర్కారు రెండేళ్లలోనే నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టి దగా చేసింది. ఏడాదికో జాబ్ క్యాలెండర్ అటకెక్కించేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉన్న వలంటీర్ వ్యవ స్థను రద్దు చేసి వారిని మోసం చేసింది. నిరుద్యోగ భృతి ఊసేలేదు. సూపర్ సిక్స్ పథకాలంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు సర్కారుకు 2029 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. – జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా యువజన నాయకులు -
మెగా కాదు... దగా డీఎస్సీ
విజయనగరం రూరల్: చంద్రబాబు సర్కారు 2025లో నిర్వహించినది మెగా కాదు.. దగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ జిల్లా విద్యా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కూడలి వరకు ర్యాలీగా వచ్చిన విద్యా, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. డీఎస్సీ–2025 అక్రమాలపై అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యా, యువజన విభాగం నాయకులు కరుమజ్జి సాయికుమార్, అల్లు అవినాష్, ఈశ్వర్ కౌశిక్లు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరు చెప్పి డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు సర్కారు మెగా దగా చేసిందని మండిపడ్డారు. మెరిట్ ముందున్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి రెండు రోజుల్లోనే జాబితాలు మార్చివేశారని దుయ్యబట్టారు. మెరిట్ జాబితా బయటపెట్టకపోవడంలో ఆంతర్యమేంటని వారు నిలదీశారు. మెరిట్ జాబితా రద్దు చేయడంతో మెరిట్ సాదించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణ సక్రమంగా చేపట్టడంలో విఫలమైన విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని స్పష్టంచేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను వంచించారని, ఎన్నో సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వలంటీర్లకు పదివేల జీతమని చెప్పి, ఆ వ్యవస్థనే రద్దు చేసి వలంటీర్ల నెత్తిన శఠగోపం పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదేనని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసేలేదని, 2029 ఎన్నికల్లో చంద్రబాబు సర్కారుకు తగిన గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ విద్యా విభాగం అధ్యక్షులు బమ్మిడి కార్తీక్, వైఎస్సార్ సీపీ యువజన, విద్యా విభాగం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి వైఎస్సార్సీపీ విద్య, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన -
రైల్వేకు ఆదాయం పులుపు..!
విజయనగరం టౌన్: రైల్వేశాఖకు ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే మామిడి పండ్ల ఎగుమతులు మూడేళ్లుగా కానరావడం లేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైల్వే ఆదాయానికి గండి పడుతోందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. మ్యాంగో అసోసియేషన్లతో తూతూ మంత్రంగా చర్చలు నిర్వహించడం, వ్యాపారస్తులకు అనుకూలంగా సమాధానం లేకపోవడంతో వారంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంటను ఎగుమతి చేస్తున్నారు. గతంలో కిసాన్రైళ్లను ఏర్పాటుచేసి ఎగుమతులకు రాయితీలు ఇవ్వడంతో రైతులకు ప్రయోజనకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైల్వేకు ఆదాయం తగ్గింది. ఎగుమతులు ఇలా.. ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలో విజయనగరం జిల్లా కేంద్రంగా మామిడి పంటను ఢిల్లీకి ఏటా ఎగుమతి చేస్తారు. కోవిడ్ తర్వాత 2022లో కేవలం 7 రైళ్లలో 2016 టన్నులకే పరిమితమై రూ. 88,30,340 ఆదాయం చేకూరింది. అయితే, 2023లో మామిడి దిగుబడులు బాగుండడం, రైతులు, మ్యాంగో అసోసియేషన్లు ముందుకు రావడంతో రైల్వేశాఖకు ఆదాయం గణనీయంగా పెరిగింది. సుమారు 25 రైళ్లలో సుమారు 8,234 టన్నుల మామిడి ఎగుమతులు చేశారు. రైల్వేశాఖకు అప్పట్లో సుమారు రూ.3,70,50,370ల ఆదాయం సమకూరింది. కోవిడ్లోనూ ఎనలేని సేవలు కోవిడ్–19 సమయంలోనూ ఈస్ట్కోస్ట్ రైల్వే కిసాన్ రైళ్లు లేకపోవడంతో సంబంధిత మ్యాంగో అసోసియేషన్లు మామిడి ఎగుమతులకు ముందుకు రావడం లేదు. రాయితీతో కూడిన ఎగుమతులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారితో సంప్రదింపు లు చేసినా ఫలితం లేకుండా పోయింది. విజ యనగరం జిల్లాలో ఉన్న రెండు అసోసియే షన్లతో చర్చించాం. వారు చెప్పిన డిమాండ్లను ఉన్నతాధికారులకు నివేదించాం. – బి.వి.సత్యనారాయణ, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, విజయనగరం తమ విలువైన సేవలను అందిస్తూ రైతుల మన్ననలు అందుకుంది. విజయనగరం పరిధిలో కోవిడ్ స్పెషల్స్లో 2020 మార్చి నెల నుంచి ఆగస్టు చివరి వరకూ 4,330 టన్నుల మామిడి ఉత్పత్పులను 20 కోవిడ్ స్పెషల్ రైళ్లలో ఎగుమతి చేసింది. వీటి ఎగుమతుల వల్ల రైల్వేకు 1,88,10,343ల ఆదాయం వచ్చింది. పార్సిల్స్ ద్వారా 5,615 క్వింటాళ్లను రవాణాచేసి రూ. 7,27,816లు, 139 క్వింటాళ్ల లగేజీ ద్వారా రూ.54,648 ఆదాయం సమకూరింది. 2021లో 30 రైళ్లతో 10,379 టన్నుల మామిడి ఎగుమతుల వల్ల రూ.4 కోట్లకి పైగా ఆదాయం వచ్చింది. 2022లో కేవలం 7 రైళ్లతో 2016 టన్నుల ఎగుమతులు చేసి రూ.88 లక్షల ఆదాయమే సమకూరింది. 2023లో సుమారు 25 రైళ్లలో సుమారు 8,234 టన్నుల మామిడి ఎగుమతులు చేసి రూ.3 కోట్లకి పైగా ఆదాయం రైల్వేశాఖ ఆర్జించింది. అంతే నాటి నుంచి నేటివరకూ ఎగుమతులు లేకపోవడం బాధాకరం. -
● పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి ● యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5 వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి ● జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు డిమాండ్
సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగునీటి మళ్లింపునకు వీలుగా షట్టర్లు ఏర్పాటుచేస్తున్న ట్టు డీఈ వై.రవీంద్రనాయుడు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలు గా 118 షట్టర్లలో పూర్తిగా పాడైన 33 షట్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటుచేస్తున్నామన్నారు. విజయనగరం అర్బన్: ప్రాంతీయ సమతుల్యతతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, తక్షణమే ఉత్తరాంధ్ర, రాయలసీ మ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేవీవీ దేవ్యాప్తంగా చేపట్టిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాయకత్వ శిక్షణా శిబిరాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న ‘వికసిత భారత్, స్వర్ణాంధ్ర’ నినాదాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. దేశం, రాష్ట్రం నిజమైన ప్రగతి సాధించాలంటే నీటి పారుదల రంగంపై ప్రత్యే క దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలి గొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభత్వం కనీస ని ధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ●పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలో ఏర్పాటు చేసిన పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభు త్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని, వీటికి రూ.6 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు. ●రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని 24 యూనివర్సిటీల్లో దాదాపు 5 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, జిల్లా అధ్య క్షుడు ఎంవీఎన్ వెంకటరావు, కార్యదర్శి ప్రభాత పట్నాయక్, సమత కన్వీనర్ జి.నిర్మల పాల్గొన్నారు. -
జె.కొత్తవలసలో ఇంటింటి ఫీవర్ సర్వే
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధి జె.కొత్తవలస గ్రామంలో ప్రబలిన జ్వరాలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలను పంచాయతీ, వైద్యశాఖల అధికారులు చేపట్టారు. ‘జె.కొత్తవలసలో జ్వరాల వణుకు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు జిల్లా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వైద్యసేవలు అందించాలని పంచాయతీ, వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు పంచాయతీ ప్రత్యేకాధికారి డాక్టర్ జె.నరేంద్రకుమార్, పంచాయతీ కార్యదర్శి కర్రి ప్రసాద్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పెరుమాళి పీహెచ్సీ వైద్యుడు వెంకటేశ్, ఆయుర్వేద వైద్యుడు ఎస్.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరపీడితుల రక్త నమూనాలను సేకరించారు. జ్వరపీడితులకు అవసరమైన మందులు అందజేశారు. ప్రస్తుతం జ్వరాలు అదుపులో ఉన్నట్టు డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. -
విత్తనాలు
వచ్చేదిఇచ్చేదివిజయనగరం ఫోర్ట్: ఖరీఫ్–2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల సాగుకు రైతులు భూమిని దుక్కిచేసి సిద్ధం చేస్తున్నారు. వరి వెదలు, నారుపోతలకు వీలుగా భూమిని మలుస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ.. విత్తన సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను కలవరపెడుతోంది. జూన్ నెల వస్తున్నా జిల్లాకు కేటాయించిన వాటిలో సగం విత్తనాలు కూడా చేరలేదు. గతేడాది వలే ఈ ఏడాది కూడా విత్తనాలకు పాట్లు పడాల్సిందేనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా విత్తనాలు, ఎరువుల కొరత, కొనుగోలు కేంద్రాలు లేక పంట విక్రయాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూడా విత్తన కష్టాలు వీడేలా లేవన్న బెంగ రైతులను వెంటాడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు జిల్లాకు చేరేవి. రైతులకు ఎరువులు, పెట్టుబడి సాయం ఠంచన్గా అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, చంద్రబాబు సర్కారు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ పరిస్థితి... ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వ పరంగా జిల్లాకు 41,810 వరి విత్తనాలను కేటాయించింది. వీటిలో ఇప్పటి వరకు 6,174 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరాయి. 35,636 క్వింటాళ్ల విత్తనాలు ఇంకా జిల్లాకు చేరాల్సి ఉంది. ఖరీఫ్సీజన్లో రైతులకు రాయితీపై విత్తనాలు అందిస్తారు. ప్రైవేటు డీలర్ వద్ద కంటే కొంత అయినా ధర తగ్గుతుందనే భావనతో రాయితీపై అందించే విత్తనాలు ఆర్ఎస్కెల వద్ద కొనుగోలు చేస్తారు. అయితే జూన్ నెల వస్తున్నప్పటకీ ఇప్పటికీ ఆర్ఎస్కేలకు పూర్తి స్థాయిలో విత్తనాలు చేరకపోవడం, మరోవైపు ప్రైవేటు దుకాణాల వద్ద విత్తన నిల్వలు ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అరకొర విత్తనాలు సరఫరా చేసి రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రభు త్వం పూనుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరి సాగు ఇలా.. విజయనగరం జిల్లాలో ఖరీఫ్లో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లు. ఈ మొత్తం విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరంగా జిల్లాకు కేటాయించింది 41,810 క్వింటాళ్లే. మిగిలిన 38,190 క్వింటాళ్లు విత్తనాలు రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పరంగా కేటాయించిన విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తారో తెలియని పరిస్థితి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు 41,810 క్వింటాళ్లు కేటాయించగా ఇంతవరకు 6,174 క్వింటాళ్లు విత్తనాలు జిల్లాకు వచ్చాయి.మిగిలి న విత్తనాలు కూడా త్వరలోనే సరఫరా అవుతాయి. – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఎనర్జీ అసిస్టెంటుకు విద్యుత్ షాక్
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామంలో విద్యుత్శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ ఎనర్జీ అసిస్టెంటుకు విద్యుత్ షాక్ తగిలింది. గ్రామంలో 11కేవీ విద్యుత్ లైన్ను తాకి ఉన్న కర్రను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకుండా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎనర్జీ అసిస్టెంటు పనులు చేపట్టాడు.. కర్రకు నీటి తడి ఉండడంతో విద్యుత్ వైర్లుకు తగిలిన వెంటనే కరెంటు ప్రవహించి ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో మందిరవలస సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంటుగా పని చేస్తున్న మెరకముడిదాం మండలంలోని గాతాడ గ్రామానికి చెందిన జి.రాము తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఎడమ చేయి మోచేతి భాగం కాలిపోగా ఎడమ కాలుకు గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం రిఫర్ చేశారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని షిఫ్ట్ ఆపరేటర్కు సమాచారం అందించానని, తరువాతనే ఎనర్జీ అసిస్టెంటుతో పనులు చేయించానని, విద్యుత్ సరఫరాను ఆఫ్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని లైన్మన్ శంకరరావు చెబుతున్నాడు. ఏది ఏమైనా విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా పనులు చేపట్టడం, ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంలో విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. -
ప్రశాంతంగా బక్రీద్
● ఊపిరి పీల్చుకున్న నగరం విజయనగరం క్రైమ్ : బక్రీద్ ను పండగను ముస్లింలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వన్ టౌన్ స్టేషన్ పరిధి కంటోన్మెంట్ గంజిపేట రెల్లి వీధి రోడ్ లో ఉన్న మసీద్ లో ముస్లింలు కుటుంబ సమేతంగా ఉదయం 6.15గంటలకే నమాజ్లు పూర్తి చేసుకున్నారు. పండగ సందర్భంగా ఎలాంటి అలర్లు, ఘర్షణలు జరగకుండా వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కేచౌదరి, ఎస్సైలు లక్ష్మీ ప్రసన్నకుమార్, సురేంద్ర నాయుడు, రవి, కమల్భార్గవ్లు అన్ని మసీదులు, దర్గాల మద్ద బందోబస్తు నిర్వహించారు. ముందస్తుగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో బక్రీద్ ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నారని వన్ టౌన్ సీఐ ఆర్వీ.కే.చౌదరి అన్నారు.ఒక రోజు ముందే ఎస్పీ అన్ని మసీద్ లున్న ప్రాంతాలను పరిశీలించి గట్టి బందోబస్తు సూచనలు ఇచ్చిన కారణంతో బక్రీద్ ప్రశాంత వారణంలో జరిగిందన్నారు.ముస్లింలు పోలీస్శాఖ కు సహకరించారని సీఐ చౌదరి తెలిపారు. -
పనసతో కులాసా!
● మార్కెట్లో భలే గిరాకీ ● భారీగా క్రయవిక్రయాలు ● పండులో పోషకాలు బోలెడు సీతంపేట: ఈ సీజన్లో నోరూరించే, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పండ్లు మార్కెట్లోకి వస్తాయి. వాటిలో పనస ఒకటి ఆరోగ్యకరమని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. సువాసనలు వెదజల్లడమే కాకుండా రుచిలో ఆమృతాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒడిశాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు సీతంపేట ఏజెన్సీకి వచ్చి విస్తృతంగా పనసను కొనుగోలు చేస్తారు. వారపు సంతలకు వచ్చి గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.100 వరకు రకాన్ని బట్టి గిరిజనులు విక్రయాలు జరుపుతారు. మైదాన ప్రాంతాల్లో రూ.200లు పైబడే విక్రయాలు జరుపుతారు. నవంబర్, డిసెంబర్లో పనసకాయల రూపంలో ఎక్కువగా లభిస్తాయి. వాటిని వివిధ హోటల్స్, శుభకార్యాలలో బిర్యానీ కోసం వినియోగించే వారు. నోరూరించే రుచికరమైన పనస తోనలు కాండం నుంచి నేరుగా.. పనస మొక్క కాండం నుంచి నేరుగా కాయ కాస్తుంది. చెట్టు మొదలు నుంచి చివరి వరకు ఎక్కడి నుంచైనా కాయలు కాయడం ఈ ఫలం ప్రత్యేకం. ఏప్రిల్ నుంచి జూలై వరకు పనస చెట్లకు బరువైన కాయలు వేలాడుతూ కనిపిస్తాయి. ఒక్కో చెట్టుకు 100 నుంచి 150 కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయ పది నుంచి 20 కిలోల బరువుంటుంది. ఈ కాయ ఎంత బరువున్నా ఆందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడతాయి. కొండపోడులో ఎక్కువగా చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే పెరటి తోటల్లో కూడా వాటిని వేస్తారు.పనసలో రకాలు.. బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గూలాబీ పనస, కజ్జా పనస, బురద పనస ఆనే రకాలు ఉన్నాయి. ఇక్కడ ఖర్జూర, బురద పనసలు లభిస్తాయి. పనస తొనలనే కాదు..పిక్కలను కాల్చుకుని కూరగా వండుకుని తింటుంటారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా వండే పనస తొన పలుచగా ఉన్నా రుచి ఆమోఘం. పనసపట్టు కూర అందరూ ఇష్టంగా తింటారు. పనస కాయ ముక్కలతో బిర్యానీ చేస్తే మటన్ ధమ్ను మరిపిస్తుందని కొంతమంది వంట నిపుణులు తెలియజేస్తున్నారు. పనసలో పోషకాలు.. పనసకాయలో ఉండే పోషకాలు చాలా విలువైనవి, సీజన్లో దొరికే పండ్లను కచ్చితంగా తినాలని వైద్యులు పేర్కొంటున్నారు. మాంసకృత్తులు 1.2 శాతం, చక్కెర 13.8 శాతం, కొవ్వులు 0.1శాతం, కెరోటిన్ 175 మైక్రోగ్రాములు, రియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి ఏడు మిల్లీ గ్రాములు, పీచు పదార్థాలు 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.5 మిల్లీ గ్రాములు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎంతో మేలు..పనస పండు శరీర పుష్టిని కలిగించి రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడుకు, నరాలకు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. బాగా ముగ్గిన పండు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. మూత్రాన్ని బాగా జారీ చేసి వాతాన్ని, పైత్యాన్ని నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పనస తొనలను నూనె, తేనెలలో ముంచి తింటే జీర్ణం సులభంగా ఆవుతుందని పెద్దల నానుడి. -
జూనియర్ హ్యాండ్బాల్ పోటీలకు ఘనంగా శ్రీకారం
విజయనగరం గంటస్తంభం: రాజీవ్ క్రీడా మైదానం వేదికగా నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రస్థాయి జూనియర్ పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఫ్లడ్లైట్ల వెలుగులో ఈ పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి విశాఖపట్నం సీసీఎస్ క్రైమ్ బ్రాంచ్ సీఐ కోరాడ రామారావు, సీఐ సోమశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించారు. జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు బత్తుల శేఖర్, వి.మల్లేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కోరాడ గోపాలరావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వరరావు, హ్యాండ్బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రాజు, అండర్–19 మాజీ ప్రధాన కార్యదర్శి బొమ్మన రామారావు, ఖోఖో సంఘం నాయకులు కమలనాభరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాయ్ అకాడమీ రిటైర్డ్ కోచ్ దేవేంద్ర, జిల్లా హ్యాండ్బాల్ కార్యదర్శి వి.మల్లేశ్వరరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. -
పనిచేయకుండానే హాజరు
గంట్యాడ: ఆ గ్రామంలో అమలువుతోంది ప్రభుత్వ అధికారిక పథకం కాదు..క్షేత్రస్థాయి సిబ్బంది సృష్టించిన సొంత పథకం. అదే..మస్తరు వేయించుకో..ఇంటికి వెళ్లిపో.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి హామీ(వీబీజీరాంజీ) పథకం కింద కూలీలకు వంద రోజులకు పైగా పని దినాలు కల్పిస్తూ ఉదయాన్నే పని వేళలు కూడా నిర్ణయించారు. కానీ, గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామంలో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది. నిబంధనలు కాగితాలకే పరిమితమవగా..క్షేత్రస్థాయిలో అక్రమాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. కోనరాముడు చెరువులో కొండంత అవినీతి కొండతామరాపల్లి గ్రామంలోని కోనరాముడు చెరువులో ఉపాధి పనులు జరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 312 మంది కూలీలు చెరువు వద్దకు వచ్చారు. అయితే, వారు వచ్చింది పని చేయడానికి కాదు..కేవలం మస్తర్లు వేయించుకోడానికే. ఉదయాన్నే వచ్చి హాజరు పట్టికలో సంతకాలు లేదా వేలిముద్రలు వేసేసి..ఎవరి ఇంటికి వారు దర్జాగా వెళ్లిపోయారు. రోజంతా చెరువు వద్ద తట్టా బుట్టా పట్టిన నాథుడే లేడు. పని చేయకుండానే వందలాది మందికి ప్రభుత్వ సొమ్ము చేతులు మారుతుండడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. విశ్రాంతి సమయం మాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధి కూలీల పని వేళలు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఉంటాయి. ఇందులో ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు గంటపాటు భోజన విరామ సమయం ఉంటుంది. కూలీలు పని ప్రదేశంలోనే ఉంటూ, భోజనం చేసి, కాసేపు అలసట తీర్చుకోడానికి ఈ సమయాన్ని కేటాయించారు. కానీ ఈ గ్రామంలో అసలు పనే జరగకపోవడంతో..ఈ విశ్రాంతి సమయాల నిబంధనలన్నీ అసహాస్యం పాలవుతున్నాయి. మేట్ల కనుసన్నల్లోనే భాగోతంఉపాధి పనులను పర్యవేక్షించడానికి, కూలీల నుంచి పని చేయించడానికి మేట్లు అని పిలిచే సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేట్లు తమ పరిధిలోని జట్టు సభ్యులను సక్రమంగా పని స్థలానికి తీసుకెళ్లి, పని చేయించి హాజరు నమోదు చేయాలి. కానీ కొండతామరాపల్లిలో కొందరు మేట్లు తమ బాధ్యతలను గాలికొదిలేశారు. కూలీలతో పని చేయించాల్సింది పోయి..కేవలం హాజరు తీసుకోవడానికే వారు పరిమితమయ్యామనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. మేట్ల సహకారంతోనే ఈ అక్రమ దందా సాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వం..కానరాని స్పందనప్రజాధనం ఇలా యథేచ్ఛగా దుర్వినియోగం అవుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఉపాధి అవినీతి భాగోతంపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు సాక్షి రిపోర్టర్ గంట్యాడ మండల ఏపీవోను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కొండతామరాపల్లిలో జరుగుతున్న ఉపాధి అక్రమాలపై విచారణ జరపాలని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొండతామరపల్లిలో యథేచ్ఛగా ఉపాధి అక్రమాలు ఒక్కరోజే 312 మంది ఆబ్సెంట్..కానీ రికార్డుల్లో ప్రెజెంట్ ప్రభుత్వ ధనం దుర్వినియోగంపై స్థానికుల ఆగ్రహం ఫోన్ ఎత్తని ఏపీఓ..స్పందించని అధికారులు -
ఓటర్ల జాబితా సవరణ కిట్ల పరిశీలన
విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) అందజేసే ప్రత్యేక కిట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తన చాంబర్లో పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటినీ సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వే సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా అధికారులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. బ్యాగులో గొడుగు, వాటర్ బాటిల్ ఎండలు, వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించే బీఎల్ఓల సౌకర్యార్థం ఈ కిట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక ఆకర్షణీయమైన బ్యాగులో అవసరమైన స్టేసనరీ సామగ్రితోపాటు ఒక గొడుగు, వాటర్ బాటిల్ను కూడా ఉంచి అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 మంది బీఎల్ఓలకు ఈ కిట్లను శుక్రవారం నుంచి పంపిణీ చేయాలని డీర్ఓకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే స్టేషనరీతో పాటు గొడుగు, వాటర్ బాటిల్స్ పంపిణీ జిల్లాలోని 1,847 మంది బీఎల్ఓలకు నేటి నుంచి కిట్ల అందజేత -
వ్యవసాయ భూములకు అడ్డుగా గేటు
విజయనగరం రూరల్: మండలంలోని కోరుకొండ గ్రామానికి చెందిన కొంతమంది రైతుల వ్యవసాయ పొలాలకు, పశువుల కళ్లాలకు వెళ్లేదారికి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అడ్డుగా గేటు ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ గ్రామానికి చెందిన సిరిపురపు సత్తిబాబు స్థలం వెనుక గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు, పశువుల కళ్లాలు ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఇదే దారిని రైతులు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. చట్ట ప్రకారం రైతులు తమ పంట పొలాలకు వినియోగించే దారిని అడ్డుకోవడానికి వీలులేదు. అయినా సదరు రైతు ఏకపక్షంగా అనధికారికంగా కోళ్లఫారం ఏర్పాటు చేసుకుని రైతులు వినియోగించే రోడ్డుకు అడ్డంగా దారికి గేటు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామానికి చెందిన రైతులు గతేడాది డిసెంబర్లో గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు రైతు అధికార పార్టీ నేతలను కలిసి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులు, గ్రామ పెద్దలపైనే కేసులు నమోదు చేయించారు. దీంతో రైతులందరూ కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేయగా గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించా రు. అయినా స్థానిక అధికారులు అధికార పార్టీ షాడో నేత ఒత్తిడికి భయపడి చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా కోళ్లఫారం షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా, రైతులు తమ పొలాలకు వెళ్లే దారిని తమ సొంత స్థలమని అడ్డుకోవడం శోచనీయమని, కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని దారి ఇప్పించాలని కోరుకొండ గ్రామ రైతులు కోరుతున్నారు. కళ్లాలకు, పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు అనుమతుల్లేని కోళ్లఫారానికి గేటు ఏర్పాటు చేసిన రైతు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న కోరుకొండ గ్రామ రైతులు -
పేద పూజారి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
అలజంగి(విజయనగరం జిల్లా): కూటమి ప్రభుత్వ పెద్దల ఆగడాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. పేదల ఇళ్లనే టార్గెట్గా చెలరేగిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు,. అటు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. 72 మంది పేదల ఇళ్లను కూల్చివేశారంటూ ఒకవైపు రచ్చ నడుస్తుండగానే విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన కూడా ఇదే ఫాలోవుతున్నట్లు ఉన్నారు. విజయనగరం జిల్లా అలజంగిలో తాజాగా ఓ పేద పూజారి కుటుంబంపై బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే బేబి నాయన. ఆ పేద పూజారిని ఇళ్లు కూల్చివేస్తామంటూ అధికారుల చేత ఆదేశాలు పంపంచారు. 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఆ పూజారి.. విద్యుత్ బిల్లులు, పంచాయతీ రశీదులు చూపించినా అధికారులు కనికరించడం లేదు. పైగా ఎమ్మెల్యే బేబీ నాయన కాళ్ల మీద పడితే వదిలేస్తామంటున్నారు అధికారులు.‘మా ఇళ్లే అడ్చొచ్చాయా..? మమ్మల్ని ఒకసారే చంపేయండి’ -
పసి ప్రాణానికి పెద్ద కష్టం
● పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం ● ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులుదత్తిరాజేరు: మండలంలోని గుచ్చిమి గ్రామానికి చెందిన సొంగల రామునాయుడు, రూప దంపతుల ఆరు నెలల పాప మోహనకు ఎస్ఎంఏ జెనెటిక్ (కండరాలు, క్షీణత) ఆరుదైన వింత వ్యాధి సోకినట్లు హైదరాబాద్లోని నిజాం ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఈ పేద దంపతులకు తొలి సంతానంగా కుమారుడు మోహన్ వంశీ జన్మించగా ఇదే వ్యాధి సోకడంతో అప్పట్లో గుర్తించలేక పోవడం వల్ల 8నెలలకే మృతి చెందాడు. మళ్లీ రెండో సంతానం కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మూడో సంతానంగా జన్మించిన పాపకు ఈ వింతవ్యాధి వచ్చింది. పాప ఆరోగ్యం నయం కావాలంటే రూ.16 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెప్పడంతో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలిసి సమస్యను చెప్పామని రూ. 20లక్షల వరకు ప్రభుత్వ సాయం వస్తుందని ఆయన చెప్పడంతో నిరుపేదలమైన తమను దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా పాప ఎప్పటికీ పెరుగుదల లేక పోవడంతో మల్లారెడ్డి ఆస్పత్రిలో చూపించగా అక్కడి వైద్యులు నిమ్స్కు వెళ్లాలని సూచించడంతో ఈవ్యాధి బయటపడిందని తల్లిడండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఆదుకుని తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: స్థానిక టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో వడదెబ్బ తగిలి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం పార్వతీపురం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మృతుడిని గుర్తించడంలో సాయపడాలని పోలీసులు కోరారు. సదరు వ్యక్తి ఆచూకీ లేదా ఇతర వివరాలు ఏమైనా తెలిసిన వారు వెంటనే పార్వతీపురం టౌన్ పోలీస్స్టేషనన్లో కానీ, ఫోన్ 9121109467 నంబర్ను కానీ సంప్రదించి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
కలగా మిగిలిన కళాశాల..!
లక్కవరపుకోట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాలను ఏర్పాటుచేస్తామని సోంపురం కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇది జరిగి రెండేళ్లు గడిచినా కళాశాల మాత్రం ఎండమావిగానే మారింది. ఎల్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాల కోసం కేటాయించిన నాలుగు తరగతి గదులు నిరుపయోగంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. లోక్శ్ మాట ఇచ్చినా నెరవేర్చలేకపోయారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. – లక్కవరపుకోట -
ప్రతిభావంతులకు పోస్టులు దక్కేనా?
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో ప్రతిభ కంటే ‘పలుకుబడి’కే పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న 9 సెక్టోరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా వాటికి 50 మంది వరకు వివిధ కేడర్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు బుధవారం చేపట్టారు. అయితే, ఇంటర్వ్యూలు నిర్వహించక ముందే తెరవెనుక రాజకీయ నాయకుల ‘సిఫార్స్ లెటర్ల’ సంస్కృతి జోరందుకుందనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన వారు, ప్రతిభ, సీనియారిటీ, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షలో డిప్యుటేషన్లపై పనిచేసే అవకాశం దక్కేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ఎవరు సిఫార్సు చేశారు... వారి ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది’ అన్న అంశమే విద్యాశాఖలో అత్యంత కీలకంగా మారిందని ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బెస్ట్ టీచర్ అవార్డుల ఎంపిక నుంచి, డిప్యుటేషన్లు, కీలక పోస్టింగులు, చివరికి సెక్టోరియల్ పోస్టుల భర్తీ వరకు అన్నింటిలోనూ అర్హత కంటే రాజకీయ పరిచయాలకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనిచేసే వారికి నిరుత్సాహం... నిజాయితీగా విద్యార్థుల అభ్యున్నతి కోసం రాత్రింబవళ్లు కష్టపడే ప్రతిభగల ఉపాధ్యాయుల కంటే రాజకీయ లేదా సంఘాల పరంగా పలుకుబడి ఉన్నవారికే అవకాశాలు దక్కుతుండడం క్షేత్రస్థాయిలో పనిచేసే వారిలో నిరుత్సాహం ఆవహిస్తోంది. ‘ఎంత కష్టపడి పనిచేసినా ప్రయోజనం లేనప్పుడు.. వ్యవస్థ కోసం ఎందుకు తపించాలి?’ అనే భావన ఉపాధ్యాయుల్లో బలబడుతోంది. ఇది పరోక్షంగా విద్యావ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ ఉపాధ్యాయుల్లోకి తప్పుడు సంకేతాలు ప్రతీ చిన్న అవకాశానికి ప్రజాప్రతినిధులు, నాయకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడడంతో విద్యాశాఖపై రాజకీయ, సంఘాల ప్రభావం మితిమీరిపోతోంది. ఇదిలా ఉంటే కొత్తగా కొలువుల్లోకి చేరిన యువ ఉపాధ్యాయుల్లోకి కూడా ఒక తప్పుడు సంకేతం వెళ్లోంది. ‘పాఠశాలలో బాగా పనిచేయడం కంటే.. పైస్థాయిలో బలమైన పరిచయాలు పెంచుకుంటేనే గుర్తింపు, మంచి పోస్టింగులు వస్తాయి’ అనే ధోరణి వారిలో పెరుగుతోందని విద్యాశాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పారదర్శక ఎక్కడ...? పైరవీల సంస్కతికి అడ్డుకట్ట వేయాలంటే నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని విద్యావర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యక్తిగత ప్రయోజనాలు, పైరవీలకు తావివ్వకుండా వ్యవస్థ పరిరక్షణ కోసం, నిజాయితీ గల ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యాప్రేమికులు సూచిస్తున్నారు. బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ప్రతిభకు పట్టం కడతారో లేక సిఫార్సులకే పోస్టులు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. సమగ్ర శిక్ష పోస్టుల భర్తీపై ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు 9 పోస్టులకు 50 మంది పోటీ పైరవీలకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు -
భగపట్టిన భానుడు..!
● నెల రోజుల వ్యవధిలో వడదెబ్బతో ముగ్గురి మృతి ● బాధితులు 44 మంది ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రాయి సన్యాసమ్మ, ఈమెది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఈనెల23వతేదీన ఎండతీవ్రతకు ఇంటి వద్దే వడదెబ్బకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా మృతిచెందింది. విజయనగరం ఫోర్ట్: పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో వడదెబ్బ తగిలి గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం పార్వతీపురం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ● రాజాం మండలం డోలపేటకు చెందిన ఎల్.రామకృష్ణ వడదెబ్బ బారిన పడి మరణించాడు. ● కొత్తవలస మండలం ముసిరాంకు చెందిన కె. చైత్ర అనే 7 ఏళ్ల బాలిక వడదెబ్బకు గురైంది. కొత్తవలస పీహెచ్సీలో వైద్యం చేయించగా కోలుకుంది. ● కొత్తవలస మండలం దేవాడకు చెందిన ఆర్, జస్మిత అనే రెండు ఏళ్ల చిన్నారి వడదెబ్బకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు కొత్తవలస పీహెచ్సీలో చికిత్స చేయించగా కోలుకుంది. వీరే కాదు. జిల్లాలో అనేక మంది భానుడి ప్రతాపానికి తాళలేక అల్లాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విలవిలాడిపోతున్నారు. ఎండలో ప్రయాణించేవారితో పాటు ఇళ్లలో ఉన్న వారు సైతం వడదెబ్బకు గురవుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఉష్ణోగ్రతలు 43,44 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులతో జనం సెగలు కక్కుతున్నారు. పరిహారంపై స్పష్టత కరువు: వడదెబ్బ బారిన పడి మృతి చెందిన వారికి అందజేసే పరిహారంపై స్పష్టత కరువైంది. వడదెబ్బ మృతులకు పరిహారంపై ఎటువంటి స్పష్టత టీడీపీ సర్కార్ ఇవ్వలేదు. వడదెబ్బ బారిన మృతి చెందిన వారి వివరాలు ఎవరికి తెలియజేయాలి. వాటిని ఎవరు నమోదు చేస్తారు అనేదానిపై టీడీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రకృతి వైపరీత్యం అయిన వడదెబ్బ వల్ల మృతి చెందిన కుటుంబ సభ్యులు ప్రభుత్వం పరిహారం గురించి ఎటువంటి ప్రకటన చేయక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న మృతుడి పేరు లక్కిడాపు రఘు(32). ఇతనిది చీపురుపల్లి. మెయిన్ రోడ్డులో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెప్పులు కుడుతున్న ప్రాంతంలోనే వడదెబ్బకు గురయ్యాడు. దీంతో స్థానికులు చీపురుపల్లి ఆస్సత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పీహెచ్సీలో చికిత్స వడదెబ్బ బారిన పడి పీహెచ్సీకి తీసుకుని వచ్చిన రోగులకు చికిత్స అందిస్తున్నాం. వడదెబ్బకు సంబంధించిన అన్ని రకాల మందులు,ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం. వడదెబ్బ మృతుల పరిహారం గురించి, వివరాల నమోదు గురించి తెలియదు. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
పేదోడి ఇంటిపై పెద్దోడి కుట్ర..!
బొబ్బిలిరూరల్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని దీన స్థితి. గ్రామంలో 70 ఏళ్ల క్రితం గ్రామదేవత పండగలకు, అమ్మవార్ల వారాల పండగలకు పూజారిగా వ్యవహరించినందుకు గాను నాటి గ్రామ పెద్దలు, ప్రజలు ఏకమై ఆ కుటుంబానికి పంచాయతీ స్ధలం కేటాయించారు. ఆనాటి ఇంటి పెద్ద మృతి చెందడం, వైస్సార్సీపీ సానుభూతి పరులన్న నెపంతో గడిచిన 3 నెలలుగా ఆ కుటుంబంపై పచ్చనేతలు పగబట్టారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని కుట్ర పన్నారు. ఇంకేముంది అది పంచాయతీకి చెందిన స్థలమని ఖాళీచేయాలంటూ, ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టారు.దీంతో ఆయన ఆదేశాలతో ఆగమేఘాలమీద పంచాయతీ యంత్రాంగం మంగళవారం ఆ ఇంటిి ముందు హడావుడి సృష్టించింది. వెంటనే ఇంటిని ఖాళీచేయాలని ఎంపీడీఓ, ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రటరీ తమ సిబ్బందితో ఆ ఇంటికి చేరుకుని నానా రభస చేశారు. కరెంట్ కట్చేయాలని, ఒకరు, తాగునీటిని బంద్ చేయాలని మరొకరు, ఇంట్లో సామగ్రి బయట పడేయాలని ఇంకొకరు ఇలా ఆ కుటుంబానికి మంగళవారం నరకం చూపించారు. ఏమైనా ఉంటే ఎమ్మెల్యేకు చెప్పుకోవాలని ఆయన ఆదేశిస్తే యఽథావిధిగా మీరు ఉండవచ్చని సలహా ఇస్తూ కొంత సమయం కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. విలేకరుల ముందు వాపోయిన పేదకుటుంబం దీంతో బాధిత కుటుంబం బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైంది. గ్రామంలో పూజారిగా వ్యవహరించిన రాపాక జోగినాయుడికి నీడ కల్పించాలన్న దృక్పథంతో 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు 60 అడుగుల గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించారు. దీంతో జోగినాయుడు ఆ స్థలంలో పెంకుటిల్లు నిర్మించుకుని కుటుంబంతో నివాసముండగా, ఆయనకు లక్ష్మి, తౌడమ్మ, భరణి అనే ముగ్గురు కుమార్తెలు అక్కడే జన్మించారు. ఇటీవల ఆయన, ఆయన భార్య మృతి చెందడంతో కుమార్తె ఒంటరి మహిళ లక్ష్మి, తౌడమ్మ, ఆమె భర్త మహేష్, పిల్లలు ప్రతిమ, హరికృష్ణలతో పాటు ఆదే ఇంటిలో కొన్నాళ్లుగా నివసిస్తూ కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ కుటుంబం గత ఎన్నికల్లో వైస్సార్సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారన్న నెపంతో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్తో పాటు మరో ఐదుగురు ఆ కుటుంబంపై కక్షగట్టారు. బొబ్బిలి కోటలోకి పిలిపించారు. వారి కుట్రలను గమనిస్తున్న మహేష్ గ్రామంలోని 300 మంది సంతకాలతో ఆ నివాసంలో ఉండేందుకు తమకు అభ్యంతరం లేదంటూ సంతకాలు చేసి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దయచేసి తమను రోడ్డున పడేయవద్దని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నాడు. అయినప్పటికీ గ్రామపెద్దల కుట్రలు ఆగకపోవడంతో మహేష్ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. పంచాయతీకి పన్నులు కడుతున్నామని, ఇన్నేళ్లుగా తామే కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్లు కోర్టుకు ఆధారాలు చూపాడు. ఆ కేసు కోర్టులో కొనసాగుతుండగా ఆకస్మాత్తుగా పంచాయతీ అధికారులు మంగళవారం మహేష్ ఇంటిమీద పడ్డారు. కోర్టునుంచి తీర్పు వచ్చాక చూసుకోవచ్చని ప్రస్తుతం ఇంటిని ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారని మహేష్ వాపోతున్నాడు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని, తమకు మరోచోట నివశించేందుకు ఎటువంటి స్థలాలు లేవని, ఇంతటి మండుటెండల్లో ఎక్కడ తలదాచుకోవాలో వారే చెప్పాలని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఉన్నతాధికారులు, మానవతా వాదులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆడబిడ్డలతో ఎక్కడికి పోతామంటూ బావురుమంటున్నాడు. టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం, కుట్ర, కక్షలకు తమ కుటుంబం బలైపోతోందని వాపోతున్నాడు. కనికరం లేని ప్రజాప్రతినిధులకు పేద బతుకుల దీనదుస్థితి ఎలా ఉంటుందో తెలియదని, రాజకీయనాయకులు తమపై చేస్తున్న కక్షలకు అధికార యంత్రాంగం వత్తాసు పలకడం బాధాకరంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా తమ కుటుంబంపై కక్ష మాని మానవతాదృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నారు.ఆ నిరుపేద కుటుంబం ఏం నేరం చేసింది. ఏ భగవంతుడు వారి మొర ఆలకిస్తాడు. ఏ అధికారి వారి అవస్థలు దూరం చేస్తాడు. ఏ ప్రజాప్రతినిధి వారికి సాయం చేస్తాడు. గ్రామ పెద్దలు కక్షగట్టి వారి ఇంటిని ఖాళీ చేచించాలని చూస్తున్న కుట్ర ఎలా భగ్నమవుతుందో వేచి చూడాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ముద్ర వేసి కక్షసాధింపు 70 ఏళ్లుగా నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయించాలన్న కుట్ర ఎమ్మెల్యే హుకుం జారీచేయడంతో అధికారుల పరుగులు కన్నీటి పర్యతమవుతున్న పేదకుటుంబం -
మహానాడా..? మనస్పర్థల సభా..?
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నచ్చని మొగుడికి పెళ్లాం చేయి తగిలినా తప్పే.. కాలు తగిలినా తప్పే’ అన్నట్లుగా ఉంది గజపతినగరంలో టీడీపీ పరిస్థితి. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక.. తెలుగు ప్రజలందరినీ ఏకం చేసిన పార్టీ అంటూ డైలాగులు కొట్టి ఫ్లెక్సీలు పెట్టే టీడీపీ నాయకులు తమ పార్టీలోనే కొందరిని మాత్రం అసింటా.. అసింటా అంటూ అస్పృశ్యతను పాటిస్తున్నారు. పార్టీ సాధారణ సభ్యుల నుంచి సర్పంచ్.. ఎంపీటీసీ.. ఇలా అన్ని స్థాయిలవాళ్లకు పిలుపువచ్చినా.. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి మాత్రం పిలుపు పరువుతీసేలా మంగళవారం రాత్రి 9 గంటలకు, కేవలం ఆయనకు మాత్రమే పిలవడం గమనార్హం. దీనిపై స్పందించిన అప్పలనాయుడు కూడా మీరు చాలా ఆలస్యంగా పిలిచారని, తన వెనుక ఉన్న వారికి ఎటువంటి సమాచారం లేదని, ప్రత్యేకంగా తామే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. విజయనగరంలో తన అనుచరవర్గంతో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వర్చువల్ విధానంలో నిర్వ హిస్తున్న మహానాడు కార్యక్రమాలు గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో చీలికలను బహిర్గతం చేశాయి. తీవ్ర మనస్పర్థల సభగా మారిపోయింది. ఒకే పార్టీ.. రెండు వర్గాలు.. మూడు కథలుగా సాగుతున్న ఇక్కడి రాజకీయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడుకి సొంత పార్టీలోనే తలుపులు మూసేశారా? అనే చర్చ శ్రేణు ల్లో బలంగా నడుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో ఎవరి మహానాడు వాళ్లదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. తొక్కేస్తున్న చిన్నాయన..! గజపతినగరం నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీచేస్తున్న కొండపల్లి వంశీయుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడును తన చిన్నాన్న కొండలరావు, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్లు రాజకీయంగా తొక్కేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జరిగిన ఎన్నికల్లో అప్పలనాయుడుకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోగా.. తాజాగా మహానాడు కార్యక్రమానికి తన పరువు తీసేలా ముందురోజు రాత్రి ఆహ్వానించడం చర్చకు తావుతీసింది. తొలుత టీడీపీలో ఉన్న కొండలరావు తర్వాత ప్రజారాజ్యం, అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీలో పదవులు అలంకరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉంటూ మూడు పార్టీలు మారిన సందర్భాల్లో తన వెంట ఉన్న నాయకులకే నామినేటేడ్ పోస్టుల్లో అవకాశం కల్పించడంపై టీడీపీ నమ్ముకుని ఉన్న అప్పలనాయుడు వర్గానికి మింగుడుపడడం లేదు. కె.ఎ.నాయుడికి టీడీపీలోనే తలుపులు మూసేశారా..? గజపతినగరంలో ఎవరి మహానాడు వాళ్లదే.. . టీడీపీలో మర్యాదకు మంగళం..? రాజాంలో తమ్ముళ్ల బాహాబాహీ రాజాం: రాజాం మండలం కంచరాం సమీపంలోని ఓ ప్రైవేటు రిసార్ట్లో బుధవారం జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు కుమ్ములాటకు దిగారు. భోజనాలు సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిని ఒకరు తోసుకుంటూ, కొట్టుకొంటూ రిసార్ట్ ప్రాంగణంలో పరుగులుతీశారు. కొంతమంది నాయకులు రంగంలోకి దిగి వివాదాన్ని సద్దుమణిగించారు. భోజనాలు చాలకపోవడం వల్లే కార్యకర్తల మధ్య వివాదం తలెత్తిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఇదే వేదికపై రాజాం మండలంలోని ఓ పంచాయతీకి చెందిన రెండు టీడీపీ వర్గాలు సర్పంచ్ పదవి కోసం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఎదుటే కుమ్ములాటకు దిగడం గమనార్హం. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
వంగర: మండల పరిధి అరసాడ గ్రామంలో గతంలో డి.దుర్గారావు స్క్రాప్ షాపులో జరిగి న చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై షేక్ శంకర్ మంగళవారం తెలి పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన పేండ్ర నాయుడు, పేండ్ర జీవన్లను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పాలకొండ తరలించామన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతినెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పప్పల రామకృష్ణ(38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత తన తండ్రికి ఆయాసంగా ఉందని టేబుల్ ఫ్యాన్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ వైరు ఛాతీకి తగలడంతో షాక్ తగిలి వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు పాప, బాబు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఆవులను తరలిస్తే ఖబడ్దార్..!
విజయనగరం క్రైమ్: బక్రీద్ పండుగ నేపథ్యంలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయనగరంలో భద్రతా ఏర్పాట్లను మే 26న అర్ధరాత్రి ఎస్పీ స్వయంగా సీఐలు చౌదరి,శ్రీనివాస్లతో కలిసి పరిశీలించారు. విజయనగరం వన్ టౌన్,టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మసీదులు, ముస్లిం మతస్తులు ఉండే ఉండే సున్నిత ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి ఎస్ఐ,సీఐలకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తత, గస్తీ నిర్వహణ విధానం, చెక్పోస్టుల పనితీరు, వాహన తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బృందాలతో ఎస్పీ దామోదర్ మాట్లాడి విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత పెంచాలని, రాత్రి గస్తీలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, పశువుల అక్రమ రవాణా అరికట్టాలని, గోవధ జరగకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. వన్ టౌన్ పీఎస్ పరిధి కంటోన్మెంట్ బొగ్గుల దిబ్బ,గంజిపేట, కన్యకా పరమేశ్వరి, టూటౌన్ పరిధి మూడు లాంతర్లు, ఆబాద్ వీధి, కాట వీధి అంబటి సత్రం, ప్రెస్ క్లబ్ ప్రాంతాలలో ఈ తనిఖీలు చేసి అర్ధరాత్రి సంచరిస్తున్న వారిని ఎస్పీ స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పండగ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక బృందాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్ బృందాలను కూడా సిద్ధం చేశామని ఎస్పీ పేర్కొన్నారు. బక్రీద్ పండగ నేపథ్యంలో ఎస్పీ తనిఖీలు -
పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలు
● ఏరియా ఆసుత్రికి క్యూకట్టిన బాధితులు పాలకొండ రూరల్: పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కల గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురించేస్తున్నాయి. బుధవారం నగరపంచాయతీ పరిధిలోని జట్టివారివీధి, లోగిడివీధి, గెద్దవీధి తదితర ప్రాంతాల్లో వీధికుక్క స్థానికులపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో జి.వెంకటలక్ష్మి, సీహెచ్ చాణక్య, కె.మాలతీకుమారి, వీఆర్వో సీహెచ్.శ్రీనివాస్తోపాటు జి.ధనలక్ష్మి, బి.లావణ్య, కె.చిన్నమ్మడు, టి.శివయ్య తదితరులు గాయపడ్డారు. బాధితుల కాళ్లు, చేతులు, పిక్కలపై శునకం కరవడంతో వారంతా పాలకొండ ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు. మరికొంతమందిపై కూడా ఆ శునకం విరుచుకుపడినట్లు క్షతగాత్రులు వాపోతున్నారు. కళ్లముందే పిల్లలపై దాడిచేయడంతో అడ్డుపడిన వారిని కరిచినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యురాలు సునీతాచంద్రిక బాధితులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. కొద్ది రోజులుగా కుక్కల సమస్యలపై నగర అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, వారం క్రితం కస్పావీధి సమీపంలో కుక్కలు పలువురిని గాయపర్చినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
సువిధ సమాగం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి
● ఈఎస్ఐ కార్పొరేషన్ బ్రాంచి మేనేజర్ జి.జీవరత్నం విజయనగరం ఫోర్ట్: ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సువిధ, సమాగం, నిధి ఆప్కే నికత్ కార్యక్రమాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐ కార్పొరేషన్ బ్రాంచి మేనేజర్ జి.జీవరత్నం అన్నారు. స్థానిక దాడి మోటార్స్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 27వతేదీన ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.కార్మికుల ఈఎస్ఐ సమస్యలు, పీఎఫ్ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కె. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఆటో పల్టీ: మహిళకు గాయాలుమెరకముడిదాం: మండలంలోని గర్భాం నుంచి ఉత్తరావల్లి వైపు పాసింజర్లతో వెళ్తున్న ఆటో బుదరాయవలస సమీపంలో బుధవారం సాయంత్రం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఉత్తరావల్లి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారస్తురాలు పార్వతమ్మ తల, ముఖంపైన తీవ్రగాయాలయ్యాయి. పార్వతమ్మను స్థానికులు 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చీపురుపల్లి సీహెచ్సీకి తరలించారు. ఈఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ విషయం తెలుసుకున్న బుదరాయవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరుపై స్థానికుల నుంచి ఆరా తీసి కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంబొబ్బిలి: పట్టణంలోని రావు వారి వీధిలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో రాపాక రమణ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో జరిగిన ప్రమాదంలో ఇంటిలోని నిత్యావసరాలు, గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.2లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక నాయకులు బొత్స అప్పులు రమణ బాధిత కుటుంబసభ్యులకు నిత్యావసరాలను అందజేశారు. వైద్యాధికారి అసభ్యకర ప్రవర్తన● ఏపీవీపీ అధికారులు గుట్టుగా ఉంచినట్లు ఆరోపణలు ● వైద్యాధికారితో బాధితులకు క్షమాపణ? విజయనగరం ఫోర్ట్: వైద్య పరిషత్ పరిధిలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో ఏపీవీపీ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యాధికారి ఇద్దరు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని బాధిత మహిళా ఉద్యోగులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వైద్యాధికారులను నిలదీసినట్లు పెద్దఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు మహిళా ఉద్యోగులకు సదరు వైద్యాధికారితో క్షమాపణ చెప్పించినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఈసంఘటనను ఏవీపీపీ అధికారులు బయటకు పొక్కనీయకుండా గుట్టుగా దాచినట్లు సమాచారం. అస్పత్రి సిబ్బందిని కూడా ఈ విషయంపై ఎక్కడా చెప్పవద్దని అధికారులు ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి డాక్టర్ పద్మశ్రీ రాణి వద్ద సాక్షి ప్రస్తావించగా మహిళల పట్ల వైద్యాధికారి అసభ్యకర ప్రవర్తన విషయం గురించి గజపతినగరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ను అడిగితే ఫిర్యాదు ఎవరూ ఇవ్వలేదని తెలిపారని చెప్పారు. -
బ్యానర్...
ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషిచేస్తుంది. అభివృద్ధికి పాటుపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాన్ని ఎలా ఇబ్బందులకు గురిచేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం అమలుచేసిన పలు సంక్షేమ పథకాలకు మంగళం పాడేయడమే కాదు.. రోగులకు అందుతున్న సేవలకూ కత్తెర వేస్తోంది. ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అనంతరం అందించే ఆసరా పథకాన్ని ఎత్తేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని ల్యాబ్లను సైతం కుదించి ప్రైవేటు ‘పరీక్ష’లను ప్రోత్సహిస్తోంది. సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్పీ ల్యాబ్ను రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు రంగం సిద్ధం చేయడంపై రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. ఇక్కడ వేలాది మందికి సేవలందించే ల్యాబ్ను ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆశ్రయించేది విజయనగరంలోని సర్వజన ఆస్పత్రినే. ఇక్కడ ప్రతిరోజు వెయ్యికి పైబడి ఓపీ నమోదవుతుంది. ప్రభుత్వ వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి కావడంతో మెరుగైన వైద్యసేవలు అందుతాయన్న ఆశతో రోగులు ఆశ్రయిస్తారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో బీపీ, సుగర్, కేన్సర్ వంటి రోగులకు చికిత్స అందించే అసంక్రమణ వ్యాధుల నియంత్రణ క్లినిక్ (ఎన్సీడీ)ను ఎత్తేశారు. తాజాగా ప్రజలకు వచ్చే ప్రధాన వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు ఆధారమైన ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వెలెన్స్(ఐడీఎస్సీ) ల్యాబ్ను సైతం సర్వజన ఆస్పత్రినుంచి తరలించేందుకు సర్వం సిద్ధం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఐడీఎస్పీ ల్యాబ్లో చేసే వైద్య పరీక్షలు ఇలా.. ఐడీఎస్పీ ల్యాబ్లో మలేరియా, డెంగీ, చికెన్గున్యా, స్క్రబ్ టైఫస్, హెపటైటీస్–ఏ, హెపటైటీస్–ఇల్పెటోపైరోసిస్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేస్తారు. బోధనానుబంధ ఆస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో రోగులు తరలివస్తారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫర్ కేసులు కూడా అధికంగా ఉంటాయి. ఇక్కడ ఏడాదికి 10వేల పైబడి పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ల్యాబ్ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్పీ ల్యాబ్ తరలింపునకు సన్నాహాలు వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పవంటున్న రోగులు ఇదెక్కడి తీరు ‘బాబూ’ అంటూ నిట్టూర్పు సర్వజన ఆస్పత్రిని కాదని రాజాం తరలించడంపై విమర్శలు అవసరమైతే అక్కడ కొత్తల్యాబ్ ఏర్పాటుచేయాలని డిమాండ్ ల్యాబ్ తరలింపునకు ఆదేశాలు వచ్చాయి సర్వజన ఆస్పత్రిలోని ఐడీఎస్పీ ల్యాబ్ను రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించాలని వైద్యారోగ్యశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
జె.కొత్తవలసలో జ్వరాల వణుకు
● మంచం పట్టిన చిన్నారులు, మహిళలు ● ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స పొందుతున్న జ్వరపీడితులు తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామస్తులను జ్వరాలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలు సోకడంతో పలువురు మంచం పట్టారు. అనుపోతుల చరణ్, రఘు, జాడ నీలవేణి, అనుపోతుల చిన్న తదితరులు రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోను, ఆర్ఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతున్నారు. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విషయాన్ని తెలుసుకున్న పెరుమాళి పీహెచ్సీ వైద్యుడు వెంకటేష్, ఆయుర్వేద వైద్యుడు శ్రీనివాసరావు సిబ్బందితో బుధవారం గ్రామానికి వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరాలతో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. -
రియల్గా ముంచేశారు
చికెన్● రాజాంలో సాయిచైతన్య రియల్ ఎస్టేట్ బాధితుల నిరసన ● డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ బాధితుల ఆందోళన ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదురాజాం: రాజాంలో రియల్ వ్యాపారి మోసానికి పలువురు పేదల బలయ్యారు. 2017వ సంవత్సరంలో బుచ్చింపేట–గడిముడిదాం రోడ్డులో పొలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన సాయిచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థ ఖాతాదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా చేతులెత్తేసింది. దీంతో రాజాం, వంగర, వీరఘట్టం, కొమరాడ, పార్వతీపురం, రేగిడి తదితర మండలాల్లోని పలువురు బాధితులు బుధవారం రాజాం చేరుకుని నిరసన చేపట్టారు. తొలుత సాయిచైతన్య రియల్ ఎస్టేట్ యజమాని వ్యాపారం నిమిత్తం చూపించిన సైట్లో ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడి నుంచి రాజాం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ అశోక్కుమార్కు ఫిర్యాదు చేశారు. 2017, 20 సంవత్సరాల్లో రాజాంలో శీర నారాయణరావు అనే వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారని, పలువురు ఏజెంట్ల ద్వారా బుచ్చింపేట–గడిముడిదాం గ్రామాల మధ్య ఖాళీ స్థలాలు చూపించారని బాధితులు వాపోయారు. రాజాం పట్టణానికి దగ్గరగా ఉండడంతో ఈ స్థలాలు తమకు లాభిస్తాయన్న ఆశతో ఒక్కో నెల రూ.3000 చొప్పున చెల్లించి రియల్ ఎస్టేట్వ్యాపారికి డబ్బులు చెల్లించామని వెల్లడించారు. ఏడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పాటు డబ్బులు వాయిదాలుగా చెల్లించామని, ఒక్కొక్కరు రూ.3.50 లక్షలకు పైగా నగదు వాయిదాల రూపంలో వ్యాపారికి చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. ఇంతవరకూ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయలేదని. గత ఆరు నెలలుగా నారాయణరావు అందుబాటులో లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉంటున్నట్లు సమాచారం ఉందని, సంబంధిత వ్యాపారిని పట్టుకుని, తమకు ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
కంపెనీలకు కాపలాదారులా.. ‘పొల్యూషన్ బోర్డు’!
రాత్రి ఎనిమిది గంటలు దాటిందంటే చాలు..ఊరి మీద పొగ ముసురుకుంటుంది..ఇంట్లో తలుపులు మూసుకున్నా దుర్వాసన లోపలికే వస్తుంది..పిల్లలు దగ్గుతో వణికిపోతున్నారు..ముసలివాళ్లు ఊపిరి పీల్చుకోలేక అవస్ధ పడుతున్నారు. ఇది ఏదో సినిమా కథ కాదు..విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ప్రతిరోజూ అనుభవిస్తున్న నరకానికి ప్రతిరూపం ఈ కథనం. కాలుష్యంతో ప్రజల బాధలు.. చూసీ చూడనట్టు అధికారులు విజయనగరం గంటస్తంభం: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఏర్పాటైన కంపెనీలు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదికి వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెర్రీ, అరోరా, సహారా ఇంపెక్స్ కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన పొగలు, వ్యర్థాలతో బొబ్బిలి మండలంలోని మెట్టవలస, పణుకువలస, గున్నతోటవలస, కొత్తపెంట, ఎం.బూర్జవలస, నారాయణప్పవలస గ్రామాలు కాలుష్య కాటుకు బలవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ప్రజల ఆరోగాన్ని కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ఫిర్యాదులు వచ్చినా స్పందించకుండా కంపెనీలకే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఊపిరితిత్తుల మీద విషపు కత్తులు పగటిపూట అంతా సవ్యంగానే ఉన్నట్లు సమాజానికి నాటకమాడే ఈ కంపెనీలు, చీకటి పడగానే తమ అసలు రంగును బయటపెడుతున్నాయి. ఖరీదైన కాలుష్య నియంత్రణ ఫిల్టర్లను రాత్రి వేళల్లో పూర్తిగా కట్టేసి, దట్టమైన నల్లటి కెమికల్ పొగను, గొంతును నులిమేసే ఘాటైన రసాయన వాయువులను వాతావరణంలోకి వదులుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఆ విషవాయువుల దెబ్బకు ఊపిరాడక, గొంతు రాక, ఇళ్లల్లో నిద్రిస్తున్న పసిపిల్లలు ఉక్కిరిబిక్కిరవుతూ ఏడుస్తూ లేస్తున్నారు. వృద్ధులు గుండెలు పట్టుకుని శ్వాస కోసం కొట్టుమిట్టాడుతున్నారు. తెల్లవారేసరికి ఇళ్లపై, వాకిళ్లలో, చివరకు తినే అన్నం గిన్నెలపై కూడా నల్లటి బొగ్గు పొడి, బూడిద పేరుకుపోతోంది. ఇక్కడి ప్రజలకు ప్రశాంతంగా నిద్రపోయే హక్కు కూడా లేకుండా పోయింది. విషంగా మారిన చెరువు నీరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఘెరమైన రసాయన వ్యర్థాలను, కెమికల్ నీళ్లను ఏ విధమైన శుద్ది చేయకుండా రాత్రికి రాత్రే బయట ఉన్న వాగుల్లోకి, చెరువుల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల శతాబ్దాలుగా గ్రామస్తులకు, పశువులకు తాగునీరిచ్చిన చెరువులు నేడు రంగు మారి, దుర్వాసనతో విషపు కుంటలుగా మారాయి. పెంట గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బొబ్బిలి తహసీల్దార్ను ఆశ్రయించారు. ఆయన తక్షణమే స్పందించి బెర్రీ కంపెనీ వారికి ఫోన్ చేసి హెచ్చరించగా, ఇక కాలుష్యం లేకుండా చూస్తాం అని సదరు యాజమాన్యం అప్పట్లో అబద్ధపు హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఆ కలుషిత నీటిని తాగిన పశువులు, గొర్రెలు, పక్షులు కళ్ల ముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తున్నాయి. పచ్చని పొలాలు చవిటి నేలలుగా మారుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని కాలుష్య నియంత్రణ శాఖ కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం నిబంధనలు పక్కనబెట్టి కంపెనీలకు గ్రీన్ సిగ్నల్? బెర్రీ, అరోరా, సహారా ఇంపెక్స్ కంపెనీలపై ప్రజల ఆగ్రహం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఐదుగ్రామాలు -
నేర నియంత్రణకు డ్రోన్ వినియోగం కీలకం
విజయనగరం క్రైమ్ : నేరాల నియంత్రణకు డ్రోన్ వినియోగం అత్యంత కీలకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ లో ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మంగళవారం మహిళా పోలీసు కానిస్టేబుల్స్కు డ్రోన్ వినియోగించడంలో శిక్షణను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణకు డ్రోన్స్ వినియోగం క్రియాశీలకంగా మారనున్నందున డ్రోన్స్ ఆపరేటర్లుగా మహిళా పోలీసు కానిస్టేబుల్స్కు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలో ప్రతి పోలీసు స్టేషన్ కు ఒక డ్రోన్ ను ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుస్టేషన్ పరిధిలో డ్రోన్ ను వినియోగించేందుకు, డ్రోన్ ఆపరేటింగ్ విధానం పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీసు స్టేషను నుంచి టెక్నాలజీ వినియోగం పట్ల అవగాహన కలిగిన మహిళా పోలీసు కానిస్టేబుల్స్ను ఎంపిక చేసి, నిపుణుల పర్యవేక్షణలో వారికి డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ఓపెన్ డ్రింకింగ్, గంజాయి, పేకాట, కోడి పందాల నియంత్రణకు, క్రౌడ్, ట్రాఫిక్ పర్యవేక్షణ, పండగలు, ముఖ్య నాయకుల భద్రత, ముఖ్యమైన బందోబస్తుల్లో డ్రోన్స్ ను జిల్లాలో వినియోగిస్తామన్నారు. ఒక ప్రాంతంలో ఉండి నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలకు లేదా నాలుగు కిలో మీటర్ల పరిధి వరకు డ్రోన్ పంపి, ఆయా ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. డ్రోన్స్ ఆపరేటింగ్ విధానంపై అవగాహన కలిగిన నిపుణుల పర్యవేక్షణలో మహిళా పోలీసు కానిస్టేబుల్స్కు డ్రోన్స్ వినియోగించి, ఒక ప్రాంతపై ఎలా నిఘా ఏర్పాటు చేయాలి, వీడియోలు, ఫొటోలు ఏవిధంగా తీయాలన్న విషయాలపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావులు పాల్గొన్నారు. -
కోళ్లఫారాన్ని సందర్శించిన అధికారులు
వీరఘట్టం: ఎండతీవ్రత, విద్యుత్ కోతలతో వీరఘట్టం సమీపంలోని అచ్చెపువలస వద్ద ఉన్న కోళ్ల పారంలో 1200 కోళ్లు మృతి చెందినట్లు మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘కోళ్లను బలికొన్న పవర్కట్’ కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. విద్యుత్శాఖ అధికారులు కోళ్ల ఫారాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.అలాగే పాలకొండ పశు శంవర్థకశ ఎ.డి పి.మాణిక్యరావు, వీరఘట్టం పశువైద్యాధికారి చైతన్యశంకర్లు అచ్చెపువలస వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పరిశీలించారు. ఎండల తీవ్రత వల్లే కోళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు.అనంతరం ఫారం యజమాని మర్రి సురేష్తో మాట్లాడారు.కరెంటు కోత ఉన్నట్లు సమాచారం లేదని, కరెంటు తీస్తారని ముందుగా తెలిస్తే జనరేటర్ ఏర్పాటు చేసుకునే వాడినని బాధితుడు తన ఆవేదనను అధికారుల వద్ద తెలియజేశాడు. అయితే మంగళవారం తెల్లవారేసరికి సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. తనకు పరిహారం వచ్చేలా అధికారులు చొరవచూపాలని బాధితుడు కోరాడు. అనంతరం మృతి చెందిన కోళ్లను పెద్ద గొయ్యితీసి పాతిపెట్టారు. సురేష్ను ఆదుకోవాలి ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో కోళ్ల ఫారం నడుపుతున్న నిరుద్యోగి మర్రి సురేష్ ఫారంలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతనికి ఇంత పెద్ద ఎత్తున నష్టం వచ్చిందన్నారు.ట్రాన్స్కో అధికారులు బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని కళావతి డిమాండ్ చేశారు. -
పశువుల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
దత్తిరాజేరు: గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా ప్యాపారాలు సాగించే పశు రవాణా వ్యాపారంపై పోలీసులు వారం రోజులుగా ఉక్కు పాదం మోపడంతో వ్యాపారుల గుండెల్లో గుబులు పుడుతోంది. గజపతినగరం సర్కిల్ పరిధిలో ఉన్న దత్తిరాజేరు,గజపతినగరం,ఎస్ బూర్జవలస, బొండపల్లి, ఆండ్ర పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాల నుంచి ఒక్క పశువు కూడా అక్రమంగా తరలకుండా 19 కూడళ్ల వద్ద సిబ్బందిని రాత్రి పగలు బందోబస్తు పటిష్టంగా ఉంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ రవాణా జరగకుండా చేస్తున్నట్లు గజపతినగరం సీఐ సన్యాసినాయుడు చెప్పారు. గతంలో నిబంధనలు బేఖాతరు చేసి అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణా సాగించిన వ్యాపారులకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడడంతో ఇది రాజకీయ కోణంలో జరిగిందా? నిజంగా పశువుల అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేస్తున్నారా? అనే ఆలోచనలో గజపతినగరం సర్కిల్ పరిధిలోని ప్రజలు పడ్డారు.ఒడిశా నుంచి రోజూ గజపతినగరం సర్కిల్ పరిధి మీదుగా వేలాది పశువులు అక్రమంగా తరలి పోతున్నా పట్టిచుకోని అదికారులు ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎంతకాలం ఈ తనిఖీలు సాగుతాయో వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఐటీఐ క్యాంపస్ డ్రైవ్లో 189 మందికి ఉద్యోగాలు
విజయనగరం అర్బన్: స్థానిక వీటీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్–2026లో 189 మందికి ఉద్యోగాలు లభించాయని ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టీవీగిరి తెలిపారు. ఈ ఉపాధి మేళాలో 13 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 274 మంది జాబ్మేళాకు హాజరుకాగా, 189 మంది వివిధ కేటగిరీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విస్తృ త స్థాయిలో ప్రచారం చేసిన మోగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కు ఐదు కంపెనీలు గైర్హాజరయ్యాయి. స్టైఫండ్ బేస్డ్ ఉన్న పోస్టులకు వెళ్లేందుకు విద్యార్థులకు ఆసక్తిచూపలేదు. -
పశువుల వ్యాన్ల అడ్డగింత
గుర్ల: మండలంలోని గుజ్జింగివలస గోశాలకు వచ్చిన పశువులను గోవధకు తరలిస్తున్నారనే అనుమానంతో గ్రామానికి చెందిన యువకులు సోమవారం రాత్రి పశువులు తరలించే వ్యాన్లను అడ్డుకున్నారు. డెంకాడ మండలంలో పట్టుబడిన 10 పశువులను అధికారులు గుజ్జింగివలసలోని గోశాలకు తరలించారు. ఆ పశువులను గోవధకు ఇతర ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తుండగా రెండు వ్యాన్లను గ్రామ యువత అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మతిస్థిమితం లేని యువకుడి ఆచూకీ లభ్యంకొత్తవలస: మండలంలోని సంతపాలెం గ్రామానికి చెందిన షేక్ రజాక్ (23) అనే మతిస్థిమితం లేని యువకుడి ఆచూకీని పోలీసులు మంగళవారం కనుగొన్నారు. రజాక్ సోమవారం అదృశ్యం అవడంతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ టీవీ విజయకుమార్, ఎస్సై జోగారావులు గాలింపుచర్యలు చేపట్టారు. మండలంలోని సంతపాలెం–సబ్బవరం రోడ్డులో గల జగనన్న కాలనీ సమీపంలో రజాక్ ఉండడాన్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.రజాక్ అన్న షేక్ అబ్దుల్లాకు అప్పగించారు. ఈ తరహా వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలని అబ్దుల్లాకు సీఐ హితవు పలికారు. ఈ సందర్భంగా అబ్దుల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ● 22 తాత్కాలిక చెక్ పోస్టుల ఏర్పాటువిజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణపై నిఘా పెట్టామని ఎస్పీ దామోదర్ మంగళవారం స్పష్టం చేశారు. ఇందుకోసం 5 శాశ్వత చెక్పోస్టులు 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 30 మూవింగ్ పార్టీలు, దాంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ముగ్గురు సీఐలతో పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు. బక్రీద్ పండగను ముస్లిం సోదరులు మతసామరస్యం పాటిస్తూ, శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వాహన తనిఖీలు, మూవింగ్ టీమ్స్ పని తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ముగ్గురు సిఐలను నియమించామన్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 కేసుల్లో 25మందిని అరెస్టు చేసి, 12 వాహనాలను, 160 పశువులను సీజ్ చేశామని తెలిపారు. గతంలో కేసులు గల పాత నేరస్తులపై నిఘా పెట్టడంతోపాటు మళ్లీ ఈ తరహా నేరాలకు పాల్పడకుండా వారిని బైండోవర్ చేశామన్నారు. పశువుల విక్రయాలు జరిగే సంతలను కూడా మూయించివేశామన్నారు. కొంతమంది వ్యక్తులు కాలి నడకన పశువులను రవాణ చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బక్రీద్ పండగ ప్రశాంతయుతంగా ముగిసే విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని, భద్రత ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలోనూ, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి పూజాదికాలను నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమలను చెల్లించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ప్రతిభావంతులకు ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రోత్సాహకాలు
విజయనగరం అర్బన్/బొబ్బిలి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదోతరగతి–2026 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్ఆర్ షాపింగ్ పాల్ యాజమాన్య ప్రతినిధులు మంగళవారం నగదు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాలల వారీగా మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున నగదు బహుమతులను చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే, పదోతరగతిలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత షాపింగ్ కూపన్లు పంపిణీ చేశారు. విద్యార్థు ల తల్లిదండ్రులను కూడా దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్క రించారు. విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో జరిగిన నగదు బహు మతుల ప్రదానోత్సవంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ జోనల్ మేనేజర్లు సూర్య, వెంకటేశ్వర రెడ్డి, హెచ్ఎం సీహెచ్.అప్పారావు, బొబ్బిలి ఎంపీడీఓ పి.రవికుమార్, ఎంఈఓ గొట్టాపు వాసు, ఏఓ డీవీ అప్పారావు, ప్రిన్సిపాళ్లు జి.భార్గవీదేవి, ఎం.వేణు గోపాల్, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్.చంద్రమౌళీశ్వరరా వు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
గంట్యాడ: మండలంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటూ పొల్లంగి గ్రామానికి చెందిన సిరివురు సన్యాసిరాజు హఠాత్తుగా మృతి చెందడం విషాదం కలిగించింది. పనిస్థలాల్లో టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి కనీస సదుపాయాలు కల్పించకుండా కార్మికులతో పనులు చేయిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బతో కూలీ..లక్కవరపుకోట: మండలంలోని రెల్లిగౌరమ్మపేట గ్రామం సమీపంలో గల మాహామాయ కర్మాగారంలో రోజు వారి కూలి పనులు చేసేందుకు వచ్చిన మెరకమొడిదాం మండలానికి చెందిన దిబ్బరాజు (50) అనేకూలీ వడదెబ్బకు గురై మృత్యవాత పడ్డాడు. దిబ్బరాజు కొద్ది రోజులుగా ఒక కాంట్రాక్టర్ వద్ద కూలి పనులకు చేరాడు.మంగళవారం అధిక ఎండ కావడంతో కర్మాగారం గేటు బయటకు వచ్చి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయి మృత్యుఒడిలోకి చేరాడు. ఆటుగా వెళ్లేవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీ మార్చురీకి తరలించి మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.చందులూరులో గుర్తు తెలియని మృతదేహం..లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం శివారులో గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాలు వయస్సు గల యువకుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ రామకృష్ణ మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై ఫ్యాంట్ మాత్రమే ఉందని షర్టు లేదని తెలిపారు. మృతుడి వీపు భాగంలో తుప్పలు గీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని ఎస్సై భావించారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9121109450 ,9494166167 నంబర్లకు తెలపాలని ఎస్సై కోరారు. పాము కాటుతో మహిళ..గంట్యాడ: మండలంలోని మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి పాము కాటుతో చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 20వ తేదీ రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో ఆమె కుడికాలి వేళ్లను పాము కాటేసింది. వెంటనే కుటుంబసభ్యులు 108 అంబలెన్స్ ద్వారా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుమారుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ ఏఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గాలివాన బీభత్సం
జమ్మూ నారాయణపురం రోడ్డులో నిలిచిన ట్రాఫిక్ ● నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● నిలిచిన విద్యుత్ సరఫరా ● రాకపోకలకు అంతరాయం విజయనగరం/గంటస్తంభం/తెర్లాం/గుర్ల: విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడిగుల శబ్దాలతో జనం భీతిల్లిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్ల రేకులు, హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాకపోకలు స్తంభించాయి. ● విజయనగరం దాసన్నపేట ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ● తెర్లాం మండలంలోని తెర్లాం–ఆమిటి రోడ్డులో పలుచోట్ల చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. వీఆర్వో డి.రాము ఇచ్చిన సమాచారం మేరకు మండల ఇన్చార్జి తహసీల్దార్ గొంగాడ సత్యనారాయణ, తెర్లాం ఎంపీటీసీ సభ్యుడు జి.ఆనందరావు పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. ● గుర్ల మండలం చింతలపేటలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం పడిపోయింది. మన్యపురిపేటలో షెడ్పై చెట్టు పడింది. గరివిడి –విజయనగరం ప్రధాన రోడ్డుపై గుర్ల వద్ద తాటిచెట్లు పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ● విజయనగరం అయ్యకోనేరు ఉత్తర, దక్షిణ నాలా ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో అంధకారం అలముకుంది. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో చెట్టు రహదారికి అడ్డంగా పడిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి
విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వేలైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి పనులపై సమీక్షించారు. వివిధ దశల్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను నిర్ణేత గడువులోగా పూర్తిచేసి, ప్రాజెక్టులు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి డబుల్ ధమాకా!
మరి ఇప్పుడు భూమిని కొట్టేసేందుకేనా? సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజలు అధికారం ఇచ్చారు.. ఐదేళ్లపాటు అడిగేవారు ఇంకెవరు అన్న రీతిన చంద్రబాబు సర్కారు ముందుకు సాగుతోంది. ప్రజాసంక్షేమాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో అలసత్వం ప్రదర్శస్తున్న చంద్రబాబు.. తమ పార్టీ కార్యాలయాలకు మాత్రం ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టడం, దీనికోసం వెంటవెంటనే జీఓలు జారీచేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. విజయనగరంలో పార్టీ కార్యాలయానికి గతంలో ఎకరా స్థలం కేటాయించిన చంద్రబాబుసర్కారు.. ఇప్పుడు దానిని రెండెకరాలకు పెంచడం, అది కూడా ఎకరానికి వార్షిక అద్దె రూ.1000కే ఖరీదైన స్థలం కేటాయించడంపై జనం విస్తుపోతున్నారు. అధికారం అండతో భలే చౌకబేరమంటూ ఎద్దేవాచేస్తున్నారు. విజయనగరంలో టీడీపీకి ప్రత్యేకంగా కార్యాలయం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు నివసిస్తున్న అశోక్ బంగ్లానే పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమమైనా అక్కడ నిర్వహించాల్సిందే. వేరే కార్యాలయం తెరిచేందుకు ఇంతవరకు నాయకులు సాహసించలేదు. అశోక్ బంగ్లాను కాదని ఎవరైనా ప్రత్యేక పార్టీ కార్యాలయం ఏర్పాటుకు పూనుకుంటే బంగ్లా రాజకీయాలకు బలిపశువు కావాల్సి వస్తుందన్న భయం నాయకులను వెంటాడుతోంది. గతంలో ఇదే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బంగ్లా రాజకీయాలను తట్టుకోలేక విజయనగరం నియోజకవర్గం పేరిట వేరే పార్టీ కార్యాలయాన్ని విజయనగరంలో పెట్టారు. ఆమె నిర్ణయం బంగ్లా నేతలకు రుచించలేదు. దీంతో గీతను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమను ధిక్కరించి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని పెట్టిన గీత కెరీర్ను ముగించేశారన్న అపవాదు లేకపోలేదు. ● గత కొన్నేళ్లుగా పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిమిడి నాగార్జున సైతం ప్రత్యేకంగా కార్యాలయాన్ని పెట్టాలని నిర్ణయించారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే, బంగ్లా రాజకీయాలకు భయపడి ప్రత్యేక కార్యాలయం ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తరహాలో తనకు ఎక్కడ రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తారన్న భయంతో ఆ నిర్ణయానికి స్వస్తి పలికినట్లు సమాచారం. టీడీపీలో బంగ్లారాజకీయాలు సాగుతున్న వేళ పార్టీకి ప్రత్యేకంగా రెండెకరాల భూమిని గాజులరేగ గ్రామంలోని సర్వే నంబర్ 1/88లో 98 సెంట్లు, సర్వే నంబర్ 6/47లో 1.02 ఎకరాలు కేటాయించడం చూస్తుంటే జిల్లా వాసుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి 2018 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అయ్యన్నపేట గ్రామ పరిధిలోని కణపాకలో టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సర్వే నంబర్ 15/1పిలో ఎకరా స్థలం కేటాయించినప్పటికీ అప్పుడు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. రెండెకరాల భూమిని కేటాయిస్తూ గత ఏడాది మార్చి 11న ప్రభుత్వం జీఓ నంబర్ 84 జారీ చేసింది. పార్టీకి వేరే ఆఫీస్ అనే ఆలోచన లేని తరుణంలో మరి ఇలా రెండెకరాల భూమి ఎందుకు ? అంటే పార్టీకి ఆస్తులు కల్పించడమే లక్ష్యంగా ఇలా భూములు కేటాయించుకుంటున్నారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. మరోవైపు పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసి అక్కడ కార్యకలాపాలు సాగిస్తే బంగ్లా నేతలు ఎంతవరకు ఒప్పుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. 2018లో ఎకరా భూమి... 2025లో రెండెకరాలకు పెంపు వార్షిక అద్దె రూ.1000కే స్థలం కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు గాజులరేగ వద్ద పార్టీ కార్యాలయం నిర్మాణానికి అడ్డుగోలుగా కేటాయింపులు భూమి కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ అంటూ ఆరోపణలు -
ఆండ్ర పనుల్లో.. కమీషన్ల గాండ్రింపు..!
కమీషన్ల పనులకే పెద్దపీట.. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలి ఆర్ఎల్ 1, 2 కాలువల కింద పంటలు పండక నష్టపోతున్నాం. కాలువలు తెగిపోతే ప్రభుత్వ సాయం లేక మేమంతా చందాలు వేసుకుని పైపులు కొనుక్కున్నాం. రైతులకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలే తప్ప కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేలా అధికారులు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. ఎప్పుడు అడిగినా నిధులు లేవనే సాకు చెబుతున్నారు. – యస్.సత్యనారాయణ, ఆర్ఎల్ 1, 2 ఆయకట్టు రైతు, లోతుగెడ్డ చేసిన పనులేవీ? వచ్చిన అరకొర నిధులతో రైతులకు రూపాయి ఉపయోగం లేకుండా చేశారు. ఎడమ కాలువ పూర్తిగా పూడికతో నిండిపోయింది. కాలువ మొదట్లో పనులు చేయకుండా ఎక్కడో పనులు చేసినట్లు చూపి నిధులు కాజేశారు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. – పడాల గంగునాయుడు, ఎడమ కాలువ నీటి సంఘం చైర్మన్ రూ.20 కోట్లు అవసరం ఆండ్ర రిజర్వాయర్ పూర్తిస్థాయి ఆధునీకరణకు సుమారు రూ.20 కోట్ల వరకు నిధులు అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు, నివేదికలు పంపించాము. ప్రస్తుతం వచ్చిన అరకొర నిధులతో పనులు పూర్తి కావడం లేదు. – రామునాయుడు, డీఈ, ఆండ్ర రిజర్వాయర్మెంటాడ: ఆండ్ర రిజర్వాయర్ ఆధునికీకరణ పనులపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. వచ్చిన అరొకర నిధులతో కమీషన్ల వచ్చే పనులకే పాలకులు పచ్చజెండా ఊపుతున్నారు. తూతూ మంత్రంగా పనులుచేస్తూ నిధులను స్వాహా చేసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులపై రాజకీయ ముద్రవేసి గాండ్రిస్తున్నారు. ఫలితం.. రైతులకు ఏటా సాగు నీటి తంటాలు తప్పడం లేదు. మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాల పరిధిలోని 22 గ్రామాలకు చెందిన సుమారు 9,426 ఎకరాల ఆయకట్టుకు ఆండ్ర పాజెక్టు నుంచి వచ్చిన సాగునీరే ఆధారం. పొలాలకు నీరందించే కాలువ పనులను గాలికొదిలేసి, కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యమివ్వడంపై రైతులు మండిపడుతున్నారు. నిధులను కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు బిడ్డింగ్ లేదా కేటాయింపులు ఎవరికి దక్కినా, తెరవెనుక పనులు చేసేది మాత్రం స్థానిక మంత్రి ముఖ్యఅనుచరుడే కావడం గమనార్హం. కాలువల్లో పూడికలు.. గండ్లు.. రిజర్వాయర్ పరిధిలో ఎడమ ప్రధాన కాలువ కింద 4,630 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే కాలువ సుమారు ఐదున్నర అడుగుల లోతుకు, ఐదు అడుగుల మేర మట్టి, ఇసుకతో పూర్తిగా పూడిపోయింది. కాలువ పొడవునా నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు 4,796 ఎకరాల ఆయకట్టు కలిగిన కుడి ప్రధాన కాలువ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కాలువ పరిధిలోని ఆర్ఎల్ 1 కాలువ ప్రధాన కాలువ నుంచి కనీసం 300 మీటర్లు కూడా నీరు ముందుకు సాగడం లేదు. పూడికలతో నీరు ప్రవహించక ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయి. ఆర్ఎల్ 2 కాలువ గట్టు బలహీనంగా ఉండడంతో రైతులను ముంపభయం వెంటాడుతోంది. ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో చాలాసార్లు సొంత డబ్బులతోనే గండ్లు పూడ్చడంతోపాటు, పైపులు వేసి సాగునీటిని తరలిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. తరచూ ఎగువ ప్రాంతంలో కాలువలకు గండ్లు పడడంతో పంటలను నీరు ముంచెత్తుతోంది. ఈ నీటి మళ్లింపునకు రైతులు తరచూ గొడవలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు శివారు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఒక చోట నీరు అధికమై పంటలు పండక, మరోచోట నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కొందరు కాడివదిలి వలసపోతున్నారు. ఆండ్ర రిజర్వాయర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం అరకొరగా మంజూరు చేసిన రూ.3 కోట్ల నిధులతో తొలుత చేపట్టాల్సిన కాలువల మరమ్మతుల పనులను, పూడికతీతలను పూర్తిగా పక్కనబెట్టారు. ప్రాజెక్టు చైర్మన్కు సైతం సమాచారం లేకుండా, అధికార పార్టీ నేతలు తమకు కావలసిన చోట మాత్రమే అరకొరగా తుప్పలు నరకడం వంటి నామమాత్రపు పనులు చేసి నిధులు డ్రా చేసుకున్నట్టు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రాజెక్టును గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గతంలో ఇద్దరు మంత్రులు హామీలు గుప్పించారు. ఆ మాటలు నేటికీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. తమ సమస్యలపై, నిధుల దుర్వినియోగంపై స్థానిక రైతులు నిలదీస్తే.. అధికార పార్టీ నాయకులు దానికి రాజకీయ రంగు పులుముతూ, రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులను వివరణ కోరితే.. ‘ప్రభుత్వానికి నివేదికలు పంపాం’ అంటూ గత మూడేళ్లుగా ఒకే పల్లవి అందుకుంటున్నారే తప్ప కంటితుడుపు చర్యలు కూడా చేపట్టడం లేదు. -
ప్రశాంత వాతావరణంలో బక్రీద్ను జరుపుకోవాలి
ముగ్గురు తహసీల్దార్లకు ఉద్యోగోన్నతి ● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం క్రైమ్: బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. స్థానిక పోలీస్ బ్యారెక్స్లో ముస్లిం మతపెద్దలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియువతంగా పండగ నిర్వహించుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మసీదుల వద్ద డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, కంట్రోల్ రూం సీఐ వైకుంఠరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా తాత్కాలిక ఉద్యోగోన్నతులు లభించాయి. 2025–26 అదనపు ప్యానెల్ సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 29 మంది తహసీల్దార్లు, ఒక సెక్షన్ ఆఫీసర్కు డిప్యూటీ కలెక్టర్లుగా తాత్కాలిక (అడ్హాక్) ప్రమోషన్లు కల్పిస్తూ రెవెన్యూ (సర్వీసెస్–1) శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ సర్వే ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం సిఫార్సుల ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పించింది. ఉద్యోగోన్నతి పొందిన వారిలో జిల్లాకు చెందిన గంట్యాడ మండల తహసీల్దార్ పన్నూరు నీలకంఠేశ్వర రెడ్డి, చీపురుపల్లి తహసీల్దార్ దరిశిల ధర్మరాజు, చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారిణి రేలంగి ఈశ్వరమ్మ ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందిన అధికారులు 15 రోజుల్లోగా కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని, లేకపోతే ప్రమోషన్ హక్కు కోల్పోతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వివాదంలో వంతెన నిర్మాణం
జామి: మండలంలోని భీమసింగి కొత్తవలస వెళ్లే రోడ్డులో ఉన్న జేఏ సాగునీటి చానల్పై వంతెన నిర్మాణం వివాదస్పదంగా మారింది. అన్నమరాజుపేట , భీమసింగి రైతులు నిర్మాణాన్ని మంగళవారం అడ్డుకున్నారు. కాలువపై వంతెన నిర్మిస్తే సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందన్నారు. వంతెన నిర్మాణాన్ని నిలిపివేయాలని అన్నమరాజుపేట పీఏసీఎస్ అధ్యక్షుడు అప్పలరాజు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎన్నింటి శేషు, పలువురు రైతులు కోరారు. ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ జేఈ సంతోష్కుమార్ స్పందిస్తూ వంతెన నిర్మాణానికి సంబంధిత వ్యక్తులు ఉన్నతాఽధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నారని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. గందర గోళంగా రీసర్వే విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో రీసర్వే పేరుతో రైతులను ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టేస్తోందని విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర విమర్మించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో లోక్సత్తా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నపాటి భూ సమస్యలు కూడా పరిష్కారంకాక రైతులు రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గ్రామాల్లో సర్వే నంబర్లు, జాయింట్ ఎల్పీఎంల సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరచూ జీఓలు జారీ చేస్తున్నా రైతులకు ప్రయోజనం లేకపోతోందన్నారు. రెవె న్యూ శాఖలో సిబ్బంది కొరత కూడా సమస్యలకు కారణమని తెలిపారు. మరో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ కేఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లలో రైతులు ఫిర్యాదులు ఇస్తున్నా పరిష్కారం కనిపించడం లేదన్నారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సదస్సులో లోక్సత్తా నేతలు, పౌర సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ సదస్సు రేపు పార్వతీపురం రూరల్: నూతన విద్యా ప్రణాళికలో భాగంగా 6, 7 తరగతుల భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలపై ప్రయోగాత్మక బోధన కోసం జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయులకు బుధవారం అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ‘మన్యం కళావేదిక’ ఆడిటోరియంలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమానికి కలెక్టర్ను ఫోరం సభ్యులు ఆహ్వానించారు. -
ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
విజయవాడ: ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


