Vizianagaram
-
ఇదెక్కడి రాజ్యాంగం..!
చీపురుపల్లి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందనేందుకు చీపురుపల్లిలో వెలుగుచూసిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. సాక్షాత్తూ దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఆరుగురు ఈఓలతో కూడిన అధికారుల బృందం ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరిగితే... పోలీసులు జేసీబీనీ సీజ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో విలువైన దేవదాయ భూముల్లో ఆక్రమణలు పక్కన పెట్టి సాక్షాత్తూ దేవదాయశాఖ బుక్ చేసుకున్న జేసీబీ యంత్రాన్ని పోలీసులు సీజ్ చేయడం వెనుక రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని స్థానికంగా చర్చ జరోందుకుంది. ఆ జేసీబీ యంత్రం వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తది కావడంతోనే సీజ్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగిస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఆక్రమణలు ఎలా తొలగిస్తారని ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పట్టాభిరామస్వామికి చెందిన భూముల్లో.. పట్టణంలోని చీపురుపల్లి–రాజాం రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకుని సర్వే నంబర్ 209/6లో పట్టాభిరామస్వామి దేవస్థానానికి చెందిన 1.53 ఎకరాల భూమి ఉంది. ఆ భూములను చాలా కాలం కిందటే ప్రస్తుత జనసేన నాయకుడు కొనుగోలు చేసి క్రయ, విక్రయాలు జరిపారు. అందులో స్థలాలు కొను గోలు చేసిన కొంతమంది నిర్మాణాలు ప్రారంభిస్తే స్థానికుల ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వంలోనే నిర్మాణాలు నిలిపివేశారు. ఇటీవల కొద్ది రోజుల కిందట వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది నాయకులు పట్టాభిరామస్వామి భూములను పరిరక్షించాలని కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆరుగురు అధికారుల బృందం ఈ ఏడాది మే 26న ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీ కావడమే .. మే 26న పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపునకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది దుర్గారావుకు చెందిన జేసీబీ యంత్రాన్ని బుక్ చేసుకున్నారు. దీంతో అధికారుల సూచనల మేరకు జేసీబీ డ్రైవర్ దేవస్థానం భూముల్లో నిర్మాణంలో ఉన్న ఓ ఉపాధ్యాయుడి ఇంటికి చెందిన పిల్లర్లు కూల్చాడు. అదే రోజు దేవస్థానం అధికారులు జేసీబీ యజమానికి రూ.2,500 కూడా చెల్లించారు. దేవదాయశాఖ చెప్పినా......జేసీబీ సీజ్ దేవదాయశాఖ అధికారులు బుక్ చేసుకున్నప్పటికీ ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసి పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. తనకేం సంబంధం లేదని జేసీబీ యజమాని చెబుతున్నప్పటికీ పోలీసులు వినలేదు. అంతేకాకుండా సాక్షాత్తూ దేవదాయ ధర్మాదాయశాఖ అధికారులు పోలీస్స్టేషన్కు వెళ్లి తామే జేసీబీని బుక్ చేశామని వాంగ్మూలం ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చాంశనీయమవుతోంది. దేవదాయ శాఖాధికారుల సూచనల మేరకు ఆక్రమణలు తొలగించిన జేసీబీ డ్రైవర్ జేసీబీని సీజ్ చేసిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తకు చెందిన జేసీబీ కావడంతోనే వేధింపులు ఆందోళనకు సిద్ధమవుతున్న జేసీబీ డ్రైవర్ బంధువులు నాలుగు రోజుల ముందే బందోబస్తు కోసం లేఖ.. పట్టాభిరామస్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపుల నిమిత్తం మే 22న దేవదాయశాఖ ఈఓ వై.శ్రీనివాసరావు పోలీసు బందోబస్తు కోరుతూ లిఖిత పూర్వకంగా చీపురుపల్లి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను కోరారు. అదే రోజు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో లెటర్ రిసీవ్ చేసుకున్నట్లు సంతకంతో కూడిన అకనాలెడ్జ్మెంట్ కాపీ కూడా దేవదాయశాఖ అధికారుల వద్ద ఉంది. -
యోగాంధ్ర అర్బన్ లెవెల్ పోటీలు
విజయనగరం: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 అర్బన్ స్థాయి పోటీలను విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రాజీవ్ స్టేడియంలో యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్కు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు అర్బన్ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఈనెల రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అర్బన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు. 375 గ్రాముల గంజాయి స్వాధీనం● ఇద్దరి అరెస్ట్ విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి విక్రయదారులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పెద్ద చెరువు రామానాయుడు రోడ్డులో కొంతమంది వ్యక్తులు గంజాయి పీలుస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఉడాకాలనీకి చెందిన వజ్జల భరత్ కుమార్, లంకాపట్నానికి చెందిన చిన్న మనోహర్లు గంజాయి పీలుస్తూ, విక్రయాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు.వారి దగ్గర నుంచి 375 గ్రాముల గంజాయి, రూ.350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..
● ముగ్గురికి తీవ్రగాయాలు విజయనగరం గంటస్తంభం/క్రైమ్: విజయనగరం సన్స్కూల్ పక్కన రామకృష్ణ నగర్లో నివాసముంటున్న పట్నాన సత్యవతి ఇంటి పైకి డంపింగ్ యార్డు మీదుగా 15 అడుగుల ఎత్తు నుంచి ఓ కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో పట్నాన సత్యవతి(60), గొడ్డు వినయ్(14), పట్నాన వినయ్(12) కారు కింద ఇరుక్కుపోయారు. దీంతో కాలనీ యువకులు హుటాహుటిన ప్రమాద స్ధలానికి చేరుకుని కారును ఎత్తి వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరావు, ఎం.శాంతమూర్తి పరామర్మించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అర్ధరాత్రి మద్యం తాగుతూ కారును నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైవోల్టేజ్తో కాలిపోయిన టీవీలువిజయనగరం ఫోర్ట్: పట్టణంలోని జొన్నగుడ్డి రుప్పవీధిలో హైవోల్టేజ్ రావడంతో సోమవారం ఓ ఇంట్లోని ఫ్యాన్లు, టీవీ, కూలర్, లైట్లు కాలిపోయాయి. అలాగే బట్టలతో సహా అన్నీ కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది. 25 లీటర్ల సారా పట్టివేతసీతంపేట: మండలంలోని కొత్తకోట జంక్షన్ వద్ద 25 లీటర్ల సారా అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు దోనుబాయి ఎస్సై మస్తాన్ తెలిపారు. వీరఘట్టానికి చెందిన శివయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక ట్రాక్టర్.. బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతినదిలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం ఆర్డీఓ జేవీవీఎస్ రామ్మోహనారావు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి తరలిస్తున్నందుకు గాను ట్రాక్టర్ యజమానకి రూ.10వేల జరిమానా విధించామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. లారీని ఢీకొని ఇద్దరికి గాయాలుగుర్ల: మండలంలోని అచ్యుతాపురం వద్ద సోమవారం ఇద్దరు యువకులు గాయపడ్డారు. మెరకముడిదాం మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన స్వామి, వాసులు ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా అచ్యుతాపురం వద్ద విజయనగరం నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తలపై గాయాల య్యా యి. గుర్ల పీహెచ్సీలో ప్రథమ చికిత్స ఆనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డి ల్యాబ్స్ ఉద్యోగిని ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. పడాల పేటలో ఉంటున్న నడిపేన భారతి, పూసపాటిరేగ వద్ద గల రెడ్డి ల్యాబ్స్లో పని చేస్తోంది. వృత్తిలో పర్మినెంట్ కాలేదని కొన్ని రోజుల క్రితం ఆమె కన్నల్లికి చెప్పింది. చేస్తున్న పనిలో ఒత్తిడి కూడా అధికం అవడం, తల్లికి భారమవుతున్నానన్న బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించి డ్యూటీ నుంచి రాగానే ఇంట్లోని తన గదిలో తలుపేసుకుని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఈ మేరకు భారతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చింతపల్లి బీచ్ను పరిశీలించిన జేసీ
పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి బీచ్లో ఈ నెల 6న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్ను జేసీ సేతుమాధవన్ సోమవారం పరిశీలించారు. వేదిక, యోగా ప్రదర్సన స్థలాన్ని గుర్తించారు. ఆయన వెంట తహసీల్దార్ తాడ్డి గోవింద, ఎంపీడీఓ ఎం. రాధిక, తదితరులు ఉన్నారు. పెరుగుతున్న మడ్డువలస నీటిమట్టం వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవా హం పెరిగింది. సుమారు వెయ్యి క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 64.05 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెస్ బిల్లులు పెంచండి ● డీఆర్వోకు ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి విజయనగరం గంటస్తంభం: సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలని, కాస్మోటిట్ చార్జీలు అందజేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం డీఆర్వో శ్రీనివాస్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణంతో పాటు వార్డెన్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీ శంకర్, ఉపాధ్యక్షులు ఎ.సుమన్, గణేష్ పాల్గొన్నారు. -
నేనే.. జిల్లా బాస్..!
విజయనగరం అర్బన్: శాఖాపరమైన ఎలాంటి అభివృద్ధి పనులకై నా ప్రజాప్రతినిధులను ఆహ్వానించే ముందుకానీ, మీరు వారిని ఇంకే కారణంతోనైనా కలవాలన్నా విధిగా తన అనుమతి తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అయినా, ప్రజాప్రతినిధులైనా పిలిస్తే వెళ్లేముందు తన అనుమతి విధిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇటీవల వ్యవహరించిన సమగ్ర శిక్ష ఏపీసీ, వ్యవసాయశాఖ జిల్లా అధికారులపై ఆగ్రహించారు. జిల్లా బాస్ను నేనే.. నన్ను దాటి ఎవరైనా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను హింసిస్తుండడం వల్లే ఇటీవల పలువురు జిల్లా అధికారులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారని కొంతమంది జిల్లా అధికారులే చెప్పినట్లు డీఆర్ఓకు మంత్రి చెప్పారని, ఈ మేరకు ప్రచారం చేయడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఎవరికీ సెలవులు ఇవ్వనని, తన అనుమతి లేకుండా సెలవులు తీసుకున్నవారిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. నా అనుమతి లేనిదే ప్రజాప్రతినిధులను కలవొద్దు జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు -
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశమందిరంలో కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 63 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోపు అర్జీదారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, పునఃపరిశీలన లేకుండా సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని తెలిపారు. పీజీఆర్ఎస్కు 32 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయి. జమ్మడుగూడ గ్రామానికి చెందిన సవర కళ్యాణ్ రహదారి మంజూరు చేయాలన్నారు. చిన్నపొల్లకు చెందిన శ్రీలత కుట్టుమిషన్ ఇప్పించాలని కోరారు. మామిడి, జీడి మొక్కలు పంపిణీ చేయాలని కురసింగి గ్రామస్తులు వినతి ఇచ్చారు. కోడిశ గ్రామస్తుడు హెచ్.రవి వన్బి అడంగల్ ఇప్పించాలన్నారు. ట్రాక్టర్ లోన్ మంజూరు చేయాలని పద్మాపురం గ్రామస్తుడు మనోసింగు కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్.వి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఉత్తర్వుల మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నాలుగు ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం సమస్యలను సంబంధింత పరిధిలో ఉన్న స్టేషన్ అధికారులకు అప్పగించి వాటిని దర్యాప్తు చేసి తక్షణ చర్యలు చేపట్టి జిల్లా పోలీసుశాఖ కార్యాలయానికి నివేదికను పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్కు అందిన విజ్ఞప్తులలో కొన్ని.. ముత్యాల సెంటర్ నుంచి కొత్తం గ్రామం వరకు మెయిన్ రోడ్డు మంజూరు చేయాలని సీతంపేట మండలం కొత్తం గ్రామానికి చెందిన సవర.గంగయ్య అర్జీ అందజేశారు. వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన సీహెచ్. దుర్గమ్మ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తూ 2022 జూలైలో పదవీ విరమణ పొందియున్నానని, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ అందలేదని, బెనిఫిట్స్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. పార్వతీపురం మండలం గదబవలస గ్రామానికి చెందిన కె. జగన్నాథం జీవన ఉపాధికోసం ట్రాక్టర్ కొనడానికి ప్రభుత్వం రుణం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన సీహెచ్ అశోక్(ఎస్టీ కొండదొర) కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, జిల్లా ప్రణాళిక అధికారి ీపి.వీర్రాజు, డ్వామా పీడీ కె. రామచంద్రరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. రాబర్ట్ పాల్, ఉద్యానవనశాఖ అధికారి బి.శ్యామల, పశుసంవర్థక శాఖ అధికారి డా.ఎస్.మన్మథరావు, డీఆర్డీఏ ఏపీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ తైక్వాండో పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: జాతీయస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్లో జరిగిన 9వ ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 8 మంది క్రీడాకారులు రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, 5 కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కొల్లు హిమశీ, ఎస్.ఉదయ్వరుణ్లు బంగారు పతకాలు సాధించగా.. ఎం.శ్రీరామ్నాయుడు రజత పతకం దక్కించుకున్నాడు. అదేవిధంగా సోము శ్యామ్కుమార్, ఎస్.శ్యామ్శ్రీఽవర్ధన్, బి.సాయిచతైన్య, ఎ.గగన్దీప్, కె.శ్రీనివాసరావులు కాంస్య పతకాలు దక్కించుకున్న వారిలో ఉన్నారు. పతకాలు దక్కించుకున్న క్రీడాకారులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, చీఫ్ కోచ్ డీవీ చారిప్రసాద్, జిల్లా అసోసియేషన్ సభ్యులు పిల్లా శ్రీనివాస్, ఎస్.సతీష్కుమార్, టి.మురళీకృష్ణ, టి.వెంకటేష్ తదితరులు అభినందించారు. -
బండెమ్మ తల్లి హుండీల చోరీ
శృంగవరపుకోట: పధ్నాలుగు ఏళ్ల తర్వాత ఎస్.కోట మండలంలోని సీతంపేట గ్రామంలో వేడుకగా జరిగిన జరిగిన బండెమ్మ తల్లి పండగ భక్తుల్లో కొత్త ఉత్సాహం నింపినా, వారి మనోభావాల్ని మాత్రం దొంగలు దెబ్బకొట్టారు. ఆదివారం రాత్రి అమ్మవారి అనుపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 12గంటల వరకూ అమ్మవారి ఆలయం వద్ద సందడిగానే ఉంది. రాత్రి 12గంటల సమయంలో అనువంశిక అర్చకులు, పెద్దలు అమ్మవారికి చెల్లించాల్సిన కానుకలు, ముడుపులు చెల్లించి ఇళ్లకు వెళ్లారు. అమ్మవారి ఆలయం వద్ద సందడి సద్దుమణగగానే దొంగలు పక్కాగా ప్లాన్ అమలు చేశారు. రాత్రి 12గంటల తర్వాత ఆలయంలో ఉన్న స్టీల్, ఐరన్ హుండీలను ఎత్తుకుపోయారు. స్టీల్ హుండీ పగలగొట్టి పక్కన ఉన్న పశువుల పాకలో పడేశారు. ఇనుప హుండీని మాత్రం పట్టుకుపోయారు. 14 ఏళ్ల తర్వాత పండుగ జరగడంతో అమ్మవారికి ఆదాయం దండిగానే వచ్చింది. సుమారు లక్ష రూపాయలు చోరీకి గురైఉంటాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. చోరీ విషయం తెలుసుకున్న ఎస్.కోట పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ ఎస్.కోట పోలీసులు చెబుతున్నారు. -
ఉచిత హామీలతో కూటమి వెన్నుపోటు
● ప్రజలను ఆశపెట్టి మోసగించిన కూటమి ప్రభుత్వం ● హామీలు అమలుచేయాలన్న డిమాండ్తో ఈ నెల 4న ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ ● అన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహించాలి ● పార్టీ కార్యక్రమాల నిర్వహణలో పార్టీ మండలాధ్యక్షులదే కీలక పాత్ర ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ● పార్టీ మండల/నగర అధ్యక్షులతో సమీక్ష సమావేశం విజయనగరం: కూటమి నేతలు ఎన్నికలకు ముందు ప్రజలను హమీలతో ఆశపెట్టి మోసగించారని, చెప్పిన వాగ్దానాలను అమలు చేయని మోసకారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన వెన్నుపోటు దినంను అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 4వ తేదీన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు సాగుతాయన్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించి అధికార యంత్రాంగానికి ఎన్నికల హమీల అమలుపై వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని ధర్మపురి సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, పార్టీ మండల, నగరాధ్యక్షులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలే స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేస్తారన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రతినాయకుడు, కార్యకర్త ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. పార్టీ మండలాధ్యక్షులదే కీలక పాత్ర... ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీ పునఃనిర్మాణంలో పార్టీ మండల, నగర అధ్యక్షులు కీలక భూమిక పోషించాలని మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీను బలోపేతం చేయాలన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పార్టీ శ్రేణుల సూచనల మేరకు పాలన సాగిస్తామని అధినేత మాట ఇచ్చినట్లు చెప్పారు. ఇకపై నెలవారీ సమావేశంలో అధ్యక్షులంతా తమ సలహాలు, సూచనలు అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే సందర్బంలో మీమీ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాటాలకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. కార్యకర్తలకు మంచి చేసే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి: కిల్లి సత్యనారాయణ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు మంచి చేసే ఆలోచనలో ఉన్నారని, పార్టీ కోసం కష్టించిపని చేసే వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ చెప్పారు. అధికారంలోకి వస్తే పాలనలో మార్పు తీసుకువస్తామని హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఏ ప్రభుత్వంపై లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. కేంద్రం నుంచి రూ.లక్షలకోట్ల అప్పులు తేవడం మినహా హమీల అమలుపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని తూర్పారబట్టారు. పార్టీ నుంచి వచ్చే ప్రతి ఆదేశాన్ని తూచాతప్పకుండా అమలు చేయడంలో మనమంతా సైనికుల్లా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, శంబంగి వేణుగోపాలనాయుడు, సంగంరెడ్డి బంగారునాయుడు, అల్లాడ సీతారామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా పార్టీ కమిటీల నియామకాలు.. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ మండల కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీలు, గ్రామ, వార్డుస్థాయి కమిటీలను నియమించే బాధ్యత పార్టీ మండలాధ్యక్షులదేనని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. పార్టీ 26 జిల్లా అనుబంధ కమిటీల్లో చురుకై న వారికి స్థానం కల్పించాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అనుబంధ కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తారని, వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. త్వరలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ అధిక సమయం క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. -
ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన వినతులకు సత్వర పరిష్కారం చూపడంతో పాటు వాటిని అర్జీదారులు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా వినతులు పరిష్కరించేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని పద్ధతులను పాటిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారా? లేదా? అనే అంశంపై వినతుల ఆడిట్ పూర్తి చేయాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో అందిన వినతుల పరిష్కారంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినతుల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకాని జిల్లా అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్ చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ తదితరులు 143 వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 32 ఫిర్యాదులువిజయనగరం క్రైమ్: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతలు బాధితుల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి యోగా శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమవుతుందని దీనికి ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారులకు జేసీ పలు సూచనలు చేశారు. ప్రతి సచివాలయానికి 9 మంది యోగా శిక్షకులను ఎంపిక చేశామని, వారి ద్వారా 3వ తేదీ నుంచి ఒక్కో బ్యాచ్కు 70 మంది చొప్పున 3 రోజుల యోగా శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. దీని కోసం ఎంపిక ఎంపిక చేసిన ప్రదేశాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఐదు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే యోగా శిక్షకులుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా జూన్ 14 వరకు బ్యాచ్ల వారీగా శిక్షణ జరుగుతుందని గ్రామంలోని దాదాపు అందరికీ యోగా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. -
ఐదుగురు గంజాయి నిందితుల అరెస్ట్
డెంకాడ: డెంకాడ మండలం బెల్లాం గ్రామం దగ్గరలో గల భాష్యం లే–అవుట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి వినియోగిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డెంకాడ ఎస్సై ఎ.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, యాంటీ గంజాయి టీమ్ జూన్ 2న దాడులు నిర్వహించి, గంజాయి పీలుస్తూ, విక్రయాలకు పాల్పడుతున్న ఒక జువైనల్ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అరెస్టయిన వారి నుంచి 1.330కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, రూ.200 నగదును డెంకాడ ఎస్సై సన్యాసినాయుడు సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ఎ–1 జామి మండలం అలమండ గ్రామానికి చెందిన దాసరి గాంధీ (24) గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. అదేవిధంగా డెంకాడ మండలం బెల్లాం గ్రామానికి చెందిన జుతిక శ్యామ్ (ఎ–2, 19 సంలు) మాల్లపురెడ్డి రాకేష్ (ఎ–3) దిబ్బగుడ్డి గ్రామానికి చెందిన మల్లపురెడ్డి వేణు (ఎ–4) సహా జువైనల్(5) గంజాయి పీలుస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ వివరించారు. గంజాయి విక్రయాలు జరిపిన వ్యక్తితో సహా, గంజాయి వినియోగిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో.. విజయకేతనం
విజయనగరం అర్బన్: ప్రతిష్ట్మాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. జాతీయ స్థాయిలో వెయ్యి లోపు ర్యాంకులు 9 మంది, ఓబీసీ కేటగిరీలో 20 మంది సాధించారు. ఓబీసీ కేటగిరిలో పి.హేమసాయి సూర్య కార్తీక్–4, బలగ జయేంద్రనాయుడు–437, ఎస్సీ కేటగిరీలో కాట్రగడ్డ రాజ్కిరణ్– 344 ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయి/ఓబీసీ ర్యాంకర్లలో తాలాబత్తుల మనోహర్ (116/15), పీటీఆనంద్ చక్రవర్తి (118/17), అరంగి శాత్విక్ (278/39), పొట్నూర్ కార్తీక్ (419), కేవీ అరవింద్ కుమార్ (442), దాసరి మహతి (551/79), బి.ఈశ్వరతనూజ్ (617/94), అప్పల శ్రీ హర్హవర్దన్ (635/99), తుమ్మగంటి వెంకట విష్ణుశ్రీవత్స (672/103), వెన్ను జయదీప్నాయుడు (1632/282) ఉన్నారు. రేగిడి విద్యార్థుల సత్తా రేగిడి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రేగిడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. కొమెర గ్రామానికి చెందిన మురపాక శ్రీనిధి ఓబీసీ కేటగిరీలో 2,561వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి తండ్రి మురపాక వెంకటరమణ ఇదే మండలం లక్ష్మీపురం పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, తల్లి గౌరీశ్వరి గృహిణి. ● తునివాడ గ్రామానికి చెందిన పల్లి శాంతిప్రియ ఆలిండియా జాతీయస్థాయి/ఓబీసీ కేటగిరీలో 1446/737 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి కుమారి గృహిణి. బొబ్బిలి విద్యార్థుల ప్రతిభ బొబ్బిలి: జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన పీటీ ఆనంద్ ఓపెన్ కేటగిరీలో 118, ఓబీసీలో 17వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుకాగా, తల్లి అనూరాధ గృహిణి. వంగర విద్యార్థి ప్రతిభ వంగర: మండలంలోని బాగెంపేట గ్రామానికి చెందిన కటికి బాలాజీ సిద్ధార్ధ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సీఆర్ఎల్–2,670, ఓబీసీ కేటగిరీలో 486 ర్యాంకు సాధించాడు. తండ్రి కటికి శివున్నాయుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా తల్లి లలితకుమారి ఓ ప్రైవేటు పాఠశాల టీచర్. ఆరికతోట విద్యార్థి ప్రతిభ రామభద్రపురం: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగేశ్వర్ జాతీ య స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 40వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 284వ ర్యాంకు సాంధించాడు. విద్యార్థి తండ్రి సింహాచలం ఓ ప్రవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తుండగా, తల్లి యర్రయ్యమ్మ గృహిణి. -
సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహశీల్దార్ కుటుంబం
సాక్షి, న్యూఢిల్లీ/విజయనగరం అర్బన్ : సిక్కిం వరదల్లో విజయగరం తహసీల్దార్ ఎన్. కూర్మనాథరావు (42) ఆయన కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. కుటుంబంతో కలిసి ఆయన 5 రోజుల క్రితం గ్యాంగ్టక్ విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడికి 18 కిలోమీటర్లు దూరంలోని నార్త్ సిక్కిం ప్రాంతం మంగన్ జిల్లాలోని లుచూంగ్లో ఉన్నారు. అక్కడ కురిసిన భారీ వర్షాలకు వారు వెళ్లిన మార్గం ఆదివారం కొట్టుకుపోయింది.చుట్టుపక్కల వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు హోటల్కే పరిమితమయ్యారు. పర్యటనలో తహసీల్దార్తో పాటు ఆయన భార్య ఎం. ఉమ (38) (డిప్యూటీ తహసీల్దార్, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం బొబ్బిలి యూనిట్లో పనిచేస్తున్నారు), కుమార్తె దీక్షిత (15), కుమారుడు జయాన్‡్ష నారాయణ (6) ఉన్నారు.బెంగళూరులో పనిచేస్తున్న ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభిషేక్రాజు (కర్నూలు), ఆదిత్యకిరణ్ (శ్రీకాకుళం), ఆదేష్ శ్రీవాస్తవ (బెంగళూరు), శ్రీజ సంతోష్ (బెంగళూరు), చందన్గౌడ (మైసూరు), సిరిన్ థామస్ (బెంగళూరు), సమృధి భాస్కర్ (బెంగళూరు) కూడా వరదలతో అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా తహసీల్దార్ కుటుంబం బసచేసిన హోటల్కు సమీపంలోనే మరో హోటల్లో బసచేశారు.సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వరదల్లో చిక్కుకున్న కూర్మనాథరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని సురక్షితంగా తీసుకురావాలని అక్కడి ఎయిర్పోర్టు అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కుటుంబ సమాచారాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తహశీల్దార్ కుటుంబాన్ని అక్కడనుంచి సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా తెలిపింది. ఏపీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రవిచంద్ర ఆదేశాల మేరకు.. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు అక్కడి జిల్లా కలెక్టర్ అనంత్, ఎస్పీ చుంగ్టన్ అరుణ్ తటాల్ సహా స్థానిక అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైన సహాయాన్ని అందించడంలో సిక్కిం డీజీపీ శ్రీధర్రావు కీలకపాత్ర పోషిస్తున్నారని ఏపీ భవన్ అధికారులు తెలిపారు.. పర్యాటకుల ఆందోళన.. తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం ఉన్న మంగన్ జిల్లా లుచూంగ్లో రోడ్లన్నీ కొట్టుకుపోయి రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో అక్కడికి హెలికాప్టర్ వెళ్తేనే వారంతా సురక్షితంగా బయటకొచ్చే అవకాశముంది. వారు బసచేసిన ప్రాంతం చుట్టుపక్కల వరద నీరు చేరడంతో పర్యాటకులంతా ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి ఇంటర్ కళాశాలల పునఃప్రారంభం
విజయనగరం అర్బన్: జూనియర్ కళాశాలల కు వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలు 18, కేజీబీవీలు 26, ఆదర్శ పాఠశాలలు 16 ఉన్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కళాశాలలకు హాజరు కావాలని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు సూచించారు. రేషన్ పంపిణీ పరిశీలన విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని కేఎల్పురంలో 281098 నంబర్ రేషన్ షాపును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదివారం పరిశీలించా రు. సరుకుల నిల్వపై ఆరా తీశారు. సరుకుల ను సకాలంలో పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్వో మధుసూదన్రావు, సీఎస్డీటీ రామారావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ విజయనగరం అర్బన్: బోధన నైపుణ్యాలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక రోజు ఉచిత శిక్షణా తరగతులు స్థానిక యూత్ హాస్టల్లో ఆదివారం నిర్వహించారు. శిక్షకుడు విల్ 2 కెన్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో స్పోకెన్ ఇంగ్లిష్ విద్యార్థులకు నేర్పించడంలో ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన మెలకువలు వివరించారు. ఈ మెలకువలతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షకుడు రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి శిక్షణలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ శిక్షణ కళాశాల సీఐ మురళి, ఉపాధ్యాయులు సోమశేఖర్, రెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పేర్కొన్నాయి. -
‘వెన్నుపోటు దినం’
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే విజయనగరం: ఎన్నికలకు ముందు అధికార దాహంతో హామీ లు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ అమలు చేయాలంటూ ప్రశ్నించేందుకే ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్టు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోలగట్ల పిలుపునిచ్చారు. ఆదివారం తన నివాసంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 4న నిర్వహించే వెన్నుపో టు దినం కరపత్రాలను, వాల్పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోల గట్ల మాట్లాడుతూ చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలేనని దుయ్యబట్టారు. నాడు దివంగత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిస్తే... నేడు 5 కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఈ నెల 4న ఉదయం 9 గంటలకు నగ రంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి నిరసన ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నారు. ప్రజల పక్షాన నిలబడదాం ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను నెరవేర్చాల్సిన ఆవశ్యకత రాజకీయ పార్టీలపై ఉందని కోలగట్ల అన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు పేరిట మేలైన పాలనందించినప్పటికీ, కూటమి నాయకుడు చంద్రబాబు అంతకన్నా మెరుగైన పాలన అందిస్తార న్న ఆశతో ఓట్లేసి గెలిపించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కేవలం స్పౌజ్ పింఛన్లు మంజూరు మినహా మిగిలి న హమీలను నెరవేర్చకపోవటంతో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించటం జరుగుతుందని వివరించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు రూ.10వేలు చొప్పున ఇస్తామని చెప్పి మోసగించారని, గత ఐదేళ్లు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందిస్తే నేడు మళ్లీ డీలర్ల వ్యవస్థను తీసుకువచ్చి వినియోగదారులను రేషన్ దుకా ణాలు చుట్టూ తిప్పే ప్రక్రియను పునఃప్రారంభించా రన్నారు. నాయకులు, కార్యకర్తలే ముందుండి నడిపించాలి అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్సీపీని పార్టీ నాయకులు, కార్యకర్తలే ముందుండి నడిపించాలని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఏడాది పాటు పాలన సాగించిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైంద ని, ఈ తరుణంలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమా లను విజయవంతంగా నిర్వహించాలని సూచించా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా బాధ్యతగా పని చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో పని చేసిన విధంగా 2029 ఎన్నికల్లో కష్టించి పని చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ టెంకల అచ్చెంనాయుడు, ఎస్వివి.రాజేష్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. రాను న్న రోజుల్లో సమన్వయంతో పని చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు. ఏడాదైనా.. హామీల అమల్లో విఫలం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం 4న జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ పార్టీ శ్రేణులు తరలిరావాలి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
అమ్మో..జూన్..!
అమ్మా..నాన్నా..కొత్త బ్యాగు, కొత్త పుస్తకాలు..కొత్త యూనిఫాం..కొత్త షూస్ కావాలని పిల్లలు ఇంట్లో అడుగుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఆకాశం వైపు.. పొలంవైపు చూస్తూ..ఈ ఏడాది వరిపంట వేయాలి. సాగుకు పెట్టుబడి సాయం కోసం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మదిలో మెదలగానే అన్నదాతల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏటా జూన్ నెల వచ్చిందంటే చాలు. పిల్లల తల్లిదండ్రులు..అన్నదాతలు..కంటికీ కనిపించని శత్రువుతో మానసిక యుద్ధం చేయాల్సిందే.పార్వతీపురం: జూన్ మాసం వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు, రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం..రైతులకు పంటల సాగులో పెట్టుబడుల భారం తప్పడం లేదు. పిల్లలకు ఫీజులు, వసతి ఖర్చులు, తలుచుకుని తల్లిదండ్రులు జూన్ నెల వచ్చేసిందంటూ ఆందోళన చెందడం పరిపాటిగా మారింది. పాఠశాలల ప్రారంభానికి మునుపే ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను గాలించారు. ప్రాథమిక పాఠశాల విద్య పూర్తయిన వారిని ఉన్నత పాఠశాలకు, ఉన్నత విద్య పూర్తయిన వారిని తమ కళాశాలలో చేర్పించాలంటూ ఒకటికి రెండుసార్లు ఒత్తిడి తెచ్చి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించుకున్నారు. గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల నుంచి పలువురు విద్యార్థులను సమీపంలోని పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో పాఠశాలకు చెందిన బస్సులు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు గ్రామాలకు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఖరీఫ్లో సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇటు వ్యవసాయ మదుపులు, అటు కళాశాల, పాఠశాలల ఫీజుల భారంతో సగటు మనిషి ఆర్ధిక ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంకింద ఏటా రూ.14వేలు అందించి రైతులను ఆదుకోవడంతోపాటు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు అదించించి తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంకానీ, చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని కానీ అందించలేదు. ఈ కారణంగా రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాగుకు భారంజిల్లాలోని పదిహేను మండలాల్లో 1.77 లక్షల ఎకరాల్లో 52, 500 మంది రైతులు ఖరీఫ్లో వరిపంటను సాగుచేస్తున్నారు. ఎకరా వరి పంటను సాగుచేయాలంటే రూ.15వేల నుంచి రూ. 20వేలవరకు మదుపు అవుతుంది. ప్రస్తుతం ఆయాగ్రామాల్లో పదుల సంఖ్యలో రైతులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగుచేసి కుటుంబ పోషణ చేస్తున్నారు. రైతులు ఖరీఫ్కు తమ పంట పొలాలను సాగుకు సిద్ధం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరిపంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చేతిలో నగదు లేకపోయినా అప్పులు చేసైనా పంటలు పండించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఖరీప్ పనులపై ఆశ రైతుల్లో పెరుగుతోంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం రైతులకు పంట సాగు పెట్టుబడి ఆందోళనఫీజుల మోత..ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల కొనుగోలుకు వారి నెలవారీ బడ్జెట్ సరిపోవడం లేదు. ఫీజులు, బస్సు రవాణా, పుస్తకాల భారం తడిసి మోపెడవుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయికి రూ.15వేల నుంచి రూ.40వేల వరకు, ఉన్నత పాఠశాల స్థాయికి రూ. 25వేల నుంచి రూ.60వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్కు కార్పొరేట్ కళాశాలల్లో రూ.80 వేల నుంచి రూ.2.50లక్షల వరకు ఖర్చవుతుంది. విద్య ఖర్చులు, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా ఉన్నాయి. అయినా పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అప్పు చేసైనా చదివించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడడం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చెల్లింపులను నిఘాపరిధిలో చేర్చకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను క్రమబద్ధీకరించడం, ఫీజుల వసూళ్లపై నిఘా వేయడం, ఇన్కంటాక్స్ దాడులను చేస్తే కొంతవరకై నా ఫీజులమోత తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
తైక్వాండో ఓవరాల్ చాంప్ మదర్ థెరిసా క్లబ్
విజయనగరం: జిల్లాస్థాయిలో జరిగిన తైక్వాండో బాల, బాలికల పోటీల్లో విజయనగరానికి చెందిన మదర్ థెరిసా క్లబ్ జట్టు సత్తా చాటింది. గత నెల 31న బొబ్బిలి వేదికగా జరిగిన పోటీల్లో పాల్గొన్న జట్టులోని 27 మంది క్రీడాకారులు బంగారు పతకాలు కై వసం చేసుకోవడంతో పాటు ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈనెల 9,10,11 తేదీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి బాల, బాలికల తైక్వాండో పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా నిలవడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న మదర్ థెరిసా క్లబ్ క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావులు అభినందించారు. -
నేలబావిలో పడి యువకుడి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం గ్రామ సమీపంలో వెంకటరాయుడుపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ నేలబావిలో పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 10మంది స్నేహితులు ఈతకు వెళ్లారు. వారిలో పార్వతీపురం పట్టణంలోని తూర్పు వీధికి చెందిన మజ్జి తరుణ్ (23) ప్రమాదవశాత్తు నేలబావిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఆమె చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
నాలుగు వాహనాలు దగ్ధం
కొత్తవలస: మండలంలోని రాజా థియేటర్ సమీపంలో గల వసంత్విహార్ అపార్ట్మెంట్ సముదాయం బ్లాక్–5లో సెల్లార్ కింద గల నాలుగు వాహనాలు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి దగ్ధమయ్యాయి. పి.లక్ష్మణరావు, కె.వెంకటస్వామిలకు చెందిన ద్విచక్రవాహనాలతో పాటు మరొకరికి చెందిన ఒక ద్విక్రవాహనం, మారుతి–800 కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడంతో అపార్ట్మెంట్ వాసులు దిగి చూసేసరికి వాహనాలు తగలబడిపోతున్నాయి. ఆర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో కొత్తవలస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే గల విద్యుత్ మీటర్ల బోర్డుకు ఈ మంటలు వ్యాపించి ఉంటే పెనుప్రమాదం జరిగేదని అపార్ట్మెంట్ వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ వాహనాలకు కావాలనే నిప్పు పెట్టారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో అపార్ట్మెంట్ వాసులు -
వామ్మో..రేడియేషన్..!
విద్యుదయస్కాంత తరంగాలతో.. సెల్ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల వల్ల గర్భిణులు, చంటి పిల్లలకు చాలా ప్రమాదం ఉంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు అడ్డుగా మారి, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం తదితర పరిణామాలు ఉంటాయి. సెల్ టవర్లు ఉన్న ప్రాంతంలో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్. వై.సతీష్ కుమార్, ఫిజిక్స్ లెక్చరర్విజయనగరం గంటస్తంభం: విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన సెల్ టవర్లతో ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. 3ఎ, 4ఎ, 5ఎ అని సిగ్నల్స్ కోసం వివిధ రకాల మొబైల్ కంపెనీలు విచ్చలవిడిగా జనవాస ప్రాంతాలలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్న ప్రదేశాలకు దూరంగా వాటిని నిర్మించాలనే నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారం నిర్మిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులకు ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మానవ శరీరంలో నిత్యం అనేక కణాలు నూతంగా పుడుతుంటాయి కొన్ని మరణిస్తూ ఉంటాయి. సక్రమంగా కణ విచ్ఛిత్తి జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గాడి తప్పుతున్న కణ విచ్ఛిత్తి ఈ రేడియేషన్ వల్ల కణ విచ్ఛిత్తి గాడి తప్పి కణాలు ప్రవర్తించడం వల్ల క్యాన్సర్ కణుతులు ఏర్పడి మనిషి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. ఈ టవర్లు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు మొబైల్ కంపెనీలు ఇచ్చే అద్దెలకు, వారు ఇచ్చే ఆఫర్లకు ఆశ పడి వాటి వల్ల వచ్చే ప్రమాదాలను ఊహించలేక పోతున్నారు. వైర్లెస్ టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం సుఖవంతవుతుందని ఆనందంపడాలో రేడియేషన్ వల్ల వచ్చే వివిధ రకాల భయంకరమైన క్యాన్సర్ తదితర రోగాలతో బాధ పడాలో అర్థం కాని అయోమయ స్ధితిలో నేటి యువతరం ఉంది. రేడియేషన్ వల్ల చర్మ సంబంధ వ్యాధులతో పాటు, కళ్లు ఎర్రబడడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, జుట్టు ఊడిపోవడం, పురుషులకు సంతాన సామర్ధ్యం తగ్గిపోవడం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికో సుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లయితే భవిష్యత్లో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానవులు, వన్యప్రాణులపై మొబైల్ టవర్ల ప్రభావం -
కరాటేలో బాలుడి ప్రతిభ
సీతంపేట: విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పెద్దూరుకు చెందిన ఆరిక యాగ్నిక్ మంచి ప్రతిభ కనబర్చాడు. పోటీల్లో మొదటి బహుమతి సాధించడంతో యగ్నిక్ను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుగుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం గ్రామ శివారులోని ఎర్రచెరువు ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తిక రాంమోహన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట గ్రామంలోని ప్రతిభాభారతి కాలనీకి చెందిన రాంమోహన్ ఆదివారం కురుపాంలో పనులు ముగించుకుని లగేజీ ఆటోతో తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తుండగా కురుపాం దాటగానే వచ్చే ఎర్రచెరువు మలుపువద్ద ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొన్నాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన సాటి వాహనదారులు లగేజ్ ఆటోలో ఇరుక్కున్న రాంమోహన్ను బయటికి తీసి అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం 108 సిబ్బంది తరలించారు. తలకు చిన్నపాటి గాయం, కాలు విరిగిపోవడంతో ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు నిర్వహించనున్నట్లు కురుపాం పోలీసులు తెలిపారు. బాలుడికి తీవ్ర గాయాలుకొత్తవలస: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస నుంచి ఎల్.కోట వైపు ఆటో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొత్తవలసకు చెందిన బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో,కారు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డుసేఫ్టీ పోలీసులు హూటా హుటిన వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. బైక్పైనుంచి కింద పడి మహిళకు గాయాలురామభద్రపురం: మండలకేంద్రంలోని టీబీఆర్ సినిమా థియేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేగాల శ్రీనివాసరావు ఆయన భార్య కల్యాణి విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ద్విచక్రవాహనంపై పార్వతీపురం జిల్లాలోని చెక్కవలస వివాహానికి వెళ్తున్నారు. రామభద్రపురంలోని థియేటర్ వద్దకు వచ్చేసరికి కల్యాణికి చెందిన చున్నీ వాహనం వీలుకు చుట్టుకోవడంతో బైక్పై నుంచి ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోగా తలకు గాయమైంది. దీంతో స్థానిక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంసీతానగరం: మండలంలోని గుచ్చిమి–జోగింపేట గ్రామాల మధ్య రైల్వేట్రాక్ దాటుతున్న గుచ్చిమి గ్రామానికి చెందిన మరిపి అప్పలనాయుడి(33)ని ఆదివారం ఉదయం రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన రైల్వే హెచ్సీ రత్నకుమార్ మాట్లాడుతూ గుచ్చిమి గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం ఉదయం తోటకు వెళ్లడానికి ఇంటినుంచి బయల్దేరి మార్గమధ్యంలో ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. ట్రాక్ పక్కనే ఉన్న మృతదేహాన్ని గమనించిన రైల్వేసిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. -
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
విజయనగరం క్రైమ్: సైబర్ మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తతే ప్రతి ఒక్కరి ఆయుధమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని అలాగే 1930 టోల్ ప్రీ నంబర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజల అవగాహన లోపం కారణంగా సైబర్ మోసాలకు గురవుతున్నారన్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పే మాయ మాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. సైబర్ మోసాల నియంత్రణలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు లాంటి అంశాలను హ్యాకర్లు లేదా సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటి వివరాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు, అప్లికేషన్లను క్లిక్ చేయవద్దని, ఎవరైనా వ్యక్తిగత సమాచారం ఫోన్ ద్వారా అడిగితే ఇవ్వవద్దని, శంకించ దగిన వెబ్ సైట్లను వినియోగించ వద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం టోల్ ఫ్రీ నంబర్ 1930 ఎస్పీ వకుల్ జిందల్ సూచన -
ముగిసిన బదిలీ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది బదిలీ ప్రక్రియ గత నెల 29 నుంచి ఆదివారం వరకు ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ నేతృత్వంలో నిర్వహించగా ఆదివారం ఈ ప్రక్రియ ముగిసినట్లు పీఓ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, అలాగే బోధనేతర సిబ్బందికి బదిలీలకు సంబంధించిన పత్రాలను ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన ఆదివారం అందజేశారు. జీఓ23 అమలు సరికాదు బదిలీలపై యూటీఎఫ్ కార్యదర్శి మురళీమోహన్ మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి సంబంధించిన జీఓ నంబర్ 23ను అనుసరించి బదిలీ ప్రక్రియ నిర్వహించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు జీఓ నంబర్ 22 మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల తరఫున ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
విజయనగరం క్రైమ్: సాలూరుకు చెందిన ఓ పత్రిక విలేకరి కొడుకు విజయనగరంలోని జొన్నవలస రైల్వేట్రాక్పై ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరులో 2019లో సీఐగా పనిచేసిన శ్రీనివాస్ పర్సనల్ ఫోన్ నంబర్కు ఆ విలేకరి ఫోన్ చేసి తన కొడుకు విజయనగరంలో రైల్వేట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో సందేశం పెట్టాడని, తన కొడుకును కాపాడాలంటూ వేడుకున్నారు. దీంతో ప్రస్తుతం విజయనగరం వన్టౌన్ సీఐగా ఉన్న శ్రీనివాస్ విలేకరి ఫోన్ చేయగానే సరాసరి జొన్నవలస రైల్వేగేట్కు వెళ్లారు. అక్కడే కళ్లముందే రైల్వేట్రాక్పై యువకుడు పడుకోవడాన్ని చూసి వెనువెంటనే బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. వివరాలు అడిగితే తాను చనిపోవాలని అనుకుంటున్నానని , ఎందుకో కారణం చెప్పక పోవడంతో వన్టౌన్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం యువకుడి తల్లిదండ్రులను పిలిపించి స్టేషన్లోనే ఆ కుర్రాడికి వన్టౌన్ సీఐ తన బృందంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. -
జాతీయస్థాయి దివ్యాంగుల పోటీలకు తోషిని ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న దివ్యాంగుల క్రీడల పోటీలకు తెర్లాం మండలకేంద్రానికి చెందిన అడ్డా తోషిని ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన తోషినిని శనివారం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారని తెర్లాం హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు సునీల్ ఆదివారం తెలిపారు. గత నెలలో ఏలూరు జిల్లా ఆరిగిపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత్ పోటీల్లో తోషిని బోసిగేమ్లో పాల్గొంది. ఈ ఆటలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించి గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు తోషిని ఎంపికై ంది. తోషిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తెర్లాం హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. సన్మానించిన జిల్లా మంత్రి శ్రీనివాస్ -
స్కానింగ్ వివరాలపై ప్రతీ నివేదిక అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి రోజూ ఎన్ని స్కానింగ్లు జరుగుతున్నాయనే అంశంపై ప్రతీ రోజు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శనివారం లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజు వారీగా జరుగుతున్న ప్రసవాలను నమెదు చేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజు సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన గర్భస్రావాల సమాచారం కూడా వెంటనే అందజేయాలన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సమాచారాన్ని వెంటనే ఒక నివేదిక రూపంలో అందజేయాలన్నారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లోనూ లింగ నిర్ధారణ సమాచారం తెలియజేయడం జరగదనే బోర్డులు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే చార్జీల వివరాలతో కూడిన ధరల పట్టికను కూడా బోర్డుల రూపంలో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులు తనిఖీ చేసిన నివేదిక ఇచ్చిన తర్వాతే వాటికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎల్వో డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, ఆర్బీఎస్కే పీవో డాక్టర్ సుబ్రమణ్యం, డీఐవో డాక్టర్ ఆర్, అచ్చుతకుమారి, డీపీహెచ్ఎన్వో సత్యవతి, డెమో చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
విక్రంపురంలో గంజాయి కలకలం..!
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ పాఠశాల వద్ద కొందరు యువకులు మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సిరిపురం గౌతమ్ అనే యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిపై గంజాయి మత్తులో దాడి చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు గౌతమ్ను ప్రశ్నించగా వారిపై ఇటుక రాళ్లతో దాడికి దిగాడు. దీనిపై ఆరా తీయగా ఆ యువకుడు తెల్లవారి నుంచే మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా గ్రామంలో తిరుగుతూ ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడం అలవాటైందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ యువకుడితో పాటు గ్రామానికి చెందిన పలువురిని గంజాయికి బానిస చేస్తున్నాడని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ ఆగడాలు గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బాలుడి తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తొమ్మిదేళ్ల బాలుడిపై దాడి -
నిఘా పెంచి మాదక ద్రవ్యాలకు
● క్యూఆర్ కోడ్తో సమాచారం ● జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురం టౌన్: జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిఘా అధికం చేయడం మాత్రమే కాకుండా వాహనాలను ఆకస్మిక తనిఖీలను చేపట్టడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో మున్సిపాలిటీలు కనీసం 5వందల సీసీ కెమెరాలు సమకూర్చాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 1972 టోల్ ఫ్రీ నంబరుకు అందించాలని కోరారు. ఆర్టీసీ బస్సులలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి వివరాలతో అవగాహన పోస్టర్లను పెట్టాలన్నారు. అటవీ శాఖ అధికారులు ఆధునిక పరిజ్ఞానంతో అటవీ ప్రాంతంలో జరిగే మాదకద్రవ్యాల నియంత్రణ కార్యక్రమంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్యూఆర్ కోడ్లతో సమాచారం క్యూఆర్ కోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మాదక ద్రవ్యాల సమాచారంపై ప్రజల స్పందన కూడా తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు 21 పోలీస్స్టేషన్ల పరిధిలో 7841 మంది ప్రజలు పాల్గొని స్పందన అందించారన్నారు. డ్రోన్ సర్వేలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు స్వయం రక్షణ పద్ధతులు నేర్పించడం, పాఠశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్బులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. జనవరి నుంచి మే వరకు మాదక ద్రవ్యాలకు సంబంధించి 11 కేసులను నమోదు చేశామని, ఇందులో 1875 కేజీల గంజాయి రవాణా చేయడం జరిగిందన్నారు. రవాణా శాఖ అధికారి ఎం.శశికుమార్ మాట్లాడుతూ రవాణా శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుందని, 199 కేసులను బుక్ చేయడం జరిగిందని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో నవోదయం రెండవ దశ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. 27 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు. సంయుక్తంగా దాడులు ఆంధ్రా – ఒడిశా అధికారులు సంయుక్తంగా దాడులను నిర్వహించడం జరిగిందని, ఇందులో 50 వేల ఐదు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సారా తయారీకి సహకరిస్తున్న 64 మంది బెల్లం వ్యాపారులను గుర్తించామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి గయాజుద్దీన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం వినోద్, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటిబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీషబాబు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ దొంగతనం జరిగిన ఇంటి పూజాగది, పరిసరాలను శుక్రవారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో రెండున్నర గంటల పాటు చర్చించి పలు సూచనలు చేశారు. దొంగతనం జరిగిన ఇంటి ముందు ఉన్న సీసీ కమోరా దొంగతనం జరిగిన రోజు సాయంత్రం 6 గంటలకు ఆగిపోవడం, కెమోరాకు సంబంధించిన వైరు తెగిపోయి ఉండడాన్ని చూసి.. అక్కడ నుంచే దర్యాప్తును ప్రారంభించారు. ట్రస్టులో పని చేస్తున్న ఐదుగురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ జరపగా చోరీ చేసిన తీరును తెలిపినట్టు సమాచారం. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చోరీ అంతా ట్రస్టులో పనిచేసే ఒక బిగ్బాస్ ఆధ్వర్యంలో జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం శనివారం సాయంత్రం మరింత లోతుగా దర్యాప్తు చేసింది. అసలు చోరీకి గురైన బంగారం ఎంత? జగదీష్బాబు ఇంట్లో జరిగిన చోరీలో ఎంత మొత్తంలో బంగారాన్ని దొంగలు అపహరించుకుపోయారనే విషయంలో స్పష్టతలేదు. పోలీసులు మాత్రం కేవలం 90 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు పోయినట్టు కేసు నమోదు చేశారు. వాస్తవానికి అంతకు 10 రెట్లు బంగారం, పెద్ద మొత్తంలో నగదును దోచుకుపోయారన్న వాదన వినిపిస్తోంది. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తును పర్యవేక్షించడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇప్పటికే అదుపులో ఐదుగురు అనుమానితులు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
● మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన గిరిజనులు పార్వతీపురం రూరల్: మండలంలోని డీకే పట్నం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పీడిక అప్పన్న (55), ఊయక రమేష్ (25) మృతి చెందారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సందివలస గ్రామానికి చెందిన పీడిక అప్పన్న అల్లుడు వరుసైన ఒడిశాలోని కార్లి గ్రామానికి చెందిన రమేష్తో ద్విచక్ర వాహనంపై సంధివలస నుంచి సొంత పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం డీకే పట్నం సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలం వద్ద రమేష్ మృతి చెందగా, డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ పీడిక అప్పన్న మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తప్పిన ప్రమాదం వంగర: మండల పరిధి మగ్గూరు కూడలి వద్ద శనివారం పెనుప్రమాదం తప్పింది. వరి నూర్పిడి అనంతరం కళ్లం నుంచి గ్రామంలోకి తీసుకువస్తున్న నూర్పిడి యంత్రం ఒక్కసారిగా బోల్తాపడింది. దీనిపై కూర్చున్న వేతనదారులు ప్రమాదాన్ని అంచనావేసి దూకేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రోడ్డుపై బోల్తాపడిన నూర్పిడి యంత్రాన్ని జేసీబీ సహాయంతో సరిచేశారు. -
పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
విజయనగరం అర్బన్: పశువుల అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ ఆదేశించారు. తన కార్యాలయంలో డివిజన్ జంతు సంక్షేమ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లొట్లపల్లి, మోపాడ జంతువులు మరియు పశువుల సంతల్లో పశువులను హింసాత్మకంగా అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంతకు లైసెన్స్ లేకపోయిన అక్రమంగా సంత నిర్వహిస్తున్నట్టు దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పశువధశాల లేకపోయినా పశుమాంస వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్స్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గో సంరక్షణ క్యాలెండర్ను ఆర్డీవో ఆవిష్కరించారు. సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఆరికతోట మోహనరావు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు, పి.అనురాధ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చంద్రశేఖర్రావు, డివిజన్ పరిధిలో మండలాధికారులు, గో సంరక్షణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ -
సారా రహిత విజయనగరం
విజయనగరం టౌన్: జిల్లా అబ్కారీ శాఖ అందించిన సమాచారం విజయనగరం జిల్లాను సారా రహిత ప్రాంతంగా ప్రకటిస్తూ నవోదయం కమిటీలో తీర్మానం చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టరేట్లోని నవోదయం 2.0 అమలుపై శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మద్యం బెల్టు షాపులు అధికంగా ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదుచేయాలన్నారు. జిల్లాలోని 27 మండలాలు 771 రెవెన్యూ గ్రామాల పరిధిలో 26 సారా ప్రభావిత గ్రామాలను గుర్తించామని, 414 పాత ముద్దాయిలను, 26 మంది బెల్లం వర్తకులను గుర్తించి బైండోవరు చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. సమావేశంలో ఎౖకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కేవీవీఎన్ బాబ్జీరావు, సహాయ సూపరింటెండెంట్ దొర, డీఎంహెచ్ఓ జీవనరాణి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మద్యం బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు కలెక్టర్ అంబేడ్కర్ -
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మందిపై ఒక్క రోజులోనే కేసులు నమోదు చేసి విజయగరం అడిషనల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఎంఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి ఒకొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం 49 మందికి రూ.4.90 లక్షల జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా ఎస్జీటీల కౌన్సెలింగ్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం జరిగింది. ఎస్జీటీ 37, ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ పోస్టులు ముగ్గురికి చొప్పున బదిలీ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏపీవో చిన్నబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవీ, జీసీడీవో రాములమ్మ, హెచ్ఎంలు పి.నారాయుడు, సూర్యం తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు పార్వతీపురం టౌన్: నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు పంపిణీ చేయనున్నట్టు జీసీసీ మేనేజరు ఎం.సాంబశివురావు అన్నారు. ఈ మేరకు శనివారం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జీసీఎంఎస్ బ్రాంచి పరిధిలో 17 డిపోల సేల్స్మెన్స్, గోదాముల సూపర్వైజరు్ల్ ఆదివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి వుంచాలన్నారు. వినియోగదారులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా పంపిణీ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు. జీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో బోల్తా.. శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర పంచాయతీ ధారపర్తి పరిధిలో పల్లపు దుంగాడ నుంచి దబ్బగుంటకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో ఆటోలో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం విజయనగరం క్రైమ్: నగరంలోని పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న కారు పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద వెనుక నుంచి వస్తూ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో రావివలస పంచాయతీకి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టు టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు
పార్వతీపురం: బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకదుర్గ అన్నారు. పట్టణంలో సౌందర్య థియేటర్ రోడ్డులో బాల్య వివాహాలను నిర్మూలించడానికి, బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలకు మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రచార రఽథాన్ని శనివారం ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ కోసం ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందన్నారు. బాలల హక్కుల రక్షణ మిషన్( ఎన్సీపీసీఆర్), రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్(ఎస్సీపీసీఆర్) గూర్చి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార రథం బాలల హక్కుల రక్షణ కోసం ఒక అవసరమైన సాధనంగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీపీవో అల్లు సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగీ కేసులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు ఉండరాదని, వాటి నివారణకు పూర్తి చర్యలు తీసుకోవాలని, అలాగే పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐఎంఆర్, ఎన్ఎంఆర్ మరణాల రేటును తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీవో తేల్చి చెప్పారు. ఈ విషయంలో వైద్యాధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ఉప జిల్లా వైద్యశాఖాధికారి కేవీఎస్ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎం.వినోద్కుమార్, ఐటీడీఏ పరిధిలో వున్న మండలాల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
విధుల్లో అంకితభావంతోనే గుర్తింపు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో తమ విధుల్లో నైపుణ్యత చూపి చేసిన సేవలు చిరస్థాయిగా పలువురికి ఆదర్శంగా, ఆచరణీయంగా ఉంటూ పదిలంగా ఉంటాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన మెట్ట సుదర్శన వెంకటప్రసాద్ను శనివారం ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 40ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి, శాఖపై ప్రజలకు మరింత భరోసా కల్పించిన వారి గుర్తింపు చిరస్థాయిగా ఉంటుందని ఎస్పీ అన్నారు. పోలీసు శాఖ వారి కుటుంబానికి అవసరమైనపుడు ఆదుకొనేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్ఐకు ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్పీ ఎస్ఐ దినకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
● ప్రభుత్వ తొందరపాటు చర్యలతో వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం ● రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు ● 66,363 పేపర్ల మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు ● 11వేల పైగా పేపర్లో విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కుల మార్పు ● విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజయనగరం గంటస్తంభం: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, విద్యారంగాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు దుయ్యబట్టారు. అమర్ భవన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా పరీక్షలు పూర్తయిన 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని విద్యాశాఖమంత్రి గొప్పలు చెప్పుకున్నారు. తీరా ఈ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు అసహనం చెందడంతో పాటు మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రచారం ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ ఫలితాల విడుదలలో చూపలేదు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేస్తే.. ఫెయిలైన 11,000 మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. చాలా మందికి సబ్జెక్టు మార్కుల శాతం భారీగా పెరిగాయి. ప్రభుత్వం తప్పుడు ఫలితాలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చందని వాపోయారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు నోరుమెదపకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీ శంకర్, పట్టణ కార్యదర్మి ఏ.సమన్, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత సంక్షేమమే తమ లక్ష్యమని కూటమి నేతలు నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టాక ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తయ్యాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరుమార్చారే తప్ప పైసా పెట్టుబడి సాయం విదల్చలేదు. 2025 ఖరీఫ్ సీజన్ ఆసన్నమై సాగు
● ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా అందని పెట్టుబడి సాయం ● విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక విలవిల ● వైఎస్సార్ రైతుభరోసా పథకానికి పేరుమార్పేతప్ప సాయం శూన్యం ● ఉచిత పంటల బీమా పథకానికి మంగళం ● రైతులే బీమా ప్రీమియం చెల్లించుకోవాల్సిన దుస్థితి ● గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రైతుభరోసా కింద రూ.1466.96 కోట్లు సాగుసాయం ● పంటల బీమా కింద రూ.33 కోట్ల చెల్లింపు విజయనగరం ఫోర్ట్: నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వరి విత్తనాలు జల్లేందుకు నారు మడులు, వెద పొలాలను సిద్ధం చేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ , తదితర మెట్ట పంటల సాగుకు ఉపక్రమించారు. అయితే, విత్తనాలు కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక పోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం ఠంచన్గా అందజేస్తామని కూటమి సర్కా రు గొప్పలు చెప్పిందని, గద్దె నెక్కిన మొదటి ఏడా దే రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శిస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలును తక్షణమే అందజేయాని డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సాగుసాయం ఏటా సీజన్వారీగా అందేది. ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు అధిక ప్రయోజనం కలిగేది. ప్రభుత్వ భరోసాతో సాగుపై ఆసక్తి చూపేవారు. నేడు ఆ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటున్నారు. ఐదేళ్లలో రూ.1466.96 కోట్లు అందజేత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2023 వరకు ఐదేళ్లలో రైతులకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్’ కింద రూ.1466.96 కోట్ల సాగుసాయం అందింది. పంటల బీమా కింద ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో నాలుగేళ్లలో రూ. 33.08 కోట్ల పరిహారం అందించింది. -
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
విజయనగరం అర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ రకాల ఉపకరణాలను శనివారం పంపిణీ చేశారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో సాగుతున్న సహిత విద్యలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. హియరింగ్ ఎయిడ్స్–35, వీల్చైర్లు 13, టీఎల్ఎం ప్రైమరీ కిట్లు 11, సెకండరీ కిట్లు 10, క్రచ్ ఎల్బోలు 2, త్రీవీలర్ సైకిల్స్ 2, రోల్లేటర్ అడల్ట్ 3, చైల్డ్ 2, ఫోల్డింగ్ వీల్చైర్లు 8, బ్యాటరీ ట్రైసైకిల్స్ 2, విభిన్న ప్రతిభావంతుల వీల్చైర్ 1 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. డీఎస్సీలో భర్తీ చేయనున్న 2,200 స్పెషల్ టీచర్ పోస్టులతో ప్రత్యేకావసరాల పిల్లలకు విద్యాబోధన మరింత చేరువవుతుందని చెప్పారు. డీఆర్వో మురళి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. సహిత విద్య అన్నది విశిష్ట పథకమని పేర్కొన్నారు. డీఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ రామారావు మాట్లాడుతూ, తమ శాఖాపరమైన కార్యక్రమాలు, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. స్పెషల్ ఒలింపిక్స్లో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపికై న అడ్డ తోషిని, కె.సంతు, ఈనుమల యశ్వంత్, రాజాన అజయ్, కొప్పర విజయ్కుమార్తో పాటు కోచ్లు పి.సునీల్, బంగారునాయుడును మంత్రి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూపాయి ఇవ్వలేదు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. – ఆర్.దేవుడు, రైతు, పెదవేమలి గ్రామం రైతన్నకు కష్టకాలం రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు కష్టకాలం మొదలైంది. ఏటా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమాతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోంది. – తలారి బ్రహ్మ, రైతు, తమ్మారాయుడుపేట, గజపతినగరం -
ఏడాది కూటమి పాలనలో... అభివృద్ధి, సంక్షేమం శూన్యం
● జెడ్పీచైర్మన్ మజ్జిశ్రీనివాసరావు ధ్వజం ● రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది ● ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసినదేమీ లేదు ● సూపర్సిక్స్ హామీలను గాలికి వదిలేశారు ● ఏడాదిలో లక్షా 50 వేల కోట్లు అప్పుచేసినా పథకాలు అందజేయని వైనం ● జూన్ 4న ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ మెరకముడిదాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్లను మెరకముడిదాంలో స్థానిక నాయకులతో కలిసి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ఏడాది కాలంలో లక్షా 50 వేల కోట్లు అప్పు చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పని చేపట్టలేదని, అప్పుచేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. రైతుల పంటల సాగుకు భరోసా లేదు, చదువుతున్న చిన్నారులకు తల్లికి వందనం లేదు.. మహిళలకు ఉచిత బస్సును సైతం తుస్సుమనిపించారని విమర్శించారు. ఒక్కపథకమూ అమలుచేయలేక, ప్రజలకు మోహాలు చూపించలేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు తిరగడం మానేశారన్నారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని, కనీసం సమావేశాలకు కూడా రాకుండా మోహంచాటేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల పిల్లల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని, నాడు–నేడు పనులతో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందించిందన్నారు. నేడు పనులు చేసినా బిల్లులు అందడం లేదంటూ కూటమికి చెందిన నాయకులే గగ్గోలు పెడుతున్నారన్నారు. పదోతరగతి ఫలితాల ప్రకటనలో వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి లోకేశే కారణమన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసిన ఫెయిలైన 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బోనెల గోపి, సత్తారు శ్రీనివాసరావు, టి.వర్మరాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
పంటల బీమా ప్రీమియం తామే చెల్లించాం..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల తరఫున పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పంట నష్టపోతే వెంటనే పరిహారం అందేది. రైతులకు సాగుభరోసా కలిగేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులనే బీమా ప్రీమియం కట్టుకోమని చెప్పింది. రబీలో అపరాలకు తామే బీమా ప్రీమియం చెల్లించుకున్నాం. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్కరూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. – వెలగాడ రామసూర్యం, రైతు, కొత్త వెలగాడ గ్రామం -
పోలీసులకు సవాల్గా మారిన చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో జరిగిన భారీ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎటువంటి జాడ దొరకకపోవడంతో పోలీసులు ముల్లగుల్లాలు పడుతున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వకుల్జిందాల్ శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా వెళ్లిపోయారు.. ఎంతమేర చోరీకి గురైయింది తదితర అంశాలను బాధితుడు జగదీష్బాబును అడిగి తెలుసుకున్నారు. దొంగతనం జరిగిన పూజాగదిని పరిశీలిచారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, కొత్తవలస, ఎస్.కోట సీఐలు షణ్ముకరావు, వేచలపు నారాయణమూర్తి, లక్కవరపుకోట, వేపాడ ఎస్ఐలు నవీన్పడాల్, సుదర్శనరావు, ఎస్బీ, ఇంటిలిజెన్స్ అధికారులతో ట్రస్టు సమీపంలో గల ఒక గదిలో ప్రత్యేక సమావేశాన్ని ఎస్పీ ఏర్పాటుచేశారు. దర్యాప్తు తీరుపై పలు సూచనలిచ్చారు. అసలు ఎంత మేర బంగారు చోరీకి గురైయిందన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కేసులో నమోదు చేసిన అంశాలకు, వాస్తవంగా చోరీకి గురైన బంగారానికి పొంతన లేనట్టు సమాచారం. అనంతరం ఎస్పీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, సాంకేతిక ఆధారాలతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మంగళపాలెం గురుదేవా ట్రస్టు చైర్మన్ ఇంటిని పరిశీలించిన ఎస్పీ అన్నికోణాల్లో దర్యాప్తు -
ఈ కమిషనర్ మాకొద్దు
● నెల్లిమర్ల కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం ● కమిషనర్ తారక్నాథ్ పనితీరు బాగోలేదని ధ్వజం ● ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ ● కమిషనర్ లంచం తీసుకున్నట్టు సమావేశంలో పలువురి సాక్ష్యం నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. కమిషనర్ తారక్ నాథ్ తీరుతో తమకు చెడ్డపేరు వస్తోందని, ప్రతి పనికి లంచాలు తీసుకుంటున్నారని సమా వేశంలో సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తమకు వద్దని, వెంటనే ఇక్కడ నుంచి పంపించివేయాలని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదరు తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కు పంపించాలని చైర్పర్సన్ సరోజినికి సూచించారు. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. కమిషనర్ తీరుపై మండిపాటు కమిషనర్ తారక్నాథ్ తీరుపై సమావేశంలో మెజారిటీ సభ్యులు ధ్వజమెత్తారు. పట్టణంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని సభ్యులు చిక్కాల సంతోష్ కుమార్, లెంక హైమావతి, చిక్కాల సుమతి, అవనాపు సత్యనారాయణ తదితరులు విరుచుకుపడ్డారు. బైరెడ్డి సంతోష్ అనే వ్యక్తి నుంచి రూ.15 వేలు, ధనుంజయ్నాయుడు అనేవ్యక్తి నుంచి రూ.10 వేలు, ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. వారితో సమావేశంలో చెప్పించారు. ప్రతిరోజూ వార్డు పర్యటన పేరుతో ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నట్లు ఆరోపించారు. సదరు యజమానులను సాయంత్రం వేళ కార్యాలయానికి రప్పించుకొని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులను కమిషనర్ చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయడానికి కమిషనర్కు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. కమిషనర్ తప్పులు చేసి, ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. పలు తీర్మానాలకు ఆమోదం.. ఆశీళ్ల వసూలు చేసుకునే వేలం మొత్తం తగ్గించాలని సమావేశంలో తీర్మానించారు. జరజాపుపేటలో షాపు ల లీజుకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. కోటి రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు తిరిగి టెండర్లు పిలవాలనే తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. బైరెడ్డి సూర్యనారాయణ మున్సిపల్ కల్యాణ మండపాన్ని రూ.20 లక్షలతో అభివృద్ధి చేసేందుకు, పట్టణంలో ఉన్న 267 అక్రమ కుళాయి కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లు చిక్కాల సంతోష్ కుమార్, మైపాడ ప్రసాద్, చిక్కాల సుమతి, జానా సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
–10లో
● నాడు–నేడుతో ఆకర్షణీయం పొగాకు జోలికి పోకు..! పొగాకు ఉత్పత్తులు తినడం, పొగాకు తాగడం కారణంగా జిల్లాలో గుండెపోటు, కేన్సర్, వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పొటోలోనిది అదే రేగిడి మండలంలోని అదే వండానపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలివిడత ‘మనబడి నాడు–నేడు’ కింద పాఠశాలకు సదుపాయాల కల్పన కోసం రూ.21 లక్షలు నిధులు మంజూరు చేసింది. రూ. 17,50,396లతో పాఠశాలలో వసతి సదుపాయాలతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, టైల్స్తో కూడిన గచ్చులు, ప్రహరీ, డిజిటల్ లైబ్రరీ, బెంచీలు వంటి సకల సదుపాయాలు కల్పించింది. అంతే, పాఠశాలలో చదుకునేవారి సంఖ్య 23 నుంచి ఒకేసారి 52కి పెరిగింది. ఇప్పుడు ఈ గ్రామ చిన్నారులందరూ ఇక్కడే చదువుకునేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. -
రామనారాయణంలో యోగాంధ్ర
విజయనగరం: పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రామధనుస్సు ఆకృతిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్, జేసీ ఎస్.సేతుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు వేశారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు డా.ఆరిశెట్టి ఇందుమతి, ఆరి సుందరశివరావు సుమారు 45 నిముషాల పాటు యోగసనాలు వేయించారు. అనంతరం యోగాంధ్రలో పాల్గొన్నవారందరూ రామనారాయణం దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రి, కలెక్టర్, జేసీలను ఎన్సీఎస్ ట్రస్టు సభ్యులు సత్కరించారు. ఆరోగ్య పరిరక్షణకు మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప ఆస్తి యోగా అని మంత్రి పేర్కొన్నారు. వచ్చేనెలలో చింతపల్లి బీచ్, రామతీర్థం, తాటిపూడి రిజర్వాయర్ తదితర ప్రదేశాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్టు ప్రతినిధులు చంద్రకళ, రామనారాయణం మేనేజర్ శ్రీనివాసరావు, ఆయుష్ జిల్లా అధికారి డా.బి.వరప్రసాద్, యోగాంధ్ర ప్రత్యేక అధికారి ఎం.ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు. జూన్ 10న ఎస్.కోటలో... విజయనగరం అర్బన్: ఉపాధి హామీ వేతనదారులతో జూన్ 10వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎస్.కోటలో నిర్వహించనున్నట్టు జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. సుమారు 5 వేల మంది వేతనదారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై తన చాంబర్లో జేసీ శుక్రవారం సమీక్షించారు. ఐదు వేల మంది పాల్గొనేందుకు అనువైన ప్రాంగణాన్ని గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డ్వామా పీడీ శారదాదేవీ, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, డీఎల్డీఓ రోజారాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీఈఓ మాణిక్యంనాయుడు, సెట్విజ్ సీఈఓ అల్లు సోమేశ్వరరావు, మెప్మా పీడీ చిట్టిరాజు, డీఎంహెచ్ఓ జీవనరాణి, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, తదితరులు పాల్గొన్నారు. రామధనుస్సు ఆకృతిలో 1500 మంది యోగాసనాల ప్రదర్శన పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్ -
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
● డీఐఐపీసీ సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు, యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామికవాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్దద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాల పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో ఏపీఐఐసీకి ఇప్పటి వరకు సుమారు 2,400 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ వాటిలో కేవలం 300 పైచిలుకు ఎకరాలను మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భూముల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, విజయనగరం ఆర్డీఓ టి.సవరమ్మ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంఝావతి ఆయకట్టుదారుల గోడువినండి బాబూ.. ● జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు ● తక్షణమే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ కొమరాడ: జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు డిమాండ్ చేశారు. ఆయకట్టు రైతులు, సమితి సభ్యులతో కలిసి జంఘావతి రబ్బరు డ్యామ్ వద్ద శుక్రవారం పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం పూర్తయిన రబ్బర్డ్యాం వల్ల సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రా జెక్టు పూర్తిచేస్తే మరో 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారం కాక ప్రాజెక్టు పూర్తికావడం లేదన్నారు. ప్రస్తుతం ఒడిశా, ఆంధ్రపదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉందని, నాయకులు దృష్టిసారిస్తే ప్రాజెక్టు సమస్య కు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ దిశగా స్థానిక కూటమి నాయకులు ప్ర భుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లోని భూములకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఎం.మాలతీకృష్ణమూర్తి నాయుడు, వి.దాలినాయుడు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. -
ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి
పార్వతీపురం రూరల్: మూస పద్ధతికి స్వస్తి పలికి నూతన విధానాలను అవలంబించి క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసి సమర్ధవంతంగా శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీటవేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పురోగతి ఎస్సీ,ఎస్టీ కేసులు, ప్రయారిటీ పీటీ కేసుల స్థితిగతులు అక్రమ మద్యం, మిస్సింగ్, సైబర్ నేరాలు, నాన్బెయిల్బుల్ వారెంట్లు తదితర కేసులకు సంబంధించిన విషయాలపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఎస్పీ వాటికి తగిన సూచనలు, సలహాలు, మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురంలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాలని ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉన్నారో? లేదో? అని ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టి సమాచారం సేకరణ క్షుణ్ణంగా చేసి అక్రమ రవాణాపై దృష్టిసారించాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు. ప్రశంసాపత్రాల అందజేత విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే వార్షిక ఫైరింగ్ శిక్షణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన అధికారులు, సిబ్బందికి కూడా ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సోషల్ మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ రాంబాబు, సీఐలు, ఎస్లు, ఎకై ్సజ్ అధికారులు, మెడికల్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
యోగాంధ్రలో వైద్యశాఖ మమేకం
పార్వతీపురంటౌన్: యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ పాల్గొంటుందని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమం శనివారం పార్వతీపురం లయన్స్ క్లబ్లోను, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, పాలకొండలోని రామ కళామందిర్ థియేటర్ దగ్గర గల గాయత్రి కల్యాణ మంటపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శారీరక, మానసిక ఉల్లాసం, ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీఎంహెచ్ఓ ఎస్.భాస్కర రావు -
పిడుగుపాటుతో యువకుడి మృతి
వేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట గ్రామానికి చెందిన సిమ్మ శ్రీనివాసరావు (33) శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పశువులను గ్రామ సమీపంలో ఎర్రబంద వద్ద మేపుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి తల్లి కృష్ణమ్మ ఇద్దరి చెల్లెళ్లు భాగ్య, లావణ్య ఉన్నారు. మరో రెండు పాడి ఆవులు.. లక్కవరపుకోట/కొత్తవలస: లక్కవరపుకోట మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో రెండు పాడిఆవులు మృతిచెందాయి. మార్లాపల్లి గ్రామానికి చెందిన గోగాడ దేముడు, ఖాసాపేట గ్రామానికి చెందిన నెల్లి అప్పలనాయుడుల రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతిచెందాయి. -
సబ్జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జి
శృంగవరపుకోట: పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి డా.ఎ.కృష్ణప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ కేసుల సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే మండల న్యాయసేవా కమిటీ ద్వారా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఖైదీలకు అందిస్తున్న సదుపాఽయాలపై ఆరా తీశారు. జైలు ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశీలించారు. న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా బయట ఉన్న పేదలు కూడా ఉచిత న్యాయసాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. జూలై 5న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని, కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాద సిబ్బంది పాల్గొన్నారు. -
బినామీ మస్తర్లు వేసుకున్న వారికి రికవరీ నోటీసులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉపాధిపనుల్లో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడిన విషయాన్ని సాక్ష్యాలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష అభియాన్ లో ఔట్సోర్సింగ్ పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సారాది సత్య నారాయణ బినామీ మస్తరు వేసుకోవడంతో అతనికి రూ. 1260 పేమెంట్ జనరేట్ అయింది. అదేవిధంగా సుంకరి సత్యనారాయణ అనే వ్యక్తి విశాఖపట్నం జిల్లా పధ్మనాభం మండలం అనంతవరంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా పనికి వెళ్లక పోయినా పనికి వెళ్లినట్టు బినామీ మస్తర్ వేయడంతో రూ.3276 పేమెంట్ జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమంది గ్రామంలో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడి వేలాది రుపాయిలు కొల్లగొట్టారనే విషయాన్ని సాక్షి బయట పెట్టింది. దీంతో ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీఓ ఈ అంశంపై విచారణ చేపట్టారు. వారి విచారణలో బినామీ మస్తర్లు వేసుకోవడం నిజమని తేలింది. దీంతో బినామీ మస్తర్లు వేసుకున్న ఇద్దరికి రికవరీ నోటీసులు ఇస్తున్నట్లు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. అదేవిధంగా వారిద్దరికి బినామీ మస్తర్లు వేసిన మేట్లు మంగ, లక్ష్మీకాంతానికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. మేట్లకు షోకాజ్ -
పొగాకు జోలికి పోకు..!
● ప్రాణాలు తీస్తున్న ధూమపానం ● నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ఆస్కారం ● పొగతాగేవారితో పాటు పక్కన పీల్చేవారికి ముప్పు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంమత్తెక్కించే వగలమారి వయ్యారి నువ్వు తోడైతే జీవితం ఎడారి మండుతూ ఆరోగ్యానికి ఎసరు పెడతావు పొగగా మారుతూ ఊపిరి తీస్తావు బూడిదవుతూ జీవితాలను బూడిద చేస్తావు వినోదం అని నీతో జత కడతారు పిచ్చి జనం వ్యసనంగా మారిపోవును నీతో సహవాసం విషాదంతో బజారు పాలవును కుటుంబం వదులుదాం..కదులుదాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు తినడం, పొగాకు తాగడం కారణంగా జిల్లాలో గుండెపోటు, కేన్సర్, వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితి బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మధుమేహ వ్యాధి అదుపులో లేకపోవడంతో ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది. సిగరెట్, చుట్ట తాగడం ఫ్యాషన్గా మారిపోతోంది. ఒకరిని చూసి మరొకరు సిగరెట్, చుట్టలు తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు. రోజురోజుకూ పొగతాగే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో పొగతాగే వారి సంఖ్య 30 శాతం వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఒక సిగరెట్ నిమిషం జీవితకాలాన్ని తగ్గించేస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకూడదన్న నిబఽంధన బుట్టదాఖలవుతోంది. సిగరెట్ తాగిన వారితో పాటు పక్కనున్న వారు ఆ పొగను పీల్చినా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గతంలో నిరాక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతవాసులు ఎక్కువగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కానీ నేడు పల్లె , పట్టణం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పొగతాగుతున్నారు. యువత సిగరెట్ తాగడానికి అలవాటు పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పొగ తాగడం వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిసినప్పటికీ అలవాటు అయిన వారిలో మార్పు రావడం లేదు. పొగతాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం. పొగతాగుతూ స్వయంగా అనారోగ్యం బారినపడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అనారోగ్యం పాలుచేస్తున్నారు. జిల్లాలో పొగతాగుతున్న వారిలో పురుషులు 20శాతం మంది కాగా మహిళలు 10 శాతం మంది ఉన్నారు. యవత 8శాతం మంది ఉన్నారు. పొగతాగడం వల్ల ప్రాణాంతక వ్యాధులు సిగరెట్, చుట్ట తాగడం, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల్ల ప్రాణంతకమైన కేన్సర్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్, నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆస్తమా, సీఓపీడీ వచ్చే ఆస్కారం ఉంది. వాటితో పాటు క్రానిక్ బ్రాంక్లైటిస్ వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. పొగతాగడం వల్ల నిమోనియా వ్యాధి అధికమవుతుంది. ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి అధికమవుతుంది. పొగాకును కొంతమంది ముక్కువద్ద పీల్చుతుంటారు. మరి కొంతమంది నోటి ద్వారా పీల్చుతుంటారు. పొగ ఎక్కువగా పీల్చడం వల్ల దాని ప్రభావం రక్తనాళాలు, నాడీ వ్యవస్థపై పడుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన రోగులు పడుతున్నారు. పొగ తాగేసి మానివేసినప్పటికీ వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుంది. సిగరెట్ తాగుతున్న వ్యక్తి స్మోకింగ్ వల్ల జీవిత కాలం తగ్గుతుంది సిగరెట్లు, చుట్టలు తాగడం వల్లజీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. అతితక్కువ వయస్సులో (30 నుంచి 35) ఏళ్లకే మొదడు పోటుకు గురయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు ఉబ్బి ఆస్తమా వంటి వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు అన్నవాహిక కేన్సర్, మూత్రాశ్రయం, లివర్, వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగతాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు మందులు వాడినా పనిచేయని పరిస్థితి. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు మానివేయడం కోసం చూయింగ్ గమ్స్, నికోటిన్ పేచర్స్ వాడుకోవాలి. డాక్టర్ బొత్స సంతోష్కుమార్ పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఏడాదికి రూ.1.20 కోట్ల వ్యాపారం అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. ఏడాదికి రూ.1.20 కోట్ల వరకు సిగరెట్లు, చుట్టల కోసం ఖర్చు చేస్తున్నారు. సామన్య ప్రజలు చుట్టలు, తక్కువ రకం సిగరెట్లు తాగుతున్నారు. సంపన్నవర్గాలు వారు ఖరీదైన సిగరెట్లు తాగుతున్నారు .2024 –25లో కేన్సర్ బారిన 299మంది 2024–25 లో జిల్లాలో 299 మంది నోటి, గొంతు కేన్సర్ బారిన పడ్డారు. ఊపిరితిత్తుల కేన్సర్ , ఆస్తమా, సీఓపీడీ వ్యాధుల బారిన జిల్లాలో 5 వేల నుంచి 6 వేల మంది పడుతున్నారు. కేన్సర్ ముదిరినంత వరకు గుర్తించలేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారు. కేన్సర్ను ప్రారంభదశలో గుర్తిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ ముదిరితే మరణమే శరణ్యం. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపుమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి హుండీల ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్యర్యంలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడి, వనంగుడి ఆలయాల్లో మార్చి 28వతేదీన హుండీలను ఏర్పాటుచేశారు. అప్పటినుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీలలో సమర్పించుకున్న కానుకలు లెక్కించగా, రూ.3,99,618 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో సాలూరు గ్రూపు దేవాలయాల కార్యనిర్వాహణ అధికారి టి.రమేష్, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.జూన్ 2న కలెక్టరేట్ ఆవరణలో ధర్నాపార్వతీపురం: జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ డీఈఓను నియమించాలని కోరుతూ జూన్ 2న కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్నట్లు గిరిజన సంక్షేమ సంఘ ప్రధానకార్యదర్శి పాలక రంజిత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత వరుసగా మూడుసార్లు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ప్రధమ స్థానం సాధించిన జిల్లాకు పూర్తి స్థాయి డీఈఓను నియమించకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ నియమాకంలో జిల్లా ఉన్నతాధికారులు తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పూర్తిస్థాయి డీఈఓను నియమించేంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యజియ్యమ్మవలస రూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తూ గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జియ్యమ్మవలస మండలంలోని పరజపాడు గ్రామంలో జరిగింది. దీనిపై చినమేరంగి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన శంబంగి గోపి నాయుడు(51) కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధడుతున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 10గంటల సమయంలో భార్య ఉపాధి పనులకు వెళ్లిన అనంతరం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు 108 సహాయంతో చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలపగా చినమేరంగి ఎస్సై పి.అనీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశాఉ. తెలిపారు. మృతి చెందిన గోపినాయుడికి భార్య అన్నపూర్ణమ్మ, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు శిరీష, సౌజన్యలు ఉన్నారు. -
హక్కుల పట్ల గిరిజనులకు అవగాహన ఉండాలి
పార్వతీపురంటౌన్: గిరిజనులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించినట్లు తెలిపారు. గిరిజన హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సబ్జైల్ ఆకస్మిక తనిఖీ పార్వతీపురం సబ్ జైలును గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వసతులు పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జైలు రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోస్పిన్, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, లోక్ అదాలత్ సభ్యులు టి.జోగారావు, ఎంఎల్ఎస్సీ సిబ్బంది కె. సునీత, జి.గంగాదేవి, పారాలీగల్ వలంటీర్లు, గిరిజనులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలతోనే బాలల వికాసం
విజయనగరం: గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థాయిలోనూ విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయం ఉండాలన్నారు. పిల్లలను కూర్చోబెట్టి పైకి వినిపించేలా పుస్తక పఠనం చేయిస్తే భాషా ఉచ్చారణ, పఠన సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ఈ విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ద పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో అసక్తిగా పాల్గొని భారతదేశ చరిత్రతో పాటు, జిల్లాస్థాయి అంశాలపైన విద్యార్థులు ఎంతో హుషారుగా సమాధానాలు చెప్పారు. విజేతలకు పుస్తకాల ను, పతకాలను అందజేశారు. కార్యక్రమంలో మేకా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు అనంతలక్ష్మి, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రా దేవి, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, సంఘం సలహాదారు కంచర్ల రాజేశ్వరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురుదేవాలో చోరీపై ముమ్మరంగా దర్యాప్తు
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినపటికీ పోలీసులు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు.ఎట్టకేలకు బుధవారం రాత్రి 11 గంటలకు బాధితుడు రాపర్తి జగదీష్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ఈ చోరీలో కేవలం 90 తులాల బంగారం (కేజీ బంగారం)తో పాటు రూ.5లక్షల నగదు పోయినట్లు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మూడు కేజీలకు పైగా బంగారం, రూ 20లక్షల నగదు దోచుకుపోయారని ట్రస్టు నిర్వాహకుడు చెబుతున్నారు. జగదీష్బాబు ఇంట్లో గల పూజ గదిలో ఆయన తాత ముత్తాతల నుంచి రాజరాజేశ్వరి శక్తి పీఠం ఏర్పాటు చేసుకుని వంశపార్యపరంగా పూజలను నిర్వహిస్తూ వస్తున్నారు. నాటి నుంచి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు వంశపార్యపరంగా వస్తున్నట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు. అమ్మవారి అలంకరణలో గల బంగారుపాదాలు, వడ్డాణం,దండ కడియాలు, 108 కాసులహారం, కొబ్బరిపువ్వులను పోలిన బంగారు గొలుసులతో పాటు అతి పురాతన రాజరాజేశ్వర ఉత్సవ విగ్రహాన్ని దోచుకుపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఆభరణాలు సుమారు మూడు కేజీలకు పైగానే ఉంటాయన్నారు. ఇవే కాకుండా తన తల్లి, అక్కకు సంబంధించిన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. చోరీకి గురైన బంగారు సామగ్రిపై జగదీష్బాబు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కేసు నమోదు విషయంలో పోలీసులు వెనకంజు వేశారు. బుధవారం రాత్రి 11 గంటల వరకు కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేసిన పిమ్మటే దర్యాప్తు ప్రారంభించారు. కొత్తవలస, ఎస్.కోట సీఐలు షణ్ముఖరావు, వర్రి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, ఎస్.కోట ఎస్సైలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది. రెక్కీ తరువాతే చోరీ తమ ఇంట్లో జరిగిన చోరీ అప్పటికప్పుడు చేసింది కాదని రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు. -
టవర్లు పూర్తి చేయాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మొబైల్ టవర్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మొబైల్ టవర్లు, గృహ నిర్మాణం పట్టాలపై గురువారం స్ధానిక కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొబైల్ టవర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలో ఇంకా 16 మొబైల్ టవర్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. గుమలక్ష్మీపురం మండలం వడబాయి, కొమరాడ మండలం ఊటకోసు, వనబడి, సాలూరు మండలం సూరపాడు, చోర గ్రామాల వద్ద రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేశామని వాటిని త్వరితగతిన పూర్తి చేసి మొబైల్ టవర్ల నిర్మాణం వేగవతం కావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తూ బాధ్యతా రాహితంగా పని చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బత్తిలి, కొమరాడ మండలం ఉలికేసు, బదిలీటీనకు, సాలూరు మండలంలోని భధ్ర పనులకు తక్షణమే అంచనాలు సమర్పించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహాలకు అటవీ అనుమతులు జారీచేసేందుకు నిబంధనలు పరిశీలించాలని అటవీ అనుమతుల జిల్లా స్థాయి కమిటీతో ఇందులో భాగంగా చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఎ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఎ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి
● భయాందోళనలో రోగులు ● వసతిలేక ఇబ్బందులు రాజాం: ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలామందికి పొగిరి లెప్రసీ ఆస్పత్రి పేరు తెలిసే ఉంటుంది. విశాఖపట్నం పరిధిలో కేవలం మూడుచోట్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లెప్రసీ నిర్మూలన ఆస్పత్రులు ఉండేవి. అందులో పొగిరిలో ఒకటి నిర్మించి, సేవలు ప్రారంభించారు. 1962లో ఎంతో అట్టహాసంగా నాలుగు భవనాలతో లెప్రసీ ఆస్పత్రి ఇక్కడ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ అవే భవనాల్లో ఇక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారు. స్థలాలు, నిధులు ఉన్నా పక్కా భవనాల నిర్మాణం ఇక్కడ లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం దు. పట్టించుకునేవారేరీ? రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టిసారించడం లేదు. కుష్ఠు నిర్మూలన కార్యక్రమాల ప్రారంభం అట్టహాసమే తప్ప వచ్చి తమ రోగాన్ని నిర్మూలించుకోవాలనుకునేవారికి కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, తెర్లాం తదితర ప్రాంతాల్లోని రోగులకు పొగిరి లెప్రసీ ఆస్పత్రి ఆసరాగా ఉంటుంది. ప్రతి నెలా సగటున 20 నుంచి 28 మంది రోగులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వ్యాధి తగ్గినవారు ఇంటికి వెళ్లిపోతుండగా, కొత్తవారు వచ్చి నయం చేసుకుంటున్నారు. వారికి కనీసం ఇక్కడ భోజనం పెట్టే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు. రాజాంకు చెందిన పారిశ్రామికవేత్త జీఎంఆర్ ఆర్థిక సాయంతో పాటు కొంతమంది దాతలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. తాగునీటి సమస్యతో పాటు వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం దుప్పట్లు, రగ్గులు వంటివి కూడా ఇక్కడ పంపిణీ లేదని పలువురు బాధితులు వాపోతున్నారు.భోజన సదుపాయం లేదుమేం చిన్నచిన్న కుష్ఠు వ్యాధి లక్షణాలతో ఇక్కడ చేరాం. ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతోంది. ఇంటి వద్ద కుటుంబసభ్యులు వచ్చేయమన్నారు. కానీ మరికొద్ది రోజులు ఉండి వెళ్లాలని అనుకుంటున్నాను. ఇక్కడ సరైన భవనాలు లేవు. దోమలు. విష సర్పాల బెడద ఉంటుంది. భోజనాలు దాతలు సమకూర్చు తున్నారు. కె.రాంబాబు, కుష్ఠువ్యాధి బాధితుడు కొత్త వాటి పంపిణీలేదుఇక్కడ ఆస్పత్రిలో ఎప్పటివో పాతకాలంనాటి దుప్పట్లు, బెడ్షీట్లు ఉన్నాయి. సరైన వస్తుసామగ్రి లేదు. కొత్తవి పంపిణీ చేయడంలేదు. దాతలు ఇచ్చిన రగ్గులు, దుప్పట్లు తప్ప కొత్తవి ప్రభుత్వం నుంచి సరఫరాలేదు. పి.లక్ష్మణరావు, కుష్ఠువ్యాధి బాధితుడు చినుకుపడితే చిత్తడే ఎప్పుడో 62 సంవత్సరాల క్రితం నిర్మించిన రేకులు, పెంకుల భవనాలే ఇప్పటికీ ఆస్పత్రి భవనాలుగా ఉన్నాయి. వాటి రేకులు శిథిలమై నీరు కారుతోంది. ఎండాకాలంలో నేరుగా ఎండ లోపలకు వచ్చేస్తుంది. విషసర్పాలు, దోమలు నేరుగా భవనాల్లోకి వస్తున్నాయి. చలికాలం, వర్షాకాలంలో ఇక్కడ రక్షణలేని పరిస్థితి కనిపిస్తోంది. కిటికీల తలుపులు, ప్రధాన ద్వారబంధాల తలుపులు మొత్తం ఊడిపోయాయి. వాటికి స్థానిక వైద్యులు సొంత డబ్బులతో మరమ్మతులు జరిపిస్తున్నారు. రాజాంకు చెందిన జీఎంఆర్ వీఎఫ్ చిన్నచిన్న మరమ్మతులకు ఆర్థికసాయం అందిస్తోంది. కొత్తగా ఇక్కడ భవనాలు అవసరమున్నప్పటికీ రోగుల సంఖ్య తగ్గడంతో పెద్దగా దృష్టిసారించలేదు. -
కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు విజయనగరం అర్బన్: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కొఠియా గ్రామాల వివాదాన్ని పరిష్కంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, అటు ఒడిశా బీజేసీ పాలిత రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో కొఠియా గ్రామ సమస్య పరిష్కరానికి ఇదే తగిన సమయమని డాక్టర్ శంకరరావు పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యకు రాజకీయ, పరిపాలనా పరమైన పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పిందని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర గిరిజ న శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎస్టీ కమిష న్ లేఖ రాసినట్లు తెలిపారు. కొఠియా సమస్య పరిష్కారానికి కేంద్రం సారథ్యంలో కమిటీ వే యాలని ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు కొఠియా గ్రామాల సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈవీఎం గొడౌన్ల తనిఖీనెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గొడౌన్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించి సెక్యూరిటీపై సమీక్షించారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ టి.సవరమ్మ, తహసీల్దార్ రవిశంకర్, కలెక్టరేట్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి పొడిగింపు విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుడు హిమాన్షు శుక్ల గురువారం ఉత్తర్వులు జారీచేశారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. ఉత్తర్వుల మేరకు 2025 జూన్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు పొడిగింపు వర్తిస్తుందన్నారు. 31న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంపార్వతీపురంటౌన్: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 31న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా విజిలెన్స్ మానిటరింట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(అత్యాచారాల నివారణ) చట్టం, 1989, నియమాలు, 1995 సమీక్షకు హాజరు కావడానికి కావాల్సిన సమాచారం మొత్తం నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నూతన సభ్యులను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. -
బడ్డీకొట్టు మాయం..!
● పేదవ్యాపారి కొట్టును లేపేసిన బడావ్యాపారి ● పోలీస్స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు ● నాన్చుడు ధోరణిలో పోలీసులురాజాం: ఓ పేద వ్యాపారి బడ్డీకొట్టుపై బడావ్యాపారి కన్నుపడింది. అంతే..అదే తడవుగిగా అధికారపార్టీ నాయకులను ఆశ్రయించి రాత్రికి రాత్రే చెక్క బడ్డీని అపహరించి, చెరువులో పడవేంచాడు ఆ బడా వ్యాపారి. ఈ తంతు జరిగిన వెంటనే బాధితుడు రాజాం పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసి నాలుగురోజులు గడిచినా బాధితుడికి న్యాయం జరగలేదు. కేవలం అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తనకు అన్యాయం జరుగుతోందని బాధితుడు వాపోతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని మాధవబజార్లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా పట్టణానికి చెందిన వడ్డి ప్రసాద్ అనే చిరువ్యాపారి గత 30 సంవత్సరాలుగా చెక్క బడ్డీ కొట్టులో ఉల్లిపాయలు, చింతపండు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ వ్యాపారంపై వస్తున్న ఆదాయంతో తనతో పాటు భార్యను పోషిస్తూ వస్తున్నాడు. ఈయన బడ్డీకొట్టు వెనుకల బండి లక్ష్మీనారాయణకు చెందిన కిరాణా వ్యాపారికి చెందిన పక్కా షాపు ఉంది. ఆ షాపుకు ఈ చిన్న బడ్డీ కొట్టు అడ్డుగా ఉండడంతో వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష్మీనారాయణ వేధింపులు ఎక్కువయ్యాయి. తన బడ్డీకొట్టు లీజుకు తీసుకున్న దస్తావేజులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండడంతో ప్రసాద్ ఎవరికీ లొంగలేదు. తన వ్యాపారం తాను చేసుకుంటూ కాలంనెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25 న అర్ధరాత్రి సమయంలో ప్రసాద్కు చెందిన బడ్డీ మాయమైంది. మరుసటిరోజు ఉదయం వ్యాపారం చేసేందుకు వచ్చిన ప్రసాద్ తన బడ్డీ అక్కడ లేకపోవడంతో ఉలిక్కిపడ్డాడు. తన బడ్డీకొట్టు ఎవరో దొంగిలించారని తొలుత ఆందోళన చెందాడు. అనంతరం శ్యాంపురం రోడ్డులో రంగప్ప చెరువులో బడ్డీకొట్టూ పడేసి ఉండడంతో తనతో వివాదాలకు దిగుతున్నవారే ఈ పనిచేసిఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తంచేస్తూ తన బడ్డీకొట్టు వెనుక ఉన్న వ్యాపారిపై రాజాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. నాలుగు రోజులైనా జరగని న్యాయం తన వద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, తన బడ్డీని దొంగిలించినవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అందులో రూ.1 లక్షకుపైగా ఉన్న సరుకులకు డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరాడు. ఈ తంతు జరిగిన నాలుగురోజులు గడిచినా ఇంతవరకూ ప్రసాద్కు న్యాయం జరగలేదు. తాను చిరువ్యాపారిని కావడంతోనే తనకు ఎవరూ మద్దతుగా రావడంలేదని, న్యాయం జరగడంలేదని ప్రసాద్ విలేకరుల ఎదుటవాపోతున్నాడు. బండి లక్ష్మీనారాయణ అనే బడా వ్యాపారే కొంతమంది అధికార పార్టీ నేతల మద్దతుతో బలవంతంగా తన బడ్డీ కొట్టూ తొలగించాడని ఆరోపిస్తున్నాడు. పోలీసులు సైతం తనకు న్యాయం చేయడంలేదని లబోదిబోమంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ విషయంపై రాజాం పట్టణ సీఐ అశోక్కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా, బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, న్యాయం చేస్తామన్నారు. -
69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● రూ.6.90 లక్షల జరిమానా వసూలు విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీసులు గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రూ.6.90 లక్షల జరిమానా వసూలు చేశారు. మొత్తం 69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధ్యులను కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వాహనాలను ఢీ కొట్టి పలు ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా బైక్ రైడ్స్ను కట్టడి చేసి, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకించి విజువల్ పోలీసింగ్ చేపడుతున్నామన్నారు. విజువల్ పోలీసింగ్లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తమ సిబ్బంది చేపడుతున్నారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. రైలు కింద పడి ఒడిశా వాసి మృతిదత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి గురువారం ఉదయం ఒడిశా వాసి మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. ఒడిశాలోని కలహండి జిల్లా జమున్ బహల్ తాలూకా, దాదాపూర్ గ్రామానికి చెందిన జవహర్లాల్ బిశ్వాల్(45)ను వైజాగ్ నుంచి బొబ్బలి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు చెప్పారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని విజయనగరం సర్వజన ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు. -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
బొబ్బిలి: పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికంగా శిక్షణ పొందిన 17 మంది ప్రతిభ గల క్రీడాకారులను ఒడిశా అసోసియేషన్ ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు కటక్లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయిలో తలపడుతున్న బొబ్బిలి క్రీడాకారులు గెలుపొంది పతకాలతో తిరిగి రావాలని సీఐ కె.సతీష్ కుమార్, అభ్యుదయ పాఠశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ చింత శారదలు వారికి గురువారం బెస్టాఫ్ లక్ చెప్పారు. -
జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. జూన్ 2 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలకార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లా స్థాయి. డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యులు జిల్లా అంతటా ఒకే సమయంలో దాడులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు ప్రమాదకరమైన సంస్థలు, స్థలాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను రెండు రోజుల్లోగా గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే పనిచేయించే యాజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. నెలరోజుల పాటు జిల్లా అంతటా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఒకే సమయంలో దాడులు జరపాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మురళి, డిప్యూటీ కమిషపర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా బేగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, డీసీపీయూ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
యోగాతో జీవనాడులు ఉత్తేజం
పార్వతీపురం టౌన్: యోగాసనాలతో మానవ జీవనాడులు ఉత్తేజమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యసిబ్బందికి యోగాసనాలపై యోగా గురువు మోహన్ శిక్షణ ఇచ్చారు. ప్రాణాయామంతో పాటు వివిధ భంగిమల యోగాసనాలను వేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు అలవర్చుకునే విధంగా యోగా గురువుతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మానసిక ప్రశాంతత, పని ఒత్తిడిని జయించేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కురుపాం, పాలకొండ, సాలూరులలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ టి.కనక దుర్గ, జిల్లా ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డా. టి.జగన్నాథ రావు, ఐసీడీఎస్ పీఓలు బి.శ్రీనివాసరావు, జి. సుగుణ కుమారి, ఎస్.సుక్కా తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కర రావు -
దొరికిన దొంగల ముఠా
పోలీసుల పనితీరు భేష్ చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకోవడంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరరావు, ఎస్ఐ ఎల్.దామోదరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమని డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. 23న చోరీ జరగగా, 24న రాత్రి నిందితులను గుర్తించామని, విచారణ నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని దుండగులను అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీస్ సిబ్బందికి రివార్డులు కోసం ప్రతిపా దిస్తామని స్పష్టం చేసారు. చీపురుపల్లి: చీపురుపల్లి మెయిన్ రోడ్డులో, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఓ ఇంటిలో చొరబడి.. ఇద్దరు వృద్ధులను గాయపరిచి చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది మందిలో 8 మంది అరెస్టుకాగా, మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన వివరాలను చీపురుపల్లి పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎస్.రాఘవులు వెల్లడించారు. ఎలాంటి కష్టం లేకుండా రూ.వందల కోట్లు కొల్లగొట్టాలనే అత్యాశతో ఈ నెల 23న అర్థరాత్రి దాటిన తరువాత పట్టణంలోని మెయిన్రోడ్లోని వారణాళి సురేష్ నివాసంలో చోరీకు పాల్పడ్డారు. వీరికి ఆ స్థాయిలో డబ్బు, బంగారం దొరకలేదు. వృద్ధులను గాయపరిచి వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. ఈ దొంగల ముఠా ఇక్కడ మాత్రమే కాదు గతంలో జరిపిన చోరీల్లో సైతం విఫలయత్నమే చేశారు తప్ప ఎక్కడా చోరీలు సఫలీకృతమవ్వలేదు. చీపురుపల్లిలో చోరీ ఘటనకు ప్రధాన సూత్రధారి మండలంలోని గత్సలవలస గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మన్నెల సూర్యారావు. గ్రామంలో టీడీపీ ప్రధాన కార్యకర్తగా చలామణిలో ఉన్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. వీడియోలు, ఫొటోలు టీడీపీ కార్యకర్త ద్వారానే... సూర్యారావు ఇచ్చిన సమాచారంతోనే ముఠా చోరీకు పాల్పడినట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు. చోరీ జరిగిన ఇంటిలో రూ.300 కోట్లు వరకు నగదు, 350 కేజీల వరకు బంగారం లభిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లాలో కూనేరులో ఉన్న ఆశీస్ జగం అలియాస్ జగన్ అనే వ్యక్తికి సూర్యారావు సమాచారం అందించాడు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి పంపించాడు. దానిని జగన్ తిరిగి విజయనగరంలోని సావిత్రి అలియాస్ జ్యోతి అనే మహిళకు పంపించాడు. ఆమె శ్రీకాకుళం జిల్లాలోని దేవరాపల్లిలో ఉన్న ఆచంట వెంకటేష్కు పంపించింది. వెంకటేష్ నుంచి విజయనగరంలోని బొల్లవరపు నాగరాజుకు సమాచారం చేరింది. అదే వెంకటేష్ బాపట్లలోని నాజుల్ బాబు అలియాస్ డైమండ్ బాబు అనే కీలక నిందితునికి సమాచారం ఇచ్చారు. ఆయన నుంచి వంగర శ్రీనివాసరావు, శ్యామ్కుమార్లకు సమాచారం ఇచ్చారు. ఇలా మొత్తం పది మంది కలిసి చోరీకు ప్రణాళిక రచించారు. వీరిలో పట్టుబడిన 8 మంది నుంచి 5 తులాలు బంగారం, ఎనిమిది సెల్ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, చోరీలో ఇద్దరు వృద్ధులను గాయపరిచి వారి నుంచి పదిహేడున్నర తులాల బంగారం అపహరించుకుపోయినట్లు వారణాళి కస్తూరి, వైశ్యరాజు చిట్టెమ్మల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం దుండగలు నుంచి కేవలం 5 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చోరీ కేసులో అదుపులోకి తీసుకున్నది వీరినే... చోరీకి ప్రధాన సూత్రధారి టీడీపీ కార్యకర్త సూర్యారావు ఆయన సూచనలతోనే చోరీ ప్రణాళిక చోరీలో పాల్గొన్న పదిమందిలో 8 మందిని పట్టుకున్న పోలీసులు మిగిలిన ఇద్దరి కోసం గాలింపు 5 తులాల బంగారం రికవరీ నిందితుల సెల్ ఫోన్లు, కారు స్వాధీనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల చోరీకి పాల్పడిన ముఠా వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాఘవులు నాజుల్ బాబు అలియాస్ డైమండ్ బాబు అలియాస్ వజ్రాల బాబు, కుమ్మరిగుంట శ్యామ్కుమార్, వంగర శ్రీనివాసరావు, ఆచంట వెంకటేష్, బొల్లవరపు నాగరాజు, దాసు సావిత్రి అలియాస్ జ్యోతి, ఆశిస్ జగం అలియాస్ జగన్, మన్నేల సూర్యారావు. తేల్లి కిషోర్, మనోజ్లు దొరకాల్సి ఉంది. వీరిపై 310(2), 310(5), 311, 331(8) సెక్షన్ల్ కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
నచ్చినంత తవ్వుకో.. వచ్చినంత అమ్ముకో...
బొబ్బిలి రూరల్: బొబ్బిలి మండలంలో గ్రావెల్ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చెరువులు, గట్లు రూపుకోల్పోతున్నాయి. ‘నచ్చినంత తవ్వకో.. వచ్చినంత అమ్ముకో’ అన్న రీతిన తవ్వకాలు జరుగుతున్నాయి. ‘అధికార’ బలంతో రంగరాయపురం, గ్రోత్సెంటర్, మల్లంపేట, దిబ్బగుడ్డివలస గ్రామాల్లోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో రాత్రీపగలు తేడా లేకుండా కంకర తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ట్రాక్టర్ గ్రావెల్ రూ.1500, టిప్పర్ రూ.3వేల చొప్పున రియల్ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ పెద్దల హస్తం ఉన్నట్టు సమాచారం. తవ్వకాల్లో వారికీ వాటా వెళ్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర తవ్వకాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చర్యలు తీసుకుంటాం..
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కచ్చితంగా డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్తో పాటు సిబ్బంది అందరూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఉండాలి. డాక్టర్ లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం మధ్యలో వెళ్లినట్టు తెలిసినా చర్యలు తీసుకుంటాం. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మెంటాడ మండలం చల్లపేట పీహెచ్సీ పరిధి పెదచామలపల్లి గ్రామంలో జరిగింది. ఇక్కడ కూడా డాక్టర్ లేకుండానే గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లోనే కాదు. అనేక చోట్ల ఇటువంటి పరిస్థితే ఉందని పల్లెప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్... ఐదేళ్ల కిందటి వరకు ధనవంతులకే పరిమితమైన వైద్యం. దానిని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పల్లె ప్రజలకు చేరువచేసింది. పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను నియమించి పల్లెలకు పంపించింది. రోగులకు వైద్యపరీక్షలు జరిపించి అవసరమైన మందులు అందజేసేది. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో త్వరగా నయమయ్యేవి. రోగులకు రూపాయి ఖర్చుకాకుండా, ఇంటి వద్దనే మెరుగైన వైద్య సేవలు, మందులు అందేవి. చాలామందికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పేది. ఇంతటి ప్రాధాన్యమున్న ఫ్యామిలీ డాక్టర్ వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేని శిబిరాలు నిర్వహిస్తూ సేవలందించడంపై జనం మండిపడుతున్నారు. సీజనల్ జ్వరాలతో సతమతమవుతున్నా వైద్యులు లేకుండానే శిబిరాలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. వృద్ధులు, దివ్యాంగులైన రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ● ఫ్యామిలీ డాక్టర్ వైద్యంపై కూటమి నిర్లక్ష్యం ● వైద్యులు పూర్తిస్థాయిలో ఉండడంలేదనే ఆరోపణలు ● ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం నిర్వహించాలి ● కొన్ని ప్రాంతాల్లో వైద్యులు లేకుండా నిర్వహణ ● మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంట, 2 గంటలకే వైద్యులు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ● గతంలో నెలకు 1.30 లక్షల మందికి సేవలు ● ఇప్పుడు 90 వేల నుంచి 1.10 లక్షల మందికే పరిమితం! విజయనగరం ఫోర్ట్: ఏదైనా జబ్బు చేస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు మండల కేంద్రంలో ఉన్న పీహెచ్సీకి, లేదంటే జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. నడవలేని వారిని తీసుకెళ్లడం మరింత కష్టమయ్యేది. వ్యయప్రయాసలకు గురయ్యేవారు. ఇటువంటి వారి కష్టాలు తీర్చేలా.. పల్లె ముంగిటకే వెళ్లి వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం చేపట్టింది. గ్రామాలకు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నిపుణులైన వైద్యులు సేవలు అందించడం వల్ల రోగుల ఆరోగ్యం కుదుటపడేది. ప్రాథమిక దశలోనే వ్యాధు లు గుర్తించి సేవలు అందించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గేవి. ఇంతటి ప్రాధాన్యమున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంపై పెద్దగా శ్రద్ద చూపకపోవడం వల్ల లక్ష్యం నేరవేరడం లేదని పల్లె ప్రజలు వాపోతున్నారు. ● ఫ్యామిలీ డాక్టర్ సేవలందించాల్సింది ఇలా... జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని 104 వాహనాలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 54 పీహెచ్సీల పరిధిలో 46 వాహనాలు ఉన్నాయి. ప్రతిరోజు పీహెచ్సీ పరిధిలో ఒక గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్య క్రమాన్ని నిర్వహిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో వైఎస్సా ర్ విలేజ్ క్లినిక్లో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరానికి వచ్చిన రోగులను వైద్యుడు తనిఖీ చేయాలి. మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్ బీపీ, సుగర్ పరీక్షలు, 104 డేటా ఎంట్రీ ఆపరేటర్ శిబిరానికి వచ్చిన రోగులకు అందించిన చికిత్స వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. గర్భిణులకు తనిఖీలు నిర్వహించి, బీపీ, సుగర్, హెచ్బీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేయాలి. ఒంటి గంటనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. 2 గంటల తర్వాత పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను తనిఖీ చేయాలి. ఆ తర్వాత మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించి వారికి వైద్య సేవలు అందించాలి. వైద్యులు లేకుండా సేవలు ఎలా..? జిల్లాలో చాలా చోట్ల డాక్టర్ లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు హాజరైనా మధ్యాహ్నం ఒంటి గంట, రెండు గంటలకే ఇంటిదారి పడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ శిబిరాలకు వెళ్లేందుకు రోగులు అంతగా అసక్తి చూపడం లేదు. మెరుగైన వైద్యసేవలు అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు భరోసా కల్పించే వైద్యసేవలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. -
వైద్య శాఖలో బదిలీ ఫీవర్..!
విజయనగరం ఫోర్ట్: వైద్యవిధాన్ పరిషత్ కార్యాలయంలో ఓ ఉద్యోగి 10 ఏళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నట్లు సమాచారం. ఒకే చోట పనిచేయడం వల్ల అధికారులను సైతం శాసించే విధంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారిగా ఎవరు వచ్చినా సదరు ఉద్యోగి మాటే చెల్లుబాటవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే శాఖలో మరో ఉద్యోగి కూడా ఐదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నాడు. ఇలా వీరిద్దరే కాదు. మరి కొంతమంది ఉద్యోగులు కూడా ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏ శాఖలో అయినా 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాలు జాబితాను వెల్లడిస్తారు. కానీ వైద్యవిధాన్ పరిషత్ అధికారులు మాత్రం అ శాఖలో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. లోపాలు బయట పడతాయనో, మరో కారణం చేతనో వివరాలు వెల్లడించడం లేదు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలు బయట పడతాయనే ఉద్దేశంతోనే అధికారులు వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఆస్పత్రుల వివరాలు వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఎస్.కోట, గజపతినగరం, చీపురపల్లి, రాజాం ఏరియా ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, నెల్లిమర్లలో సీహెచ్సీలు ఉన్నాయి. వాటి పరిధిలో వైద్యులు, స్టాఫ్నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ సూపరింటెండెంట్స్, ఎంఎన్ఓ, అటెండర్స్, ఏఓ తదితర కేడర్లలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలం ఒకేచోట పని చేస్తే అవినీతికి ఆస్కారం ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో నూ ఇటువంటి వారు తమ వారికి ఉద్యోగాలను కట్టబెట్టుకునే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలోనూ ఇదే పరిస్థితి: వైద్యారోగ్యశాఖలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి కావడంతో ఇక్కడ కూడా ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. వివిధ కేడర్లలో ఉద్యోగులు ఇక్కడ కూడా ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేసిన వారిలో గుబులు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితిపారదర్శకంగా బదిలీలు ఐదేళ్లకు పైబడి ఒకే చోట పనిచేసిన వారి వివరా లు వెల్లడించడానికి ఉన్నతాధికారుల పర్మిషన్ అ డిగాం. పర్మిషన్ రాకపోవడంతో వివరాలు వెల్ల డించలేదు. బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీరాణి, డీసీహెచ్ఎస్ -
స్కూటర్ ఢీ కొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరానికి సమీప గ్రామం చెల్లూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. చెల్లూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడు విశాఖ–విజయనగరం హైవేపై రాంగ్ రూట్లో సాయంత్రం 4 గంటలకు రోడ్డు దాటుతుండగా ఎదురుగా స్కూటర్ రావడంతో ఢీ కొనగా అక్కడిక్కడే కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించే లోగానే తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుమార్తె రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. బొబ్బిలి: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని బలిజిపేట రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జగ్గునాయుడి పేటకు చెందిన శ్రీనివాసరావు తాపీ, సెంటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం పట్టణంలోని టీచర్స్కాలనీకి బైక్పై వెళ్తుండగా బలిజిపేట రోడ్డులోని ఇండియన్ బ్యాంకు వద్దకు చేరుకునేసరికి వెనుక నుంచి వస్తున్న శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బస్సు వెనక చక్రాలకింద పడి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇందిర, పాలిటెక్నిక్ చదివిన పవన్, హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న చంటి అనే ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రమాద వాహనాలను, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై వి.జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఇంకొకరు.. గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..ఈనెల 25వతేదీ రాత్రి గంట్యాడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని బైక్ పై వస్తూ ఢీకొట్టిన సారిక గ్రామానికి చెందిన కింతాడ మధు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కేజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. కుక్క కరిచి వైఎస్సార్సీపీ కార్యకర్త..రామభద్రపురం: మండలంలోని కొండకెంగువలో కుక్క కరిచి వైఎస్సార్సీపీ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్త,గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా పనిచేసిన సత్తారు సన్యాసిరావు(34)ఈ నెల 3వ తేదీన కుక్కకాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే గ్రామ పరిధిలో ఉన్న ఆరికతోట పీహెచ్సీకి వెళ్లి రేబిస్ టీకా వేసుకున్నాడు. మూడు డోసులు వేసుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు రెండు డోసులు వేసుకున్నాడు.వచ్చే నెల ఒకటో తేదీన మూడో డోసు వేసుకోవాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ నెల 27వ తేదీన తలనొప్పి, కుక్క కరిచిన వైపు తిమ్మిర్లు వచ్చాయి. ఆఖరి డోసు రేబిస్ వేసుకుంటే తగ్గిపోతుందన్న ఉద్దేశంతో మిన్నకుండిపోగా బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. -
సాగునీటి కోసం.. రోడ్డెక్కిన రైతన్న
పాలకొండ: తోటపల్లి కాలువల ఆధునికీకరణ, కాలువల్లో పూడిక తీత, శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులు రోడ్డెక్కారు. పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, బూర్జ మండలంలోని పలు గ్రామాలకు ఏటా సాగునీరు అందడం లేదని ఆరోపించారు. పెద్ద బుడ్డిడి వద్ద మరమ్మతులకు గురైన సైపూన్ను తక్షణమే బాగుచేయాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్ మాట్లాడుతూ కాలువల్లో పూడికలు తొలగించి ఖరీఫ్కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన వినతులపై తీసుకున్న చర్యలు వివరించాలని ఏఓను నిలదీశారు. ఈ సమయంలో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఎం చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తిలు అక్కడికి చేరుకుని అధికారులతో సంయుక్త సమావేశానికి ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కండాపు ప్రసాదరావు, దావాల రమణారావు, ఇద్దుబోయిన సింహాద్రి, గంగుల శ్రీనివాసరావు, కారెపు చిట్టిబాబు, లోలుగు నారాయణరావు, పలు కార్మికసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.. అనంతరం ధర్నా -
జీడి పిక్కల వ్యాపారి షాప్/ఇంటికి తాళాలు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట గ్రామానికి చెందిన జీడి పిక్కల వ్యాపారి షాప్, ఇంటికి బుధవారం గిరిజన, దళిత నాయకులు నిమ్మక సింహాచలం, అడ్డాకుల చిన్నారావు, ఎస్.రామారావు తదితరులు తాళాలు వేశారు. ఈమేరకు ఎల్విన్పేట జంక్షన్ వద్ద రవి ఏజెన్సీస్ పేరుతో కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న జి.రవికుమార్ జీడిపిక్కలు, ధాన్యం విక్రయించిన వందల మంది రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు స్థానికంగా పలువురి నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి ఏవరికీ ఏమీ చెల్లించకుండా, ఏ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని.. ఐపీ పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని తమకు రావాల్సిన డబ్బుల సంగతి ఏమిటంటూ పలువురు బాదితులు ఆ వ్యాపారి షాప్ ముందు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పలువురి నుంచి రూ.2 కోట్లకుపైగా అప్పులు చేశాడని, తన ఇల్లు ,షాప్ను కూడా ఎవరికో రాసిపెట్టి వెళ్లిపోయాడన్న సమాచారం ఉందని, కావునే బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్ధేశంతో వ్యాపారి ఇల్లు , షాప్కు తాళం వేసినట్లు నాయకులు తెలియజేశారు. ఈ సంఘటణపై ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వారంతా పేర్కొన్నారు. -
రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని దేవస్థానం అధికారులు బుధవారం లెక్కించారు. మొత్తం 89 రోజులకు గాను దేవాలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.29,76,730 ఆదాయం సమకూరిందని ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు రాజకుమారి, చీపురుపల్లి కనకమహాలక్ష్మి, దేవస్థానం ఈఓ శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు. లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాకు చెందిన పలువురు శ్రీవారి సేవా భక్తులు హుండీల ఆదాయ లెక్కింపులో పాల్గొన్నారు. సారా కేసుల్లో నలుగురి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి, చినదొడిజ గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా కలిగిఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు సారా వండేందుకు ముడిసరుకులు సరఫరా చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో భాగంగా చినదొడిజ గ్రామ పరిసరాల్లో 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఆయన వెంట ఎ కై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యసాలూరు రూరల్: పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి అప్పలస్వామి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక రామాకాలనీలో నివాసముంటున్న అప్పలస్వామి (58) అనారోగ్య కారణంతో మనస్తాపానికి గురై ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉరివేసుకున్నాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బి.అప్పలనాయుడు తెలిపారు. పురుగు మందు తాగి మహిళ..గుర్ల: మండలంలోని పాలవసలకు చెందిన కోడి సూర్యకాంతం(45) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది, ఆ బాధను భరించలేక మూడు రోజుల క్రితం పురుగు మందు తాగేసింది. అనంతరం అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
సామాజిక అధ్యయనం సర్వే అడ్డగింత
వేపాడ: మారిక గిరిజన గ్రామాన్ని, భూములను అదానీ కంపెనీకి అప్పగించవద్దంటూ 35 రోజులుగా సచివాలయం నుంచి కలెక్టర్ వరకు విన్నపాలు చేసుకున్నప్పటికీ సామాజిక అధ్యయనం సర్వే అధికారులను ప్రభుత్వం పంపడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేపాడ మండలంలోని కరకవలస గిరిశిఖర మారిక గ్రామాన్ని, భూములను సామాజిక అధ్యయనం చేసేందుకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తుతో.. మండలస్థాయి అధికారులు తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణతో కలిసి వెళ్లిన అధికారులను మారిక పొలిమేరలోనే గిరిజనులు అడ్డుకుని వెనక్కి పంపారు. మా పొలాలను గ్రామాన్ని అదానీ కంపెనీకి ఇచ్చే ప్రసక్తి లేదంటు తెగేసి చెప్పారు. మండలస్థాయి అధికారులు ఎంత నచ్చచెప్పినప్పటికీ గిరిజనులు పట్టు వీడకపోవటంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. కార్యక్రమంలో మారిక గ్రామనాయకులు జలారి వీర్రాజు, బాబూరావు, అప్పలనాయుడు, సోమేష్, శ్రీను ఆసు, శోభన్బాబు, తదితర గిరిజనులు యువత, మహిళలు పాల్గొన్నారు, హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ప్రకటన మండలంలో కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక కొండపై రైవాడ ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ఎస్ఐఏ అధికారుల పర్యవేక్షణకు బుధవారం శ్రీకారం చుట్టామని సామాజిక ప్రభావ అంచనా నివేదిక సామాజిక నిపుణుడు పి.దేవరాజు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. బుధవారం సుమారు 8 కి.మీ కాలినడకన మారిక వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినట్లు తెలిపారు. భూసేకరణ చట్టం 2013పై గిరిజనులకు వివరించి సామాజిక ఆర్థిక, సాంఘిక సర్వేకు సహకరించాలని కోరామన్నారు. అయితే ఈ ఇన్స్పెక్షన్లో నిర్వాసితులు, పెద్దలు, ఎస్ఐఏ బృందం సభ్యులు, మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓను అడ్డగించారని తెలిపారు. గిరిజనుల అభిప్రాయాలను తమనివేదికలో కలెక్టర్కు నివేదిస్తామన్నారు. అధికారులను తిప్పి పంపిన గిరిజనులు -
గంజాయి కేసుల్లో త్వరితగతిన అరెస్టులు
పార్వతీపురం రూరల్: విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా బుధవారం సమీక్షించి గంజాయి కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను త్వరితగతిన అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్టు, నేరాలు పునరావృతం చేసే వారి ఆస్తుల జప్తు, పెండింగ్ నాన్ బెయలబుల్ వారెంట్స్, డీ–అడిక్షన్ కార్యక్రమాలపై రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమగ్రంగా చర్చించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
వేతనదారులకు నష్టం జరిగితే సహించేది లేదు
● కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ వేతనదారులకు నష్టం జరిగే చర్యలను సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ వారంలో రూ.250 వరకు వేతనం పెరిగేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 70లక్షల23 వేల పనిదినాలను సృష్టించారని, ఇది కేవలం 63 శాతం మాత్రమేనని, మిగిలిన మూడు రోజుల్లో శతశాతం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. తక్కువ పనిదినాలు కల్పించిన ఏపీఓలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రావు, తదితరులు పాల్గొన్నారు. -
అనాఽథ, నిరాశ్రయ బాలబాలికలకు ‘ఆధార్’
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికా ర సంస్థ ఉత్తర్వులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో నిరాశ్రయులు, అనాఽథలైన బాల బాలికలకు ఆధార్ కార్డులు జారీ చేసే బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రెవె న్యూ అధికారులు, పోలీస్ అధికారులు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చిల్డ్రన్ హోమ్, ఎన్జీవో హోమ్లకు సంబంధించిన నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరాశ్రయులైన బాలబాలికలకు ఆధార్ కార్డులు జారీ చేయడానికి తగిన చర్యల ప్రణాళికను వివరించారు. బుధవా రం నుంచి జూన్ 25 వరకు సర్వే నిర్వహించి వారి వివరాలను సేకరించాలని అన్నారు. జూన్ 26 నుంచి ఆగస్టు ఐదవ తేదీలోపు వారి వివరాలు రిజిస్ట్రేష న్ కార్యక్రమం నిర్వహించాలని, ఆగస్టు 15వ తేదీకల్లా ఈ నివేదికలను జాతీయ న్యాయ సేవ అధికా ర సంస్థకు పంపించాలని సూచించారు. దీని కోసం జిల్లా స్థాయిలో (ఎస్ఏఏటీఐ) కమిటీలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమన్వయంతో సమష్టిగా విజయవంతం చేయాలని కోరారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, రెండు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర అధికారు లు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. -
విజయనగరం
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025ఇంటింటి సేవలకు మంగళం ●వలంటీర్, ఎండీయూ వ్యవస్థలు రద్దు ●భర్తీకాని సచివాలయ ఖాళీ పోస్టులు ●రేషనలైజేషన్ పేరుతో సచివాలయాలు, ఉద్యోగుల కుదింపు ప్రయత్నాలు ●రైతన్నకు దూరమైన సాగుసేవలు ●కూటమి ప్రభుత్వ చర్యలతో అభివృద్ధి తిరోగమనం ●కన్నీరుపెడుతున్న పల్లెప్రజలు న్యూస్రీల్ -
ఉద్యోగులకు యోగాంధ్ర పాట్లు..!
విజయనగరం అర్బన్/సాక్షి, పార్వతీపురం మన్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. జూన్ 21వ తేదీ నాటికి అందరికీ యోగాపై సంపూర్ణ అవగాహన ఉండాలంటూ.. నెల రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రతి రోజూ గ్రామ, పట్టణ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వామ్యం చేయాలని సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో కార్పొరేషన్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు.. సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై యోగా చేయిస్తున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు. మొత్తంగా జిల్లా అధికార యంత్రాంగం దాదాపు కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంటోంది. జూన్ 21వ తేదీ వరకు ఉంటుంది కూడా. మరి.. ఇవన్నీ చేయాలంటే మనుషులు ఉండాలి. అందుకోసం అందుబాటులో ఉన్న ఏ ఒక్కరినీ వదలడం లేదు. అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వైద్య సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. వీటిని పక్కాగా అమలు చేసేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలను నియమించారు. యోగాంధ్ర మినహా.. కొద్దిరోజులుగా మిగతా విషయాలను పక్కన పెట్టేసింది. లెక్కల కోసం తిప్పలు.. యోగా మాసంలో భాగంగా వివిధ స్థాయిల్లో పోటీ లు నిర్వహించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెబుతున్నారు. దీంతో లెక్కలు చూపించేందుకు జిల్లా అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయాలని సచివాలయ సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం యోగా మంత్ యాప్ను సిద్ధం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలెవరూ నమోదుకు ముందుకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందే.. తమకు తెలిసిన వారి నంబర్లు సేకరించి, వారికి ఓటీపీలు ఇవ్వండంటూ బతిమలాడుతూ, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు ఓటీపీలు అడుగుతున్నారో కూడా చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. వారి కుటుంబ సభ్యులతోనూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. విజయ నగరం జిల్లాలోని 27 మండలాల పరిధిలో 7.8 లక్షల మందిని యోగాంధ్రలో భాగస్వాములు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతిరోజు కనీసం 40వేల నుంచి 50 వేల మందిని నమోదుచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటివరకు 85వేల మంది మాత్రమే యోగాంధ్ర పోర్టల్లో తమ పేర్లును నమోదుచేసుకున్నారు. దీంతో పాటు 5,270 మంది శిక్షకులుగా పేర్లు నమోదుచేసుకున్నారు. వీరికి 31వ తేదీ వరకు ఆయా మండలాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 30న రామనారాయణంలో 1000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఏదో కార్యక్రమం చేపట్టేవారని.. ఇలా నెల రోజులు నిర్వహించి, పెద్ద ఎత్తున నిధులు, సమయం వృథా చేయడం ఎన్నడూ లేదని ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారులు సైతం మరో దారి లేక ఫొటోల కోసం ‘మమ’ అనిపించేస్తున్నారు. యోగా మాసోత్సవంలో జన సమీకరణకు ఆపసోపాలు వేలల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిళ్లు బలవంతంగా పేర్ల నమోదు.. సచివాలయ సిబ్బందికి టార్గెట్లు -
సినిమా థియేటర్ల పరిశీలన
●వసతులపై జేసీ ఆరా విజయనగరం అర్బన్: నగరంలోని పలు సినిమా థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ స్థాయి అధికారులు బుధ వారం తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లు, సీటింగ్ సదుపాయాలపై ఆరా తీశారు. లీలామహల్ థియోటర్లో బాల్కనీ సీటింగ్, తినుబండారాల అమ్మకం, అగ్నిప్రమాద నిరోధక చర్యలను జేసీ పరిశీలించారు. ఆర్డీఓ సవరమ్మ స్థానిక ఎన్సీసీ థియేటర్లో తనిఖీలు జరిపారు. యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. తనిఖీల్లో ఇన్చార్జి తహసీల్దార్ స్వర్ణకుమార్, ఆర్ఐ రాజు, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన దరఖాస్తుల స్వీకరణ విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ప్రధానోపాధ్యా యుల నుంచి ఎస్జీటీల వరకు వివిధ కేడర్ ఉపాధ్యాయులు 4,720 మంది బదిలీ అవకా శం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో స్థానచలనం తప్పనిసరి, మిగులు ఉపాధ్యాయులు 3,500 మంది వరకు ఉండడం గమనా ర్హం. మరోవైపు హెచ్ఎం ఉద్యోగోన్నతుల ప్రక్రి య పూర్తయింది. తుది జాబితాను బుధవారం రాత్రి డీఈఓ యు.మాణిక్యంనాయుడు విడుద ల చేశారు. నదుల్లో జలకళ వంగర/సంతకవిటి: అల్పపీడన ప్రభావంతో కురుస్నున్న వర్షాలకు నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటివరకు ఇసుక తెన్నెలతో దర్శనమిచ్చిన నదుల్లో నీటి సవ్వడి కనిపిస్తోంది. నారాయణపురం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరగడంతో కుడి ప్రధాన కాలువకు సాగునీరు విడిచిపెట్టారు. డోలీలో నదిని దాటించి.. కొమరాడ: మండలంలోని చోళ్లపదం పంచాయతీ పరిధిలోని వనధార గ్రామనికి చెందిన కొండగొర్రి శ్రీను గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జర్వం ఎక్కవ కావడంతో కుటుంబ సభ్యులు కారుచీకటిలోనే డోలీలో నాగవళి నదిని దాటించి కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని, వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరారు. -
ఏకతాటిపై నడుద్దాం..
విజయనగరం: కలిసిగట్టుగా పని చేస్తూ జిల్లాలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేద్దామని విజయనగ రం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడంలో కార్య కర్తలే కీలకమని, అటువంటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. పార్టీ సిద్ధాంతాల కు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యవర్గానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, బూత్ లెవెల్ కమిటీల నియామకం, పార్టీ బలోపేతంతో జిల్లా కార్యవర్గ సభ్యుల పాత్ర తదితర అంశాలను వివరించారు. ఇప్పటి కే జిల్లా స్థాయి కమిటీల నియామకం పూర్తయిందని, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులను ప్రక టించినట్టు తెలిపారు. అనుబంధ, మండల స్థాయి కమిటీలను త్వరితగతిన నియమించాలని జిల్లా కార్యవర్గానికి సూచించారు. బాధ్యతల నిర్వహణే ప్రధానం.. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందు కు జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధంగా ఉండాలని మజ్జి శ్రీనివాసరావు సూచించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతినెలా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పార్టీ కమిటీల నియా మకాలను పూర్తిచేయాలన్నారు. త్వరలో జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అమలుచేయకుండా పబ్బంగడుపుతోందని, దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు. పర్యవేక్షణ బాధ్యతలు ఇలా.. ●ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి జిల్లా పార్టీ కార్యాలయానికి ఇన్చార్జిగా బాధ్యత లు నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఉపాధ్యాయ, అంగన్వాడీ, మేధావుల, ఉద్యోగులు/పెన్షనర్లు, గ్రీవెన్స్సెల్ అనుబంధ విభాగాలను పర్యవేక్షిస్తారన్నారు. ●ఇప్పిలి అనంత్ పార్టీ కార్యక్రమాలు, బీసీ, రైతు, వలంటీర్, ట్రేడ్యూనియన్, ప్రచార, బూ త్ కమిటీ, పంచాయతీరాజ్ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ●మరో ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పార్టీ కార్యక్రమాలు, యువజన, మహిళా, క్రిస్టియన్, విద్యార్థి, సోషల్ మీడియా, మైనార్టీ, మున్సిపల్ అనుబంధ కమిటీలను పర్యవేక్షణ చేస్తారన్నారు. ●అల్లాడ సత్యనారాయణ లీగల్సెల్, ఆర్టీఐ, ఐటీ, దివ్యాంగల విభాగాలకు..... ●శంబంగి వేణుగోపాలనాయుడు ఎస్టీ, చేనేత, వాణిజ్య, సాంస్కృతిక, డాక్టర్స్ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ క్ర మంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామ ని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలతో పాటు కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తామన్నారు. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతు న్న కార్యక్రమంలో ప్రజలంతా కలిసి వచ్చేలా ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. అక్రమ కేసులు, వేధింపులను గట్టిగా ఎదు ర్కొని కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. సమావేశంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. పార్టీ పటిష్టతలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల పాత్ర కీలకం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలి పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపు పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం హాజరైన పార్టీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ జూన్ 4న వెన్నుపోటు దినం -
హ్యాండర్లతో టచ్లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!
విజయనగరం: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారించారు.ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్, సమీర్లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు. ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల్లో రెండోరన్నరప్గా విజయనగరం జిల్లా అమ్మాయి
తెర్లాం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి అందానికి అమెరికా ఫిదా అయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో ఈనెల 25న జరిగిన తెలుగు అమ్మాయిల అందాల (‘మిస్ తెలుగు యూఎస్ఏ–2025’) పోటీల్లో ‘చందక సాయిసాత్విక’ రన్నరప్–2గా నిలిచింది. ఓ వైపు అందం.. మరోవైపు తెలివితేటలతో అందరినీ ఆకర్షించింది. చందక సూర్యకుమార్, సబితల రెండో కుమార్తె సాయిసాత్విక. ఆమె డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడానికి అమెరికా వెళ్లింది. డల్లాస్లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్ తెలుగు యుఎస్ఏ–2025’ పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ నెల 25న డల్లాస్లో జరిగిన ఫైనల్ పోటీల్లో 22 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొనగా అందులో అంకిత రెడ్డి విజేతగా నిలిచింది. రన్నరప్ 2గా సాయిసాత్విక ఎంపికైంది. సాయిసాత్విక విజయంపై తల్లిదండ్రులు, అక్క, బావ, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. మరచిపోలేని అనుభూతినిచ్చింది ఫైనల్ పోటీల్లో రన్నరప్గా నిలవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన అక్క సాయిసుస్మిత, బావకు రుణపడి ఉంటాను. నాకు ఓటువేసి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారికి ధన్యవాదాలు. – సాయిసాత్విక మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ –2 -
దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా
నెల్లిమర్ల రూరల్: మండలంలో గుషిణి గ్రామంలో కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో సాగుభూములుగా మారుతున్నాయి. ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన కొంతమంది కూటమి పార్టీ సానుభూతిపరులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దర్జాగా సాగుచేసుకుంటున్నా అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కబ్జాల బాగోతంపై పలుమార్లు ఆధారాలతో ఫిర్యాదుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన కనిగిరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాకుండా ఆ స్థలాల్లో బోర్లు కూడా ఏర్పాటు చేసి వాల్టా చట్టానికి కూడా తూట్లు పొడిచారని చెబుతున్నారు. ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లు ఎలా? గుషిణి రెవెన్యూ పరిధిలోని 79/2లో శ్మశాన వాటిక, సర్వే నంబర్ 80/1లో సింహాద్రి చెరువు, సర్వే నంబర్ 65/15లో ప్రభుత్వ భూములను అదే గ్రామానికి చెందిన చందక రమణ, సూర్యారావు, సూరప్పలనాయుడు, తదితరులు ఆక్రమించుకున్నట్టు శ్రీనివాసరావు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు కూడా పొందారు. ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లను సంబంధిత అధికారులు ఎలా ఇచ్చార నేది ప్రశ్నార్ధకంగా మారింది. గుషిణి రెవెన్యూ పరిధిలో ఆక్రమణలో ఉన్న సింహాద్రి చెరువు హెచ్చరిక బోర్డులను తొలగించి మరీ... చర్యలు తీసుకుంటాం... గుషిణిలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై తహసీల్దార్ సుదర్శనరావు ఆధ్వర్యంలో గతంలో సర్వే చేయించారు. ఆక్రమణలు, అక్రమంగా బోర్లు ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు మంజూరు వంటివి గుర్తించారు. ఆక్రమిత స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఆ బోర్డులను తొలగించినట్లు మా దృష్టికి వచ్చింది. మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – రవి శంకర్, ఇన్చార్జి తహసీల్దార్, నెల్లిమర్ల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి గుషిణిలో కూటమి పార్టీ సానుభూతిపరులు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. శ్మశానవాటిక భూమిని కూడా వదల్లేదు. ఆక్రమిత స్థలాల్లో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు పొంది బోర్లు కూడా ఏర్పాటు చేసుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. ఆక్రమణలు అని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తొలగించారు. అసలు ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారనే విషయంపై విద్యుత్ అధికారులు సమాధానం ఇవ్వాలి. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలి. – కనిగిరి శ్రీను, జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభుత్వ భూములకు అక్రమ విద్యుత్ కనెక్షన్లు బోర్లు తవ్వి వాల్టా చట్టానికి తూట్లు హెచ్చరిక బోర్డులు సైతం తీసేసి సాగుకు ఉపక్రమించిన అక్రమార్కులు గుషిణిలో కూటమి సానుభూతిపరుల కబ్జాల పర్వం చర్యలకు గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ సుదర్శనరావు రెవెన్యూ సిబ్బందితో ఆరునెలల కిందట సర్వే చేయించారు. సర్వే నంబర్ 65/15లో చందక సూరప్పనాయుడు, చందక సత్యం అనే వ్యక్తులు సాగు చేస్తున్న సుమారు 0.72 సెంట్లలో విస్తీర్ణంలో బంజరు భూమి ఆక్రమణకు గురైనట్లు, అక్రమంగా బోరును కూడా తవ్వినట్లు గుర్తించారు. సర్వే నంబర్ 65/30 లో మరో బోరు ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్ 79/2లో గెడ్డ పోరంబోకు భూమిలో ఉన్న శ్మశాన వాటికలో చందక రమణ, చందక సూర్యారావు వ్యక్తుల పేరిట సుమారు 0.10 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు స్వయంగా రెవెన్యూ అధికారులే నిర్ధారించి ప్రకటించారు. ఆక్రమిత స్థలాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం సదరు ఆక్రమణదారులు తొలగించడం గమనార్హం. -
స్లీపర్స్ సెల్స్తో పేలుళ్ల కుట్ర!
విజయనగరం క్రైమ్: స్లీపర్ సెల్స్తోనే దేశంలోని ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపేందుకు పథకం రూపొందించినట్టు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారుల విచారణలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సమీర్లు వెల్లడించినట్టు సమాచారం. విజయనగరం పీటీసీలో మంగళవారం ఐదో రోజు విచారణ దాదాపు పదకొండు గంటల పాటు సాగినట్టు తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఏడురోజుల కస్టడీ గడువులో తొలుత రెండు, మూడు రోజులు నోరుమెదపని సిరాజ్, సమీర్లు నాలుగు, ఐదో రోజు ఉగ్రకుట్ర వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. బాంబుపేలుళ్ల కుట్రకేసులో ప్రధాన సూత్రధారి సిరాజ్గా విచారణలో నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. అహీంగ్రూప్లో ఉన్న 20 మంది సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆ గ్రూపు సభ్యులతోనే ఏడు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రశాంతకు మారుపేరుగా ఉన్న విజయనగరం జిల్లాను ధ్వంసం చేసేందుకు సిరాజ్ పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఒక విద్యార్థి.. ఏడుగురు సిబ్బందిబొబ్బిలి: స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలను పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రంగా కేటాయించారు. మంగళవారం జరిగిన సంస్కృతం పరీక్షకు ఒకే విద్యా ర్థిని హాజరుకాగా... చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, ఓ ఏఎన్ఎం, ఆశ వర్కర్, ఆయాలతో పాటు ఒక ఏఎస్ఐ విధులు నిర్వహించారు. ఒక్కరైనా.. వంద మంది పరీక్ష రాసినా నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాల్సిందేనని హెచ్ఎం జగదీష్ కుమార్ తెలిపారు.పేర్లు నమోదు చేయండి: జేసీవిజయనగరం అర్బన్: జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారి పేర్లు యోగాంధ్ర పోర్టల్లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధనవ్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 7.8 లక్షల మందిని యోగాంధ్రలో భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ప్రతిరోజూ కనీసం 50 వేల మందిని నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 85 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. జిల్లాలో 5,270 మంది ట్రైనర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. వీరికి నేటి నుంచి 31వ తేదీ వరకు ఆయా మండలాల్లో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారని తెలిపారు.29న నాన్ టీచింగ్ పోస్టులకు ఇంటర్వ్యూలువిజయనగరం అర్బన్: జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న చౌకీదార్ కుక్, డే వాస్ ఉమెన్/నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ వంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సమగ్ర శిక్ష ఏపీబీ డాక్టర్ ఎ.రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆ రోజు ఉదయం 9 గంటలకు విద్యార్హత ఒరిజినల్, జెరాక్స్ కాపీలతో హాజరుకావాలని తెలిపారు. అర్హుల జాబితాను ‘విజయనగరం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు.కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన దాడులు● దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయశంకర్శృంగవరపుకోట: కూటమి ప్రభుత్వ పాలనలో దళిత, మైనార్టీ యువకులపై దాడు లు ఎక్కువయ్యాయని దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జయశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నడి రోడ్డుపై తెనాలిలో ముగ్గురు దళిత యువకులను విచక్షణ రహితంగా కొట్టడం తగదని, పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్.కోట పట్టణంలో మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏవరైనా తప్పు చేస్తే కోర్టులో హాజరుపర్చి తగిన శిక్షపడేలా చేయాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తామే న్యాయమూర్తులమని భ్రమించి శిక్షించడం సమంజసం కాదన్నారు. తెనాలి ఘటనపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులైన సీఐలు రాములునాయక్, రమేష్బాబు, కానిస్టేబుల్ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఉగ్రవాదుల అన్వేషణలో కూటమి విఫలం
విజయనగరం అర్బన్: ఉగ్రవాదులను కనిపెట్టడం, వారి కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో కూట మి ప్రభుత్వం విఫలమైందని హిందూ ధర్మ రక్షా సమితి ప్రతినిధులు శ్రీనివాస్, నందివాడ వేణుగోపాలరావు విమర్శించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతూ విజయనగరం పట్టణంలోని సిరాజ్ కుటుంబం నివసిస్తున్న ఆబాద్వీధి, అంబటి సత్రం, అశోక్ నగర్ ప్రాంతాలవారితో కలిసి కలెక్టర్ అంబేడ్కర్కు కలెక్టరేట్లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొంతకాలంగా అంబటి సత్రం, ఆబాద్ వీధిలో మసీదులు, మదర్సాలు పెరిగిపోతున్నాయని, స్థానికులు కాకుండా గుర్తుతెలియన వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రభావజాలంతో అరెస్టు అయిన సిరాజ్తో పాటు ఆయన తండ్రి, అన్నయ్యను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణానికి ఉగ్రముప్పు తప్పించాలని కోరారు. హిందూ ధర్మ రక్షా సమితి -
కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డు
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ ఎదుర్కొనే సన్నద్ధత చర్యలు చేపట్టలేదనే అంశంపై ‘కోవిడ్పై సన్నద్ధత శూన్యం..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. వైద్యపరీక్షల నిర్వహణకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటుచేయడంతో పాటు మాక్ డ్రిల్ నిర్వహించారు. -
రోడ్డున పడుతున్నాం
నాతో పాటు భార్య పేరున అగ్రిగోల్డ్లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాను. రూ.10వేల చొప్పున రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.20వేల డిపాజిట్ల చెల్లింపు సమయంలో నా ఖాతాలోకి నగదు రాలేదు. ఒకటికి మించి బాండ్లు కలిగిన వారిలో చాలామంది నష్టపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి డిపాజిట్ డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేయాలి. – సిడగం గురునాయుడు, విజయనగరం ఒక బాండుకే డబ్బులు.. రూ.5 లక్షల డిపాజిట్ చేశాను. రూ.10 వేల చొప్పన రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.50 వేలు, రూ. లక్ష విలువైన బాండ్లకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబాలతో రోడ్డున పడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. – జె.ఆదినారాయణ, విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య 1,08,470 చేసిన డిపాజిట్ల మొత్తం విలువ రూ.765కోట్లు (సుమారుగా)రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో అందినది.. ఇద్దరికి చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య 16విజయనగరం గంటస్తంభం: అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఊరూరా గొప్పగా ప్రచారం చూశారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారం చేపట్టి ఏడాది గడిచినా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పట్టించుకోవడంలేదు. వారి గోడు వినిపించుకోవడం లేదు. 2014–19 మధ్యకాలంలో ఇలాగే మోసపోయామని, మళ్లీ మరోసారి సీఎం చంద్రబాబునాయుడు తమను మోసం చేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ● ఆదుకున్న గత ప్రభుత్వం 2014 నుంచి ఐదేళ్లపాటు అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలంటూ పోరాటం సాగించారు. అయినా ఫలితం కనిపించలేదు. దాచుకున్న డబ్బులు రావనే బెంగతో జిల్లాలో 16 మంది చనిపోయారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. రూపాయి డబ్బులు చెల్లించే ఏర్పాటుచేయలేదు. 2019 ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ వివాదం ప్రధానాంశంగా మారింది. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు దశలవారీగా డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు రెండు దశల్లో రూ.929.75 కోట్లు చెల్లించారు. మొత్తం 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఆ డబ్బు అందగా, జిల్లాలో 20వేల లోపు డిపాజిట్ చేసిన 70 వేల మందికి రూ.36,97,96,900లు లబ్ధిచేకూరింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. ● న్యాయంచేసేది ఎప్పుడు? అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఏ ఒక్క చర్య కూడా ప్రారంభించలేదు. కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప..11 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు న్యాయం చేకూరే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రూపాయి ఇవ్వని వైనం బాధితుల గోడును పట్టించుకోని పాలకులు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.929.75 కోట్ల చెల్లింపు జిల్లాలో 70వేల మంది బాధితులకు లబ్ధి -
ఆదుకోండి ‘బాబూ’..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలికేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.929.75 కోట్లు కేటాయించారు. బాధితులకు కొంతమేర న్యాయం చేశారు. ఇంకొంత మొత్తం రావాల్సి ఉంది. ఇప్పడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికావస్తున్నా అగ్రిగోల్డ్ బాధితులు గురించి ఎటువంటి చర్య తీసుకోకపోవడం విచారకరం. – మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ అధ్యక్షుడు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం● -
ఖరీఫ్ సీజన్ త్వరగా మొదలు పెట్టాలి
విజయనగరం ఫోర్ట్: ప్రకృతి అనుకూలత వల్ల ఈఏడాది ముందుగానే వర్షాలు మొదలయ్యాయని వీలైనంత వేగంగా విత్తనాలు జల్లి ఖరీఫ్ సీజన్ మొదలుపెట్టాలని కలెక్ట్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వ్యవసాయ అధికారులు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆక్టోబర్ లోగా కోతలు పూర్తి చేసేవిధంగా వీలైనంత త్వరగా విత్తనాలు జల్లాలని సూచించారు. దీనివల్ల నవంబర్లో వచ్చే తుఫాన్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. తద్వారా రబీసీజన్ కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టే అవకాశం కలుగుతుందన్నారు. కౌలు రైతులకు రుణాలు జిల్లాలో ఈఏడాది సుమారు 16,500 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేసి, వారికి రూ.150 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలోగా ఈ గుర్తింపు కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కోసం సుమారు 4,89,116 మంది రైతుల వివరాలను తనిఖీ చేసి అర్హుల జాబితా ఎంపిక పక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారుల లాగిన్లో పెండింగ్లో ఉన్న రోజుల్లోనే తనిఖీ పూర్తి చేసి అమోదం తెలపాలని స్పష్టం చేశారు. రైతుల అధార్ కార్డుల సవరణ, మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టాలని సూచించారు. పీజీఆర్ఎస్లో రెవెన్యూకు సంబంధించి 1017 ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ ఎక్కువగా ఉన్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఎల్డీఎం నారాయణమూర్తి, ఏపీ సీడ్స్ డీఎం పద్మ, మార్క్ఫెడ్ డీఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పైడితల్లికి మామిడి పండ్ల నివేదన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి మంగళవారం మామిడిపండ్లతో నివేదన చేశారు. అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతా లతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట రావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీ వీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.లారీ ఇంజిన్లో మంటలుపార్వతీపురం రూరల్: విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ట్రాఫిక్ కూడలి వద్ద మంగళవారం ఉదయం 7గంటలకు జరిగిన ఈ సంఘటనను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై లారీని నిలిపివేసి స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా లారీ ఇంజిన్లో నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. తల్లి మందలించిందని తనయుడి ఆత్మహత్యరాజాం సిటీ: మద్యం తాగవద్దని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని బొమ్మినాయుడువలసలో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్సై కేవీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొమ్మినాయుడువలస గ్రామానికి చెందిన నరం సురేష్ (33)ను మద్యం తాగవద్దని తల్లి నరసమ్మ మందలించింది. ఆమె మందలించడాన్ని జీర్ణించుకోలేక ఈ నెల 22న మద్యం మత్తులో గడ్డిమందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ను స్థానికులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడని ఏఎస్సై తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. -
బదిలీల్లో లోపాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లండి
మెరకముడిదాం: ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధమైన విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడిని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆల్తిరాంబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయనగరంలో ఎమ్మెల్సీ గాదెను ఆయన ఇంటివద్ద కలిసి ఎస్టీటీ ఉపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. వాటిని వెంటనే కమిషనర్ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ఎస్జీటీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పీఆర్టీయూ నాయకులు కృష్ణమూర్తి, రామకృష్ణ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కోరిన పీఆర్టీయూ -
అవగాహన విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జూన్ 15 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి/క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో అందించేందుకు ఉద్దేశించినట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పీఎం కిసాన్ కార్డులు, జన్ ధన్ ఖాతా, పీఎం జేజీబీవై, పీఎంఎస్ బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధి హామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంఈవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. పోషకాహార ప్రదర్శనల ఏర్పాటు గ్రామస్థాయిలో ఆధార్లో నమోదు కానివారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని ఆదేశించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల పోషక విలువలు తెలియజేసేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోను అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయరాదని ఆదేశించారు. రక్తహీనత లేకుండా దృష్టి సారించాలని, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డకు పాలు పట్టే విధానం తెలియక పోవడం వల్ల కూడా కొన్ని శిశు మరణాలు జరుగుతున్నాయని, పాలు పట్టే విధానం పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గిరి చైతన్యం డిజిటల్ మీడియా వాహనం ద్వారా కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. -
పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్ ప్రత్యేక పూజలు
● పైడితల్లమ్మకు జెడ్పీ ఛైర్మన్ ప్రత్యేక పూజలు విజయనగరం: కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి గ్రామంలో వెలసిన పైడితల్లమ్మవారికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లదనోత్సవంలో భాగంగా సతీమణి ఆయన పుష్పాంజలి, కుమార్తె సిరిసహస్ర, అల్లుడు ప్రదీప్ నాయుడులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చల్లనితల్లి పైడితల్ల మ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ధర్మపురిలో వెలసిన పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. -
బెట్టింగ్ మాయలో పడి..!
పోలీసులేమంటున్నారంటే.. ఇదే విషయాన్ని ఎస్సై జి.కళాధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా క్రికెట్ బెట్టింగ్లపై నిఘా వేసి బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడికపై దృష్టి సారించి వారిని మంచి మార్గంలో నడిపించేలా చొరవ చూపాలి.● తప్పుదారి పడుతున్న యువత ● బెట్టింగ్ మనీ కోసం అప్పులు, దొంగతనాలు ● ఆర్థికంగా దివాలా తీస్తున్న కుటుంబాలువీరఘట్టం: ఈ సీజన్ ఐపీఎల్ బెట్టింగ్లో ఘోరంగా డబ్బులు పోగొట్టుకున్న వీరఘట్టానికి చెందిన ఓ కుర్రాడు తాను పనిచేస్తున్న ఇంట్లో సుమారు 5 తులాల బంగారు నగలు దొంగిలించాడు. అలాగే ఇంకొందరు యువకులు అధిక వడ్డీలకు అప్పులు కూడా చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు ఎన్నో కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. బెట్టింగ్ ఉచ్చులో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకా మేల్కోకపోతే యువత భవిత సర్వనాశనం అవడం ఖాయమని మేధావులు అంటున్నారు. ప్రతి ఏటా జూద క్రీడలకు అలవాటుపడిన కొందరు అలవాటు మానుకోలేక సీజనల్ జూదానికి తెరలేపుతుపున్నారు. ఏడాదిలో 20 శాతం పేకాట, మిగిలిన 80 శాతం క్రికెట్ బెట్టింగ్లతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యువతను బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నారు. తాజాగా రెండు నెలల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ పోటీలను తిలకిస్తూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ మ్యాచ్ల కోసం పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతా ఆన్లైన్లోనే.. ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ అంతా ఆన్లైన్లోనే దర్జాగా జరుగుతోంది. మీడియేటర్ల ద్వారా పందాలు కాస్తున్నారు. ప్రతి రోజూ వీరఘట్టంలో రూ.50 లక్షల వరకూ బెట్టింగ్లు విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టంలోని అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. లక్నో టీమ్ నాదంటే, రాజస్థాన్ రాయల్స్ నాది అంటూ వెయ్యి రూపాయలకు రూ.16 వందలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు పేట్రేగి పోతున్నారు.చిన్నచిన్న కిరాణాషాపులు, పకోడీబడ్డీలు, పాన్షాపుల వద్ద ఈ తతంగం అంతా జరుగుతోంది. టెస్ట్మ్యాచ్లు, టీ20, వన్డే మ్యాచ్లు అని తేడా లేకుండా క్రికెట్ ఏ తరహాదైనా బెట్టింగ్ మాత్రం అదే తరహాలో కాస్తున్నారు. ఈ బెట్టింగ్లకు అలవాటుపడిన యువత పక్కదోవ బడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుదేలవుతున్నారు. మరికొంతమంది ఆర్థిక నేరాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మాయదారి క్రికెట్ బెట్టింగ్లు వీరఘట్టంలో గడిచిన పదిహేనేళ్ల నుంచి యథేచ్ఛగా జరుగుతున్నా ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. -
కానిస్టేబుల్ మృతికి సంతాపం
జి.సిగడాం: స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న వల్లంశెట్టి లోకేష్(38) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఇతని స్వగ్రా మం విజయనగరం జిల్లా జామి మండలం అట్టాడ. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు. లోకేష్కు భార్య అచ్చయ్యమ్మ, కుమారుడు దివిన్, కుమార్తె భవిశ్రీ ఉన్నారు. లోకేష్ మృతి పట్ల రణస్థలం సీఐ అవతారం, ఎస్ఐ వై.మధుసూదనరావు, ఏఎస్ఐలు పొగిరి శంకరరావు, కోరుకొండ రామకృష్ణ, సిబ్బంది సంతాపం తెలిపారు. వెబ్సైట్లో ల్యాబ్టెక్నీషియన్ పోస్టుల జాబితావిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి ఐదుకేటగిరీలకు చెందిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, పీఈటీ, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను వెబ్సైట్లో పెట్టారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 28 నుంచి 31 వతేదీ వరకు, 2 వతేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలులోగా తెలియజేయాలని సూచించారు. పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు రెడీవిజయనగరం టౌన్: శ్రీపైడిమాంబ ఆధ్యాత్మిక కళానికేతన్, జ్ఞానభేరి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న జై పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు సిద్ధమవుతున్నట్లు కళానికేతన్ వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం చిత్రయూనిట్, స్థానిక పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిషెడ్యల్లో చిత్రం బాగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను చిత్ర యూనిట్కు అందజేశారు. కార్యక్రమంలో నటులు రవితేజ, డాక్టర్ మురళీధర్, పెద్దింటి అప్పారావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం
బొబ్బిలి: తాడేపల్లి గూడెం పరిధిలో ట్రైన్ ఢీకొని ఓ గుర్తు తెలియిన వ్యక్తి మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి వద్ద నూజివీడు నుంచి బొబ్బిలికి కొనుగోలు చేసిన టికెట్ లభ్యం కావడంతో అక్కడి పోలీసులు బొబ్బిలి జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫొటోలను పంపించి ఆచూకీ కనుగొనాలని కోరడంతో స్థానిక జీఆర్పీ సిబ్బంది విలేకరులకు తెలియజేశారు. బొబ్బిలి లేదా పరిసర గ్రామాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీసులను పంప్రదిస్తే ఆ సమాచారి తాడేపల్లి గూడెం పంపించేందుకు అవకాశముంటుందని స్థానిక జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
అనర్హులకు కేటాయించిన ఇళ్ల రద్దు
విజయనగరం అర్బన్: పేదలకు గృహనిర్మాణం కోసం ప్రభుత్వం అదనపు నగదు మంజూరు చేసిందని అయినప్పటికీ గృహ నిర్మాణాల కోసం ముందుకురాని లబ్ధిదారుల స్టేటస్ను వెరిఫై చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. లబ్ధిదారులకు సొంత గృహం ఉండడం వల్లనే గృహ నిర్మాణాలకు ముందుకు రావడం లేదని తెలుస్తోందని అటువంటి వారి జాబితాలను ఇంటింటికీ వెళ్ల వెరిఫై చేసి ఆధారాలతో సహా రెండు రోజుల్లో ఇవ్వాలని వారికి మంజూరైన గృహాలను రద్దు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అవాజ్ యోజన కింద మంజూరైన 11 వేల గృహాలను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 11 వేల ఇళ్లకు గాను ఇప్పటి వరకు 41 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఇంకనూ 6,924 గృహాలు పూర్తి కావలసి ఉందన్నారు. బొబ్బిలి, విజయనగరం అర్బన్లో తక్కువ గృహాలు పూర్తి కావడంపై వివరణ అడిగారు. నీటి సరఫరా లేదని, వేసిన బోర్లు దొంగతనానికి గురయ్యాయని మున్సిపల్ కమిషనర్లకు లేఖ రాశామని పీడీ మురళి తెలిపారు. రెండు రోజుల్లో బోర్లన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం గతంలో ఇచ్చిన 4,096 దరఖాస్తులను వెరిఫై చేయాలని అలాగే మాన్యువల్గా వచ్చిన మరో 2,500 దరఖాస్తులను కొందరు తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని అర్హతను వెరిఫై చేయాలని స్పష్టం చేశారు. అందరికీ గృహాలు, పీఎంజన్మన్పథకాల కింద మంజూరైన జాబితాలను కూడా వెరిఫై చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 11 వేల గృహప్రవేశాలకు సిద్ధం చేయండి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. -
కోవిడ్పై సన్నద్ధత శూన్యం..!
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ పేరు వింటేనే జనంలో వణుకుపుడుతుంది. నాలుగేళ్ల కిందట విలయతాండవం సృష్టించిన మహమ్మారి మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. కేసుల నమోదు రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగునే ఉన్న విశాఖపట్నం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవ హరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కోవిడ్ను ఎదుర్కొనే సన్నద్ధత చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోవిడ్ మహ మ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని, వైద్య సేవలతో మరణాలను తగ్గించగలిగిందని, ప్రస్తుతం అలాంటి ఏర్పాట్లు ఏవీ లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు ఏవీ..? ఏ ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లా ప్రజలు అధిక మంది ఆశ్రయించేది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రినే. అటువంటి ఆస్పత్రిలో కోవిడ్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనేందుకు ఎటువంటి ముందుస్తు చర్యలు కనిపించడం లేదు. కోవిడ్ రోగులకు ప్రత్యేక వార్డు ఇంతవరకు గుర్తించ లేదు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వస్తే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఇంతవరకు చేయలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి పెరిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పటిలో పటిష్ట చర్యలు కోవిడ్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ గ్రామాలకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ప్రజల ఆరోగ్య పరిస్థితిని బట్టి హోం ఐసోలేషన్లో కొందరికి, క్వారంటైన్ సెంటర్లలో కొందరికి, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి మరికొందరికి చికిత్స అందించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాలను కల్పించింది. కోవిడ్ వైరస్ సోకినా ప్రభుత్వం చికిత్స చేయిస్తుందనే ధీమా ఉండేది. ఇప్పుడు అలాంటి చర్యలేవీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదేశాలు రాలేదు.. కోవిడ్ ఏర్పాట్లపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. డీఎంఈ సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తాం. – డాక్టర్ అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పొరుగు జిల్లాలో కోవిడ్ కేసుల నమోదు జిల్లాలో ఎటువంటి సన్నాహాలు చేయని వైనం నిర్ధారణ పరీక్షలకు ఏర్పాట్లు లేవు.. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహాలు -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ను ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు సోమవారం తెలిపారు. పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. వార్షిక పబ్లిక్ పరీక్షల్లో గైర్హాజరయిన 63 మంది జనరల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. అలాగే, ఒకేషనల్ విభాగంలో ఇంటర్ పరీక్షలు రాయాల్సిన 422 మంది కోసం జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వీటిలో రాజాంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ రామ ఒకేషనల్ జూనియర్ కళాశాల, ఎస్.కోటలోని ప్రభుత్వ, ఏవీఎన్, దీప్తి, శ్రీవరలక్ష్మి జూనియర్ కళాశాలలు, నెల్లిమర్లలోని సీకేహెచ్ జూనియర్ కళాశాల, గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయనగరం ఎస్ఎస్పీ ఓకేషనల్ జూనియర్ కళాశాల ఉన్నాయి. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్ధులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని కోరారు. -
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
విజయనగరం టౌన్: వంగర మండలం లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఉత్తరాంధ్ర దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉత్తరాంధ్ర దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేసు విచారణలో పక్షపాత వైఖరి చూపిస్తున్న లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు కంఠవేణు, శ్రీను, ఉదయ్ భాస్కర్, బాబూరావు, చిత్ర గంగులు, గురుమూర్తి, భీమారావు, కృష్ణ, నాగరాజు, రామప్పడు, రవి, ఆదాడమోహనరావు, పి.వి.రమణ, బొంగ భానుమూర్తి, రాజేష్, చంటి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి లక్ష్మీపేట దళిత సంఘాల నాయకుల వినతి -
24 గంటల్లో అర్జీలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను 24 గంటల్లో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించే ముందు అధికా రులతో సమీక్షించారు. ఆన్లైన్లో ఇంకా చూడవలసిన వినతులు 8 ఉన్నాయని గడువు దాటిన వినతులు 2 ఉన్నాయని వినతుల పరిషాకరంలో గడువు దాటినందుకు సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. రీ ఓపెన్ కేసులు లేకుండా చూడాలని జిల్లా ఆడిట్ టీమ్ కూ డా పెండింగ్ లేకుండా ఎప్పటి వినతులు అప్పుడే ఆడిట్ చేయాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 160 వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇన్చార్జ్ డీఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్జీలలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన భూసమస్యలు 82 నమోదయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ 10, పింఛన్ల మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 21, మున్సిపాలిటీకి 10, జీఎస్డబ్ల్యూకు 1, విద్యాశాఖకు 7, హౌసింగ్కు 1 అందగా వైద్యశాఖకు 2, విద్యుత్ శాఖకు 5 వినతులు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రం ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడానికి కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్జీదారుల కోసం షామియానా ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి ఆరుగురు సిబ్బందిని నియమించడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఓ కార్యాయలం వద్ద మరో ఇద్దరు అర్జీలు రాసే సహకారం అందజేయడంతో మధ్యవర్తుల జాడ కనబడలేదు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్య పెట్టి వారి నుంచి డబ్బును తీసుకుని ప్రతివారం కలెక్టరేట్ చుట్లూ తిరిగేలా చేస్తున్నారని ఇకపై కూడా అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హాయకేంద్రంలో సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బదిలీల ఫైళ్లు ముందుగానే పెట్టండి బదిలీల ఫైళ్లను ఆఖరి తేదీన కాకుండా ముందుగానే పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బదిలీలలో ఎటువంటి సిఫార్సులను ఆమోదించబోనని, నిబంధనల మేరకే చేపడతానని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ పీజీఆర్ఎస్కు 32 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమాన్ని ఏఎస్పీ సౌమ్యలత నిర్వహించి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మా ట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి,లీలారావు డీసీ ఆర్జీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 160 వినతులు -
కౌలు రైతుల కంటకన్నీరు..!
● అన్నదాత సుఖీభవ లేనట్లేనా అని ఆందోళన ● వైఎస్సార్సీపీ హయాంలో రైతుభరోసా అందజేత కౌలు రైతులకు వర్తించదు అన్నదాత సుఖీభవ పథకం కోసం భూ యాజమానులు, అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలు వెరిఫికేషన్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వారికే వెరిఫికేషన్ చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ విడతలో అన్నదాత సుఖీభవ వర్తించదు. కౌలు రైతుల గుర్తింపు, రెన్యువల్ జరుగుతుంది. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారివిజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే రైతులందరికీ రైతు భరోసా సాయాన్ని పెంచుతాం. అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. తీరా అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టింది. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకోసం రైతుల వివరాలను వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే కౌలు రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం వర్తించే సూచనలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కౌలు రైతుల గుర్తింపు పక్రియ పూర్తిస్థాయిలో ఇంతవరకు జరగలేదు. దీని వల్ల వారికి అన్నదాత సుఖీభవ సాయం అందడం అనుమానంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కౌలు రైతుల గుర్తింపు లక్ష్యం 16250 2025–26 ఖరీఫ్ సీజన్లో వేలాది మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉంది. కానీ వ్యవసాయ అధికారులు చాలా తక్కువ మందిని గుర్తించారు. ఈ ఏడాది 16,250 మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉండగా ఇంతవరకు గుర్తించింది కేవలం 200 మందిని మాత్రమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏప్రిల్, మే నెలలోనే కౌలు రైతుల గుర్తింపుపై అవగాహన సదస్సులు నిర్వహించి కౌలు రైతులకు సాగు ఽహక్కు పత్రాలు ఇచ్చేవారు. కానీ ఈఏడాది మే నెల రెండో వారం వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కానట్లు తెలుస్తోంది. భూయాజమానులు, అటవీభూములు సాగు చేసే వారికే.. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే ఆర్థిక సాయానికి భూయాజమానులు, అటవీ భూములు సాగు చేసే వారే అర్హులని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి కౌలు రైతులకు ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. జిల్లాలో భూయాజమానులకు, అటవీభూమి సాగు చేసే రైతులకు వ్యవసాయ అధికారులు అన్నదాత సుఖీభవ పథకం కోసం వెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లాలో 4,89,252 మంది రైతులు ఉన్నారు. వారిలో 2,159 మంది అటవీ భూమి సాగుచేసే వారు ఉన్నారు. మొత్తం రైతుల్లో 4,36,744 మంది రైతులకు వెరిఫికేషన్ చేశారు. ఇంకా 50 వేల మందికి పైగా వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 25వతేదీతో వెరిఫికేషన్కు గడువు పూర్తవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూయాజమానులు, అటవీభూమి సాగు చేసే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం కింద సాయం అందజేశారు. దీంతో వారు మిగతా రైతుల మాదిరి వారు సాగు చేసిన పంటలకు పెట్టుబడి పెట్టుకునే వారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే వారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
శృంగవరపుకోట: మండలంలో సంచలనం రేకెత్తించిన తల్లి హత్యకేసును ఎస్.కోట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను సోమవారం ఎస్.కోట పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ రాత్రి తన తల్లి, చెల్లి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి తన తల్లి ఎర్రాప్రగడ వెంకటలక్ష్మి(35)ని తీసుకుపోయారని చెల్లెలు రుచిత చెప్పిందని వెంకటరమణపేట గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ హరీష్ 18వ తేదీ ఉదయం 5గంటలకు ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనుమానాలే ఆధారంగా.. హరీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఘటనాస్థలిలో రక్తపుమరకలు ఉండడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టామన్నారు. రుచిత వాదనల్లో సరైన పొంతన లేకపోవడంతో అనుమానంతో గట్టిగా విచారణ చేయడంతో వాస్తవాలు చెప్పింది. తన తల్లిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం హత్య చేశామని చెప్పింది. శవాన్ని దగ్గరలోని నేలబావిలో రాళ్లు కట్టి పడేసి, కొబ్బరి మట్టలు వేసి కప్పారన్నారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. ప్రేమ వికటించింది గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్ రుచితతో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని రుచిత తల్లి వెంకటలక్ష్మి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని చెప్పింది. అప్పటికీ హరికృష్ణ తన తీరు మార్చుకోక పోవడంతో వెంకటలక్ష్మి ఎస్.కోట పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో హరికృష్ణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు ట్రయల్స్కు రావడంతో తనపై కేసు తీసేయాలని, రుచితను తనకిచ్చి పెళ్లి చేయాలని, వెంకటలక్ష్మిని హరికృష్ణ ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో రుచితతో కలిసి హత్యకు పథకం పన్నాడు. బహిర్భూమికి అంటూ రుచితతో చెప్పించి వెంకటలక్ష్మిని బయటకు రప్పించి హరికృష్ణ, రుచితలు మరో బాలుడితో కలిసి, గొంతు కోసి హత్య చేశారు. రుచితను జువైనల్ హోమ్కు తరలించి హత్య చేసి పరారైన హరికృష్ణ కోసం మూడు బృందాలను రంగంలోకి దించారు. సోమవారం అందిన సమాచారంతో ఒడిశా వైపు బైక్పై వెళ్తున్న హరికృష్ణను, హత్యానేరంలో ఉన్న మరో బాలుడిని అరెస్టు చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని, వాంగ్మూలం రికార్డు చేసి, కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వి.నారాయణమూర్తి, ఎస్సైలు చంద్రశేఖర్, గంగరాజు పాల్గొన్నారు. -
మెరుపు చూసి మసలుకో..!
● పిడుగులు, వడగళ్లతో జాగ్రత్త అవసరం ● ఏటా పదుల సంఖ్యలో మరణాలు ● అనేక కుటుంబాల్లో విషాదం ● అప్రమత్తతతోనే ప్రమాదాలకు దూరం పిడుగులకు సంకేతం ఈ మెరుపులువిజయనగరం గంటస్తంభం: వాతావరణంలో మార్పులతో మేఘం కమ్ముకుంటే చాలు.. భయపడే రోజులు వచ్చాయి. మెరుపులు, ఉరుములతో పాటు పిడుగుల వాన కురుస్తోంది. పొలాలకు వెళ్లే రైతులతో పాటు మేతకోసం వెళ్లే జీవాలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నాయి. విషాదాన్ని మిగుల్చుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందే అంచనా వేయడంతో పాటు, ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు. ● ఏప్రిల్– జూన్ మధ్యనే అధికం.. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రంలో నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడే ఉరుములు ప్రారంభమవుతాయి. పిడుగులు పడుతుంటాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గరు రైతులు మృతి చెందారు. ● పిడుగులు ఏర్పడడం ఇలా... ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం, రుణవేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగు పడటం’ అంటారు. అలా మేఘాల నుంచి పడే ‘పిడుగు’లో దాదాపు 30 కోట్లు ఓల్టుల విద్యుత్ ఉంటుంది. ● ముందస్తు సమాచారం ఇచ్చేలా.. పిడుగు పాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. దీనికోసం ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు. ● పిడుగుపాటు సంకేతాలివే... ఆకాశంలో నల్లని మబ్బులు పట్టడం, మెరుపులు కనిపించడం, ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీయడం పిడుగుపాటుకు సంకేతాలుగా భావించాలి. జాగ్రత్త పడాలి వర్షాకాలంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలి. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండరాదు. చేతిలో సిల్వర్ పాత్రలు ఉంచరాదు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలానికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభమైతే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. చెట్ల సంరక్షణతో వేడిని తగ్గించగలిగితే పిడుగుల ప్రభావం నుంచి బయటపడవచ్చు. – ఆర్.కొండలరావు, జిల్లా అటవీ శాఖ అధికారి అప్రమత్తతే ప్రాణాలకు రక్ష... పత్రికలు, టీవీల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు స్థానిక అధికారులు చేసే హెచ్చరికలు పాటించాలి. పిడుగులు ఎత్తైన భవనాలు, స్తంభాలు, వృక్షాలపై పడే అవకాశం ఎక్కువ. ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఉరుముల సమయంలో తప్పించుకునేందుకు స్థలం లేకపోతే కిందకు వంగి ఉండాలి. కూర్చొన్నప్పుడు పాదాల ముందు భాగం మాత్రం నేలను తాకాలి. మిగిలిన ఏ భాగం నేలను తాకకుండా జాగ్రత్త పడాలి. ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. మేఘాల్లోని విద్యుత్ తరంగాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుడుకు గురుయ్యే ప్రమాదం ఉంది. గృహాల్లో టీవీలు, ఫ్రీజ్లు, ఇన్వర్టర్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికాలకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలి. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు.. ఈనెల 12న మెంటాడ మండలం కుంటినివలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు(45) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పులిగుమ్మి సమీపంలో మట్టి తవ్వుతున్న రామారావు సమీపంలో పిడుగు పడడంతో ప్రమాదం సంభవించింది. అతనితో పాటు ఉన్న కొల్లి సింహాచలం, లోకార్పు మురళి గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈనెల 14న విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలోని పెద్ద బూరడపేట సమీపంలో పిడుగులు బీభత్సం సృష్టంచాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఏప్రిల్ 30న ఎస్.కోట మండలం గిరశిఖర పంచాయతీ పరిధిలోని దారపర్తి గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి కిరణ్ పిడుగుపాటుకు మృతి చెందగా.. అతని సోదరుడు అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. వర్షానికి తడవకుండా చెట్టుకింద ఉన్న ఆవులను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో పిడుగు పడడంతో ప్రమాదం సంభవించింది. ఈనెల 15న పొలాన్ని దుక్కిచేయించేందుకు వెళ్లిన పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం దేవనాపురం పంచాయతీ జగత్పల్లి బూర్జిగూడ చెందిన సవర చంద్రరావు(28) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. -
తల్లీకొడుకుల అదృశ్యం
సీతానగరం: మండలంలోని అంటిపేట గ్రామానికి చెందిన తల్లీకొడుకులు ఈ నెల 23 నుంచి కనిపించడంలేదు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 23న రాత్రి కుటుంబసభ్యులు ఇంట్లో గొడవ పడ్డారు. ఇంట్లో గొడవ అనంతరం అందరూ గాఢనిద్రలో ఉన్నసమయంలో కొడుకును తీసుకుని తల్లి ఇంటినుంచి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. 24న ఉదయం నుంచి తల్లీకొడుకుల ఆచూకీ కోసం గ్రామంలోనే కాకుండా చుట్టాలు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ కనిపింక పోవడంతో అదృశ్యమైన మహిళ తల్లి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు.లారీని ఢీకొని యువకుడి మృతిగంట్యాడ: బొండపల్లి మండలం రాళ్లవాక గ్రామానికి చెందిన యువకుడు బొండపల్లి జగన్ (19) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హోరోహోండా గ్లామర్ బైక్పై కింతాడ మధు అనే వ్యక్తితో కలిసి బొండపల్లి జగన్ ఆదివారం రాత్రి విజయనగరం మండలం సారిక గ్రామానికి వెళ్తుండగా రామవరం ఫైఓవర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా బైక్తో ఢీకొట్టాడు. దీంతో జగన్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మధుకు తల, ఎడమ కాలికి తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. మామిడి తోట ధ్వంసంగరుగుబిల్లి: ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలో ప్రవేశించి గ్రామానికి చెందిన లోపింటి వెంకయ్య మామిడి తోటను ధ్వంసం చేశాయి. మరో రెండు మూడు రోజుల్లో చేతికి రావాల్సిన పంటను నష్టపరిచాయి. 15ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఎకరా డీ పట్టా భూమిలో మామిడి తోటను వేసుకుని జీవనోపాధి పొందుతున్న వెంకయ్యకు చేతికి అందిన పంట ఏనుగుల రూపంలో నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను నష్టపరచడమే కాకుండా కొన్ని చెట్లను కూడా భూమి నుంచి పెకిలించి వేశాయని బాధితుడు వాపోయాడు. ఏనుగుల కారణంగా మామిడి తోటలో సుమారు రూ.50వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు స్పందించి జరిగిన పంటనష్టాన్ని అంచనావేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి గడిముడిదాం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి వెంకటరమణ (40) మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ద్విచక్రవాహనంపై రాజాం వస్తున్నాడు. గడిముడిదాం–బుచ్చెంపేట గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆటోడ్రైవర్ స్థానిక కేర్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విశాఖపట్నం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని మేనమామ శంబంగి జగన్మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ సమస్య పరిష్కరించాలి
విజయనగరం గంటస్తంభం: పత్రిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లా నాయకులు టీవీ రమణ, కె.అప్పలసూరి, బి.రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంఽధ్రకు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ స్టీల్ ప్లాంట్ను కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని, మరింత సమర్థవంతంగా నడపాలని పోరాడుతుంటే, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, నిర్బంధం ప్రయోగించి, ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం ద్వారా విశాఖ ఉక్కు పరిరక్షణ కట్టుబడి ఉంటామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ స్పందించి స్టీల్ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి శంకర్రావు, ఎం.వాసు, వి.లక్ష్మి, సూర్యనారాయణ, జగన్మోహన్ రావు, ఆనంద్, పెంటరాజు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
● 10న ఉపాధి హామీ సిబ్బందితో రాష్ట్రస్థాయి కార్యక్రమం ● కొనసాగుతున్న యోగా శిక్షణవిజయనగరం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి, వారి చేత యోగాసనాలను అభ్యసింపజేసే ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన వందమంది మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ రెండో రోజు ఆదివారం రాజీవ్ఇండోర్ స్టేడియంలో కొనసాగింది. జిల్లా కేంద్రంలో ప్రత్యక్షంగా, హాజరుకాని వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహించారు. యోగా గురువులు, టీవోటీలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు. నాలుగు ప్రాంతాల్లో ప్రదర్శనలు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 30న రామనారాయణం, జూన్ 6న చింతపల్లి బీచ్ వద్ద, 12న రామతీర్థం వద్ద, 19న శ్రీ గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్కర్లతో జూన్ 10న యోగా ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో 10 ప్రాంతాల్లో.. జిల్లా కేంద్రం విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పది యోగా వీధులను ఎంపిక చేశారు. రెండు రోజులకు ఒకసారి పట్టణంలోని ఏదో ఒక ప్రధాన మార్గంలో ఉదయాన్నే యోగాసన ప్రదర్శన నిర్వహిస్తారు. శిక్షణ పొందినవారితో పాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కు వచ్చి ఆసనాలను అభ్యాసం చేయవచ్చు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
అక్రమ రవాణాకు మార్గం!
అక్రమ రవాణాపై మరింత నిఘా..మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత నిఘా మండల బోర్డర్లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ రాష్ట్రాలు ఉడడం వల్ల మండలం మీదుగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు, స్థానిక బైపాస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశాం. ఏ విధమైన అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. వి ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంరామభద్రపురం: మండలకేంద్రంలోని జాతీయ రహదారి మీదుగా నిషేధిత వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా రూ.96 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను రామభద్రపురం పంచాయతీ కార్యాయం వద్ద స్థానిక పోలీసులతో పాటు విజిలెన్స్, వాణిజ్యపనుల శాఖాధికారులు శనివారం పట్టుకున్న విషయం విదితమే. రామభద్రపురం మండల కేంద్రం అంతరరాష్ట్ర కూడలి కావడంతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాలకు బోర్డర్లో ఉన్నందున ఈ మండల కేంద్రం మీదుగా గంజాయి, ఖైనీ గుట్కా, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలతో నిషేధిత వస్తువులు అక్రమ రవాణా సులభతరమవుతోంది. పదినెలల్లో అక్రమ రవాణా జరిగిన కొన్ని సంఘటనలు.. గతేడాది జూన్ 16వ తేదీన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒడిశా రాష్ట్రం కొరాపుట్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి విజయవాడకు అక్రమ రవాణా చేస్తున్న కిలోన్నర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ● గతేడాది ఆగస్టు 16వ తేదీన కొట్టక్కి చెక్ పోస్టు వద్ద అక్రమంగా ఒడిశా నుంచి తరలిస్తున్న రెండున్న కిలోల గంజాయి పట్టుకున్నారు. ● గతేడాది అక్టోబరు 7న మండలంలోని ముచ్చర్లవలస పరిధిలో గల పెట్రోల్ బంకు సమీపంలో గల రాజస్థాన్ డాబా వద్ద ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి నల్లమందు పట్టుకున్నారు ● గతేడాది డిసెంబర్ 12న కొట్టక్కి చెక్ పోస్టు వద్ద ఒడిశా నుంచి సాలూరు, రామభద్రపురం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న 800 కిలోల గంజాయి పట్టుకున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 10న 150 కిలోల గంజాయి కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద పట్టుబడింది. కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికంగా అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదక ద్రవ్యాలతో పాటు పలు నాసిక రకం వస్తువుల అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రామభద్రపురం మీదుగా నిషేధిత వస్తువుల రవాణా -
హత్యా..?ఆత్మహత్యా?
● కోనాడలో అనుమానాస్పదంగా యువకుడి మృతి ● కుమారుడి మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు ● శవాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం చేసిన వైద్యులుపూసపాటిరేగ: మండలంలోని కోనాడ గ్రామంలో యువకుడి మృతిపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు ధ్రువీకరిస్తుండగా తమ కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో యువకుడిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేలనుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. కోనాడ గ్రామానికి చెందిన బొడ్డు భూలోక (35), గ్రామానికి చెందిన బడి సూరిబాబుల మధ్య చిన్నపాటి విషయమై వాగ్వాదం జరిగింది. భూలోక తన కుమార్తె హాసినిని దుర్భాష లాడడంతో వరుసకు మేనమామ అయిన సూరిబాబు పిల్లలను ఎందుకు దుర్భాషలాడుతున్నావంటూ భూలోకను మందలించడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. జరిగిన విషయాన్ని సూరిబాబు సమీపంలోని బంధువులకు చెబుతుండగా, మద్యం మత్తులో ఉన్న భూలోక వెనక నుంచి మంచం కోడుతో సూరిబాబు తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సూరిబాబు బంధువులు బొడ్డు అశోక్, బొడ్డు చినభూలోక, బొడ్డు అప్పలస్వామిలు కోపోద్రిక్తులై రాత్రి 10 గంటల సమయంలో భూలోక ఇంటికి వెళ్లి చేయిచేసుకున్నారు. అకారణంగా సూరిబాబును ఎందుకు కొట్టావంటూ కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన భూలోక నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఉరివేసుకోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు వారించి అడ్డుకున్నారు. అ తరువాత అర్ధరాత్రి 2 గంటల సయంలో భూలోక, తండ్రి అప్పన్నతో కలిసి మద్యం తాగాడు. సీతంపేటలో రంపం పనికోసం ఆదివారం తెల్లవారు జామున నూకరాజు అనే కాంట్రాక్టర్ ఇంటికి వచ్చి భూలోకను పిలుస్తుండగా తలుపులు తీయకపోవడంతో గదిలో చూడగా ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో భూలోక మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం శ్మశానంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి వెళ్లిన మృతుడి తండ్రి అప్పన్న తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేశారని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్లు కోనాడ శ్మశానానికి వెళ్లి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గ్రామస్తుల సహకారంతో బయటకు తీయించి వైద్యులతో మ్మశానంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో బొడ్డు భూలోకది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలనుంది.అనాథలైన పిల్లలు మృతుడు భూలోక భార్య భూలోకమ్మ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా భూలోక మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. వారికి హాసిని, రజిని అనేకుమార్తెలు, అక్షియవర్ధన్ అనే కుమారుడు ఉన్నారు. అనుకోని ప్రమాదంలో తల్లి భూలోకమ్మ, తండ్రి భూలోకలు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. సంఘటనా స్థలానికి వచ్చిన వారంతా దేవుడా ముగ్గురు పిల్లలకు దిక్కెవరంటూ కన్నీరు పెట్టుకున్నారు. బొడ్డు భూలోక మృతిపై ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బురదలో కూరుకుని బాలుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లుంబేసు పంచాయతీ మూలజమ్ము గ్రామంలో బురదలో కూరుకుపోయి ఓ బాలుడు మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బిడ్డిక చిరంజీవి, నీరజల కుమారుడు అశోక్ (7) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు శుక్రవారం వెళ్లాడు. కాసేపు చెరువులో ఉన్న నీటిలో ఆడుకున్నారు. అంతలో ఇంకొంచెం చెరువు మధ్యలోకి వెళ్లిన అశోక్ బురదలో కూరుకుపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో అంతా వచ్చి చెరువులో వెదికారు. చాలా సేపటి తర్వాత బురదలో కూరుకుపోయిన అశోక్ శవమై కనిపించాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రెండు లారీలు ఢీ కొని బిహార్ వాసి మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు లారీలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో బిహార్ వాసి ఒకరు ఆదివారం మృతిచెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందిన సైలేస్ సాహు(40) జీవనోపాధి నిమిత్తం గడిచిన మూడేళ్లుగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీలోని కొండకెంగువ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–1లో పనిచేస్తున్నాడు. అయితే పనినిమిత్తం పాచిపెంట వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–2కు వెళ్లి పని ముగించుకుని తిరిగి క్యాంప్–1కు లారీలో వస్తుండగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆ హైవేకు సంబంధించిన మరో లారీ ఎదురుగా వస్తూ ఢీ కొంది. దీంతో సాహు ప్రయాణిస్తున్న లారీ తలుపు తెరుచుకుని కిందపడడంతో లారీ చక్రాలు, రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మధ్య నలిగి ముద్దయ్యాడు. అదే లారీలో ఉన్న డ్రైవర్ శివ ఠాకూర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు వీలు లేనంతగా ముద్దవడంతో బాడంగి సీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.డ్రైవర్ శివ ఠాకూర్ ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడు సాహుకు భార్య, పాప, బాబు ఉన్నారు.రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలుగజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో ట్రైన్లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గజపతినగరం రైల్వే స్టేషన్ మీదుగా విశాఖ వెళ్తున్న పాసింజర్ ట్రైన్లో నుంచి విజయవర్మ అనే వ్యక్తి జారి పడి తీవ్రగాయాల పాలు కావడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. -
గోపాలకృష్ణ మాస్టారుకు అవార్డు ఆనందదాయకం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పుర్లి గోపాల కృష్ణంనాయుడికి తెలుగు వెలుగు సాహితీవేదిక నంది అవార్డు రావడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని అంబకండి గ్రామంలో గోపాలకృష్ణంనాయుడు మాస్టారును దుశ్శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల ఉపాధ్యాయుడు అయినప్పటికీ తెలుగుభాషపై ఉన్న మక్కువతో విద్య, సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసి అవార్డు పొందడంతో ఈ ప్రాంతానికే మంచి పేరు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఎంపీటీసీ పుర్లి సత్యవతి, లావేటి గణపతిరావునాయుడు, లావేటి శ్రీహరిరావు, లావేటి వెంకట వేణుగోపాలనాయుడు, ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
కమ్మవీధిలో అగ్నిప్రమాదం
● రూ. 5.50 లక్షల ఆస్తినష్టం విజయనగరం క్రైమ్: నగరంలోని కమ్మవీధిలో ఆదివారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని ఒక గృహిణి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడుతుండగా ఒక్కసారిగా అగ్గిపుల్ల పక్కకు ఒరిగి ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ అధికారులు సంతోష్, మహేష్ బృందం ఫైర్ ఇంజిన్తో కమ్మవీధిలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సూబట్ల సూర్యారావు ఇంట్లో ఈ ప్రమాదం సంభవించగా రూ.లక్ష నగదు, బంగారం, ఇంట్లో ఉన్న టీవీ, బీరువా దగ్ధమయ్యాయి. అలాగే ఆ ఇంటిని ఆనుకుని ఉన్న సూబట్ల రాజు, సూబట్ల లక్ష్మణరావుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పిడుగుపాటుకు రెండు ఆవుల మృతిబలిజిపేట: మండలంలోని పెద్దింపేటలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దింపేటలో మధ్యాహ్నం వర్షం కురిసి ఆగిపోయిన తరువాత రైతులు ఆవులను మేతకు విప్పి గ్రామం శివారుకు వెళ్తున్న సమయంలో పిడుగులు పడడంతో ఆవులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మజ్జి కృష్ణమూర్తి, టి.సూర్యనారాయణలకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కృష్ణమూర్తి ఆవు రూ.30వేలు, సూర్యనారాయణ ఆవు రూ.40వేలు ఖరీదు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. కుక్క కాటుతో మరో రెండు ఆవులు పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామంలో నివసిస్తున్న శిర్లి తౌడమ్మ చెందిన రెండు పాడి ఆవులు పిచ్చికుక్క కాటుకు గురై ఆదివారం మృతి చెందాయి. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబ పోషణలో భాగమైన ఆవులను కుక్క కరిచేయడంతో అవి మృతి చెందినట్లు బాధితురాలు భోరుమంది. ఇటీవల మండలంలోని రుద్రిపేట గ్రామంలో కుక్కకాటుకు గురై ఓ లేగ దూడ మరణించిన ఘటన మరువక ముందే మరో ఆవులు చనిపోయాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలపై దృష్టి పెట్టాలని అయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు. 31న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలుబొబ్బిలి: ఈనెల 31న పట్టణంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించారు. క్టబ్ కార్యదర్శి చెలికాని వేణుగోపాల రావు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా 200 మంది హాజరై జూనియర్,సబ్ జూనియర్, జూనియన్ క్యాడెట్, సీనియర్ విభాగాల్లో జరిగే పోటీల్లో తలపడతారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెల 9 నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. -
వైభవంగా ఆదిత్యహృదయ హోమం
నెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, గాయత్రి రామాయణం, ఆదిత్య హృదయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్, రామగోపాల్ పాల్గొన్నారు. -
డిజిటల్ దెబ్బ..దొంగల అబ్బా..!
చీపురుపల్లి: ఎంత నైపుణ్యం కలిగిన దొంగలైనా ప్రస్తుత రోజుల్లో డిజిటలైజేషన్ ముందు తలొగ్గాల్సిందే. విరివిగా దొంగతనాలు జరుగుతు న్నప్పటికీ పోలీస్శాఖలో పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఆ చోరీలను ఛేదించడం సునాయాసమైంది. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణంలోని మెయిన్రోడ్లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన చోరీతో పాటు వృద్ధులను గాయపరిచిన దుండగులు డిజిటలైజేషన్ పుణ్యమాని అతికొద్ది గంటల్లోనే పట్టుబడ్డారు. శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని మెయిన్రోడ్లో వారణాశి సురేష్ నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. శనివారం ఉదయానికి ఈ సంఘటన పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఎస్.రాఘవులు నేతృత్వంలోని పోలీస్ అధికారులు డిజిటలైజేషన్ సహకారంతో దుండగులను పట్టుకున్నట్లు సమాచారం. చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దొంగలను తెనాలిలో పట్టుకుని జిల్లాకు తీసుకుంచ్చినట్లు తెలిసింది. డిజిటలైజేషన్దే కీలకపాత్ర దొంగలను పట్టించడంలో డిజిటలైజేషన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చోరీ జరిగిన ఇంటికి సమీపంలోని సెల్టవర్ పరిధిలో సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది. చోరీ జరిగిన సమయంలో ఆన్లో ఉన్న ఫోన్ నంబర్లను సేకరించారు. దీంతో పాటు క్లూస్ బృందాలు సేకరించిన ఫింగర్ ప్రింట్స్తో మేచ్ అవడంతో తెనాలికి చెందిన ముఠాగా దుండగులను గుర్తించారు. వెంటనే గుంటూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో తెనాలి పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దుండగులు విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి జన్మభూమి రైలులో తెనాలి వెళ్లినట్లు తెలిసింది. రెక్కీ చేసిన మహిళ కోసం.. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో జరిగిన ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. చోరీ జరగడానికి మూడు రోజుల ముందే ఆ మహిళ చీపురుపల్లి చేరుకుని రెక్కీ నిర్వహించి ఇక్కడి ఇల్లు, పరిసరాల ఫొటోలు దుండగులకు పంపించినట్లు తెలిసింది. ఆ మహిళ వేసిన స్కెచ్ ప్రకారమే చోరీ అమలు చేసినట్లు సమాచారం. అయితే తెనాలిలో ఇద్దరు దుండగులు మాత్రమే పట్టుబడిన నేపథ్యంలో ఆ మహిళతో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. సెల్టవర్ లొకేషన్, ఫింగర్ ప్రింట్స్ ద్వారా నిందితుల గుర్తింపు వైజాగ్ నుంచి జన్మభూమి రైలులో ప్రయాణించిన దుండగులు రెక్కీ నిర్వహించిన మహిళ కోసం గాలింపు తెనాలిలో ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు వారితో పాటు మరికొంత మంది ఉన్నట్లు సమాచారం -
‘ఉగ్ర’ విచారణలో విస్తుపోయే నిజాలు!
● మూడో రోజూ కొనసాగిన విచారణ విజయనగరం క్రైమ్: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్లను మూడో రోజు ఆదివారం కూడా విచారించారు. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు భోగట్టా. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ అధికారుల నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న విజయనగరం పోలీసులు స్థానిక పీటీసీలో మూడో రోజు కూడా విచారణ కొనసాగించారు. రెండో రోజు శనివారం రాత్రి సిరాజ్ కాస్త అస్వస్తతకు గురవడంతో సర్వజన ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను రప్పించి పీటీసీలోనే చికిత్స చేయించినట్టు సమాచారం. తొలి రెండు రోజులు కాస్త నెమ్మదిగా దర్యాప్తు సాగించిన దర్యాప్తు బృందం అధికారులు మూడో రోజు తమదైన కోణంలో విచారణ సాగించినట్టు తెలిసింది. ముఖ్యంగా గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్లోనే సమీర్తో ఉన్న విజయనగరం వాసి సిరాజ్ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. మానవ బాంబుగా సిద్ధమైన సిరాజ్, సమీర్లు ముస్లిమేతరులే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా పేలుళ్లకు పథక రచన చేసినట్టు తెలిసింది. వరంగల్ ఫర్హాన్, ఢిల్లీ బాదర్ నుంచి వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. మూడో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ సాగినట్టు భోగట్టా. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకు కొనసాగినట్టు తెలిసింది. -
రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా సేతుమాధవన్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ ఇండోర్ స్టేడి యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా..నేనా అనే విధంగా ఏడు రౌండ్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన ఫిడే మాష్టర్ వేలుమహంతి సేతుమాధవన్ ఆరున్నర పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా నిలిచాడు. అలాగే విశాఖపట్నంకు చెందిన అభిరామ్ ఆరు పాయింట్లతో ద్వితీయ, విజయవాడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మల్లేశ్వరరావు తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్.కోటకు చెందిన వినీల్కార్తీక్ నాలుగో స్థానం, విశాఖపట్నంకు చెంది న జయనాగరాజు ఐదవ స్థానంలో నిలిచారు. ఓపెన్లో పది మందికి, అండర్–17 విభాగంలో పది మందికి, వివిధ కేటగిరీల్లో మొత్తం 30 మంది క్రీడాకారులకు రూ.1.30 లక్షలు నగదు బహుమతి తో పాటు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు జీఎంఆర్ ఐటీ తరఫున అందించారు. ఈ టోర్నమెంట్కు చీఫ్ ఆర్బిటార్గా కేవీ జ్వాలాముఖి వ్యవహరించగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అరుణ్కుమార్ వ్యవహ రించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్య అతిథిగా హాజరైన జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. -
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం
● అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ విజయనగరం అర్బన్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మే 27వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ తెలియజేసిందని ఈ నేపథ్యంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని మండలాలు డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి వనరులపై ప్రభుత్వ నిర్లక్ష్యం రేగిడి: సాగునీటి వనరులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. ఈ ఏడా ది ఖరీఫ్ దగ్గరపడుతున్నప్పటికీ ఇంతవరకు తోటపల్లి, మడ్డువలస ప్రధాన పిల్ల కాలువల పనులు ఆధునికీకరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఆదివారం రేగిడి వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. మడ్డువలస ప్రధా న కాలువకు లైనింగ్ పనులు పూర్తి చేయకపోవడం, పిల్ల కాలువలకు ఏర్పాటు చేసిన తూము లు, షట్టర్లు ఎక్కడికక్కడ పాడైనా.. వాటిని బాగు చేయడం లేదని, దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో పొలాలకు సాగునీరు అందడం కష్టమేనని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు సరికదా కనీసం వ్యవసాయ రంగంపై అయినా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమై న విత్తనాలను సిద్ధంగా ఉంచేదని, ఈ ఏడాది ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు విత్తనాలను అందించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించ డం దారుణమని పేర్కొన్నారు. వారి వెంట పా ర్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయు డు, మండల పార్టీ కన్వీనర్ వావిలపల్లి జగన్మో హనరావు ఉన్నారు. ప్రజా చైతన్యమే జేవీవీ లక్ష్యం ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు విజయనగరం అర్బన్: సామాజిక రుగ్మతల నుంచి ప్రజలను చైతన్య పరిచే దిశగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పనిచేసే జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలాలు ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ సంస్థ పని చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థ సమాజానికి అవసరం ఎంతో ఉందన్నారు. జేవీవీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్టాజీ మాట్లాడుతూ 30 ఏళ్ల జనవిజ్ఞాన వేదిక ప్రస్థానంలో ఎన్నో సైన్స్ ఉద్యమాలను చేపట్టి విజయాలను సా ధించిందని అన్నారు. సామాజిక కార్యకర్తలు బొడ్డేపల్లి రామకృష్ణారావు, మమ్ముల తిరుపతిరావులను ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.శాంతికుమారి, జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, సాహితీ స్రవంతి అధ్యక్షుడు చీకటి దివాకర్, యూటీఎఫ్ నాయకులు నిర్మల, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
బయట చేయించుకోవాల్సిందే..!
థైరాయిడ్ పరీక్ష..● సర్వజన ఆసుపత్రిలో పనిచేయని థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ ● ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్న రోగులు ●ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి.ఆదినారాయణ. ఇతనిది పూసపాటి రేగ మండలం. ఇతను చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగానికి వెళ్లగా అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్లగా అతనికి కూడా థైరాయిడ్ పరీక్ష బయట ప్రైవేటు ల్యాబ్లో చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. ●ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు పేరు పి.ఉమామహేశ్వరరావు. ఇతనిది పూసపాటి రేగ మండలం వెంపడాం గ్రామం. చర్మ సంబంధిత సమస్యతో సర్వజన ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగానికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఇతనికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని ఓపీపై రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబ్ దగ్గరకు వెళ్తే.. థైరాయిడ్ టెస్టు ఇక్కడ కావడం లేదు.. బయట చేయించుకోవాలని అక్కడ సిబ్బంది చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాడు. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో థైరాయిడ్ పరీక్షలు చేసే యంత్రం పనిచేయకపోవడంతో సంబంధిత రోగులకు అవస్థలు తప్ప డం లేదు. థైరాయిడ్ పరీక్ష బయట చేయించుకోవా లని సంబంధిత విభాగంలోని సిబ్బంది చెబుతుండడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా రు. ఈ పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్లో 500 నుంచి 800వరకు ఫీజులు తీసుకుంటున్నారు. దీంతో రోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ సర్వజ న ఆసుపత్రిలో ప్రతిరోజూ 15 నుంచి 20 మంది వరకు థైరాయిడ్ పరీక్ష కోసం వస్తారు. జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, న్యూరో మెడిస న్, న్యూరోసర్జరీ, ఈఎన్టీ, యురాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి సర్వజన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్కు వెళ్లాలని చెబుతారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ పరీక్ష అవసరం పడుతుంది. ప్రస్తు తం ఆసుపత్రిలో ఈ పరీక్ష చేయకపోవడం వల్ల వారంతా ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తరచూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమామహేశ్వరావుకు థైరాయిడ్ పరీక్ష కోసం రాసి ఇచ్చిన ఓపీ చీటీ సాంకేతిక సమస్యతో.. సర్వజన ఆసుపత్రిలో థైరాయిడ్ మిషన్ సాంకేతిక సమస్య వల్ల పని చేయడం లేదని తెలిసింది. త్వరలోనే బాగు చేయిస్తాం. రోగులకు అందుబాటులోకి తీసుకువస్తాం. – డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి -
లక్షా 40 వేలకోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు?: బొత్స
విజయనగరం, సాక్షి: ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?. అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా?. మా అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాలి.వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో ప్రజల అవసరాలన్నీ సమయానికి తీర్చాం. కానీ, ఏడాది పాలనలో రూ.లక్షా 40 వేలకోట్ల అప్పు తెచ్చారు. అన్ని కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేశారు?. ప్రజల అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?. గత ప్రభుత్వాల మాదిరిగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు?. ప్రజలు, రైతులను విస్మరించడం కూటమి ప్రభుత్వానికి భావ్యం కాదు అని బొత్స అన్నారు. ఇదీ చదవండి: వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నమా? -
చిట్టిబాబుకు జాతీయ అవార్డు
విజయనగరం టౌన్: భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు, భారతరత్న సి.సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును జిల్లాకు చెందిన దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు శుక్రవారం న్యూఢిల్లీలోని ఇండియన్ హేబిటేట్సెంటర్లో అందుకున్నారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా డైరెక్టర్ బిరాజ్ పట్నాయక్, ఎన్సీడీహెచ్ఆర్ నేషనల్ జనరల్ సెక్రటరీ బీనాపలికల్ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ మార్పునకు కృషిచేసే 14 మందిని గుర్తించి జాతీయ అవార్డు అందించారని, అందులో తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. -
ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230సాలూరు: సాలూరులో శ్యామలాంబ పండగ అంగరంగ వైభవంగా చేసేందుకు పట్టణ ప్రజలతో పాటు లక్షలాది మంది భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు స్నేహితులు, బంధువులను పిలిచి మూడు రోజుల పాటు పండగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్టు అంతా జరిగింది..వైఫల్యమంతా విద్యుత్ అంతరాయంలోనే కనిపించింది. మరోవైపు అంజలి రథ చక్రం విరిగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పట్టణ వాసులతో పాటు వచ్చిన భక్తులకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం చుక్కలు చూపించింది. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతోనే సరిపోయింది. ఒకనొక సమయంలో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పండగ పూర్తయిన తరువాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో పాలకులు, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో రోడ్లపైనే ప్రజలు విద్యుత్ సమస్యపై అర్ధరాత్రి వరకు బైఠాయించారు. అయినా అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వీసమంతా చలనం లేకపోయింది. తీరా చూస్తే ఇప్పుడు దీనికి కూడా టీడీపీ శ్రేణులు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రజా సమస్యలకు రాజకీయ రంగు పట్టణ ప్రజలు నాలుగు రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బందులు పడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడితే దీన్ని ఓ పార్టీకి ఆపాదించే కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ నేతలు. పండగ నేపథ్యంలో ప్రజలు రూ.కోట్లు ఖర్చు చేసి పండగను చేసుకున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడ్డారు. సమస్య ఆందోళనకు దారితీసే పరిస్థితులు వచ్చిన ఇటు పాలకులు కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఇదంతా రాజకీయమంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు పండగ కోసం సుమారు కోటి 24 లక్షల రూపాయిలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల మాటలను నమ్మి ఓ అడుగు ముందుకు వేసిన మంత్రి సంధ్యారాణి ఈ విషయమై ఉత్సాహంతో పండగ ఏర్పాట్లు చేసుకోండని పిలుపునిచ్చారు. తీరా చూస్తే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోయాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా అయిన ప్రాంతాల్లో లో, హై ఓల్టేజీలు తరచూ రావడంతో ఇళ్లల్లో గృహోపకరణాలు పాడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో విద్యుద్దీకరణ పనుల్లో కొందరికి ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే పండగ సమయంలో ఇంతగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పండగ సమయంలో మూడు రోజుల పాటు తలెత్తిన విద్యుత్ సమస్య నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. పండగ ఏర్పాట్లలో వైఫల్యం రాజకీయాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు -
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుంటే స్థలాల స్వాధీనం
విజయనగరం అర్బన్: గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వెంకటరమణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని ఆయా లబ్ధిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లేని పక్షంలో ఆ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించే నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ జీఎం శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. నెలిమర్ల మండలం సీతారాంపేట, బొంపల్లి మండలం గొట్లాం, బొబ్బిలి మండలం పారాదిలో ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఈఈ, డీఈలతో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలకు ఈ సీజన్ అనుకూలంగా ఉన్నందున లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 6,999 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.మురళీమోహన్ తదితర అధికారులు ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరమణ -
కోవిడ్పై తస్మాత్..
విజయనగరం ఫోర్ట్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కోవిడ్ పేరు చెబితే ఇప్పటికీ జనం హడలిపోతున్నారు. మొదటి, రెండు కోవిడ్ల్లో కోవిడ్ బారిన ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సకాలంలో చికిత్స చేయించుకుని ప్రాణాలతో భయపడ్డారు. రెండేళ్లు పాటు ప్రజలు కోవిడ్ కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవించారు. గత కొన్నేళ్లుగా వ్యాప్తి లేకపోవడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ప్రపంచలోని పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. పొరుగున ఉన్న విశాఖలో కూడా కోవిడ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి సూచించారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, హ్యాండ్ వాష్ తదితర వాటితో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆందోళన అవసరం లేదు.. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న పెళ్లి కారు రాయగడ రోడ్డులోని గ్రోత్ సెంటర్లో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వేగానికి పక్కనే ఉన్న కాలువలోకి పక్కకి ఒరిగి పోయింది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారులోని పెళ్లి బృందాన్ని బయటకు తీశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బలగ సాయికృష్ణ కుమార్తె పెళ్లి అనంతరం జరిగిన ఈ ఘటనలో కారులో సాయికృష్ణతో పాటు నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఘటన సంగతి తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ప్రయాణికుల క్షేమ సమాచారాలను కనుగొన్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాలల ప్రతిభకు వేదిక బాలభవన్
● వేసవిలో ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన ● పలు కళల్లో తర్ఫీదు పొందుతున్న 550 మందికి పైగా చిన్నారులు ● 32 సంవత్సరాలుగా సేవలు ● వేసవి శిక్షణకూ ఇతర జిల్లాల విద్యార్థుల హాజరురాజాం : రాజాంలోని మెంతిపేటలో ఉన్న బాలభవన్ బాలల ప్రతిభను వెలికితీసే వేదికగా మారింది. పలు కళా రంగాల్లో మక్కువ ఉన్న చిన్నారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జవహర్ బాలభవన్ను ఇక్కడ 1993 జూన్ 4న ప్రారంభించారు. అప్పట్లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పుడు సొంత భవనాలతో పాటు ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లో కేంద్రం ప్రారంభంలో ఇక్కడ శిక్షణ ఉండేది. ఇప్పుడు 16కి పైగా కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు వేసవిలో రాజాం వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి వేదికగా ఇక్కడ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నిలుస్తున్నాయి. ఏమి నేర్పుతున్నారంటే.. గత నెల 24న బాలభవన్లో వేసవి శిక్షణా శిబిరాన్ని రాజాంకు చెందిన పలువురు ప్రముఖుల చేతులు మీదుగా డైరెక్టర్ సుంకరి రమేష్ ప్రారంభించారు. ఈ వేసవిలో ఉచితంగా చిన్నారులకు మ్యూజిక్, డ్యాన్స్, తబలా, నాట్యం, సంగీతం, ఆర్ట్స్, టైలరింగ్ వంటి విద్యలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. శిక్షణ నిమిత్తం 550 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు నృత్యం, సంగీతం శిక్షణలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 200లకు పైగా బాలభవన్లు, 47 బాల కేంద్రాలు పని చేస్తుండగా, రాజాం బాలభవన్కు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఈ వేసవిలో ఇక్కడ చిన్నారులకు తర్పీదునిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.. రాజాంతో పాటు చీపురుపల్లిలో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ కేంద్రాలను నిలబెట్టాం. రాజాం బాలభవన్కు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు టీవీ షోల్లో సంగీతం, నృత్యం వంటి రంగాల్లో పాల్గొనే అవకాశం పొందారు. కొంతమంది ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ రాణిస్తున్నారు. వేసవిలో చిన్నారులు సమయాన్ని వృథా చేసుకోకుండా కాలాన్ని ఆహ్లాదకరంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ సుంకరి రమేష్, డైరెక్టర్, బాలభవన్ 550 మందికి పైగా విద్యార్థులు రాజాం బాలభవన్ వేసవి శిక్షణలో అనూహ్య స్పందన కనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు రకాల వినోద ప్రదర్శనల్లో తన సత్తాను చాటుతున్నారు. బాలభవన్ జాతీయ వేడుకల్లో ఇక్కడ బాలభవన్ గత 2018 నుంచి మూడు పర్యాయాలు ప్రథమ స్ధానాన్ని సాంస్కృతిక కళా రంగాల ప్రదర్శనలో నిలిచింది. దీంతో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో ఇక్కడకు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రాజాంలో ఉన్నవారే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులు సెలవులు కారణంగా రాజాం రావడంతో వారంతా ఈ శిక్షణలో పాల్గొని పలు కళారంగాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. -
కొత్తపేటలో రెచ్చిపొయిన మట్టి మాఫియా
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా గ్రామ ప్రథమ పౌరుడిపైనే విచిక్షణారహితంగా దాడి చేసి రక్తాన్ని కళ్ల చూశారు. తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో విజయనగరం కేంద్రాస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొత్తపేటలోని చిన్న జగ్గయ్య చెరువు వేదికగా శుక్రవారం పక్కాపథకంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో మట్టి తవ్వకాల విషయంలో సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావు, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానిక అవసరాల నిమిత్తం సర్పంచ్ మట్టిని తోలేందుకు ప్రయత్నించగా.. తాము మాత్రమే మట్టిని తరలించాలని, ఇతరులు తరలించడానికి వీలు లేదంటూ జనసేన కార్యకర్తలు తనపై దాడికి దిగారని, సువ్వాని రమణ అనే వ్యక్తి రాయితో బలంగా తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి జనసేన కార్యకర్తలు సువ్వానిపేట, కొత్తపేట చెరువుల్లో మట్టిని తరలించుకుపోతున్నారని, రోజూ వేలాది టన్నుల మట్టి తరలిపోతోందని సర్పంచ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా తమకి కూడా గాయాలయ్యాయని జనసేన కార్యకర్తలు సువ్వాని రమణ, గురాన గోవింద, కల్యాణం లోకేష్, పంచాది రమణ, తదితరులు మిమ్స్లో చేరడం విశేషం. సర్పంచ్పై రక్తం వచ్చినట్లు దాడి చేసి తిరిగి వాళ్లే ఆస్పత్రిలో చేరడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గణేష్ తెలిపారు. సర్పంచ్పై దాడి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే కొత్తపేట గ్రామ సర్పంచ్పై జనసేన కార్యకర్తలు దాడి చేసి గాయపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావును ఆయన పరామర్శించారు. దశాబ్దాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నామని, కొట్లాడుకునే సంస్కృతికి ఎప్పుడు తావునివ్వలేదని, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ సంస్కృతి ప్రారంభమైందన్నారు. మట్టి తరలింపు విషయంలో సర్పంచ్ను రక్తం వచ్చినట్లు కొట్టడం సరికాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్పై జనసేన కార్యకర్తల దాడి, తీవ్ర రక్తస్రావం మట్టి తవ్వకాల విషయంలో చెలరేగిన ఘర్షణ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ -
వెబ్సైట్లో జీడీఏ ప్రొవిజినల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ జాబితా విజయనగరం.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 31వ తేదీలోగా తెలియజేయాలన్నారు. ‘కంచరగెడ్డ’ ఆక్రమణల తొలగింపు ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు బొబ్బిలి రూరల్: మండలంలోని కాశిందొరవలస గ్రామ రెవెన్యూ పరిధి కంచరగెడ్డ జలాశయ భూముల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. టీడీపీ నాయకుడు దురాక్రమణకు పాల్పడిన భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. జలాశయం భూముల ఆక్రమణపై ఈ నెల 20న ‘కంచరగెడ్డ దురాక్రమణ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ ఎం.శ్రీను స్పందించారు. ఆక్రమణలను శుక్రవారం పరిశీలించారు. జలాశయంలోని భూములు ప్రభుత్వానికి చెందినవని, వీటిని ఆక్రమించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమిత భూమిలో సాగుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ మేరకు సిబ్బందితో హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేయించారు. కోటిపాం వంతెనపై వినూత్న నిరసన కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చే ఏర్పాట్లైనా చేయాలని డిమాండ్ చేశారు. -
జీకేఆర్ పురం నుంచి జపాన్కు..
బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివారం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. -
అధికం..!
బదిలీలకు పాయింట్ల కేటాయింపు ఇలా... తప్పనిసరి బదిలీలేపాఠశాలలున్న ప్రాంతాల సౌకర్యాలను బట్టి జిల్లాలో విభజించిన నాలుగు కేటగిరీలకు బదిలీ చట్టం ప్రకారం పాయింట్లను కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆ పాఠశాల కేటగిరీ ఆధారంగా ఉపాధ్యాయులకు బదిలీలో పాయింట్లు కేటాయించారు. కేటగిరీ–1 స్కూళ్లలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక పాయింట్, కేటగిరీ–2 స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు పాయింట్లు కేటాయించారు. అలాగే, కేటగిరీ–3 స్కూల్కి 3, కేటగిరీ–4 స్కూల్కి మాత్రం 5 పాయింట్లు ఇస్తారు. ఇలా.. కేటగిరీ–4లో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి అత్యధికంగా 40 పాయింట్లు లభిస్తాయి. వీరికి బదిలీల్లో తొలిప్రాధాన్యం ఉంటుంది. పారదర్శకంగా నిర్వహిస్తాం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీగా చేపడతాం. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ ●విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ఇప్పటికే ప్రారంభించింది. బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేటగిరీ వారీగా జరుగుతోంది. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులకు మాత్రమే తప్పనిసరి బదిలీ వర్తించినప్పటికీ, రేషనలైజేషన్ జీఓ అమలు నేపథ్యంలో స్థానచలనం జరిగే ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, గడిచిన విద్యాసంవత్సర చివరి నెల విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటున్న కారణంగా మిగులు ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. మారిన విధానాలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో 70 శాతం మందికి స్థానచలనం ఉంటుందని అంచనా. ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 100 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ ప్రక్రియను వినియోగించుకున్నారు. ఇందులో 26 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తికావడంతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎస్జీటీలకు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ.. వంద శాతం దృష్టి లోపం, 80 శాతానికి పైగా శారీరక వైకల్యం ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం, 75 శాతం దృష్టిలోపం, 70–79 శాతం శారీరక వైకల్యం, 70 శాతానికి పైగా వినికిడి లోపం ఉన్న వారికి ద్వితీయ ప్రాధాన్యం, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బొనెటీసీ, కిడ్నీ మార్పిడి, వితంతువులు, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేసుకన్న వారు, జీవిత భాగస్వామి, పిల్లలు జువనైల్ డయబెటిస్, తలసీమియా, హీమోఫిలియో, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారు, వైద్య చికిత్స పొందుతున్న వారు ఈ కేటగిరీలోకి వస్తారు. 70 శాతానికి మించి ఉపాధ్యాయులకు స్థానచలనం పరిగణనలోకి విద్యార్థుల హాజరు సంఖ్య బదిలీలకు కేటగిరీ వారీగా పాయింట్ల కేటాయింపులు బదిలీలకు కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ -
7 రైతు బజార్లు.. రెండే కూలర్లు..!
విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లను అభివృద్ధి చేస్తాం... కూరగాయాలు, ఆకు కూరలు విక్రయించుకునే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. తీరా ఆచరణలో తుస్సుమనిపిస్తున్నారు. జిల్లాలో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ, దాసన్నపేట, పాత ఎంఆర్ ఆస్పత్రి వద్ద, రాజాం, ఎస్.కోట, చీపురుపల్లి, కొఠారుబిల్లి వద్ద కలిపి మొత్తంగా ఏడు రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 300 మంది వరకు రైతులు కూరగాయలు క్రయవిక్రయాలు జరుపుతూ జీవనం సాగిస్తున్నారు. మిగులు కూరగాయలు నిల్వ ఉంచేందుకు అవసరమైన కుబ్జి కూలర్లు మంజూరు చేయాలని పాలకులు, అధికారులకు పలు మార్లు విన్నవించారు. ఒక్కో రైతు బజారుకు రెండు నుంచి మూడు కూలర్లు అందజేయాలని కోరారు. అయితే, కూటమి ప్రభుత్వం కేవలం విజయనగరంలోని ఆర్అండ్బీ రైతు బజార్, దాసన్నపేట రైతు బజార్కు మాత్రమే ఒక్కొక్కటి చొప్పున కుబ్జికూలర్లు మంజూరు చేసింది. మిగిలిన ఐదు రైతు బజార్లకు మొండిచేయి చూపింది. కూలర్లు మంజూరు చేయాలని ఏడు రైతుబజార్ల రైతులు విన్నవిస్తే కేవలం రెండింటికి ఒక్కో కూలర్నే మంజూరు చేయడం తగదంటున్నారు. రైతుల అవసరం మేరకు కూలర్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మార్కెటింగ్ శాఖ ఎ.డి. బి.రవికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండు కుబ్జికూలర్లనే ఇచ్చిందన్నారు. వీటిని విజయనగరంలోని ఆర్అండ్బీ, దాసన్న పేట రైతు బజార్లలో ఏర్పాటుచేశామని చెప్పారు. ఇదీ కూటమి ప్రభుత్వ నిర్వాకం ఆవేదనలో రైతన్నలు -
మతోన్మాద శక్తులతో చేతులు కలిపి...
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను అందరిలాంటి విద్యా ర్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్ల ఉగ్రకోణంపై ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకుని సౌదీతో ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్లో చేసిన చాటింగ్లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే సిరాజ్ నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆయా దుకాణాలకు వెళ్లి వివరాలు సేకరించారు. మతోన్నాదం ఉచ్చులోకి యువతను లాగి.. సిరాజ్, సమీర్లు దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు పూనుకున్నారు. దీనికోసం ముస్లిం యువతతో ప్రత్యేక బృందాలను నియమించారు. విదేశాల్లోని ఉగ్రమూకల నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించారు. దేశం మొత్తం అలజడులు సృష్టించేందుకు పథకరచన చేశారు. పేలుళ్లతో మారణహోమాన్ని సృష్టించడం, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనట్టు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ముందుగా విజయనగరంలోని జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో బాంబులు పేల్చాలని నిర్ణయించారు. ఇద్దరి ఉగ్రవాద భావాలు, వారి కుట్రకోణాలను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. విజయనగరం విధ్వంసానికి పథక రచన తవ్వేకొద్దీ బయటకొస్తున్న సిరాజ్, సమీర్ల ఉగ్ర కుట్రకోణం ప్రత్యేక యాప్లో సంభాషణలు పేలుళ్లకు పథకం కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ల నుంచి వివరాలు రాబడుతున్న పోలీసులు -
● కదలని బండి... తోయాల్సిందేనండి..
రాజాం–శ్రీకాకుళం ప్రాంతాల మధ్య తిరిగే బస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొరాయించింది. స్టార్ట్ కాకపోవడంతో దాదాపు గంటకాలం పాటు కాంప్లెక్స్లో నిలిచిపోయింది. చేసేదిలేక ప్రయాణికులు బస్సు దిగి ఇదిగో ఇలా ముందుకు నెట్టారు. అయినా స్టార్ట్ కాకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల రాజాం– శ్రీకాకుళం, బొబ్బిలి, చీపురుపల్లి, పాలకొండ ప్రాంతాల మధ్య తిరిగే బస్సులు అధికంగా మొరాయిస్తున్నాయి. మరమ్మతులకు గురైన బస్సులను ఇటు వైపు నడపడంతో ఈ పరిస్థితి వస్తుందని, పట్టించుకునే నాయకులు లేక ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రయాణికులు వాపోయారు. – రాజాం -
● ఆస్పత్రిలో విద్యుత్ ఇక్కట్లు
చీకటిలో వైద్యసేవలందిస్తున్న సిబ్బంది... విసన కర్రలతో రోగులకు విసురుతున్న మహిళలను చూశారా.. ఇది బాడంగి సామాజిక వైద్య కేంద్రంలో తీసిన చిత్రం. శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల వల్ల ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓ వైపు ఉక్కపోతతో రోగులు అవస్థలు పడగా, మరోవైపు ఎక్స్రే, ల్యాబ్ సేవలు, శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీలో రోగులను పరీక్షించేందుకు వైద్యులు ఆపసోపాలు పడ్డారు. ఆస్పత్రి మొత్తం చీకటిగా మారడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో వైద్యసిబ్బంది సేవలందించారు. ఏడున్నర గంటల పాటు అటు వైద్యులు, సిబ్బంది, ఇటు రోగులు నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి ఇన్వెర్టర్ చార్జింగ్ అయిపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో కష్టాలు తప్పలేదు. తక్షణమే ఆస్పత్రికి జనరేటర్ సదుపాయం కల్పించాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేశారు. – బాడంగి -
గిట్టుబాటు ధర కల్పిస్తాం
రామభద్రపురం: రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటామని మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ, ఏఎంసీ సెక్రటరీ ఈశ్వరరావు అన్నారు. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో బెండకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలో ధర రూ.2 పలకడంతో రైతన్న నష్టపోతున్నారు. కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇదే విషయంపై ‘కిలో బెండకాయలు రూ.2లు’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ స్పందించారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని మార్కెటింగ్ ఏడీ కిరణ్కుమార్ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు బొబ్బిలి ఏఎంసీ కార్యదర్శి ఈశ్వరరావు, మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో బెండకాయల సాగు రైతులతో మాట్లాడారు. ఎస్.చింతలవలసలోని ఎస్.సత్యం సాగుచేస్తున్న బెండ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యలను రైతును అడిగి తెలుసుకున్నారు. బెండపంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. పంటలను రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునే సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న మిశ్రమ పంటలు వేసుకోవాలని సూచించారు. ఽఅధిక దిగుబడి వచ్చే 6 నెలల పంట కాలం ఉన్న గ్రాఫ్టెడ్ టమాటా, వంగ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ సూపర్వైజర్ చింతల తిరుపతిరావు, వీహెచ్ఏలు పాల్గొన్నారు. బెండసాగు రైతులతో మాట్లాడిన ఉద్యానశాఖాధికారి -
2
కిలో బెండకాయలు రూ.ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం రైతులతో మాట్లాడి కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ఉద్యానశాఖాధికారులతో అనుసంధానం చేసుకుని రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునేలా సౌకర్యాలు కల్పిస్తాం. – కిరణ్కుమార్, మార్కెటింగ్శాఖ ఎ.డి., బొబ్బిలి కష్టానికి తగ్గ ఫలితం లేదు.. బెండకాయలకు కనీస ధరలేదు. చీడపీడల నివారణ, పంట కోత, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కె సత్యం, బెండ రైతు, చింతలవలస రామభద్రపురం: బెండ రైతుకు క(న)ష్టకాలం వచ్చింది. రామభద్రపురం అంతర్ రాష్ట్ర మార్కెట్లో కిలో బెండకాయల ధర రూ.2 పలుకుతోంది. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయలను గరిష్టంగా రూ.30కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధరలు లేక కోత, రవాణా ఖర్చులకు తిరిగి అప్పు చేయాల్సి వస్తోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు కష్టాలే ఎదురవుతున్నాయని, పది నెలలుగా పంటను కొనుగోలుచేసేవారి కోసం ఎదురు చూడాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొ న్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా పెట్టుబడి సాయం అందక, పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నుంచి కూరగాయల వరకు ఏ పంటకూ మార్కెట్లో మద్దతు ధర లేదని చెబుతున్నారు. రైతులంటే కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఓటు వేసి అధికారం కట్టబెట్టిన రైతన్నకే వెన్నుపోటు పొడవడం, నష్టాల్లో ముంచడంపై గగ్గోలు పెడుతున్నారు. కోత ఖర్చులకు అప్పుచేయాల్సిందే.. నేను 20 సెంట్ల విస్తీర్ణంలో బెండ పంట సాగుచేశాను. కాపుకొచ్చిన పంటను చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లేక బాధపడాలో తెలియడం లేదు. పంటను మార్కెట్కు తెస్తే కోత, రవాణా ఖర్చులు రావడం లేదు. 10 క్రేట్లను ఆటోపై రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్కు తెస్తే రూ.300కు వచ్చాయి. అందులో ఆశీలు రూ.100, ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.100 పోగా రూ.100లు మిగిలింది. కూలీలకు, పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – కటికి గంగమ్మ, బెండ రైతు, రామభద్రపురం సాగులో ఉన్న బెండ పంట 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30 నష్టాల్లో బెండ రైతులు కోత ఖర్చులు సైతం దక్కని దైన్యం -
భూ సమస్యలు తలెత్తకూడదు..: జేసీ
గజపతినగరం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతన్నలకు భూ సమస్యలు వస్తే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. గజపతినగరం మండల కేంద్రం పురిటిపెంట పాల్తేరు వారి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఐదు మండలాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులు సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి వారి సమస్యలను సంపూర్ణంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలని సిబ్బందికి సూచించారు. భూ సమస్యల పరిష్కారం విషయంలో రీసర్వే అయిన తరువాత వచ్చిన ఎల్పీఎం నంబర్లు, సర్వే నంబర్లు టాలీ చేసుకొని తప్పులు దొర్లకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. బొబ్బిలి ఆర్డీవో జెవిఎస్ఎస్.రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఈడీ ఎస్సీ సొసైటి ఇంచార్జ్ ఆర్డీవో వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్ధార్ బి.రత్నకుమార్తో పాటు ఐదు మండలాల తహసీల్లార్లు, సర్వేయర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్టు ఎక్కినా ఉపాధి కరువే..!
జియ్యమ్మవలస రూరల్: రాత్రింబవళ్లు శ్రమించి.. కఠోర సాధన చేసి.. చివరకు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మన్యం బిడ్డ.. ఉపాధిలేక దిక్కులు చూస్తున్నాడు. తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమే. ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనల నడుమ ఎవరెస్టు శిఖరాన్ని జియ్యమ్మవలస మండలం పరజపాడు పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల చిన్న నారాయణరావు తవిటమ్మల కుమారుడు బొడ్ల సాగర్ అధిరోహించాడు. యువకుడి సాహసాన్ని మే 7వ తేదీ 2017 సంవత్సరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని పత్రికలు ప్రచురించి ప్రశంసలతో ముంచెత్తాయి. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు జిల్లా అధికారులు సైతం సాగర్ సాహసంపై ప్రశంసలు కురిపించారు. సన్మానాలు చేశారు. విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. ఆ తరువాత 8 సంవత్సరాలు గడిచిపోయినా.. ఈ ఎవరెస్టు వీరుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భద్రగిరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తూ సుమారు 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ పొంది 120 మందిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎవరెస్టు శిఖరం ఎక్కగలిగారు. వారిలో సాగర్ ఒకడు. ఆ ప్రయాణంలో తన కుడిచేతి రెండు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఏళ్లు గడిచినా సాగర్కు ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తండ్రితో కూలి పనులకు, బోర్లు వేసేందుకు వెళ్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని కూలి డబ్బులతో నెట్టుకొస్తున్నాడు. సాగర్ను ఉద్యోగిగా చూడాలన్న కన్నవారి కలలు కలగానే మిగిలాయి. పర్వతారోహణకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.25లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా.. విజయాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన ఆ యువకుడిన ఆదుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తున్న సాగర్ -
ఆరోగ్యశ్రీ రోగులకు.. సాధారణ భోజనం..!
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్నే కాదు.. ఆరోగ్య సేవలపైనా కినుక వహిస్తోంది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద వైద్యసేవలు పొందుతున్న రోగులకు సరైన భోజనం అందకపోయినా పట్టించుకోవడం లేదు. రోగులు, వారి బంధువుల గోడు వినిపించుకోవడం లేదు. వాస్తవంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందేవారికి రుచికరమైన పౌష్టికాహారం అందించాలి. దీనికోసం రోజుకు రూ.100లు ఖర్చుచేయాలి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ రోగులకిచ్చే భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకూ అందిస్తున్నారు. దీనిపై రోగుల బంధువులు నిలదీస్తున్నా స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సైతం ఆరోగ్యశ్రీ రోగులకు సాధారణ రోగులకు అందించిన భోజనం( డైట్) అందిస్తున్నారు. ఇక్కడ 450 నుంచి 500 మంది వరకు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. ఇందులో 300 నుంచి 350 మంది వరకు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందినవారే ఉంటారు. వీరికి ప్రత్యేకమైన భోజనం అందించాలి. ఆస్పత్రిలో మాత్రం ఇది అమలుకావడం లేదు. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను 25 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు, 55 ప్రభుత్వాస్పత్రులు అందిస్తున్నాయి. చాలా చోట్ల భోజనం అందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదేశాలు వచ్చాయి.. ఆరోగ్యశ్రీ రోగులకు, సాధారణ రోగులకు ఒకే విధమైన డైట్ పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ రోగులకు రోజుకి రూ.100 చొప్పున 10 రోజులకి మించకుండా డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు వచ్చినా అమలు చేయలేదు. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి భోజనానికి రూ.100 ఖర్చుచేయాలి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్వైద్యసేవ) పథకం కింద చికిత్స పొందిన రోగులకు భోజనం కోసం రోజుకు రూ.100 వెచ్చించాల్సిందే. రోగులకు రుచికరమైన భోజనం వడ్డించాలి. ఇందులో నిర్లక్ష్యం పనికిరాదు. – డాక్టర్ సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ రోగులకు అందించే భోజనం అందించాల్సిన మెనూ ఇదీ.. సాధారణ రోగులకు ఇస్తున్న భోజనమే ఆరోగ్యశ్రీ రోగులకు ఇస్తున్న వైనం ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు పొందే వారికి భోజనం నిమత్తం రోజుకి రూ.100 చొప్పున వెచ్చించాలి అమలు కావడం లేదంటూ ఆరోపణ ఆవేదనలో రోగులు, వారి బంధువులు ఆరోగ్యశ్రీ పథక నిబంధనల ప్రకారం రోగులకు ఉదయం 150 గ్రాముల బరువు ఉన్న మూడు ఇడ్లీలు, 100 గ్రాముల సెట్నీ... మిల్క్ బ్రెడ్ ఏడు సైల్స్ ఉన్నవి (140 గ్రాములు)... బన్సీ రవ్వ ఉప్మా 300 గ్రాములు వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి. అలాగే, 150 ఎంఎల్ పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం మూడు పుల్కాలు (ఒక్కొక్కటి 30 గ్రాముల బరువు ఉండాలి)గాని, 450 గ్రాముల సోనామసూరి రైస్తో వండిన అన్నం, వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (30 గ్రాములు కందిపప్పు ఉండాలి), 50 గ్రాముల గల ఉడికించిన గుడ్డు, 100 గ్రాముల పెరుగు, అరటి పండు ఒకటి, లేదంటే సీజనల్గా దొరికే పండు ఇవ్వాలి. రాత్రికి 3 పుల్కాలు (30 గ్రాములు బరువు ఉండేవి) గాని, సోనామసూరి రైస్తో వండిన 450 గ్రాముల అన్నం, మిక్స్ డ్ వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (కంది పప్పు 30 గ్రాములు ఉండాలి), 50 గ్రాముల ఉడికించిన గుడ్డు ఒకటి, 150 గ్రాముల పాలు రెండు టీ స్పూన్ల పంచదారతో కలిపి ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల మెనూ అమలుకావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...
తెర్లాం: వివాహ వేడుకలకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెర్లాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు బుధవారం రాత్రి జరిగిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డ రామకృష్ణ(24) తెర్లాంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల వద్ద బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మరణించాడు. తెర్లాం మండలం రాజయ్యపేట గ్రామంలో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు తన మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం రామకృష్ణ వచ్చాడు. అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. బుధవారం రాత్రి తెర్లాం మండలం ఎం.ఆర్ అగ్రహారంలో జరుగుతున్న స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రామకృష్ణ తన చినమేనమామతో కలిసి ఆటోలో వెళ్లాడు. వివాహ వేడుకలో పాల్గొని అక్కడ భోజనం చేసి తిరిగి రాజయ్యపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆటోను తన చినమేనమామ నడుపుతుండగా అతని పక్కన రామకృష్ణ కూర్చొన్నాడు. తెర్లాం వెంకటేశ్వర కళాశాల వద్దకు వచ్చే సరికి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. దీంతో రామకృష్ణ కింద పడిపోగా, ఆటో అతనిపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రామకృష్ణను బయటకు తీశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసేటప్పటికే రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. మృతుని సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించినట్టు ఎస్ఐ సాగర్బాబు తెలిపారు. బైక్ మెకానిక్గా పనిచేస్తూ.. రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి వెంకటరమణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. వివాహ వేడుకకు మేనమామ ఊరు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న రామకృష్ణ తల్లి, తమ్ముడు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
యోగాంధ్ర విజయవంతానికి ప్రణాళిక
● 100 మంది టీఓటీల ఎంపిక ● గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యకర్తలు ● జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్టు జేసీ సేతు మాధవన్ గురువారం తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు... ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వా ములను చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఉపాధి వేతనదారులు సుమారు 5 వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో యోగా స్ట్రీట్ను ఏర్పాటు చేసి, ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకో మండలం చొప్పున ఎంపిక చేసి ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. యోగా మంత్ కార్యక్రమం విజయవంతానికి 100 మంది టీఓటీలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. రీ సర్వే వినతులు పరిష్కరించాలి ● రెవెన్యూ అధికారులను ఆదేశించిన కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: రెవెన్యూ, రీ సర్వే వినతులన్నీ వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, రెవెన్యూ అధికారుల అలక్ష్యమే దీనికి కారణమన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజక వర్గాల రెవెన్యూ అధికారులతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, వాటర్ ట్యాక్స్, ఆన్లైన్ సర్వీసెస్ పెండింగ్, రీ సర్వే, పిజీఆర్ఎస్ వినతులపై జేసీతో కలిసి గురువారం సమీక్షించారు. అన్ని గ్రామాల్లో ఆక్రమిత భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. వచ్చే సోమవారం నుంచి ఈ విషయంపై వినతులు అందితే సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ గృహాలు పథకం కింద జిల్లాలో 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని వెరిఫైచేసి శనివారం నాటికి ఆన్లైన్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలన్నారు. వాటర్ టాక్స్ జిల్లాలో సుమారుగా రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ.53వేలు వసూలు చేయడంపై అసహనం వ్యక్తంచేశారు. బదిలీలు పారదర్శకంగా సాగుతాయని, సిఫార్సులను అనుమతించబోమని స్పష్టంచేశారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో మురళీ, ఇన్చార్జి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి.రమణమూర్తి, తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దాడి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామంలో అమ్మవారి పండగ ముగింపు రోజు బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రజకుల ఇళ్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన బెవర కులస్తులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులతో పాటు కర్రలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వాడాడ పోలమ్మ, వెంపడాపు రమేష్, నందిగాం సీత, చోడవరపు అరుణలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుప్ప సింహాచలం స్థానిక సీహెచ్సీకి ఆటోపై తరలించారు. వీరిలో పోలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో అరుణ బాలింత కావడంతో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయమై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య మంగళవారం నాడే తగాదా జరిగింది. టీడీపీ వర్గీయులు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడతారోనని రజకులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు సింహాచలం ఆరోపించారు. -
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఎండీయూ వాహనాలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27 వేల మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. రేషన్కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోల్, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు సిహెచ్.వెంకటరావు, పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాడ లేని సంక్షేమం..!
ఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే విజయనగరం గణేష్ గుడి మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – సత్యం, తాపీ మేసీ్త్ర, విజయనగరం ఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేసింది. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? –కృష్ణ అప్పారావు, పెయింటర్, విజయనగరం కార్మికుల పొట్ట కొట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. విజయనగరం జిల్లా పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. –బి.రమణ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కార్మిక బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇసుకఽ కొరత లేకపోయినా పనుల్లేకుండా పోయాయి. భవన కార్మికుల సంక్షేమ బోర్డును రద్దును పునరుద్ధిరస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. –మజ్జి ఆదినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ● అర్థాకలితో నిర్మాణ రంగ కార్మికులు ● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన 1590 క్లెయిమ్స్ ● కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం ● ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయి? విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించారు. కనీసం మరణ క్లెయిమ్స్, ప్రసూతి క్లెయిమ్స్, స్కాలర్షిప్ క్లెయిమ్స్, అనారోగ్య క్లెయిమ్స్ కూడా అందకుండా చేశారు. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 1590 క్లెయిమ్స్ ఇప్పుడు వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 2లక్షల పైగా మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని వేలల్లో ఉంటారు. ఇప్పుడు వరకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 91,528 మంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. సాధికార సంస్ధ ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. పేరు మార్పు తప్ప సాయం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఉత్తివిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు 11వేల కుటుంబాలకు రూ.118 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా.. వైఎస్సార్ కల్యాణమస్తు కింద భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.20వేలు చొప్పున అందించారు. వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. అసంఘటిత రంగ కా ర్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల చర్చ
విజయనగరం అర్బన్: బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. జూన్ రెండో తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఎక్కడ చూసినా బదిలీలపై చర్చే నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబర్లో బదిలీలు చేసింది. పిల్లల చదువులు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన 15 శాఖల్లోనే అప్పట్లో సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అనుమతివ్వడంతో ఈ సారి భారీ సంఖ్యలోనే ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు కొన్నేళ్లుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని 34 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు ప్రారంభమయింది. ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి కావడంతో వాళ్లంతా సిఫార్సుల లేఖల కోసం నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్య పోస్టింగ్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం కొందరు పైరవీలు మొదలయ్యాయి. తమను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది. అటువంటి పలువురు ఉద్యోగులు కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూ, పీఆర్లో భారీ పోటీ ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, జిల్లా ప్రజా పరిషత్, ఇంజినీరింగ్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్లతోపాటు ఆయా పట్టణాలకు చుట్టుపక్కల మండలాల్లో అనుకూలమైన పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. పెద్ద మండలాలకు వెళ్లేందుకు డీప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు అదేవిధంగా మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్ల నిమిత్తం గ్రామ కార్యదర్శులు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరి ప్రాధాన్యం ఉన్న పోస్టులపై పలువురి దృష్టి సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు సచివాలయాల్లో భారీ కదలికలు తప్పవు సచివాలయ నిర్వహణ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పోస్టుల కుదింపు చర్యలు ఒకవైపు ఉంటే మరోవైపు బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో సచివాలయ ఉద్యోగుల స్థానచలనం భారీగానే ఉంటుంది. జిల్లాలోని 563 గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేడర్ సిబ్బంది 5,320 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ శాఖలో చేపట్టిన బదిలీ ప్రక్రియలో బదిలీ కోరిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది బదిలీల పరిధిలోకి రాని ఉద్యోగులందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. దీంతో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ దృష్ట్యా ఉద్యోగుల సంఖ్యకూడా కుదించనున్నారు. ఈ పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలో స్థానచలనం ఉంటుంది. -
నరవ మేట్లపై విచారణ
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నారనే అంశంపై సాక్షిలో గురువారం ఉపాధిలో బినామీ మస్తర్లు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి గంట్యాడ ఎంపీడీవో ఆర్.వి.రమణమూర్తి స్పందించారు. బినామీ మస్తర్లు వేసారన్న అభియోగాలు ఉన్న నరవ మేట్లను గంట్యాడ ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. బినామీ మస్తర్లు వేసిన మేట్లను తొలగిస్తామని ఆయన తెలిపారు. శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు. ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్ఎన్వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్ పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు పాల్గొన్నారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ (32) అప్పులు బాధ భరించలేక పురుగులు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ తన అవసరాల నిమిత్తం అప్పులు ఎక్కువగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి రావడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందుతుండగా గురువారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారుడు రుషివర్ధన్, కుమార్తె లహరి ఉన్నారు. గుర్ల ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి వేతనదారు మృతి బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు చెలపురెడ్డి తవుడమ్మ(68) పని చేస్తున్న ప్రదేశంలో గురువారం మృతి చెందినట్టు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు మరియదాస్ తెలిపారు. గ్రామంలో జగ్గన్న చెరువు పూడిక పనులు చేస్తుండగా చద్దన్నం తిని చేతులు కడుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో సాయిరాం, టీఏ శ్రీనివాసరావు ఎంపీడీవో ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీడీవో వేతనదారు మృతి పట్ల సంతాపం తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి నెల్లిమర్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నడిపేన పురుషోత్తం(27) గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బద్రీనాధ్ యాత్ర నిమిత్తం యాత్రికులను తీసుకువెళ్లేందుకు బస్సు డ్రైవర్లుగా సారిపల్లికి చెందిన పురుషోత్తం, శ్రీనివాసరావు ఈ నెల 15న వెళ్లారు. 17వ తేదీ అర్ధరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గడ ప్రాంతంలో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో క్యాబిన్లో కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్సులో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు. పురుషోత్తం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.