breaking news
Vizianagaram
-
గుర్లలో పోలీసుల దౌర్జన్యం.. అర్ధరాత్రి భయానక అరెస్ట్లు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పోలీసులు దౌర్జన్యం చేశారు. అర్ధరాత్రి గ్రామంలో చొరబడి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. జమ్మూ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. గుర్ల మండలం జమ్మూలో గత రాత్రి దుర్గాదేవి నిమజ్జనంలో చెలరేగిన గొడవలో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనికి కొనసాగింపుగా గ్రామంలోకి వచ్చిన పోలీసులు అర్ధరాత్రి దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులు చేశారు. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాకెళ్లారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు అడ్డుగా వచ్చిన వారికి చితకబాది.. వారిని వాహనాల్లో ఎక్కించారు.ఈ క్రమంలో వారికి ఎందుకు తీసుకు వెళ్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండగా.. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసిన వారి సెల్ ఫోన్లు లాక్కొని వాటిని ధ్వంసం చేశారు. అయితే, ఎవరిని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియక గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి భయానక వాతావరణంలో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పైడతల్లి సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. –8లోవిజయనగరం ఫోర్ట్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. పలు రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పుష్పాలతో ఏర్పాటు చేసిన తంబుర, వయోలిన్, గంటస్థంభం, సీతాకోక చిలుక, కూరగాయలతో తయారు చేసిన మొసలి, డ్రాగన్, సైకత పైడితల్లి ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.చిట్టిబాబు, డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూ పాలతో మైమరిపింపజేస్తూ, విచిత్ర వేషధారణల తో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయా త్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళా రూపాలను తిలకించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతిరాజు కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. శోభాయమానంగా శోభాయాత్ర ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్ విన్యాసాలతో, పైడితల్లి అమ్మవారి కలశాలతో మహిళలు, తప్పెటగుళ్లు, థింసా నృత్యం, పులి వేషాలు, విచిత్ర వేషాలు, ఆగమ పండితుల బృందం, విజయనగ రం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్, బిందెల డ్యా న్స్, చెక్క భజన, గంగిరెద్దులు, జముకుల బృందం, కాళీమాత డ్యాన్స్, ఎన్సీసీ కేడేట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు మరియు క్రీడాకారులు, అంగన్వాడీ సిబ్బంది, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఎస్.హెచ్.జి.గ్రూపులు తదితర బృందాలు అలరించాయి. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపా టి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరా వు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాల ను కాపాడుకొనేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయనున్నారు. నేటి తరానికి సంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను, కళాకారులను ఆదుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరమ ని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. 11 వేదికల్లో ఆకట్టుకున్న వివిద కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఉత్సవాల్లో భాగంగా 11 వేదికల్లో వివిధ రకాల కార్యక్రమాల ను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఆదివారం అతిథులు చేతుల మీదుగా ప్రా రంభించారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా... మాన్సాస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలు చూపరులకు కనువిందు చేశాయి. బొంకుల దిబ్బపై పౌరాణిక నాటకాలు ప్రదర్శించగా, గురజాడ కళా క్షేత్రంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అలరించాయి. లయన్స్ కమ్యూనిటీ హాల్లో జానపద కళా రూపా లు ప్రదర్శన విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించగా.. అయోధ్య మైదానంలో నిర్వహించిన పెట్ షో అందరినీ ఆకట్టుకుంది. రెండవ రోజైన సోమవారం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ అయోధ్య మైదానంలో ప్రముఖ సింగర్స్తో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మార్క్ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగారురాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జేసీ ఎస్.సేతుమాధవన్ తదితర ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కోటలో చిన్నారుల నృత్య రూపకం -
ఆపరేషన్ థియేటర్లలో చేతివాటం..!
● థియేటర్ నుంచి రోగిని వార్డుకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ ● ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సిబ్బంది దందా! ● రూ.500 నుంచి 800 వరకు వసూలు ●ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స నిర్వహించిన ఓ రోగిని వార్డుకు తరలించడానికి అక్కడ సిబ్బంది రోగి బంధువులను రూ.500 డిమాండ్ చేశారు. రూ.400 మాత్రమే ఉన్నాయని వారు ఆ మొత్తాన్ని ఇచ్చారు. ●విజయనగరంలోని ఓ పైవేటు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) ఆసుపత్రిలో గంగమ్మ అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సిబ్బంది వార్డుకు తరలించడానికి రూ.500 తీసుకున్నారు. విజయనగరం ఫోర్ట్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్ద ఆయా ఆసుపత్రుల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరిన రోగులకు వైద్య పరీక్షలకు, ఎక్సరే, స్కానింగ్, ఈసీజీ తీసిన మీదట శస్త్ర చికిత్సలు ఆపరేషన్ థియేటర్లో నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం రోగులను వార్డుకు తరలించడానికి అక్కడ వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 25 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆసుపత్రి, అమృత, ఆంధ్ర, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి, కావేరి, కొలపర్తి, మువ్వ గోపాల, నెప్రో ప్లస్, పీజీ స్టార్, పుష్పగిరి విక్టోరియా రెటినో ఇనిస్టిట్యూట్, క్వీన్స్ ఎన్ఆర్ఐ, సంజీవిని సూపర్ స్పెషాలటీ, బాబూజీ, శ్రీసాయి సూపర్, శ్రీ సాయికృష్ణ, సాయి పీవీఆర్, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్రైజ్, స్వామి కంటి ఆసుపత్రితో పాటు తిరుమల మెడికవర్, వెంకటరామ, వెంకట పద్మ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ప్రభుత్వ నెట్ వర్క్ ఆసుపత్రులు 55 ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1220 బెడ్ల కేటాయింపు ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 1220 బెడ్లు కేటాయించారు. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో 751, సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో 321, పీహెచ్సీల్లో 148 బెడ్లు కేటాయించారు. ఇందులో సగటున 1000 నుంచి 1200 మంది వరకు చికిత్స పొందుతుంటారు. ఈ ఆసుపత్రుల్లో సగటున రోజుకు జిల్లాలో 150 నుంచి 200 వరకు శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. రూ.500 నుంచి రూ.800 వరకు డిమాండ్ ఆపరేషన్ థియేటర్లలో రోగికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత వార్డుకు తరలించడానికి అక్కడ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రూ.500 వరకు డిమాండ్ చేస్తుండగా, మరికొన్ని చోట్ల రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నట్టు రోగులు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇస్తే పరవాలేదు. లేదంటే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం ద్వారా చికిత్సగాని, శస్త్రచికిత్సగాని చేయించుకున్న రోగులకు పూర్తి సేవలు ఉచితంగా అందించాల్సి ఉంది. ఒక్క పైసా కూడాఖర్చు కాకూడదు. రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉచితంగా అందించాల్సిన సేవలు కోసం చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా చికిత్స, శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఉచితంగా సేవలు అందించాలి. ఒక్క పైసా రోగు లు నుంచి తీసుకోకూడదు. డబ్బులు వసూ లు చేసినట్టు ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపైన, సిబ్బందిపైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
సంగీత సాహిత్య సమలంకృతే..!
విజయనగరం టౌన్: సంగీత సరస్వతికి స్వరనీరాజనం పలికారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన విజయనగరం ఉత్సవాల్లో సంగీత కళాకారులు కళామతల్లిని స్తుతిస్తూ చేసిన స్వరాభిషేకం ఆద్యంతం రక్తికట్టించింది. విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో ఘంటసాల, ద్వారం వంటి ఎందరో మహనీయులు సాధన చేసిన కచేరీ మందిరంలో 32 బృందాలు, 315 మంది కళాకారులు తమ స్వరఝరిని వినిపించి, కళ్లకు కట్టినట్లు చూపించి చూపరులను కట్టిపడేశారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇవే.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాలను జ్యోతిప్రజ్వలన, ప్రార్థనాగీతాలాపన, స్వాగత నృత్యాంజలితో ప్రారంభించారు. ఎన్.గోపాలరావు బృందం నాదస్వరం, శ్రీహరి సంకీర్తన ఝరి ఎన్.వెంకటరావు బృందం గాత్రం, ఎన్.కాళీప్రసాద్ బృందం గాత్రం, కె.ఎ.పద్మప్రియ బృందం వీణకచేరీ, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరిరాధికారాణి బృందం నృత్యప్రదర్శన, అమృతవర్షిణి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ టి.సౌమ్య బృందం నృత్యప్రదర్శన ఆద్యంతం అలరించాయి. టి.తన్మయి బృందం నృత్యప్రదర్శన, టి.అమ్మాజమ్మ గాత్రకచేరీ చూపరులను కట్టిపడేశాయి. సీహెచ్.శైలజ గాత్రం, ఎన్వీ.కామేశ్వరరావు ప్లూట్ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఎస్వీఎన్.వివేక్, శరత్ బృందం మైమ్, అభినయ డ్యాన్స్ స్కూల్ ఎం.సాయి ప్రియబృందం, ఇబ్రహీం ఖాన్ బృందం దూడ శ్రీదేవి, పి.క్రిషిక, కరుణల నృత్యప్రదర్శనలు, జి.రాధిక బృందం, కె.పెంటయ్యనాయుడుల గాత్రకచేరీ, పీవీఎన్ఎల్ సారథి బృందం వయోలిన్, టి.సత్యనారాయణ బృందం నృత్యప్రదర్శన, పి.సూర్యకుమారి, కె.స్వాతిప్రియదర్శిని బృందం నృత్యప్రదర్శన, వి.అప్పలస్వామి నృత్యప్రదర్శన, ఐ.మెహరలత గాత్రకచేరీ, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి బృందం గాత్రకచేరీ అలరించాయి. కళాకారులకు సత్కారం కె.విద్యాసాగర్ బృందం, డాక్టర్ మండపాక రవి మృదంగం, బి.మంజూష బృందం, ఎ.శైలజల నృత్యప్రదర్శన, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ ఎం.భీష్మారావు బృందం గాత్రకచేరీ ఆద్యంతం ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం కళాకారులను నిర్వాహకులు దుశ్శాలువాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లైఫ్ మెంబర్స్ పిళ్లా విజయకుమార్, రామయ్యపంతులు, వేదిక ఇన్చార్జ్ అధికారులు కవిత, జానకమ్మ, నాగలక్ష్మిలు సహకారమందించారు. సంగీత సరస్వతికి స్వర నీరాజనం 32 రకాల సంగీత బృందాలు, 315 కళాకారులతో స్వరాభిషేకం ఆహూతుల మన్ననలు పొందిన సంగీత, నృత్యప్రదర్శనలు విజయనగర ఉత్సవ వేదికలో మిన్నంటిన స్వరఝరి -
అలరించిన పెట్ షో
విజయనగరంఫోర్ట్: విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక అయోధ్య మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పెట్ షో అకట్టుకుంది. పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో పెట్ షో నిర్వహించారు. సిజ్జు, జెర్మనీ పెషర్డ్, ల్యాబ్, కొమిరేనియా, డాబర్ మెన్ తదితర 20 రకాలకు చెందిన 195 పెట్స్ (పెంపుడు కుక్కలు) షోలో పాల్గొన్నాయి. పెట్షోలో పాల్గొనేందుకు 170 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోగా, 25 మంది స్పాట్లో రిజిస్టర్ చేసుకున్నారు. పెట్లో షోలో పుంగనూరు జాతి ఆవులు, విదేశీ పావురాలు, గీనీపిక్స్, లవ్బర్డ్స్, రాబిట్స్ , పావురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షోలో పాల్గొన్న పెట్స్ యాజమానులకు జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జి.మహాలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్స్ డాక్టర్ కేవీ.రమణ, డాక్టర్ టి. ధర్మారావు, డాక్టర్ ఎల్, విష్ణు, డాక్టర్ ఆర్.శారద, డాక్టర్ పి.అనూరాధ, వీఏఎస్ల డాక్టర్ టి.మోహన్ రావు, డాక్టర్ ఎన్.జి.సాగర్, డాక్టర్ వి. భావన, డాక్టర్ ఎ.భాగ్య రాజ్, డాక్టర్ ఎల్.శ్రుతి పాల్గొన్నారు. -
అర్ధరాత్రి లాఠీ చార్జ్
● జమ్ము గ్రామంలో ఉద్రిక్తత ● గ్రామస్తులపై విరుచుకుపడిన పోలీసులు ● పలువురికి గాయాలుగుర్ల: మండలంలో ఇంతవరకూ లేని సంస్కృతిని పోలీసులు అలవాటు చేస్తున్నారు. కూటమి నేతల ఆశీస్సులు పొందేందుకు వైఎస్సార్సీపీ నేతలపై కక్ష కట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేస్తూ భయభ్రాంతులకు గురుచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రశాంతంగా ఉండే గ్రామం మండలంలోని జమ్ము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఆ గ్రామంలో టీడీపీ నేతలు పెత్తనం చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు పడకపోవడంతో గ్రామంలో ఎదో ఒక అలజడి సృష్ఠించి పోలీసులను, అధికారులను రంగప్రవేశం చేయించి వారిపై తీవ్ర ఒత్తిడి చేసి వారి మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని పర్యావసానంగా గ్రామంలో శనివారం దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతుండగా అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన మహిళులు, పెద్దలు, యువతపై పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ లాఠీ చార్జ్లో గ్రామానికి చెందిన సారంపాటి ఆనంద్కు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మంది మహిళలకు ఒంటిపై పోలీసుల లాఠీ దెబ్బలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పోలీసుల తీరుకు ఖండన జమ్ము గ్రామంలో దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం జరుగుతుండగా వైఎస్సార్సీపీకి చెందిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణా రహితంగా కొట్టడాన్ని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శి కెంగువ మధుసూదనరావు, నియోజక వర్గ బీసీ సెల్ అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రశాంతమైన పల్లెలో అల్లర్లు సృష్ఠించి ఉద్రిక్త వాతావారణాన్ని నెలకొల్పుతున్న పోలీసుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీ చార్జ్లో గాయపడి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
తొలి ఏరుకు వేళాయె..
● నేడు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం ● సిరిమానోత్సవం రేపు ● పట్టువస్త్రాలను సమర్పించనున్న రాజవంశీకులు విజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి (ఏరు)తో తొలుత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్ల ని పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలు, దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళతారు. అక్కడ కోటశక్తికి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతులతో ఆ విత్తనాలను అందించి అమ్మవారు ఆశీర్వదిస్తారు. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు. మంచి దిగుబడులు సాధిస్తారు. విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరి అమ్మవారి తొలేళ్ల సంబరాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకూ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడువేల మంది పోలీసు బలగాలను ఉత్సవ విధులకు కేటాయిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి, మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరారుతోంది. మరోవైపు విజయనగర ఉత్సవాల సందడితో చారిత్రాత్మక కట్టడాలన్నీ విద్యుత్ అలంకరణలతో శోభాయామానంగా తయారైంది. మహారా జ కోట, గంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీ త, నృత్య కళాశాల, మయూరీ కూడలి నుంచి రైల్వేస్టేషన్ మీదుగా సీఎంఆర్ జంక్షన్ వరకూ విద్యుత్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారు ఆలయమంతా పుష్పశోభితంగా విరాజిల్లుతోంది. తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజ లు, అధికారులు సన్నద్ధమయ్యారు. ●వేకువజామున 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ●ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ●రాత్రి 10.30 గంటలకు భాజాభజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలో కి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు. ●ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై భక్తుల సౌకర్యార్ధం ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తారు. ●ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు. -
కొత్తవలసలో వర్ష బీభత్సం
కొత్తవలస : కొత్తవలసలో ఆదివారం రాత్రి జోరువాన కురిసింది. పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. మూడు రోడ్ల జంక్షన్, రైల్వేస్టేషన్లను వరద నీరు ముంచెత్తడంతో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూడు రోడ్ల కూడలిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దసరా సెలవులు ముగియడంతో వేర్వేరు ప్రాంతాలకు పయనమైన వాహనదారులు సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో స్టేషన్లోనే గంటల తరబడి ఉండిపోయారు. రైల్వేస్టేషన్ సమీపంలో అరకు – విశాఖపట్నం జాతీయ రహదారి కోతకు గురైంది. తుమ్మికాపల్లి ఫైర్స్టేషన్ సమీపంలో భారీ వృక్షం ఆటోపై కూలడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. -
ఆకట్టుకున్న విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
● 166 విద్యాసంస్థల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టు నమూనాలువిజయనగరం అర్బన్: విజయనగర ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు ఆదివారం ప్రదర్శించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 166 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐ విద్యాసంస్థల విద్యార్థుల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో 150 పాఠశాలల నుంచి 182, 15 కళాశాలల నుంచి 32, ఒక ఐటీఐ నుంచి 20 ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉంచిన పలు నమూనాలు సందర్శకులను ఆలోచింపచేశాయి. ఐటీఐ విద్యార్ధులు రూపొందించిన వ్యర్థ ఇనుప పదార్థాల నుంచి సృజనాత్మక పరికరాలు, సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదక నమూనాలు ఆకట్టుకున్నాయి. తాటిపూడి రిజర్వాయర్, భోగాపురం విమానాశ్రయం, దేశంలో ప్రసిద్ధి చెందిన హిందూదేవాలయాల నమూనాలు, డ్రోన్లు, క్రాఫ్ట్, ఆర్ట్ కళల చిత్రలేఖన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు పాల్గొన్నారు. -
ఆర్చరీలో మెరిసిన అక్కాచెల్లెళ్లు
● రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్కు ఎంపిక సీతంపేట: ఎస్జీఎఫ్ క్రీడల్లో ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీలకు స్థానిక హిమరక ప్రసాదరావు కుమార్తెలు ఎంపికయ్యారు. ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సీతంపేట మండలం నుంచి అక్కాచెల్లెళ్లు హాజరు కాగా అండర్ 19లో హెచ్.సంయుక్త, అండర్ 17లో హెచ్.లక్షితలు ఎంపిక కావడం పట్ల ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, కోచ్ మధులతో పాటు పలువురు అభినందించారు. ప్రారంభమైన క్రీడోత్సవంవిజయనగరం: విజయనగర ఉత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన క్రీడోత్సవం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా మొత్తం ఏడు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ క్రీడాంశాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పురుష జట్లకు మాత్రమే పోటీలు నిర్వహించగా..టెన్నిస్ క్రీడాంశంలో ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. చెస్ క్రీడాంశంలో 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాల,బాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొనగా..ఫ్లడ్లైట్ల వెలుగుల్లో పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం సాయంత్రం బహుమతీ ప్రదానోత్సవం చేయనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కె.శ్రీధర్రరావు తెలిపారు. పోటీలను ఆయా క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు కె.జ్వాలాముఖి, కేవీఎన్ చిన్నారి, కేవీ.ప్రభావతి, వై.కుసుంబచ్చన్, నున్న సురేష్ తదితరులు పర్యవేక్షించారు. అలరించిన థింసా నృత్య ప్రదర్శన విజయనగరం టౌన్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పలువురు చిన్నారులు ఆదివారం చేసిన థింసా నృత్య ప్రదర్శన చూపరులను అలరించింది. అలాగే బాలభవన్, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం కళాకారుల బృందాలు చేసిన జానపద కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి. -
సిరిమానోత్సవానికి రూట్మ్యాప్
విజయనగరం క్రైమ్: పైడతల్లి సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ పైడితల్లి జాతరకు వస్తున్న భక్తులు ఈ నెల 7న తేదీన అమ్మవారి సిరిమానోత్సవం సందర్బంగా వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ చేసేందుకు పలు ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం, కోరుకొండ, జామి, అలమండ, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఎత్తు బ్రిడ్జి మీదుగా మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే ధర్మపురి, డెంకాడ పరిసర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మీదుగా కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయాలన్నారు. ఇక నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్, దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యకోనేరువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో గానీ లేదా రాజీవ్ నగర్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా ఫోర్ట్ సిటీ స్కూల్, ఎస్వీఎన్ లేఔట్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో కానీ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, గుర్ల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ మీదగా, కొత్తపేట మంటపం పాత బస్టాండ్ మీదుగా రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియం మీదుగా వచ్చి డీఎస్డీఓ ఇండోర్ స్టేడియంలో పార్కింగ్ చేయాలన్నారు. గజిపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, గంట్యాడ, ఎస్.కోట పరిసర ప్రాంతాల నుంచీ వచ్చే వాహనాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి గూడ్స్ షెడ్, సీఎంఆర్ జంక్షన్ మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్కు వ్యతిరేకంగా ఉన్న స్థలంలో పార్క్ చేయాలని సూచించారు. దీంతో పాటు పీజీ స్టార్ హాస్పిటల్ పక్కన గల ఖాళీ స్థలంలోను, ఎస్బీఐ జంక్షన్ నుంచి రామానాయుడు రోడ్డు మీదుగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద గల పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేయాలని తెలిపారు. ఏడవ తేదీ ఉదయం నుంచి ఎనిమిదివ తేదీ రాత్రి పదిగంటల వరకు. ఈ దిగువన నిర్దేశించిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిషేధమని ఎస్పీ పేర్కొన్నారు.1. బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడ జంక్షన్ 2. సింహాచలం మేడ జంక్షన్ నుంచి కోట 3. బాలాజీ జంక్షన్ నుంచి గంట స్తంభం 4. ఎం.ఆర్ కాలేజీ జంక్షన్ నుంచి గురజాడ సర్కిల్ 5. కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి గంటస్తంభం 6. ట్యాక్సీ స్టాండ్ నుంచి గంట స్తంభం 7. సామ్రాట్ లాడ్జి జంక్షన్ నుంచి శివాలయం మీదుగా ఎంజీ రోడ్డు 8.కమ్మవీధి జంక్షన్ నుంచి మూడు లాంతర్లు 9. గుమ్చీ జంక్షన్ నుంచి కోట జంక్షన్ వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిషేధించినట్లు ఎస్పీ దామోదర్ వివరించారు. నిషేధిత స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసిన పక్షంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. -
ఏనుగు పిల్ల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామ ముదిరాజు చెరువులో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు మృతి చెందింది. ఇటీవల కొద్ది వారాల నుంచి పార్వతీపురం మండలంలోని తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగును పెద్ద ఏనుగులు తొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరణానికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై ఎలిఫెంట్ మా నటరింగ్ అధికారి మణికంటేశ్వరరావు మాట్లాడుతూ ఏనుగు పిల్ల వయసు ఏడు నెలలని తెలిపారు. పోస్టుమార్టం నిమత్తం కొమరాడ మండలం అర్తాం తరలించామని చెప్పారు. కారు ఢీ కొని లారీ డ్రైవర్కు తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సమీపంలో గల భారత్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ లారీ డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ గేదెల వెంకటరావు లారీతో విజయనగరం వెళ్తూ ముచ్చర్లవలస పెట్రోల్ బంకు వద్ద మూత్ర విజర్జన కోసం జాతీయ రహదారి పక్కన లారీ ఆపి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో రామభద్రపురం నుంచి విజయనగరం వెళ్తున్న కారు లారీ డ్రైవర్ను ఢీ కొట్టింది. దీంతో వెంకటరావు తీవ్ర గాయాలపాలై తుళ్లిపోవడంతో మృతిచెందాడేమోనని భావించి కారు డ్రైవర్ రోడ్డు కారు రోడ్డు పక్కన పెట్టేసి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్బోల్తా పడి యువకుడి మృతిచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామంలో వ్యాన్ బోల్తా పడి గ్రామానికి చెందిన పెనుమజ్జి కుమార్(25) మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా వ్యాన్లో ఐరన్ రాడ్లు తీసుకువచ్చారు. ఐరన్లోడుతో ఉన్న వ్యాన్ను ఎత్తు భాగానికి ఎక్కిస్తుండగా బోల్తాపడింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న పెనుమజ్జి కుమార్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులు ఆదిబాబు, చిట్టెమ్మ దంపతులకు కుమార్ పెద్ద కొడుకు కాగా సమీపంలో ఉన్న పవర్ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. -
మూతపడిన జనరిక్ మందుల షాపు
● అధిక ధరకు మందుల కొనుగోలు ● ఇబ్బందులు పడుతున్న పేదరోగులువిజయనగరం ఫోర్ట్: ఏజబ్బు అయినా సరే మందుల ద్వారానే నయమవుతుంది. అధికశాతం మంది ప్రజలు బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, లివర్, గుండె, అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. పేద, మధ్య తరగతి వర్గాలకు అది అదనపు భారమే. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు మందులు లభించే జనరిక్ మందుల దుకాణం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అవసరమైతే జనరిక్ మందుల దుకాణాలను పెంచాల్సి ఉంది. కానీ ప్రభుత్వసర్వజన ఆస్పత్రి ఆవరణంలో ఉన్న జనరిక్ మందుల దుకాణం మూత పడి రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న షాపు అకస్మాత్తుగా మూతపడినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది రోగులు మందుల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నిత్యం ఓపీ విభాగానికి 1000 నుంచి 1200 మంది వస్తారు. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు ఉచితంగా ఇస్తారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను రోగులు జనరిక్ మందుల దుకాణంలో కొనుగోలు చేసేవారు. అదేవిధంగా బీపీ, షుగర్ , కేన్సర్ వంటి ధీర్ఘకాలిక రోగులు కూడా ఇక్కడే మందులు కొనుగోలు చేసేవారు. ప్రైవేట్ మెడికల్ షాపుల కంటే అతి తక్కువ ధరకు మందులు లభించడంతో అధికశాతం మంది జనరిక్ మందులు దుకాణంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. 20 రోజులవుతున్నా పట్టించుకునే వారే కరువు జనరిక్ మందుల దుకాణం మూత పడి 20 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలులేవు. దుకాణం నిర్వహించేవారు ఎందువల్ల తెరవడం లేదనే దానిపై అధికారులు ఆరా కూడా తీయలేదని తెలుస్తోంది.ఆదేశాల మేరకు చర్యలు జనరిక్ దుకాణం నిర్వహించే వారికి ఆస్పత్రి నుంచి ఎటువంటి అనుమతులు లేవు, విద్యుత్ బిల్లులు కూడా ఆస్పత్రి నిధుల నుంచే కడుతున్నాం. అద్దె కూడా చెల్లించడం లేదు. దీనిపై డీఎంఈకు లెటర్ రాశాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
కొట్టక్కి ఉన్నత పాఠశాలకు పురస్కారం
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి ఉన్నత పాఠశాలకు అరుదైన పురస్కారం లభించింది.గత ప్రభుత్వంలో నాడు నేడు కింద కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పరిశుభ్రత, పచ్చదనం,పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపు లభించింది. స్వర్ణాంఽధ్ర–స్వచ్ఛాంధ్ర–2025 జిల్లాస్థాయిలో ప్రభుత్వం పాఠశాలల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది.ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ చేతుల మీదుగా సంబంధిత హెచ్ఎం అవార్డు అందుకోనున్నారు. సంతోషంగాఉంది.. మా పాఠశాల స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కింద పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల సాధించిన ఘనత. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. – ఆమిటి శ్రీనివాసరావు, హెచ్ఎం ఉన్నత పాఠశాల కొట్టక్కి -
ఉత్సవాల నిర్వహణకు క్రెడాయ్ రూ. 7.01 లక్షల విరాళం
విజయనగరం: ఏటా జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి జాతరకు భవన నిర్మాణ రంగ సంస్థ క్రెడాయ్ తమవంతుగా రూ.7.01లక్షల ఆర్థిక సహాయం చేసింది. సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సుభాష్ చంద్రబోష్, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి సురేంద్ర శనివారం చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్యకు అందజేశారు. కార్యక్రమంలో క్రెడాయ్ జిల్లా ప్రతినిధులు అర్జున్, రవి, తదితరులు పాల్గొన్నారు. వరద నీరు విడుదల వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 8వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.20 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తాం విజయనగరం అర్బన్: పైడితల్లి సిరిమానోత్సవం వీక్షించేందుకు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయ స్థలం చూస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో వీక్షణకు స్థలం కావాలని అధికారులను ఆయన కోరారని, అయితే డీసీసీబీ పాలక మండలి డైరెక్టర్లు కూడా ఆ స్థలంలోనే తిలకిస్తామని కోరడంతో ఆయనకు కేటాయించలేమని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఆయనకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని అన్నారు. అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరితగతిన తుఫాన్ నష్టాల అంచనా విజయనగరం అర్బన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను, రోడ్లు, విద్యు త్ తదితర ఆస్తి నష్టాలను అంచనావేసి వెంటనే నివేదిక అందజేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ డాక్టర్ ఎస్.రామసుందర రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి వివాదాలకు తావులేని కచ్చితమైన, పారదర్శకమైన అంచనాలు వేయాలని సూచించారు. యూరి యా సరఫరా, భారీవర్షాలు, జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సుల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు. సూపర్ జీఎస్టీపై ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పాటించాలని సూచించారు. వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తగ్గుముఖం పట్టిన ‘తోటపల్లి’ గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద వరదనీటి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖంపడుతోంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 44వేల క్యూసెక్కుల వరదనీరు చేరగా.. శనివారం సాయంత్రం నాటికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతూ 11,637 క్యూసెక్కులకు చేరింది. అధికారులు స్పిల్వే వద్ద మూడు గేట్లను ఎత్తివేసి 10,617 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టారు. -
ఆచార, సంప్రదాయాల ప్రకారం... అమ్మవారి జాతర
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి జాతరను సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు హాజరుకావడం ఆచారంగా వస్తోందన్నారు. వారందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో పండగ రోజుల్లో పెద్దలను గౌరవించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సిరిమాను సంబరాన్ని వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంగణంలో కూర్చునేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి అధికారులకు లేఖ రాశామన్నారు. సుమారు 35 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అక్కడ కూర్చొని సంబరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని లేఖలో కోరామన్నారు. ఈ విషయంపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మీరు ఇక్కడ కూర్చుని సిరిమానోత్సవాన్ని తిలకించడం ఏమిటి? అంటూ పరిపక్వత లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో విపక్షనేత అని, క్యాబినెట్ హోదా కలిగిన ప్రజాప్రతినిఽధిగా గుర్తించుకోవాలని హితవుపలికారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకకు వచ్చే ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడే సమయంలో భాషపై సంయమనం కలిగి ఉండాలని, గౌరవ భావంగా వ్యవహరించాలని సూచించారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కోరిన మేరకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంటనష్ట పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి... ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. అరటి, చెరకు, బొప్పాయి, కూరగాయల పంటలతో పాటు వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గడిచిన 48 గంటలుగా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ శాఖ అధికారులు విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని వేసి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.జైహింద్కుమార్ పాల్గొన్నారు. క్యాబినెట్ హోదా కలిగిన బొత్సకు జాతరలో ప్రాధాన్యం ఇవ్వాలి సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
ఏర్పాట్ల పరిశీలన
తగరపువలస: పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్హాలులో ఆదివారం జరిగే వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను శనివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమరనాథ్, పార్టమెంట్ ప్రధాన కార్యదర్శి తైనాల విజయకుమార్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, ఎంపీపీ దంతులూరి వాసురాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంక సత్యం, మజ్జి వెంకటరావు, షిణగం దామోదరరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షిణగం రాంబాబు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పంట భూములను నాశనం చేయొద్దు
● ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు ● ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత చీపురుపల్లిరూరల్(గరివిడి): ఏటా పంటలు పండే భూముల్లో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుచేసి ఉపాధిని దూరం చేసి జీవితాలను నాశనం చేయొద్దంటూ గరివిడి మండలంలోని కుమరాం, కె.పాలవలస, కందిపేట, తాటిగూడ, విజయరాంపురం పరిసర ప్రాంతాల యువత, ప్రజలు గోడు వినిపించారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా గళమెత్తారు. గరివిడి మండలం కుమరాం పంచాయతీ పరిధిలో శోభా మెటల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వే నంబర్ 136/1,136/5,136/5ఎలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శనివారం చేపట్టింది. డీఆర్వో శ్రీనివాసమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజినీర్ రామారావునాయుడు, తహసీల్దార్ సీహెచ్ బంగార్రాజు హాజరై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు నియమ నిబంధనలు అనుసరించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెలపగా, మరికొందరు పరిశ్రమ వద్దని స్పష్టం చేశారు. పరిశ్రమకు అవసరమైన నీటికోసం పెద్దఎత్తున బోర్లు తవ్వితే వ్యవసాయ బోర్లు ఎండిపోతాయని, సాగు కష్టాలు తప్పవని పాలవలస సర్పంచ్ మీసాల ప్రసాదరావు అభిప్రాయం తెలిపారు. మూతపడిన గరివిడి ఫేకర్ పరిశ్రమను లీజుకు తీసుకుని కొనసాగిస్తే యువతకు ఉపాధి కలుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేయొద్దని స్థానికులు గోవింద్, రఘుమండ రవికుమార్, ముల్లు సత్యనారాయణ తెలిపారు. తాటిగూడకు చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర బూత్కమిటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ఎడ్ల అప్పారావు మాట్లాడుతూ నీటిని కలుషితం చేసే పరిశ్రమ మాకొద్దని తెగేసి చెప్పారు. -
అమ్మ అనుగ్రహంతోనే...
● తొమ్మిదోసారి సిరిమానును అధిరోహించడం అదృష్టం ● భక్తులందరూ పైడితల్లిని దర్శించండి విజయనగరం టౌన్: చింతమానును సిరిమానుగా మలుచుకుని సిరులతల్లి పురవీధుల్లో విహరిస్తూ తన చల్లని చూపులతో అక్షితలను చేతబట్టిన పూజారి రూపంలో భక్తులకు ఆశీర్వచనాలను అందిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు లక్షలాది మంది భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. ఈ బృహత్తర ఘట్టమైన సిరిమానును బంటుపల్లి వెంకటరావు వరుసగా తొమ్మిదోసారి అధిరోహించనున్నారు. అతి పిన్నవయసు నుంచే సిరిమాను అధిరోహించే అవకాశం అందుకున్న పూజారిగా ఘనతకెక్కారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో శనివారం మాట్లాడారు. తల్లిసేవలోనే.. చిన్నప్పటి నుంచి నాన్న బంటుపల్లి బైరాగినాయుడు అత్యధికంగా 28 సార్లు సిరిమానును అధిరోహించారు. ఆయనతో పాటు సిరిమాను ఉత్సవాల్లో పాల్గొని 24 గంటలూ తల్లిసేవలో తరించడం ఆనవాయితీగా వచ్చింది. ఆయన తర్వాతకాలంలో మేనమామ నేతేటి శ్రీనివాస్, తాళ్లపూడి భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. అప్పుడు మరింతగా అమ్మవారికి సేవచేసుకునే భాగ్యం కలిగింది. వారి తర్వాత మరలా 2017లో తొలిసారిగా సిరిమానును అధిరోహించాను. ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ ఏడాది తొమ్మిదో ఏట సిరిమానును అధిరోహిస్తుండడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను. సిరిమానును వీక్షించి.. తరించండి సిరుల తల్లి సిరిమానోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి, ఆమె దీవెనలు అందుకోవాలి. నెలరోజుల పండగలో పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవాలి. హుకుంపేట ప్రజలందరితో కలిసి అమ్మవారికి చల్లదనం చేశాం. ఘటాలతో నివేదన చేశాం. సిరిమానోత్సవానికి సంబంధించి నిర్ణీత సమయానికి సిరిమాను ఆలయానికి చేరుకునేలా పర్యవేక్షిస్తున్నాం. ఉత్సవానికి సిరిమాను, ఇరుసుమాను రెడీ అక్టోబర్ 6న నిర్వహించే తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7న సిరిమానోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసుకున్నాం. సిరిమాను మలి చే ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇరుసుమాను, గిలక, రథం పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్లు పూర్తిచేసుకోవడమే మిగిలింది. అంజలి రథం, బెస్తరవారివల, తెల్ల ఏనుగు, పాలధారను అమ్మవారిమీద ఉండే భక్తితో వారి వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయంతో ఉత్సవానికి సమయానికి తీసుకువస్తారు. -
చంద్రబాబు పథకాలన్నీ కాపీ పేస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని, వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. ఉత్తరాంధ్ర వనరులను దోచుకుంటున్నారు అమరావతిపై ప్రేమతో ఈ ప్రాంతానికి అన్యాయం స్పీకర్ పదవికి అయ్యన్న అనర్హుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు స్పీకర్ అయ్యన్నపై విమర్శలు స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అమర్నాథ్, కేకే రాజు అన్నారు. ‘అయ్యన్నలో కనీసం ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అబద్దాలు, అర్థం లేని మాటలు మాట్లాడటం ఆయన నైజం’అని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయనగర వైభవం ఉట్టిపడేలా..
సాక్షిప్రతినిధి, విజయనగరం: కళలకు కాణాచి.. విద్యలకు నిలయం... సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరం ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విజయనగరం వైభవం ఉట్టిపడేలా విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5న విజయనగరం ఉత్సవాలు ప్రారంభం కానుండగా... 6వ తేదీ వరకు కొనసాగుతాయి. అదే రోజు పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కానుంది. 7న జాతర మహోత్సవంలో కీలకమైన అమ్మవారి సిరిమాను సంబరం జరగనుంది. రెండు ఉత్సవాలను తిలకించేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండగా... వారికి కనుల విందు చేసేందుకు 11 వేదికల్లో వివిద సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేదికలు... కార్యక్రమాలు ఇలా... ● ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటలకు కోట ఎదురుగానున్న బొంకులదిబ్బ వద్ద విజయనగరం ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ● అయోధ్యామైదానంలో 5వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పెట్ షో నిర్వహించనున్నారు. ● మహారాజా కోటలో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైన్స్ ఫెయిర్, స్టాంప్స్ అండ్ కాయిన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్ గ్యాలరీ జరుగుతుంది. ● 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (రంజిని, శివరంజిని థియేటర్ ఎదురుగా) విజయనగరం వైభవంపై ‘లేజర్ షో ప్రదర్శిస్తారు. అంతేకాకుండా విజయనగరంలోని ప్రముఖ స్థలాల, కట్టడాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ● కోట ఎదురుగా ఉన్న బొంకుల దిబ్బపై 5, 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కన్యాశుల్కం, సీతాకళ్యాణం, మోహినీ భస్మాసుర, సత్యహరిశ్చ్రంద ప్రదర్శన ఉంటుంది. ● 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోట ప్రధాన ద్వారం సమీపంలో పులివేషాల ప్రదర్శన జరుగుతుంది. ● గురజాడ కళాభారతిలో ఈ నెల 5, 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక కళాకారుల నాటకాలు, వేదిక, బ్యాక్డ్రాప్లను వెలిగించడం, వేదిక ప్రదర్శనలు, అలంకరణ, హోర్డింగుల ప్రదర్శన ఉంటుంది. ● క్రీడోత్సవంలో భాగంగా విజ్జి స్టేడియంలో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నీస్, చెస్ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ● మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 5, 6 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య పోటీలు జరుగుతాయి. ● ఎం.ఆర్.లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్లో 5, 6 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుస్తక ప్రదర్శన, చారిత్రక కథనాలు, ప్రముఖులకు సంబంధించిన ఛాయాచిత్రాలు, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి పుస్తకాల ప్రదర్శన ఉంటాయి. ● లయన్స్ కమ్యూనిటీ హాలులో 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డాక్యుమెంటరీ ప్రదర్శన, జానపద కళాకారుల (గిరిజన కళాకారుల)లో నృత్యాలు, స్ట్రీట్ ఫైట్, కత్తిసాము, పులివేషాలు, డప్పు ప్రదర్శన, జముకుల కధ, రేలారే రేల, కోలాటాలు, తప్పెటగుళ్లు, బురక్రథ, తూర్పు భాగోతం వంటి అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ● లోయర్ ట్యాంక్బండ్ రోడ్డులో గల మాన్సాస్ గ్రౌండ్లో ఈ నెల 8 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ స్థాయి సరస్ మేళా ఏర్పాటు చేస్తారు. ● 5, 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పుష్ప, ఫల ప్రదర్శన ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర 11 వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు -
వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్
సాలూరు: రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంలో అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులకు, ప్రజలకు రక్షణగా, అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పట్టణంలోని తన స్వగృహం వద్ద పార్టీ నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, నాటి ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అక్రమ కేసులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న ప్రభుత్వ పెద్దల తీరు మారడం లేదన్నారు. బాధితులు డిజిటల్ బుక్లో తగు ఆధారాలతో నమోదు చేయాలన్నారు. అటువంటి వారి వివరాలను డిజిటల్ బుక్ డేటా బేస్లో భద్రపరచడం జరుగుతుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురవుతున్న ప్రతీ ఒక్కరికి డిజిటల్ బుక్తో అండగా ఉంటామన్నారు. రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో తాను ఏనాడూ ఏ అధికారిని చట్ట వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పలేదని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఎలా మాట్లాడుతున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ కార్యదర్శి, మక్కువ జెడ్పీటీసీ మావుడి శ్రీనువాసులనాయుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..!
అవగాహన కల్పిస్తున్నాం... ఐసీడీఎస్ పరిధిలో 239 మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నెల రోజులు పాటు నిర్వహించే రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో గర్భిణులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సమతుల్యమైన ఆహారాన్ని అందించాలని చెబుతున్నాం. పిల్లలకు బయట ఆహారం కాకుండా ఇంటి వద్దే తయారు చేసి పెట్టాలని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. – టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్ విజయనగరం ఫోర్ట్: బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీ, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడానికి ప్రస్తుతం ఉన్న పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని పిల్లలు ఏది అడిగితే అది తల్లిదండ్రులు కొని ఇచ్చేస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దవారు కూడా జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఫలితంగా పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ఊబకాయం రావడం వల్ల పిల్లలు అనేక వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. ఇటీవల చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. మరి కొంతమంది షుగర్, బీపీ, గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ఊబకాయంతో ఆపసోపాలు చిన్న వయసులోనే ఊబకాయం రావడంతో పిల్లలు ఆపసోపాలు పడుతున్నారు. చిన్నపాటి పరుగు తీసినా అలసిపోవడం, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు. జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలు ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. గతంలో పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పిండి వంటలు పెట్టేవారు. నువ్వు ఉండలు, వేరుశనగ ఉండలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండేవి పెట్టేవారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా పెట్టేవారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారు. దీనికి తోడు పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడుకునే వారు. దీంతో ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పడు పిల్లల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పిల్లల్లో శారీరక శ్రమ ఉండడం లేదు. మొబైల్ ఫోన్లుకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారు ఊబకాయం బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు నిల్వలు ఉండడం వల్ల ఊబకాయం వస్తుంది. ఉండాల్సిన బరువు కంటే పిల్లలు ఎక్కువ బరువు ఉంటారు. శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ కేలరీలను ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అధిక కొవ్వులు, స్వీట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. ఉబకాయం వల్ల వచ్చే అనర్ధాలు ఊబకాయం ఉన్న వాళ్లు మెట్లు ఎక్కడానికి, నడవడం వంటివి చేసినా కూడా ఊపిరి అందక ఇబ్బంది పడతారు. శరీరం అధిక బరువును మోయడానికి ఎక్కువ శక్తిని వినియోగించడం వల్ల తరుచుగా అలసటగా అనిపించడం, సాధారణ పనులు చేయడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తుంది. అధిక శరీర బరువు మోకాళ్లు తుంటి పాదాలు, వెన్నెముక వంటి వాటిపై అసాధారణ ఒత్తిడిని కల్గిస్తుంది. దీని వల్ల కీళ్లు అరుగుదలకు దారి తీసి తీవ్రమైన నొప్పులకు కారణమవుతుంది. చర్మం మడతలలో మెడ, గజ్జలు, చంకలు తేమ పేరుకు పోయి దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు తరచుగా వస్తాయి. ఊబకాయం వల్ల మధుమేహాం, గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ పొర, కిడ్నీ, కాలేయ కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఉన్నారు. భోగాపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, వియ్యంపేట, ఎస్.కోట, బాడంగి, గంట్యాడ, గజపతినగరం, గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి ఊబకాయం బారిన పడకుండా పండ్లు, కూరగాయాలు, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్స్, కొవ్వు, నూనె పదార్ధాలు తగ్గించాలి. పానీపూరీ, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు తినకూడదు. ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. రోజులో కనీసం 30 నుంచి 60 నివిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం వల్ల వ్యాధులు బారిన పడే అవకాశం తక్కువ వయసులో బీపీ, షుగర్ గుండెపోటుకు గురయ్యే అవకాశం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు పెద్దవారిలోనూ అదే పరిస్థితి -
గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?
● డీఎంహెచ్వోను అడ్డుకున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ● గురుకుల పాఠశాల ముందు ఆందోళనకురుపాం: గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే మీకు అంత నిర్లక్ష్యమా..! ప్రాణాలు పోతున్నా స్పందించరా..? వసతిగృహంలో అసలేం జరుగుతుంది.. కొన్న రోజులుగా విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నా ఇలాగేనా.. స్పందిస్తారా... మీ పిల్లలు అనారోగ్యం బారిన పడితే ఇలాగే స్పందిస్తారా? అంటూ.. కురుపాం గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఐటీడీఏ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణకు శుక్రవారం వచ్చిన డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావును వారు అడ్డుకున్నారు. పిల్లలు అనారోగ్యం, మరణాలపై పూర్తి సమాచారం ఇస్తేనే లోపలికి వెళ్లాలని ఐటీడీఏ అధికారుల తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం సాలూరు, పార్వతీపురం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం తదితర దూర ప్రాంతాల నుంచి గురుకుల పాఠశాలలో చేర్పిస్తే తిరిగి అనారోగ్యంతో తమ పిల్లలను అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అనారోగ్యం బారిన పడి ఎంతకీ తగ్గకపోవడంతోనే తాము తమ పిల్లలను వెంట తీసుకొని వెళ్తున్నామని సరైన వైద్యం, పర్యవేక్షణ ఉంటే ఎందుకు తీసుకువెళ్తామని ప్రశ్నించారు. విద్యార్థులు సెలవులకు వెళ్లిన తరువాతే అనారోగ్యం బారిన పడ్డారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. -
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రేగిడి: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగావళి నది ఉగ్రరూపం దాల్చిందని, నదీ తీర ప్రాంతాల్లో పనిచేసే అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. సంకిలి, బొడ్డవలస గ్రామాల వద్ద నాగావళి నదిని పరిశీలించారు. నదిలో మడ్డువలస ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టడంతో తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దార్ ఐ.కృష్ణలతను ఆదేశించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తీరగ్రామాల్లోనే బసచేయాలని సూచించారు. పంట నష్టాలను అంచనా వేయాలని ఏఓ బి.శ్రీనివాసరావును ఆదేశించారు. -
పండగపూట పిల్ల చేష్టలు!
సాక్షిప్రతినిధి, విజయనగరం: నడిమంత్రపు సిరి వచ్చినమ్మ చింతకాయలు చూసి ఇవేంటి.. వంకరటింకరగా ఉన్నాయి అన్నదట... కిమిడి నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది.. రాకరాక డీసీసీబీ చైర్మన్ పదవి వచ్చేసరికి దానిని ఏకంగా శాసనమండలి విపక్షనేత మీదకే ప్రయోగిస్తున్నారు. విజయనగరం పట్టణంలో కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని సిరిమాను పండక్కి కొత్త భాష్యం చెబుతున్నారు. వాస్తవానికి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఊరేగింపును టీడీపీ నేతలు.. అధికారులు, న్యాయాధికారులు కోట మీదనుంచి దర్శించుకుని ప్రణమిల్లుతారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. కార్యకర్తలు మాత్రం సిరిమాను సాగే రోడ్డులో ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణం నుంచి సిరిమానును దర్శించుకుంటున్నారు. ఇన్నేళ్లలో ఈ వాజీబును ఎవరూ కాదనలేదు. సత్తిబాబు ఇక్కడ ఎందుకు అని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా ఇదొక సర్దుబాటు రూపంలో కొనసాగుతూ వస్తోంది. టీడీపీ నాయకులూ.. విజయనగరం సంస్థానం కుటుంబీకులు కోట మీదనుంచి.. బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు.. కుటుంబీకులందరూ డీసీసీబీ నుంచి సిరిమానును తిలకిస్తూ వస్తున్నారు. ఇక సాధారణ జనం అయితే వీధుల్లో.. మేడలు .. మిద్దెల మీద నుంచి సిరిమానును దర్శించుకుంటూ వస్తున్నారు. బొత్సకు డీసీసీబీ వేదికపై నో చాన్స్ ఇంకెక్కడైనా కూర్చోండి.. ఏళ్లనాటి ఆనవాయితీకి ఆటంకం బాబు దృష్టిలో పడేందుకు నాగార్జున తాపత్రయం తమవాళ్లు వస్తారంటూ కొత్తభాష్యం ఇదెక్కడి తీరు... గత పాతికేళ్లలో తొలిసారిగా ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాత్రం.. ఠాట్ బొత్స సత్యనారాయణ ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు.. మా సహకార సంఘాల డైరెక్టర్లు 94 మంది ఉన్నారు.. వాళ్లంతా ఇక్కడికే వచ్చి ఈ ప్రాంగణంలో కూర్చుని సిరిమాను యాత్రను వీక్షిస్తారు.. బొత్స అక్కడ కూర్చునేందుకు వీలు లేదంటే లేదంటూ హూంకరించారు. నాగార్జున.. ఆయన డైరెక్టర్లు కావాలనుకుంటే టీడీపీ నాయకులతో కలిసి కోటమీద నుంచి సిరిమానును చూడచ్చు కానీ.. కేవలం బొత్సను ఇబ్బంది పెట్టాను.. అడ్డుకున్నాను అని ఆ పార్టీ అధిష్టానం వద్ద చెప్పుకోవడం కోసమే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు. కేవలం చంద్రబాబు దష్టిలో పడడానికి ఇలా చేశారని.. లేకపోతే ఒక పూట సిరిమాను చూసేందుకు కూడా వేదిక ఇవ్వడానికి ఇన్ని మాటలు ఎందుకు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నాగార్జునలోని రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా బొత్స సత్యనారాయణకు శాసన మండలి విపక్ష నేతగా ప్రభుత్వం ప్రాధాన్యతను.. సముచితమైన ప్రోటోకాల్ను కూడా కల్పించాల్సి ఉంది.. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. -
7 క్రీడాంశాలు.. 1500 మంది క్రీడాకారులు
ఆటలాడుతున్న క్రీడాకారులు(ఫైల్)విజయనగరం: ఏడాదికోసారి నిర్వహించే విజయనగరం ఉత్సవాల్లో భాగంగా క్రీడోత్సవాల నిర్వహణకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 5,6 తేదీల్లో నగర శివారులోని విజ్జీ స్టేడియం వేదికగా క్రీడాపోటీలు జరగనున్నాయి. మొత్తం 7 క్రీడాంశాల్లో నిర్వహించే పోటీల్లో 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.7.50 లక్షల వ్యయంతో నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి 6వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. పోటీల నిర్వహణ ఇలా... కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ క్రీడాంశాల్లో తలపడేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పురుష జట్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. టెన్నీస్ క్రీడాంశంలో ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు నిర్వహించనుండగా.. చెస్, టెన్నీస్ క్రీడాంశాల్లో 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాల, బాలికలకు పోటీలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోటీలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్జీ స్టేడియంలో ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా ప్రారంభించనుండగా.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుగుల్లో పోటీలు జరగనున్నాయి. రెండవ రోజు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోటీలు నిర్వహించిన అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఆయా క్రీడా అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు పర్యవేక్షించే వ్యాయామ ఉపాధ్యాయులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని, విజయవంతం చేయాలని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కె.శ్రీధర్రావు తెలిపారు. ఈ నెల 5,6 తేదీల్లో విజ్జీ స్టేడియం వేదికగా క్రీడోత్సవాలు టెన్నీస్లో ఉత్తరాంధ్ర స్థాయి పోటీలు మిగిలిన క్రీడాంశాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయి పోటీలు రూ.7.50 లక్షలతో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు -
వణికించిన గాలివాన
● ఉప్పొంగిన నాగావళి విజయనగరం ఫోర్ట్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో గురువారం గాలివాన బీభత్సవం సృష్టించింది. నదులు, వాగులు పొంగిప్రవహించాయి. పంటలను ముంచెత్తాయి. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఇప్పటికీ పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు పంటకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు కోసం రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాజాగా వర్షాలు కారణంగా పంటలకు నష్టం వాటిల్లిడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు 135 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూసపాటిరేగ, దత్తిరాజేరు, డెంకాడ, మెంటాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, సంతకవిటి మండలాల్లో అధిక విస్తీర్ణంలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. 14 మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం జిల్లాలోని 14 మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. బొప్పాయి 33.6 హెక్టార్లు, అరటి 105.6 హెక్టార్లు, కూరగాయలు 2.8 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. చీపురుపల్లి, గరివిడి, మెరకమడిదాం, బొబ్బిలి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, పూసపాటిరేగ, బాడంగి, తెర్లాం, రామభద్రపురం, నెల్లిమర్ల, గంట్యాడ, ఎస్.కోట మండలాల్లో 424 మంది రైతులకు చెందిన 142 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం గాలివానకు జిల్లా వ్యాప్తంగా 251 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల స్తంభాలు విరిగిపోగా, మరికొన్ని చోట్ల నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సంబంధిత శాఖ అధికారులు చేపట్టారు. అయితే, ఇప్పటికీ చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జరగలేదు. గంట్యాడ మండలంలోని పెదమధుపాడ, బుడతానపల్లి గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. బోనంగి గ్రామంలో 30 శాతం విద్యుత్ సరఫరా కాలేదు. నష్టాన్ని అంచనా వేస్తున్నాం 135 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశాం. ఉద్యాన పంటలు బొప్పాయి. అరటి, కూరగాయాలు 142 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు గుర్తించాం. శనివారం నుంచి పంట నష్టం సర్వేచేస్తాం. ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం. దెబ్బతిన్న 251 విద్యుత్ స్తంభాల్లో 134 స్తంభాలను పునరుద్ధరించినట్టు వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్శాఖ అధికారులు భారతి, కె.చిట్టిబాబు, మువ్వలక్ష్మణరావు తెలిపారు. మెంటాడ మండలంలో నెలకొరిగిన మొక్క జొన్న సంతకవిటి: భారీ వర్షాలకు నాగావళి నది ఉప్పొంగింది. నారాయణపురం ఆనకట్టవద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా నిలిచిపోయింది. జావాం సమగ్ర మంచినీటి సరఫరా పంపుహౌస్ పనిచేయకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. హొంజరాం, మేడమిర్తి, బూరాడపేట, తమరాం, రంగారాయపురం, జావాం తదితర గ్రామాల్లో చెరకు పంట నేల వాలింది. సంతకవిటి: నారాయణపురం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి ఉప్పొంగిన నదులు, వాగులు వరి, మొక్కజొన్న, పత్తి, అరటి పంటలకు నష్టం నేలకూలిన 251 విద్యుత్ స్తంభాలు అంధకారంలో పల్లెలు -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతిశ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. విజయనగరం విలవిల విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈపీడీసీఎల్కు రూ.1.78 కోట్ల నష్టంవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.వంశధార ఉధృతిభీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీవర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది. తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. అల్లూరి జిల్లాలో కూలిన బడులు భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.వృద్ధ దంపతులను బలిగొన్న గోడమరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నంశ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని హుకుంపేటకు చెందిన పైడితల్లి(50) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ ఏఎస్సై రామారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో భార్యతో నివసిస్తున్నాడు. సైకిల్ టైర్ పంక్చర్ రిపేర్ తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజులాగానే పనిలోకి వెళ్లిన పైడితల్లికి అక్కడే కరెంట్ షాక్ తగలడంతో మృత్యువాత పడ్డాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సాఫ్ట్బాల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
బొబ్బిలి: సాఫ్ట్బాల్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశీలకులు ఎంవీ రమణ, తిరుపతిరావుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎమ్మెల్యే బేబీనాయన, ఐ.విజయకుమార్, కోశాధికారిగా ఎన్.వెంకటి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా సుంకరి సాయిరమేష్లను ఎన్నుకున్నారు. డివైడర్ను ఢీకొని భార్యాభర్తలకు గాయాలుభోగాపురం: మండలంలోని పోలిపల్లి జాతీయ రహదారిపై డివైడర్ను బైక్తో ఢీకొన్న భార్యాభర్తలు గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన భార్యాభర్తలు బైక్పై విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో పోలిపల్లి చేరుకుసరికి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న భర్తకు తీవ్రగాయాలు కాగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో విజయనగరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని హెచ్సీ శ్రీనివాసరావు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ర్యాలీవిజయనగరం టౌన్: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా బుధవారం సంస్ధ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ సంస్ధలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్ధ అయిన బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సంస్ధ డీజీఎం దాలినాయుడు మాట్లాడుతూ హుద్హుద్ వంటి తుఫాన్లు, విపత్కర పరిస్ధితుల్లో కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందరికీ అందుబాటులో నిలిచి అందరి మన్ననలు పొందిందన్నారు. 25 ఏళ్ల ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా ఫోర్జీ నెట్వర్క్, 100జీబీ స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం కొత్తగా టవర్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రారంభించి టీటీడీ కల్యాణ మంటపం, లయన్స్ క్లబ్, కోట జంక్షన్, గురజాడ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి కార్యాలయానికి ర్యాలీ చేరింది. -
వేగావతి నదిలో భవానీ భక్తుడు గల్లంతు
బొబ్బిలి రూరల్: మండలంలోని జె.రంగరాయపురం వద్ద వేగావతి నదిలో స్నానానికి దిగిన పాటోజు యోగీశ్వర్రావు(22) అనే భవాని భక్తుడు బుధవారం గల్లంతయ్యాడు.బొబ్బిలి పట్టణంలోని కంచరవీధికి చెందిన యోగీశ్వర్రావు సహచర ఐదుగురు భవానీ భక్తులతో కలిసి బుధవారం వేగావతి నదిలో స్నానమాచరించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దిగారు. నదిలో నీటి ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు ముగ్గురు భక్తులు కొట్టుకుపోగా వారిలో వినయ్, చరణ్లు చెట్లపొదల్లో చిక్కుకుని ప్రాణాలతో క్షేమంగా బయటపడగా, యోగీశ్వర్రావు నదిలో కొట్టుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై కొండల రావు, ఫైర్ స్టేషన్ హెచ్సీబాలకృష్ణ ఆధ్వర్యంలో నలుగురు ఫైర్ సిబ్బంది నదిలో తాళ్లసహాయంతో సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు.అయినా మృతదేహం లభ్యం కాలేదు. యోగీశ్వర్రావు పట్టణంలో ఏసీ మెకానిక్గా పనిచేస్తు కుటుంబానికి అండగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వీరాచారి, సుజాత, తమ్ముడు శ్యాంలు నదివద్దకు చేరుకుని బావురుమాన్నారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తామని ఏఎస్సై కొండలరావు విలేకరులకు తెలిపారు. -
లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించాలి
విజయనగరం క్రైమ్: స్మార్ట్ పోలీసింగ్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండాలని ఎస్పీ దామోదర్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం ముగిసిన వెంటనే పెదమానాపురం పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషను పరిసరాలు పరిశీలించి, స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే బాధితులు, వృద్ధులు, మహిళల పట్ల అప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులపట్ల సామరస్యంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని, అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలందించాలని, అందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడే వారిని, గంజాయి, మహిళలు పట్ల దాడులకు పాల్పడే వారిని, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ దామోదర్ -
పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..
ఆన్యాయంగా భూమిని అక్రమించుకున్న వ్యక్తిపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలి. ఆక్రమణదారు వద్ద ఎటువంటి ఆధారం లేకుండా పురోహితులు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్నారు. సిద్ధాంతం గణపతి, ప్రధాన అర్చకుడు, సంగాం దౌర్జన్యంగా ఆక్రమణ.. దేవాదాయ శాఖకు చెందిన భూమిని టీడీపీ నేత దారుణంగా ఆక్రమించకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి సంగమేశ్వరస్వామి ఆలయం పురోహితులు సాగుచేసుకుంటున్నారు. ఆ భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి భూమిని ఆక్రమించుకోవడం దారుణం. దర్యాప్తు చేసి దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. గేదెల రామకృష్ణ, గ్రామపెద్ద, సంగాం -
ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన
పార్వతీపురం రూరల్: ఏనుగుల గుంపు సృష్టిస్తున్న బీభత్సానికి తమ పంటలు సర్వనాశనమయ్యాయని, తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో బుధవారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని మరికి, కృష్ణపల్లి తదితర గ్రామాల సమీపంలో 8 రోజులుగా ఏనుగులు సంచరిస్తూ సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న, వరి, టేకు చెట్లను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం నష్టాన్ని అంచనా వేయడానికి కూడా రాలేదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా సభ్యుడు పి. సంగం, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, అరకొర సాయం అందించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారని, పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి న్యాయమైన పరిహారం చెల్లించాలని, అలాగే ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రైతులు, ప్రజల ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. పంట నష్టపరిహారాన్ని త్వరగా అందించేలా చర్యలు ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని సత్వరమే అందజేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి డీఎఫ్ఓ జీఏపీ ప్రసూనను ఆదేశించారు. పార్వతీపురం మండలం మరికి, కృష్ణపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఏనుగుల గుంపు తమ పంట పొలాల్లోకి చొరబడి తాము సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తున్నాయని బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కావున నష్టపోయిన పంటలకు గాను సంబంధిత రైతులు, కౌలు రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలని కలెక్టరుకు దరఖాస్తు అందజేశారు. ఈ దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందజేయాలని, అలాగే నష్టపోయిన గిరిజన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని డీఎఫ్ఓ జీఏపీ పి.ప్రసూనను ఆదేశించారు. దీంతో రైతులు తమ ఆనందం వ్యక్తం చేశారు. -
అర్చకుల ఆర్తనాదం..!
వంగర: మండల పరిధిలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయం పరిధిలో దేవదాయ శాఖ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకెవ్వరు అడ్డు అంటూ గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు సుమారు 80 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నాడు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన బోర్డును సైతం లెక్క చేయకుండా భూమిని ఆక్రమించేశాడు. కొన్ని దశాబ్దాలుగా సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితులు(అర్చకులు)గా ఉంటున్న సిద్ధాంతం చిన్నిస్వామి, సిద్ధాంతం పోలిలింగం, సిద్ధాంతం విశ్వనాథం, సిద్ధాంతం నాగభూషణరావులు ఆ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఈ భూమిని గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆక్రమించుకోవడంతో దేవాదాయ శాఖ ఈవో పొన్నాడ శ్యామలరావు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సిద్ధాంతం గణపతిరావు ఆధ్వర్యంలో అర్చకుల బృందం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ భూమి వదిలేందుకు ఆక్రమణదారు ముందుకు రాకపోవడంతో బుధవారం గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమై నిరసన తెలిపారు. ఆక్రమించుకున్న భూమి వద్దకు వెళ్లి కొన్ని దశాబ్దాల నుంచి సంగమేశ్వరస్వామి ఆలయ పురోహితులు అనుభవించే వారని, ఇప్పుడు ఈ భూమి ఎలా దఖలుపడిందని ఆక్రమణదారును ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో తిరుగాడుతూ దేవాదాయ శాఖ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయాలంటూ వేడుకోలు దేవదాయ శాఖ భూమిని ఆక్రమించిన టీడీపీ నేత పార్టీలకు అతీతంగా గ్రామంలో నిరసన పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖలకు ఫిర్యాదు -
మహిళల ఆర్థికస్వావలంబన పెంపుదలే లక్ష్యం
విజయనగరం టౌన్: మహిళల్లో ఆర్థికస్వావలంబన పెంపొందించడమే లక్ష్యంగా అఖిలభారత డ్వాక్రా బజార్, సరస్ను ఏర్పాటుచేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్స్అఫీషియో సెక్రటరీ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మాన్సాస్ గ్రౌండ్లో బుధవారం ఏర్పాటు చేసిన డ్వాక్రాబజార్, సరస్ ఎగ్జిబిషన్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయం సహాయక సంఘ సభ్యులు ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ను పరిశీలించి, వారితో మమేకమయ్యారు. మహిళల సృజనాత్మకత, శ్రమ, నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేశామన్నారు. ఎన్నోరకాల తయారీ ఉత్పత్పులు ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం అభినందనీయని ప్రశంసించారు. కార్యక్రమంలో సెర్ప్ హెచ్ఆర్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, వెలుగు ఏపీడీ సావిత్రి, పీడీ రత్నాకర్, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎంలు రాజ్కుమార్, చిరంజీవి, లక్ష్మునాయుడు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ కరుణ -
పైడితల్లి అమ్మవారి ప్రసాదాల నాణ్యత పరిశీలన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు వినియోగిస్తున్న ప్రసాదాల నాణ్యత తీరును ఫుడ్ ఇన్స్పెక్టర్లు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి మాట్లాడుతూ అమ్మవారి పండగకు సంబంధించి తయారుచేసే లడ్డు, పులిహోర ప్రసాదాలకు సంబంధించిన ఆహారపదార్థాల నాణ్యతను ప్రతిరోజూ చెక్ చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన శాంపిల్స్ను సేకరించామని, వాటిని హైదరాబాద్లోని నాచారంలో ఉన్న ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తామన్నారు. ప్రసాదాలకు వినియోగించే కందిపప్పు, శనగపప్పు, కాజూ, నెయ్యి తదితర వాటిని చెక్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా, ఆలయ సూపర్వైజర్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
● భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు ● కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిసంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన అదపాక లింగంనాయుడు(37) రేబిస్ వ్యాధితో సోమవారం మృతిచెందాడు. ఆయనకు ఆగస్టు 30న కుక్క కరవడంతో సంతకవిటి పీహెచ్సీకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం వైజాగ్ రిఫర్ చేయడంతో ఆదివారం వైజాగ్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన మృతితో గ్రామస్తులు భయాందోళన చెంది గ్రామంలో కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వైద్యుల సమ్మెబాట
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలుసాక్షి, పార్వతీపురం మన్యం: వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమ స్యలు, డిమాండ్ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా విధులను బహిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులందరూ సమ్మె బాట పట్టారు. ఓపీ, అత్యవసర సేవలు కూడా నిలిపి వేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా.. మరో చోట నుంచి వైద్యులను డిప్యుటేషన్ మీద పంపినా.. ఫలితం లేకపోయింది. జిల్లాలో పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 26 నుంచి నిరసనలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు పీజీ కోటా పెంచాలని, ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని పీహెచ్సీ వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఆ మేరకు గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల డిమాండ్ల పట్ల కూటమి ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో బుధవారం పూర్తిగా విధులను బహిష్కరించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గురువారం విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. వైద్య సేవలకు ఆటంకం మన్యం జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారులు సమ్మెబాట పట్టడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆయుష్, ఇతర విభాగాల నుంచి 35 మంది వైద్యులను డిప్యూటేషన్ మీద నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలూ సిబ్బందిని అక్కడ అందుబాటులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయి. పీహెచ్సీలు పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా పంపిన వైద్యులు కొన్ని పీహెచ్సీలకు మాత్రమే హాజరై, అక్కడ కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. -
వ్యవసాయం కంటే పింఛన్ ఆదాయమే ఎక్కువ
దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామస్తులకు వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయం కంటే పింఛన్ రూపంలో వచ్చిన ఆదాయమే అధికమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వరి పండిస్తే ఎంత ఆదాయం వస్తుందంటూ వ్యవసాయ సిబ్బందిని తిరిగి ప్రశ్నించారు. సాగు వివరాలపై ఆరా తీశారు. దత్తిలో బుధవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేది కలో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంద రూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, తన ఒక్కడివల్ల కాదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని, కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంలో రూ.లక్షా50వేలతో ఏర్పా టు చేసుకున్న దుకాణాన్ని ఇటీవల తొలగించడంతో రోడ్డున పడ్డానని, ఆదుకోవాలంటూ దత్తి గ్రామానికి చెందిన పి.ధనుంజయ్ అనే యువకుడు సీఎంను వేడుకున్నారు. దీనిపై చంద్రబాబు స్పంది స్తూ ఉపాధి కల్పనతో పాటు దుకాణం అప్పగించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 12 గంటలకు వచ్చిన సీఎం సాయంత్రం 4.30 గంటల వరకు దత్తిలోనే ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జు న, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజుపాల్గొన్నారు. -
గిరిజనుల విద్య, వైద్యంపై నిర్లక్ష్యం తగదు
గిరిజనులకు మెరుగైన వైద్యం, విద్యా సౌకర్యా ల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి వారం రోజుల్లో కురుపాం బాలిక గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతే నిలువెత్తు నిదర్శనమని మా జీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. బాలికలు అనారోగ్యంతో మృతిచెందుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్పందించక పోవ డం ఘోరమన్నారు. కురుపాం సీహెచ్సీలో వైద్యసేవలు పొందుతున్న బాలికలను పరామర్శించిన అనంతరం కురుపాం గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్, సిబ్బందితో మాట్లాడారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురైందన్నారు. అనంత రం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంత మంది బాలికలు అనారోగ్యంబారిన పడతారోనని ఆవేదన వ్యక్తంచేశారు. కురుపాం సీహెచ్సీలో సేవలు పొందుతున్న 50 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేశారన్నారు. గిరిజన బాలికలకు భద్రత కరువు గిరిజన ఆడపిల్లలకు భద్రత కరువైందని పుష్పశ్రీవాణి ఆవేదన వ్యక్తంచేశారు. బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేసి మళ్లీ రూ.లక్షల్లో లంచం తీసుకుని తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై గిరిజనులకు ఏం చెప్పదలచుకుంటున్నారో..? కూటమి నాయకులు, ఐటీడీఏ అధికారులు ఆలోచించాలన్నారు. -
జీఎస్టీ తగ్గుదల..!
మందులపై అమలు కాని విజయనగరం ఫోర్ట్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందగా ఉంది.. జిల్లాలోని మందుల దుకాణదారుల వైఖరి. మందులపై జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్)ని కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 5 శాతానికి తగ్గించినా ఆ మేరకు మందుల ధరలు తగ్గించడంలేదన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి. కొన్ని మెడికల్ షాపుల యజమానులు పాతధరలకే మందులు విక్రయిస్తున్నట్టు సమాచారం. దుకాణాలపై పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఇష్టానురీతిన మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఎక్కువగా సంతోషించారు. నెలనెలా మందుల కోసం వెచ్చించే బడ్జెట్ తగ్గుతుందని ఆశించారు. బీపీ, సుగర్, ఆస్తమా, గుండె జబ్బులు, కేన్సర్ వంటి రోగులు నిత్యం మందుల కోసం కొంత బడ్జెట్ వెచ్చించాల్సిందే. నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. జీఎస్టీ తగ్గించినా మందుల బడ్జెట్ తగ్గకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులను నిలదీస్తున్నా ధర మాత్రం తగ్గించడం లేదు. కొందరు బిల్లులు ఇవ్వకుండా మందులు మాత్రమే ఇస్తున్నారు. పాత ధరలకే మందులు విక్రయిస్తున్నారని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జిల్లాలో 1600 మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో హోల్సేల్, రిటైల్ మందులు దుకాణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గుదల అమల్లోకి వచ్చింది. మందుల ధరలు ఆ రోజునుంచే తగ్గించి విక్రయించాలి. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి. అయి తే, దుకాణాలపై పర్యవేక్షణ లేక కొరవడడంతో పాత ధరలకే మందులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని మందుల దుకాణాల్లో తగ్గించిన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు జారీచేశాం. ఆ మేరకు ధరల బోర్డులు కూడా పెట్టమని ఆదేశాలిచ్చాం. మందుల దుకాణాలను పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలు పాటించని షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. – రజిత, జిల్లా ఔషద నియంత్రణశాఖ సహాయ సంచాలకులు -
విజయాలకు నాంది కావాలి
విజయనగరం: విజయదశమి ప్రతి ఒక్కరి విజయాలకు, ప్రగతికి నాంది కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ ఆయన బుధవారం ఓ ప్రకటనలో దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే దసరా పండగ, మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలకు, విజయాలకు పునాది వేయాలని ఆకాంక్షించారు. దుర్గామాత అందరినీ చల్లగా చూడాలని, సంపూర్ణ శక్తినివ్వాలన్నారు. నవ దుర్గల స్ఫూర్తిగా ప్రతిమహిళా అభివృద్ధివైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు బుధవారం వరద ప్రవాహం పెరిగింది. వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 10,500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.28 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. బుధవారం నాలుగు గేట్లు ఎత్తివేసి 11వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టినట్టు ఏఈ నితిన్ తెలిపారు. బొబ్బిలి: దశాబ్ద కాలంగా ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్, పాలిథిన్ సంచుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తు న్న బొబ్బిలి మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిచి స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికై ంది. ఈ విషయమై కమిషనర్ ఎల్.రామలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర అవార్డు రావడం సంతోషంగా ఉందని, బొబ్బిలిలో పారిశుద్ధ్య నిర్వహణకు సహకరిస్తున్న ప్రజలందరికీ అవార్డు ఫలాలు అందిస్తామన్నారు. కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు పాలకొండ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహిషాసుర మర్దినిగా కోటదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తు లు అమ్మవారికి ఘటాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. గురువారం అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. -
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలను అర్చకులు జరిపించారు. శ్రీవారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో అశీనులు చేసి రామతీర్థం పురవీధుల్లో మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం యాగశాల లో పూర్ణాహుతి, అవబృదం కార్యక్రమాలను జరిపిస్తామని అర్చకులు తెలిపారు. అనంతరం భాస్కరపుష్కరిణిలో శ్రీవారికి చక్రతీర్థ స్నానం కనుల పండువగా చేయిస్తామన్నారు. 3న జరిగే పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. -
గిరిజన గురుకులంలో చావుకేకలు
కురుపాం: గిరిజన గురుకులంలో వినిపిస్తున్న చావుకేకలు విద్యార్థిలోకాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తోయక కల్పన (15) అనారోగ్యంతో కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఇదే పాఠశాలలో చదుతున్న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన అంజిలి అనే బాలిక వారం రోజుల కిందట మృతిచెందింది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గురుకుల పాఠ శాలలో సదుపాయాలు లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీరు అందకపోవడం, బాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తరచూ అనారోగ్యంబారిన పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 611 మంది విద్యార్థినులు చదుతున్న గురుకులానికి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని, జిల్లాకు చెందిన మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదంటూ గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. పచ్చకామెర్ల బారిన విద్యార్థులు వసతి గృహంలో కలుషిత తాగునీరు కారణంగా విద్యార్థులు జ్వరాలు, పచ్చకామెర్లు బారిన పడుతున్నారు. వారంలో ఇద్దరు మృత్యువాత పడడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలకు చెందిన 50 మంది బాలికలను కురుపాం సీహెచ్సీకి తరలించారు. వైద్య పరీక్షలు చేశారు. నీరజ అనే బాలికను కేజీహెచ్కు తరలించారు. మరికొంత మంది బాలికలు జియ్యమ్మవలస మండలం రామభద్రపురం, చినమేరంగి పీహెచ్సీల్లో చికిత్స పొందుతున్నారు. జ్వరాల వ్యాప్తిపై గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ పి.అనూరాధ మాట్లాడుతూ పాఠశాలలో కొద్ది రోజులుగా ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదని, బాలికలకు ప్రత్యమ్నాయంగా వేడినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపా రు. జ్వరాల బారిన పడిన వారి ని కురుపాం సీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. కొందరు విద్యార్థిను లు దసరా సెలవుల్లోనూ ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందుతుండడం గమనార్హం. బాలికలను పరామర్శించిన పుష్పశ్రీవాణి వారం రోజుల్లో ఇద్దరు బాలికలు మృత్యువాత పడడం, 50 మంది విద్యార్థినులను వైద్య పరీక్షల కోసం కురుపాం సీహెచ్సీకి తరలించిన విషయం తెలుసుకున్న మాజీ ఉపముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి సీహెచ్సీకి వెళ్లి పరామర్శించారు. వైద్యసేవలు పొందుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. చికిత్స అందిస్తున్న వైద్యాధికారి వాసును బాలికల మరణం, జ్వరాల వ్యాప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆమె వెంట కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత, వైఎస్సార్సీపీ నాయకులు నిషార్, శెట్టి నాగేశ్వరరావు, ఆదిల్ ఉన్నారు. -
కూటమి పాలనలో అరాచకాలు, అవినీతి దాడులు
● బాధితుల కోసమే డిజిటల్ బుక్ ● డిజిటల్ బుక్ పోస్టర్లు విడుదల చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీచీపురుపల్లి: కూటమి ప్రభుత్వం పదహారు నెలల పరిపాలనలో అక్రమాలు, అవినీతి, అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఇంకేం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్లు అన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ యాప్కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు నెలల్లో పరిపాలన విషయంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం తమకు ఓట్లు వేసిన ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కూటమి ప్రభుత్వం విఫలమైన తీరును, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి సోషల్ మీడియా తీసుకువెళ్తున్న తీరును జీర్ణించుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అందుకనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్ను తీసుకొచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ డిజిటల్ బుక్ యాప్లో తమ కష్టాలు, వివరాలు నమోదు చేయాలని సూచించారు. అసలైన సైకో బాలకృష్ణ అసలు సిసలైన సైకో, ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పొందిన బాలకృష్ణ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని సైకో అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు పోలీస్ వ్యవస్థ కూడా వంతపాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు, మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహనతోనే గిరిజనుల సంక్షేమం
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబితపార్వతీపురం రూరల్: భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే వారి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఉద్ఘాటించారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మండలంలోని చినమరికి గ్రామంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం ఎన్నో ప్రణాళికలు, చట్టాలు దేశంలో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాల్య వివాహాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18ఏళ్ల వయస్సు దాటాకే వారు శారీరకంగా, మానసికంగా పరిణతి చెందుతారన్నారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ క్రమంలో తక్కువ బరువుతో పిల్లల పుట్టడం, నవజాత శిశు మరణాలు, పోషకాహార లోపాలు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. అడవి, భూమిని కాపాడుకోవాలి ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు మాట్లాడుతూ గిరిజనుల జీవనానికి, సంస్కృతికి ఆధారమైన అడవి, భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కల్పించిన హక్కులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. తమ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, పార్వతీపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోష్పిన్, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి, తహసీల్దార్ సురేష్, లోక్ అదాలత్ సభ్యులు జోగారావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వెంకటరావు, స్థానిక సర్పంచ్ గంగ తదితరులు పాల్గొన్నారు. -
ఆపద్బాంధవులు
పార్వతీపురం రూరల్/రాజాం సిటీ: మనిషి ప్రాణానికి ప్రత్యామ్నాయం లేదు. అలాగే మనిషి రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు! ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా, ప్రయోగశాలల్లో రక్తాన్ని సృష్టించలేని పరిస్థితి. అందుకే, ఒకరి ప్రాణాన్ని కాపాడాలంటే మరొకరు అందించే రక్తమే ఏకై క ఆధారం. ఆపదలో ఉన్నవారికి ప్రాణభిక్ష పెట్టే ఆ మహత్తర కార్యానికి గుర్తుగా, ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 1వ తేదీన ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ జరుపుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 1682 మంది స్వచ్ఛంద ప్రత్యక్ష రక్తదాతలు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారిని గుర్తు చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకునే ప్రత్యేక రోజు కేవలం ఒక దినోత్సవం కాదు, మానవత్వం పరిమళించే ఒక మహాయజ్ఞం. ప్రాణం నిలిపే అమృతధార ప్రతిరోజూ మన దేశంలో వేలాది మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రసవ సమయంలో తల్లీబిడ్డలు రక్తహీనతతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. తలసేమియా, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులు, రోగులకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో, దాతలు అందించే ప్రతి రక్తపు చుక్క ఓ అమృతధారలా మారి ప్రాణాలను నిలుపుతుంది. మన దేశంలో ఏటా సుమారు 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, స్వచ్ఛంద దాతల ద్వారా కేవలం 90 లక్షల యూనిట్లు మాత్రమే అందుతోందని రక్త దాతలు, వైద్యులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అపోహల తెరలను చీల్చుదాం రక్తదానం అనగానే చాలామందిలో అపోహలు, అనవసర భయాలు గూడుకట్టుకుని ఉంటాయి. ‘రక్తదానం చేస్తే నీరసించిపోతాం, అనారోగ్యం పాలవుతాం’ వంటివి కేవలం నిరాధారమైన ప్రచారాలు మాత్రమే. వాస్తవాలను పరిశీలిస్తే.. రక్తం ఇస్తే నీరసం వస్తుందా? మన శరీరంలో సగటున 5–6 లీటర్ల రక్తం ఉంటుంది. దానం చేసేది కేవలం 350 మిల్లీలీటర్లు మాత్రమే. ఈ కొద్దిపాటి రక్తాన్ని మన శరీరం కేవలం 24 నుంచి 48 గంటల్లోనే తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. ఎలాంటి నీరసం రాదు. రక్తదానం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయా? రక్త సేకరణ ప్రక్రియ అత్యంత సురక్షితమైనది. ప్రతి దాతకు కొత్త, స్టెరిలైజ్డ్ సూదిని మాత్రమే ఉపయోగిస్తారు. దీనివల్ల దాతకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకే అవకాశమే లేదు. దాతలే హీరోలు.. రక్తదానం చేయడానికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. మానవత్వంతో స్పందించే ప్రతి ఒక్కరూ రక్తదాత కావచ్చు. వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. బరువు కనీసం 50 కిలోగ్రాములు ఉండాలి. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, అంటువ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12.5 గ్రాములు ఉండాలి. పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి, మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.ప్రాణదానానికి మొదటి బాట రక్తదానంపై అపోహలను నమ్మవద్దు ఆధునిక వైద్య విధానంలో రక్తదానం 100శాతం సురక్షితం. ప్రతి దాత భద్రతను నిర్ధారించుకున్నాకే రక్తాన్ని స్వీకరిస్తాం. 18 ఏళ్లు వయసు దాటిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. నిజానికి, క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల శరీరంలో అధిక ఐరన్ నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత రక్తకణాల స్థానంలో కొత్తవి ఏర్పడి, శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలి. – డాక్టర్. జి.నాగభూషణరావు, డీసీహెచ్ఎస్, పార్వతీపురం మన్యం జిల్లాశతక దానానికి ఒక్క అడుగు దూరం మన ఇంట్లో వారికి రక్తం అవసరమైతే ఎంత ఆరాటపడతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బ్లడ్ బ్యాంకులో మనకు తెలియని వారెందరో అదే ఆరాటంతో ఎదురుచూస్తున్నారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నది ఎవరో కాదు. మన లాంటి మనుషులే. ఇప్పటికి స్వచ్ఛందంగా ప్రత్యక్ష రక్త దాతగా దైర్యంగా 99 సార్లు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాను. యువత ముఖ్యంగా రక్తదానానికి ముందుకురావాలి. పుట్టినరోజున రక్తదానం చేసి ఆ రోజును మరపురానిదిగా చేసుకునే మంచి ఆలోచనలు యువతలో రావాలి. – బోటు రామకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, పార్వతీపురం ప్రాణాలు నిలబెడుతున్న రక్తదాతలు పార్వతీపురం మన్యం జిల్లాలో 1682 మంది స్వచ్ఛంద రక్తదానం నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం -
ఆరేళ్లకే నిండిన నూరేళ్లు
రాజాం సిటీ: అప్పటి వరకు సరదాగా చిట్టిపొట్టి మాటలు ఆడుతూ తల్లిదండ్రులతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. దసరా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించిన ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా అంటూ పెట్టిన తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కళ్లెదుటే మృతిచెందడంతో జీర్ణించుకోలేక గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదించారు. ఈ హృదయ విదారక ఘటన రాజాంలో మంగళవారం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన లుకలాపు మోహనరావు మెకానిక్గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య ఇందు, కుమార్తె ద్రాక్షాయణి(6)తో కలిసి ద్విచక్రవాహనంపై బొద్దాం నుంచి రాజాం వస్తున్నారు. అదే సమయంలో బొబ్బిలి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బొబ్బిలి జంక్షన్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. రెండో వైపు పడిపోయిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే తేరుకుని కుమార్తెను చూసి ఒక్కసారిగా భోరున విలపించారు. తన కుమార్తెకు ఏమీ కాదని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి చిన్నారిని మోసుకుంటూ తండ్రి తీసుకువెళ్లిన దృశ్యం చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు. చిన్నారి మృతితో బూరాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై రమణమూర్తి తెలిపారు. -
మత్స్యకారులకు నష్టం జరిగే చర్యలు విరమించుకోవాలి
విజయనగరం: మత్స్యకారులకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట గ్రామం నక్కపల్లి మండలం బల్క్ డ్రగ్స్ పార్క్ను వ్యతిరేకిస్తూ స్థానిక మత్స్యకారులు 15రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమను మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేస్తే మత్స్యకారుల జీవనానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన వారిపై తప్పుడు కేసులు పెడితే మత్స్యకారులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు అండగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వం దుష్ట చర్యలకు పాల్పడకుండా తక్షణమే తీరప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆలోచన విరమించుకోవడంతో పాటు మత్స్యకారులపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం పర్యటనకు 600 మందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి వస్తున్న సంగతి విదితమే. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు మంత్రి కొండపల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిలు మంగళవారం పింఛన్లు పంపిణీ చేసే సభా ప్రాంగణాన్ని ఎస్పీ దామోదర్ ,ఏఎస్పీ సౌమ్యలతలతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్ల రూట్ మ్యాప్లను దగ్గరుండి మంత్రులకు ఎస్పీ దామోదర్ చూపించారు. దాదాపు 600 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా వివరించారు. సభా స్థలం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగ్ స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ వెళ్లే మార్గాలను క్షేత్ర స్థాయిలో ఎస్పీ దామోదర్ పర్యవేక్షించారు. బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించే విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చిన మాటను చంద్రబాబు, లోకేష్ నిలబెట్టుకోవాలి
● ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబుగజపతినగరం: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్ కాలువ నుంచి విజయనగరంలోని వెదురు వాడ తాటిపూడి ఎక్స్టెన్షన్ బాలెన్స్ రిజర్వాయర్ తరువాత ఎక్కడా బాలెన్సింగ్ రిజర్వాయర్ లేదని దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లాకార్యదర్శి బి.రాంబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు బొండపల్లి సభలోను, అలాగే నారాలోకేష్ గంట్యాడ మండలంలో జరిగిన సభలోను ఎలైన్ మెంట్ పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గం పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికీ ఇచ్చిన ఆ మాటను తండ్రీకొడుకులు నిలబెట్టు కోలేదన్నారు. గుమడాం గ్రామం నుంచి కోటగండ్రేడు వరకు కాలువ లోలెవెల్లో తీసుకుని పోయి అక్కడి నుంచి ఐదు లిఫ్ట్ల ద్వారా నీరు పంప్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జిల్లాలోని మెట్టప్రాంతాలకు సాగునీరందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎడమ కాలువ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ చల్లా జగన్, గంట్యాడ మండలం పోరాట కమిటీ కన్వీనర్ కోడెల శ్రీను, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపు నాయుడు, రైతు సంఘం నాయకులు డుదేవర జగన్, దాసరి సింహాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు రాకోటి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన సీతారాపు సతీష్(25) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తండ్రి సీరాపు శ్రీరాములు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుమారుడు సతీష్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించిన కారణంగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగేశాడు. దీంతో చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. సతీష్ సాలూరు ఆర్టీసీ డిపోలో కాట్రాక్ట్ పద్ధతిన డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. యువకుడి ఆత్మహత్యశృంగవరపుకోట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోకాడ బాపునాయుడు కొడుకు ప్రదీప్ కొంతకాలంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నెట్వర్క్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం గ్రామానికి వచ్చిన ప్రదీప్ అందరితో కలివిడిగా ఉన్నాడు. సోమవారం సాయంత్రం వరకు సన్నిహితులు, స్నేహితులతో సరదాగా గడిపి సోమవారం రాత్రి తన ఇంటి మేడపైన గదిలో చున్నీతో ఉరిపోసుకున్నాడు. ిస్థిరమైన ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. మృతుడు ప్రదీప్కు తండ్రి, తల్లితో పాటు పెళ్లైన అక్క ఉన్నారు. -
డ్వాక్రా ఉత్పత్తులకు చక్కని ఆదరణ
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి విజయనగరం టౌన్: జిల్లాలో డ్వాక్రా ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభిస్తోందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు తయారు చేసిన డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకాలకు విజయనగరం వరుసగా మూడో ఏడాది వేదిక అయిందని సెర్ప్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి తెలిపారు. మాన్సాస్ గ్రౌండ్లోని డ్వాక్రా బజారును అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఇటువంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సరస్లో 244 స్టాల్స్ను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీని నియమించామని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని తెలిపారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, ఏపీడీ కె.సావిత్రి, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎంలు రాజ్కుమార్, చిరంజీవి, సీతారామయ్య, లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
పారాది కాజ్వేపై వరద నీరు
బొబ్బిలిరూరల్: అంతరరాష్ట్ర రహదారిలో పారాది గ్రామం వద్ద వేగావతినదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్వేను మంగళవారం వరదనీరు ముంచెత్తింది. నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేకువజాము నుంచి కాజ్వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం ఏడు గంటలకు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో ఆర్అండ్బీ అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఆర్థిక బకాయిలు చెల్లించండి ● ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి విజయనగరం అర్బన్: ఉద్యోగుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం 30 శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సీఆర్పీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. మున్సిపల్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టనున్న చలో విజయవాడ ధర్నాను విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎ.సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ధనంజయరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆర్.కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, వై.మధుసూదనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎస్.శ్రీదేవి పాల్గొన్నారు. నేడు సీఎం చంద్రబాబు దత్తి రాక దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామంలో బుధవారం చేపట్టే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పాల్గొంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, గిరిజన, సీ్త్ర సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి దత్తి గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పింఛన్ అందజేయనున్న లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఏర్పాట్లు, గ్రామస్తులతో మాట్లాడనున్న ప్రజా వేదిక, టీడీపీ కార్యకర్తలతో మాట్లాడనున్న వేదిక, హెలిప్యాడ్ స్థలాలను సందర్శించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దత్తి గ్రామంలో సీఎం ఉంటారని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్ విజయనగరం క్రైమ్: చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం క్లాస్ పీకారు. సీఎం బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు దత్తికి వెళుతున్న హోంమంత్రి అనిత బెటాలియన్వద్ద మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ను చూసి కాన్వాయ్ను ఆపించి మైనర్లను సుతిమెత్తగా మందలించారు. పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం సరికాదని తల్లిదండ్రులకు హితవుపలికారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు. -
సమగ్ర శిక్షలో ఆకలి కేకలు
● రెండు నెలలుగా అందని వేతనం ● ఆర్థిక ఇబ్బందుల్లో 1238 మంది ఉద్యోగులు ● పట్టించుకోని కూటమి పాలకులు విజయనగరం అర్బన్/రాజాం: సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో ఎస్ఎస్ఏలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1,238 మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో సీఆర్ఎంటీలు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, ఫిజియోథెరిపిస్టులు, సైట్ ఇంజినీర్లు, మెసెంజర్లు, డ్రైవర్లుగా పనిచేస్తున్నా వేతనం సకాలంలో అందజేయకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి వర్తింపజేయపోవడంతో కూటమి తీరుపై భగ్గుమంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిరవధిక సమ్మె చేసిన సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ సిబ్బందికి మద్దతు తెలుపుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని ట్విట్టర్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా హామీ అమలుచేయలేదని నిట్టూర్చుతున్నారు. విధులు ఇలా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో సమగ్ర శిక్షలో 1,238 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఎమ్మార్సీ సిబ్బంది 130 మంది, సీఆర్ఎంటీఎస్లు 151, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్స్ 259 మంది, కేజీబీవీలో పీజీటీలు 105, పీఈటీలు 26, ప్రిన్సిపాల్స్ 26, సీఆర్టీఎస్ 179, ఏఎన్ఎంలు 19, అకౌంటెంట్స్ 26 మంది, ఇన్స్ట్రక్టర్స్ 31, కేజీబీవీల్లో కుక్స్–80, ఇతర సిబ్బంది 138, ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నిర్వహణ సిబ్బంది 58 మంది ఉన్నారు. పండగ పూట అప్పులు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత లేదు. పని సమయాలు మాత్రం అధికంగా ఉన్నాయి. సకాలంలో జీతాలు లేవు. కచ్ఛితమైన జాబ్ చార్ట్ లేదు. ఈ విషయాలపై మార్గదర్శకాలు జారీచేయాలి, రెండు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. జీతాలు లేక అప్పులు చేస్తున్నాం. పండగపూట పస్తులు ఉండాల్సి వస్తుంది. – బోర గోవిందరావు, సమగ్ర శిక్ష ఉద్యోగి, రాజాంసమ్మెకు సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్ను అధికారంలోకి వస్తే అమలుచేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు కనిపించలేదు. అక్టోబర్ 12లోగా మా సమస్యలు పరిష్కరించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వాలి. లేకుంటే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మె నిర్ణయం తీసుకుంటాం. – నిమ్మక విజయకుమార్, సమగ్రశిక్ష ఉద్యోగి, రాజాం -
స్వదేశీ నెట్వర్క్తో నాణ్యమైన సేవలు
విజయనగరం టౌన్: స్వదేశీ నెట్వర్క్తో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్టు ఆ శాఖ జనరల్ మేనేజర్ ఎం.నాయుడు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిల్వర్జూబ్లీ వేడుకల్లో భాగంగా మంగళవారం బీఎస్ఎన్ఎల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 4జీ నెట్వర్క్తో సంస్థ ముందుకు వెళ్తుందన్నారు. ఏడాదిన్నర కాలంలో 45 కొత్త టవర్స్ను ఏర్పాటుచేశామని, 240 టవర్స్ను అప్గ్రేడ్ చేశామని చెప్పారు. యాంటీ స్పామ్ నెట్వర్క్కి చెక్ పెట్టగలిగామని, జిల్లా అంతటా ఫైబరైజేషన్ జరిగిందన్నారు. మొబైల్ నెట్వర్క్ రాని 20 ప్రాంతాల్లో కొత్త టవర్స్ ఏర్పాటుచేస్తున్నామని, ఆగస్టు 15న పురస్కరించుకుని నెలరోజుల పాటు రూపాయికే సిమ్ అందజేశామని, జిల్లాలో పదివేల సిమ్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకూ టూజీ నెట్వర్క్ పనిచేసిందని, తాజాగా వాటిని ఫోర్జీకి అప్గ్రేడ్ చేశామన్నారు. డీజీఎం దాలినాయుడు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తృతం చేస్తామని స్పష్టంచేశారు. జిల్లాలో 2 లక్షల50వేలకు పైగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉన్నారని, 100జీబీ నెట్ స్పీడ్ను క్వాలిటీతో అందజేస్తున్నామన్నారు. సిల్వర్జూబ్లీ వేడుకలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏజీఎంలు శారద, శ్రీనివాసరావు, ప్రమోదకుమార్దాస్, ఎస్.లక్ష్మణరావు, మురళీ, తదితరులు పాల్గొన్నారు. -
యాదొచ్చిందేటి..!
ఏడాదిన్నరకు..సాక్షి ప్రతినిధి, విజయనగరం: జరిగితే జల్లెడతో నీళ్లు మొయ్యడం అంటే బాబుదేరా.. మొత్తానికి ఆయనకు అలా నడిచిపోతాంది.. ఎల్లప్పుడూ ఎలచ్చన్లప్పుడు వచ్చి ఏదైనా చెప్తారు.. చేయాలంటే ఎనకాముందూ చూడాలి కానీ బొంకులు చెప్పడానికి నోటికి అడ్డేటుంది చెప్మీ... ఏదేదో చెప్పినారు.. గెలిచినారు.. మళ్లీ ఏడాదిన్నరకు వస్తున్నారు.. చెప్పినవాటిల్లో ఒక్కటైనా నాడింగా ఇచ్చినారా.. ఈ లిస్ట్ చూసి టిక్కులు పెట్టుమీ.. తేలిపోద్ది.. ఇదీ గజపతినగరం బస్టాండ్లో అప్పలనాయుడు చిరాకు. ఒరే అప్పలనాయుడు దసరాపండగ ముందురోజు చంద్రబాబు మనూరు రావడం గొప్పేరా అన్నాడు పైడిరాజు. ఎందుకురా.. ఎందుకు గొప్ప.. ఎవడికి గొప్ప.. వచ్చినందుకు ఏమైనా చేస్తే గొప్పగానీ కోట్లు తగలేసి వచ్చి.. అలా ఫొటోలకు ఫోజులిచ్చి పెన్షన్లు పంచుకుని వీడియోలు దిగి వెళ్తే ఎవడికిరా గొప్ప అన్నాడు చిరాగ్గా అప్పలనాయుడు. అది కాదురా అప్పిగా.. ఏదైనా సీఎం మనూరు రావడం గొప్పేకదా అన్నాడు పైడిరాజు. ఒరేయ్ ఏదైనా తెస్తే గొప్పగానే.. ఉత్త చేతుల్తో వస్తే ఎవడికిరా గొప్ప అన్నాడు అప్పలనాయుడు.. అయితే ఏటీ ఇవ్వలేదంటావా అన్నాడు పైడి రాజు.. ఏదిరా ఇటు రమ్మిరా.. టెంకిమీద ఒకటిచ్చేయగలను అంటూ ఎలచ్చన్లలో ఇచ్చిన హామీల లిస్ట్ చదివాడు అప్పలనాయుడు.. నోటికొచ్చింది చెప్పడమే తప్ప ఏనాడైనా అవి ఇచ్చామా లేదా అని చూసుకున్నారా.. కిరాణా సామాన్లు తెచ్చినప్పుడు లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అనేవి చూసుకుంటామా.. అలాగే మనం ఇచ్చిన హామీలన్నీ చేసినామా లేదా చూసుకోవాలి కదా.. ● వీటికి సమాధానం ఇవ్వు... 50 ఏళ్లు దాటిన బడుగుబలహీన వర్గాలవారందరికీ కొత్త పెన్షన్లు అన్నాడు.. ఉన్నవాళ్లలో వేలాది మందివి వెరిఫికేషన్ అని లేపేసినాడు.. కొత్తవి ఇవ్వవయ్యా అంటే ఉన్నవి తీసేశాడు. తల్లికి వందనం.. అదొక మహా విచిత్రంగా ఉంది.. ఎవరికి ఇస్తారో.. ఎంత ఇస్తారో.. ఎవరికి ఎందుకు ఎగ్గొడతారో తెలీదు.. ఆడబిడ్డ నిధి కింద మన ఆడవాళ్లకు నెలకు రూ.1500 అన్నారు.. ఇచ్చార్రా.. అవునురా పైడిగా యూరియా కూడా ఇవ్వలేని గవర్నమెంట్ను మాత్రం నేను తొలిసారి చూస్తున్నానురా. ఇంత దరిద్రం నా డైబ్భెయేళ్ల జీవితంలో చూడలేదురా.. చెప్పులు.. సంచులు లైన్లో పెట్టుకుని యూరియా కోసం దెబ్బలాడుకోవడం.. అదొక పెద్ద ప్రహసనంరా బాబూ.. అప్పలనాయుడు.. పల్లకోరా అన్నాడు.. పైడిరాజు.. ఏట్రా పల్లకోవడం.. మెడికల్ కాలేజీలు తెచ్చిందిలేదు కానీ.. జగన్ తెచ్చిన పార్వతీపురం కాలేజీని ప్రైవేటుకు అమ్మేస్తున్నాడట.. అక్కడ చివరిదశలో నిర్మాణంలో ఉన్న కురుపాంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీని ఇప్పటికీ అందుబాటులోకి తేలేదురా.. ఇక మన గుంటలకు నిరుద్యోగ భృతి అన్నాడు.. ఓలమ్మ నిబ్బగే గావాల అనుకున్నా.. చూస్తున్నావు కదా.. వట్టిదే అని తేలిపోయింది.. మన జిల్లా గిరిజనులు డోలీ కష్టాలు చూస్తున్నాం కదరా.. ఏమైనా పరిష్కారం చూపారా అంటే ఏం లేదురా.. ఆయన దయవల్ల మనకు నిరంతరం సేవలందించే వలంటీర్లందరి ఉద్యోగాలు పోనాయిరా... బియ్యం బండీ ఆగిపోయిందరా.. ఉద్యోగాలు ఇవ్వడంపోయి చిరుద్యోగులను తొలగించేస్తున్నార్రా.. ఆళ్లంతా ఉసూరుమంటున్నారు.. ఔరా.. పల్లె పండగ అన్నాడు.. రోడ్లు అద్దంలా మెరుస్తాయి అన్నాడు.. ఏదీ ఓసారి నా బండి ఎక్కుమీ అలా బొబ్బిలి కాసి వెల్డుము గానీ అన్నాడు. నాయుడు.. వద్దురా నాయిన.. నడుం జారిపోద్ది.. పండక్కి కుక్కి మంచమే దిక్కయిపోద్ది అన్నాడు పైడి రాజు.. చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్.. చంద్రబాబు ఎప్పుడూ మాటలు చెబుతాడు.. పని చేయడు.. ఇలాంటి షూటింగ్లు మాత్రం బాగా చేస్తాడురోయ్.. అంటూ అప్పలనాయుడు బయల్దేరాడు.. నీకు దండంరా బాబు.. నిన్ను ఒప్పించలేం అంటూ పైడి రాజు జారుకున్నాడు. -
పీజీఆర్ఎస్పై సీఎం పర్యటన ఏర్పాట్ల ప్రభావం
● కలెక్టర్, జేసీ లేకపోవడంతో తగ్గిన వినతులు ● డీఆర్ఓ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంపై సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్ల ప్రభావం పడింది. వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు లేకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పలువురు ప్రజలు వెనుదిరిగారు. వినతులు ఇవ్వకుండా వెనుతిరిగిన అర్జీదారుల్లో ఎస్.కోట, విజయనగరం మండలాల నుంచి వచ్చిన రైతులు ఉన్నారు. పీజీఆర్ఎస్కు ప్రతి సోమవారం 200కు పైగా వచ్చే అర్జీలు ఈ వారం 134 మాత్రమే నమోదయ్యాయి. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి అధ్వర్యంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్రావు, మురళి, నూకరాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 30 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ఎస్పీ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పరేడ్ మైదానం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను డీఎస్పీకి విన్నవించారు. -
వైభవంగా శ్రీవారి కల్యాణం
● స్వామివారికి టీటీడీ నుంచి పట్టువస్త్రాల సమర్పణనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాల పూజలనంతరం యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ రామతీర్ధం తిరు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రామాలయంలోని వెండి మంటపం వద్ద లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేడుకను కనులపండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్కుమార్, రామగోపాలాచార్యులు, నగర పంచాయతీ వైస్చైర్మన్ సముద్రపు రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
● 1998 ఎంటీఎస్ ఐపాధ్యాయ సంఘం పిలుపుపార్వతీపురం: ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉమా కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని చర్చివీధిలో గల వేదాంత జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో వెలుగు నింపి ఉపాధ్యాయులుగా నియమించారన్నారు. ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, 12 నెలల జీతాన్ని ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. న్యాయమైన హక్కుల సాధనకు, న్యాయపోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. 98 ఎంటీఎస్ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 11న విజయవాడలో నిర్వహిస్తున్న విజ్ఞాపన సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు పీవీ రామ మోహనరావు, కె.రమేష్, దామోదరరావు, పూడు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
రీఅసెస్మెంట్ పూర్తయినా అందని టీఏడీఏలు..!
విజయనగరం ఫోర్ట్: దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట కూటమి సర్కార్ తీసుకొచ్చిన సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ నిర్వహించిన వైద్యులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా కూటమి సర్కార్ జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీ అసెస్మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీఏ, డీఏలు చెల్లించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత డబ్బులు పెట్టుకుని వైద్యులు వివిధ ప్రాంతాల నుంచి రీ అసెస్మెంట్ చేయడానికి ఆస్పత్రులకు వచ్చారు. రీ అసెస్ మెంట్ చేసినందుకు గాను వారికి చెల్లించాల్సిన టీఏ. డీఏలకు సంబంధించి డబ్బులు మాత్రం చెల్లించకుండా కూటమి సర్కార్ జాప్యం చేయడం పట్ల వైద్యులు ఆవేదన చెందుతున్నారు. రీ అసెస్మెంట్ నిర్వహించిన ఆస్పత్రులు జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం, సాలూరు ఏరియా ఆస్పత్రులు, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించారు. రీఅసెస్ మెంట్లో 40 నుంచి 50 మంది వైద్యులు 2025 జనవరిలో కూటమి ప్రభుత్వం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు రీఅసెస్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి నెలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్ మెంట్ చేసేవారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. 30వేల మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్మెంట్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్మెంట్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కంటి, ఎముకలు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 30 వేలమందికి పైగా దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వైద్యుల రాక జిల్లాలో దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్హహించేందుకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చేవారు. త్వరలో చెల్లిస్తాం దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. నిధులు వచ్చాయి. త్వరలోనే చెల్లిస్తాం. – డాక్టర్ పద్మశ్రీ రాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి దివ్యాంగులకు సదరం రీ అసెస్మెంట్ చేసిన వైద్యులు జిల్లాలో ఈఏడాది జనవరి నుంచి ప్రారంభమైన ప్రక్రియ 30 వేలకు పైగా దివ్యాంగులకు పరీక్షలు చేసి రీఅసెస్మెంట్ వైద్యులకు టీఏ, డీఏల బకాయి -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు 20 మంది ఎంపిక
బొబ్బిలి రూరల్: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు 20 మందితో జట్టును ఎంపిక చేసినట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయకుమార్ తెలియజేశారు. ఈ మేరకు బొబ్బిలి మండలంలోని పారాది జెడ్పీహెచ్ పాఠశాలల సోమవారం జరిగిన జిల్లా సీనియర్ మెన్ సాఫ్ట్బాల్ క్రీడాకారుల ఎంపికను పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించామని 60 మంది పాల్గొనగా ఉత్తమ ప్రతిభను కనబర్చిన 20 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని వారిని సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నామని తెలిపారు. -
సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన రెవెన్యూ, సంక్షేమం, అభివృద్ధి రెండు విభాగాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 102 వినతులను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, పాలకొండ సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు ఎం.సుధారాణీ , కె.రామచంద్రరావులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖాధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తూ సమస్యలను సంపూర్ణంగా విన్నవించుకునే విధంగా అర్జీదారులకు అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల పిటిషన్లకు పరిష్కారం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లకు పరిష్కారం చూపిస్తూ, వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సంబంధిత పోలీసు శాఖాధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 5 పిటిషన్లు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయి. ఏపీఓ జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. తాడిపాయికి చెందిన నందిని భాషా వలంటీర్ పోస్టు ఇప్పించాలని కోరారు. పాతూరుకు చెందిన ఢిల్లేశ్వరరావు ఏదైనా ఆశ్రమపాఠశాలలో కుక్, కమాటి పోస్టులో నియమించాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తకోటలో ఉన్న అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మినీగురుకులానికి మౌలికవసతులు కల్పించాలని కె.వీరఘట్టానికి చెందిన బి.నీలకంఠం అర్జీ అందజేశాడు. అచ్యుతాపురానికి చెందిన బి.సుశీల వాటర్ప్లాంట్ మంజూరు చేయాలని కోరింది. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రాక ఏర్పాట్ల పరిశీలన
దత్తిరాజేరు: దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వస్తున్న సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేసే ఇళ్లకు వెళ్లే మార్గాలను, వాహనాల పార్కింగ్, కూటమి నాయకులతో సమావేశం కానున్న హాల్ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్దకు ఇతరులు రాకుండా కంచెను కట్టుదిట్టంగా వేయాలని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలకు అనువుగా అన్ని ఏర్పాట్లు ఉండాలని పోలీస్, ఇతర శాఖల అధికారులను అదేశించారు. -
స్థాయి మరచి మాట్లాడొద్దు
రామభద్రపురంలో భారీ వర్షం రామభద్రపురం: మండల కేంద్రంలో సోమవారం రాత్రి 7.20 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. శ్రీరాంనగర్కాలనీని వరదనీరు ముంచెత్తింది. ఇళ్లలోకి ముడుగులోతులో నీరు చేరడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలో బీసీ వీధికి, ఎస్సీ వీధికి మధ్యలో ఉన్న మురుగునీటి కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోవడం, కాలువను రియల్ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా పూడ్చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి కాలువలో పూడికలు తొలగించి వర్షం నీరు మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డెంకాడ: ఇచ్చిన హామీలు అమలు చేయలేక తనపైన, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులపైన, మీడియాపైన ఇష్టం వచ్చినట్టు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భర్త లోకంప్రసాద్ మాట్లాడం సరికాదని, స్థాయిని గుర్తించుకుని మాట్లాడితే మంచిదని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. డెంకాడ మండలం పినతాడివాడలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వంద కంపెనీలు తెస్తా మని ఎమ్మెల్యే లోకం నాగమాధవి చెప్పారని, ఇంతవరకు ఎన్నిక కంపెనీలు తెచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి స్థానిక యువ తకు ఉపాధి కల్పిస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తక్కువ ధరకే వందల ఎకరాల భూములను తీసుకున్నది నిజంకాదా అని ప్రశ్నించారు. మిరాకిల్ కంపెనీలో స్థానికంగా ఎంత మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో బహిరంగ పరచాలన్నారు. గతంలో రుషికొండ వద్ద కంపెనీల పేరుతో భూమిని తీసుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టవచ్చనే దురాశతో రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనలేదని ఆరోపించారు. ఏడాదికి వంద కోట్లు పైబడి సంపాదిస్తున్నట్టు చెబుతున్నారు.. ముక్కాం, ముంజేరు పంచాయతీలకు చెల్లించాల్సిన సుమారు రూ.45 లక్షల పన్ను బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని నిలదీశారు. పంచాయతీ అభివృద్ధికి సహకరించాల్సిన పాలకులే పన్ను చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నించారు. లోకం ప్రసాద్ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. కొమ్మూరి అప్పడుదొరపై పోటీ చేసింది మా ఇంటి నుంచే అన్నది మరిచిపోరాదన్నారు. మిరాకిల్ సంస్థలో 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీనిని ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు. కంపెనీ నుంచి సీఎస్ఆర్ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. మా హయాంలో వేయించిన రోడ్లపై ప్రయాణిస్తూ చేసిన అభివృద్ధి ఏదని ప్రశ్నించడం అవివేకానికి నిదర్శనమన్నారు. మీరు చేసిన అవినీతి, ఆక్రమాలపై పోరాటంతో పాటు ప్రజలకు వివరిస్తామన్నారు. టీడీపీ అండదండలతో గెలిచారన్న విషయం మరువరాదన్నారు. సమావేశంలో డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నింటి తమ్మునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, బడ్డుకొండ ప్రదీప్నాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. లోకం ప్రసాద్ తీరు సరికాదు పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ -
● సరస్వతీ నమోస్తుతే...
శరన్నవరాత్రి ఉత్సవాలు వేళ.. సరస్వతీదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం పురస్కరించుకుని రింగురోడ్డు ఎస్వీఎన్ నగర్లో కొలువైన ధన్వంతరీ, సప్తమేధాగణ, లక్ష్మీభువనేశ్వరీ సహిత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అక్షర మంత్రం ప్రతిధ్వనించింది. వేలాది మంది పిల్లలతో తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. పసుపుకొమ్ముతో ఓం నమఃశివాయ అని బియ్యంలో రాయించి అమ్మవారి అనుగ్రహం పొందారు. అనంతరం పలకలను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ చిన్నారులు ప్రదక్షణ చేశారు. సాయంత్రం వేళ సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని నగర వీధుల్లో ఊరేగింపుచేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
పత్తి రైతుకు వాన కష్టాలు
తెగుళ్ల దాడి.. ప్రభుత్వం ఆదుకోవాలి ఎకరా పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కో చెట్టుకు 30 నుంచి 40 కాయలు కుళ్లిపోయాయి. పత్తి దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గిపోయింది. ఎకరాకు రూ.10వేలు వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. బ్యాంకు రుణం, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతాం. – చొక్కాపు నారాయణరావు, పత్తి రైతు, రామభద్రపురం పత్తి నాణ్యత తగ్గడం వాస్తవమే.. వర్షాలు కారణంగా పూర్తిగా విచ్చుకున్న పత్తి ముద్దలా తయారైంది. విచ్చుకుంటున్న కాయలో నీరు చేరి కాయ పూర్తిగా నల్లబా రిపోయింది. పత్తి నాణ్యత తగ్గింది. వర్షాలకు తేమ శాతం అధికమై ఆకులపై మచ్చలు ఏర్పడి పంట ఎరుపు రంగుకు వస్తుంది. దీని నివారణకు ముందుగా పొలంలో నీరు నిల్వ లేకుండా చేయాలి. తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారు సూచనమేరకు పురుగుమందు పిచికారీ చేస్తే మంచిది. రైతులకు ఎంత నష్టం జరిగిందన్నది ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాను. – ఎం.మధుసూదనరావు, వ్యవసాయశాఖ ఏడీఏరామభద్రపురం: వరిలో నష్టం వస్తుందని పత్తి పంటను సాగుచేసిన రైతన్నను వర్షాలు నట్టేటముంచాయి. పంట చేతికొచ్చ దశలో కురిసిన భారీ వర్షాలు కన్నీరు పెట్టాయి. వర్షపు నీరు పత్తికాయల్లో చేరడంతో కాయ కుళ్లిపోయింది. విచ్చుకునే పత్తి నల్లబడిపోవడాన్ని చూసిన రైతన్న తెల్లబోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు. జిల్లాలో సుమారు 1911 హెక్టార్లలో పత్తి పంట సాగైనట్టు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తికాయ ముదురి విచ్చుకునే సమయంలో కురిసి వర్షాలతో ఒక్కోచెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయలు పాడయ్యాయి. వర్షపు నీరు పగుల్లోకి వెళ్లి బూజు పడుతున్నాయి. వానకు తడిసిన పత్తికాయలను ఏరి వాటిలో పత్తి తీసేందుకు కూలి ఖర్చులు తడిసిమోపెడవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజూ కురుస్తున్న వర్షాలతో కాయల్లోకి చేరుతున్న నీరు నల్లగా మారి నాణ్యత తగ్గుతున్న పత్తి పంటకు ఎర్ర, ఆకు ముడత తెగుళ్లతో భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు ఓ వైపు వర్షాలు... మరోవైపు తెగుళ్లు పత్తి పంటపై దాడిచేసి రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తేమ శాతం అధికం కావడంతో ఎర్ర తెగులు, పచ్చదోమ, ఆకుముడత తెగులు సోకి పంటకు నష్టం కలిగిస్తోంది. ఎకరాకు 2 నుంచి 2.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే ఇప్పుడు క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, మరోవైపు ప్రకృతి ప్రకోపంతో పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి చదురుగుడిలోని హుండీల ఆదాయాన్ని అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో సోమవారం లెక్కించారు. రూ.16,75,917ల నగదు, 14.100 మిల్లీ గ్రాముల బంగారం, 301 గ్రాముల వెండి, అన్నదాన హుండీ నుంచి రూ.800లు లభించినట్టు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష తెలిపారు. కార్యక్రమంలో శంబర పోలమాంబ ఈఓ శ్రీనివాస్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూరియూ కోసం బారులు సంతకవిటి: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పనులు మానుకుని ఆర్ఎస్కేలు, సచివాలయాల వద్ద క్యూ కడుతున్నారు. సంతకవిటి మండలంలోని తాలాడ, మామిడిపల్లి గ్రామాల్లో సోమవారం వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచి రైతులు సచివాలయాల వద్ద క్యూ కట్టగా ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి ● ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: జిల్లాలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనల మేరకు అప్పగించాలని ఎస్పీదామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం పోలీస్ స్టేషన్ను సోమవారం తనిఖీచేశారు. స్టేషన్ ప్రాంగణంలోని వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో మరిన్ని ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చాలని, గస్తీ, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయించేవారు, మహిళల పట్ల దాడులకు, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, గజపతినగరం సీఐ జి.ఎ.వి.రమణ, ఎస్ఐ కె.కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
‘డిజిటల్ బుక్’తో కార్యకర్తలకు భరోసా
విజయనగరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి రెడ్బుక్ పాలన సాగిస్తోందని, పాలనా వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. కూటమి పాలనలో దాడులకు గురవుతున్న, అక్రమ కేసులు, అన్యాయా నికి గురవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది సూచనతో డిజిటల్బుక్ అందుబాటులోకి తెచ్చారని, ప్రతిఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిజిటల్బుక్ను తన నివాసంలో సోమ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరభద్రస్వామి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా పార్టీ నిలుస్తుందని, అధికారంలోకి వచ్చాక ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాడు సంక్షేమ పాలన.. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని కోలగట్ల పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల మంజూరు, రైతు, డ్వాక్రా రుణాల మాఫీ వంటి అనేక పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు, విద్యా, వసతి దీవెన, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల అమలు, మహిళాభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేసి, సంక్షేమ సారథిగా పేరు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి వాటిలో ఐదింటిలో తరగతులు సైతం ప్రారంభిస్తే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. బాలకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సినీ నటుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలే గాని, చిరంజీవిపై ఉన్న వ్యక్తిగత కక్షను అసెంబ్లీలో ప్రస్తావించడం బాలకృష్ణ మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ విజయం తధ్యమని, ప్రజలు కూటమి పాలనకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ ఎస్వీవీ రాజేష్, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదుచేసినా, దాడులు చేసినా డిజిటల్ బుక్లో నమోదు చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
విజయవాడలో గుండెపోటుతో ఎస్ఐ మృతి
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఎస్ఐ–2గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుతో విజయవాడలో సోమవారం ఉదయం మృతి చెందారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాల బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ విజయవాడ హనుమాన్పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరేలోపు బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
కోట దుర్గమ్మకు పంచలోహ కవచం వితరణ
కురుపాం: స్థానిక రావాడ జంక్షన్లో వెలసిన కోట దుర్గమ్మవారికి కీర్తిశేషులు నడుకూరు దుర్గ భవాని ప్రసాద్ దంపతుల కుమారుడు నడుకూరు దూళికేశ్వరరావు ఆదివారం అమ్మవారి విగ్రహానికి రూ.లక్షా ముప్ఫై వేల విలువైన పంచలోహ కవచం వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆలయ అర్చకుడు శ్రీనివాస నాయక్, ఆలయ కమిటీ సభ్యులకు పంచలోహ కవచాన్ని అందజేసి అమ్మవారికి అలంకరించాలని కోరారు. 50 మందిపై తేనెటీగల దాడినెల్లిమర్ల రూరల్: మండలంలోని పారసాం గ్రామంలో తేనెటీగలు ఆదివారం బీభత్సం సృష్టించాయి. గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు అమ్మవారి సన్నిధికి వెళ్లగా డీజే శబ్దాలకు స్థానిక శివాలయం వద్ద ఉన్న తేనె తుట్ట చెలరేగడంతో ఈగలు స్థానికులపై విచ్చలవిడిగా దాడి చేశాయి. దాడిి జరిగిన సమయంలో సుమారు 200 మంది ఉండగా వారిలో 50 మందిని తేనెటీగలు గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కేంద్రాస్పత్రికి తరలించగా మిగిలిన వారికి కొండవెలగాడ పీహెచ్సీలో చికిత్స అందించారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పారసాం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు● జిందాల్ నిర్వాసితుల నిర్ణయం శృంగవరపుకోట: కంపెనీ ఏర్పాటు పేరుతో జిందాల్ తీసుకున్న తమ భూములు తమకే ఇవ్వాలని చేస్తున్న జిందాల్ నిర్వాసితుల దీక్షలు 100వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నాలుగెకరాల భూమి కోల్పోయి నిరసన చేస్తున్న వందేళ్ల వృద్ధురాలు గొండ గద్దమను ఎమ్మెల్సీ రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తదితరులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన నిర్వాసితులు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ ఇంత వరకూ తమ పోరాటాలతో అన్ని వర్గాల వారి అభిమానం సాధించుకున్నామని, మన పోరాటానికి ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందని, నిద్దరోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి నిరాహారదీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటంలో నిర్వాసితులతో చివరి వరకూ ఉండి, మద్దతిస్తామని రఘురాజు, జగన్లు తెలిపారు. -
జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
విజయనగరం గంటస్తంభం: భగత్సింగ్, మహాత్మాగాంధీ జయంతుల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల ఆధ్వర్యంలో జిల్లాస్ధాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఎంఆర్ గ్రౌండ్లో ఆదివారం పోటాపోటీగా జరిగాయి. ఒకటవ పట్టణ ఎస్సైలు లక్ష్మీప్రసన్నకుమార్, లక్ష్మునాయుడులు పాల్గొని భగత్సింగ్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. ఈ క్రీడాపోటీల్లో జిల్లా స్థాయిలో విన్నర్గా జేఎన్టీయూ టీమ్, రన్నరప్గా జీఎంఆర్ఐటీ టీమ్ నిలిచాయి. మొదటి విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతులు అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.రాము, సీహెచ్.వెంకటేష్లు మాట్లాడుతూ భగత్సింగ్,గాంధీజీ స్ఫూర్తితో ఏటా యువతలో క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఘనంగా మిస్టర్ ఆంధ్ర పోటీలు ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రం వేదికగా కనకల ఎర్రయ్య మె మోరియల్ మిస్టర్ ఆంధ్రా రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ మాట్లాడుతూ, కనకల ఎర్రయ్య జ్ఞాపకార్థం ఈ ఏడాది 12వ మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం విశేషమన్నారు. ఈ సారి మొత్తం 164 మంది క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్మించారని వెల్లడించారు. విజేతలకు రూ.1.30 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులందరికీ తగిన వసతులు కల్పించామని, ఈ పోటీల ద్వారా విజయనగరం ప్రతిష్ఠను రాష్ట్రవ్యాప్తంగా చాటుకోవడమే లక్ష్యమని అసోసియేషన్ నాయకులు తెలపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కార్యదర్శి బైక్ రమేష్, నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డి, జనప్రియ శ్రీనివాస్, శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
టాస్క్ఫోర్స్ ఉందా? లేదా?
● మాదక ద్రవ్యాల సరఫరాపై కొరవడిన నిఘా ● ‘స్పా‘సెంటర్లపై కానరాని దాడులు ● మూడు నెలల్లో ముగ్గురు సీఐల బదిలీవిజయనగరం క్రైమ్: పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగం. సమాజంలో పైకి కనిపించని, పోలీసుల కళ్లు గప్పి చాపకింద నీరులా సాగి పోయే అనైతిక పనులు, చట్టవ్యతిరేక చర్యలకు చెక్ పెట్టేందుకే పోలీస్ శాఖలోంచి ప్రత్యేక విభాగంగా ఏర్పడిందే టాస్క్ ఫోర్స్. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, కొకై న్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల పంపిణీ జరుగుతుంటే టాస్క్ఫోర్స్ నియంత్రించాలి. అయితే జిల్లాలో టాస్క్ఫోర్స్లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2023 నుంచి టాస్క్ పోర్స్ వింగ్ పని తీరు జిల్లాలో అంతగా లేదంటే లేదనే పోలీస్ శాఖ చెబుతోంది. ఈ మధ్యనే విశాఖ రేంజ్ డీఐజీ కాస్త దృష్టి పెట్టడంతో జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పాసెంటర్ల పనితీరుపై టాస్క్ఫోర్స్ వింగ్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్ రోడ్లో పుట్టుకొచ్చిన స్పా సెంటర్లను తనిఖీ చేశారు. రెండు నెలల క్రితం సైబర్ సెల్ సీఐగా ఉన్న బంగారు పాప టాస్క్ ఫోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి..తనకు వచ్చిన సమాచారంతో రింగ్ రోడ్లో ఉన్న ఓ స్పా సెంటర్ పై దాడి చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు. అ తర్వాత రాజాం ఏరియాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ఆమె వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ సీఐని వీఆర్ లోకి పంపించింది పోలీస్శాఖ. అంతకు ముందు వన్ టౌన్ సీఐగా పని చేసిన డా.వెంకటరావు టాస్క్ పోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలైనా కాలేదు. అకస్మాత్తుగా ఆయనను అనకాపల్లి టాస్క్ పోర్స్ సీఐగా బదిలీ చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి పండుగ వస్తున్న వేళ..టాస్క్ పోర్స్ సీఐగా శోభన్ బాబును నియమించింది పోలీస్ శాఖ. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పా సెంటర్ లలో అసాంఘిక కార్యకలాపాలపై కొత్తగా సీఐగా బాధ్యతలు చేపట్టిన శోభన్బాబు ఏ విధంగా చర్యలు చేపడతారో వేచి చూడాలి. ఎస్పీ ఆదేశాలతో చర్యలు అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ ఆదేశాలతో చర్యలు చేపడుతున్నామని విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావు అన్నారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు దృష్టి పెట్టామన్నారు. ఈగల్ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. టాస్క్ ఫోర్స్ వింగ్ పని తీరు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాలతో జరుగుతోందన్నారు. ముగ్గురు సీఐలు మారడం రోజవారీ శాఖ పనిలో భాగమేనన్నారు. -
లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
ఇటీవల కాలంలో గుండెపోటు కేసుల్లో ఎక్కువగా 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నారు. ధూమపానం, కొకై న్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో గుండెపోటు వస్తుంది. రక్తంచిక్కగా ఉండడం వల్ల సడన్గా ఉండెపోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి. పీచుపదార్థాలు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు తినాలి. డాక్టర్ జి.సూర్యప్రకాష్, కార్డియాలజిస్టు, విజయనగరం -
హృదయం పదిలమా..!
● మానవుని జీవన శైలిలో మార్పులు ● పెరుగుతున్న గుండెజబ్బులు ● తక్కువ వయసులోనే గుండెపోటు ● బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలివిజయనగరం ఫోర్ట్: మానవుని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఉద్యోగులు పని ఒత్తిడికి, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారు జీవనం ఏవిధంగా సాగించాలనే అనే ఆందోళన, విద్యార్థులకు భవిష్యత్తుపై ఇలా ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ఆందోళన ఉంటుంది.దీని వల్ల అత్యంత ప్రధానమైన గుండెకు హాని జరిగే ప్రమాదం ఉంది. సోమవారం ప్రచంచ గుండె దినోత్సవం. గుండెను పరిరక్షించుకోకపోతే మానవుని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రతి వ్యక్తి గుండెను పరిరక్షించుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సరైన ఆహార నియామలు పాటించకపోవడం, కొవ్వు అధికంగా ఉంటే ఆహార పదార్థాలను అధికంగా తినడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వ్యాధిని గుర్తించడం ఇలా వ్యాధిలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు. బీపీని వైద్యులు పరీక్షల ద్వారానే గుర్తించడం సాధ్యం.రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో కష్టం, ఛాతీలో నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. అధిక రక్తపోటు రక్తనాళాల్లో రక్తం సాధారణ ఒత్తిడికంటే ఎక్కువ ఒత్తిడితో ప్రసరించినప్పుడు దానిని అధిక రక్తపోటు అంటారు. తరచూ రక్తపోటు తనిఖీ చేయించుకోవాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. అధిక రక్తపోటుకు కారణం: నూడిల్స్, చాట్స్, పానీపూరీ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల, టీవీ అధికంగా చూడడం వల్ల శారీరక వ్యాయమం లేకపోవడం, ఒకే చోట 8 నుంచి 12 గంటలు పాటు పనిచేయడం, మానసిక ఒత్తిడి, సంఘర్షణ, ఆత్మన్యూనత, పొగతాగడం, ఆల్కహాల్ సేవించడం వంటి వాటి వల్ల అధిక రక్తపోటు వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రతిరోజు అరగంట పాటు వ్యాయమం చేయాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా గడపాలి. పొగతాగడం, మద్యం తీసుకోవడం పూర్తిగా మానివేయాలి. యోగా, ధైవభక్తి పెంపొదించుకోవాలి. ఉప్పు, మసాలాల వాడకం తగ్గించుకోవాలి. అధికపిండి పదార్ధాలు, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. 30 సంవత్సరాలుపై బడిన వారు ప్రతి 6 నెలలుకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. -
ఎందుకంత ఆవేశం..!
పూసపాటిరేగ: ఆయన హోదా చాలా పెద్దది. ఎమ్మెల్యేకే ఆయనగారు మరి. అందుకే ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యేను, జనసేన నాయకులను జస్ట్ అలా కూర్చోమని చెప్పి ఆట మొత్తం ఆయనే ఆడేశారు. పెద్దరికానికి పెత్తనానికి అలవాటు పడిన ప్రాణం కాబట్టి విలేకరుల సమావేశంలో కూడా ఆయనే పెత్తనం చేసి ఎమ్మెల్యే ఆడాల్సిన ఆటను కూడా ఆయనే ఆడేశారు. ఎమ్మెల్యే చేసిన తప్పులు అధికారం మాటున ఎమ్మెల్యే చేసిన పనులు..జనానికి చూపిస్తున్న సినిమాను బయటపెట్టిన మీడియాపై ప్రసాద్ చిందులు తొక్కారు. తప్పులు ఎత్తి చూపినందుకు వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి తాట తీస్తానంటూ వార్నింగులు ఇచ్చారు. ఆవేశంతో ఊగిపోతూ తానేమిటో చూపిస్తానంటూ పెద్దపెద్ద మాటలు ఆడారు. ఇదంతా ఎమ్మెల్యే లోకం నాగమాధవి సమక్షంలో ఆదివారం భోగాపురంలో జరిగిన ప్రెస్మీట్లో ఊహించని విధంగా జరిగిన సన్నివేశం. భోగాపురం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. వందరోజుల్లో వంద కంపెనీలు వస్తాయని గతంలో చేసిన ప్రకటనకు సోషల్మీడియాలో తరచూ ట్రోల్ చేస్తున్నారని వందరోజుల్లో వంద కంపెనీలు ఎలా వస్తాయని తిరిగి ఆమె ప్రశ్నించారు. తమ ఆస్తులకు సంబంధించి పన్నులు ఎగవేసిన ఎమ్మెల్యే అని మీడియాలో రాయడం బాధేసిందని ఆమె స్వయంగా తెలిపారు. స్వప్రయోజనాల కోసం అధికార పార్టీ నాయకులే అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నారని పరోక్షంగా నియోజకవర్గం టీడీపీ నాయకులకు చురకలు అంటించారు. మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే భర్త ప్రసాద్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోకుండా పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయంటూ ఆవేశంతో ఊగిపోయారు. విలేకరులపై ఆవేశంతో ఊగిపోయి తాటతీస్తాను. ప్రజలను తప్పుదోవ పట్టించకండి అంటూనే ఏం పీక్కుంటారో పీక్కొండి అంటూ ఏక అసభ్య పదజాలంతో మాట్లాడడంతో సమావేశానికి వచ్చిన వారు నిశ్చేష్టులయ్యారు. ఎమ్మెల్యే క్షమాపణప్రెస్మీట్లో ఆవేశంతో మాట్లాడిన మాటల్లో ఏవైనా తప్పులు మాట్లాడి వుంటే క్షమించాలని మీడియాకు ఎమ్మెల్యే నాగమాధవి క్షమాపణ చెప్పారు. ప్రెస్మీట్లో ఎమ్మెల్యేను పక్కన పెట్టి భర్త చిందులు తాట తీస్తానంటూ మీడియాకు వార్నింగులు -
ఉచిత గ్యాస్ దూరం..!
వేలాది మందికి ● మొదటి, రెండు విడతల్లో 25,834 మందికి పడని గ్యాస్ రాయితీ నగదు ● వీరికి అందాల్సిన రాయితీ రూ.2.13 కోట్లు ● మొదటి విడతలో 6,473 మందికి అందని రాయితీ ● రెండో విడతలో 19,261 మందికి అందని రాయితీ వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరికొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీ నగదును ప్రభుత్వం ఎగ్గొట్టందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి రావడం కోసం కూటమి నేతలు గత సాధారణ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని అనేక హామీలను గుప్పించారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో అలవకాని హామీ లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథకం ఒకటి. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల వేలా ది మంది అర్హులు గ్యాస్ రాయితీకి దూరం అయ్యా రు. అర్హత ఉండి కూడా రాయితీ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఎందుకు కాలేదో.. ఎవరిని అడిగినా చెప్పిన పరిస్థితి లేదు. తమకు తెలియదంటే తమకు తెలియదని తప్పించుకుంటున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గొప్పగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒక్క సిలిండర్తో సరి పెట్టేసింది. దీంతో మొదటి ఏడాది రెండు సిలిండర్లు లబ్ధిదారులకు అందలేదు. ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5.02 లక్షలు జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఆరు లక్షలకు పైగా ఉన్నా యి. వీరిలో ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కో సం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. మొదటి విడతలో 4,46,846 మంది గ్యాస్ తీసుకున్నారు. ఇందులో 4,40,373 మందికి మాత్ర మే గ్యాస్ రాయితీ నగదు వారి ఖాతాల్లో పడింది. 6,473 మందికి గ్యాస్ రాయితీ పడలేదు. రెండో విడతలో 4,36,690 మంది గ్యాస్ తీసుకోగా ఇందులో 4,17,329 మందికి మాత్రమే గ్యాస్ రాయితీ పడింది. 18,361 మందికి గ్యాస్ రాయితీ నగదు పడలేదు. రెండు విడతల్లో 25,834 మందికి గ్యాస్ రాయితీ పడలేదు. వీరికి రావాల్సిన గ్యాస్ రాయితీ మొత్తంగా రూ.2.13 కోట్లు. మొదటి విడతలో.. జిల్లాలో మొదటి విడతలో భారత్ గ్యాస్ సిలిండర్లను 48,381 తీసుకోగా వీరిలో గ్యాస్ రాయితీ నగ దు 47,525 మంది లబ్ధిదారులకు జమ అయ్యింది. హెచ్పీ గ్యాస్ లబ్ధిదారులు 3,30,234 మంది గ్యాస్ తీసుకోగా వీరిలో 3,35,605 మందికి రాయితీ నగదు ఖాతాల్లో పడింది. ఇండియన్ గ్యాస్ను 68,231కిగాను గ్యాస్ రాయితీ 67,343 మంది లబ్ధిదారులకు జమ అయ్యింది. రెండో విడతలో.. రెండో విడతకు సంబంధించి భారత్ గ్యాస్ తీసుకు న్న వారు 62,921 మంది కాగా ఇందులో 47,177 మందికి రాయితీ నగదు పడింది. హెచ్పీ గ్యాస్ లబ్ధిదారులు 3,17,626 మంది గ్యాస్ను విడిపించ గా వీరిలో 3,04,807 మందికి గ్యాస్ రాయితీ పడింది. ఇండియన్ గ్యాస్ సిలిండర్లను 66,143 మంది విడిపించగా.. వీరిలో 65,345 మందికి గ్యాస్ రాయితీ నగదు జమ అయ్యింది. ఉచిత గ్యాస్ రాయితీకి సంబంధించి మొదట విడతలో 4,46,846 మంది గ్యాస్ తీసుకోగా 4,40,373 మందికి రాయితీ నగదు పడింది. రెండో విడతలో 4,36,690 మంది గ్యాస్ తీసుకోగా 4,17,329 మందికి గ్యాస్ రాయితీ పడింది. – జి.మురళీనాధ్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
జాతరో..జాతర
విజయనగరం టౌన్: తనను కొలిచిన వారికి కొంగుబంగారమై, చింతలు తీర్చే చింతమానును ఎంపిక చేసుకుని సిరిమానుగా మలుచుకుని సిరుల ఉత్సవానికి సిద్ధమవుతున్న చిన్నారి పైడితల్లి జాతర మహోత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని ఊరూ.. వాడా పండగ వాతావరణం చేసుకోవాలని రామవరపు చినపైడిరాజు బృందం ఆదివారం సాయంత్రం చదురుగుడిలో కొలువైన అమ్మవారికి మనవి చెప్పి ఆలయం ఆవరణలో భాజాభజంత్రీలతో, మేళతాళాలల నడుమ పండగ చాటింపు వేశారు. డప్పు వాయిద్యాలతో, ధూపదీప నైవేద్యాలను అమ్మకు సమర్పించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే సిరిమాను జాతర ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చూడాలని అమ్మను ప్రార్ధించారు. అనంతరం ఆలయం ఆవరణలో దండోరా వేశారు. అక్టోబరు 6న పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, 7న సిరుల తల్లి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చాటింపు వేశారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో కోట వద్దకు వెళ్లి కోట శక్తికి మనవి చెప్పి చాటింపు వేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబరు 22 వరకూ పండగ ఘనంగా నిర్వహిస్తామని, ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల సంబరాలు, సిరిమానోత్సవానికి చాటింపు ప్రక్రియ ఆనవాయితీగా వస్తోందన్నారు. నెల రోజుల పండగలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవాలని ఆమె కోరారు. -
లాటరీ ద్వారా డ్వాక్రా బజార్ స్టాల్స్ కేటాయింపు
విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా సెర్ప్, డీఆర్ డీఏ ఆధ్వర్యంలో అక్టోబరు 8 వరకూ నిర్వహించనున్న అఖిల భారత డ్వాక్రా బజారుకు పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాని కి వచ్చినట్టు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వచ్చిన మహిళా సంఘాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి స్టాల్స్ కేటాయింపు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సంఘ సభ్యులకు స్టాల్స్ కేటాయింపును లాటరీ ప్రక్రియ ద్వారా డ్రా నిర్వహించారు. నాబార్డ్కు 60, మెప్మాకు 26, ఆర్వైఎస్ఎస్కి 15 స్టాల్స్ కేటాయించామన్నారు. స్టాల్స్ నిర్వహకులకు భోజనం, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని, శానిటేషన్ విషయంలో ఎటువంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కలెక్టర్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. డీఆర్డీఏ అదనపు సంచాలకులు కె.సావిత్రి, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సెర్ప్ పీడీ రత్నాకర్, సీ్త్ర నిధి డీజీఎం సిద్ది శ్రీనివాస్, కృష్ణంనాయుడు, డీపీఎంలు రాజ్కుమార్, చిరంజీవి, సీతా రామయ్య, లక్ష్మునాయుడు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
దత్తిరాజేరు : వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తి గ్రామానికి రానున్న నేపథ్యంలో కలెక్టర్ రామ్సుందర్రెడ్డి ఏర్పాట్లను ఆదివారం పరిశీలించా రు. సీఎం హెలిపాడ్ దిగే స్థలాన్ని, సభా స్థలా న్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రా మంలో ఎక్కడ గోతులు లేకుండా చూడాలని, పరిశుభ్రంగా ఉంచాలని ఆయా శాఖల అధికా రులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీడీపీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, బొబ్బిలి ఆర్డీవో మోహనరావు, పోలీసు శాఖ అధికారులు ఉన్నారు. విజయనగరం అర్బన్: విజయనగరం ఉత్సవాలను 11 వేదికల్లో నిర్వహిస్తున్నామని ప్రతి వేదిక వద్ద ఘనంగా జరపాలని వేదికల ఇన్చా ర్జ్ అధికారులకు కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆది వారం ఉత్సవ వేదికల ఇన్చార్జ్ అధికారులతో ఏర్పాట్లపై వేదికల వారీగా సమీక్షించారు. ఉత్సవాల పనిపై దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలిపారు. లైఫ్ సభ్యులతో మాట్లాడుకొని ఉత్సవ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు. ఉత్సవాల నిర్వహణలో వేదికల ఇన్చార్జ్లే బాధ్యత వహించాలని, ఎక్కడ లోపం జరిగిన ఆ వేదిక ఇన్చార్జ్నే బాధ్యత చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే జేసీ దృష్టిలో పెట్టి పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూ ర్తి, ఆర్డీవోలు, వేదికల ఇన్చార్జ్ అధికారులు, ముఖ్యమంత్రి పర్యటనలో డ్యూటీ వేసిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం టౌన్: రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు రెడ్డి నారాయణరావు, ఎన్.అప్పలరాజురెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పది ప్రభుత్వ కళాశాలలను లీజుకిచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబరు 107, 108లను రద్దు చేసి 100శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గుజ్జూరు శంకరరావు, గోవింద్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని డీఎస్సీలో 19మంది అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం ఆనందంగా ఉందని బీసీ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కార్యాలయం ఆవరణలో డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా జిల్లాలో మొత్తం 228 మంది అభ్యర్థులకు కస్పా హైస్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వం డీఎస్సీ శిక్షణ ఏర్పాటు చేసిందన్నారు. వీరికి ఉచితంగా 60 రోజుల పాటూ శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటిరియల్ కొనుగోలు చేసేందుకు నగదును అందించి ప్రోత్సహించిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న 19 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. వీరిలో కొందరు తమ ప్రాథమిక విద్యను బీసీ హాస్టల్స్లో ఉంటూ పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్పేర్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
యూపీహెచ్సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.అప్పలసూరి డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీహెచ్సీ ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్లో సమస్యలు పరిష్కరించకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో సంఘం నాయకులుల బాలరాజు, శంకర్, సుమిత్ర, హరికృష్ణ, మురళీమోహన్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పొట్టచేతబట్టుకుని వెళ్లి..
చీపురుపల్లి రూరల్(గరివిడి): కుటుంబపోషణ కోసం పొట్ట చేతబట్టుకుని ఊరికాని ఊరు వెళ్లిన గరివిడికి చెందిన కె. ప్రసన్నకుమార్ (45) ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్లో గల గోదావరి స్టీల్ ప్లాంట్లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రసన్నకుమార్కు రాయపూర్లో గల గోదావరి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగావకాశం రావడంతో 20 రోజుల క్రితం ఇంజినీర్ హోదాలో ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి భార్యాపిల్లలను గరివిడిలో ఉంచి తాను రాయపూర్లో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. రాయపూర్లో అంతా అనుకూలంగా ఉండడంతో పిల్లలను తీసుకుని తన వద్దకు వచ్చేయాలని భార్యకు చెప్పాడు. ఈ మేరకు భార్య భవాని తన ఇద్దరు పిల్లలతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా, వారికి తోడుగా మృతుని అన్నయ్య కూడా బయల్దేరాడు. వారంతా రాయపూర్ ప్రయాణమై మార్గమధ్యంలో ఉండగానే స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ప్రసన్నకుమార్ మృతి చెందాడన్న వార్త తెలియడంతో దారిలోనే కుప్పకూలిపోయారు. ప్లాంట్లో నిర్మాణం జరుగుతున్న సమయంలో బీమ్ పడిపోవడంతో సంఘటన స్థలంలోనే ప్రసన్నకుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబపెద్ద మృతితో భార్యా పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాయపూర్లో గరివిడి వ్యక్తి మృతి ఉద్యోగంలో చేరిన నెల గడవకముందే ప్రమాదం అనాథలైన భార్యాపిల్లలు -
ధ్వంసం చేసిన పంట పరిశీలన
పార్వతీపురం రూరల్: నాలుగు రోజుల క్రితం ప్రవేశించిన ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోని చినమరికి, పెదమరికి, బండిదొరవలస తదితర గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పగలంతా సమీపంలో గల చెరువులు, తోటల్లో తిష్ఠవేస్తున్న ఏనుగుల గుంపు రాత్రి అయితే బండిదొరవలస సమీపంలో రహదారి పక్కనున్న మొక్కజొన్న పంట పొలంలో సేదదీరుతూ పంటను నాశనం చేస్తున్నాయి. అయితే గురువారం, శుక్రవారం డొల్లు పారినాయుడుతో పాటు మరికొంతమంది రైతులకు చెందిన మొక్కజొన్న పంటలను ఏనుగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో మండల వ్యవసాయశాఖాధికారి అశోక్ నేరుగా గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు బాధిత రైతులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
● నెలాఖరు వరకు అవకాశం ● ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానంబలిజిపేట/రాజాం: ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 2008నుంచి జాతీయ ప్రతిభా ఉపకారవేతనం(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఎంపికై తే వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందిస్తుంది. ఎవరు అర్హులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు 2025–26విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూర్బా, ఎయిడెడ్, ఆదర్శ పాఠవాలల విద్యార్థులు అర్హులు. తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.3.5లక్షల లోపు ఉండాలి. పరీక్షను ఈ ఏడాది డిసెబంర్ 7న నిర్వహించనున్నారు. అర్హులైన వారు పాఠశాల యాజమాన్య వెబ్సైట్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50లు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా పరీక్ష రుసుం చెల్లించాలి. ఇది ఎంతో ఉపయోగకరం 8వ తరగతి విద్యార్థులకు ఇటువంటి పరీక్ష నిర్వహించడం వల్ల వారికి రానున్న తరగతుల్లో మంచి విద్యపై పునాది పడుతుంది. ఇతరత్రా కాంపిటేషన్ పరీక్షలకు వెళ్లేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకు ఉపకార వేతనం చదువుకునేందుకు ఆసరాగా ఉంటుంది. – వి.వెంకటనాయుడు, ప్రధానోపాధ్యాయుడు, బలిజిపేట ఉన్నత పాఠశాల -
అభ్యంతరకర పోస్టులు పెడితే వ్యవస్థీకృత నేరం
పార్వతీపురం రూరల్ /విజయనగరం క్రైమ్: సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అభ్యంతరకర, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై పోలీసుశాఖ చర్యలు తీసుకోనున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేసినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ రేంజ్ డీఐజీ పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అగౌరవ పరిచేలా, సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా పోస్టు సృష్టించేవారిని ఉపేక్షించేదే లేదని, వారిని వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో నిరంతర నిఘా పెట్టి సోషల్ మీడియాలో పెట్టే ప్రతీపోస్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు కార్యాచరణ చేశామన్నారు. ఈ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ఎస్పీ దామోదర్ కూడా డీఐజీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టాలని డీఐజీ సూచించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
నిందితులకు శిక్ష పడేలా చర్యలు
● కోర్టు కానిస్టేబుల్స్తో ఎస్పీ సమీక్ష విజయనగరం క్రైమ్: గ్రేవ్ కేసుల్లో పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన డీపీఓ నుంచి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్, కోర్టు మానిటరింగ్ అధికారులు, హెచ్సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, న్యాయస్థానాల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితులు న్యాయస్థానాల్లో శిక్షకు గురయ్యే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుల్స్, కోర్టు మానిటరింగ్ స్టాఫ్ పాత్ర క్రియాశీలకమని స్పష్టం చేశారు. కేసుల విచారణ సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు సాక్షులు సకాలంలో హాజరయ్యేందుకు సమన్లు జారీ చేయాలని చెప్పారు. కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేసి, నిందితులు కోర్టు వాయిదాలకు రెగ్యులర్గా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రాసిక్యూషన్ జరుగుతున్న సమయాల్లో సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కోర్టులకు హాజరై, ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును గమనించాలని ఆదేశించారు. సమష్టిగా, సమన్వయంతో నిందితులకు శిక్ష పడే విధంగా సమర్థవంతంగా పని చేసే వారికి ప్రోత్సాహక బహుమతులు, రివార్డులను అందిస్తామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. ఈ జూమ్ మీటింగ్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు సీఐలు, ఎస్సైలు, లైజనింగ్ అధికారులు, కోర్టు మానిటరింగ్ స్టాఫ్, కోర్టు విధులు నిర్వహించే హెచ్సీలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
గెడ్డలో మహిళ మృతదేహం
వీరఘట్టం: మండలంలోని కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన రౌతు చిన్నమ్మడు(59) బహిర్భూమికి వెళ్లి చివరకు గెడ్డలో శవమై తేలింది. ఆమె మృతిపై ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శనివారం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన చినమ్మడు మానసిక స్థితి బాగులేదని, ఆమె ఈనెల 21న ఇంటి నుంచి బహిర్భూమి కోసం వెళ్లిందని, కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు సమీప బంధువులు, చుట్టాల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 23న స్థానిక పోలీస్స్టేషన్లో ఆమె కుమారుడు అప్పలరాజు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కొట్టుగుమ్మడకు వెళ్లే తోవలో ఉన్న బ్రిడ్జి సమీపంలో గెడ్డలో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి పరిశీలించి ఆమెను కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన చిన్నమ్మడుగా గుర్తించారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు. చెరువులో పడి భవానీ మాలాధారుడి మృతిబొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మడి సాయి సతీష్(24) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. దీనిపై ఏఎస్సై కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం అన్నసమారాధనకు వెళ్లేందుకు సిద్ధమై స్థానిక ఎర్రకోనేరులో స్నానానికి దిగి కాలు జారి పడిపోయిన సాయి సతీష్ కేకలు వేయడంతో సహచర భవానీ భక్తులు రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే స్పృహ కోల్పోయి కొన ఊపిరితో ఉండడంతో బొబ్బిలి సీహెచ్సీ హుటాహుటిన తరలించారు. దీంతో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి అచ్యుత రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలియజేశారు. సాయి సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఏఎస్సై తెలిపారు. మృతుడు సాయిసతీష్ డిప్లమోచదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇంతలో ఇలా జరిగిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహన
● జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి కుటుంబానికి స్పష్టంగా వివరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీఎస్టీ 2.0కింద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జేసీ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, మందులు, విద్య, వస్త్రాలు, రవాణా వంటి విభాగాల్లో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తెలియజేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్హెచ్జీ మహిళలు, గ్రామ కార్యదర్శులు, అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి నిత్యవసరాలపై లబ్ధిని తెలియజేయాలన్నారు. చివరిగా వచ్చేనెల 19న జిల్లాస్థాయిలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ డేవిడ్ అనిల్, ఎస్డీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
శాశ్వత లోక్ అదాలత్ను వినియోగించుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: శాశ్వత ప్రజా న్యాయ పీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, అనధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ శాశ్వత ప్రజా న్యాయపీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. శాశ్వత న్యాయ పీఠం ఈ కింది సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. బీమా, బ్యాకింగ్, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రయాణికులు, వస్తువులు చేరవేసే రోడ్డు, వాయు, జల రవాణా సేవలు, పోస్టల్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ సేవలు, ప్రజలకు సప్లై చేసే విద్యుత్, కాంతి, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుద్ధ్య సేవలు ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలకు సంబంధించిన తగాదాలను రాజీమార్గం ద్వారా కానీ లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. ఇది సులువైన ప్రత్యామ్నాయ పరిష్కారమని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీ దుర్గయ్య, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్ష ఫీజులకు వేళాయె..!
పాలకొండ రూరల్: రానున్న ఏడాదిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎటువంటి ఆపరాద రుసుము లేకుండా అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా సంబంధిత బోర్డు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుల స్వీకరణకు వచ్చే నెల 10 వరకు గడువు నిర్దేశించిన సంబంధిత బోర్డు 11 నుంచి 21 తేదీల మధ్య రూ.వెయ్యి అపరాధ రుసుముతో కలిపి చెల్లించేలా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థులు అదనపు మొత్తం చెల్లించే అవకాశం ఇవ్వకుండా వచ్చే నెలలోగా చెల్లించడం ఉత్తమమని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఫీజుల చెల్లింపు ఇలా.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంఽధించిన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్షల కోసం రూ.600, జనరల్ కోర్సులు చదువుతున్న ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సులు చదవుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి సబ్జెక్టులకు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం చదువుతూ మొదటి సంవత్సరం పరీక్షలు తప్పిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ఏడాదులకు థియరీ ఫీజుతో కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సులు చదువుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్కు హాజరు కావాల్సిన విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సులు చదువుతున్న విద్యార్థులు రెండేళ్లకు రూ.330 చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ ఏడాదుల్లో ఉత్తీర్ణత పొంది మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాయదలచిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ విద్యార్థులు రూ.1,600 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో కళాశాలలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు–14, హైస్కూల్ ప్లస్–2, కేజీబీవీలు–14, మోడల్ స్కూల్స్–4, సాంఘిక సంక్షేమ కళాశాలలు–5, గిరిజన సంక్షేమ కళాశాలలు–9, ప్రైవేట్ విభాగంలో 38 జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కళాళాలల్లో ప్రథమ సంవత్సరం–9,050మంది, ద్వితీయ సంవత్సరం 9,100 మంది విద్యార్థులు బోధన పొందుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల్లో 2,165 పైచిలుకు విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.సకాలంలో చెల్లిస్తే మేలు ఫీజుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు ఈ విషయం గమనించి సకాలంలో నిర్దేశిత ఫీజులు చెల్లించాలి. లేకుంటే అధనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 86 జూనియర్ కళాశాలలకు ఆదేశాలు అందించాం. యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించి, నిర్దేశిత గడువు ముగిసే సమయానికి శతశాతం ఫీజులు చెల్లించేలా చూడాలి. లేకుంటే విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. – వై.నాగేశ్వరరావు, డీఐఈవో, పార్వతీపురం మన్యం అక్టోబర్ 10తో ముగియనున్న గడువు గడువు ముగిశాక రూ.వెయ్యి అపరాధ రుసుం సకాలంలో ఫీజులు చెల్లించాలంటున్న అధికారులు -
244 స్టాల్స్లో ఎస్హెచ్జీ ఉత్పత్తుల ప్రదర్శన
● నేటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్ ● కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ వేదికగా నిలవనుందని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో ఆదివారం ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, దసరా వేడుకలు, విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ గ్రౌండ్స్లో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ కొనసాగుతుందన్నారు. 244 స్టాల్స్లో హస్తకళలు, కలంకారీ, చేనేత, వెదురు, ఆర్టిఫీషియల్ నగలు, డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జ్యూట్బోర్డు ఉత్పత్తులు, నాబార్డు, పోచంపల్లి, గద్వాల్ వస్త్రాలు ఈ ప్రదర్శనలో విక్రయిస్తారని తెలిపారు. మన రాష్ట్రం నుంచి 26 జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
● పొట్ట పోషణ కోసం
● పొట్ట పోషణ కోసంకూలాడితే గానీ కుండాడని బతుకులు వారివి. కొండకోనలు, వాగువంకలు, చెట్టుపుట్టలు తప్ప మరో దృశ్యానికి నోచుకోని అమాయక ప్రజలు వారు. మూడు పూటలా నాలుగు వేళ్లూ నోటిలోకి వెళ్లాలంటే గ్రామం దాటి కూలి పనికి వేరే ఊరు వెళ్లేందుకు వారికి గెడ్డ దాటక తప్పదు. వర్షాకాలంలో అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆకలితో పస్తులుండలేక, పొట్టపోషణ కోసం ప్రాణాలు అరచేతబట్టుకుని ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనికి పక్కనున్న చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీ, గుంటభద్ర గ్రామానికి చెందిన గిరిజనులు మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ఓరైతు సాగుచేస్తున్న మొక్కజొన్న పంటలో కూలిపనులు చేసేందుకు 10 మంది గిరిజన మహిళలు శనివారం గుంటభద్ర గ్రామం నుంచి ఉదయం వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని గ్రామానికి వస్తున్న క్రమంలో అడారుగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఒక్కో మహిళను పీకల్లోతు గెడ్డ నుంచి తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చాడు. – మక్కువ -
యూరియా కష్టాలు చూడండి ‘బాబూ’..
కెల్ల సచివాలయం వద్ద యూరియా కోసం రైతుల క్యూ గుర్ల/రేగిడి: వర్షాలు కురుస్తుండడంతో వర్షాధార పంట పొలాల్లో నీరు చేరింది... కాస్త యూరియా వేస్తే వరిపైరు ఏపుగా పెరుగుతుందని ఆశించిన రైతన్నకు ఎరువు దొరకడం లేదు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గుర్ల మండలంలోని కెల్ల ఆర్ఎస్కే వద్ద శనివారం సుమారు 2వేల మంది రైతులు క్యూ కట్టారు. కేవలం 450 బస్తాలు మాత్రమే రావడం, ఇందులో కూటమి నేతలకోసం యూరియా బస్తాలను పక్కకు తీయడంతో రైతులు ఆందో ళన చెందారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. ఇందులో కెల్ల గ్రామానికి చెందిన మహిళా రైతు జె.మంగ సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానిక ప్రైవేటు క్లినిక్కు తరలించి చికిత్స అందజేశారు. ● రేగిడి మండలం కొర్లవలస ఆర్ఎస్కే వద్ద బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తహసీల్దార్ ఐ.కృష్ణలత, ఎస్ఐ బాలకృష్ణ, ఏఓ బి.శ్రీనివాసరావు సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. -
అమృత్భారత్కు స్వాగతం
విజయనగరం టౌన్: బరంపురం నుంచి సూరత్ (ఉద్నా) వరకు ప్రయాణించే అమృత్భారత్ రైల్ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఒడిశాలో జార్సుగుడ నుంచి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లో అధికారులు రైలుకు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 4.15 గంటలకు విజయనగరం వచ్చిన అమృత్భారత్ రైలుకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్వర్మ పచ్చజెండా ఊపారు. అమృత్భారత్ రైలు స్వాగత కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎమ్ మనోజ్కుమార్ సాహూ, సీనియర్ డీఈఎన్ ఈస్ట్ సాయిరాజ్, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వి.రవివర్మ, బీజేపీ ప్రతినిధి రెడ్డి పావని, తదితరులు పాల్గొన్నారు. -
పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...
రామభద్రపురం: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొ న్న పంట చేతికొచ్చింది. నూర్పిడి పనులు చేపట్టారు. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. దళారులు క్వింటాకు రూ. 300 తక్కువకు అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియక... పంటకు చేసిన అప్పులు తీర్చేదారిలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చేవేళ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. రైతులపై సీఎం చంద్రబాబుకు ఇంత వివక్షతగదని వాపోతున్నారు. వరి సాగుచేసే రైతులకు యూరియా లభించడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇప్పుడు మొక్కజొన్న చేతికొచ్చినా కొనుగోలు చేసేవారు కనిపించడంలేదు.. ఇలా అయితే రైతు బతికేది ఎలా ‘బాబూ’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ● కొనుగోలు చేసేది ఎప్పుడు? జిల్లాలోని 27 మండలాల్లో సుమారు 9,850 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు దాదాపు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నలు రూ.2,400లుగా మద్ధతు ధర ప్రకటించింది. నేటికీ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కాకపోవడంతో నూర్పిడిచేసిన పంటను కళ్లాల్లోనే ఉంచి రైతులు కాపాలాకాస్తున్నారు. ఓ వైపు వర్షాలతో పంట రక్షణకు నానా పాట్లు పడుతున్నారు. వ్యాపారులకు విక్రయిద్దామంటే క్వింటాను రూ.2వేల నుంచి రూ.2,100 మధ్య కొనుగోలు చేస్తున్నారు. క్వింటా వద్ద రూ.300 ధర కోల్పోతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతంటే చిన్నచూపు తగదు రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మొక్కజొన్న పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం దారుణం. నూర్పిడి చేసిన పంటను రక్షించేందుకు నానా పాట్లు పడుతున్నాం. వర్షాల నేపథ్యంలో కళ్లాల్లో మొక్కజొన్న గింజలను ప్రతిరోజూ ఆరబెడుతున్నాం. – పొట్టంగి రాము, రైతు, పారాది, బొబ్బిలి మండలం గిట్టుబాటు ధర కల్పించాలి కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం రూ.3 వేల గిట్టుబాటు ధర కల్పించాలి. కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి. పంట నిల్వ ఉంచుకోలేక కొందరు రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. – పూడి సత్యం, రైతు, రామభద్రపురం ఉత్తర్వులు రాలేదు.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదు. కొన్ని ప్రాంతాలలో నూర్పిడి చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన, తొందరపడాల్సిన అవసరం లేదు. – వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ జిల్లా మెనేజర్, విజయనగరం -
నవదుర్గ ఆలయంలో చోరీ
పార్వతీపురం రూరల్: మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో గల శ్రీ నవదుర్గ మాత ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగలు ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన చిల్లర నాణాలను దోచుకెళ్లినట్లు ఆలయ ధర్మకర్త ఎన్.రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై వివరాలు వెల్లడిస్తూ గురువారం హుండీలో లెక్కించిన చిల్లర డబ్బులు ఆలయంలో ఉన్న ట్రంకుపెట్టెలో భద్రపరచగా గుర్తుతెలియని దుండగులు రూ.1000లు చోరీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయం తలుపులు తెరిచేందుకు వచ్చిన ధర్మకర్త రాజ్యలక్ష్మి చోరీ జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోషికుమారి తెలిపారు. -
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పతకాలు
● క్రీడాకారులకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అభినందనలు విజయనగరం: కలియుగ భీముడు కోడిరామమూర్తి స్ఫూర్తితో జిల్లాలోని బాడీ బిల్డర్లు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. ఈనెల 24న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను కోలగట్ల శుక్రవారం అభినందించి సత్కరించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు క్రీడాకారుల్లో ఐదుగురు పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. పోటీల్లో వరుణ్ బంగారు పతకంతో స్కూటీని గెలుపొందాడన్నారు. 75 కేజీల విభాగంలో జి.రమేష్ బంగారు పతకం సాధించగా, మెన్స్ ఫిజిక్లో పి.వంశీ వెండి పతకం, 55 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో 4వ స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. 80 కేజీల విభాగంలో ఎస్కె.సుభాన్ 3వ స్థానం దక్కించుకోగా..ఫిజికల్లీ ఛాలెంజెండ్ విభాగంలో బి.సాయి బంగారు పతకం కై వసం చేసుకున్నట్లు వివరించారు. ఈనెల 28న విజయనగరం వేదికగా నిర్వహించే మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తాచాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ, కార్యదర్శి బైక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల పర్యటన
విజయనగరంఫోర్ట్: వరిపంటకు తెగుళ్లు అశించడంతో రైతులకు సూచనలు, సలహాలు అందించేవారు లేక అవస్థలు పడుతున్న అంశంపై సాక్షిలో శుక్రవారం ‘వరిపంటపై తెగుళ్ల దాడి’ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. ఈ మేరకు విజయనగరం మండలంలో మండల వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్, వీఏఏ శోభలు రాకోడు, పినవేమలి, కోరుకొండ గ్రామాల్లో పర్యటించి వరి పంటకు అశించిన తెగుళ్లను గుర్తించి వాటినివారణ చర్యల గురించి రైతులకు వివరించారు. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామంలో వీఏఏ రమేష్ రైతుల పొలాలను పరిశీలించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మూడవ లైన్లో స్పీడ్ ట్రయల్ రన్పార్వతీపురం టౌన్/బొబ్బిలి: పార్వతీపురం–డొంకినవలస మధ్య కొత్తగా వేసిన రైల్వే మూడవ లైన్లో స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ బ్రిజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం రైల్వే స్టేషన్లో నిర్వహించిన ట్రయల్ రన్, అమృత భారత్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది వాల్తేరు డివిజన్కు మరో మైలురాయిగా, ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందన్నారు. డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం స్టేషన్లను కలిపేందుకు 36 కిలోమీటర్లలో కొత్తగా నిర్మించిన, విద్యుదీకరించిన మూడవ లైన్ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత స్పీడ్ ట్రయల్ రన్ను పర్యవేక్షించినట్లు తెలిపారు. రాయగడ–విజయనగరం మార్గం డబ్లింగ్లో భాగంగా ఉందన్నారు. డివిజన్లోని నిర్మాణం, ఇతర శాఖల మధ్య ప్రమేయం ఉన్న అన్ని విభాగాల అంకితభావాన్ని, సమర్థవంతమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అనంతరం అధికారులు స్టేషనన్యార్డ్ క్రాస్ ఓవర్లు, హైలెవల్ ప్లాట్ఫామ్లు, వంతెనలతో పాటు కొత్తగా అందించిన సౌకర్యాలపై సమీక్షించారు. కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్స్ట్రక్షన్) అంకుష్ గుప్తా, చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.కె.పాత్రో, వాల్తేరు డివిజన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్, సిగ్నల్– టెలికాం, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ విభాగాల నుంచి ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వృద్ధుడిని రోడ్డుపై వదిలేసిన కుటుంబం● ఆదుకున్న టూటౌన్ పోలీసులు ● నైట్ షెల్టర్లో ఆశ్రయం అల్లిపురం (విశాఖ): రోజురోజుకీ మానవత్వ విలువలు పడిపోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. వృద్ధులను అంతిమ దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబసభ్యులు వారిని బరువుగా భావిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఆస్తులు కావాలి గానీ, కన్నవారు అవసరం లేదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం విజయనగరం నుంచి సుమారు 75 ఏళ్ల వృద్ధుడిని రైల్వే స్టేషన్ దరి సిగ్నల్ పాయింట్ సమీపంలో ఒక ఆటోలో తీసుకువచ్చి వదిలివెళ్లి పోయారు. ఆయనకు యూరి నల్ బ్యాగు తగిలించి, డైపర్ వేసి ఉంది. వృద్ధుడి పరిస్థితిని చూసిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వెంటనే టూటౌన్ బ్లూకోల్ట్ కానిస్టేబుల్ నారాయణకు సమాచారం అందించారు. నారాయణ అక్కడికి వెళ్లి, ఆ వృద్ధుడి దుస్థితి చూసి చలించిపోయారు. అనంతరం రక్షక్కు ఫోన్ చేసి, విషయాన్ని టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడుకు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు వృద్ధుడిని భీమ్నగర్ నిరాశ్రయ వసతి గృహానికి తరలించి, ఆశ్రయం కల్పించారు. వృద్ధుడు తనది విజయనగరం అని మాత్రమే చెప్పగలుగుతున్నాడని, పోలీసులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి కౌన్సెలింగ్ చేసి, మరొకరు ఇలాంటి పనులు చేయకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు. -
పీహెచ్సీ ఎదుట మృత శిశువుతో నిరసన
పూసపాటిరేగ: మండలంలోని రెల్లివలస పీహెచ్సీలో ప్రసవ సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందిందని శుక్రవారం మధ్యాహ్నం బాలింత బంధువులు నిరసనకు దిగారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చల్లవానితోట పంచాయతీ కొండగుడ్డికి చెందిన గర్భిణి వాళ్లె రాధికకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రసవం కోసం రెల్లివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జాయిన్ చేశారు. ప్రసవ సమయం కావడంతో ఆస్పత్రిలో ఉండాలని సిబ్బంది సూచించారు. శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల నుంచి నొప్పులు తీవ్రం కావడంతో పీహెచ్సీ స్టాఫ్ నర్సు విజయ ప్రసవం చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ప్రసవానికి ఇబ్బందులు ఏర్పడడంతో వైద్యాధికారి భాగ్యరేఖను ఫోన్లో సంప్రదించారు. ఉదయం 8 గంటల వరకు ప్రసవం అవకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది, పీహెచ్సి సిబ్బంది అతి కష్టంమీద ప్రసవం చేయించడంతో మగబిడ్డ జన్మించాడు. పీహెచ్సీకి చేరుకున్న వైద్యురాలు భాగ్యరేఖ పుట్టిన శిశువును పరీక్షించి ప్రమాదమని గుర్తించి అత్యవసరంగా విజయనగరం ఘోషా ఆస్పత్రికి 108 వాహనంలో పంపించారు. ఆస్పత్రికి వెళ్లేటప్పటికే శిశువు మృతి చెందడంతో శిశువుతో పాటు బంధువులు రెల్లివలస పీహెచ్సీకి చేరుకుని వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారి భాగ్యరేఖ స్పందిస్తూ గర్భిణి ప్రసవం ఆస్పత్రిలో చేస్తానని స్టాఫ్నర్సు విజయ తెలిపారన్నారు. ఆకస్మికంగా హైరిస్క్లోకి వెళ్లడంతో గర్భిణికి చేయాల్సిన చికిత్స చేస్తూ సుందరపేట ఆస్పత్రి గైనకాలజిస్ట్ను సంప్రదించినట్లు తెలియజేశారు. ప్రసవ సమయంలో బేబి తల బయటకు వచ్చి ఆగిపోవడంతో హైరిస్క్ అని గుర్తించామన్నారు. 108 సిబ్బంది వచ్చి బేబిని బయటకు తీయడంతో హైరిస్క్లోకి వెళ్లిపోగా ఘోషా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శిశువు మృతి చెందినట్లు ఆమె వివరించారు. అనంతరం బంధువులు ఆందోళన ముగించి వెనుదిరిగారు. -
మత్తు పదార్థాలను పూర్తిగా నివారించాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి కోరారు. జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ముందుగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లా మీదుగా గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే వివిధ చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాలను గుర్తించేందుకు రెండు డాగ్ స్క్వాడ్లను కూడా వినియోగిస్తున్నామన్నారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించి మత్తుపదార్థాల వినియోగాన్ని మానిపించేందుకు జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్ను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ను అరికట్టువచ్చునని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. కలెక్టర్ రామ్సుందర్రెడ్డి మాట్లాడుతూ నేరాలను అరికట్టడంలో మన జిల్లా మెరుగైన స్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో 6వ స్థానంలో నిలిచామని చెప్పారు. జిల్లాలో మత్తుపదార్థాలను, గంజాయిని పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ వినియోగం, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో ఏఎస్పీ సౌ మ్యలత, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎస్డబ్ల్యూఓ వెంకటేశ్వరరావు, డీబీసీడబ్ల్యూఓ జ్యోతిశ్రీ వయోజనవిద్య డీడీ సోమేశ్వరరావు, ఆర్డీఓలు, డీఎస్పీలు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి -
హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
● క్లూస్ టీమ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్తో ఆధారాల సేకరణ బొండపల్లి: మండలంలోని కొండకిండాం గ్రామంలో సంచనలం సృష్టించిన ఆస్తి విషయంలో తండ్రిని హత్య చేసిన కొడుకు ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జీఏవీ రమణతో పాటు, స్థానిక ఎస్సై యు.మహేష్లు గురువారం రాత్రి నుంచి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హత్యకు గురైన పెద్దమజ్జి నాయుడుబాబుపై ఇనుప రాడ్తో దాడి చేసి హత్య చేసిన తర్వాత కుమారుడు గణేష్కుమార్ పరారీ కావడంతో ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి హత్య వివరాలను పోలీసులు సేకరించారు. నిందితుడు గణేష్ కుమార్ వేపాడలోని మోడల్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తండ్రి ఆరోగ్యం కోసం వైద్య ఖర్చులకు గాను భూమిని ఆమ్మే క్రమంలో తండ్రీకొడుకుల మధ్య కొద్ది రోజులుగా నడిచిన ఆస్తి వివాదం ఈ హత్యకు దారి తీసిసట్లు పోలీసులు గుర్తించి నిర్దారణకు వచ్చారు. మృతురాలి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించారు. హత్యచేసేందుకు నిందితుడు ఉపయోగించిన రాడ్డుతో పాటు ప్రాథమిక ఆధారాలను క్లూస్ టీమ్తో పాటు, రీజియన్ ఫోరెనిక్స్ సైన్స్ లేబొబరేటరీ టీమ్తో సేకరించినట్లు సీఐ రమణ తెలిపారు. నిందితుడిని తర్వలోనే పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ చెప్పారు. -
సాగుదీత..!
పార్వతీపురం రూరల్: పంట నష్టపరిహారం అందాలన్నా, పంటల బీమా వర్తించాలన్నా, సున్నా వడ్డీకే రుణం రావాలన్నా..ఆఖరికి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా..వాటన్నింటికీ ప్రభుత్వ గుర్తింపు కావాలి. ఆ గుర్తింపునకు ఏకై క ఆధారం ‘ఈ–క్రాప్’ నమోదు. అలాంటి కీలకమైన ప్రక్రియ మన్యం జిల్లాలో అటకెక్కింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వస్తున్నా, ఈ–క్రాప్ నమోదు మాత్రం నత్తనడకన సాగుతోంది. గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుండగా, ఇంకా 43 శాతం పంటల వివరాలు ఆన్న్ లైన్లో నమోదు కాకపోవడంతో అన్నదాతల గుండెల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది. నమోదులో జాప్యం..నష్టపోయేది రైతే మన్యం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పంటలు 3,09,671 ఎకరాల్లో సాగవగా, ఇప్పటివరకు కేవలం1,76512 ఎకరాల్లో మాత్రమే ఈ క్రాప్ నమోదు పూర్తయింది. అంటే, జిల్లాలో కేవలం 57 శాతం మాత్రమే పూర్తి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరో మూడు రోజుల్లో మిగిలిన 43 శాతం ఎలా పూర్తి చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో 47 శాతం నమోదు కాగా, సాలూరులో 65 శాతంతో కాస్త మెరుగ్గా ఉంది. పాలకొండలో 54శాతం, కురుపాంలో 60శాతం నమోదైంది. గడువులోగా ఈ క్రాప్ నమోదు పూర్తి కాకపోతే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, పంటనష్టం జరిగినా ప్రభుత్వ సాయం అందే అవకాశం ఉండదు. ఇది రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది. కొరవడిన సమన్వయం ఈ–క్రాప్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో సజావుగా సాగాలంటే వ్యవసాయ సహాయకులు (వీఎఎ), గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ) కలిసి పనిచేయాలి. కానీ ఆచరణలో ఇది జరగడం లేదు. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు దూరంగా ఉంటుండడంతో వ్యవసాయ శాఖ సిబ్బందిపైనే భారం పడుతోంది. ఇటీవల జరిగిన బదిలీల కారణంగా చాలా మంది వీఏఏలకు గ్రామాల్లోని పొలాలపై సరైన అవగాహన లేదు. దీనికితోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబ్బందిలో నిర్లక్ష్యం తాండవిస్తోందని, ప్రక్రియను మమ అనిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్యల సుడిగుండం సమన్వయ లోపంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా ఈ–క్రాప్ నమోదుకు అడ్డంకిగా మారాయి. మారిన నిబంధనల ప్రకారం సర్వే నంబర్ వారీగా పొలాన్ని జియో–ట్యాగింగ్ చేసి, ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు, అనేక మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు వేధిస్తున్నాయి. రైతుల బయోమెట్రిక్ వేయాలన్నా, ఐరిస్ నమోదు చేయాలన్నా సాంకేతికత సహకరించడం లేదు. భూముల సర్వే జరిగిన గ్రామాల్లోని ఎల్పీ నంబర్లకు, పాత సర్వే నంబర్లకు మధ్య తేడాలు ఉండడంతో నమోదు మరింత సంక్లిష్టంగా మారింది. మరో మూడు రోజుల్లో అద్భుతం జరిగి, ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే..ఖరీఫ్లో చెమటోడ్చి పంట పండించిన రైతన్న కన్నీరు పెట్టుకోక తప్పదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యేక చర్యలు చేపట్టి, ఈ–క్రాప్ నమోదును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఆందోళనలో అన్నదాతలు నిన్న యూరియా కొరత..నేడు ఈక్రాప్లో అలసత్వం జిల్లాలో 57శాతం పూర్తయిన ఈ క్రాప్ నమోదు గడువు ఇంకా మూడు రోజులే -
ఇటుకల తయారీ కార్మికుడి ఆత్మహత్య
పాలకొండ రూరల్: పైళ్లె పదేళ్లయినా పిల్లలు లేకపోవడంతో కుంగిపోయాడు. తనతోపాటు వివాహాలు చేసుకున్న వారంతా పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతుంటే వారిని చూసి నిరాశకు లోనయ్యాడు. అంతా ప్రశ్నిస్తుంటే తీవ్ర మనస్తాపం చెంది చివరకు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ గ్రామంలోని కుమ్మరవీధికి చెందిన బుడుమూరు రవి(37)కి ఆదే గ్రామానికి చెందిన లక్ష్మితో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం భార్యాభర్తలు ఇటుకల తయారీ కార్మికులుగా పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. రెండు నెలల క్రితం భార్య, మరో ఇద్దరు కార్మికులతో కలిసి బతుకుతెరువులో భాగంగా పాలకొండ సమీపంలో ఇటుకల తయారీ పనిలో రవి చేరాడు. తనకు పిల్లలు కలగకపోవడంతో నిత్యం సహచరుల వద్ద ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరోగ్యం బాగా లేదని, వైద్యులకు చూపించుకుంటానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వచ్చేశాడు. చీకటి పడినా ఇంటికి చేరక పోవడంతో భార్య లక్ష్మి ఇటుకల బట్టీ నిర్వాహకుడు శ్రీనివాసరావును వాకబు చేసింది. వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. శుక్రవారం పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో గజాలకానా సమీపంలో ఓ తోట గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశంలో పురుగుమందు డబ్బా, ఓ గ్లాసు, వాటర్ బాటిల్తోపాటు సెల్ ఫోన్ను గుర్తించారు. ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా మృతుని వివరాలు సేకరించి, స్థానికంగా ఉన్న భార్యకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆమె స్థానిక ఏరియా ఆస్పత్రికి చేరుకుని పిల్లలు కలగకపోవడంతో తన భర్త పడ్డ వేదన తలుచుకుంటూ మృతదేహంపై పడి గుండెలు పగిలేలా రోదించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్ల: మండలంలోని దమరసింగికి చెందిన పిన్నింటి సత్యనారాయణ(27) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పిన్నింటి సత్యనారాయణకు వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉండలేక ఈనెల18న సత్యనారాయణ గడ్డి మందు తాగేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా వారం రోజుల చికిత్స ఆనంతరం శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పండగ పూట పస్తులుండాలా?
● కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్యకార్మికులు, వాచ్మెన్ల ఆందోళన విజయనగరం గంటస్తంభం: వచ్చేది దసరా.. వీధులన్నీ దీపాలతో వెలిగిపోతుంటే.. మా ఇళ్లు మాత్రం చీకటిలో మగ్గిపోతున్నాయని, మూడు నెలలుగా జీతాలు అందక పోయినా పట్టించుకునేవారే లేరంటూ పాఠశాలలు, కళాశాల పారిశుద్ధ్య కార్మికులు, వాచ్మెన్లు ఆవేదన వ్యక్తంచేశారు. సీఐటీయూ ఆధ్వర్వంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం డీఈఓ మాణిక్యంనాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు బి.సుధారాణి, ఏ.జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రతి నెలా 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.12 వేలకు పెంచాలని, గుర్తింపు కార్డులు, యూ నిఫాంలు, పనిముట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షురాలు, కార్యదర్మి ఎస్.కె.బేగం, నందిని, నాయకులు ఉమా, సరస్వతి, స్వాతి, లక్ష్మి, రమణమ్మ, సావిత్రి, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా
● ఎస్పీ ఏఆర్ దామోదర్ చీపురుపల్లి: గంజాయి రవాణాతో పాటు వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్స్టేషన్లో ఎస్హెచ్ఓ గది, స్టాఫ్ వెయిటింగ్ రూం, రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెడునడత కలిగిన వారి పట్ల నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంపై ఎస్పీ రివార్డు ప్రకటించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్ఐ ఎల్.దామోరరావు పాల్గొన్నారు. పైడితల్లి జాతరకు 2వేల మందితో బందోబస్తు విజయనగరం క్రైమ్: పైడితల్లి తొలేళ్లు, సిరిమానోత్సవానికి 2వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టంచేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్సవ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఆలయం ప్రాంగణం సమీపంలో తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూంలోని టీవీలకు అనుసంధానం చేయాలన్నారు. పండగలో జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరగకుండా ప్రత్యేకంగా క్రైం బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, సూరి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణకు రాజకీయ పరిజ్ఞానం శూన్యం
● ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలోని తన నివాసంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సినీనటుడు చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సినీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యంపై చిరంజీవి చెప్పిన సమాధానికి బాలకృష్ణ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఒక్కరే హీరో అనుకుంటూ చిరంజీవిని చేతగాని వారిలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆయన అభిమానులు బాధపడతారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సినీరంగంలో మాదిరిగానే శాసనసభలో బాలకృష్ణ ఎటువంటి గౌరవమర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. సినిమా అభిమానులు దగ్గరకు వస్తేనే వారిపై భౌతికదాడులు చేసే బాలకృష్ణ... ఎవరికి మతిస్థిమితం సరిగ్గా లేదో తెలుసుకోవాలన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో జైలు ఊచలు లెక్కపెట్టకుండా బయటపడిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. సభలో లేనిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్రెడ్డి కోసం అగౌరవంగా మాట్లా డటం సరికాదన్నారు. హోదా, స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఓట్లేసి గెలిపించిన హిందూపురం నియోజకవర్గం ప్రజల కోసం ఏ రోజైనా సభలో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ఇదే సందర్బంలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభలో లేని వ్యక్తం కోసం అగౌరవంగా మాట్లాడటం తప్పని చెప్పకపోవడాన్ని తప్పుపడుతున్నామన్నారు. -
కఠిన శిక్షలతోనే వేధింపులకు అడ్డుకట్ట
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో మహిళలపై వివక్ష, దాడులు పెరుగుతున్నాయని, మూడేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అశ్లీల చిత్రాలు చూడడమే దీనికి కారణమన్నారు. కలెక్టరేట్లో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వేధింపులు చెప్పుకోలేక కొంతమంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే వేధింపులకు పాల్పడడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధచూపాలని కోరారు. పిల్లలకు సురక్షితమైన భద్రత కల్పిస్తున్నామా?లేదా? అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పిల్లలు, మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది ఉపయోగించుకుంటున్నారని చేతులు ఎత్తమని అడగ్గా కేవలం ఇద్దరు మాత్రమే చేతులు ఎత్తడం గమనర్హాం. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముద్దాయిలు కూడా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. బాలికలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమాంతాలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, మహిళా కమిషన్ డైరెక్టర్ నాగమణి, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తికోసం.. కన్నతండ్రినే కడతేర్చాడు..
బొండపల్లి: ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచారు. ప్రయోజకుడయ్యాక ఓ ఇంటివాడిని చేశారు. కష్టాల్లో ఆదుకుంటాడని భావించారు. చివరకు కన్నతండ్రి ఆరోగ్య కష్టాలను పట్టించుకోకుండా ఆస్తి కోసం దారుణంగా హతమార్చిన ఘటన బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ యు.మహేష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిండాం గ్రామానికి చెందిన పెద్దమజ్జి నాయుడుబాబు(72), సత్యవతి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు గణేష్కుమార్. ఆయన తన భార్యతో కలిసి వేపాడలో నివసిస్తూ అక్కడ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాయుడుబాబు ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. నడవలేని స్థితిలో కాళ్లకు శస్త్రచికిత్స అవసరం కావడంతో డబ్బుల కోసం కొడుకును సంప్రదించాడు. ససేమిరా అనడంతో ఆస్పత్రి ఖర్చుల కోసం కొంత భూమిని అమ్మకానికి పెట్టాడు. భూమిని కొనుగోలుచేసిన వారు డబ్బులు ఇవ్వడంతో ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇదే విషయంపై తండ్రితో కొడుకు పలుసార్లు గొడవకు దిగాడు. ఈ వయసులో ఆపరేషన్ ఎందుకంటూ ప్రశ్నించాడు. కొడుకు నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ మృతుడు బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకూడా చేశారు. ఈ క్రమంలో ఆస్తి విషయమై తండ్రీకొడుకుల మధ్య గురువారం రాత్రి మాటామాటా పెరిగింది. మారణాయుధంతో తండ్రిపై కొడుకు దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. తండ్రి చనిపోయాక కొడుకు పరారయ్యాడు. సమాచారం అందుకున్న గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్సై మహేష్, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. హత్యకు గల కారణాలను ఆరా తీసింది. హత్యకు ఉపయోగించిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకుంది. నాయుడుబాబు మృతితో భార్య సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆదుకుంటాడనుకుంటే హతమార్చాడంటూ రోదిస్తోంది. -
గిరిజన వర్సిటీ పనులను వేగవంతం చేయాలి
● కలెక్టర్ రామ్సుందర్రెడ్డి విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో నిర్మితమవుతున్న గిరిజన యూనివర్సిటీ పనులపై తన చాంబర్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా పనుల స్థితిగతులపై ఆరా తీశారు. సుమారు 1.3 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన యూనివర్సిటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు, గేటు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలను బయటకు జరిపేందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమణి, బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహన్, ట్రాన్స్కో ఈఈ శ్రీచరణ్, డీ–సెక్షన్ సూపరింటెండెంట్ టి.గోవింద, ఆయా మండలాల తహసీల్దార్లు, వర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. చెరువుల అభివృద్ధి పనులకు ఆమోదం జలవనరుల శాల ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ కింద రూ.56 కోట్లు అంచనాతో 102 చెరువుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కలెక్టర్ రామ్సుందర్రెడ్డి తెలిపారు. నీటివనరుల పునరుద్ధరణ, పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం, తాగునీటి లభ్యతను పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే పనులకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయన్నారు. ఆర్ఆర్ఆర్ నిబంధనలను అనుసరించి జిల్లాలో 7,900 చెరువులు ఉండగా వాటిలో కేవలం 102 చెరువులకే ప్రతిపాదనలు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
క్రీడల్లో రాణించి.. ఉద్యోగం సాధించి
–10లోనేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఎస్వీ మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.చీపురుపల్లి రూరల్ (గరివిడి): పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఆసక్తి ఉన్న రంగంలో రాణించి భవితకు బంగారుబాట వేసుకోవచ్చని నిరూపించింది గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి చెందిన రెడ్డి మౌనిక. ఆటల్లో మేటిగా నిలిచి ఉన్నతోద్యోగం సాధించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు సత్తిబాబు, పార్వతి వ్యవసాయం చేస్తూనే కుమారుడు భానుప్రసాద్తో పాటు మౌనికను డిగ్రీ వరకు చదివించారు. కొండలక్ష్మీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న సమయంలో మౌనిక టెన్నీకాయిట్ క్రీడలో ఆసక్తి చూపేది. ఆమెలో ఉన్న పట్టుదల, ప్రతిభను గుర్తించిన పీడీ ఎం.రామారావు టెన్నీకా యిట్లో తర్ఫీదు ఇచ్చారు. మెలకువలు నేర్పారు. పతకాలు సాధించేలా సాధన చేయిస్తూ ప్రోత్సహించారు. అంతే.. స్కూల్ గేమ్స్లో ఆరంభమైన ఆమె విజయకేతనం అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకాల పంటపండిస్తోంది. రెండు నెలల కిందట క్రీడా కోటాలో ఇన్కమ్ట్యాక్స్ విభాగంలో జీఎస్టీ హవల్దార్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. టెన్నీకాయిట్లో మౌనిక రాణింపు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ఉద్యోగం మౌనిక క్రీడా విజయం ఇలా.. స్కూల్ గేమ్స్ టెన్నీకాయిట్ పోటీల్లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక. 2017లో అనంతపురం జిల్లా కదిరి మండలంలో జరిగిన సబ్జూనియర్స్ చాంపియన్షిప్ స్టేట్ మీట్లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత. వెస్ట్బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధన. సౌత్ ఆఫ్రికాలో 2023 సెప్టెంబర్ నెలలో జరిగిన అంతర్జాతీయ టెన్నీకాయిట్ పోటీల్లో బంగారు పతకం సొంతం. స్పోర్ట్స్ కోటాలో విశాఖపట్నం పోర్టులో జీఎస్టీ విభాగంలో హవల్దార్గా ఉద్యోగం. -
మర్యాదపూర్వక కలయిక
విజయనగరం/నెల్లిమర్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్బాబు, పాలవసల విక్రాంత్, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. సిరిసహస్ర తన సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు.పైడితల్లి జాతరకు పటిష్ట బందోబస్తు● విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టివిజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీల్లో జరగనున్న పైడితల్లి తొలేళ్లు, సిరిమానోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రధాన రోడ్లను ఎస్పీ దామోదర్, డీఎస్పీ గోవిందరావుతో కలిసి పరిశీలించారు. హుకుంపేట నుంచి కన్యకాపరమేశ్వరి టెంపుల్, గంటస్తంభం, మూడులాంతర్లు కూడలిలో పర్యటించారు. అనంతరం మూడులాంతర్లు కూడలి వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జాతర బందోబస్తుకు విశాఖ నుంచి సిబ్బందిని నియమిస్తామన్నారు. ఉగ్రవాద భావజాలంతో నగరానికి చెందిన సిరాజ్ అరెస్టు నేపథ్యంలో జాతరలో ఇలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. నగరంలోని పలు ప్రాంతాలను స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ శాఖలు జల్లెడపడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం విజయనగరం రూరల్, మహిళా పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఆయన వెంట సీఐలు ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్ఐలు రవి, లక్ష్మీ ప్రసన్నకుమార్, కృష్ణమూర్తి, మురళి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.పంట పొలాల్లో గజరాజులుపార్వతీపురం రూరల్: దాదాపు 11 నెలల విరామం తరువాత ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోకి బుధవారం రాత్రి ప్రవేశించింది. బండిదొరవలస, పెదమరికి, చినమరికి గ్రామాల సమీపంలోని పంటపొలాల్లో సంచరించింది. వరి, మొక్కజొన్న, అరటి, రాగులు, కూరగాయలు పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: మహిళా పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి విజయనగరంలోని రాజీవ్ స్టేడియం, మేదరవీధికి చెందిన గ్రంధి పైడిరాజు అలియాస్ రాజు (38)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.2 లక్షలను మంజూరు చేయాలని గురువారం తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మేదరవీధికి చెందిన గ్రంధి పైడిరాజు ఓ బాలికను ఏప్రిల్ నాలుగవ తేదీన స్కూటీపై వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఘోషా ఆస్పత్రిలో తల్లి చేర్పించి పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెట్ట ఖజానారావు వాదనలు వినిపించారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్సై కేవీ నరసింహారావు, హెచ్సీలు సీహెచ్.రామకృష్ణ, కేఏ నాయుడు, కానిస్టేబుల్స్ కె.గోవింద, జి.సూరపు నాయుడు, పి.రమేష్, కె.నాగమణిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
నిర్వాసితుల సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడాలి
చికెన్శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని, ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని, గురువారం నాటి నిరసన కార్యక్రమంలో నిర్వాసితులు డిమాండ్ చేశారు. జిందాల్ యాజమాన్యం అక్రమంగా తమ భూముల్లో ప్రవేశించి యేళ్ల వయస్సున్న చెట్లు కొట్టించిందని, అన్యాయంగా భూములు ఆక్రమించి, అక్రమ కేసులు పెట్టి బెదిరించారని, పోలీసుల నిర్బంధంలో నిర్వాసితులను ఉంచి, గొంతు నొక్కేశారని వాపోయారు. జిందాల్ గతంలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకుండా, భూములు ఇచ్చిన రైతులను రోడ్డున నెట్టారన్న నిజాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించాలని నిర్వాసితులు కోరారు. -
వృద్ధురాలి మృతి
గరుగుబిల్లి: మండలంలోని శివ్వాం గ్రామ పరిసరాల్లో నాగావళి నది ఒడ్డున గురువారం ఉదయం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్సై ఫకృద్దీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నల్ల కాంతం దమయంతి(59) కొన్నేళ్లుగా మతిస్థిమితం లేకపోవడంతో రావుపల్లి, శివ్వాం గ్రామాల్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్త, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. నాలుగు రోజుల నుంచి రావుపల్లిలో గాని, శివ్వాంలో గాని కనిపించకపోవడంతో మృతురాలి అన్నయ్య చంద్రరావు స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు గాలించి గురువారం శివ్వాం గ్రామపరిధిలో నాగావళి నది ఒడ్డున మృతదేహాన్ని గుర్తించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై తెలిపారు.గాయపడిన వ్యక్తి మృతిలక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో మల్లివీడు జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వనం ఈశ్వరరావు(57) కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై నవీన్పడాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండలం చిన్నిపాలెం గ్రామానికి చెందిన ఈశ్వరరావు తన సమీప బంధువు ఎస్.రామకృష్ణతో కలిసి మండలంలోని లింగంపేట గ్రామంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్తుండగా మల్లివీడు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ పడిపోయారు. దీంతో బైక్ వెనుక కూర్చున్న ఈశ్వరరావు తీవ్ర గాయాలు పాలవగా విశాఖ కేజీహెచ్కు తరలించాచగా చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.చెరువులో యువకుడి గల్లంతుబొబ్బిలి: పట్టణంలోని గొల్లపల్లికి చెందిన వర్రి మధు ఆ గ్రామ వెంగళరాయ సాగర్ చెరువులో గల్లంతైనట్లు తండ్రి దాడియ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో తాపీ పని చేసుకుని జీవించే తన మూడవ కుమారుడు చెరువులో స్నానం చేసి వస్తానని సైకిల్పై వెళ్లి తిరిగి రాలేదు. చివరకు వెతకగా చెరువు గట్టుపై కుమారుడి బట్టలు, సైకిల్ ఉన్నట్లు కుటుంబసభ్యులు గుర్తించి ఫిర్యాదు చేయగా ఏఎస్సై డి.కొండల రావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు.జీతాల బకాయి చెల్లింపునకు చర్యలుపార్వతీపురం రూరల్: ‘అమ్మను కాపాడే అతివకే గండం’ అని బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి స్పందించారు. గిరిజన గర్భిణుల వసతిగృహాల సిబ్బందికి బకాయి పడిన పదినెలల జీతాలను చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే భవిష్యత్లో వసతిగృహాలకు పూర్తిస్థాయి పోస్టులు మంజూరైతే వారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. -
నేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి
● గంజాయి వ్యాపారస్తుల ఆస్తులు అటాచ్ చేయాలి ● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలో నేరాల నియంత్రణపై దృష్టిసారిస్తూ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని, అలాగే గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టే వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్వీ మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో తన కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మాసాంతపు నేరసమీక్ష సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీచేశారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై హిస్టరీ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో తప్పనిసరిగా ప్రతిరోజూ డ్రోన్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న హత్య, ఆస్తి, మహిళలపై నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహించాలని సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టిసారించి సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా. వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సోషల్మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఎస్బీ సీఐ రమేష్తో పాటు మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
ఏఓబీలో ఎకై ్సజ్ దాడులు
● 730 లీటర్ల సారా, 9700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దాడుల్లో భారీగా సారా, సారా తయారీకి ఉంచిన బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనాథుడుడు, ఏఈఎస్ ఎ.సంతోష్ల ఆదేశాల మేరకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలు సందుబడి, రంబళబ లబాయ్, రేగుల పాడులలో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 9700 లీటర్ల బెల్లం ఊట, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 730 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఒడిశా సరిహద్దు నుంచి సారా రవాణా చేస్తున్న వారి పేర్లు, పూర్తి సమాచారం తమ వద్ద ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్ఓ కె.హేమలత కోరారు. ఈ మేరకు గురువారం ఆమె తన చాంబర్లో గుర్తింపు ఉన్న కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేందంరం ఓటర్ల నివాసాలకు 2కి.మీ పరిధిలో, 800 నుంచి 1200మంది ఓటర్లు ఉండేలా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఎక్కడైనా మార్పులు, చేర్పులు అవసరమని గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పార్టీల ప్రతినిధులకు ఆమె సూచించారు. అదేవిధంగా పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్లెవెల్ ఏజెంట్ను నియమించాలని వారు బూత్లెవెల్ అధికారులతో కలిసి పనిచేసి ఓటరు జాబితాలోని తప్పులు సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఆర్ఓ కె.హేమలత -
వరి పంటపై తెగుళ్ల దాడి
● నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న రైతులు ● ఎకరాకు రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు ● పట్టించుకోని వ్యవసాయ శాఖ విజయనగరం ఫోర్ట్: అన్నదాతను కష్టాలు వీడడం లేదు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఆందోళన చెందారు. ఆలస్యంగా వర్షాలు కురవడంతో అష్టకష్టాలు పడి వరి పంట సాగు చేశారు. పంటకు ఎరువు వేద్దామంటే కూటమి సర్కార్ రైతులకు దొరకకుండా చేసింది. యూరియా కోసం అన్నదాతలు ఎన్నడూ లేనివిధంగా పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో యూరియా కోసం రైతుల తోపులాటలు, ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో అన్నతాతకు అన్నీ కష్టాలే. తాజాగా వరి పంటను వివిధ రకాల తెగుళ్లు అశించాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి పంటను సాగు చేస్తే ఒకదాని తర్వాత మరో కష్టం వచ్చి పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 95 వేల హెక్టార్లలో వరి సాగు జిల్లాలో వరి పంట 95 వేల హెక్టార్లలో సాగైంది. వరిపంటకు కొన్ని ప్రాంతాల్లో బాక్టీరియా తెగులు, మరి కొన్ని ప్రాంతాల్లో పొడ తెగులు అశించగా, కొన్ని ప్రాంతాల్లో ఆకుముడత తెగులు అశించింది. మరికొన్ని ప్రాంతాల్లో సుడిదోమ అశించింది. వేలల్లో ఖర్చు చేస్తున్న రైతులు వరిపంటకు అశించిన తెగుళ్ల నివారణకు రైతులు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. వరిపంటకు రెండు, మూడు తెగుళ్లు అశించడంతో వాటిని నివారించేందుకు పురుగు మందుల కోసం రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. సూచనలు ఇచ్చే వారేరీ? వరి పంటకు తెగుళ్లు, చీడపీడలు అఽశించిన నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి పంటకు అశించిన తెగులుకు ఏ పురుగు మందు పిచికారీ చేయాలో తెలియక రైతులు నేరుగా పురుగు మందుల డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే మందులనే పంటకు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల సరైన మోతాదులో, సరైన మందు పిచికారీ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. కానరాని వ్యవసాయ సిబ్బంది పర్యటనలు రైతుల పొలాల్లో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సిబ్బంది పర్యటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లయితే వరిపంటకు అశించే తెగుళ్లు, చీడపీడలను గుర్తించి అక్కడికక్కడే రైతులకు సూచనలు, సలహాలు, నివారణ చర్యల గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. పొలం బడి కార్యక్రమం కూడా తూతూ మంత్రంగానే జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ సిబ్బంది, అధికారులు కార్యాలయాలకే పరిమితమ వుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.యూరియా పంపిణీలో సిబ్బంది బిజీ వరి పంటకు తెగుళ్లు అశించినట్లు గుర్తించాం. యూరియా పంపిణీలో ఇంతవరకు వ్యవసాయ సిబ్బంది బిజీగా ఉన్నారు. పొలం బడి కార్యక్రమాల్లో రైతులకు సూచనలు, సలహాలు అందించనున్నాం. రైతులు డీలర్ దగ్గరికి వెళ్లినప్పడు వ్యవసాయ సిబ్బందికి ఫోన్ చేసి వారు చెప్పిన పురుగు మందులను మాత్రమే వినియోగించాలి. లైసెన్సులు లేకుండా నేరుగా గ్రామాలకు తెచ్చే డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయవద్దు. భారతి, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
ఉత్సాహంగా సైనిక్ స్కూల్ క్రీడా సంబరాలు
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక్ పాఠశాల వార్షిక క్రీడా సంబరాలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కోరుకొండ సైనిక్ పాఠశాల సైకోర్ స్పోర్ట్స్ మైదానంలో నిర్వహించిన 64వ వార్షిక అథ్లెటిక్స్ మీట్ను, పాఠశాల ప్రిన్సిపాల్ గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో సైనిక పాఠశాలలోని శాతవాహన, చాళుక్య, గజపతి, గుప్తా, మొఘల్ హౌస్లకు చెందిన సీనియర్ విద్యార్థులు, అలాగే పాండ్య, మౌర్య, పల్లవ, కాకతీయ హౌస్లకు చెందిన జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని, ప్రతి విద్యార్థి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి ఆడాలని సూచించారు. -
వెబ్ ల్యాండ్లో తప్పులు సరిచేయాలి
● రెవెన్యూ అధికారులను ఆదేశించిన జేసీ పార్వతీపురంటౌన్: జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది తెలిపారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి రెవెన్యూ, రీసర్వే, వెబ్ ల్యాండ్ కేసులపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. మానవీయకోణంలో పరిష్కరించేందుకు కృషిచేయాలని చెప్పారు. రికార్డుల మేరకు సమస్యల పరిష్కారం ఉండాలని, పరిష్కారం కాని వాటిపై అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రీ సర్వే పక్కాగా ఉండాలని తేల్చిచెప్పారు. వెబ్ ల్యాండ్లో ఉన్న తప్పులు సరిచేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఇప్పటికే పార్వతీపురంలో జరిగిందని, పాలకొండలో కూడా నిర్వహించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలుగంట్యాడ: మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన పంకుంతల తులసి అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తుండగా గొడియాడ సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
మన ఊరు బాగుచేసుకుందాం
● కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి పిలుపు ● స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రారంభం ● 12 మంది పారిశుధ్య కార్మికులకు సత్కారం విజయనగరం: రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగుచేసుకుందామని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కలెక్టరేట్ను 9 విభాగాలుగా విభజించి, వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగించడం ద్వారా పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాత్ నినాదంతో ముందడుగు వేయాలని కోరారు. కనీసం రోజుకో గంటపాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందని సూచించారు. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన ఊరు బాగుండాలంటే అందుకు మనమే ముందుడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ కొంతమంది చెత్తను పారిశుధ్య కార్మికులకు ఇవ్వకుండా, కాలువల్లోను, రోడ్ల పక్కన వేసేస్తున్నారన్నారు. ఈ అలవాటును మానుకోవాలని, కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడే చెత్తను అందజేయాలని సూచించారు. మన విజయనగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవనన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, ఇతర అధికారులు, పలువురు నాయకులు, వివిధ శాఖల సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతపార్వతీపురంటౌన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పరిసరాలు అందంగా కనిపించడంతో పాటు ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరారు. తద్వారా మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ పరిధిలోని 8వ వార్డులో గల కొత్తవలస చెరువు వద్ద స్వచ్ఛత హి సేవ –2025లో భాగంగా ఏక్ దిన్..ఏక్ గంట..ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శ్రమదానం చేయగా, మునిసిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, కౌన్సిలర్ కోరాడ నారాయణరావు, కమిషనర్ జి.శ్రీనివాసరాజు భాగస్వామ్యమై శ్రమదానం చేసి చెరువు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ మనందరి బాధ్యతగా గుర్తెరగాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన సౌత్జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు గుంటూరు జిల్లాలోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో 8 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా,, ముగ్గురు క్రీడాకారులు నాలుగు పతకాలు దక్కించుకున్నారు. పోటీల్లో పి.వసంత 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం, 400 మీటర్ల రిలే పరుగు పోటీలో మరో కాంస్య పతకం కై వసం చేసుకుంది. అలాగే క్రీడాకారిణి దివ్య 400 మీటర్ల రిలే పరుగు పోటీలో కాంస్య పతకం దక్కించుకోగా.. ఎం.హరీష్ 3000 మీటర్ల పరుగు పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. సౌత్జోన్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్లు సతీష్, మధు, శేఖర్లకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్లు అభినందించారు. -
సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్ టూరిజం డే
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలోని టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం వరల్డ్ టూరిజం డే–2025 ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక రంగం సుస్థిరత, సృజనాత్మకత, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో పోషించే కీలక పాత్రను ఈ వేడుకలు ప్రతిబించించాయి. రెండురోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ఫ్లో సైకిల్ రేస్, పోస్టర్ పోటీ, వేస్ట్ టు వండర్స్ వంటి వినూత్న పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ భవిష్యత్తు నిపుణులను సుస్థిర దృక్పథంతో తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం వినూ త్న పోటీల విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బోధన సిబ్బంది ప్రతాప్ కేశరి దాస్, డాక్టర్ అప్పాసాబా, డాక్టర్ కుసుమ్, డాక్టర్ గంగునాయుడు మండల, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ శంకర్ రెడ్డి కోలే, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైద్యరంగంలో ఫార్మసిస్టులు కీలకం
● వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ● రోగులకు అందించింది వారే ● నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో ఫార్మసిస్టులపాత్ర చాలా కీలకమైనది. వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం వారిదే. రోగి వ్యాధి తగ్గించడంలో వైద్యుడి పాత్ర ఎంత ఉంటుందో, ఫార్మసిస్టు పాత్ర కూడా అంతే ఉంటుంది. రోగిని పరీక్షించిన వైద్యుడు వ్యాధి తగ్గడానికి అవసరమైన మందులు రాసి ఇస్తారు. వైద్యుడు సూచించిన మందులను చూసి మార్చకుండా కచ్చితమైన మందులు అందించేది ఫార్మసిస్టులే. గురువారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం. వ్యాధిని తగ్గించడంలో ఫార్మసిస్టులే కీలకం రోగికి మందులు అందించడం ద్వారా ఫార్మసిస్టులు వ్యాధిని తగ్గిస్తారు. అయితే మందులు అందించడంలో ఫార్మసిస్టులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వైద్యుడు సూచించిన మందులు ఒకదానికి బదులు ఇంకొకటి ఇచ్చినా, కాలపరిమితి దాటిన మందులు అందించినా రోగుల ప్రాణాల మీదికి వస్తుంది. కోవిడ్ సమయంలో ఫార్మసిస్టులు వైద్యులతో సమానంగా వారితో కలిసి కోవిడ్ బారిన పడిన వారికి మందులు అందించారు. ప్రపంచంలో మొదటి సారి 2009 సెప్టెంబర్ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారత దేశంలో 2013 లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్లో ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2014లో సెప్టెంబర్ 25నుంచి మన దేశంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫార్మసిస్టులు చేసే పనులు మందులు నిల్వ చేస్తారు. అదేవిధంగా వ్యాక్సిన్ను నిర్దేశించిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో పనిచేసే ఫార్మసిస్టులు పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రులకు మందులు పంపిణీ చేస్తారు. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే ఫార్మసిస్టులు వైద్యులు రాసి ఇచ్చిన చీటీ ప్రకారం రోగులకు మందులు అందిస్తారు. అదేవిధంగా ఆయా ఆస్పత్రులకు ఎన్ని రకాలు మందులు? ఎంత కావాలో? ఆన్లైన్లో ఇండెంట్ పెడతారు. అలాగే మందులు ఇచ్చే మందు రోగులకు ఫార్మసిస్టులు కౌన్సెలింగ్ ఇస్తారు. ఏ రకం మందు ఏ సమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలో వివరంగా తెలియజేస్తారు. జిల్లాలో 1500మందికి పైగా ఫార్మసిస్టులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, మందులు దుకాణాలు అనేకం ఉన్నాయి. పీహెచ్సీలు 50 ఉన్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 18 ఉన్నాయి. సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. బోధనాస్పత్రి, ఘోషా ఆస్పత్రి ఒక్కొక్కటి ఉన్నాయి. అదేవిధంగా 800 వరకు మందులు దుకాణాలు, 200 నుంచి 300 వరకు క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వాటిల్లో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు. -
రోగుల పట్ల చిరాకుపడకూడదు
జిల్లా ఆస్పత్రికి, బోధనాస్పత్రికి రోగులు ప్రతిరోజూ వేలాది మంది వస్తారు. అయితే తొందరగా వెళ్లి పోవాలనే అలచోనతో వారు మందులు త్వరగా ఇవ్వాలని అడుగుతుంటారు. అటువంటి వారి పట్ల చిరాకు పడడం, విసుక్కోవడం చేయకూడదు. ఓపిగ్గా వారికి మందులు అందించి అవి ఏవిధంగా వాడాలో చెప్పాలి. వృద్ధులు, దివ్యాంగులకు త్వరగా మందులు అందించాలి. ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో మూలస్తంభం లాంటి వారు. మందులు అందించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని భగవంతుడు తమకు ఇచ్చిన వరంగా ప్రతి ఫార్మసిస్టు భావించాలి. బమ్మిడి నరసింగరావు, ఫార్మసీ ఆఫీసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మందులు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వైద్యులు సూచించిన మందులు రోగులకు అందించేటప్పడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మందుల కాలపరిమితి, బ్యాచ్ నంబర్ చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కాలం చెల్లిన, రంగు మారిన మందులు రోగులకు అందించకూడదు. రోగులు మందులు ఏవిధంగా , ఏసమయంలో వేసుకోవాలో కౌన్సెలింగ్ నిర్వహించి మందులు అందజేయాలి. బైలపూడిసన్యాసినాయుడు, రాష్ట్ర ఫార్మసిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంకటలక్ష్మి
సంతకవిటి: మండలంలోని సిరిపురం పంచాయతీ బలరాంపేట గ్రామానికి చెందిన బోర వెంకటలక్ష్మి గుంటూరులో జరగనున్న జాతీయ స్థాయి సౌత్జోన్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఈమె గత నెలలో ప్రకాశం జిల్లా చీరాలలోజరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 3 కిలోమీటర్ల రన్నింగ్లో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. డీఐజీని కలిసిన ఎస్పీవిజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ డీఐజీని ఎస్పీ ఎఆర్ దామోదర్ బుధవారం రేంజ్ కార్యాలయంలో కలిశారు. డీఐజీని కలిసిన ఎస్పీ దామోదర్ మర్యాదపూర్వకంగా పూలమొక్కను ఈ సందర్భంగా అందజేశారు. ఎస్పీగా చార్జ్ తీసుకున్న దామోదర్కు డీఐజీ గోపీనాథ్ జెట్టి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నివారణ, సైబర్నేరాలు అరికట్టడంపై దృష్టి పెట్టాలని, వాటిపట్ల ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే రహదారి ప్రమాదాలపట్ల ప్రయాణికులను అప్రమత్తం చేసేలా చైతన్యకార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీకి డీఐజీ స్పష్టం చేశారు. విజయనగరం అర్బన్: జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ కొత్తపల్లి వెంకటేష్కు పీహెచ్డీ డిగ్రీ లభించింది. ప్రొఫెసర్ జి.స్వామినాయుడు పర్యవేక్షణలో ఆయన పరిశోధన పూర్తి చేశారు. వెంకటేష్ చేసిన పరిశోధనలో అభివృద్ధి చేసిన మెటీరియల్ అధిక బలం, తుప్పు నిరోధకత, ఘర్షణ నిరోధకత కలిగి ఉండడంలో వైమానిక, నౌకాదళ, రక్షణ రంగాల్లో వినియోగానికి దోహదపడనుందని నిపుణులు తెలిపారు. వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందిన మొట్టమొదటి ఫుల్టైమ్ రీసెర్చ్ స్కాలర్గా వెంకటేష్ పేరు నమోదైనట్టు స్వామినాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటేష్ను ఎన్ఐటీ నాగపూర్ ప్రొఫెసర్ డి.రవికుమార్, పలువురు ప్రొఫెసర్లు అభినందించారు. భర్త ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: ఆ దంపతులకు పైళ్లె నాలుగేళ్లయింది. భార్యలో లోపమో భర్తలో లోపమో తెలియదు కానీ వారికి సంతానం కలగలేదు. డాక్టర్కు చూపిద్దామనుకున్న సమయంలోనే భర్త నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఇంటికి ఆలస్యంగా రావడం అదే పనిగా మద్యం తాగి వస్తుండడంతో విసిగిపోయిన భార్య భర్తను విడిచిపెట్టి కన్నవారింటికి వచ్చి ఉంటోంది. దీంతో మానసిక వేదనకు గురైన భర్త నాగరాజు విజయనగరంలోని గాజులరేగ రైలు పట్టాల వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంతకుముందే తన స్నేహితుడికి ఫోన్ చేసి ఇంట్లో బాధ మొత్తం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలికి స్నేహితుడు వచ్చి నాగరాజును హాస్పిటల్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కోర్టు చొరవతో బహిరంగ నిరసన
శృంగవరపుకోట: ఎట్టకేలకు కోర్టు జోక్యంతో జిందాల్ నిర్వాసితులు బుధవారం బహిరంగంగా నిరసన తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా జిందాల్ నిర్వాసితుల నిరసనలకు పోలీసులు అనుమతు లు నిరాకరించారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు నిర్వాసితులు నిరసన తెలిపేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు మూలబొడ్డవర రైతు సేవా కేంద్రం వద్ద నిరసన శిబిరం ఏర్పాటుకు నిర్వాసితులను అనుమతించారు. దీంతో బుధవారం నిర్వాసితులు తమ నిరసన శిబిరాన్ని బొడ్డవర నుంచి మూలబొడ్డవరకు మార్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ నియంతల్లా వ్యవహరించిన పోలీసులు ఎట్టకేలకు కోర్టు అదేశాలతో వెనక్కు తగ్గారన్నారు. రైతుసంఘం నేత చల్లా జగన్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం అటు కోర్టులో, ఇటు బయట తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. శాసనమండలిలో జిందాల్ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ రఘురాజుకు ధన్యవాదాలు తెలిపారు. -
వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: ఆశీలమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ సమీపంలో వి–జ్యూయలరీ మార్ట్ రెండో షోరూమ్ను శ్రీకన్య ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎన్.వి.ఎస్.గురుమూర్తి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వి–జ్యూయలరీ మార్ట్ భాగస్వాములు కోలా బాబురావు, కాకి గంగరాజు, పట్నాల శ్రీనివాసరావు, వూన వినీత్ మాట్లాడుతూ విమార్ట్ ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలను గ్రాము రూ.9,987 చొప్పున తరుగు 6.96 శాతం నుంచి పొందవచ్చన్నారు. అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదని, జీఎస్టీని కస్టమర్ తరుపున తామే చెల్లిస్తామన్నారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. -
బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం
పార్వతీపురం రూరల్: మండలంలోని కృష్ణపల్లి పంచాయతీలో అధికార టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పంచాయతీ ఉపసర్పంచ్ లంక శ్రీదేవిపై వారు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం, అవసరమైన సభ్యుల కోరం లేకపోవడంతో వీగిపోయింది. కనీస సభ్యుల హాజరును కూడా నిర్ధారించుకోకుండా అవిశ్వాసానికి సిద్ధమవడం, స్థానిక టీడీపీ నాయకత్వ అవగాహనలేమిని, ప్రణాళికా రాహిత్యాన్ని బయటపెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. ఏం జరిగిందంటే..? కృష్ణపల్లి పంచాయతీ దివంగత సర్పంచ్ బోను రామునాయుడు కొద్ది కాలం క్రితం మరణించడంతో, ఉపసర్పంచ్ లంక శ్రీదేవి ఇన్చార్జ్ సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పదవి నుంచి తొలగించేందుకు అధికార టీడీపీకి చెందిన వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీనిపై బుధవారం పంచాయతీ కార్యాలయంలో సబ్ కలెక్టర్ డా.ఆర్.వైశాలి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీలో సర్పంచ్తో పాటు 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2/3వ వంతు కనీసం ఏడుగురు సభ్యులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, తీర్మానానికి మద్దతిస్తారని భావించిన సభ్యులతో సహా, సమావేశానికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశానికి కోరం కొరవడిందని, అందువల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. సొంతంగా ప్రతిపాదించిన తీర్మానానికే తగినంత మంది సభ్యులను సమీకరించుకోలేకపోవడంతో టీడీపీ నాయకులు అభాసుపాలయ్యారు. కోరం లేక వీగిపోయిన అవిశ్వాస తీర్మానం -
● మేము ఏం తప్పుచేశాం..
మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామానికి చెందిన నీలాపు సత్యనారాయణ ముగ్గురు పిల్లలు సాయి, గణేష్, హైమావతి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదుతున్నారు. సత్యనారాయణ భార్య చిన్నమ్మలు 2021లో మృతి చెందింది. అప్పటి నుంచి కూలీనాలీ చేసి పిల్లలను సాకుతున్నానని, ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందలేదంటూ సత్యనారాయణ వాపోతున్నాడు. హెచ్ఎం, సచివాలయం సిబ్బంది చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తంచేశాడు. గతంలో అమ్మఒడి అందేదని, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పథకం వర్తింపజేయాలంటూ వేడుకుంటున్నాడు. – మెరకముడిదాం -
తపాలా బీమా లక్ష్యం రూ.1550 కోట్లు
బొబ్బిలి: రాష్ట్రంలో తపాలా బీమా లక్ష్యం ఈ ఏడాది రూ.1550కోట్లుగా నిర్ణయించినట్లు ఆ శాఖ ఎ.డి జి.శివనాగరాజు తెలిపారు. ఈ మేరకు బొబ్బిలిలో డివిజన్ స్థాయిలో మూడు రోజుల జరగనున్న సేవింగ్స్ పోస్టల్ మేళాను ర్యాలీతో బుధవారం ప్రారంభించారు. పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అధ్యక్షతన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది లక్ష్యాన్ని 95 శాతం చేరుకున్నామన్నారు. దీనికి 30 శాతం అదనంగా ఈ ఏడాది లక్షాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల మేళాలో రూ.30 కోట్ల బీమా సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నా రు. ఇందులో భాగంగా మొదటిరోజునే రూ.10కోట్ల వ్యాపార లక్ష్యం పూర్తయిందని తెలిపా రు. లక్ష రూపాయల ప్రీమియం సాధించిన ఉద్యోగులకు సీజీఎం చేతుల మీదుగా ఘన సత్కారం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల మందికి బీమా చేశామని, పార్వతీపురం డివిజన్లో రూ.కోటి 25లక్షల బీమా ప్రీమియం లక్ష్యం కాగా దానిని మించి వ్యాపారం చేయడం సంతోషమన్నారు. జీఎస్టీ లేకుండా బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఏఎస్పీలు ఎం.సత్యనారాయణ, ఐ.మురళి మాట్లాడుతూ రూ.550తో రూ.10లక్షల బీమా, రూ.2,199 ప్రీమియంతో కుటుంబ సభ్యులందరికీ రూ.15లక్షల ఆరోగ్య బీమాను అందజేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీమా ప్రీమియం సేకరణ లక్ష్యాలను సాధించిన వారిని మెమెంటోలతో సత్కరించి అభినందించా రు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, జీడీఎస్లు, బీపీఎంలు, ఏబీపీఎంలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టల్ ఎ.డి శివనాగరాజు -
యూరియా లభించేది ఎప్పుడు ‘బాబూ’..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. వరి చేను కొన్నిచోట్ల పొట్టదశకు చేరుకుంది. ఇప్పటికీ యూరియా లభించడం లేదు. బస్తా యూరియా కోసం గంటల తరబడి ప్రైవేటు దుకాణాలు, ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులంటే ఇంత చిన్నచూపా అంటూ మదనపడుతున్నారు. ఓటేసిన పాపానికి యూరియా కోసం రోడ్డెక్కించారంటూ నిందిస్తున్నారు. – సంతకవిటి/ దత్తిరాజేరు/గుర్ల గుర్ల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల పడిగాపులు -
సిరిమాను వచ్చింది..సంబరం తెచ్చింది
విజయనగరం టౌన్/గంట్యాడ: గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించిన పైడితల్లి సిరిమాను, ఇరుసుమానులను భక్తుల జయజయ ధ్వానాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, పసుపు నీటి చల్లదనాల మధ్య బుధవారం తరలించారు. ముహూర్తం ప్రకారం ఉదయం 8.30 గంటలకు సిరిమానుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆలయ పూజరి బంటుపల్లి వెంకటరావు, ఆలయ ఈఓ శీరిష తదితరులు గొడ్డలివేటు వేసి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్ సీపీ యువజన నాయకుడు ఈశ్వర్ కౌశిక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్.వి.వి.రాజేష్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు తదితరులు సిరిమాను చెట్టుకు పూజలు చేశారు. చెట్టుపై గొడ్డలివేటు వేశారు. అమ్మవారు జిల్లా ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కొండతామరాపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు సిరిమాను చెట్లవద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహామూర్తి, సర్పంచ్ కొడెల ముత్యాలనాయుడు, తహసీల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● సిరిమాను చెట్టు తరలింపు ఇలా.. పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను, ఇరుసుమానులను కొలతల ప్రకారం వడ్రంగులు ముక్కలు చేసి ఎడ్లబండిపై కొండతామరాపల్లి గ్రామం నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బయలుదేరారు. గంట్యాడ, నరవ, లక్కిడాం, రామవరం, మీదుగా అయ్యన్నపేట కూడలికి రాత్రి 10 గంటలకు సిరిమాను చేరుకుంది. కణపాక, కె.ఎల్.పురం, పావనీనగర్, ఉడాకాలనీ, కంటోన్మెంట్, బొగ్గులదిబ్బ, దండుమారమ్మ తల్లి ఆలయ సమీప ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారికి చల్లదనం చేశారు. పోలీస్ బ్యారెక్స్, ఆర్సీఎం స్కూల్, ఎత్తుబ్రిడ్డి మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డులోని వనంగుడి వద్దకు చేరుకున్న సిరిమానుకు ప్రత్యేక పూజలు చేవారు. అక్కడ నుంచి గాడీఖానా, ఎన్సీఎస్ రోడ్డు, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి మీదుగా హుకుంపేట రామమందిరం నుంచి పూజారి ఇంటివద్దకు రాత్రి 2 గంటల తర్వాత సిరిమాను చేరుకుంది. గురువారం నుంచి చింతచెట్లను సిరిమాను, ఇరుసుమానుగా మలిచే ప్రక్రియను వడ్రంగులు చేపట్టనున్నారు. ● సిరిమాను తరలింపులో అపశృతి సిరిమాను తరలించే ప్ర క్రియలో అపశృతి చో టుచేసుకుంది. రాత్రి 7.30 గంటలకు రామవరం వరకూ సజావు గా ఎడ్లబండిపై వస్తు న్న సిరిమాను బరువు కు బండి చక్రం ఒక్క సారి విరిగింది. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే కర్ర లతో దానిని నిలబెట్టించి, వడ్రంగుల సాయంతో చక్రాలను మార్చా రు. అక్కడ నుంచి యువకులే బండిని లా గారు. ఎట్టకేలకు హుకుంపేటకు సిరిమానును చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొండతామరాపల్లి నుంచి హుకుంపేటకు సిరిమాను చెట్టు తరలింపు దారి పొడవునా పసుపునీటితో చల్లదనం సిరిమాను చెట్టును తాకి తన్మయత్వం పొందిన భక్తులు నేటి నుంచి హుకుంపేటలో సిరిమానుగా మలిచే ప్రక్రియ -
మడ్డువలస వద్ద 9వేల క్యూసెక్కుల అవుట్ఫ్లో
వంగర: అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు మడ్డువలస ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద బుధవారం 64.31 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు.దాడితల్లికి మహానైవేద్యంబొబ్బిలి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొబ్బిలి పట్టణం బైపాస్ రోడ్డులోని దాడితల్లి ఆలయంలో అమ్మవారికి 108 రకాల ప్రసాదాలు, స్వీట్లు, పండ్లతో భక్తులు బుధవారం మహా నైవేద్యం సమర్పించారు. అన్నపూర్ణగా అవతరించిన అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పురోహితుడు పిండిప్రోలు మణికుమార్ శర్మ అమ్మవారికి అర్చనలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
కొత్తవలసలో భారీ వర్షం
● ముంచెత్తిన వరద నీరుకొత్తవలస: కొత్తవలసను మంగళవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. గృహాలు, షాపుల్లోకి వరదనీరు పొంగి పారడంతో పట్టణవాసులు నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, మేజర్ పంచాయతీ కార్యాలయం, అరకు–విశాఖ జాతీయ రహదారి, కొత్తవలస–విజయగనరం రోడ్డు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధిక వరద కారణంగా కొత్తవలస రైల్వే అండర్ బ్రిడ్జిని రైల్వే అదికారులు తాత్కాలికంగా మూసేశారు. రైల్వే పోలీసులు బ్రిడ్జి వద్ద బందోబస్తును నిర్వహించారు. కాగా కొత్తవలసను కొద్ది నెలలుగా వర్షం నీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మండల కేంద్రంలో గల వీరసాగరం చెరువు నుంచి వచ్చే మిగులు నీరు గతంలో కాలువల వెంబడి పారేది. ప్రస్తుతం కాలువలను పలువరు ఆక్రమించి పూర్తిగా కప్పేశారు. దీంతో వరద నీరు రోడ్లుపై పొంగి పారుతోంది. అధికారులు దృష్టి సారించి ఆక్రమణలను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. పొంగిపొర్లుతున్న గవరపాలెం గెడ్డకొత్తవలస: మండల కేంద్రం నుంచి సబ్బవరం రోడ్డులో గవరపాలెం గెడ్డ మంగళవారం కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతోంది. గెడ్డ అత్యంత ఉద్రిక్తంగా పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస నుంచి నిత్యం ఈ రోడ్డులో అనకాపల్లి జిల్లా సబ్బవరం,కొత్తవలస మండలం దెందేరు.సంతపాలెం, గులివిందాడ, గనిశెట్టిపాలెం తదితర గ్రామాలకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గెడ్డ పొంగి పారడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. రాత్రి వరకు వరదనీరు తగ్గకపోవడంతో వాహనదారులు నిరీక్షించారు. -
ఇటీవల ఇద్దరు యువకులు, ఇద్దరు చిన్నారుల మృతి
పార్వతీపురం రూరల్: ఇప్పటికే కాలానుగుణంగా వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగి నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. అయితే ఈత సరదాతో కొందరు చిన్నారులు పాఠశాలల సెలవు దినాల్లో స్నేహితులతో కలిసి నేలబావుల వద్ద, చెరువుల వద్ద, వాగులు, గెడ్డల వద్ద ప్రమాదకర స్థాయిలో ఈతకొట్టేందుకు వెళ్తున్నారు. లోతు పరిమాణం, ప్రవాహం అంచనా వేయలేని పరిస్థితుల్లో యువకులు, చిన్నారులు నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతిచెంది తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగులుస్తున్నారు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి మృత్యుఒడిలోకి..దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సీతంపేట మండలం అచ్చబ గ్రామానికి చెందిన కొండగొర్రి మౌనిక(12), పాలక అంజలి(11) తమ గ్రామంలో ఉన్న చినబంద చెరువు దగ్గరకు ఈత సరదాతో వెళ్లి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు విడిచారు. ఇంట్లో తల్లిదండ్రులు బయట ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో చిన్నారులు కాస్త ఈత సరదాతో ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. స్థానికంగా ఉన్న ముత్యాలు బాలికల ఆశ్రమ పాఠశాలలో 6,7 తరగతులు చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థులు ఇటీవల దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి సోమవారం దుర్మరణం చెందారు. వివాహ వేడుకకు వచ్చి మృతి.. గడిచిన మే నెల 20న పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న సాకిగెడ్డలో నూజివీడు ప్రాంతం నుంచి వచ్చిన ఐదుగురు స్నేహితులు ఈత సరదాతో గెడ్డలో దిగడంతో వారిలో ఈత రాని ఈశ్వర్కుమార్(16), నగిరెడ్డి రాము(16) ప్రవాహంలో ముగిని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు గమనించాలి ఆటలు, ఈత సరదాపై తల్లిదండ్రులకు చెబితే వద్దంటారని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అవగాహన రాహిత్యంతో పిల్లలు స్నేహితులతో కలిసి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే తల్లిదండ్రులు వారికి అర్థమయ్యే విధంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఘటనలను నెమ్మదిగా వివరిస్తూ అవగాహన కల్పించాలి. అలాగే ఎప్పటికప్పుడు సెలవు దినాల్లో పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. – కె. మురళీధర్, సీఐ, పార్వతీపురం పట్టణం -
సిరిమాను చెట్టును దర్శించిన బొత్స, బెల్లాన, చిన్న శ్రీను
గంట్యాడ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును మండలంలోని కొండతామరపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మజ్జి శ్రీనివాస్రావు(చిన్న శ్రీను), గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిరిమాను చెట్టుకు పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏటా పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును దర్శించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారు జిల్లా ప్రజల అందరిని చల్లగా చూడాలని కోరుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.సూర్యనారాయణ రాజు(పులిరాజు), పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జాగరపు అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ జామి మండల అధ్యక్షుడు గొర్లె రవికుమార్, వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, గంట్యాడ మండల యువజన విభాగం అధ్యక్షుడు కొండెల విజయ్కుమార్, కొండతామరాపల్లి సర్పంచ్ కోడెల ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నంపైడితల్లి పండగ
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను విజయవంతం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ ఎఆర్.దామోదర్ సూచించారు. అమ్మవారి చదురుగుడి పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు, సిరిమాను తిరిగే ప్రాంతాలను మంగళవారం వేకువజామున అధికారులతో కలిసి వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం మనందరి బాధ్యతని గుర్తు చేశారు. పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య శిబిరాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. జాతర ప్రాంగణంలో శిథిలావస్ధలో ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిరిమాను జాతరలో భక్తుల రక్షణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ వ్యవస్థ, మహిళల భద్రత, రాత్రి పహారా వంటి చర్యలను కఠినంగా అమలు చేస్తామన్నారు. భక్తులు శాంతిభద్రతల నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిరిమాను జాతర ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ అధికారులు ఈ ఉత్సవం ఉత్తరాంధ్రలో ఏకత్వానికి ప్రతీకగా, భక్తుల విశ్వాసం నిలబెట్టే విధంగా ప్రతి శాఖ ముందంజలో ఉంటూ పని చేయాలని సూచించారు. ముందుగా అమ్మవారి క్యూలైన్లు, సిరిమాను తిరిగే అమ్మవారి ఆలయం నుంచి కోట వరకూ పరిశీలన చేశారు. ప్రసాదాల పంపిణీ, మీడియా పాయింట్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పూజారి ఇంటి వద్ద చేపట్టనున్న సిరిమాను తయారీ, అక్కడ నుంచి గుడి వరకూ సిరిమాను తరలించే విధానం తెలుసుకుని ఆ మార్గమంతా పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో కీర్తి, ఏసీపీ సౌమ్యలత, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీషా, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, తహసీల్దార్ కూర్మనాఽథ్, సిరిమాను అధిరోహకులు బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. ● అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సిరిమాను జాతర ● సిరిమాను తిరిగే ప్రదేశాలను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ -
పిడుగు పడి పశువుల కాపరి మృతి
బొండపల్లి: పాడి పశువులను మేతకు తోలిన పశువుల కాపరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బొండపల్లి మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని పెద్దమజ్జి పాలెం గ్రామానికి చెందిన సుంకరి సూర్యనారాయణ(63) తన పాడి పశువులను మేత కోసం బొండపల్లి మండలంలోని వెదురువాడ గ్రామ రెవెన్యూలోని చింతల తోపు వద్దకు తోలాడు. ఈ క్రమంలో పశువులను మేపుతూ కాపలాగా ఉండగా సాయంత్రం ఉరుములు,మెరుపుల వర్షంతో పాటు పిడుగులు పడగా పిడుగు పాటుకు గురై అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావుతో పాటు, ఎస్సై యు.మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
కారు ఢీకొని యువకుడి మృతి
విజయనగరం క్రైమ్: నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్న 20ఏళ్ల యువకుడిని ఓ కారు ఢీ కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ తెలిపారు. విజయనగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద గణేష్ (20) అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఆ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో కింద పడిన గణేష్ తలకు బలమైన గాయం తగలడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స కోసం బంధువులు తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అవడంతో చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. -
బస్సులో ఆగిన గుండె
శృంగవరపుకోట: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి అదే బస్సులో తుదిశ్వాస విడిచాడు. స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న కె.ఈశ్వరరావు మంగళవారం ఉదయం విశాఖ –కించుమండ సర్వీస్కు కండక్టర్గా వెళ్లారు. విశాఖ నుంచి ఎస్.కోట వస్తుండగా మధ్యాహ్నం 12.30గంటల సమయంలో బస్సు పెందుర్తి– సరిపల్లి మధ్య ఉండగా కండక్టర్ ఈశ్వరరావు సీటులోనే గుండె పట్టుకుని కూలిపోయారు. ఆయనను గమనించిన ప్రయాణికులు డ్రైవర్కు చెప్పడంతో బస్సు ఆపిన డ్రైవర్ హుటాహుటిన పెందుర్తి పీహెచ్సీకి కండక్టర్ను తరలించారు. కండక్టర్ ఈశ్వరరావును పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్ మృతదేహాన్ని ఎస్.కోట తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈశ్వరరావు పార్థివ దేహాన్ని గంట్యాడ మండలంలో సొంత గ్రామమైన వసంతకు తరలించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ● విధినిర్వహణలో కండక్టర్ మృతి -
కొత్త అధికారులకు సవాల్గాపైడితల్లి జాతర!
● 2వేల మంది సిబ్బందితో బందోబస్తువిజయనగరం క్రైమ్: జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్, ఎస్పీలు అనుభవం ఉన్న అధికారులే. ఇద్దరూ వారి వారి రంగాల్లో సిబ్బంది, అధికారుల చేత పని చేయించిన వారే. ఇద్దరి పరిపాలనా కాలంలో వచ్చే నెలలో జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికే వన్నె తెచ్చి పెట్టే నిర్వహించనున్న పండగ రానుంది. కానీ ఆ పండగ నిర్వహణను సమర్థవంతంగా భక్తులకు ఇబ్బంందులు కలగకుండా గత ఏడాది లాగానే ఈ ఏడాది పండగ ప్రశాంతంగా జరిగిందని సామాన్యులు భావించేలా చేయగలరా అన్నదే ఇద్దరు అధికారుల ముందున్న సవాల్. వాస్తవానికి విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతర మహోత్సవం నిర్వహణ జిల్లా అధికార యంత్రాంగానికి అందె వేసిన చెయ్యి. అందునా దేవాదాయ శాఖ జాతరను ఇట్టే నిర్వహించగలదు. ఎటొచ్చీ జాతర నిర్వహణ ప్రశాంతంగా, సురక్షితంగా ఈ ఏడాది పూర్తి చేయడం అటు దేవాదాయ, ఇటు పోలీస్ శాఖ పైనే ఆధారపడి ఉంది. ఇంతవరకు, ఇన్నాళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయనగరంలో ఉగ్రమూలాలున్న సిరాజ్ వ్యవహారాన్ని ప్రజలు చవిచూశారు. సాంస్కృతిక వారసత్వసంపద కలిగిన విజయనగరంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ను ఎన్ఐఏ పట్టుకోవడం వారం రోజుల పాటు టూటౌన్ పోలీసుల సమక్షంలో విచారణ సాగించడం, ఆపై విశాఖ సెంట్రల్ జైల్లో ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఉన్న సిరాజ్ను ఇక్కడి కోర్టు జడ్జి వెబ్కామ్ ద్వారా విచారణ చేయడంతో సిరాజ్ ఎంతటి ఉగ్రవాదో..అలాగే విజయనగరంలో ఎన్నిచోట్ల బాంబు పేలుళ్లకు పథక రచన చేశాడో ఇప్పటికే పోలీసులు ఓ అంచనాకు వచ్చి ఉంటారు. ఇటువంటి సమయంలోనే కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ల ఆధ్వర్యంలో పైడితల్లి జాతర జరగనుంది. ఇద్దరూ పండగ నిర్వహణకు కొత్తే. మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీషకు కూడా పండగ నిర్వహణ కొత్తే. ఇక జాతర నిర్వహణకు దాదాపు 2 వేల మంది సిబ్బంది అవసరమని పోలీస్ శాఖ గుర్తించింది. పొరుగు జిల్లాల నుంచి కూడా సిబ్బందిని తీసుకువచ్చే పనిలో పడింది. ఈ బందోబస్తు నిర్వహణలో విజయనగరం పరిధిలోని మూడు స్టేషన్ లలో ఒక్క టూటౌన్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ మినహా మిగిలిన వన్ టౌన్, రూరల్ స్టేషన్ల సీఐలకు కొత్తే. ఇక విజయనగరం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆర్.గోవిందరావు అటు లా అండ్ ఆర్డర్, మహిళ, ట్రాఫిక్ విభాగాలకు డీఎస్పీగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక దిగువ స్థాయిలో బందోబస్తు నిర్వహణ చూసే సిబ్బందికి మాత్రం జాతర నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లలో అనుభవం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, వాహనాల పార్కింగ్ల గతేడాదిలాగానే ఎంటెక్ చదివిన పీసీ సింహాచలం వేసిన స్కెచ్ను ఈ ఏడాది కూడా అమలు చేస్తే వాహనదారులు సులభంంగా జాతర కు వచ్చి చూసి తరించి తిరిగి ఇళ్లకు చేరుకోగలుగుతారు. జాతర సమర్థవంతంగా నిర్వహిస్తాం శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతరను సమర్థవంతంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా, నిర్వహిస్తామని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. సిరిమాను ఉత్సవానికి బందోబస్తు నిర్వర్తించడంలో అనుభవం ఉందన్నారు.అమ్మ దయతో సిరిమాను ఉత్సవం గతేడాది లాగానే త్వరగా ముగించేలా చర్యలు చేపడతామని డీఎస్పీ గోవిందరావు తెలిపారు. -
డీఆర్డీఏ ఆధ్వర్యంలో ‘సరస్’
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణివిజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాలను పురస్కరించుకుని సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో సరస్ – 2025 పేరుతో అఖిల భారత డ్వాక్రా బజార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ పథక సంచాలకులు శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. సోమవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీపీఎం, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జంక్షన్ వద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్కన సరస్ నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 250 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 28 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటూ వివిధ రాష్ట్రాల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాలు, ప్రదర్శన చేస్తారన్నారు. మున్సిపల్, పోలీస్, హార్టికల్చర్, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, నాబార్డ్ ప్రభుత్వం శాఖలతో సమన్వయం, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, మంచినీరు, భోజన, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలపై సమీక్ష చేశారు. కార్యక్రమంలో అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి ప్రాజెక్ట్ మేనేజర్ డి.రత్నాకర్, అకౌంట్స్ ఆఫీసర్ బివివిఎస్.దొర తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె.హేమలత, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యంతో 280 వినతులను స్వీకరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం జరుగుతుందన్న ప్రజల నమ్మకం మేరకు అధికారులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతీ అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి : ఎస్పీ నిర్దేశించిన సమయంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సంబంధిత పోలీసు శాఖాధికారులకు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అంశాలు వాస్తవాలైతే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 60 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాలకొండ సబ్ కలెక్టర్, ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించారు. 60 వినతులు వచ్చాయి. అటవీ భూమికి సర్వే చేసి పట్టా ఇప్పించాలని భామిని మండలం బొమ్మికకు చెందిన గణపతి కోరారు. పాఠశాల భవనం మంజూరు చేయాలని లోకొండ గ్రామ గిరిజనులు అర్జీ ఇచ్చారు. వరదగోడ మంజూరు చేయాలని కాంగూడ గ్రామస్తులు విన్నవించారు. కమ్యూనిటీ భవనం నిర్మించాలని కేరాసింగి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని పాలకొండకు చెందిన చల్లా సుధాకర్ కోరారు. కుట్టు మిషన్ ఇప్పించాలని తాటిమానుగూడ గ్రామస్తురాలు సావిత్రి వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీ ఈవో రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ చాంబర్లోనే ఫిర్యాదుల స్వీకరణ
విజయనగరం క్రైమ్: జిల్లాకు ఇటీవల కొత్తగా వచ్చిన ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్లోనే సోమవా రం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎనిమిది భూతగాదాలకు సంబంధించినవి కాగా, కుటుంబ కలహాలకు సంబంధించినవి నాలుగు, మోసాలకు పాల్పడినట్టు ఐదు, నగ దు వ్యవహారాలకు సంబంధించి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్య లత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి. సుధాకర్, ఎస్ఐ ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
25న యూటీఎఫ్ రణభేరి
పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 25న గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న యూటీఎఫ్ రణభేరి సభకు ఉపాధ్యాయులంతా తరలి రావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు పిలుపునిచ్చారు. డీఈవో కార్యాలయం వద్ద రణభేరికి సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. రణభేరి జాతర సందర్భంగా యూటీఎఫ్ గుర్తించిన సమస్యలతో పాటు ఉపాధ్యాయులు కూడా వారి సమస్యలు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞాపనల రూపంలో అందజేశారని అన్నారు. వీటిని క్రోడీకరించి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లు ఉంచనున్నట్టు తెలిపారు. విద్యా రంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించడానికి నిరాకరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి మధ్యంత భృతిని ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, కె.భాస్కరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు
ఎంపికై న పీడీలువిజయనగరం గంటస్తంభం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న 36వ జాతీయ స్థాయి సౌత్జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లా నుంచి ఐదుగురు పీడీలు టెక్నికల్ అఫీషియల్స్గా నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ హరిబాబు ఈ మేరకు ఎంపికై న వారికి సమాచారం అందజేశారు. జిల్లా నుంచి ఎంపికై న వారిలో వి.ఆనంద్కిషోర్, పి.లీలాకృష్ణ, జి.గురునాయుడు, ఎం.రామకృష్ణ, బి.ఎం.శ్రీకాంత్ ఉన్నారు. వీరిని జిల్లా అథ్లెటిక్స్ సంఘం, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు అభినందించారు.