breaking news
Vizianagaram
-
శిక్షణ నిమిత్తం 37 మంది కొత్త ఆర్ఎస్సైలు
పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో గ్రేహౌండ్స్లో శిక్షణను పూర్తి చేసుకున్న 37 మంది నూతన ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఆర్ఎస్సైలు) ప్రాక్టికల్ శిక్షణ కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు బుధవారం వచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలలో విధుల అనుభవం కోసం వారిని జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిని వారంతా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారితో ఎస్పీ మాట్లాడుతూ ముందుగా నూతన ప్రొబేషనరీ ఆర్ఎసైలకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లను కేటాయించారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని క్రమశిక్షణే మీ బలం కావాలి అని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా, ఆర్ఎస్సైలు విధిగా ఏజెన్సీ గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై వారి ద్వారా సరైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కూంబింగ్ ఆపరేషన్లపై దృష్టి పెట్టాలని, చుట్టుపక్కల కదలికలు, వారికి సహకరించే వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. వారంవారీగా సంతల సందర్శన, అధిక మొత్తంలో సరుకులు కొనుగోలు చేసే వారిపై దృష్టి పెట్టడం, వాహన తనిఖీలు చేయడం తప్పనిసరి అన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమాచార సేకరణలో గోప్యత పాటించాలని చెప్పారు. ఏమాత్రం సందేహం వచ్చినా సీనియర్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మందులోడా.. ఓరి మాయలోడా..!
● మందుల అమ్మకాల్లో మాయాజాలం ● ధరలు పెంచిన కంపెనీలు ● జీఎస్టీ తగ్గింపు పేరుతో పాతధరలకే విక్రయాలువిజయనగరం ఫోర్ట్: పక్కన ఫొటోలో కనిపిస్తున్న డెక్సారేంజ్ సిరప్ ఽఎంఆర్పీ రూ.192. కేంద్ర ప్రభుత్వం మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతం తగ్గించింది. జీఎస్టీ తగ్గించిన ప్రకారం సిరప్ను ఎంఆర్పీపై 7 శాతం తగ్గించి విక్రయించాలి. దీంతో మందుల కంపెనీ ఎంఆర్పీని రూ.211కు పెంచేసింది. జీఎస్టీ తగ్గించినా ధర పెంచడం వల్ల గతంలో ఉన్న ధరే వచ్చేలా మందులు కంపెనీలు ప్లాన్ చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డెక్సరెంజ్ సిరప్ తయారీ కంపెనీయే కాదు. మందులు తయారీ చేసే అనేక కంపెనీలు ఈవిధంగా మందులు ధరలు పెంచేశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జీఎస్టీ తగ్గించినప్పటికీ వారి ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతో మందుల కంపెనీలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధిని తగ్గించడంలో మందులే కీలకం మానవుడి జీవనశైలిలో మార్పులు రావడం వల్ల అనేక మంది జబ్బుల బారిన పడుతున్నారు. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడం, వ్యాయమం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం తదితర కారణాల వల్ల అధికశాతం మంది బీపీ, సుగర్, గుండెజబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, సుగర్ వంటి వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏజబ్బు తగ్గాలన్నా మాత్రలు గాని, ఇంజక్షన్లు గానీ వాడాల్సిందే. జిల్లాలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు లక్షల్లో ఉంటారు. వారంతా నెలకు లక్షల్లో మాత్రలు, సిరప్లు, ఇంజక్షన్లు వినియోగిస్తారు. మందుల వ్యాపారం నెలకు రూ.కోట్లలో జరుగుతుంది. జిల్లాలో ఉన్న 1200 మందుల షాపుల ద్వారా మందుల వ్యాపారం నెలకు రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు జరుగుతోంది. నేరవేరని కేంద్రం లక్ష్యం..! ప్రజలకు మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. దీని వల్ల మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అందరూ భావించారు. కాని మందుల కంపెనీలు ధరలు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవేరడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ధరల పెంపకంపై విచారణమందుల కంపెనీలు ధరలు పెంచడంపై విచారణ చేస్తాం. మందుల తయారీ తేదీలను వెరిఫై చేయిస్తాం. రజిత, ఎ.డి, జిల్లా ఔషధ నియంత్రణశాఖ -
కన్నపేగులను కాపాడి.. తనువు చాలించిన తల్లి
● పౌర్ణమి వేళ విషాదం ● వేగావతినదిలో మునిగి మరణించిన వివాహితబాడంగి: కడుపున పుట్టిన పిల్లలు నదిలో మునిగిపోతుండగా కాపాడిన ఓ తల్లి తాను ప్రవాహంలో కొట్టుకుపోయి బుధవారం మృతిచెందింది. ఈ దురదృష్టకర సంఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన అంపావల్లి సంతు(32) కార్తీకపౌర్ణమి ఉపవాసం ఉండి నోము నోచుకోవాలని పాప కీర్తి, బాబు చరణ్లతో కలిసి వేగావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లింది. పిల్లలు ఆడుకుంటూ నది లోతులోకి వెళ్లిపోతూ ప్రమాదంలో పడ్డారు. కేకలు వేయడంతో తేరుకున్న సంతు వారిని ఆదుకునే క్రమంలో గోతిలో దిగి పిల్లలను కాపాడి తను వరదప్రవాహంలో కొట్టుకుపోయింది. పక్కనే కొంత దూరంలో ఉన్న కారాడ పథకం వద్ద తేలగా బంధువులు, గ్రామస్తులు బయటకుతీశారు. వెంటనే ఆమెను చికిత్సకోసం బాడంగి సీహెచ్సీకి తీసుకు రాగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రపరిచారు. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతూ తల్లి చనిపోవడంతో పిల్లలిద్దరూ కన్నీరుపెట్టారు. నాయనమ్మ వారిని అక్కున చేరుకుని సముదాయింది. పౌర్ణమి వేళ పుణ్యస్నానం కోసం వెళ్లిన మహిళ మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. మృతురాలి భర్త అనంత కుమార్ ఫిర్యాదు మేరకు హెచ్సీ ఉమామహేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తేవడం.. తీసుకెళ్లడం.. అంతా డోలీలోనే...
ఈ చిత్రం చూశారా... డోలీలో ఉన్నది కొమరాడ మండలం కుంతేస్ పంచాయతీ జొప్పంగి గ్రామానికి చెందిన హిమరిక సావిత్రి. ఆమెకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసిమండ వరకు రాళ్లదారిలో డోలీలో మోసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో కూనేరు రామభద్రపురం పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తిరిగి మళ్లీ అదే రాళ్లదారిలో డోలీలో బాలింతను స్వగ్రామానికి తరలించారు. ఈ దృశ్యాలు చూసిన వారు అయ్యో... గిరిజన బాలింతలకు ఎన్ని కష్టాలు అంటూ నిట్టూర్చారు. గిరిజనులకు ఈ కష్టాలు వీడేది ఎన్నడంటూ గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నించారు. – కొమరాడ -
కళాజాతరకు శ్రీకారం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతిభావంతులైన, ఔత్సాహిక కళాకారులను వెలుగులోకి తెచ్చేందుకు, వారి కళారూపాలకు సముచిత వేదిక కల్పించేందుకు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ‘కళాజాతర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని గాయకులు, నృత్యకారులు, చిత్రకారులు, మిమిక్రీ, ఇంద్రజాలం, శాసీ్త్రయ, జానపద కళారూపాలతో పాటు గిరిజన కళాప్రదర్శనలు, కవులు, నాటిక–నాటక రచయితలు సహా అన్ని కళారూపాలకు ఇది అత్యంత కీలకం కానుంది. ప్రతి 15 రోజులకు సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలు నిర్వహించి, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కళాకారులు నమోదు ఫారం ద్వారా తమ వివరాలను 99499 96497 నంబరుకు వాట్సాప్ లేదా మన్యం సంస్కృతి ఎట్ద రేటాఫ్ జీమెయిల్.కామ్ మెయిల్ చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను 2026 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలోని కళాకారులు, యువతరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులు సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలిపార్వతీపురం: దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని డీఈఓ బి.రాజ్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ఎంఈఓలు, రిసోర్స్ పర్సన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహిత విద్యను బలోపేతం చేసేందుకు దివ్యాంగ పిల్లలకు పలు రాయితీలను ప్రకటించినట్లు తెలిపారు. పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో దివ్యాంగ పిల్లలకు ఉన్న అలవెన్సులను, రాయితీలను, ఐఈపీలు అందిస్తున్న సేవలు దివ్యాంగులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
విజయనగరం రూరల్: జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 6న నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 29న నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం మోంథా తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. విజేతలకు అభినందనలు విజయనగరం అర్బన్: విజయనగరంలోని కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలో బుధవారం నిర్వహించిన సైన్స్ డ్రామా జిల్లా స్థాయి పోటీల విజేతలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు అభినందించారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం, బెంగుళూరు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో బొండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘హైజిన్ ఫర్ ఆల్’ నాటకానికి మొదటి స్థానం లభించింది. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటిక బృందం ఎంపికై నట్టు జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్ తెలిపారు. అలాగే, దత్తిరాజేరు మండలం షికారుగంజి ఏపీ మోడల్ స్కూల్, ఆర్సీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి. కస్పా స్కూల్ హెచ్ఎం విశాలాక్షి సమక్షంలో సాగిన పోటీల్లో రీసోర్స్ పర్సన్స్గా కె.సతీష్ కుమార్, ఎ.భానుప్రకాష్, న్యాయ నిర్ణేతగా ఈపు విజయలక్ష్మి వ్యవహరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని డీఈఓ ఆకాంక్షించారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్ భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. డీఎస్పీ ఎన్.రమ్య, ఇద్దరు సీఐలు, సిబ్బంది కలిసి కార్యాలయం తలుపులు మూసేసి ఉదయం 11.30 నుంచి రాత్రి 7 గంటల వరకు రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ రిజిష్ట్రేషన్లు, నెలలో జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్య, ప్రభుత్వానికి రోజుకి వస్తున్న ఆదాయం తదితర వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు వచ్చే సమయానికి పది నిమిషాల ముందు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ కార్యాలయం నుంచి బయటకు వెళ్లి పోయారు. సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చినట్టు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఎవరికంట పడకుండా ఆటోలో కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని, గురువారం కూడా తనిఖీలు చేస్తామని, అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్టు డీఎస్పీ రమ్య మీడియాకు తెలిపారు. -
ఇద్దరు విద్యార్థులకు ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అవకాశం
విజయనగరం అర్బన్: జిల్లా నుంచి ఎంపికై న ఇద్దరు విద్యార్థులకు నాసా, ఇస్రో శాస్త్రవేత్తలను కలిసే అద్భుత అవకాశం వచ్చిందని, వారికది మరపురాని అనుభూతిని పొందడమేనని డీఈఓ యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. సైన్స్ ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ప్రత్యేక సైన్స్ టూర్లు అందుబాటులోకి వస్తున్నాయి. విమానంలో వెళ్లి ఢిల్లీ వంటి ప్రదేశాల్లో అధునాతన సైన్స్ సెంటర్లు, ప్లానిటోరియంలు, ఇండో–రష్యన్ సెంటర్లను సందర్శించే అవకాశం జిల్లాలోని డెంకాడ మండలం అక్కివరం విద్యార్థి పతివాడ భానుప్రసాద్, వియ్యంపేట డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకులం విద్యార్ధిని తెగ్లంగి సంజనకు లభించిందని డీఈఓ తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తరగతి వరకు జరిగే ఈ ప్రత్యేక టూర్లో పాల్గొనడానికి బుధవారం వారిద్దరూ ప్రయాణమయ్యారు. -
అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
● గోవిందనామస్మరణతో మార్మోగిన వేదిక ప్రాంగణంసీతంపేట: వేదపండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. గోవిందుని కల్యాణంతో సీతంపేట అధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో వేదిక ప్రాంగంణం మార్మోగింది. తిరుమల శ్రీవారి అర్చక బృందం ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. స్వామివారికి అర్చన, తోమాల సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆయన సతీమణితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. మారుమూల ప్రాంతాల్లో హైందవ దర్మంపై ప్రచారాన్ని చేయడానికి గోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సీతంపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం, కుంకుమ, హ్యాండ్బుక్లు అందజేశారు. అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్సై అమ్మన్నరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ అర్చక బృందం సభ్యులు కృష్ణ సాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు
● నేటి నుంచి మూడురోజుల పాటు నిర్వహణ ● ఆహ్వానపత్రికలను ఆవిష్కరించిన సంస్ధ ప్రతినిధులువిజయనగరం టౌన్: అభినయ నాటకశాల, నటరత్న నాటక పరిషత్ సంయక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, విజయవాడ నిర్వహణలో 9వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఈ నెల 6,7,8 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సంస్ధ ప్రతినిధులు అభియన శ్రీనివాస్, గెద్ద వర ప్రసాద్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక హుకుంపేట బుక్కావీధిలో ఉన్న ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో బుధవారం ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం విశాఖ చైతన్య కళాస్రవంతి సంస్ధ ఆధ్వర్యంలో పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో అసత్యం అనే సాంఘిక నాటిక ప్రదర్శిస్తారన్నారు. అనంతరం 8 గంటలకు డాక్టర్ చిలుకూరి నాగేశ్వరరావు రచనలో గెద్ద వరప్రసాద్ దర్శకత్వంలో విజయనగరం నాటకశాల ఆధ్వర్యంలో సూత్రం అనే సాంఘిక నాటిక ఉంటుందన్నారు. 7న శుక్రవారం తెలంగాణ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మంజునాథ రచన, దర్శకత్వంలో గేమ్ అనే నాటిక, 8 గంటలకు గుంటూరు జిల్లా కట్రపాటు ఉషోదయ కళానికేతన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో కిడ్నాప్ అనే సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా 8న శనివారం కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో రమేష్ మంచాల దర్శకత్వంలో సప్నం రాల్చిన అమృతం, రాత్రి 8 గంటలకు గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ అనే సాంఘిక నాటిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కళాకారులందరికీ పురస్కారాలను అతిథులు అందజేస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే నాటిక పోటీలకు కళాకారులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
11,12 తేదీల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావువిజయనగరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈనెల 11,12 తేదీల్లో జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. 11న నగరంలోని విజ్జి స్టేడియంలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఖోఖో, హాకీ, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్లో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 12న రాజీవ్ స్టేడియంలో క్యారమ్స్, చెస్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, డ్యాన్స్/మ్యూజిక్ అంశాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. విజ్జిస్టేడియంలో టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆసక్తి గల సివిల్ సర్వీస్ ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపుకార్డుతో పోటీలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94917 67327 , 77996 20224 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
రెవెన్యూశాఖపై కలెక్టర్ ఆగ్రహం
● రీ సర్వేలో తప్పులు, వివాదాలకు ఆస్కారం ● రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్ రామ్సుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లా రెవెన్యూశాఖలో సేవలు అందించడంలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం కొనసాగుతున్నాయని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు, ఓపీసీ సర్టిఫికెట్లు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ వంటి కీలక సేవలకు సంబంధించిన దరఖాస్తులు గడువు దాటి పెండింగ్లో ఉండడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. అధికారులు తమ ప్రాథమిక విధులను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోందని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో మీసేవ ఆన్లైన్ సర్వీసెస్, రీ సర్వే, ధాన్యం సేకరణ, రెవెన్యూ కలెక్షన్స్, హౌసింగ్, ప్రభుత్వ భూముల ఆసైన్మెంట్ వంటి అంశాల్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. మండలస్థాయిలో పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీసినప్పుడు అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే డివిజన్ స్థాయిలో సమీక్షలు జరిపి, పెండింగ్ దరఖాస్తులకు కారణాలను సవివరంగా నివేదికల రూపంలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గందరగోళంగా రీసర్వే రీ సర్వే పనుల్లో తీవ్రలోపాలు ఉన్నాయని, తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్ల వివాదాలకు దారితీసే పరిస్థితి ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంతో సర్వేలో తప్పిదాలు జరుగుతున్నాయ న్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున గొడవలకు కారణమవుతుందని హెచ్చరించారు. ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు లేవా? ప్రైవేట్ దేవాలయాలకు రోజుకు వెయ్యి మంది భక్తులు వచ్చే చోట సీసీకెమెరాలు ఏర్పాటు చేయడంలో రెవెన్యూ, దేవాదాయ శాఖలు విఫలమయ్యాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపించిందని ఇది భక్తుల భద్రతకు ముప్పుకలిగిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్డీఓలు, తహసీల్దార్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మండలస్థాయిలో ఇంకా అమలు కావపోవడం ఆందోళనకరమన్నారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీడీఓ, సిబ్బందిపై కలెక్టర్ అసహనం
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఎస్. రామ్సుందరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పూసపాటిరేగ మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ పరిశీలించి సిబ్బంది ఒకరు మాత్రమే ఉండడంతో సిబ్బంది ఏరని? అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ను ప్రశ్నించారు. ఎంపీడీఓ, సూపరింటెండెంట్లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆన్లైన్ సేవలపై డిప్యూటి తహసీల్దార్ సంజీవ్కుమార్ను అడిగారు. నిర్ణీత సమయంలో సేవలు అందించాలని ఆదేశించారు. దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి. జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14,17 వయస్సుల విభాగాల్లో బాలబాలిలకు కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా..అండర్–17 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్ క్రీడాంశంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి పంపించనున్నట్లు జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. ఎంపిక పోటీలను జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి గ్రామంలో పండాల శ్రీశాంకరిపీఠం, గణేష్ జ్ఞాన మందిరంలో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. గుడి నిర్వాహకులు తెలిపిన సమాచారం మేరకు కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజల కోసం బుధవారం గుడిని తెరిచి పూజలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో తామంతా గుడి నుంచి బయటకు వచ్చేశామని ఆలయ నిర్వాహకురాలు నీరజ చెప్పారు. ప్రతి ఏడాదీ ఆలయ ధర్మకర్తలు పండాల చినబాబు, బంధువులు కార్తీక పౌర్ణమికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని ఇంతలో ఈ దొంగతనం జరగిందని నిర్వాహకురాలు నీరజ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. చీపురుపల్లిరూరల్(గరివిడి): ఈ నెల 17,18,19 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న టేబుల్టెన్నిస్ రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక ఈనెల 9వ తేదీన గరివిడిలో గల శ్రీ చైతన్యస్కూల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పి.కృష్ణమూర్తి తెలిపారు. అండర్–11,13,15,17,19 సంవత్సరాల బాలబాలికలు, సీనియర్స్ సీ్త్ర పురుషుల ఎంపికలు జరుగుతాయని తెలిపారు. టీమ్ ఈవెంట్ విభాగంలో అండర్–15 బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికలకు హాజర య్యే వారు ఉదయం 9గంటలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఫోన్ 94411 41122 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
విజయనగరం క్రైమ్: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు ఏ కారణంతో వచ్చారో తెలుసుకుని, వారి ఫిర్యాదులు, చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని జిల్లాలోని పోలీస్ సిబ్బంది, అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల్లో రిసెప్షన్ కానిస్టేబుల్స్గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్, సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి దిశానిర్ధేశం చేశారు. మీటింగ్లో ఎస్పీ మాట్లాడుతూ సమస్యలను విన్నవించేందుకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులను ముందుగా కూర్చోబెట్టి, వారికి మంచి నీరు అందించి, వారి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. ఫిర్యాదులను రాయలేని స్థితిలో ఉంటే వారి ఫిర్యాదును పోలీసులే రాసే విధంగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులను పదే పదే పోలీస్స్టేషన్కు తిప్పకుండా, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు అంశాల తీవ్రతను అర్ధం చేసుకుని, వెంటనే స్పందించాలని, తదుపరి చర్యలు చేపట్టే విధంగా రిసెప్షన్ కానిస్టేబుల్స్ వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు తీసుకున్న తరువాత ఫిర్యాదు అంశాలను రిసెప్షన్ రిజిస్టర్లో నమోదు చేసి, ఫిర్యాదుదారుకు రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం, విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసరు దృష్టికి తీసుకువెళ్లి, చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు ఆశ్రయం కల్పించాలి గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లళ్ళలేని స్థితిలో ఉంటే వారిని శక్తి సాధన స్వధార హోమ్, వన్స్టాప్ సెంటర్లలో ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్. కాపీని ఫిర్యాదుదారుడికి తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఇక మహిళలకు రక్షణ పొందేందుకు నిర్దేశించిన ఫోన్ నంబర్లు, స్వధార్ హో, వన్స్టాప్ సెంటర్, న్యాయ సహాయం అందించే న్యాయవాదులు, ఎన్జీఓలు, సైక్రియాటిస్టులు, కౌన్సిలర్స్ వివరాలను ఉమెన్ హెల్ప్డెస్క్లో అందుబాటులో ఉంచాలన్నారు వారి సేవలు అవసరమైన బాధితులకు ఫోన్నంబర్లు ఇచ్చి, సహాయపడాలని అధికారులను, రిసెప్షన్ కానిస్టేబుల్స్ను ఎస్పీ ఎ.అర్.దామోదర్ ఆదేశించారు. కాన్ఫరెన్స్లో ఏఎస్పీ సౌమ్యలత, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
● డీఎంహెచ్ఓ జీవనరాణి డెంకాడ: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ పీహెచ్సీని ఆమె బుధవారం సందర్శించారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. ఓపీ, ప్రసవాల వివరాలపై ఆరా తీశారు. మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్కుమార్, పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, ఫార్మాసిస్ట్ అప్పలనాయుడు, స్టాఫ్నర్సు మీనాకుమారి, ల్యాబ్టెక్నీషియన్ గోవింద, తదితరులు పాల్గొన్నారు. -
బేబీనాయనను నమ్మి మోసపోయాం
● టీడీపీని వీడి 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక ● కండువాలు వేసి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి: అంతన్నారు..ఇంతన్నారు.. ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు.. గ్రామ సమస్యలు పరిష్కరించాలని పదేపదే విన్నవించినా ఎమ్మెల్యే బేబీనాయన పట్టించుకోవడంలేదంటూ కోమటిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వాపోయారు. టీడీపీని వీడి బొబ్బిలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ గొట్టాపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎం.తిరుపతిరావు, గొట్టాపు త్రినాధరావు, మంతిని ధనుంజయ, జమదాల వెంకటరమణ, జక్కు తవిటినాయుడు, ఎస్.వేమన, వడ్డి సునీల్, బొత్స జజ్జులు, వెలమల అప్పలనాయుడు, వెలమల దాలినాయుడు, బోను త్రినాథ, తదితర కుటుంబాల సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కోమటిపల్లి మాజీ సర్పంచ్ వెలమల శంకరరావు మాట్లాడుతూ ఇన్నాళ్లూ బొబ్బిలి రాజులు తమ గ్రామానికి ఏదో చేస్తారన్న భ్రమలో ఉండిపోయామని, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పగ్గాలు చేపట్టినా మా గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. దశాబ్దకాలం వారితో కలిసి నడిచినా న్యాయం జరగదన్న స్పష్టత రావడంతో టీడీపీని వీడుతున్నామన్నారు. మరో కార్యకర్త ప్రకాష్ మాట్లాడుతూ తమకు వెన్నుపోటు రాజకీయాలు చేతకావని, ఇదిగో అదిగో అంటూ దాటవేత ధోరణిలో ఉన్న ఎమ్మెల్యే బేబీనాయన ఏదో చేస్తారన్న మాయలో పడి ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగామన్నారు. ఇక ఆయనను నమ్మేది లేదని, తమ సత్తా ఏమిటో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 80 శాతం ఉన్న బీసీలను కేవలం ఒక్క శాతం కూడా లేని రాజులు డబ్బు, అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతూ పదవులు అనుభవిస్తున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీలో మోసగాళ్ల రాజ్యంనడుస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ బొఇ్బలి మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ, గొట్టాపు అప్పారావు, వంగపండు శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ..!
ఆదేశాలు వస్తే అందజేస్తాం.. ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతి నెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి పింఛన్లు అందజేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేసే వీలుండదు. – ఎం. సుధారాణి, డీఆర్డీఏ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లావీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అర్హులైన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. గ్రామాల్లో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పింఛన్లే ప్రధాన ఆధారం. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ సొమ్మును ఠంఛన్గా అందజేసేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు ఉన్న పింఛన్లోనే కోతలు విధిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసేవారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున నూతన పింఛన్లు మంజూరు చేసేవారు. తర్వాత 2023, 2024 సంవత్సరాల్లో ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్ల ద్వారా ఎంపిక చేసి పింఛన్లు అందజేశారు. 2024 జనవరిలో చివరిగా నూతన పింఛన్లు మంజూరు చేశారు. తరువాత ఎన్నికల కోడ్ రావడంతో నూతన పింఛన్లకు బ్రేక్ పడింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో ఆగిపోయిన సైట్ నేటికి ఓపెన్ కావడం లేదు. కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది ఎదురుచూపులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబర్లో కొత్త జీవో తీసుకొచ్చింది. పింఛన్ అందుకుంటున్న భర్త చనిపోతే మరుసటి నెల నుంచి భార్యకు పింఛన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిగా నూతన పింఛన్లు రాకపోవడంతో జిల్లాలో 60 ఏళ్లు నిండిన సుమారు 20 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2024 డిసెంబరులో దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతికి జన్మభూమి కార్యక్రమం నిర్వహించి నూతన పింఛన్లు అందజేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రకటనలు చేశారు. దీంతో సంక్రాంతికి కొత్త పింఛన్లు కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. 50 ఏళ్ల్లకే పింఛన్ హామీ అమలుకు నోచుకునేదెప్పుడో ? ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటినా ఆ హామీ ఊసెత్తడం లేదు. దీంతో జిల్లాలో 60 వేల మందికి పైగా 50 ఏళ్లు నిండిన వారు ప్రభుత్వ హామీ ఎప్పుడు అమలు చేస్తుందా.. అని ఎదరు చూస్తున్నారు. 17 నెలలుగా ఓపెన్ కాని సైట్ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది అర్హులు ఎదురు చూపులు -
ఎస్.కోట, జామిలో భూ ప్రకంపనలు
ఎస్.కోట/జామి: ఎస్.కోట నియోజకవర్గంలోని ఎస్.కోట, జామి మండలాల్లో మంగళవారం తెల్లవారు జామున 4.30– 5గంటల ప్రాంతంలో భూమి స్పల్పంగా కంపించింది. ఈ ఘటనలో కొందరు ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకెన్లపాటు భూమి కంపించిందని జామి, కుమరాం, గొడికొమ్ము, ఎస్.కోటలోని గాంధీనగర్, శ్రీనివాసకాలనీ, బర్మాకాలనీ వాసులు తెలిపారు. స్వల్పంగా భూమి కంపించింది వేకువజామున ఉదయం 4.30 ప్రాంతలో భూమి స్వల్పంగా కంపించింది. ఆ సమయంలో నేను, నా భార్య లేచిఉన్నాం. ఒక్క సారిగా షేక్ అయినట్లు అయింది. తరువాత చాలమంది ఇదే విషయాన్ని చెప్పారు. – కొత్తలి అప్పలనాయుడు, అధ్యాపకుడు, జామి -
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి
● జేసీ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు సాధారణ రకం రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389గా ఉంటుందని తెలిపారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు, 261 క్లస్టర్లను ఏబీసీలుగా వర్గీకరించామని చెప్పారు. జిల్లాలో కోటి గోనె సంచులు అవసరం కాగా 50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని సేకరించాల్సి ఉంటుందన్నారు. 2 వేల వరకు వాహనాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ వాహనాలన్నీ జీపీఎస్ పద్ధతిలో పనిచేస్తాయని తెలిపారు. 159 మిల్లులను గుర్తించామన్నారు. వాటి సామర్ాధ్యన్ని బట్టి ధాన్యం సిద్ధంచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గ్రామాల్లో ప్రతీరైతుకు ధాన్యం సేకరణపై అవగా హన కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చెల్లింపులు 48 గంటలలోగా పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ 89789 75284 ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ బి.శాంతి, ఆర్డీఓలు కీర్తి, రామ్మెహన్, సత్యవాణి, డీఎస్ఓ జి.మురళీనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ‘సత్య’
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2025 – 26పోటీల్లో ఓవరాల్ టీమ్ చాంపియన్ను పట్టణానికి చెందిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. కళాశాల వెయిట్ లిఫ్టింగ్ టీమ్ మూడు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ ట్రోఫిని గెలుచుకుంది. పోటీలోని 79 కేజీల విభాగంలో 105 కేజీల స్నాచ్, 135 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఆర్.రాంబాబు బంగారు పతకం, 63 కేజీల విభాగంలో 75 కేజీల స్నాచ్, 95 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.యశశ్రీ బంగారు పతకం, 58 కేజీల విభాగంలో 80 కేజీల స్నాచ్, 100 కేజీల క్లీన్ అండ్ ఆర్క్ కేటగిరిలో టి.లావణ్య బంగారు పతకం, 65 కేజీల విభాగంలో 85 కేజీల స్నాచ్, 105 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.లిఖిత్ కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు కోచ్ చల్లా రామును కళాశాల యాజమాన్యం అభినందించింది. -
నరికేసిన తమ్ముళ్లు
పామాయిల్, అరటి తోటలను● ‘మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ హూంకరింపు ● గగ్గోలు పెడుతున్న బాధిత రైతు కొమరాడ: తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార బలంతో చెలరేగిపోతున్నారు. పచ్చని తోటలను తెగ నరుకుతూ ప్రత్యర్థులకు ఆస్తినష్టం కలిగిస్తున్నారు. దీనికి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొరిశీల గ్రామంలో జరిగిన ఘటనే నిలువెత్తు సాక్ష్యం. గ్రామానికి చెందిన బడే సుందర పాత్రుడు, బడే సరోజినమ్మకు చెందిన ఎకరం పైబడి విస్తీర్ణంలోని పామాయిల్, అరటి తోటలను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బడే విజయ, బడే పకీరుపాత్రుడు, బడే ప్రవీణ, గుణాపు భాస్కరరావు, మరో ముగ్గురు కూలీలతో కలిసి ఈనెల 1న ధ్వంసం చేశారు. ‘పొలం వద్దకు వస్తే మిమ్మల్ని కూడా నరుకుతాం.. మా పార్టీ అధికారంలో ఉంది.. ఏం చేస్తారో చేసుకోండి.. దిక్కున్నచోట చెప్పకోండి’ అంటూ భయాందోళనకు గురిచేశారని బాధిత రైతు వాపోయారు. అదే రోజు గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశామని, వారంతా పొలం వద్దకు వచ్చి సర్దిచెప్పినా వినకుండా తోటలను నరికేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతిలేక పోలీసులకు ఈనెల 3న ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
మక్కువ: మండలంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం మక్కువకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు ఆకుల తవిటినాయుడు, మంగళవారం మధ్యాహ్నం నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకొని, ప్రధాన రహదారి గూండా కాలినడకన ఇంటికి వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు తిప్పేందుకు టర్న్ చేస్తున్న సమయంలో ఢీకొనడంతో గాయాల పాలయ్యారు. ఉపాధ్యాయుడు తవిటినాయుడు ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి, అక్కడ నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని ములక్యాయవలస గ్రామం వద్ద బైక్పై వస్తున్న మెకానిక్ జగదీష్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. జగదీష్ను చికిత్స నిమిత్తం బొబ్బిలి తరలించారు. నిప్పంటుకుని మహిళకు గాయాలు రాజాం సిటీ: స్థానిక వాసవీనగర్లో నివాసం ఉంటున్న టంకాల రేవతమ్మ నిప్పంటుకుని గాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ అశోక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేవతమ్మ స్టౌ వద్ద వంట చేస్తుండగా మంటలు నైటీకి అంటుకుని గాయాల పాలైంది. వెంటనే తేరుకున్న ఆమె బాత్రూమ్లోకి వెళ్లి తలపై నుంచి నీరు పోసుకుని మంటలను అదుపు చేసింది. అనంతరం బొద్దూరు హైస్కూల్లో పని చేస్తున్న తన భర్త సత్యనారాయణకు ఫోన్లో విషయం చెప్పింది. వెంటనే అతను వచ్చి ఆటోలో రేవతమ్మను సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. బాధితురాలికి ముఖం, తల, వీపు, చేతులపై గాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
డిసెంబర్ 13న జాతీయ అదాలత్
విజయనగరం: డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఉమ్మడి జిల్లాల న్యాయమూర్తులతో ఆమె మంగళశారం వీడియా కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు, వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామన్నారు. ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కాన్ఫరెన్సులో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.విజయ కళ్యాణి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.పద్మావతి, పోక్సో కోర్ట్ జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
వెండి గంగాలం వితరణ
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసుల రెడ్డి 22 కిలోల వెండి గంగాలంను వితరణ చేశారు. మంగళవారం ఆలయంలో సుమారు రూ.30 లక్షల విలువున్న వెండి గంగాలంను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆల య అభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని టీటీడీ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న గాలిగోపురంలో 80 శిల్ప కళాకృతులను నిర్మించనున్నామని, ఒక్కొక్క శిల్ప కళాకృతికి రూ.6వేలు వ్యయం అవుతుందని ఈ మేరకు ఔత్సాహికులు ముందుకు రావాలని టీటీడీ సేవా ట్రస్ట్ సభ్యులు కోరారు. అడ్వంచర్ పార్కులో అద్దెకు ఫుడ్ స్టాల్స్ సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అడ్వంచర్ పార్కులో అద్దె ప్రాతిపదికన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ సూచించిన డిజైన్లో నిర్మాణం చేసుకుని ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక ఏడాది కాలనీకి లీజుకు ఇవ్వనున్నట్టు తెలిపారు. రూ.20 వేలు డిపాజిట్, నెలకు రూ.5వేలు అద్దెను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ఆసక్తి గల వారు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీడీ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వంచర్ పార్కు, మెట్టుగూడ జలపాతం, ఆడలి వ్యూపాయింట్, బెనరాయి జలపాతం, దారిమల్లి జలపాతం, టీటీదీ దేవాలయం వంటి వాటిని చూడడానికి రోజంతా పర్యాటకులను తిప్పవలసి ఉంటుందన్నారు. అందుకుగాను ఐటీడీఏ నిర్దేశిత రుసుం నిర్ణయిస్తుందన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తోంది. ఈ మేరకు జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో చదివిన విద్యార్ధులు, నీట్ పరీక్షకు హాజరైన వారు ఈ ఉచిత కోచింగ్ను ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఉచిత వసతి, భోజన సదుపాయాలతో కోచింగ్ క్లాసులు ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులు అంబేద్కర్ స్టడీ సర్కిల్ విజయవాడ 7569226400, 7995562113 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కూలిన పెంకుటిల్లు జామి: మండలంలో కుమరాం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కనపర్తి అప్పారావు పెంకుటిల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వేకువజాము కావడంతో మెలకువగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. దీంతో పూర్తిగా నేలమట్టమైంది. విషయం తెలుసు కున్న రెవెన్యూ అధికారులు ఇంటిని పరిశీలించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
ప్రజాభిప్రాయానికే వైఎస్సార్సీపీ మద్దతు
● మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరమెంటాడ: ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగేలా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, తను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెంటాడ నుంచి పార్వతీపురానికి సుమారు 100కి లోమీటర్లు దూరం ఉంటుందని విజయనగరం 30 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజయనగరంతో ఉన్న అనుబంధం, కలెక్టర్ కార్యాలయ పనులకై నా వెళ్లివచ్చే విధంగా ఉంటుందన్నారు. మండల ప్రజల బాధలను కమిటీకి వివరించి వారిపై ఒత్తిడి చేసి కొనసాగేలా చేస్తే.. ఎల్లో మీడియా వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధి కోసమే మండలాన్ని విజయనగరంలో ఉంచిందని ఎలా రాస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. అప్పట్లో టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడారని, నేడు ఆ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మెంటాడ మండలం పార్వతీపురంలో కలిస్తే టీడీపీ నాయకులే కారకులవుతారని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, రాజప్పలనాయుడు, ఎంపీటీసీ పతివాడ కుమారి, సర్పంచ్ రాంబాబు, సిరిసెట్టి నారాయణరావు మండల నాయకులు పాల్గొన్నారు. ఉచిత బస్సుల పేరిట ఉన్న వాటిని తగ్గించేశారు.. సాలూరు: ఉచిత బస్సుల పేరుతో గ్రామాలకు వెళ్లే ఉన్న బస్సులు తగ్గించేస్తున్నారని దీనివలన ప్రయాణాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పట్టణంలో తన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. బస్సుల సంఖ్య తగ్గిపోవడం వలన రద్దీ అధికమైపోతుందని తెలిపారు. దీనివలన బస్సుల్లో వాదులాటలు, తోపులాటలు షరామామూలుగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా బస్సుల్లో ప్రయాణికులు భౌతికంగా, మానసికంగా గాయాల పాలవుతున్నారని అన్నారు. దీనికి ఎవరు భాద్యులవుతారని ప్రశ్నించారు. బస్సుల్లో ఇటీవల పలు సంఘటనలు జరిగాయని అవి వివిధ మాద్యమాలు ద్వారా వచ్చాయని గుర్తు చేశారు. ఉచిత బస్సు వలన డబ్బులిచ్చి టిక్కెట్ తీసుకున్న మగవారికి సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. సీట్లు లేక బస్సులో నిల్చున్న సమయంలో అదుపు తప్పి బస్సులోనే ఒకరిపై ఒకరు పడిపోయి తోపులాటలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని ఎలా అరికడతారని, ప్రయాణికులకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. దేవాలయాల వద్ద భక్తుల మరణాలకు ప్రైవేటుతో ముడిపెడుతున్న కూటమి ప్రభుత్వం తీరు సరికాదని మండిపడ్డారు. -
వివాహేతర సంబంధంతో ఒకరి హత్య
మెంటాడ: మండలంలోని పాడివానివలస గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో మంగళవారం హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కూనేరు పంచాయతీ దిగువ మిర్తివలస గ్రామానికి చెందిన పెదకాపు పెదకాపు పైడితల్లికి పాడివానివలస గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో పైడితల్లి మంగళవారం ఆమె ఇంట్లో ఉండగా ఆమె చిన్న కుమారుడు పి.మహేష్ చూశాడు. దీంతో రగిలిపోయిన మహేష్ పైడితల్లిని కొట్టి ఇంట్లోనే హత్య చేశాడు. హతుడు పైడితల్లి కుమార్తె యర్రజన్ని చిన్నమ్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె.సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించారు. -
చి‘వరి’లో తెగుళ్ల దాడి
విజయనగరం ఫోర్ట్: వరి పంట చివరి దశకు వచ్చింది. 10 నుంచి 15 రోజుల్లో పంట కోతకు వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో సంభవించిన మోంథా తుఫాన్ వరి పంటను నిలువునా ముంచేసింది. రైతన్నను కోలుకోని దెబ్బతీసింది. మోంథా వర్షాల ప్రభావంతో ఇప్పుడు వరి పంటను తెగుళ్లు అశించాయి. వాటి నివారణకు మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటకే పంట సాగుకు వేలల్లో పెట్టుబడి పెట్టాం.. అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి జల్లాం.. ఇప్పుడు మళ్లీ తెగుళ్ల నివారణకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆకుముడత, పొడ తెగులు, బ్యాక్టీరియా తెగుళ్ల నివారణకు ఎకరానికి రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ పురుగు నివారణ మందుల పిచికారీ కోసం స్పెయిర్లు పట్టుకుని పొలంబాట పట్టారు. జిల్లాలో 1.04 హెక్టార్లలో సాగు.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో వరి పంట 1.04 లక్షల హెక్టార్లలో సాగైంది. తర్వాత స్థానాల్లో మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, అపరాలు, గోగు, నువ్వు పంటలు ఉన్నాయి. వరి పంటకు మానుపండు తెగులు, మెడవిరుపు తెగులు, సుడిదోమ తెగులు అశించాయి. మోంథా తుఫాన్ వల్ల నీరు ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండడం వల్ల ఈ తెగుళ్లు ఆశించాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో ఉన్న నీటిని బయటకు తీసేయడంతో పాటు తెగులు నివారణకు అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగు మందులను పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే పంటదిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.వేలల్లో పెట్టుబడి... వరి పంటసాగుకు రైతులు ఇప్పటికే రూ.వేలల్లో పెట్టుబడి పెట్టారు. వరి విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి విత్తేందుకు, నారు తీసేందుకు, దమ్ముచేసి నాట్లు వేసేందుకు, కలుపు నివారణ, ఎరువులు, తెగుళ్ల నివారణకు ఎకరానికి రూ.20 వేలు నుంచి రూ.30 వేలు వరకు ఖర్చుచేశారు. ఇప్పుడు తెగుళ్లు ఆశించడం వల్ల మళ్లీ రూ.వేలల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చివరి దశలో తెగుళ్లు సోకడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. తెగుళ్లు నివారణే ప్రధానం వరి పంటకు కొన్ని చోట్ల మానుపండు తెగులు, సుడిదోమ ఆశించింది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఆందోళనలో రైతన్న వరిని ఆశించిన మానుపండు తెగులు, సుడిదోమ ఇప్పటికే వేలల్లో పంటకు పెట్టుబడి పెట్టిన రైతులు తెగుళ్ల నివారణకు పెట్టుబడి తడిసిమోపెడు -
తైక్వాండో పోటీల విజేతలకు అభినందన
● స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లాకు పతకాలువిజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో నాలుగు బంగారు, రెండు వెండి, మూడు కాంస్య పతకాలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకోవటం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లా క్రీడాకారులను డీఈవో యు.మాణిక్యంనాయుడు మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి
విజయనగరం అర్బన్: నీటిపారుదల శాఖ విజయనగరం డివిజన్ పరిధిలో 109 చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల అభివృద్ధిపై తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ (రిపేర్స్, రెస్టోరేషన్, రెన్నోవేషన్) కింద మొదటి విడత 44, రెండో విడత 49, తాజాగా మూడో విడతలో 16 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశామన్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ పి.అప్పలనాయుడు, ఈఈ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డ్వామా పీడీ శారదాదేవి, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
కూటమి కుట్రలు తిప్పికొడదాం
● వైద్యకళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజారోగ్యం– ప్రజల హక్కు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సూపర్స్పెషాలిటీ వైద్యం, వారి పిల్లలకు వైద్యవిద్యను అందించాలనే ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురాగా.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటీకరణ చేసేలా కుట్ర పన్నుతోందని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిసనగా గరివిడి మండలంలోని ఏనుగువలస, బాగువలస, కొండదాడి, వెదుళ్లవలస గ్రామాల్లో మంగళవారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వెదుళ్లవలస గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్యం ప్రజలకు దూరమైందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు. తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలను కొనుగోలుచేసేవారు కరువయ్యారని వాపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ జి.శ్రీరాములనాయుడు, ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
● ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పోలీస్ అధికారులకు సూచించారు. కేసుల నమోదు, చార్జిషీట్ల దాఖలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, ఫొటోలు, వేలి ముద్రలు, స్నేహితుల వివరాలను సేకరించి రికార్డుల్లో భద్రపరచాలన్నారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, పాత నేరస్తుల ప్రస్తుత జీవన విధానాన్ని గమనిస్తుండాలని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో వారి ప్రవర్తన తీరును గమనించాలన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న చోరీ కేసులపై ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించి, ఆయా కేసుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి, సారా రవాణాను కట్టడి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్య రెడ్డి, ఎన్.రాఘవులు, సీఐలు లీలా రావు, ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్,, లక్ష్మణరావు పలువురు సీఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు హాజరయ్యారు. విమానాశ్రయం పనుల పరిశీలన భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర విమాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు మంగళవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 27 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం 91.7 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరిలో ఇక్కడ నుంచి విమానరాకపోకలను పరీక్షిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ 20వ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సీఎం సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐదు స్టార్ హోటల్స్తో పాటు ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నామని, ప్రపంచాన్ని జయించే శక్తి ఉంత్తరాంధ్రలో ఉందని తెలిపారు. కార్యక్రమంలోఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామ్సుందర్రెడ్డి, ఏస్పీ దామోదర్, ఆర్డీఓ దాట్ల కీర్తి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కంకర తరలిస్తున్న వాహనాల సీజ్
సీతానగరం: మండలంలోని నిడగల్లు కొండ సమీపంలో అక్రమంగా కంకరను తవ్వి తరలిస్తున్న వాహనాలను మైనింగ్ జిల్లా ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఏడీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిడగల్లు రెవెన్యూ పరిధిలోని కొండ నుంచి కంకర తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో తవ్వకాలు చేసి ఐదు ట్రాక్లర్లకు లోడ్ చేసి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. కంకర తవ్వకాలు చేస్తున్న ప్రాంతంలోనే జేసీబీ, లోడ్తో ఉన్న ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. కంకర తవ్వకాలు గుర్తించి అపరాధ రుసుం విధించినట్టు ఏడీ తెలిపారు. -
ఇన్ఫోసిస్కు జేఎన్టీయూ జీవీ విద్యార్థుల ఎంపిక
విజయనగరం రూరల్: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగాలకు విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయానికి చెందిన 25 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ఆర్.రాజేశ్వరరావు మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 17, 18న ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో సీఎస్ఈ విభాగం నుంచి 12 మంది, ఐటీ విభాగం నుండి 8, ఈసీఈ విభాగం నుంచి ముగ్గురు, మెటలర్జీ, సివిల్ విభాగం నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.వి.సుబ్బారావు ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థినులను వారి చూపిన ప్రతిభ, కృషి, శ్రమను కొనియాడుతూ వారి విజయాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, తదితరులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు మంగళవారం పయనమయ్యారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా నుంచి 10మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు పొట్నూరు శ్రీరాములనాయుడు, కోచ్ కె.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన అర్జీదారులు
● పీజీఆర్ఎస్లో 375 వినతుల నమోదువిజయనగరం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. వరుసగా గడిచిన రెండు సోమవారాలు సెలపు కావడంతో ఈ సోమవారం పునఃప్రారంభించిన పీజీఆర్ఎస్లో వినతులు ఇచ్చేవారి సంఖ్య పెరిగింది. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ కౌంటర్ల ఎదుట క్యూలో ఉన్న ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బారులు తీరారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తాయి. వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన 10 కౌంటర్లలో 5 కౌంటర్లు రెవెన్యూకే కేటాయించినా రద్దీ తగ్గలేదు. మరో వైపు ఆన్లైన్ నెట్ సర్వర్ ఇబ్బందులు కూడా ఎదురవడంతో అర్జీదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు మురళి, వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలగాంధీ, బి.శాంతి, కళావతి, జిల్లా అధికారులు వినతులను స్వీకరించారు. ఈ వారం గతంలో ఎప్పడూ నమోదు కాని సంఖ్యలో 375 వినతులు వచ్చాయి. సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించాలి అధికారులందరూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రజల విజ్జప్తులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సమయపాలనతో పారదర్శకంగా ప్రతి ఫిర్యాదును నాణ్యవంతంగా పరిష్కరించాలని సూచించారు. మెంటాడ మండలాన్ని మన్యంలో కలపొద్దు మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా నుంచి వేరుచేసి పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని కోరుతూ ఆ మండల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన సమయంలో ప్రజల అభీష్టంమేరకు అప్పటి సాలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో ఇచ్చిన వినతిపై స్పందించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మండలాన్ని మన్యం జిల్లాలో కలిపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మెంటాడ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాయిపిల్లి రామరావు(రవి), ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, జెడ్పీటీసీ లెంక రత్నాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు మయూరి అప్పలనాయుడు, సన్యాసినాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. -
శ్రీవిశ్వ విద్యార్థులకు కరాటేలో బ్రాంజ్ మెడల్
చీపురుపల్లి: రాష్ట్రస్థాయి కరాటే ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో చీపురుపల్లిలోని శ్రీ విశ్వ పాఠశాల విద్యార్థులు జి.యశ్వంత్, ఎం.హర్షిత్, ఎస్.చరణ్ తేజ్రామ్, ఎం రాజ్కుమార్లు బ్రాంజ్ మెడల్ సాధించారని ప్రిన్సిపాల్ రాజేష్ తెలిపారు.నవంబర్–2న విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో ఈ మెడల్స్ సాధించారని అన్నారు. మెడల్ సాధించిన విద్యార్ధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. చికిత్స పొందుతూ మహిళ మృతిరామభద్రపురం: బాడంగి వెళ్లే రహదారిలోని చర్చి సమీపంలో రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో ఆదివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలైన విషయం తెలింసిందే. వారిలో ఓ మహిళ విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. బాడంగి మండలం పూడివలసకు చెందిన బోను గౌరమ్మ మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన కన్నంనాయుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడగా ఇద్దరికీ గాయాలయ్యాయి. గౌరమ్మను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై అప్పారావు కేసునమోదు చేశారు. -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయాలి
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తన చాంబర్లో నిర్వహించి 54 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 7, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 28 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యాసరచన, వక్తృత్వపోటీలకు అనూహ్య స్పందన
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు గురజాడ కేంద్ర గ్రంథాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ పేర్కొన్నారు. 500 మందికి పైగా విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు నవంబరు 30న గురజాడ వర్ధంతి రోజున నిర్వహించే గురజాడ విశిష్ట పురస్కార ప్రదాన ఉత్సవంలో బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా మానాపురం రాజా చంద్రశేఖర్, డాక్టర్ జక్కు రామకృష్ణ, ఈపు విజయకుమార్, గురజాడ ఇందిర వ్యవహరించారు. మానాప్రగడ సాహితి, ఈశ్వరరావు, డి.రాజేంద్రప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎ.గోపాలరావు, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో అధికారులు బస చేయాలి
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలోని అధికారులు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు తప్పనిసరిగా పాఠశాలలు, వసతిగృహాల్లో ఒక రాత్రి బస చేయాలని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన వర్క్షాపులో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తరచూ పర్యటనలు చేయాలని, బస కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ స్థానికంగా ఉన్న పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. అక్కడే ఏదో ఒక వసతి గృహంలో లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమయపాలన కచ్చి తంగా పాటించాలని, ఈ మేరకు ఎంపీడీఓలు ఆకస్మిక వేకువజామున తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పారిశుద్ధ్యంతో వ్యాధులను నివా రించవచ్చని, చెత్త నివారణకు ప్రతి దుకాణానికి చెత్త బుట్టలుండాలని, 500 మీటర్ల పరిధిలో చెత్త కనిపిస్తే దుకాణ యజమానికి జరిమానా విధించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన ప్రదేశాల్లో అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమరాల ఏర్పాటు ఉన్నట్లు ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపట్ల ప్రస్తావిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సిబ్బందికి ఐడీ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్ట్
బాడంగి: మద్యం వ్యసనానికి బానిసైన బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన మామి డిరాము మద్యంకోసం డబ్బులివ్వాలని గొడవపడి విచక్షణారహితంగా కన్నతండ్రి సత్యం తలనరికి హత్యచేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి చెప్పారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిందితుడు రామను అరెస్ట్చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కు తరలించేముందు విలేకరులకు వివరాలు తెలి యజేశారు. తరచూ మందు కొనుగోలుకు డబ్బులివ్వాలనిభార్య, తల్లితో గొడవపడి కొట్టేవాడని ఈనెల 1వతేదీన సాయంత్రం 4గంటల సమయంలో కత్తితో ఇంటిలో భార్యను కొడుతుండగా తండ్రి పక్షవాతంతో మంచంమీదనుంచి లేవలేక పారిపోమని సైగలుచేసి బయటకు పంపివేయగా ఆ కసితో మంచంపై ఉన్న తండ్రిని మాంసంకోసే కత్తితో తలనరికి మొండెం నుంచి వేరుచేసి గమేలాలో వేసి పారిపోయాడని చెప్పారు. నిందితుడిని కామన్నవలస జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో బొబ్బిలి రూరల్సీఐ నారాయణరావు, ఎస్సై తారకేశ్వరరావు మంచి ప్రతిభను కన బరిచారంటూ వారిని అభినందించారు. -
నాగూరు పరిసరాల్లో ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి, సంతోషపురం, నంది వానివలస, పిట్టలమెట్ట, నాగూరు గ్రామ పరిసరాల్లో మూడు రోజుల పాటు ఏనుగుల గుంపు సంచరించి సోమవారం నాగూరు గ్రామంలోని తోటల్లోకి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పంటలను నాశనం చేశాయి. ఏనుగులు ప్రధాన రహదారిని ఆనుకుని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అటవీశాఖాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.హుండీ చోరీ నిందితుల అరెస్టునెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట పరిధిలో ఉన్న శ్రీరమా సహిత వీర వెంకటసత్యనారాయణ స్వామి వారి ఆలయంలో హుండీ పగలగొట్టి, నగదు అపహరించిన కేసులో నిందితులను నెల్లిమర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.ఆలయంలోని హుండీ పగలగొట్టి, నగదు దొంగిలించినట్లు ఇటీవల ఆలయ నిర్వాహకులు నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కొత్తపేట గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.9వేలు రికవరీ చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసులను ఛేదించడంలో తమకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని ఆయన చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో మంటలురాజాం సిటీ: మండల పరిధి గుయ్యానవలస గ్రామంలో ఆదివారం రాత్రి మచ్చ నాగేష్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన చుట్టుపక్కలవారితోపాటు గ్రామస్తులు మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లో వస్తువులు, దుస్తులు, వంట సామగ్రితోపాటు డబ్బాలో దాచుకున్న రూ. 30వేల నగదు కాలిపోయాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలి● సర్వే అండ్ భూరికార్డుల ఆర్జేడీ సీహెచ్వీఎస్ఎన్కుమార్ విజయనగరం అర్బన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సర్వే అండ్ భూరికార్డుల ఆర్జేడీ సీహెచ్వీఎస్ఎన్కుమార్ ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన సోమవారం కలెక్టరేట్లో అధికార, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయాలని సూచించారు. భూవిస్తీర్ణంపై రైతుకు పూర్తిగా అవగాహన కలిగించిన తరువాతే రికార్డులను ఖరారు చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా వెబ్ ల్యాండ్ ప్రకారం సర్వేపూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అండ్ భూ రికార్డుల ఎ.డి టి.యగ్వేశ్వర రావు, సూపరింటెండెంట్ కె.రాంబాబు డివిజన్ల అధికారులు పాల్గొన్నారు. -
జోగిరమేష్ అరెస్ట్ రాజకీయకక్ష సాధింపే..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరసాలూరు: మాజీ మంత్రి జోగిరమేష్ అరెస్ట్ పూర్తిగా రాజకీయకక్షసాధింపు చర్య అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సాలూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జోగిరమేష్ అరెస్ట్ను ఖండించారు. లిక్కర్ మాఫియా అంటూ సిట్ దర్యాప్తు పూర్తిగా రాజకీయకక్ష సాధింపుగానే కనిపిస్తోందని, తప్పెవరు చేశారో సిట్ నేటికీ తేల్చలేకపోతోందన్నారు. లిక్కర్స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారని గుర్తుచేశారు. దారినపోయిన దానయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఽ ఆధారంగా కేసులు నమోదుచేస్తే సమాజంలో ప్రతి ఒక్కరినీ అరెస్ట్చేసే అవకాశం ఉంటుందన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మరణించిన అంశం నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ఉద్దేశంతో జోగి రమేష్ను ఈ ప్రభుత్వం అరెస్ట్చేయించిందన్నారు. నకిలీ మద్యంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులుండగా ప్రభుత్వం ఆదరబాదరాగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి టీడీపీ నాయకులను కాపాడే ప్రయత్నం చేయడానికేనని విమర్శించారు. లిక్కర్ విషయంపై హైకోర్టు త్వరగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామన్నారు. -
అర్జీల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. పరిష్కారం విషయంలో అర్జీదారులకు సంపూర్ణ సంతృప్తి కలగాలని, ఎలాంటి పరిస్థితుల్లోను అర్జీలు తిరిగి తెరవకూడదని తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్కు అందిన సమస్యల పరిష్కారానికి వచ్చిన వినతుల్లో జంఝావతి రిజర్వ్ ముంపునకు గురైన బంజుగుప్ప గ్రామ నిర్వాసితులకు రీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని, అలాగే పార్వతీపురం మండలం పెదమరికి గ్రామానికి చెందిన అక్కమ్మ, గంగాపురానికి చెందిన రాములు నాయుడు తమ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కొమరాడ మండలంలోని సోమినాయుడు వలసకు చెందిన ఉమామహేశ్వరరావు తమ జిరాయితీ భూమిని తమ పేరును నమోదు చేసి రికార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే మరికొందరు మరికొన్ని సమస్యలపై వినతులను అందజేశారు. కార్యక్రమంలో మొత్తం 188 వినతులు అందాయి. జిల్లాస్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 123 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ప్రాజెక్టుఅధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 123 వినతులు వచ్చాయి. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై వినతులు ఇచ్చారు. కొత్తగూడకు చెందిన రమణమ్మ ఇల్లు నిర్మించడానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. గేదెలగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సలోమి పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని, అటవీపట్టాలు ఇప్పించాలని నల్లరాయిగూడ గ్రామస్తుడు రవికుమార్ కోరారు. పత్తిపంట వర్షాలకు నష్టపోయిందని పరిహారం ఇప్పించాలని అంబలిగండి గ్రామస్తులు కోరారు. విద్యుత్ స్తంభాలను మార్చాలని గంగమ్మపేట గ్రామస్తుడు ఆనందరావు విజ్ఞప్తి చేశాడు. దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని ముకుందాపురం గ్రామస్తురాలు లోకేశ్వరి కోరింది. కార్యక్రమంలో ట్రైబుల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, హెచ్వో జయశ్రీ, సీడీపీవో సిమ్మాలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని జామి పోలీస్స్టేషన్ పరిధిలో 2024 లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలుశిక్ష పడిందని ఎస్పీ దామోదర్ సోమవారం చెప్పారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. జామి మండలంలోని మాధవరాయమెట్టలో నివాసం ఉంటున్న వంతల శివ, (23) గతేడాది జూన్ 6న అదే గ్రామంలో ఉంటున్న ఒక బాలిక (12) రాత్రి సుమారు 10 గంటలకు ఇంటిముందు ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకుని దగ్గరలో ఉన్న ఒక తోటలోకి తీసుకు వెళ్లి, లైంగికదాడికి పాల్పడబోయాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న జనం వెంటనే తోటలోకి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి జామి ఎస్సై జి.వీరబాబు గత ఏడాది జూన్ 7న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం, కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. రూ.4,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.50,000 మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. -
9న జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికపోటీలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను ఈ నెల 9న నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసుమంచి సుబ్బారావు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవిలతో కలిసి ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9 గంటలకు గురజాడ పబ్లిక్ స్కూల్లో పోటీలు ప్రారంభమవుతాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు 10వ తేదీ ఉదయం 9 గంటలకు నగదు బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. పోటీలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కుసుమంచి ఫౌండేషన్, వాకర్స్ వనిత క్లబ్(విజయనగరం ఫోర్ట్), గురజాడ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. నాటక పోటీలకు సమన్వయకర్తగా నంది పురస్కార గ్రహీత ఈపు విజయ్ కుమార్ వ్యవహరిస్తారని, న్యాయ నిర్ణేతలుగా కందుకూరి పురస్కార గ్రహీత పసుమర్తి సన్యాసిరావు, నంది పురస్కార గ్రహీత గెద్ద వరప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, పాఠశాల కరస్పాండెంట్ ఎం స్వరూప, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ, గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు జిల్లా అధికారుల సత్కారం
విజయనగరం అర్బన్: సమన్వయంతో, సమష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి స్పష్టం చేశారు. మోంథా తుఫానును ఎదుర్కొనడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించి అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన కలెక్టర్ రామ్సుందర్రెడ్డి ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధన్ను సోమవారం గ్రీవెన్స్ సెల్లో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.మురళి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ను ఎదుర్కోనడంలో జిల్లా అధికారుల నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సహకరించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ను రాష్ట్రస్థాయి మోంథా అవార్డు గ్రహీతలైన ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, వీఆర్వో రాజ్ మోహన్, ఆశ వర్కర్ బంగారమ్మలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జేఎస్డబ్ల్యూ మాట తప్పి 18 ఏళ్లు
● ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి ● కలెక్టరేట్ ఎదుట నిర్వాసిత కుటుంబాల ధర్నావిజయనగరం గంటస్తంభం: జేఎస్డబ్ల్యూ అల్యూమినియం ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు, బాధిత కుటుంబాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెల్లకాగితాలు పట్టుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతు సోములు కాంతయ్య మాట్లాడుతూ, బొడ్డవర పంచాయతీ, ఎస్.కోట పరిధిలో సర్వే నంబర్ 170 సహా పలుచోట్ల రైతుల భూములను 2007–08లో ప్రభుత్వం జేఎస్డబ్ల్యూ అల్యూమినియం కంపెనీకి అప్పగించిందన్నారు. ఒక్కో ఎకరా విలువకు సమానంగా షేర్లు ఇస్తాం. మూడు సంవత్సరాల్లో కనీసం పది రెట్లు పెరుగుతాయని రాతపూర్వక హామీ ఇచ్చారని పేర్కొన్నారు. షేర్లు వద్దనుకుంటే నగదు కలెక్టర్ ద్వారా ఇస్తామని అప్పట్లో చెప్పారని, కానీ అసలు చెల్లింపులు రాలేదని రైతులు ఆరోపించారు. వాగ్దానం ప్రకారం పెరిగిన మొత్తాన్ని అనుసరించి డబ్బులు ఇప్పుడు లెక్కించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులకు ఆప్షన్ ఇచ్చి తరువాత మాట తప్పడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఎస్డబ్ల్యూ కంపెనీపై చర్యలు తీసుకుని నష్టపోయిన భూముల అసలు, పెరిగిన విలువలతో చెల్లింపులు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. -
బిల్లుల భారం భరించలేం
వేపాడ: గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏనాడూ రూపాయి విద్యుత్ బిల్లు చెల్లించలేదు.. 200 యూనిట్లు మించి ఏ నెలలోనూ వినియోగించలేదు.. ఉచిత విద్యుత్ సదుపాయం పక్కాగా అమలు చేశారు.. ఇప్పుడు ఒక బల్బు, ఫ్యాన్ ఉన్న ఇంటికి కూడా రూ.వేలల్లో విద్యుత్ బిల్లులు ఇస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’.. ఉచిత విద్యుత్ అంటూ గిరిజనులను మోసం చేయడం తగదు.. బిల్లులను తక్షణమే రద్దుచేయాలి.. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తంచేశారు. వేపాడ సబ్స్టేషన్ వద్ద కరకవలస పంచాయతీ పరిధిలోని మారిక గ్రామానికి చెందిన గిజనులు సోమవారం ధర్నా చేశారు. గత ఐదేళ్లు ఒక్కరూపాయి బిల్లు కట్టించుకోలేదని, నేడు కూటమి ప్రభుత్వం వేలాది రూపాయల్లో బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేయడం దారుణమంటూ సర్పంచ్ పాతబోయిన పెంటమ్మతో పాటు గిరిజనులు కుమార్, బాబూరావు, బుజ్జిబాబు, అప్పలనాయుడు, దేముడు, రాముడు, జి.దేముడు తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. వీరి ఆందోళనకు సీసీఎం నాయకుడు చల్లా జగన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 యూనిట్లలోపు వాడితే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన ప్రభుత్వం వేలాది రూపాయల్లో చెల్లించమని బిల్లులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. దసరా మామ్మూళ్ల పేరుతో ఇటీవల ఇంటికి రూ.వంద చొప్పున వసూలు చేశారని, ఇప్పుడు బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికే చెల్లించిన వారికి బిల్లు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఆందోళనపై స్పందించిన ఇన్చార్జి ఏఈ సీహెచ్ సూరిబాబు గిరిజనులతో ఫోన్లో మాట్లాడారు. మారిక గ్రామ గిరిజనులు ఇచ్చిన బిల్లులు వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అన్యాయం గతంలో గిరిజనులు ఎన్నడూ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మారిక గిరిజనులకు ఇచ్చిన వేలాది రూపాయల బిల్లులు వెనక్కి తీసుకోవాలి. కొండపై నివసించే గిరిజనులకు ఉచిత విద్యుత్ అంటూ ఇలా బిల్లులు చెల్లించాలని చెప్పడం దారుణం. తక్షణమే బిల్లులు వెనక్కితీసుకోవాలి. నా అన్న పాతబోయిన పైడితల్లి పేరున రూ.1680 విద్యుత్ బిల్లు వచ్చింది. – పాతబోయిన పెంటమ్మ, గ్రామ సర్పంచ్, కరకవలస (మారిక గ్రామం), వేపాడ మండలం రూ.5వేలు కట్టాలట.. మా నాన్న గమ్మెల పోతన పేరుమీద రూ.5వేలు బిల్లువచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ చేస్తే రూ.2,500 చెల్లించాను. మిగిలింది కట్టపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరించారు. తక్షణమే బిల్లులు వెనక్కి తీసుకుని కట్టిన సొమ్ము తిరిగి ఇవ్వాలి. – గమ్మెల బుజ్జిబాబు, మారిక, వేపాడ మండలం ద్విచక్రవాహనం ఉంటే బిల్లు ఇస్తారా.. గిరిజనులకు ద్విచక్రవాహనం ఉంటే బిల్లు వస్తుందని అధికారులు భయపెడుతున్నారు. దసరా మామ్మాళ్లు వసూలు చేశారు. మా నాన్మమ్మ పేరున ఉన్న మీటరుకు రూ.2,664 బిల్లు ఇచ్చారు. ఉచిత విద్యుత్ అంటూ కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేయడం సరికాదు. – పి.కుమార్, మారిక గ్రామం, వేపాడ మండలం గిరిజనులకు వేల రూపాయల విద్యుత్ బిల్లులు వేపాడ సబ్స్టేషన్ వద్ద ఆందోళన ఉచిత విద్యుత్ పథకం పక్కాగా అమలు చేయాలని డిమాండ్ -
భావితరాల భవిష్యత్ కోసం.. ఓ సంతకం
విజయనగరం రూరల్: తేవయ్యా.. సంతకం చేస్తా: మలిచర్లలో సంతకం చేస్తున్న మహిళ ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రజలకు వైద్యం, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్యవిద్యను దూరంచేసే కూటమి ప్రభుత్వ కుతంత్రాలను నిరసిస్తూ.. భావితరాల భవిష్యత్తు కోసం తాము సైతం అంటూ పల్లె, పట్టణ ప్రజలు సంతకాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాలని కోరుతున్నారు. ఈ పోరాటంలో వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని సంతకంతో భరోసా ఇస్తున్నారు. దీనికి పలు పల్లెలు, పట్టణాల్లో సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షినెట్వర్క్ -
నిండా మునిగిన చెరకు రైతు
తుఫాన్ వర్షాలకు రేగిడి, సంతకవిటి మండలాల్లో చెరకు పంట నీటమునిగింది. తుఫాన్ వర్షాలు తగ్గిన ఈ ప్రాంతాల్లో పంటపొల్లాల్లో వరద నీరు తగ్గలేదు. ప్రధానంగా రేగిడి మండలంలో ఏకేఎల్ గెడ్డ పరిధిలో రేగిడి, ఆమదాలవలస, చిన్నయ్యపేట, తునివాడ, ఉంగరాడ తదితర గ్రామాల్లో 400 ఎకరాల్లో చెరకు పంట నీటమునిగింది. మరో నెలరోజుల్లో ఈ పంటను కోతచేసి సంకిలి వద్ద సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలి. పంట చేతికందిన సమయంలో నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరా సాగులో రూ.90 వేల మేర పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. సంతకవిటి మండలంలో సాయన్నచానల్ పరిధిలోని చెరకు పంటతో పాటు నాగావళి గర్భంలో ఉన్న చెరకు పంట నీటమునిగింది. ఈ మండలంలో జావాం, కేఆర్ పురం తదితర గ్రామాలు వద్ద 120 ఎకరాల్లో చెరకు పంటలో నీరుచేరి ప్రమాదకరంగా మారింది. -
నిట్టనిలువునా కూల్చేసింది..
బొప్పాయి తోటలను 30 ఎకరాల్లో సాగుచేశాను. రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇంకో నెలలో కోతకు వస్తుందనుకున్న బొప్పాయి తోటను మోంథా తుపాను నిట్టనిలువునా కూల్చే సింది. నిండాకాయలతో చెట్లు నేలకూలాయి. ఇంకో నెలలో కాయలు పక్వానికి వస్తాయి.. బెంగాల్.. ఒడిశా.. నుంచి వ్యాపారాలు వచ్చి కిలో రూ.12 చొప్పున కొటారు. ఖర్చులు పోను ఎకరాకు ఒక లక్ష అయినా మిగులుతుంది.. అప్పులు తీరుతాయి.. వచ్చే సీజన్కు మళ్లీ పెట్టుబడికి ఢోకాలేదనుకున్నా. ఆశలన్నీ గల్లంతయ్యాయంటూ చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికి చెందిన లెంక రాజారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేలకూలిన తోటలో కూర్చుని కన్నీటిపర్యంతమవుతున్నారు. మొదళ్లవద్ద వర్షపు నీరు చేరిందని, ఉన్న చెట్లు కూడా చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతానంటూ గగ్గోలు పెడుతున్నాడు. -
రాజరాజేశ్వరి దేవికి కిరణ స్పర్శ
బొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరిదేవి అమ్మవారిని కార్తీక సోమవారం భానుడి లేలేత కిరణాలు స్పర్శించాయి. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. గడువులోగా అర్జీలు పరిష్కరించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను గడువులోపలే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీల ఆడిట్పై సోమవారం సమీక్షించారు. ప్రీ ఆడిట్లో ప్రవర్తనాపరమైన లోపాలు, పద్ధతిని అనుసరించే విధానంపై కలెక్టరేట్ కాల్ సెంటర్ నుంచి ఆడిట్ టీమ్ అర్జీదారులతో మాట్లాడి ఫోన్లో తెలుసుకుంటుందని, వారు చెప్పిన విషయాలను వాస్తవంగా నమోదు చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు వారంలో నాలుగు సచివాలయాలను సందర్శించాలని, అర్జీదారుల పరిష్కారంపై ఆరా తీయాలన్నారు. రెండు శాఖల వద్ద గడువుదాటి ఉన్న అర్జీలను పరిష్కరించేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కూటమి తీరుపై కాంట్రాక్టర్ల ఆగ్రహం
● పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ ● కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన బిల్లులను తక్షణమే చెల్లించాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషనర్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించేంత వరకు నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టేది లేదని తెగేసి చెప్పారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. సమస్య పరిష్కరించకుంటే అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకు పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ధర్నాకు రాష్ట్ర ఏపీ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.విజయ్కుమార్, డిప్యూటీ కో ఆర్డినేటర్ ఆర్.సాధూరావు సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. బిల్లుల చెల్లింపులో కమిషనర్ నియంతృత్వ విధానం విడనాడాలని, ట్రెడ్స్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదనంగా వసూలు చేస్తున్న ఈఎండీ వెంటనే చెల్లించాలన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు అశోక్, లింగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు బంగార్రాజు, రాజ్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధి పోర్టర్ అప్ లోడ్పేరుతో మార్పు చేసి బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. డబ్బులు ఉన్నాయని చెప్పి టెండర్లు పిలిచి, పనులు చేయించుకున్న తర్వాత పేమెంట్ చేసే విషయంలో మాకు సంబంధం లేదన్నట్టుగా అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. ధర్నాలో కాంట్రాక్టర్లు దువ్వి శ్రీనివాసరావు, మచ్చ సత్యనారాయణ, నరేంద్ర, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు. -
వరిచేను వెన్ను విరిగింది
మెరకముడిదాం మండలంలో మొత్తం 267 ఎకరాలు వరకు వరింపంట మోంథా తుఫాన్ ప్రభావంతో నీట మునిగింది..త్వరలో కోతలు అవుతాయని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని సోమలింగాపురం గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు చెబుతున్నారు. ఎకరాకు సుమారు రూ. 20,000 నుంచి రూ.30,000 మదుపులు పెట్టి సాగు చేశాం. గింజ గట్టిపడి పంట చేతికి అందాల్సిన తరుణంలో పొలంలో నీరు చేరిపోయింది. చేను ఒరిగిపోయింది. ఇక గింజ నాణ్యత తగ్గిపోతుంది. తాలు గింజలు వస్తాయి.. రంగు మారిపోతుంది.. ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారో.. ప్రభుత్వం నుంచి అయితే సాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు. – ఆబోతుల అప్పారావు, సోమలింగాపురం -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
● కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ ఘటనపై వైఎస్సార్సీపీ నిరసన ● మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ విజయనగరం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావ ణి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఫల్యాలను నిరసిస్తూ ఘటనలో మృతి చెంది న వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ఆదివారం రాత్రి నిర్వహించా రు. జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నగర మేయర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణా లంటే కూటమి ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతు ందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం ఘటనల్లో పలువురు భక్తులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకొని తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలం చెందారని, ఫలితంగానే 9 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో భక్తులు గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు మరలా పునరావృతం కాకుండా తగిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్కౌశిక్, జిల్లా పెన్షనర్లు, ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మధకుమార్, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధ్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025 ఈ చిత్రంలో కనిపిస్తూ టమాట మొక్కలు చూపిస్తున్న రైతు.. రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన ఎరుసు విజయానందరెడ్డి. తనకున్న మూడు ఎకరాల పొలంలో రెండు ఎకరాలలో సుమారు రూ.2 లక్షల 50 వేలు పెట్టుబడి పెట్టి మల్చింగ్ పద్ధతిలో పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పంట ఏపుగా పెరిగిందనుకున్నాడు. ఇంత లో మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తోటలో పూత, పిందె రాలిపోయి మొక్క లు ఉట్టిపోయాయి. కొన్ని మొక్కలు చనిపోతున్నా యి. మొక్కలను బతికించుకునేందుకు అప్పులు చేసి మందులు చల్లుతున్నాడు. గత ప్రభుత్వంలో టమాట తోటకు సాగు చేసిన రైతులకు విత్తన, ప్లాస్టిక్ కవరు, కంప బిల్లు పెడితే ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. ఇప్పుడు గతేడాది బిల్లులు పెట్టినా కనీసం రూపాయి రాలేదు. ఇప్పుడు ఈ నష్టం తలచుకుంటూ కుంగిపోతున్నాడు. -
నేల రాలిన ఆశలు
రామభద్రపురం: మోంథా తుఫాన్ రైతులను కన్నీటి సంద్రంలో ముంచింది. చేతికొచ్చిన వివిధ రకాల పంటలు తుఫాన్ దెబ్బకు భారీగా దెబ్బతిన్నాయి. రూ.లక్షల పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన టమాట రైతుల ఆశలు గల్లంతయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 నుంచి 300 ఎకరాలలో రైతులు టమాట పంట సాగు చేస్తున్నారు. మోంథా తుఫాన్ కారణంగా మడుల్లో నీరు నిల్వ ఉండి ఆరుతున్న కొద్ది మొక్కలు చనిపోతున్నాయి. నీరు పట్టని తోటల్లో నల్లమచ్చలు, గజ్జి రోగాలు వంటి తెగుళ్లు సోకి పూత, పిందె, కాయలు రాలిపోతున్నాయి. ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా తెగుళ్లతో తోటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. తెగుళ్ల దెబ్బకు దిగుబడి బాగా తగ్గిపోవడంతో పాటు కాయల నాణ్యత తగ్గిన టమాటాలను మార్కెట్లో కొనేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పుంజుకుంటున్నాయి. 20 రోజుల కిందట వరకు 25 కేజీల క్రేట్ ధర రూ.300 లోపు ఉండగా ప్రస్తుతం రూ.550 వరకు ధరలు పలుకుతున్నాయి. ధరలు పుంజుకుంటున్నా పంట దిగుబడి మాత్రం తుఫాన్ దెబ్బతో సోకిన తెగుళ్ల కారణంగా సగానికి పైగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పంటలు ఏపుగా పెరిగాయి..పంట దిగుబడి పెరిగి నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు అనుకుని సంబర పడిన రైతన్నలకు చేతికందివస్తుందన్న సమయంలో మోంథా తుఫాన్ ధాటికి పాడైపోయాయి. టమాట పంటపై పెట్టుకున్న ఆశలు నిరాశే అయ్యాయని రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న పంటలను చూస్తూ రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. తుఫాన్ దెబ్బకు రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసి నష్టపోయా మని కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని వాపోతున్నారు. దెబ్బతిన్న పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టమాట పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మోంథా తుఫాన్ ప్రభావం కారణంగా అధిక వర్షాలు కురవడంతో టమాట పంటకు బాక్టీరియాతో తెగుళ్లు సోకడం వాస్తవమే. తుఫాన్ వదిలిన తర్వాత పంటలను పరిశీలించాం. చీడపీడలు, తెగుళ్లు సోకిన టమాట పంటకు ఏ మందు పిచికారీ చేయాలో సూచించాం. ఎండుకుళ్లు తెగులు నివారణకు సీవోసీ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ 2 గ్రాములు చొప్పున్న 10 లీటర్ల నీటికి కలిపి మొక్క మొత్తం, మరియు మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం కోసం నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. – పి.మోహనకృష్ణ, మూడు మండలాల ఉద్యాన శాఖాధికారి -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంట ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాల ని సూచించారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భాష్కర పుష్కరిణి ప్రధాన ఘాట్ వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఆశీనులు చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేపట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం పూసపాటిరేగ మండలంలో కోనాడ నుంచి తీసుకువచ్చిన పడవలో స్వామిని ఉంచి పు ష్కరిణిలో తెప్పోత్సవాన్ని జరిపించారు. అర్చకుల వేద మంత్రాలతో, భక్తుల జయజయ ధ్వానాల నడుమ రామచంద్రస్వామి పుష్కరిణిలో ఊరేగారు. ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు. ఈఓ వై. శ్రీనివాసరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం సబ్ డివిజ న్ ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఏఎస్పీగా పని చేసిన అంకిత సురాన గత నెల 30న సత్యసాయి జిల్లాకు అదనపు ఎస్పీగా పదోన్నతిపై బదిలీ అయిన సంగతి విదితమే. అయితే ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు గ్రేహౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా సేవలందించిన, నంద్యాలకు చెందిన మనీషా వంగలరెడ్డిని పార్వతీపురం ఏ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
సంబరపడ్డా.. ఇంతలోనే...
ఈ చిత్రంలో రాలిపోయిన టమాట కాయలు చూపిస్తున్న రైతు రామభద్రపురం మండలం కొండ కెగువ గ్రామానికి చెందిన బెల్లాన బంగారునాయు డు. ఇతను సుమారు రూ.లక్షా 50 వేలు పెట్టుబడి పెట్టి ఎకరన్నర విస్తీర్ణంలో టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట బాగుందన్న అనుకుని సంబరపడ్డాడు. ప్రస్తుతం కోత దశలో మోంథా తుఫాన్ ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షాలు కారణంగా తోటకు పూర్తిగా తెగుళ్లు సోకి కాయలపై మచ్చలు వచ్చి కాయ రాలిపోతుందని వాపోయాడు. అలాగే నాణ్యత తగ్గి దిగుబడి కూడా రాలేదని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. పెట్టుబడి అయినా వస్తుందో.. లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
డీఎస్సీ ఎంపికలో అన్యాయం
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపికలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చీపురుపల్లి మండలంలోని వంగపల్లిపేటకు చెందిన బాడీబిల్డర్ రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు, తనకు జాతీయ స్థాయిలో బాడీబిల్డింగ్లో అర్హత ఉందని, అదే అర్హతతో టీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. రాత పరీక్షలో అర్హత సాధించిన తన పేరును 1:5 నిష్పత్తిలో ప్రభుత్వం తయారు చేసిన మెరిట్ జాబితాలో 55వ ర్యాంకర్గా తన పేరు ఉందని, ఈ మేరకు 2025 ఆగస్టు 2న విజయవాడలో తన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయ్యిందని తెలిపాడు. ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై నట్లు భావించిన తాను ఎంతో సంతోషించానని ఇంతలో సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన ఫలితాల్లో తన పేరు లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. క్రీడాకారుల కోటాలో 55వ ర్యాంకులో ఉన్న తనకు ఉపాధ్యాయ పోస్టు ఇవ్వకుండా 96వ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎలా ఎంపిక చేశారో అర్థం కాలేదన్నారు. అంతేకాకుండా స్థానిక కోటాలో ఉన్న తనను తప్పించి అంతర్ జిల్లాకు చెందిన 96వ ర్యాంకర్ను ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని, అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో తన సమస్య పొందుపరిచినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరాడు. జాతీయ బాడీబిల్డర్ ఆవేదన -
స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పూర్తి
● ఈనెల 5 నుంచి 7 వరకు తిరుపతిలో జరగనున్న పోటీలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జి స్టేడియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన 80 మంది క్రీడాకారులు ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది హాజరయ్యారు. వీరికి వ్యాయామ ఉపాధ్యాయులు పి.శ్రీరాములునాయుడు, ఆదిలక్ష్మిల నేతృత్వంలో ఎంపిక నిర్వహించగా.. అండర్–14 విభాగంలో 10 మంది బాల, బాలికలు..అండర్ 17 విభాగంలో 10 మంది బాల, బాలికలు జిల్లాస్థాయి ఎంపికల్లో అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న అంతర్ జిల్లాల స్కూల్గేమ్స్ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి తెలిపారు. -
కబడ్డీ జట్ల ఎంపికకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారులకు నగరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపికలు నిర్వహించగా..2009 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన 60 కేజీల లోపు బరువు కలిగిన బాలుర క్రీడాకారులు, 55 కేజీల లోపు బరువు కలిగిన బాలికలు పాల్గొన్నారు. అద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లా సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ అధ్యక్షుడు రంగారావుదొర వెల్లడించారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, మీసాల శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, బంటుపల్లి శివ, సారిపల్లి గౌరీ శంకర్, నడిపేన మురళీధరరావు తదితరులు పర్యవేక్షించారు. 200 మంది క్రీడాకారుల హాజరు -
ఆలయంలో ఆభరణాల చోరీ
● 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి మాయం సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఏకాదశిపూజలు ముగించుకుని అర్చకులు శ్రీనివాసాచార్యులు , వెంకటరమణాచార్యులు ఆలయం తలుపులు వేసుకుని శనివారం రాత్రి ఇళ్లకు వెళ్లారు. ఆదివారం వేకువజామున ఆలయం తలుపులు తీయడానికి వెళ్లగా దేవతామూర్తులుండే గదుల తలుపు తాళాలు విరగ్గొట్టి ఉండడాన్ని గుర్తించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది ఎం.మోహనరావు సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్చార్జి ఎస్సై సింహాచలం, ఏఎస్సై లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి చోరీజరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఆలయంలో రాజ్యలక్ష్మమ్మకు అలంకరించిన పుస్తెలు, గోదా దేవి అమ్మవారి పుస్తెలు, రామచంద్రస్వామి వారికి, వెంకటేశ్వరస్వామి వారికి అలంకరించిన 5 తులాలు బంగారు, 2 కేజీల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు అర్చకులు వారికి వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై లక్ష్మణరావు తెలియజేశారు. సంఘటనా స్థలంపరిశీలన వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ రాంబాబు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాఽథ్, ఇన్చార్జి ఎస్సై సింహాచలం, సీసీఎస్ ఎస్సై అప్పారావు, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఎస్.శారద పరిశీలించారు. -
వైద్యవిద్య ఫర్ సేల్..!
● పీపీపీ పేరిట 10 కళాశాలలు ప్రైవేట్కు ధారాదత్తం ● సంపదసృష్టి అంటూ ప్రభుత్వ కళాశాలల్ని అమ్మేసే కుట్రవిజయనగరం గంటస్తంభం: ఒంటిపై తెల్లటి ఆప్రాన్..మెడలో స్టెతస్కోప్..డాక్టర్ అనే పిలుపు..ఈ గౌరవం తమ పిల్లలకు దక్కాలని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కలలు గంటారు. ఇలాంటి ఎందరో తల్లిదండ్రులు, విద్యార్థుల తెల్లకోటు కలలకు చంద్రబాబు సర్కారు ఉరితాడు బిగించింది. తాను సీఎంగా ఉండగా ఎన్నడూ ప్రభుత్వరంగంలో వైద్యకళాశాలల ఏర్పాటుకు కృషిచేయని చంద్రబాబు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలపై పెద్ద కుట్రకు తెరతీశారు. పీపీపీ పేరిట ఈ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడంతో పాటు, విద్యార్థుల బంగారు భవిష్యత్ను చిదిమేస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పది ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీపీపీ మోడల్లో నడిచే కళాశాలలు, ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందకపోవచ్చని వైద్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉచితంగా లభించే శస్త్రచికిత్సలు, మందులు, వైద్యసేవలు ఇకపై చెల్లింపుల ఆధారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలపై ప్రభావం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ నిర్ణయం తీవ్ర అన్యాయం చేస్తుంది. పేదపిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యవిద్య లభించే అవకాశాలు తగ్గిపోవండంతో పాటు ఉచిత వైద్యసేవలు అందకుండా పేదలు నష్టపోతారు. -
కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
తెర్లాం: మండలంలోని జగన్నాథవలస గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన బొత్స అరుణ శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటి వద్ద గిన్నెలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణను భర్త, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించారు. అరుణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బొండపల్లి: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన బెల్లాన సతీష్(32) బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామానికి చెందిన శాంతిని వివాహం చేసుకుని స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సతీష్ నిత్యం మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఆదివారం ఉదయం కూడా మద్యం కోసం డబ్బులిమ్మని భార్యను వేధించడంతో ఆమె లేవని చెప్పగా మనస్తాపానికి గురై చంద్రంపేటలో పురుగు మందు తాగేసి అత్తవారి ఊరైన రోళ్లవాకకు వచ్చి గ్రామానికి సమీపంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి సుపత్రికి తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. ఉరేసుకుని మరొకరు.. కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల రాయల్సిటీ లేఅవుట్లో నివాసముంటున్న యల్లపు హేమావెంకట్(35) కడుపునొప్పి, కిడ్నీ సమస్యలు భరించలేక శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హేమావెంకట్ సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కాగా కొద్ది కాలంగా కడుపునొప్పి, కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు కాంట్రాక్ట్ పనుల్లో నష్టం రావడం, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి నెలవారీ చెల్లింపులు చేయకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనై తన ఇంటిలోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖ రావు తెలిపారు. -
సాధారణ రోగుల మధ్యలో డయేరియా రోగులు
బాడంగి: స్థానిక సీహెచ్సీలో సాధారణ రోగులకు కేటాయించిన ఇన్పేషెంట్ వార్డులోనే డయేరియా సోకిన రోగులకు కూడా సమానంగా ఒకేచోట బెడ్లు ఇచ్చి చికిత్స చేయడంపట్ల సాధారణ రోగులు ఆందోళన చెందుతున్నారు. డయేరియా అంటువ్యాధి గనుక సాధారణ రోగులకు సోకే ప్రమాదముందన్న ఆలోచనతో వారు భయపడుతున్నారు. కావున డయేరియా రోగులకు ప్రత్యేక వార్డు కేటాయించి చికిత్స చేస్తే బాగుంటుందని వైద్యులకు సూచిస్తున్నారు. రామభద్రపురం మండలానికి చెందిన పలువురు డయేరియా రోగులతో కలిసి ఒకే దగ్గర చికిత్స పొందడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. దుర్వాసనతో పాటు, దోమలు ఈగల బెడద ఉందని, వైద్యులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 24 గంటల్లో.. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతిశృంగవరపుకోట: ముద్దుగా పెంచుకున్న మనుమడు చనిపోయాడని తెలిసి తట్టుకోలేక గుండె ఆగిపోయి నాయనమ్మ తనువు చాలించింది. ఎస్.కోట మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ పరిధి లచ్చన్నదొరపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొర్లె కన్నాలమ్మ(65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం కాగా వారిలో ఇద్దరు కొడుకులు, పెద్ద కుమార్తె గతంలోనే కాలం చేశారు. కాగా కన్నాలమ్మ తన మనుమడు నాగరాజు వద్ద ఉంటోంది. నాగరాజు తన భార్య లక్ష్మి, చెల్లెలు సుహాసిని, నాయనమ్మ కన్నాలమ్మలతో ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు కొద్ది రోజులుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. శనివారం సాయంత్రం 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో నాగరాజు మృతిచెందాడు. దీంతో హృద్రోగ భాదితురాలైన నాయనమ్మ కన్నాలమ్మకు విషయం తెలియకుండా దాచిపెట్టారు. ఆదివారం కన్నాలమ్మకు ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలియగా కూర్చున్న చోటనే కుప్పకూలిపోయింది. దీంతో గ్రామస్తులు కన్నాలమ్మను పరిశీలించి చనిపోయినట్లు గుర్తించారు. 24గంటల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. కుటుంబ యజమాని నాగరాజు ఆకస్మిక మృతితో భార్య లక్ష్మి, పిల్లలు దీక్షిత, ఆదర్శ్, చెల్లెలు సుహాసిని, అనాథలుగా మిగిలారు. బస్సుకింద పడి యువకుడి మృతికొత్తవలస: మండల కేంద్రంలో గల మూడు రోడ్ల జంక్షన్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో అస్సాం రాష్ట్రానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక డోర్ నుంచి ఆ యువకుడు బస్సు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి బస్సు వెనుక చక్రాల కింద పడడంతో తలపైనుంచి బస్సు వెళ్లిపోగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది ఇలా ఉండగా ఆ యువకుడు కావాలనే ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తూ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడని ఆర్టీసీ బస్సు సిబ్బంది తెలిపారు. మృతుడి జేబులో గల సెల్ఫోన్ ఆధారంగా అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. బస్సు కింద పడి వృద్ధుడు.. గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామానికి చెందిన చౌడవాడ దాలినాయుడు (70) ఆదివారం బస్సుకింద పడి ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లేందుకు దాలినాయుడు ఆదివారం బయల్దేరాడు. వసాది గ్రామ శివారులో కొత్తవెలగాడ బస్టాప్ వద్ద విజయనగరం నుంచి ఎస్.కోట వెళ్తున్న బస్సును ఆయన కోడలు ఆపి ఎడమవైపు వెళ్లగా, కుడివైపు నుంచి బస్సు ఎక్కేందుకు వృద్ధుడు వస్తున్న విషయం గమనించక డ్రైవర్ బస్సును తీసేయడంతో బస్సు కుడివైపు ఉన్న టైర్ కింద వృద్ధుడు పడిపోయాడు. దీంతో తలనుజ్జునుజ్జవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. -
స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుల పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు. ఈనెల 3, 4 తేదీల్లో పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు పలు సూచనలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనే స్విమ్మర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. తద్వారా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యవిద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టొద్దు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం పేదలపై దాడి చేయడమే, పీపీపీ పేరుతో వైద్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి నెట్టివేస్తూ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్కు అప్పగించడం సరికాదు. దీంతో పేద విద్యార్థులు వైద్యవిద్యకు దూరమై, రిజర్వేషన్లు పోతాయి. వైద్యం ఖరీదవుతుంది. రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మార్కెట్లో వైద్యవిద్య పీపీపీ పేరిట ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం సమాజానికి పెద్ద నష్టం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పింస్తుంది. దానికి విద్య, వైద్యం, ఆరోగ్యం అంతర్భాగం. జీవో 590 ద్వారా 10 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కుల మీద దాడి. పీపీపీ పేరుతో వైద్య విద్యను, ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే చర్యలను వెంటనే ఉపసంహరించాలి. ప్రభుత్వం నిర్మించిన వాటిని ప్రభుత్వమే నడపాలి. అప్పుడే మాత్రమే ప్రజల ఆరోగ్యం రక్షితమవుతుంది. కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, -
మంత్రి ఇలాకాలో ఇన్చార్జిలే దిక్కు
దత్తిరాజేరు: సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలో పాలన ఇన్చార్జిలతో నడుస్తోంది. అసలే వర్షాలు పడుతుండడంతో సీజనల్ వ్యాధులు సోకే సమయంలో పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఇన్చార్జులే అయినా ఉన్న వారు కూడా పూర్తి స్థాయిలో విధుల్లో లేకపోవడంతో సర్పంచ్లు పారిశుధ్య పనులు చేసినా బిల్లులు అవుతాయో లేదోనన్న సందేహంతో కాలం వెల్లదీస్తున్నారు. అసలే వెనుకబడిన మండలంలో పాడి రైతులు ఎక్కువగా ఉన్న పెదమానాపురం, దత్తిరాజేరు పశు వైద్యకేంద్రాలకు కూడా పశువైద్యులు ఇన్చార్జులు కావడంతో వారు గజపతినగరం నుంచి ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి పాడిరైతులకు ఏర్పడింది. అత్యవసర సమయాల్లో పశువులకు వైద్యం చేయించుకోవడానికి చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యయసాయ భూములు ఎక్కువగా ఉన్న మండలం కావడంతో తహసీల్దార్ కూడా ఇన్చార్జ్ కాగా పనులు జరుగుతాయో లేదోనన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రెవెన్యూ కార్యాలయంలో ఉన్న డీటీ వరప్రసాద్ బాడంగి అదనపు తహసీల్దార్గా వెళ్లి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీటీ పోస్టు భర్తీ కాక ఆ కుర్చీ ఖాళీగానే ఉంది, విద్యార్థులతో పాటు మండల కార్యాలయాలకు వచ్చే వారికి పత్రికలతో పాటు మంచి పుస్తకాలు అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగ పడుతుందని గత ప్రభుత్వంలో నిర్మించి మండల శాఖా గ్రంథాలయంలో అధికారి లేక పోవడంతో ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో పాఠకులు కూడా అటు వైపు వెళ్లడం మానేశారు. సంబంధిత అదికారులు, పాలకులు దష్టిసారించి ఇన్చార్జ్ల స్దానంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు, -
విద్యవైద్యపై కూటమి కాసుల కక్కుర్తి
ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత మరిచి కూటమి పాలకులు ప్రజా వైద్యవిద్య, ప్రజావైద్యంపై కాసులేరుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించడం ప్రజా ఆస్తులపై దోపిడీ చర్య. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారంగంలోనే 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోగా, ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతోంది. ఎకరా భూమిని రూ.99కు 66 ఏళ్ల లీజుకి ఎలా ఇస్తారు? ప్రజలు మీకు ఐదు సంవత్సరాలకే అధికారం ఇచ్చారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుంది. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బుగత అశోక్ -
‘స్వేచ్ఛ..నా సందేశం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: డాక్టర్ జీవీఎస్ జైపాల్రావు రచించిన కవిత్వం ‘స్వేచ్ఛ నా సందేశం’ పుస్తకావిష్కరణ స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అరసం జిల్లా అధ్యక్షుడు జీఎస్.చలం సభాధ్యక్ష్యత వహించగా, కార్యదర్శి రత్నాల బాలకృష్ణ ఆహ్వానం పలికారు. సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, విమల సాహితీ సంస్థ అధ్యక్షుడు జె.విద్యాధర్ పుస్తకావిష్కరణ చేశారు. స్వేచ్ఛ దేశానికి అవసరమని, అటువంటి స్వేచ్ఛా సందేశాన్ని తన ప్రతి కవితలోనూ రచయిత వినిపించారన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, విమర్శకుడు, సినీగేయ రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ దేశ, ప్రాంత, సామాజిక సమస్యలన్నింటిి మీద తనదైన శైలిలో కవి తన కవితలలో నిశితంగా విమర్శించారన్నారు. గంటేడ గౌరునాయుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కందుల సురేఖ ప్రసంగించారు. కవి, విమర్శకుడు సుంకర గోపాలయ్య పుస్తకాన్ని సమీక్ష చేశారు. చీకటి చంద్రిక గీతంతో సభ ప్రారంభమైంది. పాయల మురళీకృష్ణ పుస్తకానికి ఆప్తవాక్యాన్ని అందించారు. సామాజిక స్పృహ, చైతన్యంతో కూడిన ఈ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు, కవులు, రచయితలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు
● వేటకు మోంథా తుఫాన్ దెబ్బ ● ప్రతి కూలవాతావరణంతో కొనసాగని చేపల వేటపూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు మోంధా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన ప్రతి కూల వాతావరణంతో వేటసాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావం వల్ల వాతావరణ మార్పులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేట సాగలేదు. గడిచిన నాలుగు రోజులుగా మత్స్యకారులకు చేపల వేట సాగలేదు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలలో 27 కిలో మీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 885 రిజిస్టర్డ్ బోట్లలో సుమారు 5 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంబించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కలేదని, అ తరువాత అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా అలల ఉధృతితో ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. వేట సాగక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల కుటుంబాలను విపత్తులు, తుఫాన్ హెచ్చరికల సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఆశ వర్కర్ సేవలకు అవార్డు
మెంటాడ: మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరందుకున్నవేళ.. మెంటాడ మండలం జగన్నాథపురానికి చెందిన మీసాల పార్వతి అనే గర్భిణికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త వై.బంగారమ్మ వెంటనే గర్భిణి వద్దకు చేరుకుంది. సపర్యలు చేస్తూనే ఆటోలో ఆండ్ర రిజర్వాయర్ కాలువ గట్టు గుండా ఆస్పత్రికి తరలించింది. తల్లీబిడ్డకు అండగా నిలిచింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఉన్నత వైద్యాధికారులు, ప్రభుత్వానికి నివేదించడంతో సీఎం ప్రశంసించారు. అమరావతిలో శనివారం అవార్డును అందజేశారు. భయపెడుతున్న డయేరియా రామభద్రపురం: మండలంలో డయేరియా మహమ్మారి కోరలు విప్పింది. మొన్న ముచ్చర్లవలసలో 15 మంది, నిన్న ఇట్లామామిడిపల్లి, నేడు కొండకెంగువ, ఆరికతోటలో అతిసార ప్రబలింది. కొండకెంగువ గ్రామానికి చెందిన సిరిపురం సంధ్య, చింత రవణమ్మ, ఆరికతోట గ్రా మం బీసీ కాలనీకి చెందిన కనకల గౌరిలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బాడంగి సీహెచ్సీలో శనివారం చేరారు. తాగునీటి కలుషి తం వల్లే డయేరియా ప్రబలిందంటూ పంచాయతీరాజ్ అధికారులు.. కాదు పారిశుద్ధ్య లోపమే కారణమని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తలోమాట చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకో గ్రామంలో అతిసార వ్యాప్తి తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలు తీస్తున్న మద్యం వ్యసనం ● మద్యం డబ్బుల కోసం కన్నవారితో వాగ్వాదం ● మత్తులో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న వైనం ● వరుస ఘటనలతో ఉలికిపాటు ● విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై ఆందోళన బాడంగి: పల్లెలు, పట్టణాల్లో విచ్చలవిడిగా దొరకుతున్న మద్యానికి కొందరు బానిసలుగా మారుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులోనే జోగుతున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన రూ.200, 300లకు కన్నవారు, బంధువులు, తోబుట్టువులతో గొడవకు దిగుతున్నారు. డబ్బులు చేతికందేవరకు వాగ్వాదం చేస్తున్నారు. మద్యం వద్దు అని చెప్పిన వారిపై విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. కన్నవారి ప్రాణాలు తీస్తున్నారు. బాడంగి మండలంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సొంత తండ్రులను హతమార్చిన ఘటనలు వరుసగా జరగడంతో ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు. మద్యం మహమ్మారి పేద, మధ్యతరగతి కుటుంబాలను పొట్టనపెట్టుకుంటోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడే మద్యం దొరకడంతో జీవితాలు నాశనమవుతున్నాయంటూ వా పోతున్నారు. గత నెల 9వ తేదీన మద్యం కొనుగోలుకు డబ్బులివ్వలేదన్న కోపంతో బాడంగి మండల కేంద్రంలోని సినిమా కాలనీకి చెందిన భువనగిరి లక్ష్మణరావు తన తండ్రి రాజేశ్వరరావు ను చెప్పులకు మేకులు చరిచే గూటంతో తల, చెవిపై మోది హత్య చేశాడు. శనివారం ఈ ఘట న మరువకముందే గొల్లాదిలో మద్యంమత్తులో మామిడి రాము అనే వ్యక్తి పక్షవాతంతో రెండేళ్లుగా మంచంపట్టిన తండ్రి మామిడి సత్యంను శనివారం కత్తితో తలనరికి హత్యచేశాడు. ఈ ఘటనలను చూసిన పోలీసులు సైతం ఏం చేస్తే ఈ హత్యలు ఆగుతాయన్న ఆలోచనలో పడ్డారు. -
మన్యం వద్దు.. విజయనగరమే ముద్దు
–8లోశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యలందించారు. శరవేగంగా ‘పైడితల్లి’ అభివృద్ధి పనులు సిరులతల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి.మెంటాడ: మన్యం వద్దు విజయనగరమే ముద్దు అంటూ మెంటాడ మండల కేంద్రంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో పేర్కొన్నట్టుగానే మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలంటూ నినదించారు. మెంటాడను పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపే యత్నాలను విరమించుకోవాలని కోరారు. ర్యాలీలో యువ కులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామస్తులకు అంతిమ కష్టాలు తప్పడంలేదు. మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శ్మశానం ఏడొంపుల గెడ్డ ఆవల ఉంది. శ్మశానానికి సరైన దారిలేదు. మోంథా తుఫాన్ వర్షాలకు గెడ్డలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామంలో శుక్రవారం రాత్రి చనిపోయిన ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్ నాగిరెడ్డి వెంకట్ మృతదేహాన్ని శనివారం శ్మశానానికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. పీకల్లోతు నీటిలో మృతదేహాన్ని గెడ్డను దాటించి దహనసంస్కారాలు పూర్తిచేశారు. – దత్తిరాజేరు -
● వరండాలోనే చదువులు
ఈ చిత్రాలు చూశారా.. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలో చదువులు సాగుతున్నది సంతకవిటి మండలంలోని బూరాడపేట ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 21 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా ఒక గది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దానిని వదిలేశారు. మరో తరగతి గది కూడా వర్షానికి కారిపోవడం, శ్లాబు పెచ్చులూడి పడుతుండడంతో వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – సంతకవిటి -
కాశీబుగ్గలో జిల్లా పోలీసుల సహాయక చర్యలు
విజయనగరం క్రైమ్: పొరుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక శుద్ద ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో జిల్లా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తోటి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్ ఎస్పీ నాగేశ్వరరావు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం కోసం తమ వంతు సేవలు అందించారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
కుష్ఠు వ్యాధిని నయంచేయొచ్చు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: కుష్ఠు... నయం చేయగల వ్యాధి అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కుష్ఠు వ్యాధిసోకిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుంచి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం కుష్ఠు వ్యాధిపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చర్మంపై తెల్లటి మచ్చలు, ఎర్రటి వాపు, గడ్డలు, సున్నితత్వం కోల్పోవడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలన్నారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో అవగాహనతో పాటు పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ మాణిక్యం నాయుడును ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీపీఎం డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
వంశధారలో మహిళ గల్లంతు
● కార్తీక స్నానాలలో దుర్ఘటన భామిని: మండలంలోని కాట్రగడ బీకి చెందిన గౌడో జడ్జి అనే మహిళ వంశధార నదిలో శనివారం గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. కార్తీక ఏకాదశి సందర్భంగా వేకువజామున నదిలో కార్తీక స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్తులు నదిలో వెతికినా జాడ లభించకపోవడంతో అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ శివన్నారాయణ, ఎంపీడీవో వసంతకుమారి, బత్తిలి ఎస్.ఐ అప్పారావు, ఎంఆర్ఐ మణి ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు గల్లంతైన మహిళ విషయమై పరిశీలించారు. నదీ తీరం వెంబడి వెతికేందుకు ప్రత్యేక బృందాల రప్పించనున్నట్టు అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు తోట సింహాచలం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి. ఆలయం పక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి బాలాలయం పనులను దాతల సహకారంతో అధికారులు ముందుగా నిర్మాణం చేపట్టారు. నవంబరు నెలలో పనులు పూర్తయిన తర్వాత అక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అక్కడ నుంచి ఆలయ అంతరాలయం, క్యూ వచ్చే ఇరువైపులా గోడలను పూర్తిగా తీసివేసి పొడవు, వెడల్పులను పెంచి నిర్మాణం చేపట్టేందుకు దేవదాయ శాఖ రంగం సిద్ధం చేసింది. సుమారు కోటీ రూ.80 లక్షలతో చేపట్టే ఈ నిర్మాణ పనులను వచ్చే ఏడాది జాతర నాటికి పూర్తి వైభవం సంతరించుకోనుంది. గతంలో అమ్మవారి చదురుగుడికి ఎదురుగా ఉన్న 2618 చదరపు గజాల ఎడ్వర్డ్ ఆసుపత్రి స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి కోటీ రూ.19 లక్షలతో దేవదాయ శాఖ కొనుగోలు చేసింది. ఆ ప్రదేశాన్ని పూర్తిగా చదును చేయించి, ఆలయానికి ఇరువైపులా ఉన్న షాపుల యజమానులతో సంప్రదింపులు చేసి వారికి ఆ స్ధలాన్ని అప్పగించిన సంగతి విదితమే. మొత్తం తొమ్మిది షాపుల వరకూ తొలగించి వారి నుంచి 3,130 గజాల స్ధలాన్ని సేకరించారు. సుమారు రూ.5 కోట్ల వరకూ తొమ్మిది మందికి భవన పరిహారం కింద చెల్లించారు. మరో 230 గజాల స్థలం సేకరించేందుకు ప్రపోజల్స్ను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ప్రస్తుత ఆలయం 143.24 గజాలు ఉంది. నూతనంగా విస్తరణ జరిగితే మొత్తం 396.25 చదరపు గజాలు పెరుగుతుంది. ఆలయ గర్భాలయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా కేవలం అంతరాలయం, మండపం విస్తీర్ణం పెంచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతరాలయం పాతది 3.6 అడుగుల పొడవు నుంచి సుమారు తొమ్మిది అడుగుల మేరకు పెరగనుంది. మొత్తంగా 253 గజాల విస్తీర్ణంతో ఆలయం విశాలంగా అభివృద్ధి కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దాతల సహకారం అవసరమే.. అమ్మవారి ఆలయం సంపూర్ణంగా చేయాలంటే దాతల సహకారం ఎంతైనా అవసరమే. వాటితోనే ఆలయ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి కోటీ రూ.80లక్షలతో చేపట్టిన పనులు కేవలం ఆలయ విస్తరణకు మాత్రమే సరిపోతుంది. భవిష్యత్తులో క్యూ కాంప్లెక్స్లు, అన్నదాన సత్రాలు, కార్యాలయం, కల్యాణ మండపం, కేశ ఖండన శాల తదితర వాటిని నిర్మాణానికి సంబంధించి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పైడితల్లి దర్శనం ఇక సులభం ఆలయం ఇరువైపులా అభివృద్ధి చెందితే అమ్మ దర్శనం ఇక భక్తులకు సులభంగా లభిస్తుంది. కేవలం రెండు క్యూల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. సాధారణ మంగళవారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. వచ్చే ఏడాది జాతర నాటికి 396 గజాలలో ఆలయం విస్తీర్ణం జరిగితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఆలయం పక్కనే బాలాలయ నిర్మాణ పనుల ప్రారంభం కోటీ రూ.80 లక్షలతో ఆలయ ప్రాంగణం విస్తరణ అమ్మ దర్శనం ఇక సులభం వచ్చే ఏడాది జాతర నాటికి ఆలయం సిద్ధం చేస్తాం.. ఆలయ ఈవో శిరీషనిర్మాణ పనులు ప్రారంభించాం ఆలయ విస్తరణ నిర్మాణ పనులు బాలాలయంతో ప్రారంభించాం. బాలాలయం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయి. నవంబరు రెండో వారంలో విస్తరణ పనులను సంప్రదాయబద్దంగా చేపడతాం. బాలాలయంలో అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాస్త్రోక్తంగా పనులు జరిపించే విధంగా కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది జాతర నాటికి సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాం. అమ్మ ఆలయం అభివృద్ధికి దాతలందరూ సహకరించాలి. –కె.శిరీష, పైడితల్లి దేవస్ధానం ఆలయ ఇన్చార్జ్ ఈవో, విజయనగరం -
రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను విడిచిపెట్టారు. అనంతరం సీతారామస్వామికి పూజలు చేశారు. యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించిన తర్వాత వెండి మండపంలో స్వామి నిత్యకల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఇసుక స్టాక్ పాయింట్ పరిశీలన
● ఇసుక దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు బొబ్బిలి: గ్రోత్ సెంటర్లోని ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న అంశంపై సాక్షి పత్రికలో శనివారం అక్రమ ఇసుక రవాణ అన్న కధనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆర్డీవో జెవివిఎస్.రామ్మోహనరావు, తహసీల్దార్ ఎం.శ్రీను, ఆర్ఐ రామకుమార్, ఎస్ఐ జ్ణానప్రసాద్ ఇసుక స్టాక్ పాయింట్ను పరిశీలించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇసుకను అక్కడి నుంచి అక్రమంగా తరలించినట్టు స్థానికులు చెబుతున్నారని, మధ్యాహ్న సమయంలోనే ఇసుక రవాణా జరిగినట్టు సమాచారం అందిందన్నారు. అధికారులంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనల్లో బిజీగా ఉండగా ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జేసీబీ సహాయంతో 7 ట్రాక్టర్ల ఇసుకను తరలించినట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా వైర్లును కత్తిరించారని దీనివలన ఎవరన్నది గుర్తించలేకపోయామని, త్వరలో పట్టుబడతారని వివరించారు. ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుక అక్రమంగా తరలించిన వారెవరైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తిని దోపిడి చేసినట్లేనని స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. -
జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
బొబ్బిలి: ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికను శనివారం నిర్వహించారు. డివిజన్లోని 7 మండలాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొనగా ఆయా క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని గుర్తించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. లాంగ్ జంప్, హైజంప్, త్రోబాల్ వంటి పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో గొట్టాపు వాసు, డివిజన్ ఇన్చార్జ్ ఎన్వి నాయుడు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఏడు మండలాల పి.డి.లు పాల్గొన్నారు. ములగ విద్యార్థినికి అరుదైన అవకాశం పార్వతీపురం రూరల్: మండలంలోని ములగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బంకపల్లి భార్గవి ప్రధమ స్థానాన్ని సాధించి తన ప్రతిభను కనబరుస్తూ ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగే రాష్ట్ర స్థాయి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ మేరకు అదే రోజున నిర్వహించే మాక్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు పాల్గొని అవకాశం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అరుదైన అవకాశం దక్కించుకున్న భార్గవికి ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ అభినందించారు. ‘ఓపెన్’ ఫీజు గడువు పెంపు : డీఈవో విజయనగరం అర్బన్: ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించని వారి కోసం ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్టు డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. రెగ్యులర్ టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు ‘ఏపీఓపెన్స్కూల్.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్లో సమర్పించుకోవాలని తెలిపారు. జిల్లా నెట్వర్క్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లింపునకు సదుపాయం ఉందని అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం కాకుండా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా కన్వర్షన్ చేసిన అభ్యర్థులు కూడా నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లింపును పూర్తి చేయవచ్చని తెలిపారు. బొబ్బిలిలో చోరీ బొబ్బిలి: పట్టణంలోని వెలమవారి వీధిలో ఓ అపార్ట్మెంటులో నివసిస్తున్న ఉపాధ్యాయురాలు బెవర రాధ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. బీరువాను బద్దలు కొట్టి దాచుకున్న దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. తన కుమార్తె పుట్టపర్తిలో విద్యనభ్యసిస్తుండగా భర్త రామకృష్ణ కుమార్తె వద్దకు వె వెళ్లారు. శుక్రవారం రాధ తన పుట్టింటికి వెళ్లగా శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి తలుపుల గడులు, బీరువా తెరిచి ఉన్నాయని దీంతో తమకు సమాచారం ఇచ్చినట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చి పరిశీలించిందని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు ఇంకా అందలేదని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య గుర్ల: మండలంలోని గుజ్జింగివలసకు చెందినన బద్రి రాంబాబు(30) మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బద్రి రాంబాబుకు కుటుంబ సభ్యులు మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక్క సంబంధం కూడా నిశ్చయం కాకపోవడంతో పెళ్లి కాదనే నిర్ణయానికి వచ్చి మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్ల హెడ్ కానిస్టేబుల్ త్రినాధ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతునికి తల్లి అప్పయ్యమ్మ ఉన్నారు. -
రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
● దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయాలి ● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరసాలూరు రూరల్: మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కనీస బీమా సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం అసలు రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుందో కూటమి నాయకులు సమాధానం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మండలంలోని పెదపదం పంచాయతీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పంట పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో సంపత్, ఆర్జేఎల్, సోనామసూరు, సాంబమసూరు రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన నేలకొరిగిన వరి చేలు చూస్తుంటే రైతు కష్టం, కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహరంతో పాటు పంటలను కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు. ఉచిత బీమా లేక రైతుల ఆందోళన గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు తమ పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి ఆదుకుందన్నారు. గతంలో తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు బీమా డబ్బులు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత సంత్సరం కూడా ఇలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి నష్టపరిహరం అందలేదని, ఇప్పుడు కూడా బీమా సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు బీమాకు దూరమయ్యారన్నారు. మండలంలోని రెండు తుఫాన్లకు అరటి, మొక్కజొన్న, వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహరం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
భోగాపురం: ఐచర్ వ్యాన్ డీకొట్టడంతో మండలంలోని ముంజేరు పంచాయతీ ధనాలపేట గ్రామానికి చెందిన ధనాల గోవిందు (37) మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మండల కేంద్రంలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ధనాలపేట గ్రామానికి చెందిన గోవిందు విమానాశ్రయం నిర్మాణ పనులలో కూలీగా పని చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. మృతునికి తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని తల్లిదండ్రులు డెంకాడ మండలం అక్కివరం సమీపంలో ఉన్న జామి తోటలో ఒక యాజమాని దగ్గర కూలీలుగా పని చేస్తున్నారు. గోవిందు తన తల్లిదండ్రులను కలిసేందుకు ధనాలపేట నుంచి బైక్పై అక్కివరం జామి తోట వద్దకు బయలు దేరాడు. ఈ క్రమంలో అప్పన్నపేట వద్దకు చేరుకునే సరికి భోగాపురం నుంచి ఉప్పు లోడుతో ముక్కాం వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో గోవిందు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ధనాలపేట గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకొంది. ఇంటికి పెద్దదిక్కు చనిపోవడంతో మృతుని భార్య కొండమ్మ తన ముగ్గురు ఆడ పిల్లలతో రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. డ్రైవర్ గంగాధరయ్య వ్యాన్ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి.పాపారావు తెలిపారు. బొండపల్లి: మండలంలోని గోట్లాం గ్రామంలో గల కోనేరులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలు... గ్రామానికి సమీపంలో గల కోనేరులో గుర్తు పట్టడానికి వీలు లేకుండా బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మృతుని వద్ద ఆధారాల కోసం పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామ నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109462 నంబరుకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఒడిశా వాసి అనుమానాస్పద మృతి విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఒడిశాకు చెందిన కలియాగౌడ్(27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్టౌన్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన కలియాగౌడ్ శుక్రవారం రాత్రి కంపెనీ పని నిమిత్తం విజయనగరం వచ్చాడు. ట్రైన్లో దిగి ఇక్కడి నుంచి భీమిలి వెళ్తున్న సమయంలోనే అనుమానాస్పదంగా కింద పడి ఉండటంతో స్థానికులు చూసి అతని వద్ద ఉన్న బ్యాగ్లో ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న కలియాగౌడ్ బంధువులు బరంపురం నుంచి వచ్చి పరిస్థితి గమనించి మృతి చెందినట్టుగా వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కడపలో సీపీఐ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు
విజయనగరం గంటస్తంభం: కడపలో డిసెంబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సీపీఐ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సభలకు సంబంధించిన పోస్టర్లను శనివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి బి.శంకరరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న హిందుత్వ, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, కార్పొరేట్ వర్గాలను బలోపేతం చేసే విధానాలపై సభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందిస్తామన్నారు. కార్మిక, దళిత, మైనార్టీ, రైతు, పేదల పోరాటాలకు ముందుండే సమయం వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే కుట్రల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ కోతలతో పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో క్షీణత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.గంగాధర్, ఎన్.సూర్యనారాయణ, ఎం.సురేష్, ఏఐసీసీటీయూ నాయకులు పాల్గొన్నారు. -
టెట్ అర్హత జీవితకాలం చెల్లుబాటులో ఉండాలి : ఫ్యాప్టో
విజయనగరం అర్బన్: ఆర్టీఈ చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సర్టిఫికెట్కు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘జీవితకాల చెల్లుబాటు’ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తిని, డీఈవో యు.మాణిక్యంనాయుడుకు శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం 2011 నుంచి 2025 మధ్య నిర్వహించిన టెట్ పరీక్షలకు 7 సంవత్సరాల చెల్లుబాటు మాత్రమే ఉన్నట్టు పేర్కొనడం ఉపాధ్యాయులలో ఆందోళనకు దారి తీసిందని అన్నారు. 2011లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటుగా ఉండాలని స్పష్టం చేసినందును రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009 ఆర్టీఈ చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా టెట్ పరీక్ష తప్పనిసరి చేసిన నేపథ్యంలో అర్హత పొందిన అభ్యర్థులు పునరావృత పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. డీఆర్వోను కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ పి.శ్రీనివాసరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు జేఏవీఆర్కే ఈశ్వరరావు, ఎన్వీ పైడిరాజు, ఏలూరి శ్రీనివాసరావు, డి.శ్యాం, జేఆర్సీ పట్నాయక్, సూరిబాబు తదితరులు ఉన్నారు. -
మొక్కుబడిగా మంత్రి పర్యటన
● అధికారులతో రివ్యూకే పరిమితం ● పునరావాస కేంద్రం వైపు కన్నెత్తి చూడని మంత్రి పాచిపెంట: మోంథా తుఫాన్ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించి అనంతరం పెద్దగెడ్డ జలాశయాన్ని సందర్శించి వెనుదిరిగారు, మంత్రి పర్యటన కేవలం అధికారులతో రివ్యూకే పరిమితమవడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడికి వచ్చినట్లు అలా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని అధికారులతో నాలుగు మాటలు మాట్లాడితే సరిపోతుందా? మంత్రి రివ్యూ నిర్వహించిన తహసీల్దార్ కార్యాలయానికి 200మీటర్ల దూరంలో ఉన్న పద్మాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఉన్న పునరావాస కేంద్రానికి వెళ్లకపోవడం, అక్కడ విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం కానీ, శిథిలావస్థలో ఉన్న ఆశ్రమ పాఠశాల భవనాన్ని పరిశీలించే అవసరం కానీ మంత్రికి లేవా? లేక గిరిజన విద్యార్థుల అవస్థలు గిరిజన మంత్రి పరిధిలోని కావా..అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల పర్యటించి నేలమట్టమైన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి రైతు కష్టం తెలుసుకునే ప్రయత్నం మంత్రి చేయకపోవడంతో మండలంలో మంత్రి పర్యటన మరిన్ని విమర్శలకు తావిస్తోంది. -
దివ్యాంగుల సేవలో ‘గురుదేవా’
● సౌత్ఏషియన్ ఎల్పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే ● దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందని సౌత్ఏషియన్ ఎల్పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే కొనియాడారు.ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఆధ్వర్యలో సౌత్ఏషియన్ఎల్పీజీ సంస్థ సహకారంతో 250 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్చైర్స్, ట్రైసైకిల్స్, పోలియో కాలిపర్స్, వాకర్స్, చెవిటి మిషన్లు తదితర ఉపకరణాలను గురువారం అందజేశారు. ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని సౌత్ఏషియన్ఎల్పీజీ సంస్థ ప్రతినిధి రామనాథ్తో కలిసి సీఈఓ సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో పేదలు, దివ్యాంగులకు అందుతున్న సేవలను ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు వారికి వివరించారు.అనంతరం రిచాషిండే మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టమని, భగవంతుడికి చేస్తున్న సేవగా భావించాలన్నారు. ఆ అదృష్టం చారిటబుల్ ట్రస్టు చైర్మన్ జగదీష్బాబుకి దక్కిందన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు డాక్టర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జోగింపేట విద్యార్థులు
సీతానగరం: మండలంలోని జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ గిరిజన ప్రతిభ (ఎస్ఓఈ) విద్యాలయం విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయిపోటీలకు ఎంపికావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ ఎం.ధర్మరాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని జోగింపేటలో గరువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్ఓఈ ఇతర విద్యాలయాల 19మంది విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో తమ విద్యాలయానికి చెంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికకు జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీలు పార్వతీపురం, వెయిట్లిఫ్టింగ్ పోటీలు గుంటూరు, వాలీబాల్ పోటీలు విజయనగరంలో జరిగాయి. 31న చిత్తూరులో స్టేట్మీట్ పోటీలు జరుగుతాయని తెలియజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన జై ప్రసాద్ (ఆర్చరీ), రాజ్యన్ వెయిట్లిఫ్టింగ్ (సిల్వర్), అండర్ 19లో కె భానుప్రసాద్ వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. వారందరినీ ప్రిన్సిపాల్ బి.ధర్మరాజు, పీడీ ఎం.ఉదయ్కుమార్, సిబ్బంది అభినందించారు. ఇద్దరు సెల్ఫోన్ దొంగల అరెస్ట్గుమ్మలక్ష్మీపురం: మండలంలోని గద్రజోల గ్రామంలో గురువారం ఉదయం సెల్ఫోన్లు దొంగతనం చేస్తుండగా ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సమాచారాన్ని ఎల్విన్పేట పోలీసులకు తెలియపర్చగా పోలీసులు గ్రామానికి వెళ్లి పట్టుబడిన యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై బి.శివప్రసాద్ మాట్లాడుతూ పట్టుబడిన యువకుల నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, ఈ యువకులు ఇంకెక్కడైనా, ఏదైనా దొంగతనాలకు పాల్పడ్డారా? అనే విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టాలి
విజయనగరం: అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టి సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక అవగాహన వారోత్సవా ల్లో భాగంగా గురువారం విజయనగరం మున్సిప ల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమ్య ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవినీతితో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా ఉండలేరన్నారు. లంచం, అవినీతికి పాల్పడిన వారు ఏసీబీ నుంచి తప్పించుకోలేరన్న విషయాన్ని గమనించాలని హితవు పలి కారు. పూర్తి ఆధారాలతో మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేస్తుందని, ఎంతటి వారైనా ఈ తరహా నేరంలో బయటపడలేరని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని నిర్వహించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కోరారు. మనిషికి ఉన్న అత్యాశే అవినీతికి ప్రధాన కారణమన్నారు. లంచంతో పట్టుబడితే శిక్ష పడడమే కాకుండా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం అంటే మన పాపాన్ని మనమే పెంచుకుపోతున్నట్లు అర్థమన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సమాజంలో అవినీతి లేకుండా నిజాయితీగా సేవలు అందించిన నాడే ఏ అధికారికై నా, ఉద్యోగికై నా పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఏసీబీ సీఐ మహేశ్వర రావు, కార్పొరేషన్ ఉద్యోగులు, అవినీతి నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య -
అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
● పట్టుబడ్డ పాత నేరస్తుడు విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ బుధవారం రాత్రి సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఉగ్రవాది సిరాజ్ అరెస్టు పుణ్యమా అని నగరంలోని అలాంటి జాడలు ఉన్నాయేమోనన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో రోజుకో స్టేషన్ ఎస్సై తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై అశోక్, సిబ్బంది రామకృష్ణ, సూర్యారావులతో నగరంలోని వై జంక్షన్, చెల్లూరు, రింగ్ రోడ్డు, ధర్మపురి, గాజులరేగలలో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఫింగర్ ప్రింట్ డివైజ్తో దాదాపు ఆ సమయంలో ఎలాంటి కారణాలు లేకుండా తిరుగుతున్న 30 మంది నుంచి వివరాలు సేకరించారు.ఈ తనిఖీల్లోనే నగరంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్పరిధి రాజీవ్నగర్కు చెందిన రఘు అనే పాతనేరస్తుడు దొరికాడు. ఒక వ్యభిచార కేసులో నిందితుడిగా ఉండి కేసు నమోదై కోర్టు వరకు వెళ్లివచ్చాడు. పోలీస్ రికార్డుల్లో నిందితుడిగా ఉండడం, మరోసారి మద్యం కేసులో పోలీసులకు అర్ధరాత్రి పట్టుబడ్డాడు. 11 గొర్రెల చోరీతెర్లాం: మండలంలోని విజయరాంపురం గ్రామంలో బుధవారం రాత్రి గొర్రెల శాలలోని 11 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకెళ్లిపోయారని గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, గొర్రెల యజమాని వంజరాపు సత్యం గురువారం తెలిపారు. మేతకు తోలుకుని వెళ్లిన గొర్రెలను బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చి శాలలో పెట్టానని, గురువారం ఉదయం వెళ్లి చూడగా 11 గొర్రెలు కనిపించలేదని బాధితుడు తెలిపాడు. 11 గొర్రెల విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని వాపోయాడు. గొర్రెల కోసం చుట్టు పక్కల పొలాల్లో వెదికినా ఆచూకీ కనిపించలేదని, దీంతో 11 గొర్రెలను దొంగలెత్తుకు పోయినట్లు వారు అనుమానం వ్యక్తంచేశారు. చోరీ కేసులో పురోగతివిజయనగరం క్రైమ్: వారం రోజుల క్రితం నగరంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉడా కాలనీ పరిధి కలాం విగ్రహానికి సమీపంలో కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రికల్ వైర్లు చోరీ జరిగిందన్న అంశంపై వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని కలాం విగ్రహం సమీపంలో 5 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇంటికి సంబంధించి సుమారు రూ.5లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ పనులను యజమాని రామునాయుడు చేయించారు. అయితే వాచ్మన్ ఉండగానే విద్యుత్ వైర్లను కోసి మరీ దొంగతనం జరగడంతో హుటాహుటిన వన్ టౌన్ పోలీసులకు యజమాని రామునాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయగా క్రైమ్ పార్టీ సిబ్బంది మూడు రోజుల పాటు ఉడా కాలనీ, ద్వారపూడి, చెల్లూరు, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, కేఎల్ పురం, పాల్నగర్, దుప్పాడ, అయ్యన్నపేటలలో వెతుకులాట చేశారు. కాగా ఒక వ్యక్తి టూ వీలర్పై ఆ ఎలక్ట్రికల్ వైర్లను పట్టుకెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు తన సిబ్బంది రమణ, శ్రీనివాస్లతో దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే చెల్లూరు సమీపంలో చెంచుల కాలనీకి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డ
పాచిపెంట: మోంథా తుఫాన్ కారణంగా పెద్దగెడ్డ జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో, రెండు గేట్లు ఎత్తి సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీటిని పెద్దగెడ్డ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల చేసే సమయంలో పైనుంచి నీరు అలా పరవళ్లు తొక్కుతూ కిందికి పడడం.,నీరు కిందకు పడే సమయంలో వచ్చే శబ్దం, ప్రకతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా గురువారం అధికసంఖ్యలో ప్రకతి ప్రేమికులు జలాశయానికి వచ్చి పెద్దగెడ్డ అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు దిగారు. ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు -
కూలిపోయిన ఇళ్లు
సీతానగరం: మోంథా తుఫాన్ కారణంగా నాలుగురోజులుగా కురిసిన వర్షానికి సీతానగరం మండలంలోని బక్కుపేటలో ఒంటరి మహిళ చుక్క లక్ష్మి పూరిల్లు గోడలునాని పూర్తిగా కూలిపోవడంతో భోరున విలపించింది. బుధవారం సాయంత్రం ఇల్లు కూలి పోవడంతో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్కు ఫిర్యాదు చేసింది. దిక్కులేక అవస్థలు పడుతూ తలదాచుకుంటున్న ఇల్లు వర్షానికి కూలిపోవడంతో భోరున విలపించింది. ఇల్లు కూలిపోయిందని వీఆర్వో ద్వారా తెలుసుకున్న తహసీల్దార్ మాట్లాడుతూ కూలిన ఇంటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలియజేశారు. గుర్లలో..గుర్ల: మోంథా తుఫాన్ ప్రభావంతో గుర్ల మండలంలోని తాటిపూడిలో పెంకుటిళ్లు ముందుభాగాలు పూర్తిగా తడిచిపోయి కుప్పకూలాయి. తాటిపూడికి చెందిన గూడేల లావణ్య, లక్ష్మణరావు, గేదెల పాపారావు, గూడేల నరసయ్యమ్మ, పొతిన శ్రీరాములుకు చెందిన పెంకుటిళ్ల ముందుభాగం ఒక్కసారిగా పడిపోవడంతో వారు భయాభ్రాంతులకు గురయ్యారు. పెంకిటిళ్ల ముందుభాగం పడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు. ద్విచక్ర వాహనంపై కర్రలు, పెంకులు పడడంతో పాక్షికంగా దెబ్బతింది. పడిపోయిన ఇళ్లను తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి పరిశీలించారు. ఆ ఇళ్లలో ఉన్నవారిని సచివాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
రామభద్రపురం: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జీవనరాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను గురువారం ఆమె సందర్శించిన అనంతరం స్థానిక పీహెచ్సీకి వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి మరిగించిన నీరు తాగేలా అవగాహన కల్పింలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే సుఖప్రసవాలు జరుగుతాయని, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు పోగొట్టుకోకూడదని హితవు పలికారు. సిబ్బంది కూడా గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి దిలీప్కుమార్, సీహెచ్వో రాజు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో జీవనరాణి -
ప్రాణంపోతున్నా సమాజంలో వెలుగు నింపిన అమరులు
పార్వతీపురం రూరల్: పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కూడలి వద్ద అమరవీరుల చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, దీపం ఆరిపోతూ కూడా ప్రకాశవంతమైన వెలుగునిస్తుంది. అదేవిధంగా పోలీసుల త్యాగాలు కూడా. ప్రాణం పోతున్నా సమాజంలో వెలుగును నింపి అమరులయ్యారని కొనియాడారు. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని నిష్పాక్షికంగా ప్రజాసేవ చేస్తామన్నారు. 24 గంటలు ప్రజా రక్షణ కోసం నిలబడేది పోలీస్ శాఖ మాత్రమేనని, వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మురళీధర్, రంగనాథం, ఏఆర్ ఆర్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
చెట్టు కిందనే చదువులు
● పాఠశాలలో వర్షపు నీరు చిమ్మడంతో తప్పని పరిస్థితి పార్వతీపురం రూరల్: అభం శుభం తెలియని చిన్నారుల చదువు చెట్టు కిందకు చేరింది. బడికి వెళ్తే ఏ పైకప్పు పెచ్చులూడి పడుతుందో, ఏ గోడ కూలుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇది పార్వతీపురం మండలం బిత్రటొంకి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దయనీయ దుస్థితి. సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన ఈ పాఠశాల భవనం, ‘మోంథా’ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా మారింది. గురువారం ఉదయం తరగతులు జరుగుతుండగా, పైకప్పు నుంచి ఒక్కసారిగా నీరు ధారగా చిమ్మడంతో ఆ గదిలో ఉన్న ఏడుగురు విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగుపెట్టారు. గత్యంతరం లేక.. వృక్షం నీడలో.. తరగతి గదిలో పై కప్పునుంచి నీటి ధారలు కారడంతో, చేసేదేమీ లేక ఉపాధ్యాయుడు విద్యార్థులను సమీపంలోని ఓ చెట్టు కిందకు తరలించారు. వర్షపు జల్లుల మధ్య, చలికి వణుకుతూనే చిన్నారులు చెట్టు నీడన అక్షరాలు దిద్దాల్సిన దుస్థితి ఏర్పడడం చూసిన పలువురిని కలిచివేసింది. ‘నాడు’ వైభవం.. ‘నేడు’ నిర్లక్ష్యం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద సర్కారీ బడులు ప్రైవేట్ సంస్థలకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. విద్యకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనడానికి బిత్రటొంకి పాఠశాలే సజీవ సాక్ష్యం. ‘నాడు’ పొందిన వైభవం.. ‘నేడు’ కనీస మరమ్మతులకు నోచుకోక కునారిల్లుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, శిథిల భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలు
చికెన్పార్వతీపురం రూరల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు, ఆయా పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది ‘‘లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర’’ అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించగా, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్బీ సీఐ పర్యవేక్షణలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వ్యాస రచన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని రాశారు. అదేవిధంగా వక్తృత్వం పోటీలో పాల్గొన్నవారు తమ ఆలోచనలను స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, ప్రేరణాత్మకంగా వ్యక్తపరిచారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేయనున్నారు. -
ముచ్చర్లవలసలో పారిశుద్ధ్యలోపం
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస గ్రామస్తులు అతిసారతో మంచంపట్టారు. 15 మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అతిసార వ్యాప్తికి గ్రామంలో పారిశుద్ధ్యలోపం, కలుషిత తాగునీరే కారణమని అధికారులు భావిస్తున్నారు. గ్రామంలోని ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు, ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వ ఉండడంతో దోమ లు వ్యాప్తిచెందుతున్నాయి. జనంపై దాడిచేస్తున్నాయి. వ్యాధులు వ్యాప్తిచెందినప్పుడు హడావిడి చేస్తున్నారే తప్ప సాధారణ రోజుల్లో పారిశుద్ధ్యంపై పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. గ్రామాన్ని బుధవారం డీఎంహెచ్ఓ, డీపీఓ, ఆర్డీఓ, మండల స్థాయి అధికారులు సందర్శించగా, గురువారం ఽడీఎంహెచ్ఓ, డీఎల్డీఓ తదితర అధికారులు పర్యటించి అతిసార వ్యాప్తిపై ఆరా తీశారు. కోటశిర్లాంలోని ఏడొంపుల గెడ్డ నుంచి గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. చెత్త సంపద కేంద్రం వద్ద ఉన్న మురుగునీటి కాలువలోని తాగునీటి పైపు లీకేజీలతో నీరు కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
ప్రతి నష్టాన్ని నమోదు చేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: భారీ వర్షాలకు, వరదలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని కూడా నమోదు చేయాలని, నష్టం విలువను అంచనా వేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై జిల్లా అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. పంటలు, పశువులు, రోడ్లు, విద్యుత్, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలకు కలిగిన నష్టం అంచనా నివేదికలను అందజేయాలన్నారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో 4,949 మంది ఉన్నట్టు తెలిపారు. ఉచిత శిక్షణ విజయనగరం టౌన్: సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్పీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మైనారీటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కె.కుమారస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో శిక్షణ సాగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సీఈడీఎం కార్యాలయం, భవానీపట్నం, విజయవాడ–520012 చిరునామాకు బయోడేటాను పంపించాలన్నారు. వివరాలకు స్థానిక మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, ఫోన్–0866–2970567ను సంప్రదించవచ్చన్నారు. -
కన్నీరు మిగిల్చిన మోంథా
● అన్నదాతకు కోలుకోలేని దెబ్బ ● మొలకెత్తిన వరి, మొక్కజొన్న ● ఆవేదనలో రైతన్న రామభద్రపురం: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వరుస తుఫాన్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అపార నష్టం కలిగిస్తున్నాయి. మోంథా తుఫాన్ కన్నీరు మిగిల్చింది. మొక్కజొన్న, వరి, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. మొక్కజొన్న గింజలకు మొలకలు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అమ్ముదామంటే కొను గోలు కేంద్రాలు లేవు.. ఇప్పుడు మొలకలు వచ్చిన పంటను కొనుగోలుచేసేవారే కరువయ్యారు. తడిసిన పంటను రక్షించుకునేందుకు తిరిగి పెట్టుబడి తడిసిమోపెడవుతుండడంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు. పంటంతా పాడైంది నా పేరు లగుడు సత్యం. మాది జామి గ్రామం. నేను 30 సెంట్లలో తోటకూర, పాలకూర, ఉల్లి, చిక్కుడు సాగుచేశాను. మోంథా తుఫాన్ వల్ల నీట మునిగాయి. కూరగాయలు, ఆకుకూరలు దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంట ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. కంటికి రెప్పలా సాకుకుంటూ వచ్చాను. రాకాసి తుఫాన్తో పంటంతా నేలకొరిగింది. పాలుపోసుకునే దశలో పంట పాడైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే అప్పుల్లో కూరుకుపోతాం. – లింగాల శంకరరావు, రెల్లి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా వీడని వరద రేగిడి: మోంథా తుఫాన్ వరద పంట పొలాలను వీడడంలేదు. చేతికందొచ్చిన పంట వరదపాలు కావడంతో రైతులు కన్నీరుకార్చుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం అమలులో ఉండడంతో విపత్తుల సమయంలో రైతన్నకు నష్టపరిహారం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. -
అడుగుకో గుంత.. రాకపోకలకు చింత
జిల్లాలోని పల్లెలు, పట్టణాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. పల్లెపండగ పేరుతో రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేసిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లను మరమ్మతులు కూడా చేయని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగుకోగుంతతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ నిరసన తెలుపుతున్నారు. రోడ్లు ఎప్పుడు బాగుచేస్తారు ‘బాబూ’ అంటూ ప్రశ్నిస్తున్నారు. –విజయనగరం రూరల్/వేపాడ/వంగర/సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం ఎటువెళ్లినా గోతులే.. కొత్తపేట రోడ్డులో ప్రయాణ కష్టాలుఎస్ఎస్ఆర్ పేటలో కోతకు గురైనరోడ్డు వంగర: తలగాం వద్ద రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో చేరిన వర్షపు నీరు -
కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలు వేస్తే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వ్యర్ాధ్యలు కలెక్టరెట్ ప్రాంగణంలో వేస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. ‘కంపుకొడుతున్న కలెక్టరేట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని గురువారం ఆదేశాలిచ్చారు. ప్రతి నెల మూడవ శనివారం తప్పనిసరిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మడ్డువలసకు వరద ఉద్ధృతి వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సువర్ణముఖి, వేగాతి నదుల నుంచి గురువారం 24,600 క్యూసెక్కులనీరు ప్రాజెక్టులో చేరుతుండగా, ఎనిమిది గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 63.71 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు. -
● ఈ షెడ్డులో చదువుకోలేం
ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకుల షెడ్ చూశారా... ఇది బొబ్బిలి మండలం బట్టివలస గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనమట. ఇక్కడ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. ఒక రెగ్యులర్ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. గతేడాది వరకు పూరిపాకలో పాఠశాల నిర్వహణ జరగ్గా అది కూలిపోవడంతో పక్కనే ఉన్న చర్చిలో చదువులు సాగిస్తున్నారు. విద్యార్థుల సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పలు మార్లు ఆందో ళన చేసినా స్పందన శూన్యం. యూటీఎఫ్ నాయకురాలు విజయగౌరి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా ఆయన గ్రామ సర్పంచ్కు రూ.50 వేలతో పాఠశాల గదిని నిర్మించాలని సూచించారు. డబ్బులు కూడా ఇచ్చారు. పశువులకు నిర్మించినట్టు చిన్నషెడ్డు వేసి కనీసం గచ్చులు కూడా చేయకపోవడంతో అందులో చదువుకునేందుకు చిన్నారులు నిరాకరించారు. ఎండ కాస్తోందని, వర్షం వస్తే తడిచిపోతున్నాంటూ ఆవేదన వ్యక్తంచేస్తూ మళ్లీ చర్చిలోనే చదువులు సాగిస్తున్నారు. పిల్లల చదువుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, పక్కా భవనాన్ని మంజూరు చేయించలేకపోవడం ఎమ్మెల్యే బేబినాయన అసమర్థపాలనకు నిదర్శనమంటూ గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. – బొబ్బిలిరూరల్ -
ముంపు ప్రాంతాల్లో జెడ్పీ చైర్మన్ పర్యటన
● తుఫాన్ నష్ట నివారణలో సచివాలయ వ్యవస్థ భేష్ రాజాం/నెల్లిమర్ల/మెరకముడిదాం: జిల్లాలో మోంథా తుఫాన్ ముంపు ప్రాంతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. మెరకముడిదాం మండలంలో మెరకముడిదాం, సోమలింగాపురం, ఎం.రావివలస గ్రామాల్లో తుఫాన్ వర్షాలు కారణంగా నష్టపోయిన వరి పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. పడిపోయిన పంటను పరిశీలించి, నష్టంపై ఆరా తీశారు. తహసీల్దార్ సులోచనారాణి, ఎంపీడీఓ భాస్కరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రాజాం మండలంలో లక్ష్మీపురం, నందబలగ, శ్యాంపురం, కొఠారిపురం గ్రామాల్లోని పంటపొలాలు పరిశీలించారు. ముంపు పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోంథా తుఫాన్ కొన్ని ప్రాంతాల్లోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మెంథా తుఫాన్ నష్టాన్ని నివారించడంతో సచివాలయ వ్యవస్థ బాగా పనిచేసిందని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ఆస్తి, పంట నష్టాలశాతం తగ్గిందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో సచివాలయ సిబ్బంది పాత్ర ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన వ్యవస్థ ఆపద సమయాన ఆదుకుంటోందన్నారు. కలెక్టర్ సైతం సిబ్బంది సేవలను అభినందించారన్నారు. ఆయన వెంట పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, తదితరులు ఉన్నారు. విద్యార్థినులకు పరామర్శ నెల్లిమర్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్ల మండలం కేజీబీవీ విద్యార్థినులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. పాఠశాలలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్పై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థులకు సూచించారు. -
ఎన్డీపీఎస్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి బుధవారం జూమ్ వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా మాసాంతపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా పెండింగ్ కేసులపై, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్డీపీఎస్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చూడాలని, గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టినవారి ఆస్తులను అటాచ్ చేయాలని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని, నేరస్థులపై హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశించారు. కేసులకు సత్వర పరిష్కారం చూపే దిశగా గ్రేవ్, లాంగ్ పెండింగ్ కేసులు, మహిళా సంబంధిత నేరాల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. ఎన్బీడబ్ల్యూలను త్వరగా అమలు చేయాలని, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో, ప్రమాద సమాచారాన్ని ఐఆర్ఎడిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించి, డ్రంకెన్డ్రైవ్, ఈ–చలాన్లు అధికంగా నమోదు చేయాలని ఆదేశించారు. పేకాట, ఓపెన్ డ్రింకింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతిరోజూ డ్రోన్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. చివరగా, మోంథా తుఫాన్ ప్రభావంతో వరదలు వచ్చే ప్రాంతాలపై దృషి్ట్ సారించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
ముచ్చర్లవలసలో అతిసారం
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస గ్రామంలో అతిసార వ్వాధి విజృంభించింది. దీంతో సుమారు 15 మందికి పైగా డయేరియా సోకడంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఒకరిద్దరు విజయనగరం, కొంతమంది బాడంగి సీహెచ్సీ, మరికొంతమంది రామభద్రపురం క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. పసుకుడి వద్ద లారీ బోల్తా● నెలలో మూడో ప్రమాదం భామిని: మండలంలోని కొత్త పసుకుడి వద్ద గల రోడ్డు డైవర్షన్లో బుధవారం వేకువ జామున భారీ లోడు లారీ తిరగబండింది. గడిచిన నెలరోజుల్లో ముచ్చటగా మూడో రోడ్డు ప్రమాదం ఇదే డైవర్షన్లో జరగడం ఆశ్యర్యం కలిగిస్తోంది. స్థానిక అధికారులు రోడ్డు ప్రమాదాలపై చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్తున్న భారీ లారీలు ఈ రోడ్డులో ప్రమాదానికి గురయ్యాయి. -
డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు
జామి: మండలకేంద్రంలోని కొత్తలి వీధికి చెందిన కసిరెడ్డి కొండమ్మ (70) సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జామి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె గోస్తనీ నదివైపు బహిర్భుమికి వెళ్లిందని స్థానికులు చెప్పడంతో గోస్తనీనదిలో వృద్ధురాలు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జామి ఎస్సై జనార్దన్ డ్రోన్ల సహాయంతో ఆమె ఆచూకీ కోసం పరిశీలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. -
కూలిన ఇంటి గోడ
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురుగజపతినగరం: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో తుఫాన్ వర్షాలకు ఓఇంటి గోడ కూలిపోయింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కనకల రామ అనే వ్యక్తి పెంకిటింటిలో కాళ్ల సంతోషి, సన్యాశినాయుడు దంపతులతో పాటు వారి ఇద్దరు కవలపిల్లలు, సన్యాసినాయుడు అత్త కంటుభుక్త నారాయణమ్మ అద్దెకు ఉంటున్నారు. అయితే కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా తెల్లవారు జామున ఒక పక్క ఇంటి గోడ కూలిపోతుందన్న విషయాన్ని గ్రహించిన సన్యాశినాయుడు తన భుజస్కందాలపై గోడను కాచి రెప్ప పాటులో కవల పిల్లలను, భార్య సంతోషి, అత్త నారాయణమ్మను కాపాడుకున్నాడు. వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఆ సమయంలో సన్యాశినాయుడు మేల్కోక పోతే కవలపిల్లలు కాళ్ల సాయిమణికంఠ, కాళ్ల సహస్ర(7నెలలు)లతో పాటు భార్యభర్తలు, నారాయణమ్మలకు ప్రాణాపాయం జరిగి ఉండేదని గ్రామస్తులు, అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ బి.రత్నకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కూలిపోయిన ఇంటిని పరిశీలించి కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులో నమోదు చేశారు. సాలూరులో..సాలూరు: తుఫాన్ నేపథ్యంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు సాలూరు పట్టణంలోని చినవీధిలో గల ఓ పాత ఇంటి గోడ కూలిపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయండి
బలిజిపేట: మండలంలోని వంతరాం, నూకలవాడ గ్రామాల్లో వరద ఉధృతితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారిని అప్రమత్తం చేసి, సమస్యలు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. ఈ మేరకు మండలంలోని వంతరాం, నూకలవాడలో ఆయన బుధవారం పర్యటించారు. వంతరాంలో వేగావతి వరద ఉధృతి పెరిగి గ్రామంలోకి రావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వేగావతి నది పక్కనే ఉన్న బస్టాండ్ రోడ్డును ఎత్తుచేయాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. వేసవిలో వేగావతి నది ఎండిపోవడంతో నీటి సమస్య వస్తోందని, అందుకు నది దాటి ఉండే రాతికొండ సమీపంలో చెక్డ్యాం నిర్మాణం చేపడితే నీరు నిల్వ ఉండి మోటార్లు పనిచేస్తాయని గ్రామస్తులు కోరగా దీనిపై పరిశీలించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వంతరాం కేజీబీవీని పర్యవేక్షించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వద్ద ఏఎన్ఎం ఆసమయంలో లేకపోవడంతో కలెక్టర్ ఆమైపె ఆగ్రహించారు. నూకలవాడలో పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తోందని గ్రామస్తులు తెలపడంతో విద్యుత్శాఖ ఏఈని కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపీడీఓ శ్రీవాణి, మండలస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
గజపతినగరంలో రోడ్డు ప్రమాదం
● కారు దిగిన కలెక్టర్ గజపతినగరం: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న విజయనగరం కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి గజపతినగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బుధవారం గమనించారు. వెంటనే ఆయన ప్రయాణించే వాహనాన్ని నిలిపి కిందికి దిగి గాయపడిన వ్యక్తులకు ధైర్యం చెప్పారు.అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేయించి బాధితులను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గోల్డెన్ అవర్లో అందించిన సాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని ప్రాణం కంటే విలువయినది ఏమీ లేదని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.గుర్ల: మండలంలోని తాతావారి కిట్టాలి వద్దనున్న గడిగెడ్డ రిజర్వాయర్లో మెరకముడిదాం మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన పల్లేడ రవీంద్ర అనే యువకుడు బుధవారం స్నానానికి దిగాడు. స్నానం చేస్తుండగా ఫోన్లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అప్పటికే నీటి ప్రవాహం పెరగడంతో రవీంద్ర కొట్టుకుపోతున్నాడు. రిజర్వాయర్లో కొట్టుకుపోతున్న రవీంద్రను స్థానికుడు సీల సూర్యనారాయణ గమనించి ఒడ్డుకు చేర్చాడు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రవీంద్ర లవిడాంలోని తన సహచర కుటుంబ సభ్యుల ఇంటికి వచ్చి రిజర్వాయర్కు స్నానానికి వచ్చినట్లు చెప్పాడు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యవంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కడగల రాము(49) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వంగర పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిత్యం మద్యం తాగడంతో కడుపునొప్పి తాళలేక ఈ నెల 26వ తేదీన మద్యంలో కలిపి పురుగులు మందు తాగేశాడు. కుటుంబసభ్యులు గమనించి రాజాం సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. భార్య కడగల శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. -
విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని వసతి గృహ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో జేసీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పుల దృష్ట్యా విద్యార్థులపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురికారాదని హితవు పలికారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి అవసరమైన మందులు ఇవ్వాలని పీహెచ్సీ వైద్యులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానంగా వైద్యసిబ్బంది పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఎస్ భాస్కరరావు, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి -
యోగా పోటీల్లో ఏఆర్ కానిస్టేబుల్కు కాంస్య పతకం
పార్వతీపురం రూరల్: అమరావతిలోని విట్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరిగిన 2వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ ఆర్టిస్టిక్ యోగా పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఏఆర్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ వై. మధుబాల అద్భుత ప్రతిభ కనబరిచారు. సీనియర్ మహిళల ‘ఎ’ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొన్న ఆమె, కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి, జిల్లాకు పేరు తెచ్చిన మధుబాలను ఎస్పీ ఘనంగా సత్కరించి, అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్రాన్ని, పోలీసు శాఖ ఖ్యాతిని పెంచేలా విజయాలు సాధించాలని ఎస్పీ ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్ అయిన గది పరిశీలనగుర్ల: మండల కేంద్రంలోని కేజీబీవీ డార్మిటరీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో విద్యార్థులు వినియోగిస్తున్న బెడ్స్ కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షార్ట్ సర్క్యూట్ అయిన గదిని చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు, ఆర్జేడీ భాస్కరరావు బుధవారం పరిశీలించారు. అస్వస్థతకు గురై చికిత్స పొందిన విద్యార్థులను పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గోడలో విద్యుత్ వైర్లు సర్క్యూట్ అవడమే ప్రమాదానికి కారణమని గుర్తించినట్లు ఏసీఓ ఎ.రామారావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాఠశాలలో ఉన్న కార్బన్ డై ఆకై ్సడ్ ట్యాంక్లను వినియోగించాలని అవగాహన కల్పించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు బాలికలను పరామర్శించారు. -
పదహారేళ్లకే పెళ్లి.. పదిహేడేళ్లకే తల్లి
● తక్కువ వయసులోనే గర్భం దాల్చుతున్న బాలికలు ● బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి విజయనగరం ఫోర్ట్: జామి మండలానికి చెందిన ఓ బాలికకు 16 ఏళ్లకే వివాహమైంది. దీంతో అ బాలిక 17ఏళ్లకే తల్లయింది. గంట్యాడ మండలానికి చెందిన బాలికకు 17 ఏళ్లకే వివాహం కాగా 18 ఏళ్లకే తల్లయింది. ఇలా వీరిద్దరే కాదు. అనేక మంది టీనేజ్లో గర్భం దాల్చి ప్రసవిస్తున్నారు. ఆడిపాడే వయసులో పిల్లలను చంకలో ఎత్తుకుని తిప్పుతూ వారిని ఆడించాల్సిన పరిస్థితి. తోటి విద్యార్థులతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో కుటుంబ భారాన్ని మోయాల్సిన దుస్థితి. పిల్ల లను ఏవిధంగా సాకాలో కూడా వారికి తెలియదు. టీనేజ్లో గర్భం దాల్చి తల్లి అవడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నప్పటికీ తక్కువ వయసులో వివాహాలు చేసేయడంతో ఈ పరిస్థితి దాపురిస్తోంది. పెళ్లి గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేక పోయినప్పటికీ పెద్దలు చెప్పారని బాల్య వివాహం చేసుకోవడంతో 16, 17 ఏళ్లకే గర్భం దాల్చుతున్నారు. గర్భస్థ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియవు. ఫలితంగా 17 ఏళ్లు, 18 ఏళ్లకే తల్లులవుతున్నారు. టీనేజ్లో గర్భంతో నష్టాలు టీనేజ్లో గర్భం దాల్చడంతో పాటు తల్లులవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. టీనేజ్లో గర్భం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, పేదరికం వంటి సమస్యలు కూడా వస్తాయి. టీనేజ్లో తల్లి అవడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవిస్తారు. రక్తహీనత, బీపీ వంటి సమస్యలు వస్తాయి. శిశు మరణాలు సంభవిస్తాయి. బిడ్డకు పుట్టకతోనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. టీనేజీలో పెళ్లిళ్లు చేయడం వల్ల చదువు మధ్యలోనే మానివేస్తారు. పుట్టే పిల్లలు తరచూ కామెర్లు, మలేరియా వంటి సమస్యల బారిన పడతారు. జిల్లాలో 142 మంది టీనేజ్లో గర్భిణులు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 142 మంది టీనేజ్ లో గర్భవతులయ్యారు. అదేవిధంగా 71 మంది తల్లులయ్యారు. భోగాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 24 మంది టీనేజ్లో గర్భం దాల్చి 13 మంది తల్లులయ్యారు. గరివిడిలో 22 మంది గర్భం దాల్చగా ఆరుగురు తల్లుల య్యారు. గజపతినగరంలో 18 మంది గర్భం దాల్చగా ఆరుగురు తల్లులయ్యారు. రాజాం 15 మంది గర్భం దాల్చి ఆరుగురు తల్లులయ్యారు. బాడంగిలో 10 మంది గర్భిణులకు 10 మంది తల్లులయ్యారు. వియ్యంపేటలో 12 మంది గర్భం దాల్చి ఏడుగురు తల్లులయ్యారు. చీపురుపల్లిలో 9 మంది గర్భంగా దాల్చగా ఐదుగురు తల్లులయ్యారు. బొబ్బిలిలో ఐదుగురు గర్భం దాల్చి ముగ్గురు తల్లులయ్యారు. గంట్యాడలో ముగ్గురు గర్భం దాల్చగా ఇద్దరు తల్లులయ్యారు. టీనేజ్లో గర్భం వల్ల సమస్యలు టీనేజ్లో గర్భం దాల్చి తల్లులవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. బాల్య వివాహాలు చేయడం వల్లే తక్కువ వయసులో గర్భం దాల్చి తల్లులవుతున్నారు. 18 ఏళ్లు నిండిన వరకు ఆడపిల్లలకు వివాహం చేయకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించాలి
విజయనగరం అర్బన్: ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవిసుభాష్ పట్టంశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. వృద్ధులు, పాతఇళ్లు, పాడు పడిన ఇళ్లల్లో ఉన్నవారిని పునరావాస శిబిరాలకు చేర్పాలన్నారు. తుఫాన్ చర్యలపై టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్షించారు. చెరువు గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు వేయాలన్నారు. నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జిల్లాలోని బొండపల్లి, గజపతినగరం మండలాలలోని కంట్రోల్ రూంలను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం సందర్శించారు. కంట్రోల్ రూంలో విధుల కేటాయింపు, విధుల నిర్వహణలో అలసత్వం చూపుతున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బొండపల్లి, గజపతినగరం మండలాల తహసీల్దార్లు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులైన పట్టు పరిశ్రమ సహాయ సంచాలకుడు, జిల్లా కోపరేటివ్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
అప్రమత్తంగా ఉండాలి
గంట్యాడ: గోస్తనీ నదీ పరివాక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్ సూచించారు. తాటిపూడి గ్రామంలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలశయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. జలాశయం గరిష్ట నీటిమట్టం, ముంపు గ్రామాల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటిని విడుదల చేసే సమయంలో జలాశయం పరిధిలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని కోరారు. ఉద్దేశ పూర్వకంగా అసత్యాలను ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎస్పీ గోవిందరావు, ఎస్బీ సీఐ బి.లీలారావు, రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కంపుకొడుతున్న కలెక్టరేట్
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కలెక్టరేట్ ప్రాంగణంలో కానరావడంలేదు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్న కార్యక్రమం జిల్లాకు వెన్నెముకగా నిలిచే కలెక్టరేట్లో నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 40 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆయా శాఖల కార్యాలయాల్లో జిల్లా అధికారులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐదు వందలకు పైబడి ఉన్నారు. వీరితోపాటు ఆయా శాఖల్లో అధికారులను కలిసేందుకు జిల్లా ప్రజలు ప్రతిరోజూ వస్తుంటారు. విధుల్లో ఉపయోగించే కాగితాల, ప్లాస్టిక్ బాటిళ్లు, పాతఫైళ్లు తదితర వ్యర్థాలను చతురాకార కార్యాలయాల సమూహం మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. వీటిని సకాలంలో తొలగించకపోవడంతో ప్రాంగణం ‘డంపింగ్ యార్డ్’ను తలపిస్తోంది. మరోవైపు కలెక్టరేట్లో ఉన్న అరకొర మరుగుదొడ్లు సిబ్బందికి సరిపడడంలేదు. అత్యవసర వేళ మరుగుదొడ్డికి వెళ్లాలంటేనే ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకుంది. ఇదే విషయంపై కలెక్టరేట్ నిర్వాహక అధికారులు స్పందిస్తూ ప్రాంగణ శుభ్రతపై కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ వాపోయారు. ఇప్పటికే వ్యర్థాలు తొలగించాలని సంబంఽధిత శాఖలకు నోటీసులు ఇచ్చామని, త్వరలో ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేస్తామన్నారు. డంపింగ్ యార్డును తలపిస్తున్న కలెక్టర్ కార్యాలయ పరిసరాలు కలెక్టరేట్లో కానరాని ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ మరుగుదొడ్లు అంతంతమాత్రమే.. అపరిశుభ్రతతో ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు -
పక్షవాతం పట్ల అప్రమత్తం
స్ట్రోక్ లక్షణాలు: ● ఒక్కసారిగా తలనిరుత్తత, నడవలేక పోవడం, తడబడడం ● ఒక్కసారిగా చూపు మసకబారడం ● ముఖం ఒక వైపు వంగిపోవడం, నవ్వలేక పోవడం ● ఒక చెయ్యి బలహీనంగా ఉండడం, లేవలేకపోవడం ● మాటలు అడ్డంగా రావడం, గందరగోళంగా మాట్లాడడంవిజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన యువకుడు సంతోష్ ఉదయం ఇంట్లో మంచంపైనుంచి ఆకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లి సి.టి స్కాన్ చేయగా పక్షవాతం(స్ట్రోక్)కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ● మెంటాడ మండలానికి చెందిన స్వామి నాయుడు అనే 38 ఏళ్లు వ్యక్తికి మూతి వంకర పోయి, చేయి ఎత్తలేక పోవడంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి సి.టి స్కాన్ చేయగా పక్షవాతం బారిన పడినట్లు గుర్తించారు. సమాజంలో స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గతంలో 50, 60 ఏళ్లు దాటిన వారు స్ట్రోక్కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. నేడు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ● స్ట్రోక్పై అవగాహన లేక చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల వ్యాధి తీవ్రమై మృత్యువాత పడతారు. వ్యాధి లక్షణాలు కనపించిన వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తే వైకల్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం వల్ల స్ట్రోక్ బారిన పడే ఆస్కారం ఉంది. గతంలో 50 ఏళ్లుదాటిన వారికి స్ట్రోక్ ప్రస్తుతం స్ట్రోక్ బారిన 20, 30 ఏళ్ల యువత బాధితులను సకాలంలో ఆస్పత్రిలో చేర్చాలి జిల్లాలో ఏడాదికి 2 వేల నుంచి 3వేల మందికి స్ట్రోక్ పొగ, మద్యంతాగడం, ఊబకాయం, బీపీ, సుగర్ వ్యాధుల వల్ల స్ట్రోక్ వచ్చే ఆస్కారంస్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ చెక్ చేసుకుంటూ ఉండాలి మందులు వాడడం మానకూడదు మధుమేహాన్ని (షుగర్)ను నియంత్రణలో ఉంచుకోవాలి ధూమపానం, మద్యం మానివేయాలి పొగతాగడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది మద్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడవడం లేదా వ్యాయమం చేయాలి. దీనివల్ల మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, విశ్రాంతి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. హృదయ సమస్యలను పట్టించుకోవాలి స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి స్ట్రోక్ రావడానికి కారణం: మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ పొగ, మద్యం తాగడం తీవ్రమైన ఒత్తిడి, ఒబెసిటి, కాలుష్యం గర్భనిరోధక మాత్రలు వాడడం గుండెజబ్బులు శారీరక శ్రమ లేక పోవడం -
వైద్యసేవలందక రోగుల అవస్థలు
● నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మెకు 15 రోజులు ● పట్టించుకోని ప్రభుత్వం విజయనగరంఫోర్ట్: ● గంట్యాడ మండలానికి చెందిన ఎస్.సూరమ్మ కంటి సమస్య ఉందని విజయనగరంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కంటి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాం. ఆపరేషన్కు రూ.10 వేలు అవుతాయని చెప్పడంతో డబ్బులు పెట్టి చేయించుకోలేక ఆమె వెనుదిరిగింది. ● విజయనగరం పట్టణానికి చెందిన దేవికి కడుపు నొప్పి రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని చెప్పడంతో డబ్బులు చెల్లించి శస్త్రచికిత్స చేయించుకుంది. ఇలా వీరిద్దరే కాదు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్వైద్య సేవ) సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు సేవలు అందించినందుకు గాను నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడంలో కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రుపాయిలు కూటమి సర్కార్ చెల్లించాల్సి ఉంది. మొద్దునిద్రలో సర్కార్ అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోకుండా మొద్దు నిద్ర నటిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచితంగా వైద్యసేవలు అందక రోగులు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నా కూటమి సర్కార్ పట్టించుకోక పోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. మొదటి సారి రోడ్డెక్కిన నెట్వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర చరిత్రలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రులు తొలిసారి రోడ్డెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు విజయవాడలో ధర్నా నిర్వహించాయి. అయినప్పటికీ కూటమి సర్కార్ సమ్మె విరమింపజేసే ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టిదాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఇంతవరకూ ఎప్పుడూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ధర్నా చేపట్టినా దాఖలాలు లేవు. కానీ కూటమి సర్కార్ హయాంలోనే నెట్వర్క్ ఆస్పత్రులు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరీ ఉచితంగా సేవలు అందించేవి. గుండె జబ్బులు, కేన్సర్ వంటి పెద్ద వ్యాధులకు కూడా ఉచితంగా వైద్యసేవలు అందించేవారు. కానీ కూటమి సర్కార్ హయాంలో రోజుల తరబడి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా పట్టించుకోక పోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే చర్యలు
విజయనగరం క్రైమ్: తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో విజయనగరంలోని తన క్యాంప్ ఆఫీస్లో ఎస్పీ దామోదర్ అత్యవసరంగా మంగళవారం సమావేశమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, వరదముంపు ప్రదేశాల్లో శాఖాపరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. నగరంలోని ట్యాంక్ బండ్ రోడ్డు వద్ద పెద్ద చెరువు నీరు పొంగిపొర్లడంతో దగ్గరుండి ఎస్పీ దామోదర్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. అక్కడే పెట్రోల్ బంకు వద్ద చెరువు నీరు పొంగిపొర్లడంతో వన్టౌన్ స్టేషన్ సిబ్బందిని సహాయ చర్యల నిమిత్తం ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ పై లేనిపోని వదంతులను నమ్మవద్దని హితవు పలికారు. అనుచితమైన, ఆందోళన కలిగించే వార్తలను నమ్మవద్దన్నారు. అలాంటి పనులు చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్ఛరించారు.ఈ పర్యటనలో ఎస్పీ వెంట వన్ టౌన్, టూటౌన్ సీఐలు చౌదరి, శ్రీనివాస్, ఎస్పీ సీఐ లీలారావు పాల్గొన్నారు. -
విలేకరిని గాయపరిచిన ఆటోడ్రైవర్
బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన జాగాన సత్యనారాయణ అనే ఒక దినపత్రిక విలేకరిని (సాక్షికాదు) రామభద్రపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ దిలీప్ కొట్టిగాయపరిచినందున కేసునమోదుచేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. మధ్యాహ్నం సత్యనారాయణ స్వగ్రామం వద్ద మెయిన్రోడ్డు పక్కన ఇద్దరిమధ్య జరిగిన ఘర్షణలో విలేకరి ముఖం భాగాన ఆటోడ్రైవర్ గాయపరచగా స్థానిక సీహెచ్సీలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.బాధితుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
● అమరవీరుల వారోత్సవాల్లో పోలీస్శాఖ రక్తదానశిబిరంపార్వతీపురం రూరల్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం విషయంలో అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని తద్వారా అవసరమైన వారికి ప్రాణదాతలు కావాలని ఎస్పీ ఎస్వీ. మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో మంగళవారం రెడ్క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి సంఘీభావంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులతో పాటు యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల పోలీసుశాఖ తరఫున ఎస్పీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభినందించారు. కార్యక్రమంలో 139మంది రక్తదానం చేయగా 100యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్క్రాస్ సంస్థకు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్రెడ్డి సీఐలు మురళీధర్, రంగనాథం, రెడ్క్రాస్ ప్రతినిధులు, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
వంగర: మండల పరిధిలోని కొండచాకరాపల్లి గ్రామంలో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీధికి రెండు చొప్పున గ్రామంలో ఆరు బెల్టు షాపుల ద్వారా విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషమేమంటే మడ్డువలస ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఉన్న ఈ గ్రామాన్ని వరద నీరు ఎప్పుడు చుట్టుముడుతుందోనని అధికారులు రాత్రింబవళ్లు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామ ప్రజలను ఉన్న బంగారువలస వద్దకు తరలించేందుకు పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇందు కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ గ్రామంలో అధికారులు హడావుడిగా పర్యటనలు సాగిస్తుంటే బెల్టుషాపులు నిర్వహకులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది ప్రజలు నిర్వాహకులపై మండిపడుతున్నారు. అధికారులు కూడా వారి విక్రయాలను చూసీ చూడనట్లు విడిచిపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ఆశ్రమపాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమపాఠశాలను ఎంపీడీవో అర్జునరావు మంగళవారం సందర్శించారు. ‘సమస్యల వసతిలో చదువుల పోరాటం’ బురదలోనే భోజనా నికి..అన్న కథనాలు సాక్షిలో మంగళవారం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో అర్జునరావు ఆశ్రమపాఠశాలను సందర్శించి, మధ్యాహ్నభోజన వంటకాలను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం అనసభద్ర గ్రామం సమీపంలోని ఏకలవ్య పాఠశాలను ఎంపీడీవో సందర్శించి, తుఫాన్ ప్రభావంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు బయటకు వెళ్లరాదని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఇంజినీరింగ్ అధికారి రంజిత్, ఇన్చార్జ్ హెచ్ఎం ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగున్నర గంటలలోగా ఆస్పత్రిలో చేర్చాలి
స్ట్రోక్కు గురైన వ్యక్తిని నాలుగున్నర గంటలలోగా ఆస్పత్రిలో చేర్చినట్లయితే సి.టి స్కాన్ ద్వారా ఏరకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ (రక్తనాళాల్లో గడ్డలు) గా నిర్ధారించిన వారికి ధ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇస్తారు. అవసరమైతే 12 గంటలలోపు క్యాథ్ ల్యాబ్కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలు తొలగిస్తారు. ఈ రకమైన చికిత్స వల్ల రోగికి వైకల్యం రాకుండా చూడగలుగుతారు. స్ట్రోక్కు గురైన వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్కు గురవుతారు. పక్షవాతానికి గురైన రోగులకు రిహ్యాబిలిటేషన్ చాలా ముఖ్యం. కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ ఫిజియోథెరపీ లాంటివి చేయాలి. స్ట్రోక్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల లోగా ఆస్పత్రిలో చేర్చాలి. దీని వల్ల ప్రాణనష్టం, వైకల్యం బారిన పడకుండా చూడవచ్చు. బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి.స్ట్రోక్ తీవ్ర సమస్య అయినప్పటికీ 80 శాతం వరకు నివారించవచ్చు. మద్యం, పొగతాగడం మానుకోవాలి. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయమం చేయాలి. ఆయిల్ ఫుడ్స్, జంక్ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఏడున్నర గంటల పాటు నిద్రపోవాలి. డాక్టర్ ఎస్.వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరోమెడిసిన్ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
రామ కోనేరుకు జలకళ
● గత ప్రభుత్వ హయాంలో కోనేరుకు మరమ్మతులు ● భారీగా నీరు చేరడంతో భక్తులు, స్థానికుల హర్షం ● కోనేరులో స్వామివారి తెప్పోత్సవానికి తీరిన చింతనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన (భాస్కర పుష్కరిణి) రామకోనేరు జలకళ సంతరించుకుంది. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో బోడికొండపై నీరు కోనేరులో చేరి సంతృప్తికర స్థాయిలో నిండింది. పక్కనే ఉన్న చెరువు నిండి కోనేరులోకి వరద నీరు ప్రవహిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చొరవతో సుమారు రూ.75లక్షల నిధులు వెచ్చించి రామకోనేరుకు మరమ్మతులు చేయించారు. రెండు కొత్త ఘాట్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం నీరు దీర్ఘకాలంగా నిల్వ ఉండేందుకు కోనేరును భారీగా లోతు కూడా చేయించారు. నిన్న, మొన్నటిదాకా కోనేరులో నీరు ఉన్నప్పటికీ అధిక లోతు కారణంగా నీటి మట్టం అంతంతమాత్రంగానే ఉండేది. తాజాగా కురుస్తున్న వర్షాలకు బోడికొండపై వర్షం నీరు నేరుగా కోనేరులోకి ప్రవహించడంతో రామ పుష్కరిణికి జలకళ సంతరించుకుంది. ఏటా రామతీర్థంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఎప్పటినుంచో ఆనవాయితీ. కోనేరులో సంతృప్తికర స్థాయిలో నీరు లేకపోవడంతో తెప్పోత్సవాన్ని నిర్వహించకుండా కోనేరు వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. తాజాగా కోనేరులో నీరు పుష్కలంగా చేరడంతో వచ్చే ఆదివారం రామ కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామతీర్థం కోనేరులో మూడు ఘాట్ ల వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. కోనేరును ఆనుకుని పిచ్చిమొక్కలు, చెట్లు దట్టంగా అలుముకున్నాయి. ప్రధాన ఘాట్ వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది. కోనేరులో అపరిశుభ్ర వాతావరణ నెలకొందని, సంబంధిత అధికారులు స్పందించి కోనేరు పరిసరాలను బాగు చేయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
విజయనగరం టౌన్: ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో నిర్వహించిన యోగా పోటీల్లో 18–14 సంవత్సరాల విభాగంలో జిల్లాకు చెందిన వై.దినేష్ కార్తికేయ రాష్ట్రంలో ప్రథమ స్ధానంలోను, 30–40 ఏళ్ల విభాగంలో శివకుమార్ ద్వితీయస్ధానం సంపాదించుకున్నారని, యోగా అసోసియేషన్ అధ్యక్ష్యుడు బూర్లె శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్ధాయిలో ప్రతిభ కనబర్చిన దినేష్, శివలు డిసెంబరు 27,28,29 తేదీల్లో గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించే జాతీయస్థాయి యోగాపోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా ఉపాధ్యాయులు, బి.సన్యాసిరావు, ఎన్.పైడిరాజు, ఎస్.రవివర్మ, సంతోష భారతిలు విజేతలకు అభినందనలు తెలిపారు. -
‘జియో’ రామకృష్ణకు స్వర్ణం
శృంగవరపుకోట: కొన్నేళ్లుగా యోగాలో సాధన చేస్తున్న ‘జియో’ వ్యవస్థాపకుడు బొబ్బిలి రామకృష్ణ యోగాలో స్వర్ణపతకం సాధించారు. విశాఖలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా అసోసియేషన్ 38వ యోగాసన చాంపియన్షిప్ పోటీలు ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్.కోట పట్టణానికి చెందిన యోగా శిక్షకుడు బొబ్బిలి రామకృష్ణ 50–60 విభాగంలో ఉత్తమ ప్రతిభ చాటారు. దీంతో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదాయపు పన్నుశాఖ జాయింట్ కమిషనర్ కె.ప్రసాద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. సబ్జూనియర్స్ విభాగంలో బి.హృషీకేశ్, బి.లాస్యశ్రీలు ప్రతిభ చూపారు. వారికి ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్, కార్యదర్శి మృణాల్చక్రవర్తి, ఏపీ యోగా అసోసియేషన్ చైర్మన్ కె.హరినాఽథ్రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు కోన కృష్ణదేవరాయలు, ఎ.రవికుమార్, విశాఖపట్నం యోగా అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఏ రాజు, సీహెచ్వీ రమేష్, బి.సన్యాసిరావు తదితరులు పతకాలు, ప్రశంసాపత్రాలు అందచేశారు. -
జిల్లాకు జ్వరమొచ్చింది..!
జ్వరాల నియంత్రణకు చర్యలు గ్రామాల్లో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా మలేరియా, డెంగీ పరీక్షలు చేయిస్తున్నాం. ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైన వారిని రిఫర్ చేస్తున్నాం. రెండు, మూడు రోజులు జ్వరం తగ్గకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు చికిత్స అందుబాటులో ఉంది. – డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓవిజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన డి.రమణ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఇన్పేషేంట్గా చేర్చుకుని చికిత్స అందించారు. ఆరురోజుల పాటు చికిత్స అందించి రూ.60 వేలు బిల్లు వేశారు. ● ఇదే మండలానికి చెందిన ఎస్.కృష్ణకు జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా వైరల్ ఫీవర్ అని నిర్ధారణ అయింది. ప్లేట్లెట్స్ 24 కు తగ్గిపోయాయి. దీంతో వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ● విజయనగరం పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కి జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా అని నిర్ధారణ అయింది. ఇలా వీరే కాదు. అనేక మందిజ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్తో పాటు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్న జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటాలాడుతున్నాయి. గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో మలేరియా కేసులు గిరిజన ప్రాంతంలో ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పడు మైదాన ప్రాంతాల్లోనూ అధికంగా నమోదువుతున్నాయి. జిల్లాలో గిరిజన ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికీ కేసులు అధికంగా నమాదవుతుండడం గమనార్హం. అక్టోబర్ 12వతేదీ నాటికి జిల్లాలో 338 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా డెంగీ కేసులు 65 నమోదయ్యాయి. వైరల్ ఫీవర్స్ 2,91,572 కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసులు 650 వరకు నమోదయ్యాయి. అయితే వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జ్వరపీడితులు వివరాలు ఇవి. జిల్లాలో 50 పీహెచ్సీలు, 8 సీహెచ్సీలు, 18 పట్టణ పీహెచ్సీలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లాలో 300వరకు ఉన్నాయి. వాటిలో వైరల్ ఫీవర్ కేసులు 2 లక్షలు వరకు నమోదయ్యాయి. తగ్గిపోతున్న ప్లేట్లెట్స్ జ్వరపీడితులకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. గతంతో డెంగీ, మలేరియా కేసులకు ప్లేట్లెట్స్ తగ్గిపోయేవి. కానీ ప్రస్తుతం సాధారణ వైరల్ ఫీవర్కు కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీంతో జ్వరం వచ్చిందంటే చాలు హడలిపోతున్నారు.ప్లేట్లెట్స్ కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. అధిక మొత్తంలో ఫీజుల వసూలు జ్వర పీడితులకు ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జ్వరం వచ్చిందంటే చాలు జేబు గుల్ల చేసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా, డెంగీ కేసులకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్ కేసులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా, డెంగీ కేసులకు ఆరోగ్యశ్రీ వర్తించేది. అయితే కొద్ది రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచి పోవడంతో రోగులు డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు వైరల్ జ్వరాలు 2,91,572 నమోదు బాధితులకు పడిపోతున్న ప్లేట్లెట్స్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక మొత్తంలో ఫీజుల వసూలు -
జూడో పోటీల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్కు రజతం
● అభినందించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ పోటీల్లో రజత పథకం సాధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బీఎస్ఎన్ మూర్తిని ఎస్పీ దామోదర్ సోమవారం అభినందించారు. ఇటీవల శ్రీనగర్లో జరిగిన 10వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ 2025, 26 పోటీల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ రజత పతకం సాధించాడు. ఈ మేరకు తన చాంబర్కు మూర్తిని పిలిపించి ఎస్పీ మాట్లాడుతూ మూర్తి రజత పతకం సాధించి జిల్లాకు, పోలీస్ శాఖకు వన్నె తెచ్చారని ప్రశింసించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మూర్తిని ఎస్పీ అభినందించి, ఆయన క్రీడా ప్రతిభను ప్రశంసించారు. త్వరలో జీఎస్ఈ అందిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే తనకు పంపాలని ట్రాఫిక్ సీఐ సూరి నాయుడును ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. -
పారదర్శకమైన ఓటర్ల జాబితాకు సహకరించాలి
● డీఆర్ఓ కె.హేమలత పార్వతీపురం రూరల్: జిల్లాలో నాణ్యమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. స్పష్టమైన జాబితా తయారీకి బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి నెలా మొదటి వారంలో తప్పనిసరిగా జరిగే డీఈఓ/ఈఆర్ఓ సమావేశాలలో పాల్గొని సూచనలు ఇవ్వాలని ఆమె పార్టీ ప్రతినిధులను కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఏడు రోజులు దాటిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను రోజువారీగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారని డీఆర్ఓ గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఇప్పటివరకు స్వీకరించిన 6,933 దరఖాస్తులలో, 5,969 ఈ–రోల్ కాగా, కేవలం 165 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 799 దరఖాస్తులు చట్టపరమైన కారణాలతో తిరస్కరించినట్లు వివరాలు అందించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తుఫాన్పై అధికారులతో మంత్రి సమీక్ష
విజయనగరం అర్బన్: మోంథా తుఫాన్ను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తుఫాను కంట్రోల్ రూంను సందర్శించారు. తుఫాన్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరగకుండా రైతులకు తగిన జాగ్రత్తలను తెలియపరచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తాగునీరు,పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మంత్రి ఆదేశించారు. తుఫాన్ వల్ల జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా తీసుకున్న చర్యలను మంత్రికి ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, డీపీఓ రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐరాస సదస్సుకు ఆహ్వానంబొబ్బిలి: డీబీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబుకు దోహాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించే రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల తరువాత సామాజిక అభివృద్ధి సదస్సును నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు తనకు ఆహ్వాన లేఖను పంపారని తెలిపారు. నవంబర్ 4 నుంచి 6 వరకూ జరిగే ఈ సదస్సుకు తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. కాగా చిట్టిబాబు గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పలు సదస్సులు, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సామాజిక అంశాలపైన తన గళం వినిపించారు. ఆయన స్వస్థలం బొబ్బిలి మండలంలోని రంగరాయపురం.గాయపడిన వృద్ధుడి మృతినెల్లిమర్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న నెల్లిమర్లలోని బైరెడ్డి వీధికి చెందిన వృద్ధుడు గిడుతూరి అప్పలనారాయణ (70) సోమవారం వేకువజామున మృతిచెందాడు. ఈ నెల 19న నెల్లిమర్లలో రోడ్డు దాటుతుండగా గుర్ల మండలానికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్తో వస్తూ అప్పలనారాయణను ఢీ కొట్టాడు. దీంతో గాయపడిన అప్పలనారాయణను కుటుంబసభ్యులు తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేజీహెచ్లో చేర్చారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీ మృతికశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీ మృతి చెందినట్లు సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..బయ్యవరం వద్ద పరిశ్రమలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు నడిచి వస్తుండగా, ఆదివారం సాయంత్రం యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో వారు గాయపడ్డారు. ఇద్దరిలో తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లా మర్రివలస గ్రామానికి చెందిన పరమేష్ (52)కు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత చికిత్స కోసం విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పరమేష్ బయ్యవరంలోని ఒక ప్రైవేట్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
వంగర: మండల పరిధి కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన రైతు పారిశర్ల వెంకటరమణ(49) సోమవారం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తన పొలంలో నిలువ నీటిని తొలగించేందుకు మడి వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామానికి చెందిన మహిళా రైతు కోల అప్పన్నమ్మ ముందు వైపు నడుస్తూ గ్రామం వైపు వస్తోంది. ఆమె వెనుక భాగంగా నడుచుకుంటూ ఇంటి వైపు వెంకటరమణ వస్తున్నాడు. ఆ సమయంలో భారీ వర్షంతోపాటు గాలులు వీయడంతో విద్యుత్ లైన్ గాలికి తెగిపడింది. అది గమనించిన ఆ మహిళా రైతు తప్పించుకుని వెళ్లిపోయింది. విద్యుత్ లైన్ తెగిపడిందని అక్కడే ఉన్న రైతు వెంకటరమణకు కేకలు వేసి చెప్పినప్పటికీ వర్షం కారణంగా గమనించలేదు. వ్యవసాయ పంపుసెట్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ పొలంలో తెగిపడడంతో గమనించని రైతు వెంకటరమణ కాలికి విద్యుత్ వైరు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని భోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పిన్నింటి రామారావు, ఎంపీడీవో రాజారావు, విద్యుత్ శాఖ ఏఈ వి.సాంబశివరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనను కలెక్టర్కు వివరించామని తహసీల్దార్ తెలిపారు. అనంతరం భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
● 122 కొత్త కేంద్రాల ప్రతిపాదన ● డీఆర్ఓ శ్రీనివాసమూర్తివిజయనగరం అర్బన్: భారత ఎన్నికల సంఘం జూన్ 16న జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 1,200కు పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని ఈఆర్ఓలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించిన అనంతరం 23 పోలింగ్ కేంద్రాల స్థానాల మార్పు, 51 కేంద్రాల పేరు మార్పు, 122 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను భారత ఎన్నిక సంఘానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ గుర్తింపు పొందిన బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు అందజేయాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ ప్రమీల గాంధీ, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, సహాయ ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరం
విజయనగరం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు సోమవారం ప్రారంబించారు. పీటీసీ ఏర్పాటు చేసిన ఈ రర్తదాన శిబిరంలో కళాశాల సిబ్బంది రక్తం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామచంద్రరాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. పోలీసులంటే సేవకు, త్యాగానికి ప్రతీక అని తెలియజేస్తూ రక్తదానం కూడా ఆ సేవలో అతి ముఖ్యమైన భాగమని దీని ద్వారా కొందరి ప్రాణాలను కాపాడగలమని ప్రిన్సిపాల్ అన్నారు. ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కళాశాలలో శిక్షకులకు తర్ఫీదు ఇస్తున్న డి.శంకర్, కె.శ్రీరాములు, కె.మురళీమోహన్, జి.మురళి, ఆర్ఐలు, ఆర్.వాసుదేవ్, డి.విజయకూమార్, కె.హేమంత్ కూమార్, ఎస్సైలు బి.దివాకర్, కె.రమేష్, సీహెచ్ సత్తిబాబు, ముగ్గురు హోంగార్డ్స్ తమ రక్తాన్ని ఇచ్చారు. -
ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలి
● సబ్కలెక్టర్లకు స్పష్టం చేసిన జిల్లా ప్రత్యేకాధికారిపార్వతీపురం రూరల్: ‘మోంథా’ తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ, ఎంత చిన్న సమస్య తలెత్తినా తక్షణం తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కలెక్టర్లు మంగళవారమే ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, ముందస్తు చర్యలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ అధికారి మూడు రోజులపాటు ఒక్కచోటే ఉండి సమన్వయంతో పనిచేయాలని, రహదారులపై చెట్లు విరిగిపడితే తక్షణం తొలగించాలని, అసలు చెట్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చెట్లు పడి విద్యుత్ తీగలు తెగాయన్న మాటే వినపడకూడదని ఆదేశించారు. గంటగంటకూ నివేదిక క్షేత్రస్థాయిలో ఏ చర్యలు తీసుకున్నా, ఏం జరిగినా వెంటనే గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలని, ప్రతి గంటకూ సమాచారం అందించాలని కలెక్టర్ను కోరారు. పంటనష్టం జరగకుండా వరి పొలాల్లోకి వచ్చిన వరద నీటిని వెంటనే వదిలేయాలని రైతులకు తెలియజేయాలన్నారు. పురాతన, శిథిల భవనాలను గుర్తించి, అక్కడ ఎవరూ ఉండకుండా చూడాలని, సిబ్బంది విధి నిర్వహణ ప్రదేశంలోనే ఉండాలని, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సచివాలయాల్లో మహిళా పోలీసులు అందుబాటులో ఉండాలని, వసతి గృహాల్లోని విద్యార్థులను తుపాను ప్రభావం తగ్గే వరకు బయటకు రానివ్వరాదని ప్రత్యేక అధికారి సూచించారు. సమావేశంలో డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వీడని గజరాజుల బెడద
కొమరాడ: ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు కదిలించరని, కూటమి ప్రభుత్వం కనీసం స్పందించంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట, ఆర్తాం అటవీప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు స్వామినాయుడువలస, కందివలస, గంగరేగువలస తదితర గ్రామాల్లో కూరగాయల సాగు ఉండడంతో రైతులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చిన సమయంలో ఏ సమయంలో ఏనుగులు గుంపు వచ్చి ధ్వంసం చేస్తుందోసని ఈ ప్రాంత రైతులు భీతిల్లుతున్నారు. ఓ వైపు తుఫాన్, మరో వైపు ఏనుగుల సంచారంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. అలాగే వరిచేను కోతలు కావడంతో రైతుల పొలాల్లో ఏనుగులు సంచరిస్తే ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుందో నని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించే చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అలాగే రైతులు పంట పొలాల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు 4వ తేదీకి వాయిదా
● మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలి ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న వైస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీలను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా వేసినట్లు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసినట్టు స్పష్టంచేశారు. పారాది బ్రిడ్జివద్ద రాకపోకలు క్రమబద్ధీకరణ బొబ్బిలిరూరల్: పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన కాజ్వే వరదనీటిలో మునిగిపోగా, పాత బ్రిడ్జిపై నుంచే బస్సులు, చిన్నచిన్న వాహనాలను విడిచిపెడుతున్నారు. ఆదివారం రాత్రి బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై మరమ్మతులకు గురై నిలిచిపోయిన లారీని క్రేన్ సహాయంతో పక్కకు పెట్టారు. బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలకు అనుమతించేదిలేదని సీఐ సతీష్కుమార్, ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. -
హెల్ప్డెస్క్ నంబర్లు ఇవే..
విజయనగరం: 08922–221202 బొబ్బిలి: 0891–2883323, 2883325 శ్రీకాకుళం రోడ్: 08942–286213, 286245 విశాఖపట్టణం: 0891–2746330, 2744619 దువ్వాడ: 0891–2883456 రాయగడ: 0891–2885744, 288755 నౌపడ: 0891–2885937 అరకు: 08936 – 249832 కోరాపుట్: 0891–2884318, 2884319 జగదల్పూర్: 0891 – 2884714, 2884715 -
మోంథా ముప్పు..!
పూసపాటిరేగ/భోగాపురం: మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల గాలులు వీయడంతో వరిచేలు నేలకొరిగాయి. నూర్పిడిచేసిన మొక్కజొన్న, అమ్మకానికి సిద్ధంచేసిన పత్తి పంటలను రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో రాశులుగా పోసి టార్పాలిన్లు కప్పుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పలు రైళ్లను ఆ శాఖ అధికారులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూసపాటిరేగ, భోగాపురం తీరంలోని సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతపల్లి రేవులో 20 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. తీరం ఒడ్డున ఉన్న వలలు, బోట్లను ట్రాక్టర్ల సహాయంతో మత్స్యకారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. చింతపల్లిలో తీరంలో గెడ్డ వద్ద సముద్రం కోతకు గురయింది. తిప్పలవలస, తమ్మయ్యపాలెం గ్రామాలను అలలు తాకుతున్నాయి. కలెక్టర్ రాంసుందర్రెడ్డి, ఎస్పీ దామోధర్తో పాటు పలువురు అధికారులు తీరప్రాంతంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. విజయనగరం టౌన్: మొంథా తుఫాన్ ఎఫెక్ట్ రైల్వేశాఖపై పడింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటిని దారిమళ్లించినట్లు ఈస్ట్కోస్ట్ రైల్వే సోమవారం ప్రకటించింది. ప్రయాణికులకు తక్షణ సమాచారం కోసం ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ తదితర రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్లను ఏర్పాటుచేసింది. రద్దయిన రైళ్ల వివరాలు.. రైలు నంబర్ 18515/516 విశాఖ–కిరండోల్ ఎక్స్ప్రెస్తో పాటు 58501/502 కిరండోల్–విశాఖ ప్యాసింజర్ను రద్దుచేసింది. 58538/537 విశాఖ–కోరాపుట్–విశాఖ, 18512/511 విశాఖ–కోరాపుట్–విశాఖ ఎక్స్ప్రెస్, 18526/525 విశాఖ–బరంపురం–విశాఖ ఎక్స్ప్రెస్, 67289/290 విశాఖ–పలాస మెమూ–విశాఖ, 67287/288 విశాఖ–విజయనగరం–విశాఖ మెమూ, 68433/434 కటక్–గుణుపూర్–కటక్ మెమూ, 58531/532 బరంపురం–విశాఖ–బరంపురం ప్యాసింజర్, 58506/505 విశాఖ–గుణుపూర్–విశాఖ ప్యాసింజర్, 18463 భువనేశ్వర్–కెఎస్ఆర్ బెంగుళూర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్, 17015 భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్, 20851 భువనేశ్వర్–పుదుచ్చేరి వీక్లీను ఈ నెల 28న రద్దుచేశారు. రైలు నంబర్ 18189 టాటానగర్, ఎర్నాకులం ఎక్స్ప్రెస్ను టిట్లాఘర్, రాయమోంథా ఎఫెక్ట్ జిల్లాలో వర్షాల జోరు చింతపల్లి తీరంలో 20 అడుగులు ముందుకొచ్చిన సంద్రం వలలు, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మత్స్యకారులు ప్రాజెక్టుల వద్ద అప్రమత్తం పలు రైళ్ల రద్దు సముద్ర, నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు తీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ పూర్, నాగపూర్, బల్లార్ష మీదుగా డైవర్ట్ చేశారు. 18447 భువనేశ్వర్–జగదల్పూర్ హీరాఖండ్ రాయగడ వరకు, 18107 రూర్కెల్లా–జగదల్పూర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను రాయగడ వద్ద షార్ట్ టెర్మినేట్ చేశారు. ప్రయాణికులు తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు హెల్ప్డెస్క్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు కోరారు. నదిలోకి మడ్డువల నీరు వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో 63.72 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. తుఫాన్ వర్షాలకు వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుండగా ఒక గేటు ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. -
శిథిల భవనాలు.. అధ్వానంగా ఉన్న పరిసరాలు.. నేలపైనే భోజనాలు.. అరకొర మరుగుదొడ్లు... మూలకు చేరిన ఆర్వోప్లాంట్లు.. మెస్లు లేని కిటికీలు, తలుపులు.. అరకొర మంచాలు వెరసి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు సమస్యల సుడిలో చదువులు సాగించాల్సిన దుస్థితి. ఇటీవల వందల సంఖ్యలో విద
సమస్యల ‘వసతి’లో..చదువుల పోరాటం! మక్కువ/సాలూరు రూరల్: తినేందుకు భోజనశాల ఉండదు.. ఎండైనా వానైనా ఆరుబయట, వరండాల్లో భోజనం చేయాల్సిందే. అనారోగ్యానికి గురైతే అందుబాటులో ఏఎన్ఎం ఉండరు. ప్రాథమిక వైద్యం కోసం కూడా ఆస్పత్రులకు పరుగుతీయాల్సిందే. దోమలు దాడిచేస్తున్నా హాస్టల్ కిటికీలు, డోర్లకు మెస్లు కానరావు. మెస్లు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకునేవారు ఉండరు. దోమతెరలు పంపిణీ చేయరు. స్వచ్ఛమైన తాగునీరు అందడం గగనమే. కళ్లముందే ఆర్వోప్లాంట్ మూలకు చేరినా బాగుచేయరు. మరుగుదొడ్లు సరిపడక ప్రతిరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరు. వసతిగృహ పరిసరాలు అధ్వానంగా తయారైనా బాగుచేసేవారే ఉండరు. ఫలితం.. వసతిగృహ విద్యార్థులు సమస్యల నడుమ చదువులు సాగిస్తున్నారు. బంగారు భవిత కోసం తల్లిదండ్రులను విడిచి సుదూర ప్రాంతాల్లోని వసతిగృహాల్లో చేరి అనారోగ్యం పాలవుతున్నారు. మరికొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా విద్యార్థులు మరణిస్తున్నా ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించేందుకు చర్యలు కానరావడం లేదని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అరకొర మంచాలు.. నేలపైనే నిద్ర.. మక్కువ మండలంలోని పనసబద్ర పంచాయతీ ఎర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 350 మంది గిరిజన విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. వీరికి సరిపడా మంచాలు, పరుపులు లేవు. చాలామంది విద్యార్థులు నేలపైనే నిద్రపోవాల్సిన పరిస్థితి. డైనింగ్ హాల్లేక నేలపైనే భోజనాలు చేస్తున్నారు. వసతిగృహంలో కనీస సదుపాయాలు లేవంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరుగుదొడ్లకు తలపులు లేకపోయినా పట్టించుకునేవారే కరువయ్యారని వాపోతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్వో ప్లాంట్ మూలకు చేరడంతో కొన్నిసార్లు కాచిచల్లార్చిన నీటిని అందిస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, మంత్రి సంధ్యారాణి స్పందించి వసతిగృహానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవిస్తున్నారు. అన్ని పనులూ విద్యార్థులే... గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలోని గిరిజన బాలబాలికల ఆశ్రమ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. సాలూరు మండలంలో ఆరు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలోను మౌలిక వసతుల సమస్య ఉంది. ● తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 400 మందికి పైబడి విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ డైనింగ్ హాల్ లేదు. పాడుబడిన భవనంలోనే వీరు భోజనాలు చేస్తున్నారు. మావుడి ఆశ్రమ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. నిత్యం ఇక్కడి పాఠశాల విద్యార్థులే తమకు తాము వడ్డించుకోవడం పరిపాటిగా మారింది. ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజు ఆరుబయట చెట్టు కింద భోజనాలు చేయాల్సిన దుస్థితి. అంటివల ఆశ్రమ పాఠశాలలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కొత్తవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో అత్యధికంగా 660 మంది పిల్లలు ఉన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలకు గత ప్రభుత్వం డైనింగ్ హాల్ మంజూరు చేసింది. నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ● మామిడిపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరీ విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ 180 మంది వసతిగృహాల్లో సమస్యల కొలువు నేలపైనే భోజనాలు మరమ్మతులకు నోచుకోని మరుగుదొడ్లు మూలకు చేరిన ఆర్వోప్లాంట్లు సమస్యలతో సతమతమవుతున్న ఆశ్రమపాఠశాలల విద్యార్థులు బాలికలు చదువుతున్నారు. రేకులు షెడ్డులోనే పిల్లలు చదువుకోవడంతో పాటు రాత్రిపూట డార్మెటరీగా వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా మరుగుదొడ్లు సరిపడినన్ని లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సువర్ణముఖి నది ఒడ్డున ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే వారికి సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ప్ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్అన్నారు. ఈ మేరకు పట్టణంలోని జొన్నగుడ్డి రోడ్డులో నూతనంగా నిర్మించిన సుఖీభవ హాస్పిటల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు. ఆధునాతన వైద్య పరిజ్ఞానంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ఆపదలో ఉన్న రోగులకు చికిత్స అందించేటప్పడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రి ఎం.డి పీఎస్వీ రామారావు మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగికి ఇష్టమైన వైద్యుడు వచ్చి చికిత్స అందించవచ్చన్నారు. అదేవిధంగా అతి తక్కువ రేడియేషన్ పరికరాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఆస్పత్రిలో ఐసీయు, సీఐసీయూ, ఐఎంసీయు, హెచ్డీఐసీయు, పోస్టు ఆపరేటివ్ ఐసీయు, కేథల్యాబ్, కేథల్యాబ్ ఐసీయూ, డయాలసిస్ యూనిట్, సిటిస్కాన్ సేవలు అందబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు, సుఖీభవ హాస్పల్ల్ డైరెక్టర్స్ డాక్టర్ పి.వి.శివరామ్, డాక్టర్ జె.శ్రీకాంత్, డాక్టర్ ఎ, శరత్ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో లైబ్రేరియన్ మృతి
● సంతాపం తెలియజేసిన గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్సీతానగరం: మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం లైబ్రేరియన్ కేతిరెడ్డి రామలక్ష్మి(53)గుండెపోటుకు గురై మృతి చెందడం దురదృష్టకరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ మాణిక్యమ్మ అన్నారు. అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురైన కేతిరెడ్డి రామలక్ష్మి కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. లైబ్రేరియన్ రామలక్ష్మి విద్యాలయంలో అస్తస్థతకు గురై విధి నిర్వహణలో కుప్పకూలిపోయినట్లు తెలియగానే వచ్చిన జిల్లా కోఆర్డినేటర్ మాణిక్యమ్మ ప్రిన్సిపాల్ రాజారావు తక్షణం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామలక్ష్మి మృతదేహానికి స్వగ్రామం బక్కుపేటలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కేతిరెడ్డి రామలక్ష్మి, రామకృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్దకుమారుడు గుర్గాంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా చిన్నకుమారుడు నాగ్పూర్ ఎన్ఐటీలో నాలుగవ సంవత్సరం చదువున్నాడు. -
మరోవైపు ఆహ్లాదం
ఓవైపు ఆధ్యాత్మికం..భక్తుల తాకిడి ఎక్కువ కార్తీకమాసంలో ముక్తిధాం, షిర్డీసాయి క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న ధ్యానమందిరంలో కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఈ ప్రాంతం పిక్నిక్లకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది వస్తుంటారు. చింతపల్లిబీచ్ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. – పతివాడ భాస్కరరావు, పతివాడపూసపాటిరేగ: మనుసుకు ఉల్లాసాన్ని ఇచ్చే సముద్రతీరం..ఆహ్లాదకర వాతావరణం నడుమ ముక్తిధాం క్షేత్రం కొలువై ఉంది. కొబ్బరి, సరుగుగుడు తోటల మధ్య పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న గోవిందపురం ముక్తిధాం క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. ఈక్షేత్రానికి సమీ పంలో నక్కానపేట షిర్డీసాయి నగర్లో రాష్ట్రంలోనే ఎత్తైన షిర్డీసాయి మహాస్థూపం, అలాగే సహజ సౌందర్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులు మది దోచే చింతపల్లిబీచ్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ముక్తిధాం క్షేత్రం, చింతపల్లిబీచ్, సముద్రంలో నిర్మించే తిరుమల ఫ్యూజిటెక్ వంతెన, నక్కానపేటలో షిర్డీసాయి మహాస్థూపం చూడడానికి ఏటా కార్తీకమాసంలో వస్తుంటారు. విజయనగరం నుంచి వచ్చే పర్యాటకులకు 35 కిలో మీటర్లు..పూసపాటిరేగ నుంచి వచ్చే పర్యాటకులకు 15 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకులకు 62 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి వచ్చే పర్యాటకులకు 55 కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. గోవిందపురం గ్రామం సమీపంలో 1991లో పోతినిండి కనకదుర్గమ్మ ముక్తిధాం క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించిన గీతామందిరంలో కొంత సేపు సేద దీరితే మనసు ఆధ్యాత్మిక భావంతో పులకించి పోతుందని భక్తులు చెబుతుంటారు. గీతామందిరం చుట్టూ రామాయణ, మహాభారత ఘట్టాలు చూపరులను కట్టిపడేస్తాయి. పాండవుల చరిత్ర, నందివిగ్రహం, దేవతామూర్తుల ఆలయాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. రాష్ట్రంలో ఎత్తైన స్థూపం గోవిందపురం రహదారిలో గల నక్కానపేట సమీపంలో రాష్ట్రంలో ఎత్తైన 141 అడుగుల షిర్డీసాయి మహాస్థూపం భక్తులను ఆకట్టుకుంటోంది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు షిర్డీసాయి ఆలయం, షిర్డీసాయి మహాస్థూపాన్ని దర్శించుకుంటారు. ఆహ్లాదపరిచే బీచ్ చింతపల్లి తీరంలో బీచ్ పర్యాటకులను కనువిందు చేస్తుంది. బీచ్లో హోయలొలికించే అందాలు ఆకట్టుకుంటాయి. బ్రిటిష్ కాలం నాటి లైట్హౌస్, సముద్రంలో నిర్మించిన తిరుమల ఫ్యూజిటెక్ వంతెన ఆకర్షణగా నిలుస్తాయి. ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే రిసార్ట్స్, హోటల్స్ నిర్మించినప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. చింతపల్లితీరం పర్యాటకులను కట్టిపడేస్తుంది. కార్తీకమాసం పిక్నిక్ సీజన్ కావడంతో వేలాదిమంది పర్యాటకులతో సందడిగా ఉంటుంది.చివరిదశలో చింతపల్లిలో నిర్మాణాలు చింతపల్లితీరంలో పర్యాటకుల కోసం నిర్మించిన రిసార్ట్స్, విశ్రాంతి గదులకు మరమ్మతులు జరుగుతున్నాయి. వాటి చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. చింతపల్లిప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. – కె. కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయనగరం పర్యాటకులకు పవిత్రం ముక్తిధాం క్షేత్రం చింతపల్లిలో ఆహ్లాదకరమైన సముద్ర తీరం నక్కానపేటలో షిర్డీసాయి మహాస్థూపం -
అండర్–15 చెస్ పోటీలకు స్పందన
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 15 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన రోలింగ్ ట్రోఫీ చెస్ పోటీలకు స్పందన లభించింది. నగరంలోని రింగ్రోడ్లో గల ఫైర్చెస్ స్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరుకాగా ..డాక్టర్ బీసెంట్ స్కూల్ విద్యార్థి ఎ.పరమేష్ ప్రథమ బహుమతి, గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అనురాగ్ విశ్వాస్ కె. ద్వితీయ బహుమతి, కేంద్రియ విద్యాలయ విద్యార్థులు ఎ.జిగ్నేష్, శ్రీమన్నారాయణ సాహు, కె. సోమనాథ్ 3,4,5వ బహుమతులు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్కు కేవీ జ్వాలాముఖి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా విజయనగరంలో నిర్వహించిన చెస్ థియరీ పరీక్షలో సుమారు 45 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు త్వరలో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కేకే జగన్నాథ్, కార్యదర్శి కరణం భాస్కరరావులు తెలిపారు. -
బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం
రామభద్రపురం: సరిగ్గా శనివారం రాత్రి 11.45 గంటల సమయం. కొందరు నిద్రలో ఉన్నారు. మరికొందరు నిద్రలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు పనుల నిమిత్తం వెళ్లిన వారు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంతలో రామభద్రపురం మండలకేంద్రంలోని సాలూరు వెళ్లే బైపాస్ రోడ్డులో పొట్టావాని కొనేరు సమీపంలో ఎగిసి పడుతున్న అగ్నికీలలు. కళ్ల ముందు భయానక వాతావరణం, ఏం జరుగుతోందో తెలీదు. లారీలో ఎందుకు మంటలు చేలరేగు తున్నాయో అర్థం కాని పరిస్థితి. గ్రామంలోని చుట్టుపక్కల నివాసాలకు చెందిన కొంతమంది యువకులు పరిగెత్తుకు వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి గాయాలతో రోడ్డు పక్కనపడి ఉండడం,లారీ దగ్ధం కావడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. లారీలో ఎవరైనా ఉన్నారా?ఉన్నవారికి ఏమైనా ప్రమాదం జిరిగిందా అని భయపడ్డారు. లారీ డ్రైవర్ దూకేశాడు. అందులో ఎవరు లేరనేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఆ యువకులు పోలీసులకు, బాడంగి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలియడంతో రాత్రి పెట్రోలింగ్లో ఉన్న ఎస్సై వి.ప్రసాదరావు చేరుకుని ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. స్థానిక యువకులు, ఎస్సై కలిసి రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ప్రథమ చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఆదివారం మరోసారి దగ్ధమైన లారీని పరిశీలించిన ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తుని నుంచి ఒడిశా వెళ్తున్న మినీ లారీ పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు మద్యం మత్తులో రామభద్రపురం మీదుగా తన అత్తవారి ఇంటికి బాడంగి మండలం రౌతువానివలస శనివారం రాత్రి వెళ్తున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మినీ లారీ తుని నుంచి గోగునారతో తయారు చేసిన గోనె సంచుల లోడుతో మితిమీరిన వేగంతో రామభద్రపురం బైపాస్ రోడ్డు మీదుగా ఒడిశాకు వెళ్తోంది. సరిగ్గా పొట్టావాని కోనేరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారు అప్పలనాయుడుని మినీ లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి పక్కకు తుళ్లిపోగా తీవ్రగాయాలయ్యాయి. లారీ కింద ఇరుక్కుపోయిన అపాచీ బైక్ను వంద అడుగుల వరకు లారీ ఈడ్చుకెళ్లింది. తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి కర్నూలులోని వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలో మంటలు చెలరేగి లారీ ఇంజిన్ మొత్తం దగ్ధమైంది. లారీ కింద ఉన్న బైక్ ఆనవాళ్లు లేకుండా కాలిపోయింది. లారీలో ఉన్న సుమారు రూ.2 లక్షలు విలువ చేసే గోనె సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాడంగి అగ్నిమాపక వాహనం వచ్చి కాలుతున్న మంటలను అదుపులోకి తెచ్చింది. ఆ సమయంలో దిచక్ర వాహనదారు పక్కకు తుళ్లిపోవడం, వాహనాలేవీ రాకపోవడంతో ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.లారీ కింద ఇరుక్కుపోయిన బైక్తో పాటు ద్విచక్రవాహనదారు చనిపోయి ఉంటాడని భయపడి లారీ డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలులో జరిగిన తరహాలో ప్రమాదం లారీకింద ఇరుక్కుపోయిన బైక్ వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లి ప్రమాదానికి గురైన లారీ తీవ్రరాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకునుంచి చెలరేగిన మంటలు బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు స్వల్పగాయాలతో బయటపడిన బైకర్ పెనుప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు పరారైన లారీ డ్రైవర్ -
రైతుబజార్ నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపన..!
భోగడాపురం: అదేదో సినిమాలోని డైలాగ్లా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీమళ్లీ అన్నట్లు మండల కేంద్రం భోగాపురంలో జాతీయ రహదారిని అనుకుని 50 సెంట్ల విలువైన స్థలంలో రైతు బజార్ను ఏర్పాటు చేసేందుకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చొరవ తీసుకుని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ద్వారా సుమారు రూ.74 లక్షలు నిధులను మంజూరు చేయించి రైతుబజార్ను తీసుకువచ్చారు. ఈ మేరకు 2022 జూన్ 16వ తేదీన అప్పటి ఎంపీ బెల్లానచంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబుతో కలిసి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు శంకుస్థాపన నిర్వహించగా పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు నిలిచిపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యే లోకం నాగమాధవి తిరిగి మళ్లీ అదే రైతుబజార్కు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన చేసిన దానికి రెండోసారి శంకుస్థాపన చేయడమేంటని మండలలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతుబజార్ పనులను తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకునేందుకే మళ్లీ శంకుస్థాపన నిర్వహిస్తున్నారని మండలంలోని పలువురు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. -
జానపద కళల పునరుజ్జీవానికి కృషి
● గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం ● జానపద గురువులకు ఆత్మీయ సత్కారంవిజయనగరం టౌన్: అంతరించిపోతున్న జానపద కళల పునరుజ్జీవానికి గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం ఎల్లప్పుడూ కృషిచేస్తుందని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బద్రి కూర్మారావు పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చిన జానపద గురువులకు ఆత్మీయ సత్కారం గురజాడ స్వగృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల ఖిల్లాగా ప్రసిద్ధికెక్కిన విజయనగరంలో కళాకారులకు కొదవలేదన్నారు. కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ పి.శంకరరావు (విశాఖ) మాట్లాడుతూ ఒకప్పుడు దేదీప్యమానంగా విరాజిల్లిన జానపద కళలు ఆదరణ లేక అంతరించిపోవడం విచారకరమన్నారు. బుర్రకథ కళాకారుడు కుమ్మరి మాస్టారు, జాలారి నృత్య రూపకర్త, ప్రదర్శకుడు సంపత్ కుమార్ వంటి కళాకారులను విజయనగరం అందించిందని, అటువంటి కళలను బతికించేందుకు కృషిచేస్తున్న కూర్మారావు వంటి వారికి మనం చేయూతనివ్వాలని కోరారు. రానున్న రోజుల్లో అందరూ కలిసి కళలను ముందుకు తీసుకెళ్లి భావితరాలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా జపాన్లో తప్పెటగుళ్లు ప్రదర్శించిన నీలబోని సత్యం, మలేషియాలో తెలుగువారికి చెక్క భజన, కోలాటంలో శిక్షణఇచ్చిన గురువులు మత్స తవిటినాయుడు, మాస్టర్ సాయికుమార్లను, కర్ణాటక, రాజస్ధాన్ రాష్ట్రాలలో తూర్పుభాగవతాన్ని ప్రదర్శించి అవార్డు పొందిన డీవీవీ జగన్నాథం పంతులు, బొంతలకోటి శంకరరావు, కొచ్చెర్ల అంజలి భాగవతార్, కొచ్చర్ల లక్ష్మి భాగవతార్లను ఘనంగా సత్కరించారు. ప్రతిగా కళాకారులు మాట్లాడుతూ ప్రభుత్వాలు, సాంస్కృతిక శాఖ, దేవాదాయశాఖ ఈ కళలను బతికించేందుకు తోడ్పాటునందించాలని లేకపోతే ఈ కళలు ఇంతటితో అంతరించిపోతాయన్నారు. సంస్థ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ జి.జనార్దననాయుడు, ధవళ సర్వేశ్వరరావు, ఈపు విజయకుమార్, జీఎస్ చలం, చీకటి దివాకర్, జీవీ శ్రీనివాస్, షేక్ గౌస్బాషా. డప్పు శ్రీను, ఎన్.చిన్నాదేవి, చంద్రిక రాణి, ఫణిశ్రీ, అట్టాడ లక్ష్డునాయుడు, మారినాయుడు, అప్పలరాజు, చింతా నాగేశ్వరరావులతో పాటు అధిక సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం ఓ పెంకిటిల్లు దగ్ధమైంది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దాడ సాయిరాజ్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్లో మంటలు చెలరేగి ఇంటి దూలాలు అంటుకున్నాయి. అలాగే టీవీ, ఎలక్ట్రికల్ సామగ్రి, బట్టలు, కొంత మేర నగదు కాలిపోవడంతో సుమారు రూ.2.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. సమాచారం మేరకు సాలూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. వివరాలను రెవెన్యూ అధికారులకు నివేదించినట్లు ఎస్సై వి. ప్రసాదరావు తెలిపారు. రెండు ఆలయాల్లో చోరీ● దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నెల్లిమర్ల రూరల్: మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగతనానికి దేవుడిని సైతం వదల్లేదు. ఆలయాల్లోకి చాకచక్యంగా ప్రవేశించి హుండీల్లో నగదును మాయం చేస్నున్నారు. ఈ తరహా ఘటనలు తరుచూ జరుగుతుడడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల మండలంలో శనివారం అర్ధరాత్రి రెండు ప్రధాన ఆలయాల్లో వరుస చోరీలు జరిగాయి. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారిలోని కొత్తపేట సమీపంలో ఉన్న శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు ఓ గదిలో భద్రపరిచిన హుండీని పగలగొట్టి సొత్తు దోచుకున్నారు. అనంతరం అదే రహదారిలో రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. తొలుత తెలివిగా సీసీ టీవీ ఫుటేజీ కనెక్షన్లు తప్పించి హుండీలో నగదు చోరీ చేశారు. ఆదివారం ఉదయం చోరీ జరిగినట్లు గమనించిన ఆలయాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాలకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. ఆయా ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. ఇటీవల గ్రామ దేవతల పండగలు జరిగిన నేపథ్యంలో హుండీల్లో నగదు ఎక్కువగానే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. టీడీపీ నాయకుడిపై దాడి ● బయటపడిన విభేదాలుభామిని: మండలంలోని టీడీపీ నాయకుల్లో విభేదాలు భగ్గుమన్నాయి. పాలకొండ ఎమ్మల్యే నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పడాల భూదేవి వర్గాలు ఒకరిపై ఒకరు పోటీ దాడులకు దిగుతున్నారు. ఈ మేరకు ఆదివారం భామిని మండలం సొలికిరికి చెందిన టీడీపీ నాయకుడు బర్ల ఆనందరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ మరో నాయకుడు కొత్తకోట గోవిందరావు కుటుంబం దాడి చేసి గాయపరిచిందని బత్తిలి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పార్టీ వ్యవహారాలు మాట్లాడదమని చెప్పి ఇంటికి పిలిచి టీడీపీ నాయకుడు కొత్తకోట గోవిందరావుతో పాటు కుటుంబసభ్యులు తనను బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు బర్ల ఆనందరావు వాపోతున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితుడిని ఎంఎల్సీకి తరలించినట్లు బత్తిలి ఎస్సై అప్పారావు తెలిపారు. -
మోంథాపై అప్రమత్తం
విజయనగరం అర్బన్: మోంథా తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దం అయింది. జిల్లా వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను ఆదివారం కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తుఫాన్ జాగ్రత్తలపై వివిధ శాఖ ల అధికారులతో సమీక్షించి తుఫాన్ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను మీడియాకు వివరించారు. మోంథా తుఫాన్ సోమ వారం సాయంత్రం తరువాత తీరం దాటే అవకా శం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. ఒక్కోసారి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు అత్య వసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించా రు. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. పశువులను, పెంపుడు జంతువులను బయటకు విడిచిపెట్టవద్దని సూచించారు. నదు లు, గెడ్డలు, నీటి ప్రవాహాల్లోకి దిగవద్దని, వంతెన లు, కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్నపుడు వాటిపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించా రు. తాటాకు ఇళ్లు, పురిపాకల్లో ఉన్నవారిని రేపు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. మందులు, ఆహార పదార్ధాలతో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశా మని ఇప్పటికే మత్స్యకారులంతా ఒడ్డుకు చేరుకున్నారన్న సమాచారం వచ్చిందని కలెక్టర్ వివరించారు. 27 నుంచి 29వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు మోంథా తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి డిగ్రీ కళాశాల వరకు అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ ఏ యాజమాన్య విద్యా సంస్థ కూడా తెరవకూడదని హెచ్చరించారు. సంబంధిత విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అధికారులు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్లలో ఉండి పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని ప్రధానోపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యాశాఖ పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు 8978504260, 9441285224గా ఉన్నాయని తెలిపారు. కలెక్టరేట్ : 08922–236947, 8523876706 రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, విజయనగరం : 8885893515 ఆర్డీవో ఆఫీస్, చీపురుపల్లి : 9704995807 ఆర్డీవో ఆఫీస్, బొబ్బిలి : 9989369511 మున్సిపల్ కార్పొరేషన్, విజయనగరం : 9849906486 ఏపీ ఈపీడీసీఎల్ : 9490610102 ఏపీ ఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ : 1912 కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, మున్సిపాలిటీ లు, తహసీల్దార్ కార్యాలయాలు, విద్యుత్, అగ్నిమాపక శాఖల్లో 24/7 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుఫాన్ కంట్రోల్ రూంల ఫోన్ నెంబర్ వివరాలు ఇలా ఉన్నాయి. -
తీరప్రాంతంలో తస్మాత్..
పూసపాటిరేగ : మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని మత్స్య శాఖ డి.డి. ఎం.విజయకృష్ణ సూచించారు. సముద్రాన్ని ఆనుకొని నిలిపి వు న్న విలువైన బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రధానంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. తీరప్రాంత గ్రామాలైన చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, తిప్పలవలస, కోనాడ, ముక్కాం, చేపలు కంచేరు, కొండ్రాజుపాలెం గ్రామాలలో మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాలలో ఇప్పటికే దండోరా వేసి అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తీరప్రాంత గ్రామాలలో వీఆర్వోలను అక్క డే స్థానికంగా వుంచి అప్రమత్తత చేయిస్తున్నట్లు పూసపాటిరేగ తహసీల్దార్ ఎన్వి.రమణ తెలిపారు.


