Vizianagaram
-
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీఏపీ) బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ఐదోతరగతిలో ప్రవేశాలు కల్పించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్లో 140 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60, బైపీసీ–40, సీఈసీ–40 సీట్లు ఉన్నాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హతలు గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరంగా (202–24, 2024–25) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 01.09.2014 –31.08.2015 మధ్య జన్మించి, 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2013–31.08.2017 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు. జిల్లాలో మూడు బాలికలు, నాలుగు బాలుర ఎంజేపీఏపీ బీసీ గురుకులాలు 440 మంది విద్యార్థులకు ఐదోతరగతిలో ప్రవేశాలకు అవకాశం నెల్లిమర్లలో ఇంటర్లో ప్రవేశానికి 140 సీట్లు వచ్చేనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి/సంరక్షకుని మొబైల్ నంబర్ తదితర ప్రాథమిక వివరాలతో రూ.100 చెల్లిస్తే జర్నల్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా హెచ్టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపిన తరువాత వచ్చే రిఫరెన్స్ నంబరుతో దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకోవాలి. పాఠశాలలకు నేరుగా అందజేసే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోరు. అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్లో ప్రవేశానికి మార్చి 15వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – కేబీబీ రావు, గురుకులాల జిల్లా కన్వీనర్, విజయనగరం -
వసతిగృహం సందర్శన
విజయనగరం లీగల్: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్ సుంకరవీధిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహాన్ని బుధవారం సందర్శించారు. మెనూ సరిగా అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి వార్డెన్ను ప్రశ్నించారు. బాలికలకు సరిపడా బెడ్స్ సమకూర్చాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్, ఎంఈఓలు కూర్మానందరావు, పి.సత్యవతి, టూ టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి ఉన్నారు. గంజాయి రవాణాపై నిఘా విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై నిఘావేసి నియంత్రించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్టి ఎస్పీలను ఆదేశించారు. విశాఖపట్నంలోని తన కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. వివిధ నేరాలపై సమీక్షించారు. గంజాయి వ్యాపారులపై పీడీ యాక్టులు నమోదు చేయాలని, వారి ఆస్తులు సీజ్చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు వేగవంతంగా పరిహారం అందేలా చూడాలన్నారు. మహిహిళలకు భద్రత కల్పించాలని, పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు. భార్యను చంపిన వ్యక్తి అరెస్టు దత్తిరాజేరు: గుచ్చిమి గ్రామ సమీపంలోని చౌదరి తోటలో యాకల గౌరమ్మను కొడవలితో నరికి చంపిన భర్త యాకల సత్యంను పెదమానాపురం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6వ తేదీన చుక్కపేట నుంచి గుచ్చిమి వద్ద ఉన్న పొలానికి పనికి వెళ్తుండగా వెనుక నుంచి వెళ్లి కొడవలితో దాడిచేయడంతో గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడి అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు పెదమానాపరం రైల్వే గేటు వద్ద పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. -
ఉపాధికల్పనలో అలసత్వం..!
విజయనగరం ఫోర్ట్: ఉత్తుత్తి హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... అన్నింటా వైఫల్యం చెందుతోందన్న మాట ప్రతిఒక్కరి నోటా వినిపిస్తోంది. ఓ వైపు ప్రజాసంక్షేమ పథకాలు ఎండమావిగా మారాయి. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పల్లెల్లోని చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు ‘ఉపాధి’ చూపడంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. పనికి ఆసక్తిచూపే వారందరికీ కాకుండా కొంతమందికే ఉపాధి పనులు కల్పించడంపై వేతనదారులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలోనూ వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనుల కల్పనలో వెనుకబడి ఉండడంపై ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కువ మంది వేతనదారులకు పనికల్పించారు. దీని వల్ల వేతనదారుల జీవోనపాధికి ఇబ్బంది ఉండేది కాదు. పని కోసం వలస వెళ్లాల్సిన అవసరం తప్పేది. పనుల కల్పనలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేదని గుర్తుచేస్తున్నారు. 2023–24లో ఫిబ్రవరి 19 నాటికి 1.78 కోట్ల పనిదినాల కల్పన 2024–25లో 1.53 కోట్ల పనిదినాలే.. గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనిదినాలు తక్కువ ఆవేదనలో వేతనదారులు పని కల్పనకు చర్యలు పని అడిగిన వేతనదారుడికి పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చి నెలఖారు నాటికి పని దినాల లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తాం. వ్యవసాయ పనులు ముగిసినందున పనుల్లో పాల్గొనే వేతనదారుల సంఖ్య పెరుగుతోంది. – ఎస్.శారదా దేవి, డ్వామా పీడీ జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6.05 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీనాటికి 1.78 కోట్ల పనిదినాలు కల్పించారు. 2024–25లో ఫిబ్రవరి 19వ తేదీ నాటికి 1.53 కోట్ల పని దినాలే కల్పించారు. గతేడాది కంటే ఇదే సమయానికి 25 లక్షల పనిదినాలు తక్కువగా కల్పించారు. ఉపాధిహామీ పథకం కింద నీటి వాగులు, కుంటలు, చెరువుల ఆధునికీకరణ, పొలాల చుట్టూ సరిహద్దు కందకాలు, పంట కుంటలు, ఊట కుంటలు వంటి పనులు గ్రామ సభల ఆమోదం మేరకు జరపాలి. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో వెండర్ విధానానికి తెరతీయడంతో వేతనదారులకు పనిలేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పథక నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులకే ఖర్చుచేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉత్సాహంగా శరీర సౌష్టవ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువతను ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో మొదటిసారిగా పోటీలు జరగడంతో వివిధ జిల్లాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహించినట్టు హనుమాన్ సేవాసమితి ప్రతినిధులు ముగడ అనిల్, పొట్టేలు రవి తెలిపారు. పోటీలను ఎమ్మెల్యే బేబీనాయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్వర్మ, పువ్వల శ్రీనివాసరావు, గెంబలి శ్రీనివాసరావు, వేణుగోపాలరావు తదితరులు తిలకించారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
గజపతినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా అతిథి అధ్యా పకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్జరోతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయనగరంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. గెస్ట్ లెక్చరర్స్ సమస్యను క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని మంత్రిని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగభద్రత కల్పించి ఆదుకోవాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో అధ్యాపక సంఘ నాయకులు బూడి అచ్చుంనాయుడు, కర్రోతు పైడిరాజు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలకు కోడిగుడ్డు కట్
సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెనూలో భాగంగా పోషకాహరం అందివ్వడానికి పెట్టే కోడిగుడ్లు నిలుపుదల చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఆదేశించారు. పక్క ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఎగ్స్ పెడుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిలిపివేయడం గమనార్హం. అలాగే మిడ్డేమీల్, అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్నప్పటికీ ఆశ్రమపాఠశాలలకు మాత్రమే నిలుపుదల చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మిగతా ఐటీడీఏలలో ఎక్కడా కోడిగుడ్లు నిలుపుదల చేయలేదని స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రమే ఆపివేశారని వాపోతున్నారు. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలకు కలిపి మొత్తం 3,70,000 కోడిగుడ్లు అవసరం. ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు (శనివారం మినహాయించి )ఇచ్చేవారు. చికెన్, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినవచ్చని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేస్తోంది. చికెన్ ఎలాగూ బర్డ్ఫ్లూ భయంతో నిలుపుదల చేశారు. కనీసం ఎగ్ కూడా పెట్టకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏమన్నారంటే..ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర వద్ద సాక్షి ప్రస్తావించగా తుని నుంచి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, బర్డ్ఫ్లూ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా కొద్ది రోజులు నిలిపివేయాలని అన్ని వసతిగృహాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అంతకు ముందు చికెన్ నిలిపివేత బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిర్ణయం -
జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు
విజయనగరం ఫోర్ట్: గులియన్ బర్రీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ, కట్టడిచేయడానికి అవసరమైన ల్యాబ్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాగునీటి పథకాలను షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయాలని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవన రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు బలహీన పడడం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి 80 శాతం మందికి సహజంగానే తగ్గిపోతుందన్నారు. 15 శాతం మందికి చికిత్స అవసరమని, కేవలం 5 శాతం మందికి మాత్రమే పరిస్థితి విషమంగా మారుతుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి సీఈఓ ఆర్.వెంకటరామన్, డీపీఓ టి.వెంకటేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ -
వై.ఎస్.జగన్తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వై.ఎస్.జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వై.ఎస్.జగన్ ఆదేశించారు. -
పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు ● భారీగా పోలీసుల మోహరింపుబొబ్బిలి: పట్టణంలోని 29వ వార్డు పాకివీధి సమీపంలో 1.40ఎకరాల స్థలాన్ని పారిశుధ్య కార్మికులకు కేటాయించాలని గత పాలకులు ఇచ్చిన హామీ మేరకు అందులో తాత్కాలికంగా వారు వేసుకున్న పాకలను మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు పొక్లెయిన్లతో తొలగించారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం పారిశుధ్య కార్మికులు ఇళ్ల వద్ద లేని సమయంలో పాకలు తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులను మహిళలు అడ్డుకున్నా వెరవకుండా తొలగించారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కార్మికులు, సంఘం నాయకులు అంతా ఒక చోట చేరి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఆక్రమించి మోహరించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన స్థలం కోసం 1991లోనే మున్సిపల్ కార్యాలయానికి రుసుము చెల్లించామని ఆ రశీదులు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, సీఐలు కె. సతీష్ కుమార్, నారాయణరావు, ఎస్సై ఆర్.రమేష్ల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మీకు స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఆ పార్టీలోనే ఉండబోనని టీడీపీ నాయకుడు కాకల వెంకటరావు కార్మికులకు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కార్మికులు మెమొరాండం సమర్పించగా మున్సిపల్ ఉన్నతాధికారుల లేఖను కార్మికులకు వారు అప్పగించారు. అక్కడ నిర్మించిన పాకలను వెంటనే తొలగించాలని పోలీసులు, అధికారులు కోరారు. పాకలను తొలగించే వరకూ సరేనని, కానీ అక్కడున్న కర్రలను తొలగించేది లేదని చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ స్థలంలో కర్రలను తొలగించకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులుంటాయని హెచ్చరించడంతో కాసేపు తోపులాట జరిగింది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి. ఆరుగురి అరెస్ట్ కేసుల నమోదుఆ సమయంలో కోపోద్రిక్తులైన పోలీసులు ఆరుగురు కార్మిక సంఘం నాయకులు పొట్నూరు శంకరరావు, బంగారి యుగంధర్, ఏడుకొండలు, వడ్డాది శంకర రావు, జి.గౌరీశు, బంగారి వెంకట రమణలను పోలీసు వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్కు తీసుకువెళ్లిపోయారు. అక్కడ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్కడి నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ వారిపై బైండోవర్ చేశారు. ఇండ్ల స్థలాలను అడిగితే ఇలా అరెస్టులు, కేసులు ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. చర్చల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శ శరత్, కాకల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్హమోహన్రెడ్డి సుమారు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్టోటింగ్ జెట్టీకి పరిపాలన, ఆర్థిక అనుమతులపై కనీసం పట్టించుకోకపోవడంతో టెండర్ ప్రక్రియ జరగలేదు. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవన విధానం మెరుగుపడేది. జెట్టీలేక పోవడంతో వేట సాగక తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం మత్స్యకారులు వలస పోయారు. జెట్టీ నిర్మాణం పూర్తయితే సుమారు 885 బోట్లకు వరకు జెట్టీలో నిలుపుకునే అవకాశం ఉంది. జెట్టీలేక పోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బోట్లు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో లక్షలాది రుపాయల విలువైన బోట్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 27 కిలోమీటర్ల తీరప్రాంతంలో పూసపాటిరేగ, భోగాపురం మండలాలను కలుపుతూ 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి సర్కారు మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించి ఎంతో కాలంగా మత్స్యకారులు కళగా ఉన్న ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తిచేసే విధంగా అడుగులు మందుకు పడాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలిఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. టెండర్ దశలో ఉన్న ఫ్లోటింగ్ జెట్టీకి అనుమతులు మంజూరు చేసి మత్స్యకారుల సంక్షేమంపై దృషి సారించాలి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లామత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు విజయనగరం మత్స్యకారుల చిరకాల వాంఛ ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం మత్స్యకారుల చిరకాల వాంఛ. జెట్టీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మాణంపై దృష్టిసారించాలి. బొ.కొర్లయ్య, చింతపల్లి ఆరునెలలుగా ముందుకు సాగని పనులు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం వేటసాగక ఇబ్బందులు పడుతున్న గంగపుత్రులు -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టుబొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీలు
నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు, కందుకూరి వీరేశలింగం అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ ఆరిపాక బ్రహ్మానందం మాస్టారి పేరిట ఈ నాటక పోటీలను ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎంఎల్ఏ లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభ అనంతరం నాటిక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. తొలిరోజు హైదరాబాద్ కళాంజలి కళాకారులు’ రైతే రాజు’ నాటికను తర్వాత కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్న్స్ కళాకారులు ’ఎడారిలో వాన చినుకు’ నాటికను ప్రదర్శిస్తారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమానికి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, భీశెట్టి బాబ్జీ, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వేమలి త్రినాథరావు హాజరు కానున్నారు. రెండో రోజు రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం కళారారులు ’కొత్త పరిమళం’ నాటికను, తర్వాత విజయనగరానికి చెందిన సౌజన్య కళా స్రవంతి (ఉత్తరాంధ్ర) కళాకారులు దేవరాగం నాటిక ప్రదర్శించనున్నారు. మూడో రోజు శనివారం సాయంత్రం 6గంటలకు సభా కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ’చీకటి పువ్వు నాటికను, తర్వాత విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి కళాకారులు ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత ’నాటికను ప్రదర్శించమన్నారు. విజేతలకు బహుమతులు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అతిథుల చేతుల మీదుగా జరజాపు పేటకు చెందిన సీనియర్ కళాకారులను సత్కరించనున్నట్లు పోటీల నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాటక పోటీల విజేతలకు వరుసగా రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులతో పాటు శాశ్వత షీల్డ్ లను అందజేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ నటులకు వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నాటక పోటీలకు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మూడురోజుల పాటు జరగనున్న పోటీలు రెండు రాష్ట్రాల నుంచి ఆరు నాటిక బృందాల రాక -
వ్యక్తిపై కత్తితో దాడి
దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం పాతరేగకు గూడాపు సింహాచలం, గాయాల పాలైన పైడిపునాయుడుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గ్రామ శివారుకు స్కూటీపై సింహాచలం వచ్చి పైడిపునాయుడిపై కత్తితో దాడిచేయగా గాయాలపాలవడంతో ముందుగా బాడంగి ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతున్నాడు. దాడిచేసిన సింహాచలాన్ని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దార్ విజయభాస్కర్ సిబ్బంది బుధవారం చెరువు దగ్గరకు చేరుకుని చుట్టూ వేసిన ఇనుప కంచెను, చెరువు గట్టుపై వేసిన కంచెను తొలగించాలని ఆక్రమించిన ఎన్ఆర్ఐ బంధువులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వ భూమిలో వేసిన కంచెను తీస్తామని రైతులు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కోరడంతో..రెండు రోజుల్లో తొలగించని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు. 200 ఎకరాలకు వెళ్లే దారిని మూసి వేయడంతో రైతులు ఆందోళన చెంది సర్పంచ్ గర్భాపు విజయలక్షి, భర్త శ్రీనివాసరావు ద్వారా పత్రికలో కథనం రావడంతో పొలాలకు వెళ్లే మోక్షం కలింగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కంచె తొలగించాలని ఆదేశాలు -
ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు
చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. -
గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l Isîæ-yîlH M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ yîlH& gôæiĶæÊH M>Æý‡Å-{MýSÐ]l$… {ç³VýS-†Oò³ ÑÑ«§ýl Ô>QÌS A«¨M>Æý‡$-ÌS-™ø çÜÒ$„ìS…^éÆý‡$. ˘ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరతి ఆబా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) కార్యక్రమం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించిందన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో ఆన్లైన్ సబ్కలెక్టర్ యశ్వంత్ కుమార్ పాల్గొనగా, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ బి.చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ దుర్గా చక్రవర్తి, ఎస్ఎస్ఏ పీఓ ఆర్.తేజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోమన్రావు, టీడబ్ల్యూ ఈఈ మణిరాజు, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ కంచిబాబు, జీసీసీ డీఎం మహేంద్రకుమార్, డీఎఫ్ఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్ను ఆశ్రయించారు. ఉభయులూ కలిపి పెద్దల సమక్షంలో సీతానగరం పోలీస్టేషన్కు చేరుకున్నారు. గ్రామ పెద్దలతో పోలీస్టేషన్కు వచ్చిన ఉభయ వర్గాల వారుల స్టేషన్ ఆవరణలో పంచాయితీ నిర్వహించారు. మెడికల్షాపు నిర్వాహకుడు ఉభయుల శ్రేయస్సు దృష్ట్యా తనకున్న స్థిరాస్థులు విక్రయించి బాధితులకు రుణాన్ని తనకున్నంత మేరకు తీర్చుకుంటానని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు. దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌరహక్కుల రక్షణ చట్టం, అత్యాచార నిరోధకర చట్టం జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలో గౌరవ సభ్యులుగా నియమాకం చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎండి.గయాజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అధికార సభ్యులు ముగ్గురు, అనధికార సభ్యులు ఐదుగురు, స్వచ్ఛంద సేవా సభ్యులు ముగ్గురిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార సభ్యులు గ్రూపు ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్స్, అనధికార సభ్యులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు, స్వచ్ఛంద సభ్యులు ఇతర కేటగిరిలకు చెందినవారు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తుతో ఎస్సీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9492535085 నంబర్ను సంప్రదించాలని కోరారు. వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు● 10 కేసుల నమోదు విజయనగరం: విజయనగరం పట్టణంలో, బొండపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎం.దామోదర నాయుడు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడం గుర్తించి 3 కేసులు, తూనిక యంత్రాలలో లొసుగులు వినియోగించి తూకంలో మోసం చేసిన వారిపై 4 కేసులు, అదేవిధంగా ప్యాకేజీలపై ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించిన వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తూకంలో గానీ కొలతలో గానీ తేడా లేకుండా విక్రయించాలని, ముద్రించిన ధరకే ప్యాకేజీలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిభామిని: మండలంలోని లివిరికి చెందిన బౌరి రాజేంద్ర(32) బుధవారం ఉదయం మరణించాడు. మంగళవారం రాత్రి లివిరి–భామిని మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న బౌరి రాజేంద్ర(32), మరో యువకుడు బౌరి తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్థానికుల సహకారంతో బాధితులను భామిని పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం లివిరి స్వగ్రామానికి తీసుకువెళ్లి ఇద్దరు బాదితులకు ప్రైవేట్ వైద్యం అందించినప్పటికీ గాయపడిన బాధితుడు బౌరి రాజేంద్ర(32) మృత్యువాత పడి ఉండడాన్ని భార్య ఉషారాణి బుధవారం ఉదయం గుర్తించి భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించగా లివిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
23న ఉత్తరాంధ్ర స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకా రులతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం–మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఓపెన్ విభాగంతో పాటు అండర్–7,9,11,13,15 వయస్సుల విభాగాల్లోని బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఓపెన్ విభాగంలో విజేతకు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనుండగా..చిన్నారుల విభాగంలో విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఫోన్ 9703344488 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వృత్తి పరమైన నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్ధులు ఆదిశగా కళాశాల స్థాయి నుంచి తయారు కావాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్ రిటైర్డ్ సైంటిస్టు బీవీఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్స్పై నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు అధికమన్నారు. భవిష్యత్లో అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సావనీర్ను ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీఎస్ఎన్మూర్తి, ప్రొఫెసర్ కె.బాబులు, కేసీబీరావు, డాక్టర్ గురునాథం, డాక్టర్ నీలిమ, డాక్టర్ బి.హేమ, డాక్టర్ జి.అప్పలనాయుడు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి హాజరైన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యోగులను కొనసాగించండి
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ వై.వి.రమణకు మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ పరిధిలో ఉన్న సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈఎంఆర్ఐ ఏజెన్సీ పరిధిలో మూడేళ్లుగా పనిచేస్తున్నారన్నారు. ఈ నెల 15తో సంస్థ కాలపరిమితి ముగిసిందని, ఉద్యోగాల నుంచి తొలగించినట్టు లేఖలు పంపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఏజేన్సీలు మారినా, ప్రభుత్వం అప్పటి వరకు పనిచేసిన ఉద్యోగులను నూతన సర్వీస్ ప్రొవైడర్లతో కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కనీస వేతనాలతో కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్.నరేష్, సాయిసతీష్, సురేష్, జయలక్ష్మి, భద్రకాళి, యోగింధర్ దొర, నీరజ, కావ్య, యశ్వంత్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. జేసీ, పశు సంవర్థక శాఖ జేడీకి వినతిపత్రం అందజేసిన పశు సంచార వాహన ఉద్యోగులు -
ఎన్నికల విధుల్లో అప్రమత్తం
విజయనగరం అర్బన్: ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పీఓలు, ఏపీఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మొదటివిడత శిక్షణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులను ఎన్నిసార్లు నిర్వహించినా ఏ మాత్రం అలసత్వం చూపించకూడదన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని, కొత్త ఆదేశాలు వస్తుంటాయని, వాటన్నింటినీ చదవి అర్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాలు, ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయని, వీటిని ప్రతిఒక్కరూ గ్రహించాలని సూచించారు. డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఎన్నికల సిబ్బంది లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఆర్డీఓ డి.కీర్తి ఇతర అంశాలను వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
–8లో
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు పెట్రోల్ బంకులో చిరిగిన పది రూపాయల నోటు గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదికొచ్చింది. వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు దివ్యాంగులకు రైల్వే పాస్లను ఆన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ను ప్రారంభించింది.20న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలకొండకు రాక సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు రానున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పాలకొండకు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మంగళవారం వెల్లడించారు. 20వ తేదీన జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ 1.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి 2.15 గంటలకు పాలకొండలోని పాలవలస రాజశేఖరం తనయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఉండనున్నారు. తదుపరి సాయంత్రం 3.30 గంటలకు పాలకొండ నుంచి తిరిగి బయలుదేరుతారు. 4.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. -
గాదె గెలుపే లక్ష్యం: ఎస్టీయూ
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ముఖ్యనాయకులు తెలిపారు. స్థానిక పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టీయూ నాయకులు దాడిచిలుక శ్యామ్, వసంతుల గోవిందరావు తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్టీయూ రాష్ట్ర కమిటీ ఏ ఒక్క అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానిక పరిస్థితులు, ఉపాధ్యాయ వర్గాల శ్రేయస్సు దృష్ట్యా గాదె శ్రీనివాసులునాయుడి ప్రాతినిథ్యం ఉండాలని కోరుకుంటున్నామని ప్రకటించారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్టీయూ నాయకులు గాదె గెలుపునకు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్దొర, లచ్చన్న, సత్యనారాయణ, మహేష్, శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్నాయుడు, ఎస్.త్రినాథ్, రెడ్డి గణపతి, రాజారావు, బి.అప్పారావు, ఆనంద్, జాకబ్, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
సదస్సు పేరుతో ప్రచారం
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రవివర్మకి మద్దతుగా టీడీపీ చీకటి ప్రచారానికి తెరతీసింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యాసదస్సు పేరుతో విందు భోజనాలు పెట్టడం, ఎన్నికల ప్రచారం జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల పేరులేకుండా ‘విద్యారంగం–వర్తమాన సవాళ్లు’ అనే అంశంతో పేరుతో మెసానిక్ టెంపుల్ సమావేశ మందిరంలో మంగళవారం విద్యాసదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను మాత్రమే ఆ సదస్సుకు ఆహ్వానం పలుకుతూ టీచర్లను వాట్సప్ గ్రూపుల్లో ఆహ్వానించారు. తీరా అక్కడి వెళ్తే అది ఎన్నికల ప్రచార వేదికగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉపన్యాసాలు సాగాయి. అనంతరం సదస్సుకు వచ్చిన వారికి విందు పెట్టారు. సదస్సుకు వచ్చిన వారికి ఎమ్మెల్సీ బరిలో ఉన్న పాకలపాటి రవివర్మ ఆహ్వానం పలకడం గమనార్హం. విద్యాసదస్సు పేరుచెప్పి ఇదెక్కడి ఎన్నికల ప్రచారమంటూ పలువురు గురువులు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఉల్లంఘన -
కుంకి ఏనుగుల నివాస స్థలం పరిశీలన
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడానికి తీసుకురానున్న కుంకి ఏనుగుల నివాసానికి అసరమైన స్థల ఏర్పాట్లను రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట కొండ ప్రాంతంలో కుంకి ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన స్థావరాలను ఆమె తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడు ఏనుగుల గుంపు, పాలకొండ నియోజకవర్గంలో నాలుగు ఏనుగుల గుంపు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా కుంకి ఏనుగులను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆ ముగ్గురి మధ్యే పోటీ!
పాకలపాటి రఘువర్మ● కీలక దశకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ● ఈనెల 25 సాయంత్రం 4 గంటలతో ముగియనున్న ప్రచారం ● ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ● మొత్తం ఓటర్లు: 22,493 మంది ● పోలింగ్ కేంద్రాలు: 123 డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు అన్ని ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే ఈసారి ఓటర్లు పెరిగారు. పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లు రావాలి. లేకుంటే 2వ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ● పోటీ వారిమధ్యనే.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. విజయగౌరికి ఉత్తరాంధ్రాలో బలమైన యూటీఎఫ్ సంఘాలు మద్దతు ఇస్తుండగా, రఘువర్మకు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు బీజేపీ నాయకులు, మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీ మాధవ్ మద్దతు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వీరి ముగ్గురి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ● ప్రచారానికి కొద్దిరోజులే సమయం.. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభ్యర్థులు జోరుగా చేపడుతున్నారు. ఈ ప్రచారం ఈ నెల 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రచారంలో స్పీడు పెంచాయి. పాఠశాలల్లో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ● 123 కేంద్రాల్లో పోలింగ్.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్వతీపురం మన్యం, విజయగనరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఉన్న 22,493 మంది ఓటర్ల కోసం 123 పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. ఈ కేంద్రాల్లో 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 8,985 మంది, పురుషులు 13,508 మంది ఉన్నారు. శ్రీకాకుళం–5,035 మంది, విజయనగరం–5,223, పార్వతీపురం మన్యం–2,333, అల్లూరి సీతారామరాజు–1,488, విశాఖపట్నం–5,529, అనకాపల్లి జిల్లాలో 2,885 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఆ ఇద్దరు కూడా... ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగుతుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతుండంగా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బహుజన సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థి పోతల దుర్గారావు కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీ చేస్తున్న సుంకర శ్రీనివాసరావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుండడంతో మొదట ప్రాధాన్యత ఓటు శాతం ప్రధాన అభ్యర్థులకు తగ్గే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నారు. పోటీ అభ్యర్థులకు మద్దతు ఇలా... గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి పీఆర్టీయూ తరఫున బరిలో దిగిన డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడుకు ఏపీటీఎఫ్ (1938), ఆంధ్రపదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘం (ఆప్టా), బహుజన ఉపాధ్యాయ సంఘం, ఆర్యూపీపీ, ఆదివాసీ ఉపాధ్యాయ, ఎస్టీయూ సంఘాల (ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు) మద్దతు ఉంది. తొలిసారిగా బరిలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థిని కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్, ఏపీ మోడల్ స్కూల్ పీఎస్, కేజీబీవీ టీచర్లు, తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. రెండో సారి పోటీలో ఉన్న పాకలపాటి రఘువర్మకు ఏపీటీఎఫ్ (257), ఎస్ఎల్టీఏ, ప్రధానోపాధ్యాయుల సంఘం, పీఆర్టీయూడీ, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు అండగా ఉన్నాయి. -
శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ˘
విజయనగరం గంటస్తంభం: మహాశివరాత్రి పర్వదినాన వివిధ ఆలయాలు సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థానికి 45 బస్సులు నడుపుతామన్నారు. శ్రీకాకుళం–2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ, చీపురుపల్లి, గరివిడి మీదుగా పాలకొండ డిపో నుంచి 20 బస్సులు వేశామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సు లు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు వేసినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 99592 25620, 94943 31213, 94403 59596 నంబర్లను సంప్రదించాలని కోరారు. పీహెచ్సీల్లో ప్రసవ సేవలు అందించాలి ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) ప్రసవ సేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 10 పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణుల నమోదు, నెలనెలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా జరపాలన్నారు. మాతాశిశు మరణాలను నివారించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారిక మందులు అందజేయాలన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి ˘గుర్ల: అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డీఈఓ యు.మాణిక్యంనాయు డు సూచించారు. గుర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాటలు పాడించడం, ఆటల లో చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. శిక్షణ కార్యక్రమాలు ఆరు రోజులపాటు జరగనున్నాయన్నారు. పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు రాస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. మార్చి 8న జాతీయ లోక్అదాలత్ ● వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం లీగల్: వచ్చేనెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని న్యాయమూర్తులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రాంసిరీ నోట్, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎక్సైజ్, భూములు, కుటుంబ తగాదాలు, వాటర్, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిస్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, టీవీ రాజేష్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవీ రత్నకుమారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రమ్య, ఎకై ్సజ్ న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి పాల్గొన్నారు. -
ఆరు వాహనాలతో సేవలు
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్నపలంగా తొలిగించారనే అంశంపై ‘సాక్షి’లో ఈ నెల 17వ తేదీన ‘సంచారం ఓ చదరంగం’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 17 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో మొదటి విడతలో జిల్లాకు వచ్చిన 7 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్వాధీనం చేసుకోమని పశు సంవర్థక శాఖ సంచాలకులు నుంచి ఆదేశాలు వచ్చాయని పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ తెలిపారు. ఆరు వాహనాల సేవలు మాత్రం యథావిధిగా అందుతాయన్నారు. -
ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విజయనగరం గంటస్తంభం: ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేస్తూ క్యాబినెట్ చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అయితే మొత్తం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అంతేగానీ మళ్లీ థర్డ్ పార్టీ విధానంలో కార్మికుల్ని బందీలను చేసి వారి శ్రమను కొల్లగొట్టాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోందని, రిటైర్ అయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. చివరికి వాటర్ సప్లై, నైట్ శానిటేషన్, స్ట్రీట్లైట్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా, నచ్చినట్లు విధుల నుంచి తొలగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అతి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కుదింపు, పోలవరం అమరావతి సహా రైల్వే జోన్ తదితర ప్రాధాన్యతా అంశాలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ కూటమి పెద్దలు మౌనంగా ఉండడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, నాయకులు పాపారావు, భాస్కరరావు, గురుమూర్తి, రాఘవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
సారాతో నలుగురి అరెస్టు
మెంటాడ: సారా తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సారా బాటిల్స్ మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర రిజార్వాయర్ వెనుక గల లోతుగెడ్డ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 20 బ్యాటిల్స్లో 40 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకుని వారిని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయండి● ట్రాన్స్కో ఎస్ఈ చలపతిరావు ● సాక్షి కథనానికి స్పందన వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను మోసగిస్తోందని మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఉచిత విద్యుత్ పధకానికి మంగళం’ అనే కధనంపై జిల్లా ట్రాన్స్కో ఈఓ చలపతిరావు స్పందించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే మండలాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈలను ఆదేశించారు. గూడ్స్ సైడింగ్ ప్రారంభందత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గందర గోళం మధ్య గూడ్స్సైడింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైల్వే మూడో లైన్ పనులతో పాటు గూడ్స్ సైడింగ్ పనులు అప్పట్లో ప్రారంభమై పూర్తి కావడంతో బొబ్బిలి గూడ్స్షెడ్ స్థానంలో కోమటిపల్లి పల్లి వద్ద మంగళవారం ప్రారంభం కావడంతో ఇంతవరకు బొబ్బిలిలో పని చేసిన కార్మికులతో పాటు వి,కృష్ణాపురం, వింధ్యవాసి, వంగర, పెదమానాపురం, పాచలవలస మరడాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్మికులు రావడంతో మధ్యాహ్నం వరకు పనులు ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ నుంచి కోమటిపల్లి ఆటోస్టాండ్ వరకు బియ్యం లారీలు ఉండడం గమనించిన పెదమానాపురం ఎస్సై కాంట్రాక్టర్తో మాట్లాడగా ఆయన కార్మికులతో తొలి రోజు 50 లారీలలో వచ్చిన బియ్యాన్ని రైలులో వేయించారు. చెరకు లారీ బోల్తారాజాం సిటీ: మండల పరిధి రాజయ్యపేట జంక్షన్ వద్ద మంగళవారం చెరుకు లారీ బోల్తా పడింది. పరిమితికి మించి లోడుతో తెర్లాం నుంచి రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద లారీ బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.వ్యక్తి అరెస్ట్గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. -
నూతన విధానంతో సులభతరం..
దివ్యాంగులు పాస్లు పొందేందుకు రైల్వేశాఖ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో జిల్లా వాసులు సంబంధిత రైల్వేస్టేషన్కు ఇతరుల సాయంతో వెళ్లి అక్కడ దరఖాస్తు అందజేసేవారు. రైల్వే అధికారులు జిల్లా నుంచి వచ్చిన మొత్తాన్ని సేకరించి సంబంధిత రైల్వే సబ్డివిజన్కు పంపేవారు. అక్కడ అధికారుల ఆమోద ముద్ర పడిన తరువాత తిరిగి జిల్లాకు వచ్చేది. ఇదంతా జరగడానికి దాదాపు మూడు నెలల వరకు సమయం పట్టేది. ఈ లోగా పాస్ల కోసం దివ్యాంగులు నాలుగుసార్లు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ఇబ్బందులను గుర్తించి నూతన విధానానికి రైల్వే శాఖ నాంది పలికింది. దివ్యాంగులు తాము ఉండే ప్రాంతం నుంచే నెట్ సెంటర్, ఈ–సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ తరువాత 20 రోజుల్లోపు వారు ఆన్లైన్లో పాస్ కూడా తీసుకోవచ్చు. సమయంతో పాటు శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కె.కుమార స్వామి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎ.డి, విజయనగరం -
రహదారి భద్రతపై ర్యాలీ
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మహారాణి పేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రూమ్లను పరిశీలించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్, కూర్మానంద రావు, తహసీల్దార్ పి.సత్యవతి ఎంఈఓ, జిల్లా బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు, టూ టౌన్ ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
అపరాలకు దక్కని మద్దతు..!
● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం ● ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● తుఫాన్ల కారణంగా వేల హెక్టార్లలో పంటకు నష్టం విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్లో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల వరి పంటతో పాటు అపరాల (పెసర, మినుము) పంటలు కూడా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉన్న పంటకు కూడా ప్రస్తుతం మద్దతు ధర రాని పరిస్థితి. మార్కెట్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర రానప్పడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేయాలి. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి సర్కార్ చెప్పింది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాసాన పోలేదు. తాజాగా అపరాలు సాగు చేసిన రైతులు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము పండించిన పెసర, మినుము చాలా వరకు పంట తీసి నూర్పులు చేసి పంట వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో పంటను తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21,931 హెక్టార్లలో అపరాలు సాగు జిల్లాలో అపరాలు 21 931 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పెసర పంట 5,909 హెక్టార్లలోను, మినుము పంట 16,011 హెక్టార్లలో సాగైంది. వీటి ద్వారా పెసర పంట 3,520 మెట్రిక్ టన్నులు, మినుము పంట 10,081 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పెసర ఎంఎస్పీ రూ.8682 పెసర పంట ఎంఎస్పీ క్వింటారూ. 8682, మినుములు ఎంఎస్పీ క్వింటాకు రూ.7400 అయితే ప్రభుత్వం అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అపరాలు విక్రయించాల్సిన పరిస్థితి. పెసలు క్వింటాకు రూ.7 వేలు, మినుములు క్వింటాకు రూ.6500 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జిల్లాలో సాగైన అపరాల్లో తుఫాన్ వల్ల చాలా వరకు పంట దెబ్బతింది. ఎకరాకి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకి క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితి. ఉన్న పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా వరకు రైతులు పంట తీసేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏకారణం చేతనో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాలి అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెఫెడ్ డీఎంకు లెటర్ రాశాం. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.డి.కి ప్రతిపాదనలు పంపిస్తాంజిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాసిన లెటర్ అందింది. జేసీ ద్వారా మార్కెఫెడ్ ఎం.డి.కి అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎన్.వెంకటేశ్వరావు, మార్కెఫెడ్ , జిల్లా మేనేజర్ -
కోట్లాది రూపాయలతో వ్యక్తి పరారీ
సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
రామభద్రపురం: పాస్ తీసుకోవడానికి దివ్యాంగులు పడే కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. దివ్యాంగులు ఇక నుంచి రైల్వే పాస్లను నేరుగా స్టేషన్కు వచ్చే తీసుకునే పనిలేకుండా అన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ ప్రారంభించింది.అందులోనే ఈ–టికెట్ బుక్ చేసుకునే కొత్త విధానాన్ని ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఆర్థోపెడిక్, అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగత్వం తదితర అంగవైకల్యం కలిగిన అన్ని వయసుల వారు కలిపి మొత్తం 73 వేల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వారిలో దాదాపు 45 వేల మంది రైల్వేపాస్లు పొందేందుకు అర్హులున్నట్లు అధికార సమాచారం. రైల్వే పాస్ల కోసం దివ్యాంగులు నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అన్లైన్ విధానంతో ఆ కష్టాలు తప్పనున్నాయి. ఆన్లైన్లో పాస్ జారీ ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోనే కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో జ్ట్టి ఞ://ఛీజీఠి డ్చ ుఽజ్జ్చ ుఽజీఛీ.జీ ుఽఛీజ్చీ ుఽట్చజీ .జౌఠి.జీ ుఽ వెబ్సైట్లోకి వెళ్లి పాస్కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు(యూడీ ఐడీ)మంజూరు చేస్తారు. నూతన పాస్ కావాల్సిన వారు, పాత పాస్ రెన్యువల్కు కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్సైట్ అమల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి దరఖాస్తును పరిశీలించుకోవచ్చు. ఇకపై ఆన్లైన్లో రైల్వేపాస్ జిల్లాలో 45 వేల మంది అర్హులు ఇకపై ఆన్లైన్లో పాస్ తీసుకోవడానికి రైల్వేశాఖ చర్యలు ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు -
సంతృప్తి చెందేలా వినతులకు పరిష్కారం
విజయనగరం అర్బన్: ఆర్థిక పరమైన అంశాలు, కోర్టుల నుంచి నిలిపివేయమని ఆదేశాలు వచ్చిన అంశాలు తప్ప మిగిలిన అన్ని రకాల వినతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతులకు పూర్తిస్థాయిలో కూలంకుషంగా చదివి, పిటిషనర్లతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్జీదారుల సంతృప్తే ముఖ్యమని భావించి సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, సీఎంఓ, వీఐపీ గ్రీవెన్స్సెల్లో నాలుగు రకాల వినతులు అందుతున్నాయని చెప్పారు. వాటిపై నిర్వహించిన విశ్లేషణలో సరాసరిగా ఒక్కో కుటుంబం నుంచి రెండు వినతులు వస్తున్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఏ ఒక్క వినతైనా గడువు దాటితే సంబంధిత అధికారికి చార్జ్ మోమో జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. నియోజకవర్గం వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, బుధవారం లోగా నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియపై ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, వచ్చిన వినతులకు సరైన పరిష్కారం చూపిస్తే, రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 శాతం సమస్యల పరిష్కారం జరుగుతోందని, ప్రతిరోజూ సమీక్షించడం వల్ల పెండింగ్ తగ్గిందన్నారు. రీఓపెన్ కేసులపై మండలాల వారీగా సమీక్షించి, కారణాలను తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, డిప్యుటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
విజయనగరం లీగల్: రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్తో కలిసి ప్రభు త్వ బధిరులు, అంధుల రెసిడెన్షియల్ స్కూళ్లను సోమవారం పరిశీలించారు. వసతిగృహం గదులను తనిఖీ చేశారు. మెనూ అమలుపై ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో కూర్మానందరావు, విజయనగరం తహసీల్దార్ పి.సత్యవతి, ఎంఈఓ, బధిరుల, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్స్ జె.దయానంద, మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాలెట్ పత్రాల పరిశీలన విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కలెక్టరేట్కు చేరుకున్న బ్యాలెట్ పత్రాలను కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోమవారం పరిశీలించారు. తనిఖీ ప్రక్రియ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి కలెక్టర్కు వివరించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు. విలేకరిపై దాడి తగదు ● జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ నాయకుడి దాడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూ లాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసంకాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసి నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ ఇవ్వాలని, లేదంటే ప్రకటన ద్వారా ఖండించాలే తప్ప భౌతికదాడులు సరైన మార్గం కాదన్నారు. బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం బొండపల్లి: పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదునివ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు సూచించారు. మండలంలోని నెలివాడ జిల్లా పరిషత్ హైస్కూల్ను సోమవారం సాయంత్రం పరిశీలించారు. పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రమాద స్థలాల గుర్తింపు విజయనగరం క్రైమ్: జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదం జరిగే ప్రదేశాలను ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం పరిశీలించారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, భోగాపురం సీఐ రామకృష్ణ, ఎస్ఐలతో కలిసి సవరవిల్లి, పోలిపల్లి, లింగాలవలస, నారుపేట, భూమాత లేఅవుట్, ఉప్పాడపేట, నందిగాం, భోగాపురం, సుందరపేట ఇలా 18 కిలోమీటర్ల విస్తీర్ణంలో యాక్సిడెంట్ (బ్లాక్) స్పాట్లను డ్రోన్ల సహాయంతో గుర్తించారు. ఆర్టీఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎన్హెచ్ఏ అధికారి మొనాడ్లాల్తో ప్రమాద కారణాలపై చర్చించారు. ఈ ప్రదేశాల్లో సీసీ కెమారాలు పెట్టాలని, గస్తీ పెంచాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జీబ్రా లైన్లతో పాటు జిగ్జాగ్లను పెట్టాలన్నారు. -
● ఎండన బడిన పిల్లలు
రథసప్తమి వెళ్లాక.. ఎండలు మండుతున్నాయి.. రెండు నిమిషాలు బయట ఉంటేనే.. నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్దవారే ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు.. విద్యార్థులు.. ఏకధాటిగా కూర్చొన్న చోట నిలువ నీడ లేక.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పందిర నీడన ఒకేచోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురుకావడం గమనార్హం. సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. రెండేళ్ల కిందట అది కూలిపోవడంతో దానిని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నాళ్లపాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద, పందిరిలో బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు ఊరి చివరన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటుచేసిన పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అసలే ఎండలు. ఆపై ఆరుబయట చదువులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షి, పార్వతీపురం మన్యం -
–8లో
రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు కల్పిస్తు న్నట్టు ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. అధికార దర్పం తగదు ఉపాధిహామీ పనుల్లో కూటమి నాయకులు అధికార దర్పాన్ని ప్రదర్శించడం తగదు. స్థానికంగా పనికల్పించి వలసలను నివారించాలన్న లక్ష్యంతో చేపట్టే ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టు సైతం తప్పుబట్టింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీర్మానానికి, మాటకు విలువలేకుండా పంచాయతీల్లో అడ్డగోలుగా పనులు చేపడితే ఊరుకునేది లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదు. – పతివాడ అప్పలనాయుడు, ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, పూసపాటిరేగ వెండర్ విధానాన్ని రద్దు చేయాలి ఉపాధహామీ పనుల్లో వెండర్ విధానాన్ని రద్దు చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్ల హక్కులకు భంగం కలగకుండా పనులు చేపట్టేవారు. సర్పంచ్ల తీర్మా నాలు లేకుండానే అధికార పార్టీ నాయకులు వారికి నచ్చిన వారికి పనులు అప్పగించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో, వారి తీర్మానాలతో పనులు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలి. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – చల్ల చెల్లంనాయుడు, ఎంపీపీ, బొండపల్లి -
నిర్వాసితులకు రెట్టింపు పరిహారం
వేపాడ: పెందుర్తి– బౌడారా– 516బి రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితులకు రెట్టింపు పరిహారం అందజేస్తున్నట్టు ఆర్డీఓ దాట్ల కీర్తి తెలిపారు. తహసీల్దార్ రాములమ్మ నేతృత్వంలో బొద్దాం, పాటూరులో నిర్వాసితులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వాసితుల జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహారం అందజేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ భూములకు సెంటుకు రూ.26,500, వ్యవసాయేతర స్థలాలకు గజానికి రూ.6వేలు చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. బొద్దాంలో 130, పాటూరులో 30 మంది నిర్వాసితులను గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్ సన్యాసినాయుడు, ఆర్ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ పెద్దలు కొట్యాడ రమణమూర్తి, ద్వారపూడి గంగునాయుడు పాల్గొన్నారు. -
● మా గోడు వినండి సారూ..
చిత్రంలో లక్కవరపుకోట వెలుగు కార్యాలయం వద్ద హైకోర్టు ఉత్తర్వుల కాపీలను చూపిస్తున్నది లక్కవరపుకోట మండలం కొట్యాడ, తలారి గ్రామాలకు చెందిన మద్ది శ్యామల, తలారి బంగారమ్మ. ఇందిరా క్రాంతి పథంలో భాగంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)లుగా సుమారు 12 సంవత్సరాలుగా నెలకు రూ.3 వేల జీతం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు రూ.10వేలకు జీతం పెరగానే వీరిని గతేడాది జూన్ 27న అకారణంగా విధులనుంచి తొలగించారు. వీరి స్థానంలో కూటమి కార్యకర్తలను చేర్చుకున్నారు. జరిగిన అన్యాయంపై వీరు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలంటూ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీలను కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, వెలుగు ఏపీడీ, ఏపీఎం తదితర అధికారులకు రిజిస్టర్ పోస్టుచేశారు. కొందరిని స్వయంగా కలిసి గోడువినిపించారు. అయినా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. విధుల్లోకి చేర్చుకోలేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అమలుచేయాలని, ఉద్యోగాలిప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. – లక్కవరపుకోట -
అంగన్వాడీలకు రూ.26వేలు వేతనం చెల్లించాలి
విజయనగరం గంటస్తంభం: అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలోని ఎన్పీకే ఆర్ శ్రామిక్ భవన్లో స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి విశాలాక్షి అధ్యక్షతన సోమవారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసీడీఎస్కు గతం కంటే అదనంగా కేటాయించిన రూ.150 కోట్లను లెక్కకడితే పిల్లాడికి 5 పైసలు వస్తుందన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు ఆ నిధులు సరిపోవన్నారు. విద్య, వైద్య రంగాలకు, ఉపాధి హామీ పథకానికి అరకొరగా నిధులు కేటాయించి గొప్పగా చెప్పుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెట్టిందని, అందులో భాగమే 4 లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. కోటి మందికి పైగా ఉన్న స్కీమ్ వర్కర్స్ను కార్మికులుగా గుర్తించడానికి మోదీ అంగీకరించడం లేదని, 8 గంటల పనిదినాన్ని 12 గంటలుగా మార్పు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. 20వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఐసీడీఎస్కు తగినంత కేటాయింపులు చేయాలని, అంగన్వాడీల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహనరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పైడిరాజు, మంగవేణి, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
రైతులకు ఆదాయం పెంచే సూచనలివ్వండి
విజయనగరం ఫోర్ట్: రైతులకు ఆదాయం పెంచేలా సూచనలు, సలహాలు అందించాలని ఆచార్య ఎన్.జి.రంగా సహాయ విస్తరణ సంచాలకులు బి.ముకుందరావు సూచించారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరకు సాగు విస్తీర్ణం పెంచి బెల్లం తయారీకి రైతులను ప్రోత్సహించాలన్నారు. మొక్కజొన్నలో కాండం తొలుచుపురుగు ఉద్ధృతి పెరుగుతోందని, నివారణ చర్యలను రైతులకు వివరించాలన్నారు. అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను అందించాలని సూచించారు. రెల్లరాల్చు పురుగు వల్ల రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగువిధానాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు సీహెచ్ ముకుందరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కెల్ల లక్ష్మణ్, ఎం.వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు
● అమృత్ భారత్ పనులు పరిశీలించిన రైల్వే జీఎంపార్వతీపురంటౌన్: ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్ను నిర్మిస్తున్నామని ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర ఫంక్వాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ఎఫ్ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశాఖ డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింగల్, సీఏఓ అంకుస్ గుప్త, సీనియర్ డీసీఎం కె సాందీప్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ (భువనేశ్వర్) సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్లో బయలుదేరిన ఆయన రాయగడ మీదుగా జిమిడిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం మీదుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో విజయనగరం రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. అడుగడుగునా ట్రాక్ల పరిశీలనతో పాటు మలుపులు, హెచ్చరికబోర్డులు, ట్రాక్ పాయింట్లు, ఆర్యూబీలు పర్యవేక్షి ంచారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయనాయకులు, ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించారు. అమృత్భారత్ నిధుల్లో భాగంగా ప్రయాణికులకు ప్రత్యేక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ను ప్రారంభించారు. అమృత్భారత్ స్టేషన్ అభివృద్ధిపనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చేపట్టాల్సిన పనులౖపై సూచనలు చేశారు. -
పేదల ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నం
● ప్రజలు ప్రతిఘటించడంతో వెనుదిరిగిన అధికారులుసాలూరు: రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు నివాసముంటున్న ఇళ్లను కోర్టు ఆదేశాలతో కూలగొట్టేందుకు అధికారులు జేసీబీతో రాగా, తమ గూడును తొలగించవద్దంటూ పేదలు వాపోయి ఆందోళన చేసి ప్రతిఘటించారు. సాలూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఉన్న రైల్వేస్టేషన్ రోడ్డులో పేదలు నివాసముంటున్న పూరిళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సోమవారం పూనుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న పేదల ఇళ్లను కూల్చేందుకు యత్నించారు. వెంటనే బాధిత ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దంటూ గగ్గోలు పెట్టారు. పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి ఎన్వై నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శ్రీనువాసరావు సదరు బాధిత పేదలకు అండగా నిలిచారు. పేదలతో కలిసి నాయకులు సంఘటనాస్థలానికి అధికారులు, పోలీసులతో తీసుకువచ్చిన జేసీబీని అడ్డుకున్నారు. నిరుపయోగంగా ఉన్న కొన్ని పూరిళ్లను తొలగించారు. ఈ సందర్భంగా పేదలు కమిషనర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న చోటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో పేదలు ఊపిరిపీల్చుకున్నారు. -
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
విజయనగరం ఫోర్ట్: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 9 పీహెచ్సీల వైద్యాధికారులు సిబ్బందితో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి వారు సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ను లబ్ధిదారులందరికీ వేసేలా చూడాలని చెప్పారు. టీబీ గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఒళ్లంతా తిమ్మిర్లుగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతో పాటు వాంతులు గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధి పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నాడీ వ్యవస్థను ఈవైరస్ దెబ్బతీస్తుందని తెలిపారు. దీంతో రోగి పక్షవాతం బారిన పడతారన్నారు. ఇది అంత ప్రమాదకరం కాదని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఎల్ఓ డాక్టర్ కె. రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుత కుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
హోటల్స్కు స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్
విజయనగరం అర్బన్: పర్యావరణ హితంగా పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ తెలిపారు. అందుకోసం ఘన వ్యర్థాల నిర్వహణ, మానవ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణల ఆధారంగా మూడు విధాలుగా మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో సబ్ కమిటీలు హోటల్స్ను తనిఖీ చేసి రేటింగ్ కోసం సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్ను హోటళ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చని అందువల్ల ఆయా హోటళ్ల ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న హోటల్స్ను ప్రభుత్వమే వెబ్సైట్లో పెట్టి ప్రోత్సహిస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీపీఓ వెంకటేశ్వరరావు, పలు హోటళ్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు, బాబూరావు కలెక్టర్ను పుష్పగుచ్చంతో సత్కరించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
జర్నలిస్టు సంఘాల నిరసన
● జర్నలిస్టుపై దాడిచేసిన టీడీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు వినతివిజయనగరం అర్బన్: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై దాడి చేసిన టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టుపై చేసిన దాడికి నిరసనగా స్థానిక కలెక్టరేట్ వద్ద గల గాంఽధీ విగ్రహం దగ్గర సోమవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విఽధినిర్వహణలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణలపై వార్త కవరేజ్ కోసం విలేకరిపై దాడి చేయడం, చంపుతానని బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించని అధికారుల పనులపై, మంత్రి కార్యక్రమాలపై ఎందుకు రాశావని అసభ్యకరమైన పదజాలంతో దూషించి భౌతిక దాడికి పాల్పడడం దారుణమని వాపోయారు. ఇకపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించిన వేణుగోపాల్ నాయుడిని కఠినంగా శిక్షించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సత్యనారాయణ, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్, ప్రజాశక్తి ప్రతినిఽధి సీహెచ్.రాము, వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డేవిడ్ రాజు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం పార్వతీపురం: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వల్ల ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విలేకరులపై దాడులు చేయడం సరికాదని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అల్లువాడ కిశోర్ పేర్కొన్నారు. ఈ మేరకు మక్కువ మండల విలేకరిపై భౌతికదాడులకు పాల్పడడంతో పాటు చంపుతానని టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు హెచ్చరించిన చర్యను ఖండిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడులకు నిరసనగా పలు నినాదాలు చేశారు. విలేకరిపై దాడి సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, విలేకరికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సంఘ సభ్యులు జిల్లా కార్యదర్శి గండి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావుతోపాటు జిల్లాలోని వివిధ పత్రిలు, మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
సీ్త్ర, పురుష నిష్పత్తిని తగ్గించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అధికంగా ఉంటున్నదని, దీనిని తగ్గించేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. జిల్లాలో ఉన్న 110 స్కానింగ్ కేంద్రాల ద్వారా రోజువారీ జరుగుతున్న స్కానింగ్ల సమచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గర్భిణులకు అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చికిత్సలకు వైద్యులు సిఫార్సు చేస్తూ పేద కుటుంబాలపై అనవసర ఆర్థికభారం మోపుతున్నారని, దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన గర్భిణులు, వారిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు ఆయా నెలల్లో జరిగే అబార్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు కూడా స్కానింగ్ సెంటర్స్ను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఎన్సీడీ పీఓఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
కూటమి తూట్లు
సర్పంచ్ల హక్కులకు.. విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, సర్పంచ్ల హక్కులు, అధికారాలను కాలరాస్తూ ఉపాధిహామీ పనులను వెండర్ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంపై స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కలెక్టరేట్కు సోమవారం చేరుకుని ప్రభుత్వ తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. ఉపాధిహామీ పనుల్లో వెండర్ విధానం వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకాపీలను చూపించారు. న్యాయస్థానం ఉత్తర్వులు అమలుచేయాలంటూ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. ● పంచాయతీ తీర్మానాలను పక్కనపెట్టి... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 ప్రకారం ఉపాధిహామీ పనుల్లో 50 శాతం కూలీలకు కచ్చితంగా పనికల్పించాలి. యంత్రాలతో పనులు చేయించకూడదు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించకూడదు. గ్రామ సభ అమోదించిన పనులను మాత్రమే చేయాలి. కూటమి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పంచాయతీ తీర్మానాలకు విరుద్ధంగా వెండర్ విధానంలో పనులు కట్టబెడుతోంది. కూటమి కార్యకర్తలు, నాయకులకు ఉపాధి నిధులను దోచిపెడుతోంది. ఈ విధానం తక్షణమే రద్దు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ వర్క్స్లో కాంట్రాక్టు విధానాన్ని కూటమి నేతల లబ్ధికోసమే అమలుచేస్తోందని ఆరోపించారు. ● 2,199 పనులు మంజూరు జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్ వర్క్స్ 2,199 మంజూరయ్యాయి. ఈ పనులు ప్రస్తుతం వెండర్ విధానంలో జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తారు రోడ్లు, మెటల్ రోడ్లు వంటి పనులకు రూ.152 కోట్లు, ప్రహరీ నిర్మాణాలకు రూ.12 కోట్లు వెచ్చించనున్నారు. వెండర్విధానాన్ని రద్దుచేయాలంటూ పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించరాదని తీర్పు ఇచ్చింది. దీనిని అమలుచేయాలంటూ వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం ప్రతినిధులు మామిడి అప్పలనాయుడు, పీరుబండి జైహింద్కుమార్, వర్రి నరసింహమూర్తి, అంబళ్ల శ్రీరాములునాయుడు తదితరులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పల్లెల్లో కూటమి ప్రభుత్వ ప్రత్యేక చట్టం అమలు వెండర్ విధానంలో ఉపాధిహామీ పనులు సర్పంచ్ల తీర్మానానికి చెల్లు హైకోర్టు తీర్పు ఉన్నా బేఖాతరు ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్కు ఫిర్యాదు సర్పంచ్ల హక్కులను కాలరాయొద్దు కూటమి ప్రభుత్వం సర్పంచ్ల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. పంచాయతీ తీర్మానం, స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పనులు చేయడం సమంజసం కాదు. కాంట్రాక్ట్ (వెండర్ ) విధానాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. అమలు చేయకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని అశ్రయిస్తాం. – గార తవుడు, జెడ్పీటీసీ సభ్యుడు, గజపతినగరం నిధులు దుర్వినియోగం ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండేది. గ్రామ సభల ఆమోదంతో పనులను గుర్తించి, అభివృద్ధి పనులు చేపట్టేవారం. ప్రస్తుతం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా వెండర్స్ విధానాన్ని తీసుకువచ్చి పంచాయతీల ఆమోదం లేకుండా పనులు చేపడుతుండడం విచారకరం. ఇది ఉపాధిచట్టానికి విరుద్ధం. – ఎం.రమ్య, సర్పంచ్, కొండకరకాం, విజయనగరం మండలం ఇష్టారాజ్యమంటే కుదరదు మేమంతా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులం. పంచాయతీ పరిధిలో ఏ పనులు చేస్తే రైతులు, ప్రజలు, పంచాయతీకి ఉపయోగకరంగా ఉంటాయో మాకు తెలుస్తాయి. ఆ మేరకు పనులకు తీర్మానాలు చేస్తాం. వీటిని పక్కనపెట్టి, మా హక్కులు కాలరాసేలా ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లతో చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టు కూడా ఇదే చెప్పింది. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – అలమండ వాణి. సర్పంచ్, బుడతానాపల్లి స్థానిక సంస్థలు ఖూనీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టేలా వెండర్స్ విధానాన్ని తీసుకువచ్చి వారితోనే పనులను చేయించడం దుర్మార్గం. న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. – కునుకు వెంకటరావు, సర్పంచ్, గుంకలాం గ్రామం, విజయనగరం మండలం చట్ట విరుద్ధం కూటమి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఉపాధిహామీ పనుల్లో వెండర్ (కాంట్రాక్ట) విధానాన్ని రద్దు చేయాలి. సర్పంచ్ల తీర్మానం ప్రకారం మెటీరియల్ పనులు చేపట్టాలి. ఉపాధిహామీ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలి. – లెంక రత్నాకర్ నాయుడు, మెంటాడ -
వెన్నశాతం పెంపుతో రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: ఆవు పాలు వెన్నశాతాన్ని 2.8 నుంచి 3.1 శాతానికి విశాఖ డెయిరీ యాజమాన్యం పెంచిందని, దీనివల్ల పాల రైతులు నష్టపోతారని, దీనిని 2.8 శాతంగానే ఉంచాలని ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్దరాజు రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక రైతు సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 లీటర్ల కంటే తక్కవ పాలు సేకరిస్తున్న కేంద్రాల నిలుపుదల నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలన్నారు. విశాఖ డెయిరీపై వేసిన హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేయాలన్నారు. డెయిరీని సహకారం రంగంలోకి తీసుకురావాలన్నారు. దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహకంగా లీటర్కు రూ.5 ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు ఆదినారాయణ, కృష్ణమూర్తి, ఎస్.గో పాలం, పైడిపునాయుడు, గంగునాయుడు, సత్యనారాయణ, చుక్క అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ జీవీలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో రెండు రోజులు నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏక్తార్ ఎక్స్ఎక్స్వీ’ అనే అంశంపై నిర్వహించిన ఈ సింపోజియంను యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్–జి రిటైర్డ్ శాస్త్రవేత్త పి.త్రిమూర్తులు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో విజయానికి విద్య, వృత్తి నైపుణ్యాలు ముఖ్యమన్నారు. ఉన్నత ఉద్యోగాలకు, పదవుల ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం విశిష్ట అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థల సంబంధాల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజేనాగరాజు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వీఎస్ వకుళ, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు పి.శ్రీనివాసులురెడ్డి, టి.శిరీష, వివిధ కళాశాలల నుంచి హాజరైన 400 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతుబజార్లో నేరుగా కూరగాయల విక్రయం●
● రైతులకు పిలుపునిచ్చిన అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ● సాక్షి కథనానికి స్పందనపార్వతీపురంటౌన్: రైతులు పండించే కూరగాయలను నేరుగా రైతుబజార్లో విక్రయించుకోవచ్చని అగ్రి ట్రేడ్–మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం సాక్షిలో ‘రైతులు లేరు..జని రారు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పంచాచారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుబజార్లో రైతులు తమ కూరగాయలను రైతులు విక్రయించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తు తం కూరగాయల పంట సీజన్ అయినందున, అధిక సంఖ్యలో దిగుబడి రావడం, తమ ప్రాంతాల్లో తగినంత గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నట్లయితే మీ పల్లె లేదా మండలాల్లోని ఉద్యానవన శాఖ అధికారులు లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను కలిసి తగిన వివరాలు ఇస్తే, జిల్లాలోఉన్న అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ శాఖ ద్వారా మీ సరుకును పార్వతీపురంలోని రైతు బజార్లో నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు ఏ విధమైన నష్టం వాటిల్లదని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సందేహాల నివృత్తి కోసం ఫోన్ 91823 61348 నంబర్ను సంప్రదించవచ్చని ప్రకటనలో వివరించారు. గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదంకొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో అందరూ ఉండగానే గ్యాస్లీకై మంటలు రావడం గమనించి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కలకు చెందిన యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఈక్రమంలో బి.అప్పలరాజు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని కొత్తవలస ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కాగా ఈ సమాచారం చెంతనే గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ కార్మాగారం యాజమాన్యానికి అందించగా కర్మాగారానికి చెందిన ఫైర్ ఇంజిన్తో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 200జీబీఎస్పై అప్రమత్తం● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం: గులియబుల్ భారే సిండ్రోమ్ (జీబీఎస్)పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జీబీఎస్పై వైద్యశాఖ, పంచాయతీరాజ్శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు జీబీఎస్పై అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించడంతో పాటు వేడినీరు తాగడం, వేడి ఆహార పదార్ధాలను తీసుకోవాలని తెలియజేయాలన్నారు. సమావేశంలో కేఆర్ఆర్ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్తో ఎంఆర్ కళాశాల ఎంఓయూనెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయం విజయనగరం మహారాజా కళాశాలతో సోమవారం ఎంఓయూ కుదుర్చుకుంది. కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సాంబశివరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంటర్న్షిప్లు, పరిశోధన, నైపుణ్యం, తదితర అవకాశాలకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ సన్నీడయోల్, డాక్టర్ విజయ్బాబు, పుష్పలత, ఐక్యూసీ హెడ్ ప్రొఫెసర్ ఎంఎంల్ఎన్ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తావిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలోని జరిగిన డీఅర్ఎం కప్ 8వ రాష్ట్రస్థాయి ఉమెన్న్స్ సీనియర్ బాక్సింగ్ చాంపంయన్ షిప్ 2025లో విజయనగరం క్రీడాకారులు మూడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. విజేతల్లో ఎస్. షర్మిల 70 కిలోల రజత పతకం, మనోజి 75 కిలోల విభాగంలో రజత పతకం, సుమిత్ర 80 కిలోల కేటగిరిలో రజత పతకం, ఎన్.రమ్య 57 కిలోల కేటగిరిలో కాంస్య పతకం, బి.పూజిత 65 కిలో కేటగిరిలో కాంస్య పతకం, 60 కిలోల విభాగంలో వై.అనుష కాంస్య పతకం దక్కించుకున్నారు. విజేతలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు అభినందించారు. 100 లీటర్ల సారా స్వాధీనం● ● ఇద్దరిపై కేసు నమోదుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి, పులిగూడ గ్రామాల్లో సారా అమ్మకాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారాను కలిగి ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇరిడి గ్రామంలో బిడ్డిక గుండు 80 లీటర్ల సారాతో, పులిగూడ గ్రామానికి చెందిన ఊయక కిరణ్ కుమార్ 20 లీటర్ల సారాతో పట్టుబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల మండలాల్లో సారా తయారీ, విక్రయాలు, సరఫరా అరికట్టేందుకు దాడులు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని విశాఖ–అరుకు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం పుణ్యగిరి కళాశాల వద్ద బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బద్దు మహేందర్ అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం 1.30 సమయంలో బైక్పై రోడ్డు దాటుతుండగా, విశాఖపట్నానికి చెందిన బసవబోయిన దుర్గాప్రసాద్(17) అనే యువకుడు తన మోటార్ సైకిల్పై కొత్తూరు నుంచి ఎస్.కోట వైపు వేగంగా వస్తూ మహేందర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయాల పాలవగా, తలకు గాయమైన దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
● ఒక్క ఉచిత విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం ● ఉచిత విద్యుత్కు తూట్లు పొడుస్తున్న కూటమి ఏడు నెలలవుతోంది ఏడు నెలల క్రితం వీరఘట్టం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉచిత విద్యుత్ మీటరు కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారని లైన్మెన్ను అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – లెంక జగదీశ్వరరావు, రైతు, నడుకూరు గ్రామం, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లావీరఘట్టం: ● పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రామకృష్ణ అనే రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. ఇంతవరకు ఆయన దరఖాస్తును పరిశీలించిన దాఖలాలు లేవు. ● అలాగే వీరఘట్టం గ్రామానికి చెందిన మంచుపల్లి గోపాలం అనే మరో రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం తన దరఖాస్తును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రైతుకు కూడా ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇలా వీరఘట్టం మండలంలో 15 మంది రైతులు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, మరో 30 మంది వీరఘట్టం ట్రాన్స్కో కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేశారు. ఇలా వీరఘట్టం మండలంలో ఇంతవరకు 45 మంది వరకు రైతులు ఉచిత విద్యుత్ వ్యవసాయ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ● ఉచిత విద్యుత్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం దశల వారీగా మంగళం పాడుతోంది. రైతులకు ఆపన్న హస్తంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.అందుకోసం పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏకంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరునే ప్రభుత్వం నిలిపి వేసింది. గతేడాది 2024 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఒక్కటి కూడా కూడా మంజూరు చేయలేదు. ఆగస్టు నెలాఖరు వరకు మంజూరు చేసిన కనెక్షన్లు కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమోదించిన వాటికే కనెక్షన్లు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు. రాష్ట్రంలో 1.50 లక్షల దరఖాస్తుల పెండింగ్.. పార్వతీపురం జిల్లాలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటీకీ వాటికి ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఇప్పటికీ 2,500లకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.వాటిని పరిష్కరించి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. కనీసం ఆ దరఖాస్తులను ఇంతవరకు పరిశీలించకపోవడం కానీ, స్క్రూట్నీ చేయకపోవడం కానీ ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 2,500మందికి పైగా రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అందనీయకుండా తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం సుమారు 1.50 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రాధాన్యతా క్రమంలో మంజూరు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గతేడాది ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేశా. మిగిలిన దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ కావాల్సిన వారు 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది పరిశీలించి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. – ఎస్.చలపతిరావు, ట్రాన్స్కో ఎస్ఈ, పార్వతీపురం మన్యం జిల్లా -
జిల్లాకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి
● స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్ విజయనగరం లీగల్: నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి ఆదివారం వచ్చారు. ఈ మేరకు ఆయనను మర్యాదపూర్వకంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ డాక్ట ర్ బీఆర్ అంబేడ్కర్లు కలిసి సాదర స్వాగతం పలికారు. జిల్లా కోర్టుకు చెందిన పలువురు న్యాయాధికారులు కూడా హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, కలెక్టర్, ఇతర న్యాయాధికారులతో జెడ్పీ అతిథి గృహంలో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు ముచ్చటించారు. పారా ఒలింపిక్స్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులువిజయనగరం: ఈనెల 17 నుంచి 20 వరకు చైన్నెలో జరగబోయే 23వ పారా ఒలింపిక్స్ జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీలకు ఆదివారం జిల్లా నుంచి బయల్దేరిన క్రీడాకారులకు పారా ఒలింపిక్స్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పారా ఒలింపిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన సుంకరి దినేష్, దొగ్గా దేముడు నాయుడు, బోదల వాసంతి, కిల్లక లలిత పరుగు 100 మీ టర్లు, 400 మీటర్లు, షాట్పుట్ అంశాల్లో అత్యు త్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల కు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి ప్రతి ఒక్కరూ పతకాల ను సాధించి, తద్వారా జిల్లా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సజావుగా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికక్షయ కబళిస్తోంది..! క్షయ వ్యాప్తిని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభు త్వం పైలెట్ ప్రాజెక్ట్గా విజయనగరం జిల్లాలో టీబీ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. –8లోసమస్యలపై స్పందించరూ..! రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. –8లోఅక్రమ రవాణా నియంత్రణకు గట్టి నిఘారామభద్రపురం: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రామభద్రపురం మండలకేంద్రం అడ్డాగా మారడం, వాహన తనిఖీలలో పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడుతుండడం వంటి సంఘటనలు ఇటీవల సంభవించడంతో ఈ నెల 13వ తేదీన గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా రామభద్రపురం శీర్షిక సాక్షి కథనం ప్రచురించింది.ఆ కథనానికి స్పందించిన ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి అక్రమరవాణా నియంత్రణకు మరింతగా గట్టి నిఘా పెంచారు.ఈ క్రమంలో ఆదివారం ఆరికతోట జంక్షన్ వద్ద డైనమిక్ వాహన తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టమాటో @ 4బొబ్బిలి: కూరగాయల ధరలు భిన్నంగా ఉంటున్నాయి. నిన్నమొన్నటి వరకు బాగా గిరాకీ పలికి టమాటోల ధర అమాంతం పడిపో యింది. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు మార్కెట్కు తీసుకువస్తే రూ.4లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తమ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. అమ్మ పెట్టదు..దొరికింది తిననివ్దదు..అన్నట్లు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి ఏడునెలలు గడుస్తున్నా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన వారి నోటిముందర కూడు కూడా లాగేస్తోంది. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసింది. ఆర్థిక స్థోమత లేక ఆ స్థలాల్లో కాస్త ఆలస్యంగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన వారి ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ లబ్ధిదారులకు గూడు కరువయ్యేలా చర్యలు చేపడుతోంది. –చీపురుపల్లి రూరల్(గరివిడి)గరివిడి మండలంలోని కోనూరు జగనన్న కాలనీగరివిడి మండలంలోని కోనూరు గ్రామానికి చెందిన మీసాల ఆదినారాయణకు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇంటి పట్టా మంజూరైంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇల్లు నిర్మించడం ఆలస్యమైంది. కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుని ఇల్లు నిర్మించుకోవడం కోసం గతప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో పునాదులు తవ్వాడు. ఇంతలో గృహ నిర్మాణశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ లబ్ధిదారుకు షాక్ ఇచ్చారు. నీ ఇంటి పట్టా క్యాన్సిల్ అయ్యింది, నీవు సకాలంలో ఇల్లు నిర్మించుకోని కారణంగా పట్టా క్యాన్సిల్ అయ్యింది, ఒకవేళ నిర్మించుకున్నా బిల్లు అయ్యే పరిస్థితి ఉండదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక ఆ లబ్ధిదారు ఇంటి నిర్మాణం ఆపేశాడు. అలాగే ఇదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారు కరణం సత్యవతి కూడా ఇల్లు నిర్మించుకుందామని జగనన్న కాలనీలో గల ఇళ్ల పట్టా స్థలంలో పునాదులు తవ్వేందుకు సిద్ధమైంది. ఆమెకు కూడా పట్టా క్యాన్సిల్ అయ్యింది, నిర్మాణం చేసినా బిల్లు వచ్చే పరిస్థితి లేదని స్థానిక నాయకులు చెప్పడంతో ఆమె అధికారుల వద్దకు వెళ్లి తన పట్టా కోసం అడగ్గా పట్టా క్యాన్సిల్ అయ్యిందని, కూటమి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేస్తే నిర్మాణం చేసుకోవచ్చని అధికారులు తెలియజెప్పడంతో వెనుదిరిగింది. ఇలా ఈ ఇద్దరు లబ్ధిదారులే కాదు. ఈ ఒక్క గ్రామంలోనే పదిమంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను కోల్పోయారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు నోచుకోలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్న విమర్శలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1965 పట్టాలు మంజూరు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదల కోసం జగనన్న కాలనీలో 1965 ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. స్వంత ఇంటి స్థలానికి నోచుకోని, ఆర్థికంగా వెనుకబడిన వారికి జగనన్న లే అవుట్లు ఏర్పాటు చేసి అందులో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి వెంటనే బిల్లులు కూడా మంజూరు చేయడంతో చాలామంది వరకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొంత మంది రెండో దశలో మంజూరైన లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడంలో ఆర్థిక సమస్యలతో ఆలస్యం చేశారు. చివరకు ఇంటిని నిర్మించుకుందామని పునాదులు తవ్వేసరికి ఇంటిపట్టా క్యాన్సిల్ అయ్యిందని అధికారుల నుంచి సమాధానం రావడంతో ఆ పేదింటి కుటుంబాలు సొంత గృహాలకు నోచుకోలేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చి న కూటమి ప్రభుత్వం మళ్లీ సొంతింటి పట్టాలిస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల పట్టాలిచ్చినా తమకు వస్తుందో రాదో? అధికార పార్టీ వారికి కేటాయిస్తారోనన్న అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా నేటికీ ఇచ్చిన హామీల అమలుకు నోచుకోని పరిస్థితుల్లో ఇళ్ల పట్టాల మంజూరు ఎంతవరకు అమలు జరుగుతుందోనని లబ్ధిదారులు వాపోతున్నారు. మత్తు వదలరా సోదరా..!వంగర: ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలు కావొద్దని ఎస్సై షేక్శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధి శివ్వాం గ్రామంలో నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, మ ద్యం, గుట్కా, ఖైనీ వంటి పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచించారు. విజయనగరం రూరల్: నగరంలోని బాబామెట్ట విజ్జీ క్రీడా ప్రాంగణంలో ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల క్రికెట జట్టు ఎంపిక పోటీలు సజావుగా జరిగాయి. ఎంపిక పోటీలకు ముందు దివ్యాంగుల క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి సూర్యనారాయణ వర్మలు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైకల్యాన్ని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న క్రీడాకారుల ఆసక్తిని అభినందించారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీ ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 57 మంది క్రీడాకారులు పాల్గొన్నారని దివ్యాంగుల క్రికెట్ సంఘం సలహాదారు పి.మహేంద్ర తెలిపారు. న్యూస్రీల్ ఇంటి నిర్మాణంలో ఆలస్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు అయోమయంలో లబ్ధిదారులునియోజక వర్గంలో ఇళ్ల పట్టాల వివరాలు.. చీపురుపల్లి నియోజకవర్గంలో గల చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో 1965 ఇళ్ల పట్టాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 1006 స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోగా 160 పట్టాల్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించలేదు. 799 పట్టాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించని పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు సొంతగృహాలకు నోచుకోకుండా పోతున్నారు. పట్టాలను క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసం. ఇల్లు నిర్మించుకోలేని పేదల కోసం గత ప్రభుత్వం లే అవుట్లు నిర్మించి పట్టాలిచ్చింది. అవకాశం ఉన్న వారందరూ నిర్మించుకున్నారు. కాస్త ఆర్థిక అవకాశం తక్కువగా ఉన్నవారు నిర్మాణం చేపట్టేసరికి ఆలస్యమైంది. ఇప్పుడు నిర్మించుకుందామంటే పట్టాలు క్యాన్సిల్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏం కావాలి? ఇదే సమస్యపై మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను ప్రశ్నించాం.పట్టాలు క్యాన్సిల్ చేయకుండా నిర్మాణాలకు అవకాశం ఇచ్చేలా చూడాలని కోరాం. –బూడి శ్రీరాములు, సర్పంచ్, కోనూరు, గరివిడి మండలంపట్టాలు క్యాన్సిల్ అయ్యాయి ఇళ్ల పట్టాలను మేం క్యాన్సిల్ చేయలేదు. సకాలంలో నిర్మాణం చేయని పట్టాలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు పట్టాలిస్తే అప్పుడు నిర్మించుకోవాలి.ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. –నవీన్, గృహనిర్మాణశాఖ ఏఈ -
క్షయ కబళిస్తోంది..!
● టీబీ వంద రోజుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల గుర్తింపు ● రెండు నెలల్లో 401 కేసుల నిర్ధారణ ● గతేడాది డిసెంబర్ 7న జిల్లాలో ‘టీబీ వంద రోజుల కార్యక్రమం’ ప్రారంభం ● రెండు నెలల్లో 28, 800 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలుపరీక్షలు చేసుకోవాలి.. రెండు వారాలకు మించి దగ్గు , జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కఫం పరీక్ష చేసుకోవాలి. జిల్లాలో కఫం పరీక్ష కేంద్రాలు 34 ఉన్నాయి. అదేవిధంగా టీబీ యూనిట్లు 14 ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా పరీక్ష చేసి మందులు అందజేస్తారు. 28,800 మందికి పరీక్షలు.. టీబీ వంద రోజుల కార్యక్రమంలో ఇప్పటివరకు 4.38 లక్షల మందిని స్క్రీనింగ్ చేశారు. ఇందులో 28, 800 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 401 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 1411 మంది క్షయవ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. -
సంచారం ఓ చదరంగం..!
● పశు ఆరోగ్యసేవలపై ప్రభుత్వం కుట్ర.. ● సేవలు నిలిపివేయాలని ఆదేశాలు ● నిలిచిపోయిన మొదటి విడత ప్రారంభమైన ఏడు వాహనాలు ● ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది ● ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ ● ఉన్న పళంగా తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పి స్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్అసిస్టెంట్స్, వెలుగులో పని చేసే వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్లు, వాచ్మె న్, పాఠశాలల్లో పనిచేసే వాచ్మెన్, ఆయాలను తొలగించారు. తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే సిబ్బందిని తొలిగించేశారు. పేజ్–1లో నియమితులైన అందరికీ టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ చేశారు. ఒక్కసారిగా తొలగింపు ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు అంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 13 వాహనాలు సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 13 ఉన్నాయి. మొదటి విడతలో 7 వాహనాలు వచ్చాయి. రెండో విడతలో వచ్చిన 6 వాహనాలు ఉన్నాయి. మొదటి విడతలో విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. రెండో విడతలో గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట, రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. మొదటి విడతలో వచ్చిన ఏడు వాహనాలను ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అదేవిధంగా సిబ్బందికి టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి. ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది పని ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పన సిబ్బంది పనిచేసేవారు. ఒక డ్రైవర్, పారవిట్, పశువైద్యుడు పనిచేసేవారు. అదేవిధంగా 6 వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారు. అయితే ఉన్నపళంగా వారిని విధుల నుంచి తొటగించడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పశువుల చెంతకు వెళ్లి సేవలు మూగజీవాలు అనారోగ్యానికి గురైతే వాటి చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో అనారోగ్యానికి గురైన ఎన్నో పశువులకు ఈ వాహనాల ద్వారా వైద్య సేవలు అందించారు. పశువుల చెంతకే వచ్చి వైద్యసేవలు అందించడం వల్ల పాడి రైతులు ఎంతో సంతోషించేవారు. ఈ వాహనాలు రాకముందు ఏదైనా పశువుకు అనారోగ్యం వస్తే పశు వైద్యశాలలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. మళ్లీ పాత రోజులే వచ్చే పరిస్థితి కనిపిస్తోందని పాడి రైతులు వాపోతున్నారు. ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు ఆరోగ్య సేవను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నిర్వహించేది. ఫిబ్రవరి 15, 2025తో ఆ సంస్థ టెండర్ కాలపరిమితి అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా సేవలను నిలిపివేసింది. ఏదైనా సంస్థకు టెండర్ కాలపరిమితి అయిపోయినప్పడు కొత్తగా టెండర్లు పిలిచి నూతన సంస్థ బాధ్యతలు స్వీకరించేవరకు పాత సంస్థను కొనసాగించేవారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. కొత్త సంస్థ బాధ్యతలు తీసుకోకుండానే పాత సంస్థ సేవలను నిలిపివేశారు. అలాగే కొత్త సంస్థ పాత ఉద్యోగులను కొనసాగించకుండా టెర్మినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు వాస్తవమే మొదటివిడతలో జిల్లాకు మంజూరైన ఏడు సంచార పశు ఆరోగ్య సేవల వాహనాల సేవలు నిలిపివేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఆదివారం నుంచి సేవలు నిలిపివేశాం. ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఉద్యోగులకు వాటిని అందజేశాం. –బి.నారాయణరావు, జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ జిల్లా మేనేజర్ -
● రెండేళ్ల కిందట సమూల మార్పులు తీసుకొచ్చిన గత ప్రభుత్వం ● గతంలో 11 పేపర్లు..11 రోజుల పాటు పరీక్షలు ● నేడు సులువుగా చదువుతున్న టెన్త్ విద్యార్థులు ● ఇప్పుడు 6 సబ్జెక్టులు..7 పేపర్లు ● ఒక్కో పేపర్కు వందమార్కులు ● విద్యార్థులపై తగ్గిన ఒత్తిడి ● జిల్లాలో
రెండేళ్ల క్రితం వరకు పది పరీక్షలను 11 రోజుల పాటు 11 పేపర్లు నిర్వహించేవారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యేవారు. ముఖ్యంగా పరీక్షలంటే విద్యార్థుల్లో ఆందోళన ఉండేది. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్లుగా మార్చింది.దీంతో విద్యార్థులపై కొంత మేర ఒత్తిడి తగ్గింది. ఈ ఏడాది అదే విధానాన్ని అనుసరించనుండడంతో పాటు ప్రతి పరీక్షకు ఒక రోజు విరామం ఇచ్చారు. జిల్లాలోని 447 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తం 23,774 మంది విద్యార్థులు 119 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. అయితే పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లో హడావుడి, మానసిక ఒత్తిడి సాధారణం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒకింత పరీక్షే. గతంలో 11 రోజులు పరీక్షలు రాయాల్సి ఉండడంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేవారు. అయితే ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్ల విధానంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గింది. అలాగే పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ప్రకటించడంతో గత విద్యాసంవత్సరం మాదిరిగానే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఏడు పేపర్లు నిర్వహించనున్నారు. గతంలో ఇలా.. పదో తరగతి పరీక్షలు చాలా సంవత్సరాల నుంచి 11 పేపర్లుగా నిర్వహించేవారు. హిందీ మినహా తెలుగు, ఇంగ్లీషు, గణితం, సోషల్, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 50 మార్కుల చొప్పున రెండు పేపర్ల ప్రకారం జరిగేవి. కరోనా ప్రభావంతో 2019–20 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేశారు.కరోనా తీవ్రత తగ్గడంతో 2021–22 విద్యా సంవత్సరంలో 11 పేపర్లను 7 పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సోషల్ సబ్జెక్టుల్లో ఒక్కో పేపర్కు 100 మార్కులు చొప్పున ఫిజిక్స్, బయాలజీ పేపర్లు ఒక్కో పేపర్కు 50 మార్కులు నిర్దేశించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత విధానానికి స్వస్తి పలకడంతో విద్యార్థులకు భారం తగ్గింది.ఒత్తిడి తగ్గి బాగా చదువుకోవచ్చు.. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గి పరీక్షలు బాగా రాసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షకు పరీక్షకు మధ్య సెలవు రావడం విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అంశాల వారీగా తర్ఫీదు ఇస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. నూతన విధానం ద్వారా పరీక్షల సంఖ్యతో విద్యార్థులపై భారం తగ్గుతుంది. – కె మోహనరావు, డిప్యూటీ డీఈవో -
తప్పని డోలీ మోతలు..
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో ఉన్న తమకు డోలీ మోతలు తప్పడం లేదని.. ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాట మరిచారని గిరిజన సంఘ నాయకులు ధ్వజమెత్తారు. మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన జన్ని రవి అనే యువకుడు ఆదివారం కడుపునొప్పి, విషజ్వరంతో బాధపడడంతో బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఒక కర్రకు తట్టకట్టి రవిని అందులో కూర్చోబెట్టి, గ్రామానికి చెందిన యువకులు సుమారు ఏడు కిలోమీటర్లు కొండల మధ్యగా డోలీని మోసుకుంటూ మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనం దొరక్కపోవడంతో తెలిసిన వారి బైక్పై కూర్చోబెట్టి హుటాహుటిన ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘ నేతలు, గ్రామ యువకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ ఎస్.కోట బహిరంగ సభలో మాట్లాడుతూ, చిట్టంపాడుకు చెందిన గంగులు భార్య, అతడి బిడ్డ వైద్యం అందక చనిపోయారని.. ఇది చాలా అవమానమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా తమ కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిశిఖర గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం చేయకతప్పదని గిరిజన సంఘ నాయకులు జరతా గౌరీష్, తదితరులు స్పష్టం చేశారు. -
మా జోలికి వస్తే చంపేస్తాం...
మక్కువ: ఈ రోజు నుంచి నా జోలికి వచ్చినా.. మా నాయకులు, మినిస్టర్ గురించి రాసినా నీ ఇంటికొచ్చి చంపేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావును బెదిరించారు. పైగా ఆదివారం ఉదయం మండలంలోని వెంగంపేట – కాశీపట్నం మధ్యలో రామారావుపై దాడి కూడా చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు బెదిరించిన వాయిస్ రికార్డు అన్ని సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు తనపై దాడి చేశారంటూ ప్రజాశక్తి విలేకరి రామారావు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వెంకటరమణ వద్ద ప్రస్తావించగా.. టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు నుంచి రక్షణ కల్పించాలని విలేకరి రామారావు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున, ప్రస్తుతానికి ఫిర్యాదు స్వీకరించామని చెప్పారు. దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు దాడి చేయడాన్ని జర్నలిస్తు సంఘాలు ఖండించాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సూరిబాబు, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్ నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, తదితరులు దాడిని ఖండించారు. విలేకరిని బెదిరించిన టీడీపీ మండల అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడుభౌతికదాడులు సరికాదు.. జర్నలిస్ట్లపై భౌతికదాడులు సరికాదు. విలేకరులు తప్పుడు వార్తలు రాస్తే, ప్రెస్మీట్లలో, పబ్లిక్ సమావేశాల్లో అడగడం మంచి పద్ధతి. అంతేగాని కక్షపూరితమైన చర్యలు చేపట్టడం మంచి సంస్కారం కాదు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కొంతమంది కూటమి ముఖ్య నేతలు సైతం వారికి అనుకూలంగా వార్తలు రాయడం లేదన్న కారణంతో దాడులకు తెగబడుతున్నారు. ఈ సంస్కృతి సరైంది కాదు. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం మంచి పద్ధతి కాదు.. విలేకరులు వారి వృత్తిరిత్యా వార్తలు రాస్తుంటారు. అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి.. మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి.. వాటిని రాజకీయ నాయకులు చూసి దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలే తప్ప, వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. – మావుడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు, మక్కువ -
ఆప్కాస్ రద్దు ఆలోచన మానుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఘాల జేఏసీ డిమాండ్ విజయనగరం అర్బన్: ఆప్కాస్ రద్దు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మంత్రివర్గం నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేసే ఆలోచనలో ఉందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా రోస్టర్ పద్ధతి పాటించే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నియామకాలు చేపట్టడం వల్ల వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేల్ వర్తింప చేయకూడదని ఇటీవల విడుదల చేసిన జీఓ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, డి.సాయిప్రసాద్, కె.సురేష్, కె.శ్రీనివాస్, రాజేష్, ఈశ్వరరావు, పి.దుర్గారావు, బి.శ్రీనివాసరావు, మజ్జి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ దొంగ అరెస్ట్
గుర్ల: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో మండలానికి చెందిన సున్నపు ఉదయ్కుమార్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై నారాయణరావు ఆదివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్లెపేటకు చెందిన బూర్లె పెంటం నాయుడు తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని నిలిపివేశాడు. అక్కడకు రెండు గంటల తర్వాత వాహనం కనిపించకపోడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా వాహనం కనిపించకపోవడంతో గుర్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై నారాయణరావు సిబ్బందితో కలిసి వెంటనే నేర చరిత్ర ఉన్న మండలానికి చెందిన సున్నపు ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బైక్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడ్ని చీపురుపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ద్విచక్రవాహనం అపహరణపై కేసు నమోదు.. సంతకవిటి: మండల పరిధి పొనుగుటివలస గ్రామంలో ద్విచక్ర వాహనం దొంగతనంపై కేసు నమోదు చేశామని ఎస్సై ఆర్.గోపాలరావు ఆదివారం తెలిపారు. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని గ్రామానికి చెందిన రెడ్డి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కుంకి ఏనుగులు ఎప్పుడొస్తాయి..? పార్వతీపురం టౌన్: ఏనుగుల సమస్య పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన కుంకి ఏనుగులు ఎప్పుడొస్తాయని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జ్ బత్తిన మోహనరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏనుగుల భారిన పడి ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, సుమారు రూ. 6 కోట్ల మేర ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమన్నారు. కుంకి ఏనుగులు రప్పించి ఏనుగుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలు ఏమయ్యాయన్నారు. 2017లో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రవేశించిన ఏనుగులు ఇప్పటివరకు 12 మందిని పొట్టను పెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ఏనుగులు కూడా ఏడు మృతి చెందాయని చెప్పారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏనుగుల సమస్య పెద్దదేమీ కాదని.. పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఆరోపించారు. ఏనుగుల బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వంగల దాలినాయుడు, కోలా కిరణ్, శిరసపల్లి సాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ● 27న జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం ● 18న తొలి విడత శిక్షణ తరగతులు ● 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ మహారాణిపేట: ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థులు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొలి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీవో)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. -
కన్న కొడుకే కాలయముడు..
విజయనగరం క్రైమ్: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాజులరేగలో జరిగిన హత్య కేసు మిస్టరీని విజయనగరం టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీ రాత్రి తన భర్త సూరిబాబు మృతి చెందాడని అతని భార్య సృజన ఫిర్యాదు చేసిందన్నారు. వెంటనే ఎస్సై మురళి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. విచారణ నిమిత్తం భార్య, స్థానికులతో మాట్లాడగా మృతుడి కుమారుడిపై అనుమానం ఏర్పడిందన్నారు. వెంటనే అతడ్ని స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా.. తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవన్నారు. తండ్రి అడ్డు తొలగిస్తే ఇల్లు తనకు దక్కుతుందని భావించి నిందితుడు (పోలీసులు పేరు వెల్లడించలేదు) ఈనెల 12న తండ్రితో గొడవపడి గుండెలపై పిడి గుద్దులు గుద్దడంతో పాటు కర్రతో బలంగా బాదడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడని చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తండ్రిని హత్య చేసిన కొడుకు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బొబ్బిలి రూరల్: మండలంలోని చింతాడ జెడ్పీ హైస్కూల్లో ఫిజిక్స్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాయల ఈశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్వగ్రామమైన అరసాడ నుంచి శనివారం ఉదయం బైక్పై బొబ్బిలి వస్తుండగా.. కారాడ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంల ద్వారా బొబ్బిలి సీహెచ్సీకి తరలించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. క్రీడాకారుల ఎంపిక రేపు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో త్వరలో జరగనున్న సీనియర్స్ టెన్నీకాయిట్ టోర్నమెంట్లో పాల్గొనబోయే జిల్లా సీ్త్ర, పురుషుల జట్ల ఎంపికలను మంగళవారం చేపట్టనున్నట్లు జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 21 నుంచి కాకినాడ వేదికగా జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు విజయనగరం జిల్లా జట్టు తరఫున పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణను (94917 61126) సంప్రదించాలన్నారు. -
మా జోలికి వస్తే చంపేస్తాం...
మక్కువ: ఈ రోజు నుంచి నా జోలికి వచ్చినా.. మా నాయకులు, మినిస్టర్ గురించి రాసినా నీ ఇంటికొచ్చి చంపేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావును బెదిరించారు. పైగా ఆదివారం ఉదయం మండలంలోని వెంగంపేట – కాశీపట్నం మధ్యలో రామారావుపై దాడి కూడా చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు బెదిరించిన వాయిస్ రికార్డు అన్ని సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు తనపై దాడి చేశారంటూ ప్రజాశక్తి విలేకరి రామారావు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వెంకటరమణ వద్ద ప్రస్తావించగా.. టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు నుంచి రక్షణ కల్పించాలని విలేకరి రామారావు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున, ప్రస్తుతానికి ఫిర్యాదు స్వీకరించామని చెప్పారు. దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు దాడి చేయడాన్ని జర్నలిస్తు సంఘాలు ఖండించాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సూరిబాబు, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్ నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, తదితరులు దాడిని ఖండించారు. విలేకరిని బెదిరించిన టీడీపీ మండల అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడుభౌతికదాడులు సరికాదు.. జర్నలిస్ట్లపై భౌతికదాడులు సరికాదు. విలేకరులు తప్పుడు వార్తలు రాస్తే, ప్రెస్మీట్లలో, పబ్లిక్ సమావేశాల్లో అడగడం మంచి పద్ధతి. అంతేగాని కక్షపూరితమైన చర్యలు చేపట్టడం మంచి సంస్కారం కాదు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కొంతమంది కూటమి ముఖ్య నేతలు సైతం వారికి అనుకూలంగా వార్తలు రాయడం లేదన్న కారణంతో దాడులకు తెగబడుతున్నారు. ఈ సంస్కృతి సరైంది కాదు. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం మంచి పద్ధతి కాదు.. విలేకరులు వారి వృత్తిరిత్యా వార్తలు రాస్తుంటారు. అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి.. మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి.. వాటిని రాజకీయ నాయకులు చూసి దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలే తప్ప, వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. – మావుడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు, మక్కువ -
క్షయ కబళిస్తోంది..!
● టీబీ వంద రోజుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల గుర్తింపు ● రెండు నెలల్లో 401 కేసుల నిర్ధారణ ● గతేడాది డిసెంబర్ 7న జిల్లాలో ‘టీబీ వంద రోజుల కార్యక్రమం’ ప్రారంభం ● రెండు నెలల్లో 28, 800 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలుపరీక్షలు చేసుకోవాలి.. రెండు వారాలకు మించి దగ్గు , జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కఫం పరీక్ష చేసుకోవాలి. జిల్లాలో కఫం పరీక్ష కేంద్రాలు 34 ఉన్నాయి. అదేవిధంగా టీబీ యూనిట్లు 14 ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా పరీక్ష చేసి మందులు అందజేస్తారు. 28,800 మందికి పరీక్షలు.. టీబీ వంద రోజుల కార్యక్రమంలో ఇప్పటివరకు 4.38 లక్షల మందిని స్క్రీనింగ్ చేశారు. ఇందులో 28, 800 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 401 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 1411 మంది క్షయవ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. -
సమస్యలపై స్పందించరూ..!
విజయనగరం టౌన్: రైలు ప్రయాణికుల అభ్యున్నతికి పాటు పడుతున్నామని చెబుతున్న రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడు. ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ (భువనేశ్వర్) వార్షిక పర్యటనలో భాగంగా అభివృద్ధి చెందిన అమృత్భారత్లో ఎంపికై న రైల్వేస్టేషన్గా పేరొందిన విజయనగరం జంక్షన్ను సోమవారం సందర్శించనున్నారు. రైల్వే జీఎం రానున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రైలు ప్రయాణికుల శ్రేయస్సే తమ లక్ష్యమంటూ రైల్వేశాఖ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ప్రయాణికుల సమస్యలు తీర్చడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. రోజుకు సాధారణ టికెట్ల ద్వారా రూ. 3.5 లక్షలు, రిజర్వేషన్ల ద్వారా రూ.3 లక్షలు, పార్సిళ్ల ద్వారా రూ. 25 వేల పైబడి ఆదాయం సమకూరుతోంది. మామిడి ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఉద్యోగ, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయనగరం నుంచే అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ప్రయాణికులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సమస్యల సుడిలో.. ● జిల్లా కేంద్రంలో ఐదో నంబర్ ఫ్లాట్ఫారం నుంచి తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం వరకు గతంలో కంటోన్మెంట్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అందుకు సంబంధించిన అలైన్మెంట్లు వేశారు. ఏళ్లు గడిచిపోతున్నాయి కాని పనులు మాత్రం జోరందుకోలేదు. పనుల్లో భాగంగా పాత బ్రిడ్జి కూల్చేశారు. దాని స్థానంలో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ అవి ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. నామినేటేడ్ ప్లాట్ఫారం పైకి రైళ్లు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ● కంటోన్మెంట్ గూడ్స్షెడ్ నిరుపయోగంగా పడి ఉంది. నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలుమార్లు గంజాయి విక్రయిస్తున్న వారిని, సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న దాఖలాలున్నాయి. ● రైల్వేస్టేషన్లో ఐదు ఫ్లాట్ఫారమ్స్ ఉన్నప్పటికీ కేవలం ఒకటో నంబర్ ఫ్లాట్ఫారంపైనే సులాభ్ కాంప్లెక్స్ ఉంది. ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ● వాస్తవానికి ఒకటో నెంబరు ఫ్లాట్ఫారంపై ప్రయాణికులకు సంబంధించిన రైళ్లు ఆగాల్సి ఉంది. కానీ వాటిని మూడు, నాలుగు ఫ్లాట్ఫారాలకు డైవర్షన్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకటో నంబర్ ఫ్లాట్ఫారంపై గత కొన్నేళ్లుగా గూడ్స్రైళ్లు నిలుపుదల చేస్తుండడంతో వయోవృద్ధులు, దివ్యాంగులు పక్క ప్లాట్ఫారాలకు వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. ● వీటీ అగ్రహారం వద్ద ఉన్న మ్యాంగో యార్డ్ నిరుపయోగంగా ఉంది. ● ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీస్ స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వచ్చినప్పుడు రికార్డులన్నీ తడిచి ముద్దవుతున్నాయి. ● కోరమండల్ ఎక్స్ప్రెస్, హౌరా –కన్యాకుమారి ఎక్స్ప్రెస్లు బాగా డిమాండ్ ఉన్న రైళ్లు. వీటికి విజయనగరంలో స్టాప్ లేదు. దీనిపై దృష్టిసారించాలి. ● చీపురుపల్లి రైల్వేస్టేషన్లో కోణార్క్ , ఫలక్ నుమా వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లకు నిలుపుదల లేదు. దీనివల్ల అక్కడ నుంచి ప్రయాణికులు విజయనగరం, విశాఖ వెళ్లి తమకు కావాల్సిన రైళ్లను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ● గజపతినగరం రైల్వేస్టేషన్ నుంచి బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో బొబ్బిలి, విజయనగరంలలో దిగి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ● ఆదర్శ రైల్వేస్టేషన్లుగా గుర్తింపబడినప్పటికీ బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్లు అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరం. సీతానగరం రైల్వేస్టేషన్దీ అదే పరిస్ధితి. సమస్యలపై స్పందించరూ..!విజయనగరం టౌన్: రైలు ప్రయాణికుల అభ్యున్నతికి పాటు పడుతున్నామని చెబుతున్న రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడు. ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ (భువనేశ్వర్) వార్షిక పర్యటనలో భాగంగా అభివృద్ధి చెందిన అమృత్భారత్లో ఎంపికై న రైల్వేస్టేషన్గా పేరొందిన విజయనగరం జంక్షన్ను సోమవారం సందర్శించనున్నారు. రైల్వే జీఎం రానున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రైలు ప్రయాణికుల శ్రేయస్సే తమ లక్ష్యమంటూ రైల్వేశాఖ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ప్రయాణికుల సమస్యలు తీర్చడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. రోజుకు సాధారణ టికెట్ల ద్వారా రూ. 3.5 లక్షలు, రిజర్వేషన్ల ద్వారా రూ.3 లక్షలు, పార్సిళ్ల ద్వారా రూ. 25 వేల పైబడి ఆదాయం సమకూరుతోంది. మామిడి ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఉద్యోగ, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయనగరం నుంచే అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ప్రయాణికులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సమస్యల సుడిలో.. జిల్లా కేంద్రంలో ఐదో నంబర్ ఫ్లాట్ఫారం నుంచి తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం వరకు గతంలో కంటోన్మెంట్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అందుకు సంబంధించిన అలైన్మెంట్లు వేశారు. ఏళ్లు గడిచిపోతున్నాయి కాని పనులు మాత్రం జోరందుకోలేదు. పనుల్లో భాగంగా పాత బ్రిడ్జి కూల్చేశారు. దాని స్థానంలో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ అవి ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. నామినేటేడ్ ప్లాట్ఫారం పైకి రైళ్లు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. కంటోన్మెంట్ గూడ్స్షెడ్ నిరుపయోగంగా పడి ఉంది. నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలుమార్లు గంజాయి విక్రయిస్తున్న వారిని, సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న దాఖలాలున్నాయి. రైల్వేస్టేషన్లో ఐదు ఫ్లాట్ఫారమ్స్ ఉన్నప్పటికీ కేవలం ఒకటో నంబర్ ఫ్లాట్ఫారంపైనే సులాభ్ కాంప్లెక్స్ ఉంది. ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఒకటో నెంబరు ఫ్లాట్ఫారంపై ప్రయాణికులకు సంబంధించిన రైళ్లు ఆగాల్సి ఉంది. కానీ వాటిని మూడు, నాలుగు ఫ్లాట్ఫారాలకు డైవర్షన్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకటో నంబర్ ఫ్లాట్ఫారంపై గత కొన్నేళ్లుగా గూడ్స్రైళ్లు నిలుపుదల చేస్తుండడంతో వయోవృద్ధులు, దివ్యాంగులు పక్క ప్లాట్ఫారాలకు వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. వీటీ అగ్రహారం వద్ద ఉన్న మ్యాంగో యార్డ్ నిరుపయోగంగా ఉంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీస్ స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వచ్చినప్పుడు రికార్డులన్నీ తడిచి ముద్దవుతున్నాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్, హౌరా –కన్యాకుమారి ఎక్స్ప్రెస్లు బాగా డిమాండ్ ఉన్న రైళ్లు. వీటికి విజయనగరంలో స్టాప్ లేదు. దీనిపై దృష్టిసారించాలి. చీపురుపల్లి రైల్వేస్టేషన్లో కోణార్క్ , ఫలక్ నుమా వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లకు నిలుపుదల లేదు. దీనివల్ల అక్కడ నుంచి ప్రయాణికులు విజయనగరం, విశాఖ వెళ్లి తమకు కావాల్సిన రైళ్లను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. గజపతినగరం రైల్వేస్టేషన్ నుంచి బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో బొబ్బిలి, విజయనగరంలలో దిగి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆదర్శ రైల్వేస్టేషన్లుగా గుర్తింపబడినప్పటికీ బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్లు అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరం. సీతానగరం రైల్వేస్టేషన్దీ అదే పరిస్ధితి. విజయనగరం రైల్వేస్టేషన్లో సమస్యల తిష్ట నేడు రైల్వే జీఎం పరమేశ్వరన్ పర్యటన -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
మాతాశిశు మరణాల నివారణకు చర్యలు
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బొండపల్లి, దేవుపల్లి, వెలగాడ, సతివాడ, జామి, గంట్యాడ, పీఎం పాలేం, కొట్టాం, పోలిపల్లి, జరజాపుపేట యూపీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి సుఖప్రసవమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు శతశాతం వేయాలన్నారు. 100 రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వైద్య సేవల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రమణ్యం, డీఎస్ఓ డాక్టర్ సత్యనారాయణ, డెమో వి. చిన్నతల్లి, డీఎంఓ వై.మణి, ఎస్ఓ ధర్మారావు, డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, తదితరులు పాల్గొన్నారు. -
రాకపోకలకు ఇబ్బందిగా ఉంది....
నాది సాలూరు పట్టణం. గత ఐదు నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. 108 వాహనంలో ప్రయాణించే అవకాశం లేక సాలూరు నుంచి పార్వతీపురం ప్రైవేటు వాహనంలో వస్తున్నాను. అటూఇటూ రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. నెలకు నాలుగైదు సార్లు రావాల్సివస్తుంది. డయాలసిస్ పింఛన్కు దరఖాస్తు చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. – రావాడ అప్పారావు, డయాలసిస్ రోగి, సాలూరు పట్టణం ● -
ఆరోగ్యం కోసం చెత్తను ఊడ్చేద్దాం
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు అన్నారు. స్వచ్ఛఆంధ్రా–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రి ఆవరణలోని చెత్తా చెదారాన్ని శనివారం తొలిగించారు. దాసన్నపేట విద్యుత్ భవన్ వద్ద తుప్పలు, చెత్తా చెదారాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. కార్యక్రమాల్లో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు పి.ఎ.రమణి, శ్రీధర్, విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, డీజీఎం లక్ష్మీనారాయణ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
మల్లన్న తలపాగా ఊరేగింపు
సంతకవిటి: మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన చేనేత కార్మికులు గత 20 రోజుల నుంచి నియమ నిష్టలతో శ్రీశైలం మల్లన్న కోసం నేసిన తలపాగాను శనివారం గ్రామంలో ఊరేగించారు. శివరాత్రి నాడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి తలపాగాను సమర్పిస్తామని చేనేత కార్మికులు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం ● జిల్లా అటవీ అధికారి కొండలరావు విజయనగరం పూల్బాగ్: పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు పిలుపునిచ్చారు. విజయనగరం పూల్బాగ్లోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అటవీ సిబ్బందితో స్వచ్ఛభారత్పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై డీఎఫ్ఓ అవగాహన కల్పించారు. తాబేళ్లు సంరక్షణ, మొక్కల పెంపకం, జంతు వుల సంరక్షణ, తదితర అంశాలను బోధించా రు. కార్యక్రమంలో ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు, ఎఫ్ఎస్ఓ రాజు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని వారి లైసెన్స్లను రద్దు చేస్తాం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: రహదారి భద్రతా నియమాలు పాటించని వారి లైసెన్స్లను రద్దు చేస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమన్న విషయాన్ని ప్రతి వాహనచోదకుడు గుర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ డైవర్లుగా నిలిచిన కలెక్టర్, ఎస్పీ వాహనాల డైవర్లు కృష్ణ, ప్రసన్నకుమార్, ఆర్టీసీలో పనిచేస్తున్న ఉత్తమ డ్రైవర్లకు, రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తున్న ఎన్సీసీ కాడెట్లకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, లారీ అసోసియేషన్, ఆటో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం బాడంగి: విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల్లోని అంబేడ్కర్ గురుకులాల్లో ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా బోధన సాగిస్తున్నామని ఉమ్మడి జిల్లాల గురుకుల పాఠశాలల సమన్వయకర్త ఎస్.రూపావతి చెప్పారు. బాడంగి గురుకుల బాలుర పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. విద్యార్థులకు స్టడీఅవర్స్, వారాంతపు పరీక్షల నిర్వహణతో పాటు చదువులో వెనుకబడినవారిని టీచర్లు దత్తత తీసుకుని ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారన్నారు. అనంతరం క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరావు, రాందాస్ పాల్గొన్నారు. -
శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
విజయనగరం ఫోర్ట్: శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె శనివారం కె.ఎల్.పురంలో ఉన్న శిశుగృహను తనిఖీచేశారు. ఇద్దరి శిశువుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒక శిశువుకు సహస్ర అని నామకరణం చేశారు. పిల్లల వ్యక్తిగత రికార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత బాలసదన్ను పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్పాన్, సెమి అర్పాన్ పిల్లలను తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. వంటగది, పిల్లల మంచాలు పరిశీలించి స్వచ్ఛత, శుభ్రత మరింత పాటించాలని సూచించారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీడీపీఓ, డీసీపీయూ, చైల్డ్లైన్, ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 10 తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రుక్సానా బేగం, సీడీపీఓలు ప్రసన్న, ఉమాభారతి, ఆరుద్ర, డీఈఓ మాణిక్యంనాయుడు, ఏపీసీ డాక్టర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.