breaking news
Vizianagaram
-
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 40, ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● పార్వతీపురం బైపాస్ రోడ్డు ధూళి సమస్యను పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● కురుపాం మండలం దొమ్మిడిని కొత్త పంచాయతీగా ప్రకటించాలని సర్పంచ్ ఎం. గౌరి, తదితరులు అర్జీ సమర్పించారు. ● గరుగుబిల్లి మండలంలో చెరువుల ఆక్రమణలను తొలగించాలని.. కొమరాడ, ఉక్కాడవలస ప్రాంతాల్లో భూములను ఆన్లైన్ చేయాలని అర్జీలు సమర్పించారు. ● బీఈడీ పూర్తి చేసిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వ్యవసాయానికి బోర్ మంజూరు చేయాలని గిరిజన యువకులు కోరారు. ● నాగావళి నదిపై 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేస్తూ జేసీ యశ్వంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ● గిరిజన వేతనదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న డ్వామా పీడీని సస్పెండ్ చేయాలని.. డీఈఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం నేత పాలక రంజిత్కుమార్ కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
మా బాధలువినే ఓపిక లేదా?
ఎమ్మెల్యేసారూ... చీపురుపల్లి/గుర్ల: ఎమ్మెల్యే గారికి రైతుల బాధలు వినే ఓపిక లేదట.. రైతుల కష్టాలు తెలుసుకునే అవసరం కూడా లేదట... కనీసం రైతులతో మాట్లాడే తీరిక కూడా లేదట.. కష్టాలు చెప్పుకుందామని వస్తే పోలీసులతో తోయించేస్తారా?.. పోలీసులు తమను తోసేస్తుంటే ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే గారు నవ్వుతారా?.. ఇందుకేనా ఓట్లు వేసి గెలిపించుకున్నాం.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇంటింటికీ వచ్చారు... తీరా ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత ఎమ్మెల్యేకు రైతులకు మధ్య పోలీసులు ఎందుకు వచ్చారు... ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చింది రైతులే కదా సంఘ విద్రోహ శక్తులు కాదు కదా.. పోలీసులు తోసేస్తుంటే రైతులకు గాయాలవుతున్నా నవ్వుతూ వెళ్లిపోతున్నారు తప్ప పట్టించుకోలేదంటూ చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంటరావు తీరును గుర్ల మండలంలోని కెల్ల, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట, బెల్లానపేట గ్రామాలకు చెందిన రైతులు దుమ్మెత్తిపోశారు. ఓట్లేసి గెలిపించినందుకు తగిన శాస్తి చెప్పారంటూ మనోవేదనకు గురవుతున్నారు. పచ్చని భూముల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేస్తే రైతుల భవిష్యత్ నాశనమవుతుందని కొద్ది నెలలుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పక్షాన నిలబడకపోతే ఎలా అంటూ రైతులు మండిపడ్డారు. పచ్చని పొలాల్లో పారిశ్రామిక మంటల రాజేయడం తగదని, ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని వివరించి తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులేమైనా సంఘ విద్రోహ శక్తులా... ఎన్నికల ముందు ఇదే రైతులతో చేతులు పట్టుకుని భుజాలు రాసుకుని దద్ద, పెద్దయ్య, తమ్ముడు అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే... ఇప్పుడెందుకు కలవనివ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము రైతులమే తప్ప సంఘ విద్రోహ శక్తులం కాదు కదా... శాంతియుతంగా తమ కష్టాలు చెప్పుకోవాలని వస్తే పోలీసులతో అడ్డగించి తోయించడం ఎంతవరకు న్యాయమంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైతుకు స్వల్ప గాయాలు ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రైతులను తాడుతో పోలీసులు అడ్డుకున్నారు. ఎదురుగానే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రైతులను పంపించండని అనలేదు. దీంతో ఆవేదన చెందిన రైతులు ఎలాగైనా ఎమ్మెల్యేను కలిసి తమ గోడు చెప్పుకోవాలని ముందుకు సాగారు. దీంతో అడ్డుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దమరసింగి గ్రామానికి చెందిన మీసాల అసిరినాయుడు అనే రైతు కిందపడిపోవడంతో స్వల్ప గాయమైనట్లు రైతులు చెబుతున్నారు. ఓ వైపు రైతన్నా మీకోసం... మరోవైపు రైతులకు మోసం.. ప్రభుత్వం ఓ వైపు రైతన్న మీ కోసం అంటూ కార్యక్రమం చేస్తూనే మరోవైపు అదే రైతులను మోసం చేస్తోంది. రైతులపై ప్రేమ ఉన్నట్లు కపట నాటకాలు ఆడుతున్నారు. కనీసం కష్టాలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్తే పోలీసులతో అడ్డగించారు. రైతుల కష్టాలు వినకపోవడం దారుణం. – మీసాల ప్రసాద్, స్టీల్ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు, దమరసింగి, గుర్ల మండలం కళా తీరు దారుణం స్టీల్ప్లాంట్ ఏర్పాటు వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. పచ్చని పొలాల్లో పంటలు పండించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతాంగం కుదేలు అవుతుంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పాలని రైతులం వెళ్తే పోలీసులతో అడ్డగించడం దారుణం. రైతులు ఎదుర్కొంటున్న బాధలు వినకపోతే ఎలా? – కెల్ల సూర్యనారాయణ, కెల్ల, గుర్ల మండలం కష్టాలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులతో తోయించేస్తారా? ఇందుకేనా ఓట్లు వేసి తమరిని గెలిపించుకున్నాం.. రైతులమా లేక సంఘ విద్రోహ శక్తులమా చెప్పండి రైతులను మోసం చేయడం న్యాయమేనా? పోలీసు చర్యలతో అసిరినాయుడు అనే రైతుకు స్వల్ప గాయాలు -
దారి చూపండి.. ప్లీజ్..
గజపతినగరం: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు.. కనీసం ఆటో కూడా వెళ్లడంలేదు.. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలంటూ గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీ వాసులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను చుట్టుముట్టి గోడు వినిపించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. రహదారికి అడ్డంగా ఉండే గోడను తొలగించి రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యానవన పంటల సాగుకు ప్రాధ్యాన్యమివ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరం పంచాయతీ ఎమ్.వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల నూతన వంగడాలు, పరికరాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, పశుసవంర్ధక శాఖ ఎ.డి. ఎన్.చంద్ర శేఖర్, ఎ.డి.ఎ. ఎ.నిర్మళాజ్యోతి, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, ఏఓ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ దగా, వేధింపులు, అధిక వడ్డీలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అధికారులకు ఆదేశం.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రికెట్ టోర్నీ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం ఆర్ఆర్బీ పురం జీటీడబ్ల్యూఏహెచ్ఎస్లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న మన్యం లీగ్ – 2026 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ఈ టోర్న్మెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎస్డీఓ కె. శ్రీధరరావు, తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి.. విజయనగరం క్రైమ్: ఓ ఆకతాయి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నిండు గర్భిణి వేడుకుంది. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ దగ్గర్లో ఉన్న కృష్ణాపురంలో అనురాధ, కల్యాణ్ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కాయలు ఎదురుగా ఉన్న పృథ్వి ఇంటి ఆవరణలో పడడంతో వాటిని తీసుకునేందుకు ఇటీవల అనురాధ వెళ్లింది. దీంతో నా అనుమతి లేకుండా ఇంటిలోకి ఎందుకువచ్చావంటూ అనురాధతో పృథ్వి గొడవపడ్డాడు. తర్వాత అనురాధ ఇంటి నుంచి ఆమె కుమార్తె, అత్త, మరిది ఇలా ఎవరు ఇంటి బయటకు వచ్చినా బూతులు తిట్టడంతో పాటు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధిత కుటుంబం ఈ నెల 11న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● తెగిపడిన విద్యుత్ తీగలు పార్వతీపురం రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. రోడ్డుపక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు, ఓ కూరగాయల దుకాణంపై తీగలు పడ్డాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ పార్వతీపురం రూరల్: మండల పరిధిలోని వైకేఎం కాలనీ, చర్చి వీధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీలపై బాధితురాలు మత్స తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా రెడ్డి సారథ్యంలో రూరల్ సీఐ పి. రంగనాథం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ అస్రాఫుల్, షేక్ బాబు, ఒడిశాకు చెందిన రూపేష్ నాగ్లను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎం. రాజేష్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సమున్నత రీతిలో నగరాభివృద్ధికి కృషి
విజయనగరం: కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో మొదటి పాలకవర్గంగా సమున్నతరీతిలో సుపరిపాలన సాగించి విజయనగరం జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చామని, నగరాన్ని సుందరంగా మలిచామని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఉద్ఘాటించారు. గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులు నుంచి రూపాయి కేటాయించలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు తామే చేస్తున్నామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో జరిగిన అభివృద్ధిపై కౌన్సిల్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం విజయనగరం కార్పొరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రధాన అజెండాలో 14 అంశాలు పొందుపరచగా... టేబుల్ అజెండాలో మరో 3 అంశాలను పొందుపరిచారు. వీటిపై చర్చించిన కౌన్సిల్ రెండు అంశాలను తిరస్కరించి మిగిలిన 15 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్ మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్ కర్రోతు రాధామణి ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదంటూ చేసిన వాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల కిందట టీడీపీ కౌన్సిల్ సభ్యులు మధ్య సమన్వయలేమితో రూ.60 కోట్ల సాధారణ నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆలోచనలతో ఆ నిధులతో పాటు వివిధ గ్రాంట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తమ హాయాంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. దేశంలోనే రెండవ ప్రభుత్వ ఏసీ పాఠశాలుగా కొత్తపేటలోని వివేకానంద పాఠశాల గుర్తింపు పొందిందన్నారు. నగర వ్యాప్తంగా 23 ఫౌంటైన్లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కులు నిర్మించామన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు 11 వాటర్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు రోడ్ల విస్తరణ, వార్డుల్లో రోడ్లు, కాలువలు నిర్మాణాలు, ప్రాంతాల వారీగా ప్రభుత్వాస్పత్రుల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి తాజాగా వారు కోరిన ప్రాంతంలో స్థలం కేటాయించిన ఘనత ఈ పాలకవర్గానికే దక్కుతుందన్నారు. ● నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి ఆలోచనలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కౌన్సిల్ మొత్తం గర్వంగా చెబుతుందన్నారు. ప్రతి డివిజన్లో సుమారు రూ.2.50 కోట్ల నుంచి రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించామని పేర్కొన్నారు. ● కార్పొరేటర్లు మారోజు శ్రీనివాసరావు, అల్లు చాణక్య, మీసాల రమాదేవి, బాలి పద్మావతి, కడియాల రామకృష్ణ, పిన్నింటి కళావతి, రేగాన రూపాదేవి, తాళ్ల పూడి సంతోషికుమారి తదితరలు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంతృప్తికర పాలనపై చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సామూహిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ఆప్కోస్లో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 9 మంది కార్మికుల కుటుంబాలకు ఆ విధులు అప్పగించాలని కోరారు. కార్పొరేటర్గా సేవలందిస్తూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని కో ఆప్షన్ సభ్యుడు ఆశపు వేణు భరోసా ఇచ్చారు. పాలనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్గా పాలనకు సహకరించిన తోటి కార్పొరేటర్లకు, అధికారులకు, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి ఫలాలను పరిరక్షిస్తూ భవిష్యత్లో విజయనగరం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి సారధ్యంలో నగరంలో చేపట్టిన పనులకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆనందం వ్యక్తం చేయడం పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రూ.200కోట్లతో అన్నిరంగాల్లో విజయనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం అకింత భావంతో పనిచేశాం టీడీపీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించిన ఘనత మాదే పాలనకు సహకరించిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్లు -
ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ప్రారంభం
చికెన్విజయనగరం అర్బన్: మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) పరిధిలో విజయనగరంలో కొత్త పాలిక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ వైద్య కేంద్రాన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) రియర్ అడ్మిరల్ ఎం.మురళీమోహన్ రాజు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కమాండ్ మెడికల్ ఆఫీసర్ సర్జన్ రియర్ అడ్మిరల్ దిలీప్ రాఘవన్, మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ పాలీక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. మురళీ మోహన్రాజు మాట్లాడుతూ.. దేశానికి సేవలందించిన మాజీ సైనికులకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెంటర్ ఈసీహెచ్ఎస్ సెల్ అధికారి కెప్టెన్ ఎంవీఎస్ కుమార్, మాజీ సైననికులు పాల్గొన్నారు. -
వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు..
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: వ్యవస్థను మెరుగుపరిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా వార్త కథనాలు ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 196 కార్డులు అందజేసినట్లు చెప్పారు. జర్నలిజం సూత్రాలపై రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఆర్ఓ కె. బాల్మాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
అలసత్వం వహిస్తే సహించేది లేదు..
● కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి ● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పోటెత్తిన అర్జీదారులువిజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు రాగా.. అధికారులు 233 వినతులు స్వీకరించారు. ఇందులో 130 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందరరెడ్డి మాట్లాడుతూ.. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 130 వినతులు రాగా..డీఆర్డీఏ –13, పంచాయతీరాజ్ – 20, మున్సిపల్–9, విద్యుత్ శాఖ–7, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–1, గ్రామ సచివాలయ శాఖ–6, విద్య శాఖ–2, ఇతర శాఖలకు సంబంధించి 42 వినతులు వచ్చాయన్నారు. డిజిటల్ పర్యవేక్షణ.. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై డిజిటల్ పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేది, సమయం కూడా వారికిచ్చే రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, సీపీఓ బాలాజీ, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 48 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు 48 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూతగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, నగదు వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
బాధను దిగమింగి..
● తల్లి మరణించిన మరుచటి రోజే పరీక్షకు హాజరురామభద్రపురం: తండ్రి ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ తానై పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా పడి ఉంటే కుమిలి కుమిలి ఏడ్చిన కుమారుడు అంతటి బాధను కూడా దిగమింగుకుని మరుచటి రోజు పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ముల్లు రామలక్ష్మి (33) గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామలక్ష్మి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బిడ్డను (కోటేశ్వరావు) సాకుతూ వచ్చింది. కుమారుడిని గారాబంగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించింది. ఇక పై చదువులు చదివి తనను ఆదుకుంటాడనుకున్న సమయంలో విధి వక్రించింది. అనారోగ్యంతో రామలక్ష్మి ఆదివారం కన్నుమూసింది. దీంతో గుండెలవిసేలా ఏడ్చిన కోటేశ్వరరావు.. ఇంతటి బాధలోనూ సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. -
చేతివృత్తులకు కష్టకాలం..
మంగలి, చాకలి వృత్తులు కూడా అంతంతమాత్రమే..పూర్వం గ్రామాల్లో మంగలి, కలి వృత్తులకు ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక సెలూన్లు, వాషింగ్ మెషీన్లు, లాండ్రీలు పెరగడంతో ఈ వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇతర కులస్తులు పట్టణాల్లో ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులు నిర్వహిస్తుంటే.. అసలైన కులవృత్తిదారులు వారితో పోటీ పడలేక వృత్తినే వదిలేస్తున్నారున.విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు గ్రామాలు అన్నిరకాల వృత్తిదారులతో సందడిగా ఉండేవి. సూర్యోదయం నుంచే చేతివృత్తిదారులు తమ పనుల్లో బిజీగా కనిపించేవారు. ప్రతి రోజూ కుమ్మరి ఇంట్లో మట్టిచక్రం తిరిగేది. చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం సవ్వడి చేసేది. కంసాలి పనిముట్ల శబ్దం ఊరంతా వినిపించేది. మంగలి కత్తెర చప్పుడు.. చాకలి ఇస్సు ఇస్సు శబ్దాలతో గ్రామాలన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. గ్రామం అంటే కేవలం ఇళ్లు, పొలాలకే పరిమితమైపోయింది. ఆధునిక జీవన విధానం పెరిగింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్ను ఆక్రమించాయి. ఫలితంగా శతాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయ కులవృత్తులు నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి. ఈ వృత్తులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు..మన సంస్కృతీ, సంప్రదాయాలకు పునాది. కానీ నేడు ఆ వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కంసాలి వృత్తికి కాలం పరీక్ష.. వ్యవసాయ పనులకు కావాల్సిన పరికరాలు గొడ్డళ్లు, కొడవళ్లు, కత్తులను గతంలో గ్రామాల్లో ఉండే కంసాలులే తయారు చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మార్కెట్ను ఆక్రమించడంతో కంసాలి వృత్తి కూడా క్షీణిస్తోంది. ఇనుప మోగులు మసకబారుతున్నాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించిన కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. తండ్రి వృత్తి కొనసాగించని కొత్త తరం.. పూర్వం తండ్రి చేసే వృత్తినే కొడుకు కొనసాగించడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నేటి పరిస్థితుల్లో యు వత ఆ వృత్తులపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఆ దాయం, కష్టమైన పని, భవిష్యత్పై భయం కారణంగా యువత పట్టణాలకు వెళ్లి ఇతర ఉద్యోగాలు వెతు క్కుంటోంది. దీంతో పూర్వీకుల వృత్తుల కొత్త తరానికి చేరకుండా నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. గ్రామ సంస్కృతికి ముప్పు.. కులవృత్తులు కేవలం పనులు కాదు. అవి గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం. ఆ వృత్తులు మాయమ్తెతే గ్రామ సంస్కృతీ, సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అవి గతకాల జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం – సమాజం కలిసి రక్షించాలి.. ఈ సంప్రదాయ వృత్తులను కాపాడాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలి. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహక పథకాలు, మార్కెట్ అవకాశాలు కల్పించడం, హస్తకళల పదర్శనలు నిర్వహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం. వంటి చర్యలు తీసుకుంటేనే ఈ వృత్తులు తిరిగి బతికే అవకాశం ఉంటుంది. చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న వృత్తిదారులు పాత వృత్తులను దెబ్బతీస్తున్న ఆధునికత కనమరుగవుతున్న గ్రామ సంస్కృతి -
డాక్టర్ ఇంట్లో చోరీ
● 23 తులాల బంగారం, 12 కేజీల వెండిని దోచుకుపోయిన దొంగలు ● లబోదిబో మంటున్న వైద్యుడు సుబ్బారావు కొత్తవలస: మండల కేంద్రంలోని సబ్బవరం రోడ్డులో నివసిస్తున్న తెన్నేటి సుబ్బారావు ఇంటిలో దొంగలు పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండిని దోచుకుపోయారు. బాధితులు, సీఐ సీహెచ్ షణ్ముకరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సుబ్బారావు హైదరాబాద్లో నివసిస్తున్న భార్యను తీసుకువచ్చేందుకు రెండు రోజుల కిందట వెళ్లారు. శనివారం రాత్రి ఇంటి వెనుకభాగంలోని గోడ, కిటికీలను తొలిగించి దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా, మంచం కింద దాచిపెట్టిన 23 తులాల బంగారం, 12 కేజీల వెండిని దోచుకుపోయారు. సోమవారం ఉదయం సుబ్బారావు తన భార్యతో కలిసి వచ్చి ఇంటిలో చూడగా సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ షణ్ముకరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతం విజయనగరం అర్బన్: జిల్లాలో తొలిరోజు సోమవారం నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 23,015 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 75 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సోమవారం పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణలో పరీక్షలు రాసేలా నిరంతరం పర్యవేక్షించాలని పర్యవేక్షకులకు సూచించారు. -
25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విజయనగరం లీగల్: ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈనెల 25 న జరుగనున్నాయి. సంఘంలో సుమారు 600 మంది సభ్యులున్నారు. అధ్యక్ష పదవికి నళితం రమేష్కుమార్, గువ్వల తిరుపతిరావు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమ మద్దతుదారులతో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి కంటుభుక్త శ్రీనివాస్ తెలిపారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, స్పోర్ట్స్ సెక్రటరీ, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల అధికారులు వై. హరికృష్ణ, దాసరి పద్మ పాల్గొన్నారు. -
రైతుల క(న)ష్టాలు పట్టించుకోరా..?
విజయనగరం ఫోర్ట్: మామిడి, జీడి మామిడి రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణంలో మార్పులు, పొగమంచు, తెగుళ్లు, పురుగు ఆశించడం కారణంగా పూతనల్లగా మాడిపోయింది. జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. మెట్ట, కొండ ప్రాంత భూములు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మామిడి, జీడి మామిడి పంటలే జీవనాధారం. ప్రకృతి సహకరించకపోవడంతో పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పంటల బీమా ఉంటే పరిహారం అందేదని, ఆర్థికంగా ఆదుకునేదని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. అధికారంలోకిరాక ముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా చంద్రబాబు వ్యవహరించడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు, కౌలు, మామిడి, జీడిమామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. రైతులను ఆదుకోవాలని, తక్షణమే ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు, నష్టాలు పట్టించుకోరా అంటూ నిలదీశారు. ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది పంటల బీమా చెల్లించిన రైతులకు బీమా కంపెనీతో ప్రభుత్వ పెద్దల మాట్లాడి బీమా సొమ్మును ఇప్పించాలన్నారు. నష్ట పోయిన మామిడి, జీడి మామిడి రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. ఎకరానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీడిమామిడికి కేజీకి మద్దతు ధర రూ.200 ప్రకటించి ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఆందోళనలో రైతు సంఘం నాయకులు పైడపునాయుడు, ఆదినారాయణమూర్తి, శ్రీను, రవిరాజు, రైతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమాను అమలుచేసింది. విపత్తుల సమయంలో రైతులకు మేలు జరిగేది. బీమా సాయం ఠంచన్గా అందేలా ఏర్పాట్లు చేసేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. పరిహారం.. పరిహాసం.. గతేడాది మామిడి, జీడిమామిడి రైతులు వేలాదిమంది బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంట నష్టపోతే ఎకరానికి రూ.40వేలు, జీడి మామిడికి రూ.30 వేలు బీమా వస్తుందని చెప్పడంతో మామిడి పంటకు 10,104 మంది రైతులు 6,358 ఎకరాలకు బీమా ప్రీమియం కింద రూ.1,27,16,000లు చెల్లించారు. జీడి మామిడి పంటకు 566 మంది రైతులు 378 ఎకరాలకు రూ.5,67,000లు బీమా ప్రీమియం చెల్లించారు. మామిడి పంటకు ఎకరానికి రూ.2 వేలు, జీడిమామిడికి రూ.1500 చొప్పన ప్రీమియం చెల్లించారు. గతేడాది మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పంట దిగుబడి కూడ బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతింటే పంటలబీమా వర్తిస్తుందని ఆశపడ్డారు. ఏడాది గడిచినా ఇంతవరకు రైతులకు రూపాయి బీమా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి ఉన్నతాధికారులకు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. -
అమరజీవికి నివాళి
విజయనగరం కలెక్టరేట్: ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతిని కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, పీసీఓ బాలాజీ, ఆర్య వైశ్య సంఘం సభ్యులు రవ్వ శ్రీనివాస్, బండారు చంద్ర శేఖర్, ఎస్వీఎన్ శివ, కాపుగంటి ప్రకాష్, చెరుకూరి నాగార్జున, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన త్యాగం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. మహనీయుడు పొట్టి శ్రీరాములు విజయనగరం క్రైమ్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి ఎస్పీ, ఏఎస్పీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రూ.3.20 కోట్ల గంజాయి పట్టివేత
బొండపల్లి: ఒడిశా కేంద్రంగా విశాఖపట్నంకు భారీగా తరలిస్తున్న గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) పోలీసులు ఆదివారం వేకువజామున పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. ఒడిశాలోని సిమిలిగూడ ప్రాంతానికి చెందిన అజయ్రాయ్ తన బొలెరో వ్యాన్లో వేకువజామున వ్యాన్లో కింద గంజాయి ప్యాకెట్లు పేర్చి పైన క్యాబేజీలను వేసి రవాణా చేస్తుండగా ఎన్సీబీ పోలీసులకు అందిన సమాచా రం మేరకు బొండపల్లి పోలీస్స్టేషన్ మీదుగా వెళ్తు న్న బొలెరో వాహనాన్ని పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. 647 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం ఎన్సీబీకి అందిన సమాచారం మేర కు ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 647కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాడుల్లో ఎన్సీబీ పోలీసులు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొని బొలెరో వ్యాన్ను పట్టుకున్నారు. ఆరా తీ యగా కాయగూరలు రవాణా మాటున గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి విలువ రూ.3.20 కోట్లు పోలీసులకు పట్టుబడిన గంజాయి విలువ సుమా రు రూ.3.20 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన వారిపై ఆరా తీసే పనిలో ఎన్సీబీ పోలీసులు నిమగ్నమయ్యారు. -
వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతసేవ, వేదపండితులు పూజలు ప్రారంభించారు. అర్చన, మంత్రపుష్పం, నైవేద్యం, సేవాకాలం, భక్తుల దర్శనాలు, తులసి అర్చన పూజలు చేశారు. యాగశాల పూజలు, విశేష హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి హంస వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమే తంగా విహరించారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి తదితరులు తెప్పోత్సవంలో భాగంగా పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పాలనపై పట్టులేని చంద్రబాబు
రేగిడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 40 సంవత్సరాల అనుభవమని డప్పు కొట్టుకోవడమే తప్ప పాలనపై పట్టులేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని అక్కన్నఅగ్రహా రం గ్రామానికి ఆదివారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కాకుండా కేవలం అబద్దపు ప్రచారాలకే పరిమితమైందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేసి న అప్పు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకే ఏటా రూ.13వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్ వి.జగన్మోహనరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, సర్పంచ్లు కె.గోవిందరావు, గార రమణ, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పి.ధవళేశ్వరరావు ఉన్నారు. -
కాపాడాల్సిన మీరే ఆక్రమిస్తే ఎలా..?
● బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు ఫోన్ చేసి ప్రశ్నించిన పీసీసీ చీఫ్ షర్మిలబొబ్బిలి: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మండలంలోని పారాదిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర – రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సమయంలో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఏడుగురు పేదలు ఆమెను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1991లో ప్రభుత్వం తమకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూములను పంపిణీ చేయగా..సాగు చేసుకుంటున్నట్లు బాధితులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల బేబినాయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర భూమికి సంబంధించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకుల్లో చెల్లిస్తున్న క్రాప్లోన్లు, రైతుభరోసా వచ్చిన వివరాలు వైఎస్ షర్మిలకు చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆమె వెంటనే ఎమ్మెల్యే బేబి నాయనకు ఫోన్ చేయగా.. ఆ భూముల విషయం తర్వాత వివరిస్తానని బదులిచ్చారు. నాకు చెప్పవద్దు.. బాధితులకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ పట్టుబట్టగా, ఎమ్మెల్యే స్పందిస్తూ వారి ఆరోపణల్లో నిజం లేదు.. వారు చెప్పిన సర్వే నంబర్ వేరు.. ఈ సర్వే నంబర్ వేరు.. నేను ఇప్పుడు రాజాంలో ఉన్నాను. తర్వాత చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధితుల వినతి మేరకు ఆమె అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి..
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యగజపతినగరం రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించి పనిభారం తగ్గించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మరుపల్లిలో గల బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో పీఆర్టీయూ ఐదో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్టీయమూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన సభ్యత్వ నమోదు మరింత ఎక్కువ స్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయక తప్పదన్నారు. అనంతరం జనరల్ సెక్రెటరీ డి. శ్రీనివాస్ సంఘ వార్షిక నివేదికను సభకు సమర్పించారు. ఈ సందర్భంగా మూడోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ సంఘం తరఫున ఎన్నికై న గాదె శ్రీనివాసులునాయుడును రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, జిల్లా జనరల్ సెక్రెటరీ డి.శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, బైరి అప్పారావు, పప్పల రాజశేఖర్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, బండారు రవికుమార్, బూడి వెంకటరావు, పీఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షలపై సమీక్ష
● పరీక్షలు సజావుగా నిర్వహించాలి ● ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా విజయనగరం అర్బన్: పదవ తగరతి పబ్లిక్ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ, విద్యా శాఖ, పోలీస్ శాఖల అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. పరీక్ష కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకురాలు సమీక్షించి, పరీక్ష లు నిష్పక్షపాతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందు కు అవసరమైన సూచనలు అధికారులకు అందించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రెవెన్యూ, విద్యా శాఖ అధికారు లు కేంద్ర సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల కమిషన ర్ టి.సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు విజయనగరం క్రైమ్ : జిల్లాలో టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కేంద్రాలకు తీసుకురాకూడదని పేర్కొంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపాయి. -
బండి నడవదు..
విజయనగరంసోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026బండ రానిదే..ఎండాకాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధు లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల సరఫరాపై అనిశ్చితి నెలకొంది. యుద్ధానికి ముందు రోజు వారి ఇండెంట్ పెడితే సరఫరా చేసే ఏజెన్సీలు ప్రస్తుతం 10 రోజులు ముందుగా డీడీల రూపంలో నగదు చెల్లించినా సరఫరా చేసేందుకు ముందుకు రావటం లేదు. దీంతో గ్యాస్ తక్కువగా వినియోగమయ్యే వంటలు మాత్రమే వండుతున్నాం. ప్రభుత్వం ఓ వైపు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేకుంటే హోటల్ రంగం నష్టాల ఊబిలో కూరుకుపోతుంది. – జి.శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజయనగరం: పశ్చిమాసియాలో యుద్ధం భారత్లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. వంట గ్యాస్ ఫిల్లింగు టెర్మినల్స్లో నాన్ డొమిస్టిక్ సిలిండర్ల (ఎన్టీసీ) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుంచి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ఉత్తరాంధ్రలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు.. ఒక్కో డీలరుకి రోజుకు ఒక్క లోడు మాత్రమే ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. యుద్ధ ప్రభావానికి ముందు ఒక్కో డీలరుకు గరిష్టంగా రెండు లేదా మూడు లోడ్ల వరకు ఫిల్లింగ్ జరిగేది. ఇప్పుడు ఒక్క లోడుకే పరిమితం చేయడంతో డీలర్ల వద్ద క్రమేణ నిల్వలు తగ్గుతున్నాయి. మరో వైపు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచి హోటళ్లు, చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలోనే సగటున 70 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తారు. వాటికి సరఫరా నిలిచి పలు హోటళ్లలో వంటకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇదే సమయంలో గృహాలకు వంటగ్యాస్ సరఫరాలో సైతం ఆంక్షలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండరు తీసుకున్న 25 రోజులు పూర్తయితేనే మరొక సిలిండర్ బుకింగ్కు అవకాశం ఉంది. పలువురు బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా కావడం లేదు. వారం రోజుల నుంచి గ్యాస్ బుకింగ్ చేద్దామని ఆన్లైన్ నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో డీలర్ల వద్దకు పరుగెడుతున్నారు. భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సరఫరా జిల్లాలో గ్యాస్ ధరల భారం మోస్తున్న పెద్ద, చిన్న హోటళ్ల నిర్వాహకులకు వేధిస్తున్న గ్యాస్ కొరత గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. కొరతను సాకుగా చూపి కొందరు డీలర్లు చేస్తున్న నల్లబజారు వ్యాపారంతో నలిగిపోతున్నామని వాపోతున్నారు. ఫలితంగా ఎంతో మంది ఉపాధికి కష్టం అవుతోంది. ధరలు పెరిగితే ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. ధర పెరగడంతో పాటు సరఫరా నిలిచిపోయింది. రోజుకు 5 సిలిండర్లు అవసరమైతే అసలు అందడం లేదు. బ్లాక్ మార్కెట్లో రూ.500 నుంచి రూ.1000 అదనపు వసూలు చేస్తున్నారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందించిన సమాచారం ప్రకారం జిల్లాలోని ఆహార పదార్దాలు తయారు చేసి విక్రయించేందుకు అవసరమైన కమర్షియల్ గ్యాస్ ప్రతి నెల 30వేల కేజీల అవసరం కాగా... ప్రస్తుతం కేవలం 8వేల కేజీల అందిస్తుండటం గమనార్హం. ఇదే ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే టిఫిన్లు, ఫాస్ట్ఫుడ్, బిర్యానీలు, స్వీట్లు, పిండి వంటలు, కర్రీ పాయింట్లు, బేకరీ ఆహారాల రేట్లు పెరిగిపోతాయి. బయట ఉండి చదువుకుంటున్న విద్యారులు, ఉద్యోగులపై పెనుభారం పడనుంది. పెరిగిన ధరలు గ్యాస్ బండ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వంట గ్యాస్పై రూ.60, వాణిజ్య (కమర్షియల్) సిలిండరుపై రూ.115 పెంచింది. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో రోజుకు సరాసరి 4 వేల నుంచి 6 వేల సిలిండర్లు వినియోగదారులకు ఏజెన్సీల నుంచి పంపిణీ జరుగుతోంది. పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.5 లక్షల వరకు భారం పడే అవకాశాలున్నాయి. ప్రతీ రోజు వేలాది మంది స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆకలిని తీర్చుకునేందుకు హోటల్స్, మెస్లును ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాం. మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. – పి.వాసు, అధ్యక్షుడు, విజయనగరం హోటల్ అసోసియేషన్ నగరంలో పలు హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టారు. కొన్ని చిన్న హోటళ్ల నిర్వాహకులు ఏకంగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు గతంలో మాదిరి అన్ని రకాలు పెట్టలేమని చెబుతున్నారు. ఆహార సరఫరాలో సైతం మూడు, నాలుగు రకాలు మాత్రమే అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో చిన్నహోటళ్లు, టిఫిన్ తోపుడు బళ్లు, వాహన టిఫిన్ సెంటర్ల ఆధారంగా వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో హోటల్లో ముగ్గురు నుంచి పది మంది వరకు పని చేస్తున్నారు. వీరి సంఖ్య క్రమంగా తగ్గించుకుంటున్నారు. -
స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకం
● జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణగుర్ల: మండలంలోని కెల్ల, బెల్లానపేట, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్కు జనసేన వ్యతిరేకమని జనసేన రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని బెల్లానపేటలో ఐదు గ్రామాల రైతులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. పరిశ్రమలు మొట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, మూడు పంటలు పండే పల్లం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల రెతులుకు అన్యాయం జరుగుతుందన్నారు. సాగు భూములను పరిశ్రమలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల తీర్మానం లేకుండా ప్లాంట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నేత రమేష్ రాజు ఉన్నారు. -
పీడీఓ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
విజయనగరం రూరల్: పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మంత్రి రమణ, కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా తాడి వెంకటరావు.. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, సీహెచ్ ప్రసాద్, ఎ. ప్రవీణ్కుమార్, ఎస్.సురేష్, బి.భవానీ.. సంయుక్త కార్యదర్శులుగా ఎస్.హేమాంజలి, పి. రాంబాబు, కె. వెంకటరావు, ఎ. ముజీబ్, టి. రజని.. కోశాధికారిగా వి. శ్రీనివాస్.. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వామినాయుడు.. గౌరవ అధ్యక్షుడిగా యర్ర రమణలతో పాటు 8 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారుగా అచ్యుతరావు, న్యాయ సలహాదారునిగా పప్పు త్రినాథ్ ఎన్నికై నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎం. శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడిగా కె. చంద్రశేఖర్ వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎ. సురేష్ మాట్లాడుతూ.. పీడీఓల సమస్యలపై పోరాటం చేయడానికి ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. వన్ పీడీఓ – వన్ యూనియన్ నినాదంతో సభ్యులందరూ ఏకమై సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైగా పీడీఓలు హాజరయ్యారు. -
దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. -
ఘనంగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సక్సెస్ మీట్
విజయనగరం అర్బన్: నగరంలోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్న్స్టిట్యూట్ సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్ కోచింగ్తో పాటు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. గ్రూప్ వన్లో ఒకరు, గ్రూప్–2లో 66 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం గ్రూప్స్ విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రామకృష్ణ, ఎయిమ్స్ గ్రూప్స్ ప్రతినిధి కడగల ఆనంద్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, సువ్వాడ రవిశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన వైద్య బృందం
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప వైద్య బృందం ఆదివారం సందర్శించింది. ఆస్పత్రి సర్టిఫికేషన్కు అర్హత ఉందా.. లేదా.. అనేది పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పారిశుధ్యం, బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెడ్ల సౌకర్యాలు, రోగుల వివరాలు తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులు, కిట్లు చూశారు. రోగులతో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో టీం లీడర్ ప్రవీణ్, బయో మెడికల్ ఇంజినీర్ సంతోష్, ఎన్క్వాస్ నోడల్ ఆఫీసర్ మణికంఠ, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్పీవీ టీకాతో క్యాన్సర్కు చెక్..
సీతానగరం: మహిళలకు ఆశించే ప్రమాదకర గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. స్థానిక పీహెచ్సీలో చేపడుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్సీడీ అధికారి టి. జగన్మోహన్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి పదిహేనేళ్ల లోపున్న బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క బాలిక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం టీకా ఉచితంగా వేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల బాలికలకు టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్కు ముందు ఆభా ఐడీతో యువిన్లో రిజిస్ట్రేషన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. ఉషారాణి, యుడీసీ మురళి, సూపర్వైజర్ వెంకటరమణ, ఆ రోగ్య పర్యవేక్షకులు భవానీ, రవణమ్మ, గోపాల్నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
వాహనాల్లో కుక్కేసి ప్రమాదాల్లోకి నెట్టేసి..
ఒక్క నిమిషం ఆలోచిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి వెళ్లాలన్నా ఆలోచనా ఉన్నా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓవర్ లోడ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆటో డ్రైవర్లలో గాని ఇటు ప్రయాణికుల్లో గాని మార్పు రావడం లేదు. ముగ్గురు, నలుగురు ఎక్కాల్సిన ఆటోలో పదుల సంఖ్యలో ప్రయాణికులను కుక్కేస్తున్నారు.. దీంతో ఏమాత్రం అదుపు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో శనివారం సాక్షి కంట పడిన ప్రమాదకర ప్రయాణాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం లగేజ్ వాహనంలో ప్రయాణికులుఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణికులు -
ఎంపికలో ప్రాధాన్యం..
యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికై న విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
ప్రాణం తీసిన అజాగ్రత్త..
● లారీ టైర్ కింద పడి డ్రైవర్ మృతి కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఒక డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో డ్రైవర్ ప్రాణం పోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మొయ్యి శ్రీను (53) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో గల రైల్వేస్టేషన్ బొగ్గు యార్డు నుంచి లారీలో బొగ్గు లోడ్ చేసుకుని సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆపాడు. లారీ నుంచి బొగ్గు ధూళి పైకి ఎగరకుండా ఉండేందుకు టార్పాలిన్ కప్పుతున్నాడు. ఈ క్రమంలో లారీ కింద పడుకుని తాడు కడుతుండగా.. అదే సమయంలో అక్కడే ఉన్న మరో లారీ రివర్స్గా వస్తూ శ్రీను తలపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని రివర్స్ చేస్తున్న డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో లారీ డ్రైవర్ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష విజయనగరం అర్బన్: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరుకానుండగా ఇందుకు 1,356 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎస్జీటీలు, అంగన్వాడీ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూను జిల్లా పరిశీలకుడిగా నియమించిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఎంలు సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారన్నారు. మృతిపై అనుమానాల్లేవు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పీఎస్ పరిధిలోని తోటపాలెం రామ మందిరం సమీపంలో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన రక్తపు మడుగులో పడి ఉండడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు లేవని సీఐ చౌదరి తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య పద్మావతి కుమార్తెతో కలిసి శనివారం స్టేషన్కు వచ్చి తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాల్లేవని చెప్పిందన్నారు. మద్యం మత్తులో మంచంపై పడిపోవడం వల్ల తలకు గాయమై రక్తం కారినట్లు క్లూస్ టీమ్ సభ్యులు కూడా తేల్చారన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో శనివారం నిర్వహించిన బాలల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. బొబ్బిలి గ్రామానికి చెందిన పవిత్ర నృత్యాలయం బృందంచే ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు అలరించాయి. అనంతరం బాలలకు ఆలయ మేనేజర్ ఏవీ రమణ ప్రశంసాపత్రాలు అందించారు. ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన విజయనగరం టౌన్: నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో స్వామి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దోసూరి దాలినాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మురళీధర్, శ్రీధర్, అశోక్, సాయి ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆలుగు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం
డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు. -
సమాజాన్ని చైతన్యపరచాలి
● యూటీఎఫ్ మహిళా సదస్సులో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణివిజయనగరం అర్బన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, లింగవివక్ష, భౌతిక దాడులలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్ట్రీరియల్ హాల్లో ‘సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కారణంగా బాలికలు విద్యకు దూరమవుతున్నారని, ఇది సమాజాభివృద్ధికి ప్రతికూలమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ పోరాటం చేస్తోందన్నారు. మహిళా కమిటీ కన్వీనర్ జి.సుశీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.కస్తూరి, రాష్ట్ర కౌన్సిలర్ బీబీఎల్ మాధవీలత, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్, ఎ.శంకరరావు, జి.రాజారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జేఆర్సీ పట్నాయక్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జేఏవీఆర్కే ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు డి.రాము, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్పోలో సీతం విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఎలెక్సెంట్రా – 2026లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పోలో పట్టణానికి చెందిన సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో సీతం కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి అభించింది. కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎం.హైమ, ఎస్.తేజశ్రీవల్లి, పి.అఖిల్, కె.శ్రీనివాసరావు బృందం ‘ఓపెన్ సివిని ఉపయోగించి వర్చువల్ డాష్బోర్డ్’ అనే వినూత్న ప్రాజెక్ట్ రూపొందించారు. కంప్యూటర్ వెబ్కెమెరా ద్వారా చేతి కదలికలను గుర్తించి సంబంధిత లోడ్లను పనిచేయించే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సాంకేతికతను ముఖ్యంగా ఏటీఎంలు, పరిశ్రమలలో వినియోగించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి టి.దామోదరనాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించారు. ముగిసిన ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ శిక్షణ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్’ అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరైన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎస్.విష్ణువర్థన్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్, సిమ్యులేషన్ ప్రాజెక్ట్ల రూపకల్పనపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వై.నరేంద్రకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఏర్పాట్లు
రామభద్రపురం: పదో తరగతి విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు పబ్లిక్ పరీక్షలలో వెసులుబాటు కల్పించారు. వీరికున్న శారీరక వైకల్యాన్ని బట్టి అర్హులైన వారికి సహాయకులను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. 9వ తరగతి చదివే బాల బాలికలను సహాయకునిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చూపు సరిగా లేని విద్యార్థులు ఏదైనా ఒక భాష (లాంగ్వేజ్ సబ్జెక్టు) పరీక్ష రాయకుండా మినహాయింపు ఉంది. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందితే ఉత్తీర్ణులవుతారు. వినికిడి లోపం ఉన్నవారు రెండు భాషలు రాయనవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో సబ్జెక్టుకు 20 మార్కులు చొప్పున్న పొందాల్సి ఉంటుంది. మాట లోపం గల విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు సాధించాలి. పరీక్ష సమయం అదనంగా అరగంట కేటాయిస్తారు. -
రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఆలయ అధికారులు శనివారం ఆహ్వానం పలికారు. విజయనగరంలోని ఆయన నివాసంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు, మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రామతీర్థంలో జరుగుతున్న నవమి ఏర్పాట్లపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈఓకు సూచించారు. డెంకాడ మండలం మోపాడలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది సాయిరామాచార్యులు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. కాట్రగడ వైపు ఏనుగుల పయనం భామిని: మండలంలోని కాట్రగడ వైపు ఏనుగులు శనివారం పయనమయ్యాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటలను ఆహారంగా తీసుకుంటుండడంతో పంట మొత్తం నాశనం అవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేరడి బ్యారేజి వద్ద వరద కాలువలో దిగి ఆవలకు దాటినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరడి, కాట్రగడ, బొమ్మిక ప్రాంత పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. 19 నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ పారాయణం, శ్రీరామలక్ష్మీ జపంతో పాటు అష్టో త్తర, సహస్ర నామార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం శ్రీ సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు తమ గోత్రనామాలతో రూ.500లు చెల్లించి పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రసాదం, శేష వస్త్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల ఉదయం 19న తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో తెలుగు పండితులు పొందూరు సుధాకుమార్ శర్మచే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 108లో ప్రసవం సీతంపేట: మండలంలోని వెదుల్లవలస గ్రామానికి చెందిన గర్భిణి శనివారం 108లో ప్రసవమైంది. సవర సుమిత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ రవిబాబు, పైలెట్ రమణ గ్రామానికి చేరుకొని గర్భిణీని తీసుకువస్తుండగా దిబ్బగూడ గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి సిబ్బంది సుమిత్రకు ప్రసవం చేయించారు. సుమిత్ర మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చేసిన సేవలకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు. -
బస్సులో ప్రయాణం.. నరకప్రాయం
● యూఎన్ఓకు విద్యార్థిని ఫిర్యాదు భామిని: పాఠశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బాలికలు శారీరక హింస, అసభ్యకరమైన మాటలు, దూషణలకు గురవుతున్నట్టు హోలీక్రాస్ గ్రో క్లబ్ సభ్యురాలు చాందిని ఐక్యరాజ్యసమితికి శనివారం ఫిర్యాదు చేశారు. జనాలతో నిండిన బస్సుల్లో ప్రయాణంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నట్టు వివరించారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే మహిళల స్థితిగతుల కమిషన్ సమావేశం (సీఎస్డబ్ల్యూ – 70) సందర్భంగా జరిగిన అంతర్జాతీయ వర్చువల్ కార్యక్రమంలో గర్ల్స్ రోడ్ మ్యాప్ టు జస్టీస్లో యువ ప్యానల్ స్పీకర్గా చాందిని తన అభిప్రాయాలు వెల్లడించారు. బాలికలు హింసకు గురైనప్పుడు వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగలిగే స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థ ఉండాలన్నారు. ిఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. హోలీక్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లో క్లబ్లు బాలికల అవసరాలను గుర్తించి చైతన్యపరుస్తున్నట్టు డైరెక్టర్ ప్రభుదాస్ తెలిపారు. -
వడగాడ్పులతో తస్మాత్... : కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్: రాబోయే ఎండా కాలంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రజలు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా రుమాలు ధరించడం, తరచుగా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని తెలిపారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని చల్లబరచాలని, అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. -
కనులపండువగా సాంస్కృతికోత్సవం
విజయనగరం: ఉగాది సంబరాలు పేరిట విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో పదనిసలు పల్లవించాయి. ప్రదర్శనలు పరవళ్లు తొక్కాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు కనువిందు చేశాయి. కళాకారుల గీతాలు వీనుల విందుగావించాయి. మొత్తంగా సాంస్కృతికోత్సవం పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ చైతన్యానికీ విశ్వసౌందర్యానికీ ప్రతీక ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే ఉగాది తెలుగువారి తొలి పండుగగా చెప్పారు. వసుధ మీదకు వసంతం వస్తోందని త్వరలో రానున్న ఉగాది విజయనగరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కాలం మార్పుల ప్రవాహమని, సుఖ దుఃఖాలు, శుభాశుభాల నిరంతర పరంపరగా వాఖ్యానించారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని నృత్య రంగంలో వరలక్ష్మీత్యాగరాజ కళాశాలకు చెందిన గాయత్రి, అమృతవర్షిణి డ్యాన్స్ స్కూల్కు చెందిన తెలికిచెర్ల సౌమ్య, లయ లాస్య డ్యాన్స్ స్కూల్కు చెందిన బెల్లాన రాజు, విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీకి చెందిన ప్రవీణ్కుమార్ ఆచార్య, కుమారి హర్షితలకు, సేవారంగం నుంచి ముళ్లపూడి సుభద్రాదేవి, డివి.సత్యనారాయణ, డిమ్స్ రాజు, తాడేపల్లి నాగేశ్వరరావులకు, పాత్రికేయ రంగం నుండి కె.జె.శర్మ, మజ్జి శివకుమార్లకు, వెంట్రిలాక్విజమ్ నుంచి శ్రీనివాస పండిట్, ఫొటోగ్రఫీ రంగం నుంచి బుర్రా శ్రీనివాసరావులకు, కళారంగం నుంచి గంటాలక్ష్మీలకు ఉగాది పురస్కారాలను సమాఖ్య అధ్యక్షులు గురుప్రసాద్తో కలసి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిన్నారులను వరలక్ష్మీ త్యాగరాజ నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మిరామదాసు ఆశీర్వదించారు. -
గూడ్స్ రైలులో మంటలు
● అర్ధ గంట పాటు కనిమెరక గేటు సమీపంలో నిలిచిపోయిన రైలు ● మంటలు ఆర్పిన తర్వాత బయలుదేరిన రైలు బొండపల్లి: మండలంలోని కనిమెరక – దావాలపేట రెల్వేగేట్లకు సమీపంలో విశాఖపట్టణం నుంచి గజపతినగరం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో బొగ్గు వ్యాగిన్లో శనివారం మంటలు రావడంతో అర్ధ గంట పాటు నిలిపేశారు. బొగ్గు వ్యాగన్లో మంటలు రావడాన్ని గ్యాంగ్మన్లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ గమనించి అప్రమత్తమై రైలుకు ఎర్ర జెండా ఊపి నిలిపేశారు. దీంతో గూడ్స్ డ్రైవర్ల వద్ద ఉన్న మంటలను ఆర్పే యంత్రాలతో వాటిని అదుపు చేశారు. తరువాత రైలును యధావిధిగా పంపించారు. దీంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వందేభారత్ రైతులను వేరే మార్గం ద్వారా పంపించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. -
లక్ష్య సాధనలో వెనుకడుగు..!
విజయనగరం ఫోర్ట్: ఆదాయ లక్ష్య సాధనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ( ఏఎంసీ)లు వెనుకబడ్డాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని శతశాతం సాధించడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు అలసత్వం వహిస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్యం సాధించడానికి గడువు కేవలం కొద్ది రోజులే ఉంది. కాని సాధించాల్సిన లక్ష్యం రూ.కోట్లలో ఉంది. నెలల్లో సాధించలేనిది, రోజుల వ్యవధిలో సాధించడం అసాధ్యంగా కనిపిస్తుంది. మార్కెట్ కమిటీలు అలసత్వం వహించడం వల్లే ఆదాయ లక్ష్యాన్ని సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, మెరకముడిదాం, రాజాం ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ● మిగిలింది 16 రోజులే.. ఆదాయ లక్ష్యం సాధనకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ కొద్ది రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆదాయ లక్ష్యాన్ని సాధించగలవా... అనేది సందేహంగానే ఉంది. ● 11 నెలల 14 రోజుల్లో రూ.10.95 ఈ నెల 31వ తేదీతో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్య సాధనకు సంబంధించి గడువు పూర్తవుతుంది. 11 నెలల 14 రోజుల్లో రూ.10.95 కోట్ల ఆదాయాన్ని సాధించారు. ఇంకా గడువు 16 రోజులే ఉంది. ఈ తక్కువ వ్యవధిలో రూ.3.12 కోట్ల ఆదాయం సాధించడం దాదాపు కష్టమే. ● మార్కెట్ కమిటీల ఆదాయం వచ్చేది వీటి ద్వారానే.. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ఫీజు ద్వారా, మార్కెట్ కమిటీ పరిధిలో ఉండే దుకాణాల అద్దెలు ద్వారా ఆదాయం వస్తుంది. 184 రకాల నోటిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు. వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వులు, పెసలు, మినుములు, గోగునార, బెల్లం, అరటి, వేరుశనగ, మామిడి, జీడిమామిడి తదితర ఉత్పత్తుల మార్కెట్ ఫీజు ద్వారా ఆదాయం వస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల వారీగా లక్ష్యం, సాధించిన ఆదాయం 2025 - 26 లక్ష్యం రూ.14.07 కోట్లు జిల్లాలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్యం రూ.14.07 కోట్లుగా నిర్దేశించారు. ఈ నెల 13నాటికి రూ.10.95 కోట్లు సాధించారు. ఇంకా రూ.3.12 కోట్లు సాధించాల్సి ఉంది. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీలు తక్కువ ఆదాయాన్ని సాధించాయి. ఈ క్రమంలో మిగిలిన ఆదాయ లక్ష్యం ఎంత వరకు సాధించగలరన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. -
రేపటి నుంచి పది పరీక్షలు
● 22,961 మంది విద్యార్థుల కోసం 119 పరీక్ష కేంద్రాలు ● పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144, నో ఫోన్ జోన్ అమలు విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. పది పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల సమీపంలో జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి గుంపులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాలను నో ఫోన్ జోన్గా ప్రకటించినట్టు తెలిపారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు మాత్రమే పరీక్షలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 119 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 119 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 3 అదనపు డిపార్టుమెంటల్ అధికారులు, 1,210 మంది ఇన్విజిలేటర్లు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ సహకారం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 119 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా ఓసెన్ స్కూల్కు చెందిన 631 మంది విద్యార్థులు 8 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమాచారం కోసం 08922–351399, 7382157686 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు పాల్గొన్నారు. -
లోక్అదాలత్ సక్సెస్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత విజయనగరం లీగల్: రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాకుండా ఉంటుందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కోర్టులైన విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 10,395 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వీటిలో సివిల్ కేసులు 348, క్రిమినల్ కేసులు 10047, ప్రీ లిటిగేషన్ కేసులు 21 పరిష్కరించినట్టు పేర్కొన్నారు. ఇన్సురెన్స్ కంపెనీకి చెందిన రూ.68 లక్షలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్కు హాజరైన కక్షిదారులందరికీ ప్రముఖ న్యాయవాది పీఏఎన్ రాజు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్లో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి ఎన్.పద్మావతి, మహిళా, ఐదవ జిల్లా న్యాయ మూర్తి కె.నాగమణి, పోక్సో న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ వారు కోర్ట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా
బొండపల్లి: మండల కేంద్రానికి సమీపంలో చలి చెరువు వద్ద జాతీయ రహదారిపై బొండపల్లి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి శుక్రవారం బోల్తా పడింది. వివరాలు.. బొండపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి, బంగారయ్య, చంద్రరావు ట్రాక్టర్ ట్రక్కులో వస్తుండగా చలి చెరువు అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం పూసపాటిరేగ : భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటో పోలిపల్లి సమీపంలో ఆగి వున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శీల రాంబాబు మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీ బొండపల్లి: మండల కేంద్రంలోని నవీన్ వైన్స్ దుకాణంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి మద్యం దుకాణం మూసేసిన తరువాత సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళాలను విరగ్గొట్టినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు, షాపు నిర్వాహకులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా షాపులో ఉంచిన రూ.12వేల నగదు అపహరించుకుపోయినట్టు గుర్తించారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభ్యంతరాలకు ఆహ్వానం విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నట్టు విద్యాశాఖ జిల్లా అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, సమాన సిబ్బంది వర్గాలు, ఎస్జీటీలు, సమాన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ఈ నెల 1 నాటికి రూపొందించి ప్రచురించినట్టు పేర్కొన్నారు. దీనికి సవరించిన ప్రోవిజినల్ సీనియారిటీ జాబితాను ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయ వెబ్సైట్లో పరిశీలించవచ్చని సూచించారు. జాబితాలో ఎలాంటి అభ్యంతరాలున్నా.. తగిన ఆధారాలతో ఈ నెల 21న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య జిల్లా కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయ పనిదినాల్లో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నట్టు తెలిపారు. -
వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు
బొండపల్లి: వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు ఏపీసీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఫారెస్టు ) అధికారి రాహుల్ పాండే తెలిపారు. మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వనమిత్ర కేంద్రాల్లో ప్రసుత్తం ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు వసతులు కల్పించడానికి పరిశీలించి సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అందాల్సిన వేతన బకాయిలకు సంబంధించి నివేదికలను కూడా పంపనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డీఎఫ్ఓ రవీంద్ర దామో, ఎఫ్ఆర్ఓ సింధు, వనమిత్ర కేంద్రం సహాయకుడు పడాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బెల్ట్షాపులపై ఎకై ్సజ్ పోలీసుల దాడులు
పూసపాటిరేగ: భోగాపురం మండల పరిధిలో అనధికార మద్యం విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలు.. మండలంలోని పోలిపల్లి గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక మహిళ నుంచి 180 ఎం.ఎల్. పరిమాణం కలిగిన ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, ప్రతాప్, కానిస్టేబుల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకరి అరెస్టు -
అఖిల భారత తైక్వాండో పోటీలకు యశస్విని
విజయనగరం అర్బన్: ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈ నెల 15 నుంచి జరగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ మహిళల తైక్వాండో పోటీలకు స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్ యశస్విని ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాల తైక్వాండో పోటీల్లో కుర్గి ఓవర్ వెయిట్ 73 కిలోల విభాగంతో పాటు పూమ్సే వ్యక్తిగత, టీం ఈవెంట్లలో ప్రతిభ కనబరిచి జేఎన్టీయూ జీవీ జట్టుకు అర్హత సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు యశస్వినిని అభినందించారు. -
ప్రశ్నించినప్పుడే వినియోగదారుడికి న్యాయం : జేసీ
పార్వతీపురం: వినియోగదారులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై నిర్దేశించిన బరువు, కాల పరిమితి, ఎం.ఆర్.పి విలువలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వస్తువు ధరలో అన్ని రకాల పన్నులు కలిపే ఎం.ఆర్.పిని నిర్ణయిస్తారని, అంతకంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక బాధ్యత అని, అది భవిష్యత్తులో ఏదైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రధాన ఆయుధంగా పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, వినియోగదారులు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా లేదా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బి.అశోక్, డాక్టర్ జగన్మోహన్రావు, లీగల్ అడ్వైజర్ టి.జోగారావు వివిధ పాఠశాలల విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వరల్డ్ పారా అథ్లెటిక్స్లో లలిత ప్రతిభ
విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన పారా క్రీడాకారిణి కిల్లక లలిత సత్తా చాటింది. టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగులో అద్భుతమైన ప్రతిభ కనబరచి రజిత పతకం సాధించింది. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ప్రోత్సాహంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూరులో కోచ్లు రాహులు, బాలకృష్ణన్ల శిక్షణలో, గైడ్ రన్నర్ తబరీష్ల సహకారంతో వరుసగా విజయాలు సాధిస్తున్న లలిత గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ తానేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఇండియా తరఫున ఎంపికై న ఆరుగురు క్రీడాకారుల జట్టులో స్థానం సంపాదించిన లలిత అసాధారణ ప్రతిభతో మరో విజయాన్ని దేశానికి అందించిందని పేర్కొన్నారు. -
జోయలుక్కాస్ ఆభరణాల షోరూం ప్రారంభం
విజయనగరం: జోయలుక్కాస్ అంటేనే నమ్మకమైన బ్రాండ్ అని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయలుక్కాస్ విజయనగరం జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన షోరూంను వారు ప్రారంభించారు. అనంతరం షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలు విస్తరించటం మంచి పరిణామంగా పేర్కొన్నారు. వినియోగదారులు మెచ్చే నాణ్యమైన ఆభరణాలను సరసమైన ధరలకు అందించాలని ఆకాంక్షించారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్ వివిధ దేశాల్లో 190 షోరూమ్లు నిర్వహిస్తుండగా... భారతదేశంలో 113 షోరూమ్లు నిర్వహిస్తోందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్న సంస్థగా పేరుగాంచిన జోయలుక్కాస్ విజయనగరంలో షోరూం ప్రారంభించటం శుభపరిణామంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్లను అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్లు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. శుక్రవారం ఒక్క రోజే విజయనగరంతో పాటు శ్రీకాకుళం ప్రాంతాల్లో నూతన షోరూంలు ప్రారంభించామన్నారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. జోయలుక్కాస్లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృత శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్ అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ సీఓఓ హెన్రీ జార్జ్, మార్కెటింగ్ హెడ్ అనిష్ వర్గీస్, రిటైల్ హెడ్ రాజేశ్ కృష్ణన్, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతుకు దుఃఖీభవ
సాధారణ రైతుల సంఖ్యను తగ్గించేసిన చంద్రబాబు సర్కార్ కౌలు రైతులకు మొండి చేయి చూపింది. మొదటి, రెండు విడతల్లో కౌలు రైతులకు మొండిచేయి చూపిన చంద్రబాబు సర్కార్ మూడో విడతలోనూ ఒక్క రుపాయి విదల్చలేదు. దీంతో కౌలు రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లాలో 13 ,635 మంది కౌలు రైతులను వ్యవసాయ అధికారులు గుర్తించారు. భూమి లేని రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తారు. సాగు పెట్టుబడికి అప్పులు చేస్తారు. పెట్టుబడి సాయం అందిస్తే సాగుఖర్చు కష్టాల నుంచి గట్టెక్కుతారు. కానీ చంద్రబాబు సర్కారు వారికి ఆర్థిక సాయం అందించ లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. -
గ్యాస్ కొరత వస్తే హోటల్ రంగం కుదేలు
● కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే... ● ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ విజయనగరం: పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధసంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్ కోరారు. విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వాసుతో కలిసి నగరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ కొరతను దష్టిలో పెట్టుకుని పది రోజులు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అసోసియేషన్ తరఫున అందజేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా, వాస్తవానికి తమ హోటల్స్కు తగినంత గ్యాస్ సరఫరా కావడం లేదన్నారు. సరఫరాపై గ్యాస్ డీలర్లు చేతులెత్తేశారని వివరించారు. ఇదేపరిస్థితి కొన్నిరోజులు కొనసాగితే హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉందన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పి. వాసు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో అనేకమంది అద్దె భవనాలలో హోటల్స్ నిర్వహిస్తున్నారని, గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యలు వినియోగించేందుకు భవన యజమానులు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే హోటల్స్ నడపడం సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఒంగోలు పట్టణంలో అన్ని జిల్లాల అసోసియేషన్లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, టి.అనిల్, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం
విజయనగరం రూరల్: మెటలర్జీ విభాగం విద్యార్థులకు పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని మెటలర్జీ విభాగం పరిశోధకుడు డాక్టర్ బి.శివకుమార్ అన్నారు. విజయనగరం జేఎన్టీయూ జీవీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘ఈఐఎన్ఈఎన్– 2026’ 11వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆధునిక పరిశ్రమల్లో మెటలర్జీ ప్రాముఖ్యత, మెటీరియల్ సైన్స్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ జి.వేణుగోపాల్నాయుడు బియాండ్ ది డిగ్రీ అంశంపై ప్రేరణాత్మకంగా వివరించారు. డిగ్రీకి మించి నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేశారు. అనంతరం అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్ కె.శ్రీనివాస ప్రసాద్, వర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెసీబీ రావు, వివిధ కళాశాల ఆచార్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నూతనంగా నియామకమైనవారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులుగా నియమితులైన జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా పరిశీలకురాలు శోభా హైమావతి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరికీ మజ్జి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఆకాంక్షించారు. బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా కురుపాం: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు శాసన సభ మాజీ సభ్యుడు నిమ్మక జయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పరిస్థితులు, వ్వక్తిగత కారణాల దృష్ణ్యా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించామన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక రైతు మృతి గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన రైతు కురుమునెల్లి దాలినాయుడు (33) పురుగులు మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే... దాలినాయుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇటీవల కాలంలో పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగా శుక్రవారం మృతి చెందాడు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీలవేణి, కుమార్తెలు ఉష, ఝాన్సీ ఉన్నారు. ఆ డీలర్ మాకొద్దు రాజాం: మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో రేషన్ డిపో డీలర్పై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ను తొలగించాలంటూ గ్రామానికి చెందిన 200 మంది రేషన్ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. డీలర్ ఆగడాలను తహసీల్దార్ ఎం.రాజశేఖరానికి వివరించారు. రేషన్లో ప్రతినెలా కోతవేస్తున్నారని వాపోయారు. సరుకులు సక్రమంగా అందించడంలేదని ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల సమస్యను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు. -
వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికత
● కలెక్టర్ రాంసుందర్రెడ్డి బొబ్బిలిరూరల్: రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికత విస్తరిస్తుందని, పంటల సాగు, తెగుళ్లు, నీటి తడుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ ఎస్ రాంసుందర్రెడ్డి తెలిపారు. సంప్రదాయ వరి రకాలకు స్వస్థి చెప్పాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘పీఎం కిసాన్–అన్నదాతసుఖీభవ’ మూడోవిడత నిధులను విడుదల చేశారు. పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, ఆర్డీఓ రామ్మోహనరావు, జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, ఏడీ మదుసూధనరావు, ఏఓ శ్యాంసుందర్, తహసీల్దార్ ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వాడుక భాషకు వన్నె తెచ్చిన ‘మొల్ల’
విజయనగరం క్రైమ్: రచనలతో వాడుక భాషకు కవయిత్రి మొల్ల వన్నె తెచ్చారని విజయనగరం అడిషనల్ సూపరింటెండెంట్ సౌమ్యలత అన్నారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో డీపీఓలో శుక్రవారం నిర్వహించారు. మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సౌమ్యలత మాట్లాడుతూ 16వ శతాబ్దానికి చెందిన ఆతుకూరి మొల్లమాంబ తెలుగు కవయిత్రిగా కీర్తి గడించారన్నారు. వాజ్మయ మూలాల ఆధారంగా స్వతంత్ర భావాలతో సరళమైన వాడుక భాషలో సామాన్యులకు, పామరులకు అర్థమయ్యే శైలిలో రచనలు చేశారన్నారు. సంస్కృత భాషలోని రామాయణాన్ని ప్రప్రథమంగా తెలుగులోకి అనువదించిన మహిళగా మొల్లమాంబ ఘనత సాధించారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
డైట్లో టీచ్ టూల్స్పై శిక్షణ
నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలోని జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలో టీచ్ టూల్స్ శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. కళాశాలలో గత నెల 28 నుంచి ఈ నెల 12 వరకు రెండవ దశ టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగినట్టు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశానుసారం డైట్ ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. అలాగే టీచ్ టూల్ రిసోర్స్పర్సన్ రమేష్ బాబు, పద్మజ మాట్లాడుతూ తరగతి గది పరిసరాలు, సమదృష్టితో బోధన విధానం, విద్యార్థుల సానుకూల ప్రవర్తన, అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సహచర విద్యార్థుల పరస్పర నైపుణ్య మార్పిడి, అంశాల వారి ప్రతిస్పందన దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాలని ఐఎఫ్ ప్యానల్లో వీడియోలతో శిక్షణలో వివరించారు. స్టాఫ్ సెక్రటరీ వాక చిన్నంనాయుడు, ఫ్యాకల్టీ రమేష్, మురళి, సూరిబాబు, శ్రీనివాసరావు, అన్నారావు, అప్పారా వు, లక్ష్మణరావు, సత్యారావు, రజిత, సౌమ్య, సూర్యకళ, శర్మ, సోమయాజులు, శశి భూషణ్, గోపాలకృష్ణ, ఉమా మహేష్ పాల్గొన్నారు. -
చెరకు తోటలు దగ్ధం
● రూ.రెండున్నర లక్షల ఆస్తి నష్టం బాడంగి: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. లచ్చుపతుల శ్రీరాముకు చెందిన సుమారు రెండెకరాల నిలవరం, బల్జి రమణకు చెందిన 0.25 సెంట్లలో విత్తనానికి ఉంచిన చెరకు కాలిపోయి నష్టం సంభవించినట్టు రైతులు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం జరిగినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంఆర్ఐ జగదాంబ, వీఆర్ఓ ఆర్వీ రమణమూర్తినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. డొంకినవలసలోని అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ ఎస్టీ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో అద్దాల చిన్నమ్మి, అప్పన్న దంపతులకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.85 వేల నగదు, తులమున్నర బంగారు ఆభరణాలు, కొద్ది మొత్తంలో వెండి కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న నగదు కాలిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు. విజయనగరం క్రైమ్ : అప్పులిచ్చి అధిక వడ్డీల పేరిట వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డబ్బులిచ్చి అధిక వడ్డీ వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని బెదిరించడం ఇచ్చిన అప్పు కంటే అధికంగా అసలుతో పాటు వడ్డీని వసూలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు బయట వ్యక్తులకు జిల్లాకు వచ్చి అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి అప్పులిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు తమ దృష్టి వచ్చిందని తెలిపారు. డబ్బులిచ్చి బ్లాంక్ ప్రామిసరీ నోటు, బాండ్ పేపరు, తెల్లకాగితం మీద సంతకాలు చేయించుకుంటూ డబ్బులు సకాలంలో ఇవ్వకుంటే కొల్కత్తా, బిహార్ వంటి బయట రాష్ట్రాల కోర్టుల్లో కేసులు వేసి భయపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీన్నే కాల్మనీ వ్యాపారం అంటారని తెలిపారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. -
సరిహద్దు గ్రామాల్లో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురం రూరల్ : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎస్.శిరీష ఆధ్వర్యంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కర్లీ, కప్పలాడ, పిప్పలబద్ర గ్రామాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 4,800 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 170 లీటర్ల నాటుసారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై ఒడిశా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం, సాలూరు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్, ఇ.ఎస్.టి.ఎఫ్ బృందాలు, సాలూరు బీఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు. 4,800 లీటర్ల ఊట ధ్వంసం -
వరల్డ్ పారా అథ్లెటిక్స్లో గౌతమ్కు కాంస్య పతకం
విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి 13 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ – 2026 పోటీలలో భారతదేశం తరఫున పాల్గొన్న విజయనగరం జిల్లాకు చెందిన పారా అథ్లెట్ కరణం గౌతమ్ (టీ–12 కేటగిరి ) 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించడం హర్షణీయమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ వేదిక మీద జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలకు భారత్ నుంచి ఆరుగురు (6) పారా క్రీడాకారులు ఎంపిక కాగా అందులో విజయనగరం జిల్లాకు చెందిన కరణం గౌతమ్ ఒకరని తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి కాంస్యం గెలుచుకున్న గౌతమ్ అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని మరింతగా పెంచాడని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
రామభద్రపురం: మండల కేంద్రంలోని బొబ్బిలి రూట్లో పెట్రోల్ బంకు వద్ద ఈ నెల 11వ తేదీన లారీని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన ఇజ్జాడ గౌరీశ్వరి (64) ఇటీవల సాలూరులో తమ బంధువు మృతి చెందిన నేపథ్యంలో 11వ తేదీన పెద్దకర్మ కార్యాక్రమానికి సాలూరు వెళ్లేందుకు బొబ్బిలి వచ్చింది. అక్కడ పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎక్కింది. సరిగ్గా రామభద్రపురం గ్రామ సమీపంలోని బొబ్బిలి రూట్లో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరీశ్వరి తీవ్రగంగా గాయపడింది. వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి ప్రధమ చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఆవిర్భావ సంబరాలు
అంబరాన్నంటిన రాజాంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలేరాజేష్ తదితరులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు, నాయకులు వేడుకల్లో పాల్గొని పార్టీ పతాకాలను ఎగురవేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు మండలాల్లో పార్టీ నేతలు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. సామాజిక సేవల్లో నిమగ్నమయ్యారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల జేజేలు నడుమ వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్సార్సీపీ 16వ వసంతంలోకి అడుగుపెట డం సంతోషంగా ఉందన్నారు. పార్టీని నడిపిస్తున్న శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజాం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్, పార్టీ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజుతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో చర్చించారు. రేగిడి మండలకేంద్రంలో ఆ మండల ఎంపీపీ దార అప్పలనరసమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ జగన్మోహన్రావులు పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బొబ్బిలి పట్టణం బలిజిపేట రోడ్డులో ఉన్న అమ్మిగారి కోనేటి గట్టు దరిలో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇంటి గోపాలరావు, పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో ఊరూరా ఉత్సవంలా నిర్వహించారు. వేడుకల్లో పార్టీ నేతలు తమ్మిరెడ్డి దామోదరరావు, బొద్దల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, మండల వైస్సార్సీపీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు పార్టీ జెండా ఎగురవేశారు, భోగాపురంలో మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు, అనంతరం వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. నెల్లిమర్లలో నగర పార్టీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, వైస్సార్సీపీ నాయకుడు సముద్రపు రామారావులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజవర్గంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో అందించిన సుపరిపాలనను గుర్తుచేశారు. దత్తిరాజేరులో పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, రాజుల రామచంద్రపురంలో ఎంపీపీ గేదెల గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, గంట్యాడలో పార్టీ అధ్యక్షుడు జాగరపు అప్పారావు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్లు కట్చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఊరూరా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు 16వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ.. సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు సమన్వయకర్తలు, పార్టీనేతల సమక్షంలో జెండా ఆవిష్కరణలు -
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
● సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ విజయనగరం కలెక్టరేట్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం (ఈ నెల 15)ను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 13న మధ్యాహ్నం 4 గంటలకు కలెక్టరేట్లో వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఫోరం సభ్యులంతా హాజరు కావాలని ఆ ప్రకటనలో జేసీ కోరారు. ఆపదసమయంలో మహిళలు ధైర్యంగా స్పందించాలి ● సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి బాలామణి విజయనగరం ఫోర్ట్: ఆపద సమయంలో మహిళలు ధైర్యంగా స్పందించాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి కె.వి.బాలామణి అన్నారు. స్థానిక ఎం.ఆర్. కళాశాలలో మిషన్ శక్తి పథకంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. గుడ్టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థినులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు బాలలు ఆపద సమయంలో హెల్ప్లైన్ నంబర్ 1098కు ఫోన్ చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయ సహాయం కోసం వన్స్టాప్ సెంటర్ను ఆశ్రయించాలన్నారు. కార్యక్రమంలో వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పి.సాయివిజయలక్ష్మి, కేస్ వర్కర్ అనిత తదితరులు పాల్గొన్నారు. మహిళలు పిల్లలనుకనే యంత్రాలు కాదు ● జేవీవీ సమతా రాష్ట్ర కన్వీనర్ నిర్మల విజయనగరం గంటస్తంభం: ముగ్గురు పిల్లలకు జన్మనిస్తే రూ.25 వేల ప్రోత్సాహకం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడం మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూడటంలో భాగమని జేవీవీ సమతా రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల దుయ్యబట్టారు. మహిళలు ఎంత మంది పిల్లలను కనాలనే నిర్ణయం వారి హక్కు అని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టకుండా పిల్లలను కనాలని ప్రోత్సహించడం సరైది కాదన్నారు. సీఎం వ్యాఖ్యలను జేవీవీ సమతా రాష్ట్ర కమిటీ ఖండించినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాఅధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు హాల్టికెట్ చూపించి ఆల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీనెక్స్ నిర్వాహకుడిని తక్షణమే అరెస్టు చేయాలి విజయనగరం గంటస్తంభం/క్రైమ్: విజయనగరం పట్టణంలో డీసీసీబీ బ్యాంకు సమీపంలో ఉన్న వినెక్స్ కోచింగ్ సెంటర్ యాజమాని శ్రీనివాసరావును తోణమే అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ డిమాండ్ చేశారు. శిక్షణ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వివాహిత, అవివాహితులపై గురువు ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి నీచపు గురువుకు కఠిన శిక్ష విధించాలని, కోచింగ్ సెంటర్లపై నిఘాపెట్టి, విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరారు. లైంగిక వేధింపుల కేసు విచారణాధికారి శిరీష మహిళా పోలీస్ స్టేషన్లో వీనెక్స్ శిక్షణ సంస్థ నిర్వాహకుడి లైంగిక వేధింపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణాధికారిగా ఎస్ఐ శిరీషను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు. భామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ పాలకొండ రూరల్: పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కళాశాల విద్య, రాజమండ్రి ఆదేశాల మేరకు వేసిన కమిటీలో పాలకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్యామ్బాబు, భౌతికశాస్త్రం విభాగాధిపతి కె.శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా నోడల్ అధికారి, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్లు సభ్యులుగా ఉన్నారు. -
చీపురుపల్లి నియోజకవర్గంలో..
చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో గల శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీపురుపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం చీపురుపల్లి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి గరివిడిలో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, పార్టీ పీఏపీమెంబర్ బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి విపక్ష నేత కుమార్తె బొత్స అనూష, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కొయ్యన శ్రీవాణి, నియోజకవర్గ పరిశీలకులు పెడాడ రమణి కుమారి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు. -
9 మందికి 14 ఏళ్ల జైలు శిక్ష
గంజాయి కేసులో ● ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమాన విజయనగరం క్రైమ్: గంట్యాడ పోలీసు స్టేషన్లో తొమ్మిదేళ్ల కిందట నమోదైన గంజాయి కేసులో అరెస్టయిన 9 మంది నిందితులపై నేరారోపణ రుజువుకావడంతో ఒక్కొక్కరికి 14 ఏళ్లు కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి గురువారం తీర్పు వెల్లడించారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2017 ఆగస్టు 23వ తేదీన గంజాయి తరిలిస్తున్నారన్న సమాచారం మేరకు గంట్యాడ పోలీసులు కొటారుబిల్లి కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. బొడ్డవర నుంచి వస్తున్న మూడు వాహనాలను తనిఖీ చేశారు. అందులో సుమారు 641కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, అప్పటి గంట్యాడ ఎస్ఐ పి.నారాయణరావు కేసు నమోదుచేశారు. అప్పటి విజయనగరం రూరల్ సీఐ డి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రం దాఖలుచేశారు. ఏఎస్ఆర్ జిల్లా అరకు మండలం లోతేరుకి చెందిన పట్టాసి చంద్రశేఖర్, అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, అరకు మండలం చోలెంకికి చెందిన కొర్న మోసెస్ అలియాస్ ఆలీ, డుంబ్రిగూడకు చెందిన మధ్యగురు సింహాద్రి, ఎస్.కోట మండలం టి.బొడ్డవరకు చెందిన శోభా నాగరాజు, డుంబ్రిగూడ మండలం పెదఅంజోడకి చెందిన పంగి సన్యాసిరావు, అనంతగిరి మండలం ఎగువబూడికి చెందిన జన్ని అప్పారావు, శివలింగాపురానికి చెందిన దుడ్డు వీరభద్రరాజు, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం సత్యనారాయణపురానికి చెందిన మద్దుల శరత్పై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి మీనాదేవి శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. మరో నిందితుడైన ఏఎస్ఆర్ జిల్లా అనంతగిరి మండలం తొకురుకి చెందిన గేదెల ధర్మతేజ కేసు విచారణ సమయంలో అనారోగ్యంతో మృతి చెందాడు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్పై వివిధ జిల్లాల్లో 7 గంజాయి కేసులు ఉన్నాయి. ఇతనిపై ఏఎస్ఆర్ జిల్లా లో పి.డి.యాక్ట్ ఉంది. ఆయన గంజాయి వ్యాపారంతో సంపాదించిన సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఆస్థిని జప్తుచేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ముద్దాయిలకు శిక్షపడేలా వ్యవహరించిన విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. -
చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల యూనిట్పై.. చిన్నచూపు
విజయనగరం ఫోర్ట్: చిరుధాన్యాలు, వాటితో తయారుచేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యదాయకం. చిరుధాన్యాలు తీసుకోవాలని పదేపదే వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. కొందరు చిరుధాన్యాలను నేరుగా తీసుకోలేని వారు వాటితో తయారుచేసిన ఉప ఉత్పత్తులైన బిస్కెట్స్, లడ్డూలు, మిక్సర్, కారంపూస, మురుకులు తదితరవి ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం గాజులరేగ వ్యవసాయ పరిఽశోధన స్థానంలో రూ.30 లక్షల వ్యయంతో చిరుధాన్యాల ఉపఉత్పత్తుల తయారీ యూనిట్ను ఏర్పాటుచేశారు. కొన్నాళ్లపాటు ఇక్కడ ఉపఉత్పత్తుల తయారీ జరిగేది. మార్కెట్కు తరలించేవారు. మహిళలకు ఉపాధి లభించేది. మరోవైపు చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు యూనిట్ అండగా ఉండేది. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేది. సుమారు రెండేళ్లుగా ఇక్కడ ఉప ఉత్పత్తుల తయారీ నిలిచిపోవడంతో అటు మహిళలకు ఉపాధి పోవడంతోపాటు యూనిట్ నిరుపయోగంగా మారింది. డిమాండ్ ఉన్నా... చిరుధాన్యాల ఉప ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిరుధాన్యాలైన రాగి లడ్డు, రాగిమిక్సర్, రాగి బిస్కెట్స్, రాగి పిండి, రాగి చాక్లెట్స్, కొర్రలతో తయారుచేసిన కారంపూస, కొర్రలతో తయారు చేసిన మురుకులు, సామలతో తయారు చేసిన కేకు వంటి పలు రకాల చిరుధాన్యాల ఉప ఉత్పత్తులు మార్కెట్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వివిధ రకాల మార్ట్లలో చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. వ్యవసాయ పరిఽశోధన స్థానానికి రాగి బిస్కెట్స్, రాగి మిక్సర్, రాగి చాక్లెట్స్కు పేటెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాల ఉప ఉత్పత్తులతయారీ విభాగాన్ని లక్షల వ్యయంతో ఏర్పాటుచేశారు. చిరుధాన్యాల పౌడర్తో పాటు బిస్కెట్స్, మిక్చర్, కారంపూస తయారీకి అవసరమైన యంత్ర పరికరాలను కూడా అమర్చారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టరేట్ ప్రాంగణంలోనూ, రైతు బజార్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయారు. చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ కోసం నియమించిన శాస్త్రవేత్తను వేరే ప్రాంతానికి బదిలీ చేసేశారు. ఉప ఉత్పత్తుల తయారీ నిలిచింది చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ ప్రస్తుతం నిలిచింది. డీఆర్డీఏ అధికారులు చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీకి శిక్షణకోసం మహిళలను పంపిస్తున్నారు. వారికి శిక్షణ మాత్రమే ఇస్తున్నాం. – టి.ఎస్.ఎస్.కె.పాత్రో, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి మూలకు చేరిన రూ.30లక్షల యూనిట్ నిలిచిన చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ డిమాండ్ ఉన్నా పట్టించుకోని యంత్రాంగం మహిళల ఉపాధికి గండి చిరుధాన్యాల సాగు రైతులకు ప్రోత్సాహం కరువు -
సార్... మా కూతురు ఎక్కడ?
విజయనగరం జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఏమైందో తెలియదు.. ఎక్కడకు వెళ్లిందో అర్థంకావడం లేదు.. ఏ పరిస్థితుల్లో ఉందో ఆందోళనగా ఉంది.. అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది.. మా కూతురును వెతికిపెట్టండి సారూ.. అంటూ 22 రోజులుగా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ చుట్టు తిరుతున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు. మా కూతురు కనిపించడం లేదని పుట్టెడు దుఃఖంలోఉంటే సీఐ, ఎస్ఐలు నిర్లక్ష్యంగా.. చులకనగా తమతో మాట్లాడుతున్నారంటూ అమాయకులైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొల్లలములగాం గ్రామానికి చెందిన పిసిని బాలాజీ తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం మీడియా ముందు తమ గోడు వినిపిస్తూ కన్నీరుపెట్టారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలిక ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లి తిరిగి చేరుకోలేదన్నారు. అదే రోజు చీపురుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశామని చెప్పారు. తమ గ్రామానికి చెందిన మైలపల్లి అమ్మాజీ తమ బిడ్డను ఏదో చేసి ఉంటాడని పోలీసులకు చెప్పినప్పటికీ ఆ వ్యక్తిని పోలీస్స్టేషన్కు పిలిచి ఎందుకు విచారించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక... తల్లిదండ్రులకు ఓ లేఖ రాసి విడిచి వెళ్లింది. అందులో ‘సారీ నాన్న’ అంటూ రాసి ఉన్న లేఖ కలకలం సృష్టిస్తోంది. -
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టీడీపీ ఎమ్మెల్యే, గిరజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సంధ్యారాణి పీఎస్ సతీష్ ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్థిక, లైంగిక వేధింపుల కేసు విషయంలో పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ బుధవారం భంజ్దేవ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలి ఫోన్ నుంచి భంజ్దేవ్కు పలుమార్లు ఫోన్లు రావడం, భంజ్దేవ్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్లడంపై ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని పలుమార్లు ఆమె ఫోన్లో తెలిపిందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో మంత్రి సంధ్యారాణితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్టు భంజ్దేవ్ తెలిపారు. వివాదం పెద్దదికావడంతో సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, టీడీపీ అరకు పార్లమెంట్ ఆఫీస్ ఇన్చార్జి నాగేశ్వరరావు సైతం ఫోన్ చేసి, ఆమెతో (ఫిర్యాదుదారురాలితో) ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించానని, నాగేశ్వరరావు వాట్సాప్కాల్లో తనఫోన్ నుంచి బాధితురాలితో మాట్లాడినట్టు వివరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘటన తీరును వివరించానన్నారు. విచారణ జరిపించడం బాధాకరం పోలీసుల విచారణ తర్వాత భంజ్దేవ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికార పార్టీలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధినైన తనకు చాలా మంది బాధితులు ఫోన్ చేస్తారని పేర్కొన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఇలాంటి విషయాలపై ఏ రోజు పోలీసులు విచారణ జరపడం తెలియదని, బాధాకరమంటూ వాపోయారు. మంత్రి పీఎస్ కేసులో తన కాల్డేటాను అనుమానించి పోలీసులతో విచారణ జరిపించడం బాధకలిగిస్తోందన్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు విచారణకు వచ్చారో అందరికీ అర్థమవుతుందని, జరిగిన విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భంజ్దేవ్ స్పష్టం చేశారు. -
సమయం బుధవారం ఉదయం 10.30 గంటలు. పార్వతీపురం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారు. డిపో నుంచి బస్సు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరడంతో డ్రైవర్ వేగం పెంచాడు. రామభద్రపురం మలుపు వద్ద లారీని బలంగా ఢీకొట్టాడు. అంతే..
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీ కెమోరాలను పోలీసులు పరిశీలించారు. అందులో బస్సు డ్రైవర్ ఇయర్ ఫోన్స్ను చెవిలో పెట్టుకుని నిర్లక్ష్యంగా బస్సును అతివేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తించారు. పార్వతీపురం డిపోలో 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరడం... ఆ సమయాన్ని కలిపేందుకు అతివేగంగా బస్సు నడిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్పై గతంలో ప్రయాణికుల నుంచి ఫిర్యా దులు అందడంతో సాలూరు డిపో పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్ను పార్వతీపురం డిపోకు బదిలీచేసినట్టు సమాచారం. బస్సు డ్రైవర్ పాలకొండ తిరుపతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.ప్రసాదరావు తెలిపారు. గమ్యస్థానాలకు చేరుకునేలోపే... బస్సులో అధికమంది రామభద్రపురం, తారాపురం, కొట్టక్కి, సాలూరు తదితర గ్రామాల స్టాప్లలో దిగాల్సినవారే అధికం. కొద్ది సమయంలో గమ్యస్థానాలకు చేరుకుంటామన్న సమయంలో బొబ్బిలి వైపు వెళ్తున్న మధ్యప్రదేశ్కు చెందిన లారీని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. గాయ పడిన వారిలో 20 మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. తల, గుండె, వీపు, కడుపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. మరో 25 మందికి పెదవులు, ముక్కు, నాలుక, దంతాల వద్ద గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలై... కొట్టక్కి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బొబ్బిలికి చెందిన మాసాబత్తుల ఝాన్సీ, శనగల సూర్యనారాయణమ్మ, రామభద్రపురం గ్రామానికి చెందిన దేవతన లక్ష్మి, చిన బూర్జవలసకు చెందిన గేదెల దాడమ్మ, గొర్లి రాజేశ్వరమ్మ, ఇజ్జాడ గౌరమ్మ, గొడ్డె చిన్నయ్య, పారాది నాగరాజు తదితరులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్ప్రత్రికి తరలించారు. యజ్జల లక్ష్మమ్మ, బూరాడ గౌరమ్మ, సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.శోభారాణి, బస్సు కండక్టర్ బెహరా చిన్నమ్మ తదితరులు బాడంగి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలైన ఎస్ఎంబి మైలాలి, మత్స దివ్య, సీహెచ్ రాజీవ్, కర్రి కాంతారావు, పాలవలస శ్రీనివాసపరావు, కర్రి పద్మ, పైల భారతి, శిరిపురపు భారతి, నక్కేళ్ల అమరామణి, నక్కేళ్ల భారతి తదితరులు బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నారు. సీసీ కెమోరాలు పరిశీలించిన పోలీసులు.. డిపో నుంచి పది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన బస్సు ఆ సమయాన్ని కలిపేందుకు అతివేగంగా బస్సును నడిపిన డ్రైవర్ రోడ్డు మలుపులో లారీని ఢీకొట్టిన బస్సు బస్సులోని 60 మందిలో 50 మందికి గాయాలు సాయం కోసం ప్రయాణికుల ఆర్తనాదాలు 9 మందిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలింపు మిగిలిన వారికి బాడంగి, రామభద్రపురం ఆస్పత్రుల్లో చికిత్స బస్సు డ్రైవర్పై కేసు నమోదు ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న డ్రైవర్ పాలకొండ తిరుపతి, కండక్టర్ చిన్నమ్మి -
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లే వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గడిచిన 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. జననేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రజల పార్టీగా వైఎస్సార్సీపీ రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో, అన్యాయంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు, అక్రమ కేసులు బనాయించిన పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం అనిర్వచనీయమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లోను పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించాలని సూచించారు. స్వచ్ఛంద రక్తదాన, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
క్వారీ అనుమతుల రద్దుకు డిమాండ్
● క్వారీ వద్ద కొండకరకాం గ్రామస్తుల ఆందోళన విజయనగరం రూరల్: మండలంలోని కొండకరకాం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న క్వారీలకు వెంటనే అనుమతులు రద్దు చేసి, గ్రామాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదాయార్జన కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై నిరసన గళం వినిపించారు. సర్వే నంబర్ 198లో రెండు క్వారీలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. క్వారీ నిర్వహణవల్ల కొండ పైభాగంలో ఉన్న ఉమామహేశ్వరస్వామి దేవాలయం దెబ్బతింటుందన్నారు. రూ.30లక్షల విరాళాల సొమ్ముతో ఆలయానికి నిర్మించిన రోడ్డు మూసుకుపోతుందన్నారు. క్వారీకి వెనుక భాగాన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందని తెలిపారు. గ్రామంలో ఎటువంటి చెరువులు లేకపోవడంతో కొండకు ఆనుకుని ఉపాధిహామీ పనులు చేపడుతున్నామని, క్వారీ ఏర్పాటైతే ఆపని దొరికే పరిస్థితి లేదని వాపోయారు. పంచాయతీ పాలకవర్గం, ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్షంగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కిలారి రమ్య, భోగాపురపు ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పాండ్రంకి గౌరినాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు కిలారి రాంబాబు, ఆదినారాయణ, టీడీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. క్వారీ ఏర్పాటుచేసే ప్రదేశం వద్ద కొండకరకాం గ్రామస్తుల ఆందోళన -
దేవదాయశాఖ జాతరలో పోలీసుల పెత్తనమా..?
రాజాం: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి వందవ జాతరను ఆసరగా తీసుకున్న పోలీస్బాస్ వసూళ్లపై విచారణ ప్రారంభమైంది. దేవదాయశాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా జాత రకు వచ్చిన చందాలు, బలవంతపు వసూళ్లపై వివరాలు సేకరణ ప్రారంభించారు. రాజాం పట్టణ సర్కిల్ పోలీస్ అధికారి దందాపై ఈనెల 11న ‘అశోకవనంలో భక్షక భటుడు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి దేవదాయశాఖ అధికారులు స్పందించారు. ఆ శాఖ డీసీ శిరీష బుధవారం రాజాం పైడితల్లి ఆలయ ఈఓ బీవీ మాధవరావును విజయనగరం కార్యాలయానికి పిలిపించారు. అక్కడ సాక్షిలో కథనానికి సంబంధించిన వివరాలపై సమీక్షించారు. దేవదాయశాఖను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు నిమిత్తం పట్టణ పోలీస్ అధికారి నగదును ఇమ్మన్న విషయం వాస్తవమేనని ఈఓ తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై డీసీ స్పందించి పోలీసులకు ఎటువంటి నగదు ఇవ్వవద్దని ఆదేశించారని తెలిసింది. ఈ ఏడాది ఇస్తే ఏటా ఇలానే ఇవ్వాలని అన్నారని, అంతే కాకుండా ఈ ఏడాది యాత్రకు టికెట్లు, హుండీలు ద్వారా వచ్చిన ఆదాయమే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆడంబరాలకు స్పాన్సర్లు నుంచి వచ్చిన ఆదాయం వివరాలు, జాతర పేరుతో ఇతర శాఖలు చేపట్టిన చందాలు వివరాలు వారంరోజుల్లో తెలియజేయాలని ఆదేశించారని తెలిసింది. దేవదాయశాఖకు సంబంఽధించిన జాతరలో పోలీసుల పెత్తనమేమిటని ఈఓను ప్రశ్నించారని, ఈ వ్యవహారం సీరియస్గా తీసుకుని, రాష్ట్ర దేవదాయశాఖకు తెలియజేస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరు ఒక్కోలా మొర... ఇదిలా ఉండగా రాజాం పట్టణ సర్కిల్ పోలీస్ అధికారిపై వచ్చిన కథనానికి బుధవారం కొంతమంది బాధితులు స్పందించారు. తమ గోడును వెళ్లబోస్తున్నారు. జాతరలో పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద ఓ స్వచ్ఛంద సంస్థ భక్తులకు మజ్జిగ చలివేంద్రాన్ని పెడితే అక్కడకు వెళ్లిన అధికారి 500 మజ్జిగ ప్యాకెట్లు ఇమ్మన్నారని తెలిసింది. మజ్జిగ ప్యాకెట్లు తమ వద్ద లేవంటే మజ్జిగ టిన్నులు (20 కిలోలు) ఐదు పంపించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇలా మజ్జిగ, బిర్యాణి, పులిహోర పొట్లాలు ఇచ్చిన బాధితులను కూడా పోలీసులు వదలకపోవడం కొసమెరుపు. సాక్షి కథనంతో దేవదాయశాఖ అంతర్గత విచారణ ఈఓతో డీసీ అత్యవసర సమీక్ష యాత్రకు ఎంతొచ్చింది... ఎంత వసూలు చేశారు వారంరోజుల్లో వివరాలు ఇవ్వండి రూపాయి కూడా పోలీసులకు ఇవ్వొద్దు -
మిమ్స్ విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్ మీట్లో నెల్లిమర్ల మిమ్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పత కాలు సాధించారు. ఎంబీబీఎస్ పైనల్ ఇయర్ విద్యార్థిని పల్లా ప్రమీల 100, 200 మీటర్ల పరుగులో మొదటిస్థానం.. లాంగ్జంప్లో రెండో స్థానం సాధించి వర్సిటీ ఉత్తమ అథ్లెటిక్గా నిలిచింది. ఫైనల్ ఇయర్ విద్యార్థి అద్యాస సమంత్రాయ్ డిస్క్త్రోలో మొదటి స్థానం.. జావెలిన్ త్రోలో రెండో స్థానం సాధించినట్లు పీడీ కళా వెంకటరావు తెలిపారు. వారిని కళాశాల యాజమాన్యం అభినందించింది. -
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తిబాబు సత్తా
విజయనగరం: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మార్చి 6 నుంచి జరుగుతున్న 7వ పారా బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు బ్రాంజ్ మెడల్ సాధించి సత్తా చాటాడని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మంగళవారం తెలిపారు. ఎస్.యూ. 5 కేటగిరి మెన్స్ డబుల్స్లో కర్ణాటకకు చెందిన జంషద్తో కలిసి ఆడిన సత్తిబాబు అత్యుత్తమ ప్రతిభ కనబరచి బ్రాంజ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయం వెనుక సత్తిబాబు కృషి, పట్టుదల, ధృడ సంకల్పం, నిరంతర సాధన ఉన్నాయని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగించిన సత్తిబాబును పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామి తదితరులు అభినందించారు. -
బూత్ ఏజెంట్ వివరాలు ఇవ్వాలి : ఆర్డీఓ
బొబ్బిలి: ప్రతీ పోలింగ్ బూత్కు ఒక ఏజెంటు నియమించి వారి వివరాలను ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 264 పోలింగ్ బూత్లలో ఆయా వివరాలను రెండు రోజుల్లో ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు, పరిసరాలపై ఎవరికై నా అభ్యంతరాలుంటే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు తెలియపర్చాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల ఉప తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, బీజేపీ అధ్యక్షుడు తాడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ప్రత్యేకాధికారిగా రామమోహనరావు బొబ్బిలి పురపాలక సంఘ పాలక వర్గం పదవీ కాలం గడువు తీరిపోవడంతో కొత్తగా ప్రత్యేకాధికారుల పాలనకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా బొబ్బిలి ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామోహనరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. -
రెడ్క్రాస్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ బ్లడ్ బ్యాంక్లో టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులకు అర్హత, అసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చైర్మన్ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఎంఎల్టీ, డీఎంఎల్టీ చదువుకొని, రెండేళ్లు పాటు బ్లడ్ బ్యాంక్లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రూ. 20 వేలు నుంచి రూ. 22వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9493092700, 7995435952 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. పేలుడు పదార్ధాలే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు : ఎస్పీవిజయనగరం క్రైమ్: పేలుడు పదార్ధాలు లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని నాటు తుపాకులు, లైసెన్స్ లేకుండా వెపన్స్ కలిగిన వాటి కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నాటు తుపాకుల ఏరివేత, పేలుడు పదార్ధాలు, గంజాయి, నాటు సారా నియంత్రణే లక్ష్యంగా ముందుగా గుర్తించిన గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గ్రామస్తులకు అర్ధమయ్యే రీతిలో వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. గ్రామ సందర్శనలు చేసే సమయంలో నాటు తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మ్స్ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం పరిగణించడం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలపాలని పేర్కొన్నారు.చిన్నారి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం పార్వతీపురం రూరల్: మూడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి విజయనగరం మొదటి అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ ఘటనపై మంగళవారం న్యాయమూర్తి ఎం.మీనాదేవి తీర్పు వెలువరించారు. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగువ గ్రామానికి చెందిన కిల్లక వినోద్ (20), 2021 జూన్ 11న రాత్రి సమయంలో తన తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో పకడ్బందీగా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ఈ మేరకు నిందితుడికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం కొత్తవలస: మండలంలోని అరకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళపాలెం జంక్షన్ రాజా సినిమా హాల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు సోమవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్.కోటకు చెందిన జి.లీలాహర్షవర్దన్ తన బావమరిది కంచర్ల సాయితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాజా సినిమా హాల్ వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లీలాహర్షవర్దన్, సాయి తీవ్రంగా గాయపడ్డారు. సాయి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు. గంజాయి నిందితుడి అరెస్టు విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన దాస్ తాయాసబ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్టు రూరల్ సీఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. నిందితుడు దాస్ మరొక ఐదుగురితో కలిసి ఒడిశా నుంచి విశాఖపట్నంకు కారులో గంజాయి తరలిస్తూ పోలీసులను చూసి గంజాయితో ఉన్న కారును విడిచిపెట్టి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించామని చెప్పారు. గంజాయికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
సవాళ్లను అధిగమించి మున్ముందుకు..
● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి ● రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంపాలకొండ రూరల్: ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజా మన్ననలు పొందిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలవలస స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ద్వారా తన పాలనలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం ఏ ఒక్కరూ మరువలేరని గుర్తు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగిందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకుని ఈ నెల 12న 16వ వసంతంలోకి అడుగిడుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం పాలకొండలోని వైఎస్సార్ కూడలి వద్ద గురువారం ఉదయం 10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళులర్పించనున్నట్టు తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ స్ఫూర్తిని ఘనంగా చాటాలని కోరారు. తద్వారా ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా పునరంకితం అవుదామని అన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగడదామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మన పార్టీయే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. -
నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
గజపతినగరం: పోస్టల్ సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని విజయనగరం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్పోస్టాఫీస్ కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మన ముందున్న లక్ష్యాలను చేరుకోవాలని, అలాగే పోస్టాఫీస్లో అందించే ఆధార్ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోస్టాఫీస్ ప్రగతి నివేదికను వివరించారు. కార్యక్రమంలో సబ్డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, సబ్ పోస్ట్మాస్టర్ అప్పలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై మండలిలో గళం విప్పిన ‘పెనుమత్స’
● అభినందించిన జిల్లా పౌరవేదికవిజయనగరం గంటస్తంభం: శాసనమండలి సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన కీలకమైన ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డా.పెనుమత్స సురేష్బాబు ప్రస్తావించడం శుభసూచికమని, ప్రజా సమస్యలే తన గళంగా వినిపించడం అభినందనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అతిథిగృహంలో పౌర వేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ సురేష్బాబును మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో కేన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉండడంతో విజయనగరంలో ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సురేష్బాబు మండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మెడికల్ కళాశాలకు తరలించాలని కోరడం సముచితమని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యలు, మూతపడిన భీమసింగి సుగర్స్ పునరుద్ధరణ, యువత ఉపాధి, రైతు సమస్యలపై అధికార పార్టీ నేతలు శాసనసభలో స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక నేతలు జలంత్రి రామచంద్రరాజు, దవడ కొండబాబు, పట్నాల శ్రీనివాస్, అల్లంశెట్టి నాగభూషణం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పురాల్లో ప్రత్యేక పాలన
బొబ్బిలి: జిల్లాలోని నగర, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు తెరలేచింది. నగర పాలక సంస్థలు, పురపాలికలు, నగర పంచాయతీల్లోని పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఉంటాయని కొందరు, ప్రస్తుతం ప్రజల్లో కూటమి పాలనపై వ్యతిరేకత కారణంగా ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని అధికమంది అభిప్రాయాలు వ్యక్తంచేశారు. చివరకు ప్రత్యేక పాలనకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు ఇలా... విజయనగరం కార్పొరేషన్కు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీకి అక్కడి ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహనరావును ప్రత్యేకాధికారిగా నియమించారు. అలాగే, నెల్లిమర్ల నగర పంచాయతీకి విజయనగరం ఇన్చార్జి ఆర్డీఓ వెంకటేశ్వర రావు(ఎస్సీ కార్పొరేషన్ ఈడీ)ను ప్రత్యేకాధికారిగా నియమించారు. రాజాం నగర పంచాయతీలో 11 సంవత్సరాలుగా ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎం.సుధారాణి ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. స్థానిక ఎన్నికలకు వెనుకడుగు? ఈనెల 17తో పురపాలక, నగరపాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం.. ప్రత్యేకాధికారుల పాలనకు మొగ్గుచూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఆ వ్యతిరేకత కూటమి కొంప ముంచుతుందనే భయం కూటమి నాయకులను వెంటాడుతోంది. అందుకే ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేకాధికారులపై పరిపాలన వదిలేయడం మంచిదనే ఆలోచన చంద్రబాబు అండ్కో చేసినట్టు రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసంతో.. విశ్వాసం కోల్పోయి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల్లోని సభ్యులకు పదవులు, ఆర్థిక పరమైన అంశాలను ఎరగా వేసి కూటమి నేతలు తమవైపు తిప్పుకున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కొత్త పాలక వర్గాల్లో తమ వ్యక్తులను నియమించుకున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అధికారాలను అప్పనంగా లాక్కున్నారు. ఈ దశలో ఎన్నికలకు వెళ్తే గడచిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తామువేసిన ఓటుకు విలువలేకుండా అధికార మార్పిడి చేసిన వారిపై ఓటర్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమోనన్న అనుమానాలు కూడా కూటమి నాయకులను వెంటాడుతుండొచ్చని రాజకీయ వేత్తలు చెబుతున్నారు. విజయనగరం పట్టణ ప్రత్యేకాధికారిగా కలెక్టర్కు బాధ్యతలు మిగిలిన పట్టణాల్లో జేసీ, ఆర్డీఓలకు అధికారాలు ఈనెల 17తో ముగియనున్న పాలక వర్గాల పదవీ కాలం పురాల్లో ప్రత్యేక పాలనపై ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు వెనుకంజ బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం -
‘గ్లకోమా..’ అప్రమత్తతే అసలైన రక్షణ
● జిల్లాలో గ్లకోమా వారోత్సవాలుపార్వతీపురం రూరల్: చాపకింద నీరులా విస్తరించి, కంటి చూపును కబళించే గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డా. భాస్కరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ గ్లకోమా వారోత్సవాల (మార్చి 8 నుంచి 14 వరకు) నేపథ్యంలో, మన్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా దృష్టి దోష పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గ్లకోమా లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే అంధత్వ నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. నేత్ర వైద్య నిపుణులు డా. వెంకటేష్, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణారావు రోగులకు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి నగేష్రెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక శిబిరాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించి, చూపు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. సూర్యకౌశిక్ తెలిపారు. -
రెవెన్యూ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు
టూ.. పన్నులు కడుతూ.. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా పోలీసులను ఉసిగొల్పి బెదిరించి లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసులు పెడితే రూ.2లక్షలు కట్టి బయటకు రావాల్సి ఉంటుందని చెప్పి భయపెడుతున్నారని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా.. అధికారులు, ప్రజాప్రతినిదులు కార్పొరేట్ కంపెనీలకు కార్పెట్లు పరచడానికే ఉన్నారంటూ మండిపడ్డారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నాలుగు దశాబ్దాలు వయసు గల భారీ చెట్లు, తోటలు ధ్వంసం చేస్తుంటే రెవెన్యూ, పోలీసు శాఖలు కళ్లు మూసుకుంటూ జిందాల్ అక్రమాలకు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించిన 33 మంది రైతులను ఆ భూములను తరలించకూడదని ఆదేశిస్తే వారిలో చలుమూరి రామారావు తాలూకా రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. బీరువాల్లో ముక్కిపోయిన నోటీసులను కలెక్టర్ చూడాలని, 18 మంది రైతుల భూములను దోచేస్తున్న రెవెన్యూ లీలలను డీఆర్ఓ పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్పందించకుంటే రైతుల కోసం తానే నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు.శృంగవరపుకోట: పీఓటీ అంటే పవర్ చూపించు... ఆక్రమించు.. తొలగించు... అన్న చందంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పెదఖండేపల్లి గ్రామానికి చెందిన జిందాల్ భాదిత రైతులు, ఎంపీపీ సోమేశ్వరరావు, సర్పంచ్ యాళ్ల వెంకటరమణ, ఎంపీటీసీ బోదల దేముడు సహ పలువురు రైతులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాసరావు కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. పీఓటీ రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ల భూములు జిందాల్ ఎలా లాక్కుంటుందని, మీరెలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిందాల్ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు పీఓటీ భూములు 18 మంది రైతులకు చెందిన 74 ఎకరాలను కబ్జా చేశారన్నారు. 18 మంది రైతుల పీఓటీ భూములను జిందాల్కు ఎలా విక్రయించారని, 2002లో జిందాల్కు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. నాటి నుంచి నేటి వరకూ రైతుల ఆధీనంలో ఉన్న భూములను లాక్కొని గెంటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లు ఉం -
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
పూసపాటిరేగ: రైతులంతా తాము పండించే పంటలకు సంబంధించి, ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వీటీ రామారావు అన్నారు. మండలంలోని కుమిలి గ్రామంలో మంగళవారం పర్యటించిన ఆయన..అక్కడి రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మార్చి 15వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు చేసుకుని, ఆ తర్వాత ఈ–క్రాప్ నమోదు చేసుకున్న వారి జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో రైతులు చూసుకోవాలన్నారు. పంట నమోదు చేసుకున్న వారు ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి పంట నష్టపరిహారం వస్తుందన్నారు. రైతులంతా నవధాన్యాల సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషణరావు, మండల వ్యవసాయాధికారి కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
నేత్ర సమస్యలపై అలసత్వం వద్దు
● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: నేత్ర సమస్యలపై అలసత్వం వహించరాదని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లకోమా వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్లకోమా పట్ల నిర్లక్ష్యం వహిస్తే చూపుకోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలన్నారు. మధుమేహవ్యాధి ఉన్న వారు కూడా గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటికి సంబంఽధించి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం వహించరాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ప్రొగ్రాం మేనేజర్ డాక్టర్ కె.త్రినాథరావు, చిన్నతల్లి, తారక్, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో... సర్కిల్ సార్..
సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఏమయ్యా వన్ నాట్ టూ... ఊళ్లో ఏం జరుగుతోంది? దర్పంగా అడిగారు సర్కిల్ పెద్దసార్... ఏం లేదుసార్... ఏముంటాయి.. పక్క ఊళ్లో పండగ...మర్నాడు ఈ ఊళ్లో జాతర.. ఆ డ్యూటీలు ఉన్నాయి సార్... వినయంతో చెప్పాడు కానిస్టేబుల్. ఏంటయ్యా ఊరి జనాలు పండగ చేసుకుంటే మనం ఎండలో చెమటలు కక్కుకుంటూ డ్యూటీలు చేయాలా?.. వాళ్ల బళ్లకు మనం కాపలా కాయాలా? వాళ్ల పిల్లలు తప్పిపోతే మనం వెతికి తెచ్చి ఇవ్వాలా? ముసలి ముతక జనాలను రోడ్లు దాటించాలా? ఇలా చేస్తే పేపర్లో మనపేర్లు ? ఫొటోలు వస్తాయా? ఈ పేర్లు.. ఫొటోలు ఎవరిక్కావాలయ్యా... మనకు పండగ లేదా? ఉండాలి.. మనం కూడా పండగ చేద్దాం... పోలీసుల పండగ అంటే ఎలా ఉంటుందో జనానికి.. వ్యాపారులకు చూపిద్దాం పదా అంటూ లాఠీ పట్టుకుని జీపెక్కారు. రాజాం టౌన్ సర్కిల్లో తన దందా మార్క్ చూపించి తోటి సిబ్బందినే ఆశ్చర్యపరిచారు. ● జనానికి జాతర.. ఆయనకు పండగ.. రాజాంతో పాటు చుట్టుపక్కల జాతరయ్యిందంటే చాలు రాజాం పట్టణ సర్కిల్ బాస్కు పెద్ద పండగేనట. ఇక్కడ బాగా ఆరితేరి ఉండడంతో పాటు అందరితో పరిచయాలు బాగా కలిసివస్తున్నాయి. గ్రామా దేవత పండగల్లో గుండాట, అట్టాటలు, బెల్ట్ షాపులకు అనఽఽధికార అనుమతులు ఇస్తూ ఒక్కో వ్యాపారానికి ఒక్కోరేటు వసూళ్లు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలా కుదరని చోట పెద్ద వ్యాపారులను స్పాన్సర్ల రూపంలో పిండేస్తున్నారు. అడిగేవారు, ప్రశ్నించే వారు లేకపోవడంతో ‘అశోక’వనంలో ప్రజల శోకాలు ఎవరికి వినిపించడం లేదు. భక్షక భటుడి అక్రమార్జనకు అడ్డూలేకుండా పోతోంది. ● అట్టాటకు అడ్డగోలు అనుమతులు.. అంతకాపల్లిలో ఏటా జరిగే మజ్జిగౌరమ్మ జాతర పోలీసులకు నిజమైన పండగ తెచ్చింది. పండగన్నాక జూదం లేకుంటే ఎలా.. జూదం పెట్టుకోండి.. మాకు ఓ లక్ష ఇచ్చుకోండి అంటూ పోలీస్ బాస్ ఆఫర్ ఇవ్వడంతో ఒక్క రాత్రికే లక్షల జూదం నడిచినట్టు సమాచారం. జూదం జరిగిన తీరును వీడియోల రూపంలో కొందరు నిక్షిప్తం చేసి.. ఇదంతా ఖాకీబాస్ అనుమతితోనే జరిగిందంటూ చూపిస్తుండడం గమనార్హం. రాజాం పట్టణంలో ఎటువంటి వివాదాలు వచ్చినా పోలీస్ స్టేషన్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఆ మధ్య మల్లికార్జున కాలనీలో ఓ వ్యక్తి ఇంటి జాగాను మరో వ్యక్తి ఆక్రమించి నిర్మాణాలు చేస్తే దీన్ని అడ్డుకోవాల్సిన పోలీస్ బాస్ వన్ సైడ్ వ్యవహారం నిర్వహించారు. దీనిపై బాధితుడు డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించగా, కొద్ది రోజులు నిర్మాణాలు ఆపి, ఇరు వర్గాల వద్ద ఆధారాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై మండిపడుతూ సదరు బాధితుడికి సర్కిల్ అధికారి ఏకంగా హెచ్చరికలు జారీచేశారు. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానంటూ బెదిరించడంతో బాధితుడు భయపడుతున్నాడు. ఏదైనా వివాదంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులతో పాటు రెండో వర్గాన్ని కూడా పిలిచి, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఇక్కడ బోలెడు. ఎవరైనా మొండికేస్తే పోలీస్ స్టేషన్లో పేరుబడిన కొంతమంది పాత నేరస్తులతో భయపెట్టించడం సంబంధిత అధికారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పాన్సర్ల పేరిట భారీగా దండకం పెద్ద వ్యాపారులే టార్గెట్ రాజాం టౌన్ సర్కిల్ పేరు చెబితే హడల్ అంతకాపల్లిలో అట్టాట, రూ.లక్షల్లో జూదం పోలిపల్లి పైడితల్లి జాతరలో డ్రోన్, సీసీ కెమెరాల పేరిట భారీగా వసూళ్లు రాజాం చుట్టుపక్కల జాతర అయిందంటే పండగే జూదం చట్టవిరుద్ధం... అరికడతాం రాజాం పట్టణ పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటేమాకు ఇవ్వండి... కచ్చితంగా దర్యాప్తు చేస్తాం. జాతరల్లో అట్టాటలు, గుండాట వంటి జూదాలు నిషిద్ధం. ఇలాంటివి ఎవరు చేసినా శిక్షార్హులు. అలాంటి ఆటలు ఆడినా...వాటిని ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రాఘవులు, డీఎస్పీ, చీపురుపల్లి సబ్ డివిజన్ -
రోగులను ఇబ్బంది పెట్టొద్దు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర అల్లు పద్మజ ఆదేశించారు. ఈసీజీ, స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలకు రోగులను వీల్చైర్లలో తీసుకెళ్లేందుకు వారి బంధువులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 6వ తేదీన ‘వైద్యం కోసం ‘సర్వజన’ కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకులు ఆమె స్పందించారు. వార్డుల్లో పనిచేసే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, జీడీఏలు రోగులను వివిధ పరీక్షలకు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ కోసం ఆరోగ్యశ్రీ గది వద్దకు రోగులు రాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లు వార్డుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి విజయనగరం అర్బన్: విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు సూచించారు. విజయనగరం కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘స్కూల్ హెల్త్–వెల్నెస్’ కార్యక్రమంపై ఒక రోజు ఓరియెంటేషన్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వైద్యశాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యార్థుల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వెల్నెస్ అంశాలపై అవగాహన కల్పించారు. మారు‘మోగిన’ జాతర రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, రాజాం–బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లిపైడితల్లి మారుజాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. గతనెల 22 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి శతవార్షిక జాతర నిర్వహించిన విషయం విదితమే. ఈ నెల 3న నిర్వహించాల్సిన మారుజాతర గ్రహణం కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సమక్షంలో భక్తులకు అన్నసమారాధన జరిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, ఈఓ బీవీ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు సలాది తులసీదాస్, వి.లక్ష్మణరావు, ఎ.వెంకటినాయుడు, గంది గోపి, పి.చైతన్య, పి.సురేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆరాటం.. నగరంలో పోరాటం
విజయనగరం గంటస్తంభం: విద్యకు నిలయంగా పేరొందిన విజయనగరం నిరుద్యోగ యువత కొలువుల సాధనకు ఆశల కేంద్రంగా మారింది. కొలువుల సాధనే లక్ష్యంగా పల్లెల నుంచి నిరుద్యోగ యువత నగరబాట పడుతున్నారు. చిన్నచిన్న అద్దెగదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొలువుల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో రోజంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. పార్కులు, చెట్ల కింద, మైదానాలు, గ్రంథాలయాలను చదువు వేదికలుగా మలచుకుంటూ... కలిసికట్టుగా కొలువుల సాధనకు కష్టపడుతున్నారు. చిన్నగదుల్లో పెద్దపెద్ద కలలు.. విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, మరికొన్ని చోట్ల ముగ్గురు లేదా నలుగురు కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. చదవడానికి సరైన వాతావరణం లేకపోయినా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. చిన్నగదుల్లోనే పెద్ద లక్ష్యాలతో చదువుతున్న యువత కష్టాలు.. వారి జీవిత పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా.. నగరానికి వచ్చే యువతలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలిపనులు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పిల్లలకు పంపిస్తున్నారు. నగరంలో జీవనం సులభం కాదు. అద్దె గదులు, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులు, కోచింగ్ ఖర్చులు.. ఇవన్నీ కలిపి వారికి పెద్ద భారంగా మారుతున్నాయి. ఒక పరీక్షకు అప్లై చేయాలంటే రూ.200 నుంచి రూ.500 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగ సాధన కోసం ఆర్థిక కష్టా లు భరిస్తూనే పుస్తకాలతో నేస్తం చేస్తున్నారు. పలు శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతికింద ప్రతినెలా రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఆ డబ్బులు ఇచ్చినా ఉద్యోగ సాధన శిక్షణకు ఉపయోగపడేవని, పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవికాదని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులను మోసం చేయడం చంద్రబాబుకు తగదని చెబుతున్నారు. ఉద్యోగం కోసం ఊరిని వదిలి.. మా గ్రామంలో చదువు అవకాశాలు తక్కువ. అందుకే విజయనగరానికి వచ్చి అద్దె గదిలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. అయినా ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా నిలవాలనేది నా లక్ష్యం. ప్రస్తుతం రైల్వే ఉద్యోగానికి చదువుతున్నాను. ప్రభుత్వం నిరుద్యోగభృతి ఇస్తే మాలాంటి పేద కుంటుంబాల విద్యార్థులకు ఉపయోగపడేది. – ముత్యాల తరుణ్, నిరుద్యోగి, తాటిపూడి గ్రామంగ్రంథాలయాలు, పార్కులే చదువు కేంద్రాలు రోజంతా గదుల్లో చదవడం కష్టంగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గురజాడ గ్రంథాలయం యువతకు ప్రధాన చదువు కేంద్రంగా మారింది. ఇంకొందరు ప్రశాంత వాతావరణం కోసం పెద్దచెరువు, మయూరి పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్లి చెట్లనీడలో కూర్చుని చదువుతున్నారు. గ్రూప్ డిస్కషన్స్తో ముందుకు సాగుతున్నారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సాధనే ప్రధానం గ్రామం నుంచి నగరానికి వచ్చి చిన్న గదిలో ఉంటూ చదువుకుంటున్నాం. అద్దె, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులన్నీ భారంగా ఉన్నా ఉద్యోగం సాధించాలనే ఆశతో కష్టపడుతున్నాం. మా కష్టం ఫలిస్తుందనే నమ్మకం ఉంది. – కె.గంగయ్య, నిరుద్యోగి, కోటబొమ్మాళి గ్రామం లక్ష్యంతో చదువుతున్నా.. కొన్నాళ్లుగా విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ప్రతిరోజు గ్రంథాలయంలో ఎక్కు వ సమయం చదువుకుంటున్నాను. ఆర్ఆర్బీ పరీక్షకు సిద్ధమవుతున్నాను. పోటీ ఎక్కువగా ఉన్నా పట్టుదలతో ముందుకు సాగుతున్నాను. – భవానీశంకర్, నిరుద్యోగి, విజయనగరం కంటోన్మెంట్ -
సెలవుపూటా శా‘శిస్తు’న్నారు
విజయనగరం రూరల్: చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోంది. పన్నులు, శిస్తులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు సెలవుపూటా శాశిస్తున్నారు. లేకపోతే సంజాయిషీ లేఖలు ఇవ్వాలని వేధిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో గత ఆదివారం పన్నులు వసూలు చేయలేదని 260 మంది పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు జారీ చేసి మంగళవారం తన కార్యాలయానికి పిలిపించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే ఉంచేశారు. చీకటి పడినా వదల్లేదు. సంజాయిషీ లేఖలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో చెట్ల కింద సెల్ఫోన్ వెలుగులోనే సంజాయిషీ లేఖలు రాసి కార్యదర్శులు డీపీఓ కార్యాలయంలో అందజేశారు. ఇదేం టార్చర్ అంటూ లబోదిబోమన్నారు. మహిళా కార్యదర్శులు అయితే తీవ్ర ఇబ్బంది పడ్డారు. తిరిగి ఇళ్లకు ఒంటరిగా వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. డిజిటల్ విధానంలో పన్ను వసూలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నా అధికారులు వినిపించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విపరీతంగా పనిభారం పెంచేశారని, ఉదయం ఏడు గంటల్లోపే గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు పరిశీలించి యాప్లలో అప్లోడ్ చేయాలని హుకుం జారీ చేశారని, ఆ తర్వాత కార్యాలయంలో విధులు, ఆ తర్వాత పన్నుల వసూలు బాధ్యతలు అప్పగించారని అయినా అష్టకష్టాలు పడుతూ పనిచేస్తున్నామని గగ్గోలు పెట్టారు. తమకు పైనుంచి ఒత్తిడి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారని, ఒక్కోరోజు పన్నులు వసూలు కాకపోతే తామేం చేస్తామని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. సర్కారు తీరును దుయ్యబడుతున్నారు. -
పోలీసుల అదుపులో బంగారం దొంగ
చికెన్విజయనగరం క్రైమ్: నిద్రిస్తున్న వదిన మెడలో బంగారాన్ని దొంగిలించిన మరిదిని విజయనగరం టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి టుటౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయఘడకు చెందిన బుడుపూరు మణికంఠ సుబుద్ది ఈ ఏడాది జనవరి 10న విజయనగరంలోని తన అన్న బుడుమూరు రామారావు ఇంటికి వచ్చాడు. కొద్ది రోజులు మంచిగానే ఉన్న మణికంఠ అదే నెల 25న నిద్రిస్తున్న వదిన మెడలోనుంచి పుస్తెలతాడు, నల్లపూసలను దొంగిలించి పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం పట్టుబడ్డాడు. సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. గంజాయి నిందితుడు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గంజాయి నిందితుడిని విజయనగరం రూరల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 2020లో దాదాపు 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రూరల్ సీఐ లక్ష్మణరావు, క్రైమ్ పార్టీ సిబ్బంది వెతుకుతుండగా.. ఎట్టకేలకు పట్టుకున్నారు. -
పశువుల అక్రమ రవాణా అరికట్టాలి
● కాంగ్రెస్ నాయకులుపార్వతీపురం రూరల్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, నాయకులు కోలా కిరణ్కుమార్, సిరిసిపల్లి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశువుల అక్రమ రవాణాపై గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అడ్డాపుశీల, పార్వతీపురం, పరశురాంపురం, గుమడ ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు నిత్యం పశువుల తరలింపు జరుగుతోందన్నారు. జంతుహింస నివారణ చట్టం–1960 నిబంధనలను పాటించడం లేదని, వాహనాల్లో కనీస వసతులు కల్పించకుండా మూగజీవాలను తరలిస్తున్నారని ఆరోపించారు. పశువైద్య ధ్రువీకరణ పత్రాలు లేకుండా, రాత్రి వేళల్లో రహస్యంగా రవాణా సాగుతోందని వివరించారు. అధికారులు స్పందించి తనిఖీలు ముమ్మరం చేయాలని కోరారు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
● కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డివిజయనగరం కలెక్టరేట్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో 190 వినతులు రాగా.. అందులో 108 రెవెన్యూ సంబంధిత సమస్యలే కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 108 వినతులు రాగా.. డీఆర్డీఏకు 25, పంచాయతీరాజ్కు 18, మున్సిపల్కు 5, విద్యుత్కు 1, హౌసింగ్కు 1, డీఎంహెచ్ఓకు 8, గ్రామ సచివాలయ శాఖకు 5, విద్యాశాఖకు 3, ఇతర శాఖలకు సంబంధించి 16 వినతులు అందాయని చెప్పారు. పీజీఆర్ఎస్ పురోగతిని ప్రతి వారం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులను కలిసి, మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్టులో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐ అక్రమాలపై ఆరా!
చీపురుపల్లి: చీపురుపల్లి ఎస్ఐ అవినీతి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. సాక్షాత్తూ పోలీస్శాఖ అత్యున్నత కార్యాలయమైన డీజీ కార్యాలయం నుంచి అంతర్గత విచారణ జరుగుతోంది. మరోవైపు సబ్ డివిజిన్ స్థాయిలోనూ దర్యాప్తు ప్రారంభమైంది. రోడ్డుపై తోపుడుబళ్లు నిర్వహించుకునేవారు, చిరువ్యాపారులు, వివిధ కేసులపై స్టేషన్కు వచ్చే పేదలు, రాజకీయనాయకుల నుంచి, అమ్మవారి జాతర్లో పట్టాట, గుండాటను ప్రోత్సహిస్తూ రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు కేరాఫ్గా మారాన్న అపవాదు ఉంది. ఇదే విషయంపై ‘పోలీస్ దందా’ ‘శీర్షిక’న ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్ఐ తీరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఎస్ఐ గ్యాంగ్లో బీపీ పెరిగింది. ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఎస్ఐ పై విచారణ జరుగుతుండడంతో ఆయన బాధిత వర్గం సంతోషపడుతున్నట్టు సమాచారం. ప్రజల సంగతి పక్కన పెడితే పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది కూడా ఆయన వేధింపులు తట్టుకోలేక, ఉన్నతాధికారులకు చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఎస్ఐ తీరుపై పోలీస్ ఉన్నతాధికారుల దర్యాప్తు ను స్వాగతిస్తూ, అరాచకాలు, అక్రమాలపై తమ కు తెలిసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి, ఇంటలిజెన్స్ వర్గాలు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. జాతరలో జూదంను ప్రోత్సహించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి ఉదంతాలు కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. తోపుడుబళ్లు, చిరువ్యాపారులు, పలువురు రాజకీయనాయకుల నుంచి ఎస్ఐ వసూళ్ల వివరాల సమాచా రం సేకరించినట్టు బోగట్టా. నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దు విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖలో నోటిఫికేషన్ లేకుండా స్టాఫ్నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వందల మందికి ఎన్హెచ్ఎం ఉద్యోగినంటూ కిరణ్ అనే వ్యక్తి ఫోన్చేసి మోసంచేస్తున్న యత్నంపై డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి స్పందించారు. ‘దగా చేసే యత్నం..!’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ వైద్యారోగ్యశాఖలో ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగడంలేదన్నారు. ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా వస్తున్న నకిలీ కాల్స్, మెసేజ్లు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే అస్సలు నమ్మవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అధికారక సమాచారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికార వెబ్సైట్లలో ప్రకటిస్తామని తెలిపారు. చీపురుపల్లి ఎస్ఐ తీరుపై డీజీ ఆఫీస్ నుంచి విచారణ.. ఎస్బీ, ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచార సేకరణ చిరువ్యాపారులు, తోపుడుబళ్ల నిర్వాహకుల నుంచి వసూళ్ల వివరాల సేకరణ -
పొట్టిశ్రీరాముల త్యాగం మరువలేనిది
విజయనగరం టౌన్: ప్రత్యేక రాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కొనియాడారు. మండల పరిధిలోని జొన్నగుడ్డి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఆమె సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కేటాయించి, ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచిన గొప్ప పోరాటయోధుడు పొట్టిశ్రీరాములు అని, ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరజీవిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రొగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్ పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో పొట్టి శ్రీరాముల విగ్రహాలు 58 ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, విగ్రహ దాత గూడూరు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం: రెవెన్యూ క్లినిక్లో తెలియజేసిన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ ఎస్. దిలీప్చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఎజెంటిక్ ఏఐ’ వర్క్షాప్ విజయనగరం అర్బన్: పట్టణంలోని గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏపీఎంఎస్ఎంఈ, జేఎన్టీయూ జీవీ సంయుక్తంగా గత నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘ఏజెంటిక్ ఏఐ’ వర్క్షాపు సోమవారంతో ముగిసింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్న ర్యాంప్ పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక కృత్రిమ మేధస్సు నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. 20 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజాప్రసన్నకు ఉత్తమ మహిళా పురస్కారం విజయనగరం: జిల్లా కేంద్రంలోని ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ సముద్రాల గిరిజాప్రసన్నను ఉత్తమ మహిళా పురస్కారం వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం 20 మంది మహిళలకు ఈ అరుదైన గౌరవం దక్కగా గడిచిన 23 ఏళ్లుగా ఉపాధ్యాయ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను తనకు ఈ గుర్తింపు లభించినట్లు గిరిజాప్రసన్న తెలిపారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: పీజీఆర్ఎస్లో ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ సి. యశ్వంత్కుమార్ రెడ్డి , డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ అర్జీని వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత మీదే పరిపాలన ఆదారపడి ఉంటుందన్నారు. ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపితే అర్జీదారుల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోల గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన బీటీ రహదారి నిర్మాణ పనులు పూర్తిగా చేపట్టాలని గ్రామస్తులు సురేష్ కుమార్, తదితరులు వినతిపత్రం అందించారు. ● మక్కువ మండలం బురదగెడ్డ గ్రామంలోని ఐటీడీఏ ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గ్రామానికి చెందిన డి. లక్ష్మి కోరుతూ అర్జీ అందజేశారు. ● పార్వతీపురం పట్టణంలోని మజ్జిగౌరీ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ రహదారి మధ్యలో ఉండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని పట్టణానికి చెందిన కేబీకే ప్రసాద్ అర్జీ సమర్పించారు. ● పదో తగరతి మార్కుల లిస్ట్లో ఇంటిపేరు తప్పుగా పడిందని..రైతుభరోసా డబ్బులు జమకాలేదని.. పాస్పుస్తకాల్లో మార్పులకోసం..భూ ఆక్రమణలను అరికట్టాలని పలువురు అర్జీలు అందజేశారు. -
హిట్ అండ్ రన్ వాహనం పట్టివేత
రామభద్రపురం: ఈ నెల ఒకటో తేదీన ఓ వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనాన్ని సంఘటన స్థలంలో పడి ఉన్న చేపల ట్రే ఆధారంగా తొమ్మిది రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు. వాహనానికి సంబంధించి విరిగి పడి ఉన్న నంబర్ ప్లేట్ ముక్కలు, చేపలతో ఉన్న ట్రే ఆధారంతో పాటు సాంకేతికతను ఉపయోగిస్తూ ఎస్సై వి. ప్రసాదరావుతో కూడిన పోలీసు బృందం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాహనాన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్స్టోరేజ్ వద్ద ఈ నెల ఒకటో తేదీ వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో బాడంగి మండలం వాడాడకు చెందిన కల్లూరి బైరాగి మృతిచెందిన సంఘటన తెలిసిందే. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం సాలూరుకు చెందిన జి. సాయికుమార్దిగా పోలీసులు గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న చేపల ట్రే ఆధారంగా పోలీసులు గజపతినగరం, సాలూరు, దత్తిరాజేరు, తదితర గ్రామాల్లో చేపల విక్రయదారులను విచారించి, సాయికుమార్ను అనుమానితుడిగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే సాయికుమార్ను ప్రశ్నించగా.. ప్రమాదానికి తానే కారణమని అంగీకరించాడు. -
గ్రంథాలయాలు, పార్కులే చదువు కేంద్రాలు
విజయనగరం గంటస్తంభం: విద్యకు నిలయంగా పేరొందిన విజయనగరం నిరుద్యోగ యువత కొలువుల సాధనకు ఆశల కేంద్రంగా మారింది. కొలువుల సాధనే లక్ష్యంగా పల్లెల నుంచి నిరుద్యోగ యువత నగరబాట పడుతున్నారు. చిన్నచిన్న అద్దెగదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొలువుల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో రోజంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. పార్కులు, చెట్ల కింద, మైదానాలు, గ్రంథాలయాలను చదువు వేదికలుగా మలచుకుంటూ... కలిసికట్టుగా కొలువుల సాధనకు కష్టపడుతున్నారు. చిన్నగదుల్లో పెద్దపెద్ద కలలు.. విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, మరికొన్ని చోట్ల ముగ్గురు లేదా నలుగురు కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. చదవడానికి సరైన వాతావరణం లేకపోయినా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. చిన్నగదుల్లోనే పెద్ద లక్ష్యాలతో చదువుతున్న యువత కష్టాలు.. వారి జీవిత పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా.. నగరానికి వచ్చే యువతలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలిపనులు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పిల్లలకు పంపిస్తున్నారు. నగరంలో జీవనం సులభం కాదు. అద్దె గదులు, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులు, కోచింగ్ ఖర్చులు.. ఇవన్నీ కలిపి వారికి పెద్ద భారంగా మారుతున్నాయి. ఒక పరీక్షకు అప్లై చేయాలంటే రూ.200 నుంచి రూ.500 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగ సాధన కోసం ఆర్థిక కష్టాలు భరిస్తూనే పుస్తకాలతో నేస్తం చేస్తున్నారు. పలు శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతికింద ప్రతినెలా రూ.3వేలు ఇస్తా మని హామీ ఇచ్చారు. కనీసం ఆ డబ్బులు ఇచ్చినా ఉద్యోగ సాధన శిక్షణకు ఉపయోగపడేవని, పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవికాదని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులను మోసం చేయడం చంద్రబాబుకు తగదని చెబుతున్నారు. రోజంతా గదుల్లో చదవడం కష్టంగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గురజాడ గ్రంథాలయం యువతకు ప్రధాన చదువు కేంద్రంగా మారింది. ఇంకొందరు ప్రశాంత వాతావరణం కోసం పెద్దచెరువు, మయూరి పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్లి చెట్లనీడలో కూర్చుని చదువుతున్నారు. గ్రూప్ డిస్కషన్స్తో ముందుకు సాగుతున్నారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. గ్రామాల నుంచి నగరానికి వస్తున్న యువత ఉద్యోగ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగులు పార్కులు, గ్రంథాలయాలే చదువుల వేదికలు ఇరుకు గదుల్లో పుస్తకాలతో కుస్తీ వివిధ సంస్థల్లో శిక్షణ గురజాడ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత -
14న జాతీయ లోక్అదాలత్
విజయనగరం: జాతీయ లోక్అదాలత్ను ఈ నెల 14న విజయనగరం హనుమాన్ నగర్లోని ఎంఆర్ పీజీ కళాశాల హాస్టల్ ప్రాంగణంలో నిర్వహిస్తామని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్అదాలత్లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్టు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ తగదాలు, కార్మిక సంబంధిత కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే లోక్అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ సిబ్బంది ‘చేయూత’ విజయనగరం క్రైమ్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి పోలీస్ సిబ్బంది అండగా నిలిచారు. ‘చేయూత’ కింద సేకరించిన రూ.1,47,800లను చెక్కురూపంలో కానిస్టేబుల్ భార్య దమయంతికి అదనపు ఎస్పీ సౌమ్యలత తన కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.లలిత, అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. హమాలీల సమస్యలు పరిష్కరించండి నెల్లిమర్ల: జిల్లాలోని విద్యుత్స్టోర్స్లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్ స్టోర్స్ హమాలీస్ యూనియన్ (సీఐటీయూ) సభ్యులు ఏపీ ఈపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.పృద్విరాజ్కు విన్నవించారు. యూనియన్ నాయకులు కెల్ల గోవిందరావు, ఎ.భాష తదితరులు విశాఖపట్నంలో సోమవారం ఎం.డిని కలిశారు. ఏపీ ఈపీడీసీఎల్ కంపెనీ పరిధిలోని ఐదు జిల్లాల జట్టు కార్మికుల లోడింగ్, అన్లోడింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించాలని, సోర్స్ సిబ్బందికి ఉద్యోగభద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఎస్ఎస్ఆర్ రేట్లు 50 శాతం పెంచి, లోడింగ్, ఆన్ లోడింగ్ బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ● మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవ వేడుకల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. వలసలు అరికట్టడమే లక్ష్యం విజయనగరం ఫోర్ట్: వీబీ–జీ రామ్జీ కింద పనులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో వీబీ–జీరామ్జీ చట్టంపై రూపొందించిన అవగాహన వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఏటా ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధిహామీ కల్పిస్తామన్నారు. పనిచేసిన 15 రోజుల్లోగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేతనం జమచేయాలని, పనికోరిన 15 రోజుల్లో పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) జీపీఎస్ మొబైల్ యాప్ల ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారదాదేవి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చిన్నచూపు తగదు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధుల కేటాయింపులో చిన్నచూపు తగదంటూ ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు, రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఖండాపు ప్రసాద్, బంటుదాసు, ఎం.కృష్ణమూర్తి, రెడ్డి రమణమూర్తి తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతో పాటు తోటపల్లి నిర్వాసితులకు అందాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. జంఝావతి, జంపరకోట, ఆడారుగెడ్డ, వనకాబడి గెడ్డ వంటి చిన్న తరహా ప్రాజెక్టులు కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్రంతో ఉన్న సమస్యను పరిష్కరించి జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుంటే ఆందోళనలను ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు
● ఎస్పీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాతంటే అంత అలుసా..?
విజయనగరం ఫోర్ట్: రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం.. వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నాం.. అంటూ చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కాని వాస్తవ పరిస్థితి అందుకువిరుద్ధంగా ఉంది. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి. పంట నష్టం జరిగి నెలలు గడుస్తున్నా వారికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా పాలకులు మోసం చేస్తున్నారు. కష్టం వచ్చిన వెంటనే సాయం అందిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ నష్టం జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. 776 హెక్టార్లలో పంటలకు నష్టం.. గతేడాది వచ్చిన మోంథా తుఫాన్ కారణంగా జిల్లాలో వందల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, చెరకు, ఉలవ, పత్తి, శనగ, మినుము పంటలకు సంబంధించి 776.978 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. ఇందుకుగాను రూ.1.93 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. గతేడాది అక్టోబర్ నెలలో మోంథా తుఫాన్ సంభవించింది. పంటలు కోల్పోయి ఏడు నెలలవుతున్నా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే పంటలకు నష్టం జరిగిన నెల రోజుల్లోపే రైతులకు పరిహారం అందేది. చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వివరాలు.. పంట నష్టం జరిగితే పెసర పంటకు (హెక్టారుకు) రూ. 15 వేలు చెల్లించాలి. అదేవిధంగా చెరకు పంటకు రూ. 25 వేలు, ఉలవకు రూ. 15 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వరికి రూ. 25 వేలు, శనగకు రూ.15 వేలు, పత్తికి రూ. 15 వేలు, మినుము పంటకు రూ. 15 వేలు అందించాల్సి ఉంది.నిధులు మంజూరు కాలేదు.. మోంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి రూ. 1.93 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించాం. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా మంజూరు కాలేదు. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. – వి. తారకరామారావు, వ్యవసాయ శాఖ ఎ.డి గతేడాది మోంథా తుఫాన్కు 776 హెక్టార్లలో పంటలకు నష్టం ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని వైనం వరి, మొక్కజొన్న పత్తి, పెసర పంటలకు నష్టం -
పార్వతీపురంలో వరుస చోరీలు
● రెండిళ్లల్లో బంగారం, వెండి ఆభరణాల అపహరణపార్వతీపురం రూరల్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దొంగలు పంజా విసిరారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెండు వేర్వేరు చోట్ల భారీ చోరీలకు పాల్పడ్డారు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకేఎం కాలనీలో మత్స తవిటమ్మ అనే మహిళ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న తులం బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎం. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే పట్టణంలోని చర్చి వీధిలో గల దేశెట్టి రామారావు ఇంట్లో సుమారు 4 తులాల బంగారం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీరు పశ్చిమ బెంగాల్కు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ సీఐ బి. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మాస్టర్ బ్యాడ్మింటన్ పోటీలకు పైడిరాజు
విజయనగరం: జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్లో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న పోలిపిల్లి పైడిరాజు అర్హత సాధించాడు. ఇటీవల విజయనగరం వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 50 ప్లస్ వయస్సు విభాగంలో సింగిల్స్లో రన్నర్గా నిలవగా.. డబుల్స్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో పైడిరాజును ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ మేరకు పైడిరాజును విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు పెద్దింటి త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి వి.మోహన్బాబు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం మహిళా శక్తి కదం తొక్కింది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళా పోలీసు లు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా హక్కులపై నినాదాలు చేశా రు. కోలాటాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ అధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చాణిక్య హర్ష, మేనేజర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
క్రైమ్ కార్నర్..
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినా యుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురంలో జరగనున్న వాహనాల వేలంలో పాల్గొనేందుకు విజయనగరానికి చెందిన పులప అప్పారావు శనివారం ఉదయం బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వస్తుండగా.. రాత్రి 9.30 గంటల సమయంలో అయినాడ జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవు తున్నారు. భామిని: మండలంలోని సతివాడ గ్రామానికి చెందిన పున్నాన తేజ (7) చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తేజ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కర్ర చెరువు వద్ద ఆటలాడుతూ.. చేపలు పట్టే క్రమంలో చెరువులో దిగారు. ఈక్రమంలో తేజ ప్రమాదవశాత్తూ చెరువులో కూరుకుపోయి మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన స్నేహితులు కేకలు వేశారు. దీంతో స్థానికులు చెరువులో దిగి గాలించారు. తేజను చెరువు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే తేజ మృతి చెందాడు. ఇదిలా ఉండగా తేజ తండ్రి లక్ష్మణరావు రెండేళ్ల కిందటే మృతి చెందాడు. దీంతో తల్లి జయలక్ష్మి బోరున విలపిస్తోంది. భర్త చనిపోయి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు తేజపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నానని రోదిస్తోంది. ఇక తాను ఎవరి కోసం జీవించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
షేడ్నెట్స్ ఏర్పాటులో..నత్తే నయం..!
విజయనగరం ఫోర్ట్: ఆధునాతన వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన షేడ్ నెట్ పథకం లక్ష్యానికి అనుగుణంగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ షేడ్ నెట్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపడుతున్నట్టు గొప్పగా చెప్పారు. కానీ వాటి ఏర్పాటులో శ్రద్ద చూపడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్యంలో సగం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ లక్ష్యం నేరవేరడం లేదు. స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళ)తో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీటి ఏర్పాటుకు రాయితీ లేకపోవడంతో మహిళలు ముందుకు రావడం లేదు. ఆసక్తి చూపని లబ్ధిదారులు షేడ్ నెట్ యూనిట్లను 400 –500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా రుపొందించారు. అందుకుగాను రూ.2.15 లక్షల ఖర్చు అవుతుంది. రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుందని, మిగిలిన మొత్తం సెర్ప్ ద్వారా రుణంగా ఇస్తారని గతంలో వెల్లడించారు. వీటి ఏర్పాటును కేతి అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. గతంలో 450 మంది షేడ్ నెట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. 78 మందికి ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు రావని తెలియడంతో వారు కూడా ఆగిపోయారు. వ్యయం తగ్గించినా అదే పరిస్థితి షేడ్ నెట్ వ్యయం రూ.2.15 లక్షలతో ఏర్పాటు చేయడానికి మహిళలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యయాన్ని తగ్గించారు. అయినప్పటకీ అదే పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 50 శాతం వరకు వ్యయాన్ని తగ్గించారు. 6, 10 సెంట్లు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆరు సెంట్లుకు రూ.1,04,400 లు, 10 సెంట్లుకు రూ.1,37,100 గా నిర్ణయించారు. వెలుగు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్ ద్వారా వడ్డీకి రుణాలు ఇస్తుంది. 100 యూనిట్లకుగాను ఇప్పటి వరకు 42 ఏర్పాటు చేశారు. మార్చి నెలఖారులోగా వీటిని పూర్తి చేయాల్సి ఉంది. అయితే గడువు కేవలం 23 రోజులే ఉంది. మరి శతశాతం షేడ్ నెట్స్ ఏర్పాటు చేస్తారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. షేడ్ నెట్ ఏర్పాటుకు లబ్ధిదారులు రూ.34,100 భరించాల్సి ఉంటుంది. షేడ్ నెట్స్లో పండించేవి.. షేడ్ నెట్స్లో కూరగాయాలు, ఆకుకూరలు, పువ్వులు, నారు పెంచుతారు. షేడ్ నెట్లో పండించడం వల్ల అధిక ఎండ, వేడి పంటలను మొక్కలను రక్షిస్తుంది. 75 శాతం వరకు రాయితీ ఇస్తుంది. నేల నుంచి తేమ ఆవిరి కాకుండా తగ్గిస్తుంది. దీని వల్ల నీటి అవసరం తగ్గుతుంది. పక్షులు, కీటకాలు, వడగండ్ల నుంచి పంటలను రక్షిస్తుంది. కావాల్సినంత కాంతి, తేమను అందించడం ద్వారా పూలు, పండ్లు, కూరగాయాలు నాణ్యత పెరుగుతుంది. రాయితీ లేకపోవడంతో ముందుకు రాని మహిళలు 100 యూనిట్లకుగాను 42 మాత్రమే ఏర్పాటు ఇంకా 23 రోజులే గడువు42 ఏర్పాటు ఇప్పటి వరకు జిల్లాలో 42 షేడ్ నెట్స్ ఏర్పాటు చేశాం. మిగతావి కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ -
వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం
శృంగవరపుకోట : జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర కార్యాలయం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజాం – కె.వి.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి – పేడాడ రమణకుమారి, బొబ్బిలి – రొంగలి జగన్నాధం, నెల్లిమర్ల – నెక్కల నాయుడుబాబు, శృంగవరపుకోట – మాజీ ఎమ్మెల్యే కొట్టుగిల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం – తూముల భాస్కరరావు, గజపతినగరం – శోభా స్వాతిరాణిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని కేంద్ర పార్టీ కార్యాలయం సూచించింది. -
కార్డన్ సెర్చ్లో 22 వాహనాలు స్వాధీనం
విజయనగరం క్రైమ్ : విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్తో పాటు విజయననగరం వన్ టౌన్, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్వీకే చౌదరి, శ్రీనివాసరావు 150 మంది సిబ్బందితో బాలాజీ జంక్షన్ ఏరియా, జొన్నగుడ్డిలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. ప్రతీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆధార్, రేషన్, గ్యాస్, కరెంట్ బిల్లులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జొన్నగుడ్డి ప్రాంతాన్ని 14 వీధులుగా విభజించిన పోలీసులు అణువణువు గాలించారు. ఎస్ఐ లీలావతి, నవీన్ పడాల్, కనకరాజు ఐదుగురేసి కానిస్టేబుళ్లుతో బృందాలుగా విడిపోయి ఇళ్లల్లో ఉన్న వారి ఆధారాలు సేకరించారు. జొన్నగుడ్డిలో రామమందిరం వద్ద నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనంలో రెండు రోజుల కిందటే కొందరు కుర్రాళ్లు గంజాయి సేవించి పంపకాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని అలెర్ట్ చేయడంతో పాటు గంజాయి సేవించిన స్థలాన్ని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే జొన్నగుడ్డి మహిళలతో ఏఎస్పీ సమావేశమయ్యారు. మీ ప్రాంతంలోకి అనుమానితులు వచ్చినా... అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, మద్యం సేవించినా, మత్తు పదార్ధాలు రవాణ జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 22 బైక్లను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్బంధం చేశారు. ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, సారా వంటివి లభ్యం కాలేదని ఏఎస్పీ తెలిపారు. ఈగల్ టీం ఆర్ఐ టి.ధనంజయనాయుడు, విజయ్కుమార్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
అనారోగ్యంతో నాలుగో తరగతి విద్యార్థిని మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పి.టి మండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా, పచ్చ కామెర్లు వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్ను మూసింది. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు కొండగొర్రి నూకం దొర, జయశ్రీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అంజలి, కల్పన, కవితలే కాకుండా పలువురు గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకం ఏమైందో కానీ ఇప్పటి వరకు ఒక్క ఆరోగ్య కార్యకర్తను వేసిన దాఖలాలు లేవని, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో, వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తను వేసి ఉంటే ఇంత మంది గిరిజన విద్యార్థుల చావులు ఉండేవి కాదని తమ కుమార్తె జ్వరమే అనుకున్నాం కానీ పచ్చకామెర్లు వచ్చిన సంగతి గుర్తించలేక పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకాన్ని నిలబెట్టుకుంటే ఇంతమంది గిరిజన విద్యార్థులు చనిపోయేవారు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. చనిపోయిన విద్యార్థిని సాయి సార్విని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
వలపు వల నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: ఫేస్బుక్లో పరిచయంతో ఓ యువకుడికి గాలం వేసి, బంగారు చైన్ను దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తంపురానికి చెందిన పాండ్రంకి కిరణ్, ఉష భార్యాభర్తలు. భర్త కిరణ్ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ను పరిశీలించి, ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు యువతిగా నమ్మించి మెసేజ్లు చేస్తారు. వారితో పరిచయం పెరిగాక దగ్గర ఉండి తన భార్య ఉషతో వాట్సాప్కాల్ మాట్లాడిస్తాడు. ఆ ట్రాప్లోనే భీమిలికి చెందిన వెలవలపల్లి సాయిరమేష్ (28) అనే కుర్రాడు చిక్కుకున్నాడు. సాయిరమేష్తో వాట్సాప్ కాల్లో ఉష తరచూ మాట్లాడేది. ఆమె కోరిక మేరకు గతనెల 14న జామి మండలం అలమండ సంత వద్దకు వెళ్లాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఉష, కిరణ్తో పాటు ప్రసాద్, జామికి చెందిన బోని ఎర్నిబాబుతో కలిసి ఒక్కసారిగా రమేష్పై దాడిచేశారు. తన భార్యకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్చేసి వేధిస్తున్నాడంటూ స్థానికులను నమ్మించి బలవంతంగా బైక్పై రమేష్ ను భీమసింగివైపు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించారు. మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను బలవంతంగా తీసుకొని, అదనంగా మరో రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ భయపెట్టారు. యువకుడు తేరుకుని తన తప్పులేదని భావించి మార్చి 3న జామి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వై.వీర జనార్దన్ కేసునమోదు చేసి, ఫేస్బుక్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి మొబైల్, పల్సర్ బైకు, బంగారం చైన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురికావద్దని ఆమె హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, జామి ఎస్ఐ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
కొత్తవలస : మండలంలోని కొత్తవలస – విజయనగరం రహదారిలో అర్ధన్నపాలెం గ్రామ జంక్షన్ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి(38) అక్కడికక్కడే మృతి చెందాదు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి కొత్తవలస ప్రాంతంలో సర్వీసు చేసుకొని మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు అర్ధన్నపాలెం జంక్షన్ సమీపంలో ఆటోను ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం, ఆటో పూర్తిగా నుజ్జయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరదేశి తుళ్లిపడి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 వాహనానికి ఫోన్ చేయగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. సుమారు అర్ధ గంటకు పైగా క్షతగాత్రుడు రోడ్డుపై ఉండిపోయి అధిక రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య శశి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె రేష్మ, మూడో తరగతి చదువుతున్న జైరామ్ ఉన్నారు. భార్య రేష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు. -
రూ.49 కోట్లతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి
రామభద్రపురం: జిల్లాలోని రూ.49 కోట్ల అంచనాలతో సీహెచ్సీ భవనాల నిర్మాణాల పనులతో పాటు ఆధునీకరణ పనులు, ఆయుష్ భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ నాగిరెడ్డి భారతి అన్నారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్ భవన నిర్మాణ పనులు శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎస్.కోట, భోగాపురం, నెల్లిమర్ల, బాడంగి, గజపతినగరం తదితర ప్రాంతాలలో రూ.46.78 కోట్లతో సీహెచ్సీ భవనాలు నిర్మాణాలు జరగుతున్నాయన్నారు. వీటిలో పలు చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది చోట్ల ఆయుష్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని పీహెచ్సీల ఆవరణలో నిర్మాణం చేపడుతున్న ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, వేరే ప్రాంతాలలో నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.30 లక్షలు చొప్పున్న నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పరిశీలించి నాణ్యత ఉండేలా చూడాలని సంబంధిత డీఈ ప్రసన్నకుమార్కు సూచించారు. ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ భారతి -
మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆండ్ గ్రీవెన్స్సెల్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మహిళాశక్తి అని అన్నారు. ఏ పనినైనా ధైర్యంగా చేయాలని, కష్ట, నష్టాలను పోరాటపటిమతో ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని అన్నారు. సీ్త్ర ఎల్లప్పుడు సూర్యునిలా ప్రకాశవంతంగా ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అలాగే విశ్వవిద్యాలయం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రిజిస్ట్రార్ జి.జయసుమ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన విశాఖ జిల్లా కన్జూమర్స్ డిస్పూట్స్ రెడ్రస్సుల్ కమిషన్ సభ్యులు రహీమున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యా ర్థినులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు వి.లక్ష్మి, ఎం.రమ్య, బి.దేవి మాధవి, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
● అన్నింటా ‘ఆమె’..
‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా!’ అని సమాజంలో మహిళల ప్రస్తుత పాత్రను వర్ణించాడు ఓ సినీ కవి. అంతగా శ్రమిస్తున్నా, ఆమెలో అలుపు రాదు.. చిరునవ్వు తప్ప! ఆమె నడిచే దారంతా వెలుగులు పూస్తాయి. అమ్మగా.. భార్యగా.. తోబుట్టువుగా.. బిడ్డగా.. ఓ కుటుంబానికి దారి దీపం ఆమె. సమాజంలో ఏ పాత్ర అయినా తనకు కొట్టిన పిండే. ఆమె లేని చోటు లేదు.. ఆమె చేయని పని లేదు.. ఆమె లేకుండా ఈ జగతే లేదు! అవనిని మోసే భూమాత సీ్త్ర. నేడు మహిళా దినోత్సవం. ఆమె గురించి ఈ ఒక్క రోజు కాదు.. ఏడాదంతా కేటాయించినా తక్కువే. అటువంటి ‘అతివ’రథ మహారథులందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుదాం. – రామభద్రపురం/సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
సర్వేత్రా ఆందోళన..
విజయనగరంఅతివ దుఃఖీభవ..! ● సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్లలో కనీసం 70 శాతం మందికి గ్రేడ్–1 ప్రమోషన్ ఇవ్వాలి. ● గ్రామ సర్వేయర్ పోస్టుకు ఉన్న అర్హతను పెంచి ఐటీఐ స్థానంలో డిప్లమో లేదా బీటెక్(సివిల్) అర్హతగా నిర్ణయించాలి. ● రీ–సర్వేలో సాంకేతిక పనులు నిర్వహిస్తున్నవారికి టెక్నికల్ అలెన్స్ ఇవ్వాలి. ● ఫీల్డ్లో చేసే పనులకు టీఏ, డీఏతో పాటు ఇతర ఫీల్డ్ అలవెన్సులు చెల్లించాలి. ● ఏడేళ్ల సర్వీసు పూర్తయితే ఉద్యోగోన్నతలు కల్పించాలి. ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026విజయనగరం గంటస్తంభం: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్ల కలెక్టరేట్ వేదికగా ఆందోళనకు దిగారు. రెండోరోజు శనివారం కూడా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్ లోపల ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించిన సర్వేయర్లను పోలీసులు అడ్డుకొని బయటకు నెట్టివేయడంతో ప్రధాన ద్వారం వద్దే ధర్నా కొనసాగించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఇద్దరు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడంపై సర్వేయర్లు మండిపడ్డారు. కారణం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం మిగతా సర్వేయర్లను భయపెట్టడానికేనంటూ ఆరోపించారు. జిల్లాలో మొత్తం 478 మంది గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఉన్నారని, ఇద్దరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. సస్పెండ్ చేయాలంటే అందరినీ చేయండి.. ఇద్దరిని బలిపశువులుగా చేయడం తగదని, తక్షణమే సస్పెన్షన్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మేము కూడా ప్రభుత్వంలో భాగమే.. ప్రభుత్వ ఉద్యోగులమే అని, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే సోమవారం చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సర్వేయర్ల డిమాండ్లు ఇవే... మహిళలకు చంద్రబాబు సర్కార్ శఠగోపం ‘పథకం’ ప్రకారం మోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ వీడని ఆవేదన సస్పెన్షన్తో భయపెడతారా? టమాటా పంట కొనుగోలుకు చర్యలు కూరగాయల రైతులతో ముఖాముఖి రైతు బజారులో విక్రయాలకు ఏర్పాట్లు రామభద్రపురం: రైతులు పండించిన టమాటా పంటను రైతు బజారు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసేందుకు బొబ్బిలి మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు చేపట్టారు. టమాటా పంటకు మార్కెట్లో ధర లేకపోవడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 6వ తేదీన ‘రైతన్నకు కూర‘గాయాలు’ అనే శీర్షికన ‘సాక్షి’ లో ప్రచురితమైన వార్తకు వ్యవసాయమార్కెట్ కమిటీ కమిషనర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏఎంసీ కార్యదర్శి కాళేశ్వరరావు, సూపర్వైజర్ తిరుపతిరావు రామభద్రపురానికి చెందిన కోట సోములు సాగుచేస్తున్న టమాటా పంటను శనివారం పరిశీలించారు. పంటను కోయకుండా వదిలేయడం చూసి అవాక్కయ్యారు. విజయనగరం రైతు బజారు వ్యాపారులు నేరుగా ఇక్కడి టమాటా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. పంటలకు ధరలు లేకపోవడం వాస్తవమేనన్నారు. కలెక్టరేట్ వద్ద సర్వేయర్ల నిరసన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కూటమి ప్రభుత్వం వైఖరిపై మండిపాటు కలెక్టరేట్ లోపల ధర్నాను అడ్డుకున్న పోలీసులు స్పందించకపోతే సోమవారం చలో విజయవాడ -
సివిల్స్లో సత్తా చాటిన ప్రమోద్విష్ణు
● జాతీయ స్థాయిలో 640 ర్యాంకు విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ యువకుడు నిలబెట్టాడు. రెండుసార్లు సాధించలేకపోయినా మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించి తల్లిదండ్రులతో పాటు జిల్లాకే గుర్తింపు తీసుకొచ్చాడు. కొద్ది నెలల కిందట తల్లి మరణించినప్పటకీ ఆ దుఃఖాన్ని మనసులో దిగమింగుతూ పరీక్షలకు సిద్ధమై యూపీఎస్సీలో జాతీయ స్థాయిలో 640 ర్యాంకు సాధించాడు పట్టణంలోని కామాక్షినగర్లో నివాసం ఉంటున్న పల్లి ప్రమోద్ విష్ణు. విష్ణు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విజయనగరంలోని సెయింట్జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివాడు. 6నుంచి 8వ తరగతి వరకు విజయనగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివాడు. 9, 10 తరగతులు విజయవాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడలోని గోశాల వద్ద చైనా బ్యాచ్ కళాశాలలో చదివాడు. ఢీల్లీలోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ చదివాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ఫోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు. విష్ణు తల్లిదండ్రులు స్వస్థలం గంట్యాడ మండలం కొర్లాం గ్రామం. తండ్రి పల్లిశ్రీనివాస్ గొట్లాం హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి లత గంట్యాడ మండలంలోని కొఠారుబిల్లి ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయరాలుగా పని చేసేవారు. అనారోగ్యంతో కొద్ది నెలలు క్రితం మరణించారు. ప్రమోద్విష్ణు యూపీఎస్సీలో మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాడు. ఈయనకు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని తండ్రి పల్లి శ్రీనివాసరావు తెలిపారు. విష్ణును కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. ఇదిలా ఉండగా విష్ణు సొంత గ్రామం కొర్లాంలో సందడి నెలకొంది. విష్ణు తన ప్రతిభతో గ్రామానికే కాక జిల్లాకే గర్వకారణంగా నిలిచాడని పలువురు అభినందించారు. -
దుబాయ్లో చిక్కుకున్న రేగిడి వాసి
● ఆందోళనలో తల్లిదండ్రులు రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామానికి చెందిన గుండ లావణ్యకుమార్ దుబాయ్లో చిక్కుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని జీవనోపాధి కోసం 2025 జనవరిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ వెల్డర్ పనులు చేసుకుంటూ అబుదాబిలో ఉంటున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు గుండ శ్రీను, భవానీలకు లావణ్యకుమార్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి యుద్ధ వాతావరణంతో ఇక్కడ చాలా భయంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేత పట్టుకుని గడుపుతున్నామని ఫోన్లో తెలిపాడని తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు దేశం కాని దేశంలో చిక్కుకోవడం తమకెంతో బాధకలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని అబుదాబిలో ఉన్న తమ కుమారుడుని సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేవిధంగా చూడాలని కోరారు. -
సమస్యలు చెబితే సస్పెండ్ చేస్తారా..!
విజయనగరం గంటస్తంభం: తమ సమస్యలు చెబుతామని వస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అకారణంగా సస్పెండ్ చేస్తున్నారని గ్రామ, వార్డు సర్వేయర్లు ఆందోళనకు దిగారు. అధికారులు తమపై ఒత్తిడి పెంచుతున్నారని సమస్యలు చెబుదామంటే వినకుండా తిరిగి తమపై చర్యలు తీసుకుంటున్నారని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వం మారిన తరువాత సర్వే పనులతో పాటు అనేక రకాల అదనపు సర్వేలు, ఇతర పనులు అప్పగిస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో సర్వేయర్ల యూనియన్కు చెందిన ఇద్దరు గ్రామ సచివాలయ సర్వేయర్లను సస్పెండ్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డెంకాడ మండలం డెంకాడ గ్రామ సచివాలయ సర్వేయర్ జి.లక్ష్మీప్రసాద్, నెలిమర్ల మండలం బూరాడపేట గ్రామ సచివాలయ సర్వేయర్ జి.శరత్లను ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే టి.యజ్ఞేశ్వరరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కాస్త సర్వేయర్ల ఆందోళనకు దారి తీసింది. ● ప్రశ్నిస్తే శిక్షా...? కలెక్టరేట్ వద్ద ఆందోళనలో సర్వేయర్లు మాట్లాడుతూ యూనియన్లో ఉన్న ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయడం ద్వారా మిగతా సర్వేయర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఇలా హింసించడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. తమ అసలు పని భూముల సర్వే చేయడమేనని, అయినా ఇతర శాఖలకు సంబంధించిన అనేక పనులు కూడా అప్పగిస్తున్నారని తెలిపారు. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఉద్యోగం చేయడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పెరిగినా.. వేతనాలు మాత్రం పెరగలేదని వాపోయారు. సస్పెన్షన్లు ఎత్తేయాలి.. తమ యూనియన్కు సంబంధించి ఇద్దరు సర్వేయర్లపై వేసిన సస్పెన్షన్ వేటును తక్షణమే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల చర్యలు తమలో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు. అంతకు ముందు ఉన్నతాధికారులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు సర్వేయర్ల ధర్నా సమస్యలు చెప్పనీయకుండా గొంతు నొక్కేస్తున్నారు.. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాం.. తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.. -
పీహెచ్సీల్లో సక్రమంగా సేవలు అందాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషేంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను విస్తృతం చేయాలన్నారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. ప్రతి ిపీహెచ్సీలో నెలకు 1500 మందికి సేవలు అందించాల్సి ఉండగా చాలా పీహెచ్సీల్లో నెలకు 50 శాతం కూడా సేవలు అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీడీ స్క్రీనింగ్ శతశాతం పూర్తి చేయాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సహకాలు గురించి ప్రచారం చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రసవ తేదీకి ముందుగానే ఆస్పత్రిలో చేర్చాలన్నారు. డయేరియా కేసులు వస్తే వెంటనే ఎంపీడీఓకు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. త్వరలో పశువుల మందుల విక్రయ కేంద్రాలు విజయనగరం కలెక్టరేట్: రాష్ట్రంలో పశువైద్య సేవలను మరింత చేరువ చేస్తూ, పశుపోషకులకు నాణ్యమైన, చవకైన మందులను అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి పశు ఔషధి విక్రయ కేంద్రాల ద్వారా పశువుల మందులను అందించేందుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ద్వారా జెనరిక్ మందులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, గ్రామ స్థాయిలో మహిళా సాధికారతను పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష, జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశాలను నిర్వహించారు. జిల్లాలో జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి నియోజకవర్గంలో రక్షించబడిన, నిరాశ్రయ జంతువుల కోసం యానిమల్ హాస్టల్స్ నిర్మించి, నిర్వహణను ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కై ండ్నెస్ క్లబ్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ, జెడ్పీ సీఈఓ బివి.సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, ఎఫ్ఆర్ఓ వివిఎస్ఎన్.రాజు, ఆర్టీఓ యు.దుర్గాప్రసాద్, డీఎస్పీసీఏ నోడల్ అధికారి డాక్టర్ ఎల్.విష్ణు, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: పోలీసు బ్యారెక్స్లో ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. అధికారులతో ఆయన శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని జిల్లా, మండల స్థాయి వేదికల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. అంబులెన్స్ వాహనాలను, అత్యవసర మందులను వీలైతే మహిళ వైద్యులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్, తాగునీరు ఏర్పాట్లును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు చూడాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య కళాశాలలో పీజీ అకడమిక్సెల్ ప్రారంభం విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంఽధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ అకడమిక్ సెల్ను ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవి మాధవి శుక్రవారం తెలిపారు. అకడమిక్ సెల్ చైర్మన్గా డాక్టర్ కె.వెంకటాచలం, పోగ్రామ్ కో ఆర్డినేటర్గా డాక్టర్ కె.శారద వ్యవహరిస్తారని తెలిపారు. డీఆర్ఓగా సత్తిబాబు విజయనగరం కలెక్టరేట్: జిల్లా రెవెన్యూ అధికారిగా సి.హెచ్.సత్తిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం హౌసింగ్ పీడీగా పని చేస్తూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇంతకు ముందు పని చేసిన శ్రీనివాసరావు జనవరి నెలలో ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేసీఆర్ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళి అదనంగా బాధ్యతలు చూస్తున్నారు. 15లోగా సీఎస్సీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ పార్వతీపురం: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్(సీఎస్సీ) పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంజినీరింగ్ అధికారి తమ రోజువారీ ప్రగతిని వివరించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రతీ అధికారికి ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తప్పని సరిగా చేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర–2047 క్యాలెండర్ ఆవిష్కరణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ–2047 క్యాలెండర్ను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్రెడ్డి, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో పాటు పలువురు అధికారులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో మన్యం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లా ముందంజలో ఉండాలి స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాధమిక రంగాల్లో పురోగతి కనిపించాలన్నారు. రాష్ట్ర స్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకొని క్షేత్ర స్థాయి లక్ష్యాలను చేరుకొనేందుకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ముస్తాబు గ్రామంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడానికి వినూత్నంగా ‘ఈ–టామ్టామ్’ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్ఓ హేమలత పాల్గొన్నారు. -
వేతనదారుల యాతన..!
విజయనగరం మండలం దుప్పాడలో పని చేస్తున్న వేతనదారులువిజయనగరం ఫోర్ట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి సరిగా వేతనాలందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనికి వెళితే సకాలంలో వేతన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వేతనదారులకు కోట్లాది రుపాయిలు వేతన బకాయిలు అందాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఉపాధి హామీ లక్ష్యానికే తూట్లు పడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనికి వెళ్లిన వారికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల వేతనదారులు మళ్లీ వలసబాట పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ వలసబాటేనా... ఉపాధి హామీ పథకం రాక ముందు ఉపాధి కోసం జిల్లా నుంచి హైదరాబాద్, చైన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు జిల్లా ప్రజలు వలస వెళ్లేవారు. పొరుగు జిల్లా అయిన విశాఖపట్నం కూడా వెళ్లేవారు. నెలలు, సంవత్సరాలు తరబడి అక్కడే కూలీ, నాలీ చేసుకుని అక్కడే ఉండేవారు. ఉపాధి హామీ పథకం చేపట్టిన తర్వాత కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే చంద్రబాబు సర్కార్ వైఖరి వల్ల మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. 1.07 కోట్ల పని దినాలు తగ్గింపు జిల్లాలో వేతనదారులు 6,26,094 జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు కాగా.. జిల్లాలో వేతనదారులు 6,26,094 మంది ఉన్నారు. జిల్లాలో అధికశాతం మంది వేతనదారులు నిరుపేదలే. గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు వెళ్లి వాటి ద్వారా వచ్చే వేతనంతో జీవిస్తారు. ఇటువంటి వారికి వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల వారి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో వారు కుటుంబ పోషణ కోసం వలస బాట పడుతున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలుగా అందని వేతనాలు ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి నాలుగు నెలలుగా వేతనాలు అందని పరిస్థితి. 2025 నవంబర్ నెల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. పనికి వెళ్లినా నాలుగు నెలలుగా వేతనాలు అందక పోవడంతో వేతనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 10 లక్షల పని దినాలకు సంబంధించి రూ.30 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఉపాధి హామీ వేతనదారులకు అందని వేతనాలు నాలుగు నెలలుగా ఎదురుచూపులు రూ.30 కోట్ల వరకు బకాయిలు జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు వేతనదారులు 6.26 లక్షలు పథకం పేరు మార్పుతో వేతనాలపై అనుమానం మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీ రామ్ జీగా ప్రస్తుతం ప్రభుత్వం మార్చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వీబీజీరాంజీ పథకంగా అమలు కానుంది. దీంతో 2025 సంవత్సరంలో వేతనదారులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు చెల్లింపులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత పథకంతో పని చేసినా వేతనాలు చెల్లిస్తారా.. లేదా.. అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేతన బకాయిలు నిజమే.. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వేతనదారులకు గత ఏడాది నవంబర్ నెల నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వేతనాలు నేరుగా వేతనదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ 2023 సంవత్సరానికీ... ఇప్పటకీ కోట్లాది పనిదినాలు తగ్గిపోయాయి. 2023 – 24 సంవత్సరానికి సంబంధించి 2.18 కోట్ల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.502.36 కోట్లు వెచ్చించారు. 2025 – 26సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 1.11 కోట్లు పనిదినాలు కల్పి ంచారు. ఇందుకుగాను రూ.242.64 కోట్లు వెచ్చించారు. 1.07 కోట్ల పనిదినాలు 2023–24 సంవత్సరం కంటే తక్కువగా పనిదినాలు కల్పించారు. పనిదినాలు తగ్గించడం వల్ల ఎంతో మంది వేతనదారులకు పని దొరకని పరిస్థితి. దీంతో వారికి ఉపాధి కూడా పోయింది. ఉపాధి వేతనదారుల సంక్షేమానికి పాటుపడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటలకు.. చేతలకు పొంతన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
పాలకొండ రూరల్: మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. ● ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ఈ ఏడాది 10,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 15 మండలాల పరిధిలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 99 మంది ఉన్నారు. వీరి సౌకర్యార్థం మార్కుల్లోనూ మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ● శారీరకంగా దివ్యాంగులైన విద్యార్థులకు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్ష రాయకుండా మినహాయింపు కల్పించారు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ● కంటిచూపు సరిగా లేని విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ పరీక్ష మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు రావాలి. ● వినికిడి లోపం గల వారు రెండు లాంగ్వేజ్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందాలి. ● మాట లోపం గలవారు ఒక్కో సబ్జెక్ట్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యసనా వైకల్యం గల విద్యార్థులకు ఆంగ్లం మినహా మిగిలిన సబ్జెక్ట్ల్లో 15 మార్కులు పొందాల్సి ఉంటుంది. ● ఈ తరహా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద వీల్చైర్లు, ర్యాంపులు, వైద్య పరమైన సేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సదరు విద్యార్థులు సహాయకుల కోసం (స్రైబ్) దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డీఈఓ బ్రహ్మాజీరావు -
త్వరితగతిన ఈ పంట నమోదు
డెంకాడ: రబీ సీజన్లో ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెదతాడివాడలో శుక్రవారం ఆయన పర్యటించి, సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యానవన పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, ఏడీఏ నాగభూషణరావు, ఆర్.శ్రీనివాసరావు, ఏఓ సంగీత, ఉద్యానవన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు
రేగిడి: జలవనరుల శాఖలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో శుక్రవారం కోరారు. మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జోన్ –1, జోన్ –4లకు సంబంధించి వాటర్ రిసోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. 1975లో వెనుబడిన ప్రాంతాల అభ్యున్నతికి రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, పదోన్నతులు ఆ ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు వర్తించేలా ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల వల్లే వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 1975 నుంచి ఈ ఉత్తర్వులు అన్నిశాఖల్లో అమలులో ఉన్నాయన్నారు. 2017లో గత ప్రభుత్వం 6 పాయింట్ ఫార్ములా ఫ్రెసిడెన్సియల్ ఆర్డర్ని తుంగలోకి తొక్కి, సుమారు 50 మంది ఉత్తరాంధ్ర ఇంజినీర్లను రివర్స్ చేసిందన్నారు. ఇది కేవలం జలవనరులశాఖలో మాత్రమే జరుగుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన ఇంజినీరింగ్ అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్ చేయగా, హైకోర్టులో 2019లో జడ్జిమెంట్ వచ్చిందనన్నారు. ఆ తీర్పు ప్రకారం 2017లో ఇచ్చిన అడ్డగోలు ప్రమోషన్లు రద్దుచేసి, రాజ్యాంగం ప్రకారం జోనల్ సిస్టమ్, సీనియార్టీ జాబితాలు తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ విక్రాంత్ -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
● ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ‘గిరిమిత్ర’ హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఏ.మురళీధర్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. 224 మంది గైర్హాజరు పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జంతుశాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 224 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు తెలిపారు. 5,987 మంది విద్యార్థులకు గాను 5,763 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. -
వన్యప్రాణులకు అండగా..మేమున్నాం...
పార్వతీపురం అటవీ రేంజ్ పరిధిలో అగ్నిప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్న అధికారులుపాలకొండ రూరల్: అడవుల్లో సంచరించే వన్యప్రాణులు వేసవిలో వాటి మనుగడ కోసం అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంటుంది. నీరు, ఆహారం కొరత వల్ల ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటాయి. మరోవైపు ఎండలకు చెట్లు, ఆకులు ఎండి రాలిపోతుంటాయి. కొందరు తమ స్వలాభాల కోసం అడవులను తగలబెట్టం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సమీపంలో జీవించే జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో వన్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకోవడానికి, కడుపు నింపుకోవడానికి జనావాసాల వైపు అడుగులు వేస్తుంటాయి. ఏనుగుల గుంపులు జనావాల్లోకి తరచూ వస్తుండడమే ఇందుకు నిదర్శనం.. దీనిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫైర్ లైన్స్.. ఫైర్ బ్లోయర్స్.. అడవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తే సమయంలో వాటిని అధిగమించేందుకు 3 మీటర్ల వెడల్పులో గడ్డిని చెక్కి ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ బ్లోయర్ అనే ప్రత్యేక పరికరాలు వినియోగించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానటరింగ్ సెల్లో అడవికి సంబంధించి ఒక కోడ్ను నమోదు చేస్తారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేపట్టారు. 20 చోట్ల నీటి కుంటలు.. వేసవిలో వన్యప్రాణులు తాగునీటి సమస్యతో మృత్యువాత పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చుక్కల దుప్పులు, అడవి మేకలు, కుందేళ్లు, తదితర జీవాలు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురికావడం, మృత్యువాత పడడం జరుగుతుంది. దీనిని అధిగమించేందుకు కనీస నీటివసతి లేని ప్రాంతాల్లో 20 చోట్ల సాసర్పిట్లు (నీటి కుంటలు) ఏర్పాటు చేశారు. నీటి కోసం వచ్చే జంతువులకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కుంటల్లో నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంక్లతో నీటిని నింపుతున్నారు. భద్రతకై నిఘా.. జీవరాశుల కదిలికలు ఎక్కువగా ఉన్నచోట, దాహార్తిని తీర్చుకునే ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యత కల్పించారు. వేటగాళ్ల ఉచ్చులకు చిక్కకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు వారాలకోసారి వీటిని పరిశీలిస్తున్నారు. నిరంతరం ఈ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతానికి విజుబుల్ రక్షణ అందిస్తుంది. గతేడాది చివరి నుంచి ప్రత్యేక యాప్ సహాయంతో జీవాల కదలికలు, వాటి ఆనవాళ్లు గుర్తించి ఫొటోలు తీసి విశ్లేషిస్తున్నారు. అడవి పందులు, కుందేళ్లు, పునుగు పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి మేకలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు.స్వీయ పర్యవేక్షణ.. ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని నాలుగు రేంజ్లలో మా సిబ్బంది అడవి జంతువులు, వన్యప్రాణుల రక్షణకు స్వీయ పర్యవేక్షణ చేపడుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. జీవాల దాహార్తి తీర్చేలా.. వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అటవీ సంరక్షణకు ప్రజాల సహకారం అవసరం. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి, పార్వతీపురం మన్యం 1,07,721 హెక్టార్లలో.. మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 1,07,721 హెక్టార్ల వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో చింతపండు, విప్పపువ్వు, జీడిపిక్కలు, కొండ మామిడి, ఇతర అటవీ ఫలసాయం సేకరణకు పలువురు అడవుల్లో సంచరిస్తుంటారు. వీరిలో కొంతమంది అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. -
విజ్ఞానంతో మానసిక వికాసం
వీరఘట్టం: విజ్ఞానంతోనే మానవ వికాసం సాధ్యమని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప విద్యాశాఖాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకు శాస్త్ర విజ్ఞానం ఎంతో దోహదపడుతుందన్నారు. సృజనాత్మక, నూతన ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, సెమినార్స్, క్విజ్, డిబేట్, పోస్టర్ ప్రజెంటేషన్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జి,లక్ష్మణరావు, విద్యాశాఖాధికారులు సీహెచ్ రత్నాకరరావు, జి.రవిప్రసాద్, బి.సొంబర, ఎం.ఈశ్వరరావు, కేపీ నాగమణి, పెంట రామకృష్ణ, చొక్కాపు శ్రీనివాసరావు, కె.శివ, శిర్లాపు ఉమామహేశ్వరరావు, మరడాన సంపత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో విజేతలు వీరే.. పోస్టర్ ప్రజంటేషన్లో గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె,ప్రసన్న మొదటి బహుమతి.. సాలూరు మండలం బోరబంద జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.హారిక రెండో బహుమతి, భామిని మండలం ఏపీఎంఎస్కు చెందిన ఎస్.రేష్మ తృతీయ బహుమతి పొందారు. ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో.. సాలూరు జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.భువనచంద్ర, పాచిపెంట మండల పాంచాలి జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.వంశీకృష్ణ, వీరఘట్టం మండలం రేగులపాడు కేజీవీకి చెందిన ఎం.గీత విజేతలుగా నిలిచారు. డిబేట్లో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.తేజశ్వని, వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థిని పి.సౌజన్య వరుస స్థానాల్లో నిలిచారు. క్విజ్ పోటీలో.. సీతానగరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన వై.తేజశ్వని, బి.కీర్తి, పి.అక్షయలు మొదటి స్థానంలో.. పార్వతీపురం మండలం ములగ జెడ్పీహెచ్ఎస్కు చెందిన సీహెచ్, భవిక, వై.గాయత్రి, వై.సంతోషికుమారి ద్వితీయ స్థానంలో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన బి.కావ్య, సీహెచ్.సుధీర్, బి.గుణశేఖర్ తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ విభాగం పోస్టర్ ప్రజెంటేషన్లో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన జె.కారుణ్య, సీతంపేట జీటీడబ్ల్యూఏహెచ్ఎస్కు చెందిన ఎం.హిమశ్రీ, సాలూరు ఎంపీఎల్పీఎస్కు చెందిన జి.నికేష్నందన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో.. పార్వతీపురం మున్సిపల్ ప్రైమరీ స్కూల్కు చెందిన రితిక్ రెడ్డి, జీఎల్ పురం జీటీడబ్ల్యూఏజీహెచ్ఎస్కు చెందిన ఎం.సుమతి, సాలూరు ఎంజేపీఎస్కు చెందిన వై.శరణ్య విజేతలుగా నిలిచారు. క్విజ్ పోటీల్లో.. వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థులు ఎన్.అక్షయ, ఎం,హిమశ్రీ, జేఆర్ లాస్యప్రియ మొదటి స్థానంలో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు టి.జ్ఞానశ్రీ, జి.మోక్షిత, డి.శిరీషా ద్వితీయ స్థానంలో.. పార్వతీపురం దత్తుపేట ఎంపీఎల్పీఎస్కు చెందిన ఎం.లీలాకుమార్ తృతీయ స్థానాల్లో నిలిచారు. ఘనంగా విజ్ఞాన వారోత్సవాలు -
గంజాయితో ఇద్దరి అరెస్ట్
రామభద్రపురం: మండలంలోని బాడంగి రూట్లో ఎస్సై వి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఇద్దరు వ్యక్తులు రెండున్నర కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి కుమ్మరివీధికి చెందిన గొండేల దిలీప్, గరివిడి మండలం బాగువలసకు చెందిన నడిమింటి అఖిల్ మరికొంతమందితో కలిసి సుమారు మూడేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరు గంజాయికి బానిసలు కావడంతో పాటు మరికొంతమందికి విక్రయిస్తున్నారు. ఒడిశాలోని సుంకి నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు తనిఖీలు చేపట్టగా దిలీప్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. గొండేల దిలీప్పై పెదమానాపురం పోలీస్స్టేషన్లో గంజాయి అక్రమ రవాణాపై గతంలో కేసు నమోదైంది. జాతీయ విలువిద్య పోటీల్లో గిరిజన క్రీడాకారుల ప్రతిభ పార్వతీపురం రూరల్: కేరళలో ఇటీవల నిర్వహించిన 38వ తలక్కల్ చందు మెమోరియల్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్కుమార్ రెడ్డి శుక్రవారం తన చాంబర్లో అభినందించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కాగా.. మహిళల విభాగంలో పువ్వల వసంత తృతీయ బహుమతి సాధించారు. మరో క్రీడాకారుడు దంగభద్ర పవన్కుమార్ కూడా విజేతగా నిలిచారు. గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి విజయాలు దోహదపడతాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ. విజయశాంతి, ఏపీఓ ఎ.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు. నేడు ఎస్సీ కమిషన్ సభ్యుడి రాక పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం. శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి సంతకవిటి: గడ్డిమందు తాగిన మహిళ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన టి. లక్ష్మి (60) గురువారం రాత్రి పొరపాటున ఇంటిలో ఉన్న గడ్డిమందు తాగేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతురాలి కుమార్తె రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణపల్లికి చెందిన వృద్ధురాలు.. పార్వతీపురం రూరల్: గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణపల్లి పంచాయతీకి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ఫిబ్రవరి 28న పింఛన్ తీసుకుంది. అదేరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఫించను నగదుతో పాటు ఇంట్లో ఉన్న మరికొంత నగదు దోచుకునే క్రమంలో వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన తెరీజమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. క్లూస్ టీమ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కారు బోల్తా..
గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై కిరణ్కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం మానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయరావు, రౌతు సాయిశంకర్, రౌతు చంద్రశేఖర్ తమ స్నేహితుడితో కలిసి విజయనగరం వైపు నుంచి మానాపురం కారులో వస్తున్నారు. తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో మరుపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రౌతు ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సాయిశంకర్, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్కు, మరో వ్యక్తిగి పెద్దగా గాయాలు కాలేదు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రౌతు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు -
నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి
సీతంపేట: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలకు నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు అన్నారు. జీసీసీ ద్వారా నిర్వహించే టెండర్ల ప్రక్రియలో నాణ్యమైన శాంపిల్స్ చూపించి సరఫరాలో మాత్రం కొందరు చేతివాటం చూపిస్తున్నారని అన్నారు. ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిత్యవసర సరుకుల పంపిణీకి (కంది, వేరుశనగ, ఇడ్లీనూక, మినపగుళ్లు, నూనెలు) శుక్రవారం టెండర్లు నిర్వహించారు. మొత్తం 26 సరుకుల సరఫరాకు 12 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ.. పలు ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలు సందర్శించినప్పుడు నాణ్యత లేని సరుకులు కనిపించాయన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న సరుకులు అందించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం దాసరి కృష్ణ, మేనేజర్ గొర్లె నరసింహులు, హెచ్డబ్ల్యూఓలు పాలక అమల, హెచ్.శారద, పి.రాజారావు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు -
ఈ నెల 22న బాడీబిల్డింగ్ పోటీలు
విజయనగరం: మహాబలుడు కోడి రామ్మూర్తినాయుడు స్ఫూర్తిని యువతలో కలిగించేందుకు విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఉమ్మడి విజయనగరం జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక గురజాడ కళాభారతిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక బాడీ ఫిట్నెస్ జిమ్లో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించార. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ..55 నుంచి 75 కిలోల విభాగాల్లో ఆరు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో బాడీబిల్డర్లు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు నమ్మి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ అజయ్, అసిస్టెంట్ సెక్రటరీ డి.సన్నిబాబు, ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధి నిర్వహణే ఉద్యోగులకు రక్షణ
విజయనగరం అర్బన్: ఉత్తమ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ఉద్యోగుల రక్షణకు శ్రీరామరక్షగా ఉంటుందని ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులకు గురువారం హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ ఉద్యోగులకు బలపరుస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం, యూనియన్ బలోపేతానికి ఇదే ప్రధాన మార్గమని తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తరువాత వచ్చిన మార్పులు, వాసా రూల్స్ ప్రకారం జారీ అయిన జీవోలలో ఉన్న మార్పులను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఎన్ఎంయూఏను రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 96 ద్వారా గుర్తింపు సంఘంగా ప్రకటించిందని అలాగే జీవో నెంబర్ 129 ద్వారా స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించి ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. అందువల్ల ప్రతి ఉద్యోగి సర్క్యులర్లు తెలుసుకుని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపేటప్పుడు సర్క్యులర్ ప్రకారం మెమోరాండం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి, కోశాధికారి పీవీమోహన్, జోనల్ అధ్యక్షుడు బీఎస్రాములు, జోనల్ కార్యదర్శి ప్రదీప్కుమార్, జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ తదితరులు పాల్గొన్నారు. జోన్ పరిధిలోని 18 డిపోల ముఖ్య నాయుకులు, వర్క్షాప్ నాయకులు కూడా హాజరయ్యారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ -
వీడిన రాజాం చోరీ మిస్టరీ
● చోరీ సొత్తులో 470 గ్రాముల రికవరీ ● పోలీసుల అదుపులో ఇద్దరు ● పరారీలో మరో ఇద్దరు ● ఏఎస్సీ సౌమ్యలత వెల్లడి విజయనగరం క్రైమ్ : రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లోని రెండిళ్లలో గత నెల 1వ తేదీన జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు, వారి నుంచి 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. స్థానిక డీపీఓలోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లో జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ నగేష్ దసర్వార్, జీఎంఆర్ ఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 1న చోరీకి పాల్పడ్డారని చెప్పారు. ఒక ఇంట్లో 1279 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 245 గ్రాముల ఆభరణాలు దొంగిలించుకుపోయినట్టు అందిన ఫిర్యాదుల మేరకు సంతకవిటి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారన్నారు. వీటిని ఛేదించేందుకు సీసీఎస్ పోలీసుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 12 మంది ఎస్ఐలతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సాంకేతికతతో సీసీటీవీ పుటేజ్తో చోరీకి పాల్పడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన గ్యాంగ్గా గుర్తించామని తెలిపారు. ఆ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ధార్ జిల్లాకు వెళ్లాయన్నారు. గ్యాంగ్లోని ఇద్దరు నిందితులైన ధార్ జిల్లా సర్దార్పూర్ తహశీల్, ధకన్బారికి చెందిన రక్ష ఉరఫ్ రాక్సింగ్(36), ఖనియాంబాకు చెందిన మోహన్సింగ్ దౌదావే(28)లను పట్టుకున్నామని తెలిపారు. ఈ ఇద్దరూ మళ్లీ దొంగతనం చేసేందుకు రాజాం వచ్చినట్టు అందిన సమాచారంతో బూరాడపేట జంక్షన్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి సుమారు రూ.70 లక్షల విలువ చేసే 470 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని, వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, సీసీ ఎస్ ఎస్ఐ కె.లక్ష్మణరావు, సంతకవిటి ఎస్ఐ ఆర్.గోపాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు పాల్గొన్నారు. -
ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’
విజయనగరం టౌన్: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా రవం చిత్ర నిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్ ఫిల్మ్ హౌస్ బ్యానర్పై నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. సౌండ్ ఆఫ్ సోల్ క్యాప్షన్తో ప్రశాంత్, అనుశ్రీవర్మలు హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ దర్శకత్వంలో అద్భుతంగా చిత్రం రూపుదిద్దుకుందన్నారు. నిర్మాత, సంగీత దర్శకునిగా తారక్ వ్యవహరిస్తున్నారన్నారు. నిర్మాతలుగా తారక రామారావు, కళ్యాణిలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్లుక్ టీజర్ను ఆవిష్కరించారు. నిర్మాత తారకరామారావు మాట్లాడుతూ హారర్ , థ్రిలర్స్, సస్పెన్స్తో సాగే ఈ చిత్రం ఆద్యంతం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. శ్రీగురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకులు బిఎ.నారాయణ మాట్లాడుతూ విద్యలనగరమైన విజయనగరంలో హరికథ, సంగీతంలో రాణించి సినీ ఇండస్ట్రీలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన కళ్యాణి, ఆమె సోదరుడు తారక్లు తొలిసారిగా నిర్మాతలుగా తీసిన రవం చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈపు విజయకుమార్, గెద్ద వరప్రసాద్, భోగరాజు సూర్యలక్ష్మి, థీరజ్ వజ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
కమాండెంట్ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వై.రవిశంకర్రెడ్డిని 5వ ఏపీఎస్పీ మినిస్టీరియల్ నూతన అసోసియేషన్ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జె.హరిబాబు, వైస్ ప్రెసిడెంట్ టి.తవిటినాయుడు, సెక్రటరీ కేజేవీ ప్రసాదరావు, ట్రెజరర్ బి.బాబీశ్యామిలి, జాయింట్ సెక్రెటరీ బి.గీత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఐ.భవాని, ఎం.ప్రవీణ్, వి.రోహిణి, ఎం.సీత, యు.గోవింద తదితరులు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు విజయనగరం కలెక్టరేట్: డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఇదిలా ఉండగా మెంటాడ తహసీల్దార్గా విజయ్ భాస్కర్ను నియమించారు. దత్తిరాజేరు తహసీల్దార్గా ఉన్న ఆయన గత కొన్ని నెలలుగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే. కుక్కల దాడిలో 18 మందికి గాయాలు బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడి చేసి పలువురిని గాయపరిచాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. నెలివాడలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 18 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు. కుక్కల దాడిలో గ్రామానికి చెందిన నెట్టి అనురాధ, ముడిదాన కనకమహాలక్ష్మి, పెండి అరసవల్లి, శివుడు రాజు, కోమ్మా రమ, లక్ష్మి, కె.నూకరాజు, సత్తిబాబుతో పాటు పురమనేని లక్ష్మినాయుడు ఉన్నారు. దీనిపై స్పందించిన సర్పంచ్ తాళ్లపూడి కీర్తి, ఈఓపీఆర్డీ ఎ.రఘుపతిరావు కుక్కల నుంచి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ చోరీ నిందితుల పట్టివేత నెల్లిమర్ల: పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో చోరీ చేసిన నిందితులను పట్టుకున్నట్టు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నిందితులు ఇద్దరూ జిల్లా కేంద్రంలోని లంకాపట్నంకి చెందిన మైనర్లని, వీరికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. వీరిద్దరూ మద్యానికి బానిసలుగా మారి చెడు వ్యసనాలతో దొంగతనాలు చేస్తున్నారని, వాహన తనిఖీల్లోభాగంగా ఇద్దరినీ పట్టుకున్నామని చెప్పారు. నిందితులు నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు. నిందితులు హుండీలో దొంగిలించిన సొమ్మును పూర్తిగా ఖర్చు చేశారని, వారిని కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్టు తెలిపారు. రైల్వే ట్రాక్పై మృతదేహం విజయనగరం క్రైమ్ : విజయనగరం – కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య, జొన్నవలస రైల్వేగేట్ రైల్వే ట్రాకై ్ప గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ గురువారం తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన మృతదేహం 5 అడుగుల 2 అంగుళాల పొడవు కలిగి ఉంటాడరన్నారు. చామన ఛాయ రంగుతో, నీలం రంగు గల రౌండ్ నెక్ టీ షర్టు, వైలెట్ కలర్ నిక్కర్ ధరించి ఉందన్నారు. మృతదేహం పక్కనే తెలుపు, ఎరుపు గీతల గల తువ్వాలు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వాళ్లు 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్ఐ బాలాజీరావు ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బ్యాంకింగ్ సేవల్లోని మోసాలపై చైతన్యం కావాలి
● ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో బ్యాంక్ అధికారులువిజయనగరం అర్బన్: బ్యాంకింగ్ సేవల్లో మోసాలపై ఖాతాదారులు చైతన్యం కావాలని ఆర్బీఐ మేనేజర్ ఎ.రామకృష్ణ అన్నారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు స్థానిక ప్రైవేటు హాటల్లో ఐటీఐ, కళాశాల విద్యార్థులు, బ్యాంక్ల నూతన ఖాతాదారులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిఽథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ భద్రత, బీమా పథకాలపై విస్తృ తంగా అవగాహన కల్పించారు. కేవైసీ ప్రక్రియ ప్రాముఖ్యత, బ్యాంకు ఖాతాలలో నామినేషన్ అవసరం, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలపై అధికారులు వివరించారు. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్ల లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే పద్ధతుల గురించి కూడా తెలియజేశారు. బీమా మరియు పొదుపు పథకాలైన పీఎంజేజేబీవై, అటల్ పెన్షన్ యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రయోజనాలపై కూడా పాల్గొనే వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, స్పామ్ మెసేజీలు, ఓటీపీ/డేటాషేరింగ్, అనుమానాస్పద లింక్ల ద్వారా జరిగే సైబర్ మోసాల గురించి కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీఓఎం టి.నాగార్జున, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జిజేంద్ర శర్మ, మెప్మా పీడీ జి.యు.చిట్టిరాజు, ఆర్సెట్ డైరెక్టర్ డి.భాస్కరరావు, సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రసన్నకుమార్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ ఎం.సురేష్ బాబు, ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి సదస్సులు
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ – గురజాడ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులు మెక్నో– ఎంఎం–2026, ఎలక్ట్రిక్ – 2026 గురువారం ముగిశాయి. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ – జీవీ ఉపకులపతి వి.వి. సుబ్బారావు మాట్లాడుతూ యువ విద్యార్థులు సమాజానికి వారి పూర్తి సామర్థ్యానికి సేవ చేయడానికి నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సమాజ అభివృద్ధిలో మెకానికల్ ఇంజినీరింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ కె.సి.బి.రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. జి.జె.నాగరాజు, డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమా దేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న గిరిజన విద్యార్థులు
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పీడమండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా జ్వరంతో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అనారోగ్యానికి గురైన సాయి సార్వినిని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి కుటుంబ సభ్యులు మంగళవారం తీసుకురాగా వైద్యులు పరీక్షించారు. పరిస్థితిని గమనించి చిన్నారిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అయితే చిన్నారికి సరైన వైద్యం అందడం లేదని తల్లిదండ్రులు కొండగొర్రె నూకందొర, జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కొన్నాళ్లుగా పాఠశాలకు రాకపోవడంతో సాధారణ జ్వరమేనని పాఠశాల సిబ్బంది అనుకున్నారు. ఆరా తీయగా మలేరియాగా గుర్తించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సార్వినిని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విషయమై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని గిరిజన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మండలిలో డోలపేట భూముల అంశాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ
రాజాం : పట్టణ పరిధి డోలపేట గ్రామానికి సంబంధించిన భూములు ఎన్నో ఏళ్లుగా దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రస్తావించారు. గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డోలపేట భూముల అంశాన్ని సభాధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లారు. బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేసిన అయ్యగారి పాపయ్య పంతులు 1848లో డోలపేట (అప్పటి సీతారాంపురం అగ్రహారం) గ్రామంలో ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. అయితే 1941 మరియు 1944లలో ఆస్తి రిజిస్టర్ రూపొందించినా ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని అందులో పేర్కొన్నారని తెలిపారు. 2002, 2012 సంవత్సరంలో దేవదాయ శాఖ తయారు చేసిన ప్రాపర్టీ రిజిస్టర్లో రైతుల జిరాయితీ భూమి 207.33 ఎకరాలను ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ దేవాలయం పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్దంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్మెంట్ అధికారి రైతులు, ప్రజలతో ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా, రైతులకు తెలియకుండా అనేక దిద్దుబాటులతో చట్టవిరుద్దంగా ఇందులో కొన్ని భూములకు స్వామివారి పేరున పట్టా ఇచ్చారని తెలిపారు. దేవదాయ శాఖ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్రిజిస్ట్రార్కు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతులు ఇవ్వొద్దని పురపాలక సంఘానికి ఆదేశాలు ఇవ్వడంతో వేల మంది డోలపేట గ్రామప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని డోలపేట గ్రామ ప్రజలకు భూములపై సర్వ హక్కులు కల్పించేలా చట్టం తీసుకురావాలని కోరారు. -
కార్మిక నమోదుతో ఆర్థిక భరోసా..!
విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన కార్మికులు వినియోగించుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహం, ప్రసూతి, సహజ మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించే పథకాలను అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి హామీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీలలో పని చేసే వారు, రాయి పనులు చేసే వారు, వెల్డర్లు తదితరులు రూ.110 చెల్లించి ఐదు సంవత్సరాలకు కార్మికులుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. రెన్యువల్కు మరో అవకాశం 2019 నుంచి 2025 వరకు కార్డు రెన్యువల్ చేయించుకోని కార్మికులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ.110 చెల్లించి కార్డులను రెన్యువల్ చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచించారు. కార్డు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. వివాహ కానుకగా రూ.40 వేల సాయం భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహాలకు ప్రభుత్వం రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. కార్మికుడికి లేబర్ కార్డు ఉండి వివాహ సమయానికి రెన్యువల్ అయి ఉండాలి. ఏపీ సేవా పోర్టల్ నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు కాపీలతో కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. 2026 మార్చి నుంచి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 90వేల కార్మికుల నమోదు ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీసేవా కేంద్రాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్మికులకు అవగాహన దీనికి సంబంధించి కార్మికుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్మిక శాఖాధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల విజయనగరం పెద్ద చెరువు వద్దనున్న దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వ నమోదు విధానం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు, ఏఎల్ఓ జీఎస్ఎస్కే శ్రీనివాసరావు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ బి.రమాదేవి, సిబ్బంది అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు. 18 – 60 ఏళ్ల కార్మికుల నమోదుకు సువర్ణావకాశం రూ.110తో నమోదు..కార్మికులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లేబర్ కార్డు ఉంటే పెళ్లి, ప్రసూతి, మరణానికి ఆర్థిక సాయం రెన్యువల్ చేసుకోని కార్మికులకు మరో అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 90 వేల మంది కార్మికుల నమోదుప్రసూతి సాయం భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు రెండు కాన్పులకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున సాయం అందజేస్తుంది. ఆస్పత్రి ప్రసూతి ధ్రువపత్రం, డిశ్చార్జి సర్టిఫికెట్, శిశువు జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సహజ మరణానికి రూ.60 వేల సాయం నమోదైన కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.60 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. మరణ సమయానికి కార్డు రెన్యువల్ అయి ఉండాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేయాలి. దహన సంస్కారాలకు తక్షణ సాయం మరణించిన కార్మికుడి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం రూ.20 వేల తక్షణ సాయం అందజేస్తుంది. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. -
వంగర ఏపీఓ సస్పెన్షన్
వంగర: ఉపాధి హామీ పథకం ఏపీఓ మర్రాపు సత్యవతి సస్పెండ్ అయినట్టు డ్వామా ఏపీడీ చంద్రకుమారి గురువారం తెలిపారు. విధుల నిర్వహణలో లోపాలను గుర్తించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 3వ తేదీన ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. రేగిడి ఏపీఓ ఎస్.హరినాథ్ను ఇన్చార్జి ఏపీఓగా నియమించారన్నారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో గత రెండు నెలలుగా జ్వరాల కేసులు పెరగడం, ఆస్పత్రుల కు రోగుల తాకిడి అధికమైందన్న అంశంపై ఈ నెల 4వ తేదీన ‘జిల్లాకు జ్వరమొచ్చింది ..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్యాబ్ను జిల్లా మలేరియా అధికారి ఎం.సింహాచలం గురువా రం పరిశీలించారు. జ్వరాల వ్యాప్తి, కేసుల నమోదుపై ఆరా తీశారు. మలేరియా, డెంగీ కేసుల నమోదు వివరాలను ల్యాబ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరడిలో ఘీం‘కరి’ంపు భామిని: మండలంలోని నేరడి గ్రామ సమీపంలో ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రెండు జతలుగా వీడి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక జత ఏనుగులు వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఎగువ భాగానికి వెళ్లి పంటలకు నష్టం కలిగించాయి. మరోజత బిల్లుమడ వైపు పంటపొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేశాయి. జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను స్థానికులు దారిమళ్లించే యత్నం చేస్తున్నారు. సాలూరు: జీతాలు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని, వసతులు కల్పించాలని కోరుతూ సాలూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల ధర్నాకు మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయా యాజమాన్యాలను కోరారు. -
కూరగాయాలు
రైతన్నకు ● కూరగాయల ధరలు పతనం ● నష్టాల ఊబిలో రైతన్నలు ● మార్కెట్లో ఏ ఒక్క కూరగాయకు గిట్టుబాటు ధరలేని వైనం ● కోత ఖర్చులు రాని దుస్థితి ● పంట కోయకుండా పొలాల్లో వదిలేస్తున్న రైతులు ● రైతన్న గోడును పట్టించుకోని చంద్రబాబు సర్కారు ఈ చిత్రంలో టమాటా పంటను చూపిస్తున్న రైతు రామభద్రపురానికి చెందిన కోట సోములు. ఈయన తనకున్న 50 సెంట్లలో సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెట్టి టమాటా పంటను సాగు చేశాడు. పంట దిగుబడి బాగుండడంతో సంతోషపడ్డాడు. పంట చేతికందే సరికి మార్కెట్లో ధర కిలో రూ.3లకు పడిపోవడం, పంటను కొనుగోలు చేసేవారు లేకపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఒక కూలి మనిషి రోజంతా 10 క్రేట్ల టమాటా ఏరుతుంది. వాటిని మార్కెట్లో విక్రయిస్తే రూ.500 నుంచి రూ.600 వస్తున్నాయి. కూలీకి రూ.300, రవాణా ఖర్చులు రూ.100, ఆశీలు రూ.100 పోతున్నాయి. రైతుకు మిగిలింది సున్నా. పంట సాగుచేసిన రైతు కుటుంబం ఎలా బతకాలి, పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి అంటూ రైతు గగ్గోలుపెడుతున్నాడు. కూలిఖర్చులు రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేయాల్సి వస్తోందంటూ కన్నీరుపెట్టాడు. -
ఇదేంశిక్షణ..
మెరకముడిదాం: డీఆర్డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరకముడిదాం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండలానికి చెందిన వీఓఏలు, జండర్, ఆరోగ్య కమిటీ సభ్యులకు గురువారం ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటుచేశారు. శిక్షణ కోసం సభ్యులందరూ ఉదయం 10 గంటలకే హాజరుకాగా, శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన ఇన్చార్జి ఏపీఎం గీత 11.30 గంటల వరకూ హాజరుకాలేదు. ఆమె రాకకోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సీసీలు సూర్యనారాయణ, కోటేశ్వరరావు శిక్షణను కొనసాగించారు. శిక్షణ తరగతుల నిర్వ హణపై అధికారి నిర్లిప్తతను పలువురు సభ్యులు తప్పుబట్టారు. -
మిషన్ హార్టివిజన్తో ఉద్యానసాగు విస్తరణ
విజయనగరం ఫోర్ట్: మిషన్ హార్టివిజన్ అమలుచేసి ఉద్యాన పంటల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. దీనికోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వశాఖల సమన్వయంతో సమష్టిగా కృషిచేయడం ద్వారా దీనిని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం, డీఆర్డీఏ, విద్యుత్, మార్కెటింగ్శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి పంటకు బదులు ఉద్యాన పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక మిషన్ను రుపొందించినట్టు తెలిపారు. వచ్చే ఖరీఫ్లో 6 వేల ఎకరాల్లో అదనంగా వివిధ ఉద్యాన పంటల సాగు చేపట్టడం మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. కనీసం ఐదు ఎకరాలు ఒక క్లస్టర్గా రుపొందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యానశాఖాధికారి చిట్టిబాబు, మార్కెటింగ్శాఖ ఏడీ రివికిరణ్, ప్రకృతి వ్యవసాయం మేనేజర్ ఆనందరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చిమొక్కల్లో ప్రజారోగ్యం
కొత్తవలస: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఆస్పత్రి భవన నిర్మాణాలు పూర్తిచేయడంలో జాప్యం రోగులకు శాపంగా మారింది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీటవేసింది. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఐదు పీహెచ్సీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ 8.25 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పనులు చకచకా సాగాయి. సుమారుగా 60 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయాయి. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఆధారమైన భవనాలు పిచ్చిమొక్కల నడుమ దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతున్నాయి. ఇదీ పరిస్థితి... నియోజకవర్గంలోని జామి, అలమండ, లక్కవరపుకోట, కొత్తవలస, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చొరవతో ఐదు పీహెచ్సీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవ న నిర్మాణాన్ని రూ.కోటి65లక్షల వ్యయంతో తలపెట్టారు. రోగులకు వైద్యసేవలందించేందుకు వీలుగా విశాలమైన వార్డులు, వైద్యులకు ప్రత్యేక గదులు, ఓపీ విభాగం, లేబొరేటరీ ఇలా.. ఆధునిక సదుపా యాలతో భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ భవనాల పూర్తిచేయడంలో ప్రస్తుత కూటమి ప్రభు త్వ నిర్లక్ష్యం రోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పరాయి పంచన ఆస్పత్రులు.. ప్రస్తుతం కొత్తవలస పీహెచ్సీ చెంతనే గల ఎన్జీఓ కార్యాలయంలోను, వియ్యంపేట పీహెచ్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్లో నిర్వహిస్తున్నారు. పీహెచ్సీలకు వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు లేవు. మంచాలు లేకపోవడంతో బల్లలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. చీకటి గదుల్లోను మందులను దాచుకునే దుస్థతి నెలకొంది. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షను వీడి ప్రజారోగ్యానికి అవసరమైన పీహెచ్సీ భవన నిర్మాణాలపై శ్రద్ధ చూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తి నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారి ఇ.శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కొద్దిపాటి బిల్లులు పెండిగ్లో ఉండడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, బిల్లులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆస్పత్రి భవనాల నిర్మాణా లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే గత ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – పల్లా భీష్మ, చింతలపాలెం మాజీ సర్పంచ్, కొత్తలస మండలం కూటమి ప్రభుత్వం ప్రజా రోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం కొత్తవలస ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. ఇప్పటిౖకైనా పాలకులు కళ్లుతెరిచి భవన నిర్మా ణాలు పూర్తిచేసి పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా చూడాలి. – వెంకన్నపాత్రుడు, కొత్తవలస -
మేము అప్పుచేస్తాం... మీరు వడ్డీ చెల్లించండి!
రాజాం సిటీ: ‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు మేము అప్పుచేస్తున్నాం.. దానికి అయ్యే వడ్డీ 7.5 శాతం భారాన్ని కళాశాలల యాజమాన్యాలే భరించాలి.. అలా అయితేనే 2024–25 సంబంధించి ఆర్టీఎఫ్లు విడుదల చేస్తాం... మీకు చెల్లించాల్సిన మొత్తంలో 7.5 శాతం వడ్డీ మినహాయించి మిగిలినది కళాశాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తాం.. దీనికి మీరు అగ్రిమెంట్ ఇవ్వాలి.. దీనికి సమ్మతమైతే ఆర్టీఎఫ్ విడుదల అవుతుంది.’ అంటూ ఇటీవల రౖపైవేటు కళాశాలల అసోసియేషన్ సభ్యులు సంప్రదించిన సమయంలో సీసీఈ సభ్యుడు భరత్గుప్తా చెప్పిన మాట. దీనిపై ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే రెండేళ్లుగా వడ్డీలకు అప్పులుతెచ్చి కళాశాలలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఎఫ్లు విడుదలకు తెచ్చిన సొమ్ముకు 7.5 శాతం వడ్డీ చెల్లించాలంటే కష్టమని, ఇలా అయితే కళాశాలల యాజమాన్యాలు నష్టపోతాయని తేల్చిచెప్పామనే విషయాన్ని అసోసియేషన్ సభ్యులు వాట్సాప్ గ్రూపుల ద్వారా మిగతా కళాశాలల యాజమాన్యాలకు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసేదని, వారు ఫీజులు చెల్లించేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే ఆర్టీఎఫ్ నిధులు జమచేస్తామని చెప్పి ఇప్పుడు ఈ మెలిక పెట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో ఉన్న సుమారు 35 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 20వేల మంది, 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందన్న భరోసాతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్నారు. విద్యాసంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంత వరకు చంద్రబాబు సర్కారు కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. దీంతో అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాలలపై భారమా.. విద్యావ్యవస్థ బలోపేతం చేయాలంటే ఎంతో పారదర్శకత అవసరం. చంద్రబాబు సర్కారులో అది లోపించింది. కళాశాలల్లో విద్యార్థుల చదువులు చక్కగా సాగాలంటే ఆర్టీఎఫ్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలి. దీనికోసం తెచ్చిన అప్పులపై వడ్డీ భారం కళాశాలల యాజమాన్యాలపై మోపేందుకు చూడడం ఎంత వరకు సమంజసం. ప్రభుత్వానికి చేతకాకే వడ్డీ భారాన్ని కళాశాలల యాజమాన్యాలపై వేయాలని చూస్తోంది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించేది. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ ఇబ్బందులకు గురిచేయడమేనా అజెండా? ïœk ÈÆ‡$$…-ºÆŠ‡Þ-Ððl$…sŒæ Ñyýl$-§ýlÌS ^ólĶæ$-MýS$…yé MýSâêÔ>-ÌSÌS¯]l$ Cº¾…-§ýl$-ÌSMýS$ VýS$Ç-^ól-Ķæ$yýlÐól$ ^èl…{§ýl-»êº$ çÜÆ>PÆý‡$ Agñæ…-yéV> MýS°í³Ýù¢…¨. VýS™èl ¯ðlÌSÌZ ïœk ÈÆ‡$$…ºÆŠ‡ÞÐðl$…sŒæ °«§ýl$Ë$ Ñyýl$§ýlÌS ^ólÔ>Ð]l$° ^ðl糚-MýS$…-r$¯]l² {糿¶æ$™èlÓ… C…™èl Ð]lÆý‡MýS$ BĶæ* MýSâê-Ô>ÌS-ÌSMýS$ °«§ýl$Ë$ fÐ]l$-^ól-Ķæ$-MýS-´ùÐ]lyýl… Ððl¯]l$MýS B…™èl-Æý‡Å-Ðól$-Ñ$sìæ. Cr$ ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$, Ar$ MýSâê-Ô>ÌS-ÌS¯]l$ B…§øâýæ¯]lMýS$ VýS$Ç-^ól-Ķæ$yýl… ™èlVýS§ýl$. MýSâê-Ô>-ÌS-ÌSOò³ Ð]lyîlz-¿êÆý‡… ÐólĶæ*ÌS° ^èl*yýlyýl… çÜÇ-M>§ýl$. ˘ – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి ప్రైవేటు కళాశాలలకు చంద్రబాబు సర్కారు సరికొత్త ఆఫర్ 7.5 శాతం వడ్డీ చెల్లిస్తేనే ఫీజురీయింబర్స్మెంట్ విడుదల! అప్పుతెచ్చిన నిధులకు కళాశాలలే వడ్డీ చెల్లించాలని మెలిక నిధుల విడుదలలో జాప్యం దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు -
‘కోట’లో చోరీ
శృంగవరపుకోట: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘరానా చోరీ పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాన రహదారిలో జనం తిరిగే సమయంలో షాపులకు ఉన్న షట్టర్లు తెరిచి దర్జాగా చోరీ చేసి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట ప్రధాన రహదారిలో ఉన్న సీతారామ మెడికల్స్ దుకాణంలో చోరీకి యత్నం చేసి షట్టర్ బలంగా ఉండడంతో ప్రయత్నం విరమించుకుని పైన మేడపైన ఉన్న డాక్టర్ సీతారత్నంకు చెందిన సీతారామ మెడికల్ ల్యాబ్లో చోరీకి పాల్పడ్డాడు. ల్యాబ్లో రూ.4వేలు చోరీ చేసినట్టు డాక్టర్ సీతారత్నం పోలీసులకు తెలిపారు. తరువాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రధాన రహదారిలో ఉన్న జైశ్రీరామ మెడికల్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ దుకాణంలో ఎక్కువ మొత్తంలో సొమ్ము చోరీకి గురైనట్టు ఫిర్యాదుదారు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రధాన రహదారిలో ఉన్న పలు దుకాణాలు, మాల్స్ నుంచి సీసీ పుటేజీలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ఒకే వ్యక్తి అని నిర్దారణకు వచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు. -
రూ.1.32 కోట్లు
● ప్రభుత్వంపై నమ్మకం లేక... గతేడాది బీమా ప్రీమియం చెల్లించిన మామిడి, జీడిమామిడి రైతులు 10,670 మంది రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తం జిల్లాలో సాగులో ఉన్న మామిడి పంట 32 వేల హెక్టార్లు గతేడాది పంటల బీమా రాకపోవడంతో ఈ ఏడాది ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. బీమా ప్రీమియం వసూలులో చూపుతున్న శ్రద్ధ చెల్లింపులో ప్రభుత్వం చూపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. జిల్లాలో సాగులో ఉన్న జీడి మామిడి పంట 5,600 హెక్టార్లు విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. విపత్తు సమయంలో సాయం అందక విలవిల్లాడుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన కూటమి సర్కారు.. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయినా పరిహారం అందించడంలో నిర్లక్ష్యంవహిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. ఉద్యానసాగును ప్రోత్సహిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవానికి భిన్నమని, విపత్తుల సమయంలో ఎలాంటి సాయం అందడంలేదంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. బీమా కంపెనీ నుంచి రైతులకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఇప్పించడంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. ● బీమా ప్రీమియం చెల్లించినా... 2025–26లో మామిడి తోటలకు ఎకరాకు రూ.2, జీడి మామిడి తోటలకు ఎకరాకు రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. 10,104 మంది రైతులు 6,358 ఎకరాల మామిడితోటలకు రూ.1,27,16,000లు, జీడి మామిడి రైతులు 566 మంది 378 ఎకరాలకు రూ. 5,67,000లు బీమా ప్రీమియంగా చెల్లించారు. పంట నష్టపోతే మామిడి పంటకు ఎకరాకు రూ.40 వేలు, జీడిమామిడికి రూ.30 వేలు బీమా అందాలి. గతేడాది కొన్ని తోటలు పూర్తిగా పూతపూయకపోగా, మరికొన్నిచోట్ల తుఫాన్ వర్షాలకు నష్టంవాటిల్లింది. మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతినడంతో బీమా వర్తిస్తుందని మామిడి, జీడిమామిడి రైతులు ఆశించినా ఇంతవరకు పైసా కూడా అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు బీమా ప్రీమియం డబ్బులు, మరోవైపు పంట నష్టపోయామని చెబుతున్నారు. బీమా.. లేదండి ధీమా..! గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు అందని బీమా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం ఆవేదనలో రైతాంగం 0రైతులు నష్ట పోయారు.. గతేడాది మామిడికి ఎకరానికి రూ.2 వేలు, జీడి మామిడికి రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. తుఫాన్ వర్షాలకు పంట నష్టపోయినా ఒక్క రూపాయి బీమా చెల్లించకపోవడం దారుణం. రైతులు రెండు విధాలా నష్టపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. వారి సమస్యలను పరిష్కరించడం లేదు. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బీమా డబ్బులు అందలేదు... ఈ ఏడాది మామిడి, జీడిమామిడి పంటలకు రైతులు పంటల బీమా ప్రీమియం కట్టలేదు. గతేడాది పంటల బీమా కోసం వివరాలు అడిగితే కమిషనర్ కార్యాలయానికి పలు మార్లు పంపించాం. ఒక్క రైతుకు కూడా బీమా డబ్బులు అందలేదు. – కె.చిట్టిబాబు, జిల్లా ఉద్యానశాఖాధికారి -
క్షుద్రపూజల కలకలం
● ఏడాదిలో మూడుసార్లు వివిధ ప్రదేశాల్లో పూజలు ● భయాందోళనలో పల్లెప్రజలు ● చంద్రగ్రహణం రోజున పూజల కలవరం బొండపల్లి: బొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గెద్దపేట గ్రామానికి ఆనుకొని ఉన్న సిరి చెరువులో బుధవారం వేకువజామున క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చంద్రగ్రహణం అనంతరం చెరువులో మూడు చోట్ల నిమ్మకాయలతో పాటు మనిషిబొమ్మ, ఇతర సామగ్రి, నల్లని కోడిపెట్టలను అక్కడే చంపివేసి పూజలు నిర్వహించడం, ఏడాదిలో ఇదే రీతిన మూడు సార్లు ఈ ప్రాంతంలో పూజలు చేయడంపై భయపడుతున్నారు. అటువైపుగా వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. పూజలు చేసిన వారిపై నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎస్ఐ యు.మహేష్ మాట్లాడుతూ పూజల సమాచారం అందిందని, నిఘా వేసి సబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కింతలివానిపేటలో... బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధిలోని కింతలివానిపేటలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేశారన్న అంశం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ వీఽధి నాలుగురోడ్ల కూడలిలో పెద్దగా ముగ్గులువేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రగ్రహణం అనంతరం అర్ధరాత్రి పూట ఈ పూజలు నిర్వహించారని, ఇది దేనిసంకేతమో తెలియడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారమిచ్చారు. -
శతశాతం ఫలితాల సాధనే లక్ష్యం
● డీఈఓ మాణిక్యంనాయుడు రామభద్రపురం: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సిబ్బందికి సూచించారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని డీఓలు, సీఎస్లకు పరీక్షల నిర్వహణపై బుధవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో 5 నిమిషాలు ఆలస్యం అయినా అనుమతించాలని సూచించారు. జిల్లాలో 440 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 22,961 మంది విద్యార్థులు 119 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారన్నారు. మొత్తం 1350 మంది ఇన్విజిలేటర్లు, ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డీఓ, సీఎస్లను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో విమర్శలకు తావులేకుండా రాష్ట్ర విద్యాశాఖ నుంచే ర్యాండమ్గా నియమిస్తూ జాబితా తయారైందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డీఈసీ మెంబర్ సన్యాసిరాజు, ఎంఈఓ తిరుమలప్రసాద్, ఏఎస్ఓ బి.లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి విజయనగరం ఫోర్ట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోను, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. విజయనగరం పోలీస్బ్యారెక్స్లో నిర్వహించే ఉత్సవాలకు సుమారు 3 వేల మంది వరకు మహిళలు హాజరవుతారని, వారికి తాగునీరు, స్నాక్స్, శానిటేషన్ తదితర ఏర్పాట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మహిళా పారిశ్రామిక వేత్తలను సన్మానించేందుకు, వారి విజయగాథలను వివరించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ పీడీకి తెలిపారు. సమావేశంలో జేసీ సుతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ వెంకటేశ్వరావు, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధితో విద్యార్థి మృతి జామి: మండలంలోని శాసనపల్లి గ్రామానికి చెందిన గంధవరపు భరత్(9) తలసేమియా వ్యాధితో బుధవారం మృతి చెందాడు. భరత్ స్థానిక ప్రాధమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. అప్పారావు, లక్ష్మీ దంపతుల కుమారుడైన భరత్ చిన్నప్పటి నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. విశాఖ, చైన్నె, బెంగళూరు తదితర చోట్ల వైద్యం చేయించారు. బెంగళూరులో శస్త్రచికిత్సకు రూ.15లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పడంతో పేదలు కావడంతో డబ్బుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలోనే విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భరత్ మృతితో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పారదర్శకంగా పది పరీక్షల నిర్వహణ ● ఆర్జేడీ విజయభాస్కర్ విజయనగరం అర్బన్: పది పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిర్వహణ జరగాలని విద్యా శాఖ ఆర్జేడీ బి.విజయభాస్కర్ అన్నారు. స్థానిక ఫోర్ట్ సిటీ స్కూల్లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సక్రమంగా పారదర్శకంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్షల సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోసుకోకుండా అప్రత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.


