breaking news
Vizianagaram
-
ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి కోటాను భర్తీ చేసిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ సభ్యులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యంనాయుడును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన పాఠశాలల భవనాలను బాగుచేయాలని విన్నవించారు. డీఈఓను కలిసిన వారిలో సంఘ నాయకులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, ఎస్.చిట్టిబాబు, పి.లక్ష్మణరావు, బి.అడివయ్య, వాసుదేవరావు, వి.మల్లేశ్వరరావు, రవి తదితరులు ఉన్నారు. అత్యాధునిక నైపుణ్య శిక్షణ ● ఎస్ఎస్ఐపీఎల్తో నాక్ ఎంఓయూ ● అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ విజయనగరం అర్బన్: జిల్లాలో త్వరలో అత్యాధునిక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నాక్) జిల్లా సహాయ సంచాలకుడు ఎం.సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ రంగంలోని స్వింగ్ స్టేటర్ ప్రైవేట్ లిమిటెడ్తో ఇటీవలే నాక్ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. దీని ప్రకారం తరగతి గదుల్లో సిద్ధాంతపరమైన బోధనతో పాటు ప్రాజెక్టు సైట్లో ప్రాక్టికల్ శిక్షణ, అభ్యర్థులకు అధునాతన పరికరాలు, భద్రతా కిట్లు, రవాణా సౌకర్యం లభిస్తాయన్నారు. స్థానిక శిక్షకులను టీఓటీలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యువతను సర్టిఫైడ్ మిషన్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి ● కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీచేసి నివేదికను అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సీపీపీఎన్డీటీ చట్టం అమలుపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నెలవారీగా జరుగుతున్న స్కానింగ్ వివరాలు, ప్రసవాలు, అనధికారికంగా ఆస్పత్రుల్లో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రశ్నించారు. గర్భస్థ లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రతి స్కానింగ్ సెంటర్లో తప్పనిసరిగా ధరల పట్టికను, లింగనిర్ధారణ చేయడం నేరమని తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సరోగసి కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లా స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసేందుకు డివిజన్ల వారీగా ఆర్డీఓ, డీఎస్పీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, అడిషనల్ డీఎంహెచ్ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్. సూర్యనారాయణ, డీఐఓ అచ్చుతకుమారి, డీపీఎంఓ రవికుమార్రెడ్డి, డీఎస్పీ గోవిందరావు, ఆర్డీఓ దాట్ల కీర్తి, తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ సీతంపేట: ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన వివరాలు తెలియజేస్తానన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్
● ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్ వంగర: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ శాఖ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ డిమాండ్ చేశారు. ఎం.సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. విద్యారంగంలో మూల్యాంకనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసెస్మెంట్ విధానంతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం అన్యాయమన్నారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతిని చెల్లించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 కూర్మినాయుడు, ఏటీపీఎఫ్ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు లంక రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు వై.రామకృష్ణ, చింతాడ అప్పన్నదొర, బుగత ఉమామహేశ్వరరావు, బూరి అచ్చుతరావు, సాయి మురళీ, కె.రవికుమార్, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్కరణల అమలుతో వికసిత్ భారత్
● ఏబీఆర్ఎస్ఎం జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి జి.లక్ష్మీస్ విజయనగరం అర్బన్: నవ భారత్ నిర్మాణానికి జాతీయ విద్యా విధానం–2020 సంస్కరణల అమలు కీలకమని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి గుంథ లక్ష్మీస్ అన్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్– వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యావిధానం–2020 ఆత్మలా ఉంది’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక గౌరవం, విద్యా సంస్కరణలు వంటి చర్యల అమలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమన్నారు. వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుతో విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి, వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధ్యాపకులు ప్రేమాచటర్జీ, బి.కోటయ్య, కె.సురేష్బాబు, బి.వెంకటేశ్వర్లు, ఎం.గంగునాయుడు, పి.కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి
తెర్లాం: తోటపల్లి ప్రధాన కుడికాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తెర్లాం మండలంలోని కవిరాయునివలస గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, తెర్లాం ఎస్సై బి.సాగర్బాబు తెలిపిన వివరాలి లా ఉన్నాయి. సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన జమ్మల శంకరరావు(50) శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటపల్లి ప్రధాన కుడికాలువ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. కాలువలో దిగి పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిపోయాడు. కొద్దిసేపటికి గ్రామస్తులు పొలం పనులకు తోటపల్లి కాలువ వైపు వెళ్తూ నీటిలో పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే బయటకు తీసి పడిపోయిన వ్యక్తి తమ గ్రామానికి చెందిన జమ్మల శంకరరావుగా గుర్తించారు. అప్పటికే శంకరరావు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్తులకు, తెర్లాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తెర్లాం ఎస్సై సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జి.హేమంత్కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య అప్పమ్మ, ఇద్దరు వివాహితులైన పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు చైన్నెకి కూలిపనుల నిమిత్తం వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మృతదేహానికి బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో మహిళ..సంతకవిటి: మండలంలోని మల్ల య్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు(49) పాముకాటుకు గురై మరణించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఎప్పటిలాగానే అమ్మడు భర్త వెంకటరావుతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పొలంలో ఆమెను పాము కాటు వేయడంతో శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనపై మృతురాలి భర్త వెంకటరావు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య? బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలస గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. గ్రామానికి చెందిన సన్యాసమ్మ అనే మహిళ అదే దారిలో వెళ్తుండగా కొంత దూరంలో ఎవరో చెరువులో దూకినట్లు కనిపించిందని స్థానికులకు తెలియజేయడంతో స్థానికు సమాచారంతో ఎస్సై రమేష్ తన బృందంతో వచ్చి గాలింపు చేపట్టారు. ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టినప్పటికీ ఎవరి మృతదేహం లభ్యం కాలేదు.దీంతో నిజంగా జరిగిందా? లేక అపోహ? అన్న కోణంలో పోలీసులు స్థానికులను విచారణ చేశారు. చూసిన మహిళ వృద్ధురాలు కావడంతో నీటి బాతులను చూసి చెప్పి ఉంటుందని కొంతమంది, నిజంగా జరిగితే పరిస్థితి ఏమిటని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు కొనసాగుతునే ఉంది. చెరువులో ఎటువంటి అచూకీ లభ్యం కాలేదని ఎస్సై రమేష్ తెలిపారు. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ స్టేషన్ పరిధి రంగిరీజువీధికి చెందిన తాడి శంకరరావు(68) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వన్టౌన్ సీఐ చౌదరి శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శంకరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భర్త శంకరరావు ఆత్మహత్యపై భార్య ఆరోపణలు చేయగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. -
వినేవారే లేరా?
వీఆర్ఏల గోడు.. పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తోంది... వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కనీసం చొరవ చూపడంలేదు. వినతులు అందజేసినా ఫలితం లేదు. నెలకు ఇచ్చిన రూ.11వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేందుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పదోన్నతుల కల్పనలో కూటమి కినుక వహిస్తోంది. వాచ్మన్ ఉద్యోగం సైతం చేయిస్తోంది. ఖాళీలను భర్తీ చేయకుండా పనిభారం మోపుతోంది. వీఆర్ఏల గోడు వినేవారే లేరు. అందుకే శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు వీఆర్ఏల సంఘం నాయకులు తెలిపారు. సెప్టెంబరు 2న జిల్లా కేంద్రలో నిరసన తెలియజేస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై దృష్టి సారించని కూటమి నిబంధనలకు విరుద్ధంగా వాచ్మన్ విధులు చాలీచాలని వేలతనాలతో ఆర్థిక ఇబ్బందులు జిల్లాలో 338 మంది వీఆర్ఏలు సమస్యలు పరిష్కరంచాలంటూ నేటి నుంచి పోరుబాట నైట్ వాచ్మన్లుగా మహిళా వీఆర్ఏలను విధులకు పంపడం సరికాదు. తక్షణమే అటెండర్, నైట్ వాచ్మన్ పోస్టులు భర్తీ చేయాలి. మా సమస్యలపై ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదు. తక్షణమే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి. – జి.కృష్ణారావు, వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ఏలు అంతా చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. ఖాళీలు భర్తీచేయక పోవండంతో సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. ప్రభు త్వం మా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. ఎన్నోసార్లు సమస్యల పరిష్కారానికి వినతులు, నిరసనలు తెలిపినా కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మా సమస్యలకు పరిష్కారం చూపాలి. – జి సరోజ, వీఆర్ఏ -
84,998 హెక్టార్లలో పంటల సాగు
● కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరంఫోర్ట్: జిల్లాలో ఇప్పటివరకు 84,998 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరిగిందని, వీటికి 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 25,605 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్లో వ్యవసాయ, మార్కెఫెడ్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 2,339 మెట్రిక్ టన్నుల యూరియా, 1330 మెట్రిక్ టన్నుల డీఏపీ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉందన్నారు. ఈ నెలఖారులో 3వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎరువుల దుకాణాలు, ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సీఎస్డీటీ బృందాలతో తనిఖీ చేయిస్తామన్నారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, వ్యవసాయశాఖ జేడీ తారకరామారావు, మార్కెఫెడ్ డీఎం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. -
మూలకు చేరిన మునకళ కర్ర!
● గతంలో కర్రపెత్తనం చేసిన పెద్దాయన ● ఇప్పుడు ‘కళ’తప్పిన రాజకీయం ● ముదురుకేసులను పక్కనబెట్టిన చినబాబు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆ రోజుల్లో ఆయన రాజకీయ ‘కళ’.. రాజసమే వేరు.. పెద్ద ఎన్టీఆర్ ముందే బుర్రుమని కుర్చీ లాక్కొని దిలాసాగా కూర్చునే రోజులు.. తనకు నచ్చిన మంత్రి పదవి.. ఇష్టమైన పోర్టుఫోలియో ఎదురుగా తన పేరు రాసుకునే చనువు.. పెద్దరికం.. ఐదారు ఖాళీ బీ ఫారాలు చేతిలో పట్టుకుని తనకు నచ్చినవాళ్ల పేర్లు రాసుకునే వెసులుబాటు.. మునకాల కర్ర పట్టుకుని వీధుల్లో ధీమాగా నడుస్తూ పెత్తనం సాగించే కామందుకు ప్రతిరూపం. కానీ కాలం మారింది. ఆ రోజులన్నీ పెద్ద ఎన్టీఆర్తోనే పోయాయి. పెత్తనం సాగించిన ఇలాంటి చాలా మునకాలకర్రలను ఈ కొత్త జనరేషన్ మూలనబడేసింది. చినబాబు పాలనలో పెద్దరికాలకు ఫుల్స్టాప్ పడింది. పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవులు.. మంత్రి పదవులు.. ఇలా సర్వం చిన్నబాబు అనుమతితో... సమ్మతితోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తనకంటూ ప్రత్యేకవర్గాన్ని.. టీమ్ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ కొత్త పాలసీలో భాగంగా సీనియర్లను పెద్దలు అంటూ ట్యాగ్ మేడలో వేసేసి పక్కనబెట్టారు. పోనీ సీనియర్ కదాని గౌరవించి పదవి ఇస్తే పాతకాలపు వాసనలతో ఆయన పెత్తనం చేస్తారు తప్ప చినబాబు వద్ద అణిగిమణిగి ఉండడం కష్టమన్న భావన. ఇంకా గట్టిగా మాట్లాడితే నాది మీ తాతతరం.. మీ తాత రేంజి అంటూ మంత్రుల అందరిమధ్య క్లాస్ పీకుతారేమోనన్న భయం. నువ్వు పుట్టకముందే నేను హోమ్ మంత్రిని అనే మాట అనేసినా అనేయొచ్చు. అందుకే ఎందుకొచ్చిన బుర్రబాధ అనుకుంటూ పెద్దతలకాయలను పక్కనబెట్టేశారన్నది జనంమాట. రాజకీయ ‘కళ’తో ముందుకు సాగిన పెద్దాయన ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎక్కువ.. మంత్రికి తక్కువ అనే ప్రత్యేక హోదాలో చేసీచేయని రాజకీయం చేస్తున్నరన్నది పెద్దవిమర్శ. నిత్యం రాజాంలో సొంత ఇంట్లో ఉంటూ బోర్ కొట్టినప్పుడు అలా తన నియోజయకవర్గానికి వెళ్లి ఏవో ఒకట్రెండు అధికారిక కార్యక్రమాలకు హాజరై మళ్లీ రయ్యిమంటూ రాజాం వెళ్లిపోతున్నారు. ఆయన వ్యవహార శైలి గురించి తెలిసిన కార్యకర్తలు కూడా ఆయన మీద ఆశలు పెట్టుకోలేదు.. ఇది తనకు అలవాటైన తీరు కాబట్టి ఆయనా ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోలేదు. మొత్తానికి ఒకనాడు బాగా పెత్తనం చెలాయించిన మునకాలకర్రలను చినబాబు ఇలా మూలబెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ నలుగురు కార్యకర్తలు గుమికూడినా దీనిపైనే గుసగుసలాడుతున్నారు. -
అనాథలైన అమ్మానాన్నలు
● పుట్టిన గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటూ జీవనం ● లక్షల విలువైన ఆస్తులను దక్కించుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన పిల్లలులక్కవరపుకోట: అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు నాడు బిడ్డలా? అన్నట్లు తయారైంది వృద్ధులైన ఆ దంపతుల పరిస్థితి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా అనాథల్లా రోడ్ల వెంబడి పిచ్చివారిలా తిరుగుతూ ఏవరైనా పెట్టింది తింటూ షాపుల ముందు పడుకుంటూ ఆ దంపతులు పడుతున్న దీనస్థితి కలిచివేస్తోంది. నలుగురు పిల్లలను కని పెంచి ప్రయోజకులుగా చేసిన ఆ తల్లిదండ్రులు అనాథల్లా మిగిలిపోయారు. ఈ దీనగాథ ఇలా ఉంది. లక్కవరపుకోట మండల కేంద్రానికి చెందిన సంఘం అప్పలనారాయణ, చిన్నమ్మలు భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాయగూరల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి వారికి పెళ్లిళ్లు, పేరంటాలు జరిపించారు. అలాగే చిన్నమ్మలుకు తన కన్నవారి కుటుంబం నుంచి కొంత ఆస్తికూడా కలిసి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగా వారు అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కొడుకులిద్దరూ తన తల్లి కన్న వారి ఇంటి నుంచి వచ్చిన భూమిని లక్షల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తీరా ప్రస్తుతం ఆదంపతులు వృద్ధాప్యంలోకి చేరడంతో వారి ఆలనా పాలన పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ దంపతులు మతిస్థిమితం లేక ఇద్దరూ చెరో దారిలో పడి రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..ఠి -
వారంలోగా గుంతలకు మరమ్మతులు
● ఆర్అండ్బీ ఏఈ బి.రాజేంద్ర కుమార్ ● సాక్షి కథనానికి స్పందన పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్ వైపు వెళ్లేందుకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై గుంతలకు వారంలోగా మరమ్మతులు చేపడతామని ఆర్అండ్బీ ఏఈఈ బి. రాజేంద్రకుమార్ అన్నారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘‘చెరువులను తలపిస్తున్న రోడ్లు’’ అనే శీర్షికకు ఆయన స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారి విస్తీర్ణం నిమిత్తం రూ.17కోట్లు మంజూరవగా అందులో భాగంగా 4/0 కిలోమీటర్ల నుంచి 12/8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ పనులు పూర్తయ్యాయన్నారు. అయితే 2023 నుంచి బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయని, ఇటీవల బకాయి బిల్లులు చెల్లింపులు జరగడంతో త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. పోలయ్య ఆచూకీ లభ్యంసంతకవిటి: మండలంలోని చిత్తారపురం పంచాయతీ పోడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య(76) గత ఆదివారం ఉదయం నాగావళి నదిలో గల్లంతయ్యాడు. పోలయ్య ఆచూకీ లభించకపోవడంతో గత మంగళవారం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చేపట్టగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెద్ద బొడ్డేపల్లి వద్ద ఓ మృతదేహం ఒడ్డుకు రావడంతో స్థానికులు అక్కడి వీఆర్ఓకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలయ్య కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహం పోలయ్యదేనని గుర్తించినట్లు వీఆర్ఓ అన్నారావు, పోలీస్ సిబ్బంది తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో కూటమి నేత కబ్జా
● అక్రమంగా షెడ్డుల నిర్మాణం ● షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమని ఆరోపణలుగంట్యాడ: అధికారం ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికార దర్పంతో ఎక్కడ స్థలం కనబడినా అక్రమిస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అధికారులు కూడా అఽధికార పార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలు అక్రమించుకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమణ కళ్లెదుట కనిపిస్తున్నా తమకు ఏమీ కనబడడం లేదన్న విధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అందులోనూ మంత్రి సొంత మండలంలో తమను ఎవరు ఏమీ అనరనే ధీమాతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖరీదైన స్థలం కొట్టేసే ప్లాన్.. మండలంలోని నరవ గ్రామం జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ స్థలాలకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్ను వేశారు. జాతీయ రహదారిని అనుకున్న ప్రభుత్వ స్థలం అక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం షెడ్డు కూడా వేసేశారు. ఈ రోడ్డు గుండానే తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు అందరూ రాకపోకలు సాగిస్తారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణం గురించి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేత అక్రమించిన స్థలం విలువ సుమారు గా రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీంతో సదరు నేత సొంత స్థలం మాదిరి షెడ్డులు వేసి షాపులు నిర్మించేసి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వరకు గొప్పలు చెబుతున్నారు. కానీ అపార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలను అక్రమించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలంలో షెడ్డు నిర్మించినట్టు నా దృష్టికి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకుంటాం. పి.నీలకంఠేశ్వర రెడ్డి, తహసీల్దార్, గంట్యాడ -
వైభవంగా శ్రావణమాస పూజలు
● ప్రత్యేక పుష్పాలంకరణలో మహాలక్ష్మి ● అమ్మవారి సన్నిధిలో శతసహస్ర నామ కుంకుమార్చననెల్లిమర్ల రూరల్: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా జిల్లాలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అర్చకులు సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే రామస్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలు, గంధంతో అభిషేకాలు జరిపించారు. సుమారు 30 మంది వైష్ణవ ఋత్విక్కులతో శత సహస్రనామ కుంకుమార్చన వైభవంగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ ఉమా సదాశివాలయంలో కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, మల్లికార్జున శర్మ, కిరణ్, పవన్, రామగోపాలాచార్యులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో హోంగార్డులుగా పనిచేస్తూ ఇటీవల రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో కానిస్టేబుల్స్గా ఎంపికై న ఆరుగురు హోంగార్డులు శుక్రవారం ఎస్పీ వకుల్జిందల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ పోలీస్శాఖలో హోంగార్డుగా పనిచేసిన మీరు సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై న తరుణంలో శాఖను ఉన్నతస్థాయిలో తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. కానిస్టేబుల్గా ఎంపికై న మీపై మరింత బాధ్యత పెరిగిందని, శాఖపట్ల అవగాహన, అనుభవంతో కర్తవ్యదీక్షతో పనిచేయాలని హితవు పలికారు. కానిస్టేబుల్గా ఎంపికై న హోంగార్డులు నాగరాజు, ఈశ్వరరావు, గౌరినాయుడు, సత్యనారాయణ, దేవి, గౌరినాయుడులు ఎస్పీని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో హోంగార్డుల ఇన్చార్జి ఆర్ఐ రమేష్కుమార్, హెచ్సీలు శ్రీను, రాజు పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు ఛేదించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: సాంకేతిక పరిజ్ఞానంతో పెండింగ్ కేసుల పరిష్కారం త్వరితగతిన పూర్తిచేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నివారణకు సాంకేతికత వినియోగం, కొత్తక్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు అధికారులు విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతి కేసులో న్యాయపరమైన ఆధారాలు బలపరిచి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అంకితా సురానా, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీపీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్సైలు, జీఆర్పీ ఎస్సైలు, ఎకై ్సజ్ సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
బాల్యంపై బ్యాగుల బరువు
వీరఘట్టం: ప్రతి శనివారం బ్యాగు మోత లేకుండా విద్యార్థులకు ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనంతో పాటు సామాజిక అంశాలపై పట్టు సాధించేలా బోధన చేపట్టి ఒక్క శనివారం మాత్రం నో బ్యాగ్ డే పాటించేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన ఇంత వరకు అమల్లోకి రాలేదు. నేటి కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు బ్యాగుల బరువు మోత తప్పడం లేదు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికి దూరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఆందోళనలో చిన్నారుల పరిస్థితి కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం 70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయస్సులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వ సాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రైవేట్ బడులు ఉంటున్నాయి. బరువు వేసుకుని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అమలు కాని నిబంధనలు..పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్ధితి మరే దేశంలోనూ లేదని బరువుపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువు వల్ల కండరాలపై ఒత్తిడి పడి భవిష్యత్త్లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కులేదు. ప్రతి శనివారం అమలు కాని నో–బ్యాగ్ డే కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు కష్టాలు బ్యాగు బరువుతో అకెక్కిన ఆటలు చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు పట్టించుకోని విద్యాశాఖ -
మహిళా ముద్దాయికి యావజ్జీవ శిక్ష
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన జంటహత్యల కేసులో భీమిలి మండలం నగరపాలెం ప్రాతానికి చెందిన జ్యోతిర్మయి (34)కి జీవితఖైదు, దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పాడరాము (38), చొక్కా నరేష్ (42), ఉప్పాడ గ్రామానికి చెందిన మరో ఇద్దరు ముద్దాయిలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ విజయనగరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి అప్పలస్వామి తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. కేసు వివరాల్లోకి వెళ్తే..భీమిలికి చెందిన జ్యోతిర్మయికి నగరపాలెం గ్రామానికి చెందిన రమేష్తో వివాహం జరగ్గా వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే దిబ్బవాని పాలెం గ్రామానికి చెందిన పాడ రాముతో జ్యోతిర్మయి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త రమేష్ చైన్నెలో సీ మన్గా ఉద్యోగం చేస్తూ తిరిగి వచ్చే క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడింది. ఈ విషయంపై భర్త ప్రశ్నించినందుకు ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను జ్యోతిర్మయి హతమార్చి మృతదేహాన్ని భీమిలి సముద్రంలో పడేసింది. ఆ సమయంలో ఆరేళ్ల కూతురు ఇంట్లో జరిగిన దారుణాన్ని చూడడంతో చిన్నారిని కూడా పకడ్బందీగా విజయనగరం తీసుకొచ్చి కొత్తపేట బావిలో పడేసింది. 2015 జూలై 26 ఈ ఘటన జరగడంతో అప్పటి టూ టౌన్ సీఐ అంబేడ్కర్ కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో భాగంగా టూ టౌన్ సీఐ ప్రాసిక్యూషన్ పూర్తి చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేయడంతో కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు పైవిధంగా కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామ్, సీఐ శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ లక్ష్మి, ఏఎస్సై మల్లేశ్వరరావులు క్రియాశీలకంగా పనిచేశారని ఎస్పీ తెలిపారు. భర్త, కూతురి హత్య -
గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రానున్న వినాయక చవితి సందర్భంగా గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. అలాగే మంటపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంలో జ్ట్టి ఞట://జ్చ ుఽ్ఛటజి ఠ్టట్చఠి. ుఽ్ఛ్ట క్లిక్ చేసి, నిర్దేశించిన అనుమతులు పొందాలని సూచించారు. ఈ విధానం వల్ల సులభంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మంటపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనానికి అనుమతులు పొందవచ్చునని ఎస్పీ తెలిపారు. తెలుగు కీర్తి పురస్కారానికి గురుప్రసాద్ ఎంపికవిజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ తెలుగు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న తెలుగు భాషా దినోత్సవంలో ప్రతిష్టాత్మక తెలుగు కీర్తి పురస్కారం ఆయనకు ప్రదానం చేయనున్నారు. పరుగు పందెంలో ప్రతిభచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కుమరాం పాలవలసకు చెందిన క్రీడాకారుడు గదుల దుర్గారావు రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో ప్రతిభ చాటాడు. జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో జరిగిన 36వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ చాంపియన్షిప్ 2025 పోటీల్లో 5000 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 5000 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రీడాకారుడిని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం అభినందించారు. క్రీడల్లో మరింత ఆసక్తిని కనబరచాలని, క్రీడలు ఉన్నత స్థానంలో స్ధిరపడేలా ఎదుగుదలకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ కింతాడ కిరణ్కుమార్ పాల్గొన్నారు. ఉత్తమ టీటీఐలకు సత్కారంతాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేరు రైల్వే డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా గురువారం సత్కరించారు. మే నెలలో టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రూపాలలో రూ.2,41,20,627 ఆదాయాన్ని ఆర్జించారు. గత సంవత్సరం మే నెలలో సాధించిన రూ. 2,27,34,221 ఆదాయంతో పోలిస్తే, ఈసారి అధిక ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ రికార్డు ఆదాయం సాధించడంలో వ్యక్తిగతంగా ఇద్దరు ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. విజయనగరం, టీటీఐ వై. అప్పలరాజు.. 836 కేసులు నమోదు చేసి రూ. 4,89,320 జరిమానాలు, అదనపు టికెట్ రుసుముగా వసూలు చేశారు. శ్రీకాకుళం రోడ్డు టీటీఐ కె. శ్రీనివాసరావు 815 కేసులు నమోదు చేసి రూ. 4,42,900 వసూలు చేశారు. వారిద్దరిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సమక్షంలో సత్కరించారు. -
వణికిస్తున్న వైరల్ జ్వరాలు
పాలకొండ రూరల్/గుమలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాల ప్రభా వంతో కొత్త నీరు సమకూరడంతో పాటు పారిశుధ్య లోపం, డ్రైనేజీల సమస్యలు, నిల్వ ఉండే మురుగు కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరప్రభా వంతో తీవ్ర చలి, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, నోరు పూర్తిగా చేదుగా మారడంతో పాటు అఽధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం కనీసం 4–6 రోజులు కొనసాగడంతో జ్వర పీడితులు పూర్తిగా రోగ నిరోధకశక్తిని కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు. ఏజెన్సీ కలబోసి ఉన్న ప్రాంతంలో..ఏజెన్సీ ప్రాంతం అధికంగా మిళితమై ఉన్న పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలో దాదాపు ప్రతి ఇంటా జర్వ పీడితులు ఇద్దరు లేక ముగ్గురు ఉంటున్నారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో పాలకొండ ఏరియా ఆస్పత్రిలో 848 మంది వివిధ రకాల జ్వరాలతో చేరారు. 705 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా 141 మందికి పాజిటివ్ వచ్చింది, డెంగీ పరీక్షలు 193 మందికి చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది, 896 మందికి మలేరియా పరీక్షలు చేపట్టగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దాదాపు 6 వందల మంది వైరల్, సాధారణ జ్వరాల బారిన పడినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా వందకుపైబడి బాధితులు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. సగటున రోజుకు ఆరు వందల మేరకు ఓపీ నమోదవుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. వారిలో అధిక శాతం జ్వరపీడితులే కావడం విశేషం. చేతి సొమ్ము చెల్లించి.. సీజనల్ జ్వరపీడితులు రోగనిర్ధారణ పరీక్షలకు అధికమొత్తంలో చేతి సొమ్ము చెల్లిస్తున్నారు. సర్కారు దవాఖానాతో పోల్చుకుంటే రోగుల తాకిడి ప్రైవేట్ ల్యాబ్ల వద్ద అధికంగానే ఉంటోంది. గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు జ్వరాలపై నిరంతర సర్వే కొనసాగడంతో సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేవని గ్రామీణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అందించే మందులు కూడా ఆశించిన మేర అందుబాటులో ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బీపీ, గ్యాస్టిక్, రోగనిరోధక శక్తిని అందించే ఐవీ, డైక్లోఫినాక్ ఇంజెక్షన్లు తక్కువగా పీహెచ్సీలకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు నెలలకు ఓ సారి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే మందుల్లో నిత్యావసర మందు బిళ్లలు, సూది మందులు తక్కువగా వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రోగగ్రస్తులు ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మలేరియా, టైపాయిడ్, సీబీసీ, యూరిన్, ప్లేట్లెట్స్, వైరల్ జ్వర నిర్ధారణకు రు.600 చెల్లించాల్సి ఉంటుంది. డెంగీ, స్క్రాబ్ టైఫస్ వంటి ప్రాణాంతక జ్వరాల నిర్ధారణకు రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంట్లో ఇద్దరు ముగ్గురికి జ్వరం వస్తే రూ.వేలల్లో చేతి సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. పారిశుధ్య లోపం..కలుషిత నీటి ప్రభావం..జర్వరాల విజృంభణకు కలుషిత నీరు, పారిశుధ్య లోపమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. తాజాగా జిల్లాలో నమోదవుత్ను అధిక వర్షాల ప్రభావంతో నీటి వనరుల్లో కొత్తనీరు చేరుతోంది. ఎక్కిడికక్కడ మురుగు పేరకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రెండు విడతలు, తాజాగా 16వ ఆర్ధిక సంఘానికి సంబంధించి ప్రస్తుత ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన మొత్తాలు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బ్లీచింగ్, ఫినాయిల్ కొనేందుకు కూడా పంచాయతీల ఖాతాల్లో నిధులు లేవని ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. సొంత సొమ్ము చెల్లించి ఎంతోకొంత పనులు చేపడుతున్నా ఫలితం లేకపోతోందని అంటున్నారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రోజుల తరబడి తీవ్ర జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు ఏజెన్సీ కలబోసిన రెండు నియోజకవర్గాల్లో మరింత ప్రభావం తీవ్రమైన నొప్పులుగతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన నొప్పులతో కూడిన జ్వరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఇంట చూసినా చిన్నాపెద్దా తేడా లేకుండా జ్వరాలు వస్తున్నాయి. రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా అందిన వైద్యానికి నయంకాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. పి.సులోచన, తాడికొండ, జీఎల్.పురం మండలంజాగ్రత్తలు అవసరంగతంతో పోల్చుకుంటే టైఫాయిడ్, మలేరియా కాకుండా వైరల్, సాధారణ జ్వరాలు నమోదువుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచిచల్లార్చిన నీటిని తాగాలి. రోగ నిరోధక శక్తిని అందించే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంతో మరింత జాగ్రత్తలు పాటించాలి. వర్షంతో తడవనీయ కూడదు. దుమ్ము ధూళిలో ఆటలాడనీయోద్దు. జలుబు, దగ్గు వస్తే అలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ రవికుమార్, ఏరియా ఆస్పత్రి, పాలకొండ -
నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారాలు కీలకం
విజయనగరం క్రైమ్: నేరాల దర్యాప్తులో డిజిటల్ ఆధారలే కీలకమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. ఈ మేరకు రేంజ్ పరిధిలోని అయిదు జిల్లాలకు చెందిన ఐటీ అనుభవం కలిగిన పోలీస్ సిబ్బందికి గురువారం కై లాసగిరి పోలీస్ గెస్ట్హౌస్ లో ఉబెర్ డేటా డిస్క్లోజర్ పాలసీపై వర్క్ షాప్ జరిగింది. నేర సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణంలో మొబైల్ లొకేషన్ ఆధారంగా నేరస్థులను గుర్తించడంలో ఉబెర్ డేటా ప్రాముఖ్యం గురించి వివరించారు. లీగల్ ప్రాసెస్, డేటా రిక్వెస్ట్ చేయడం, అందుబాటులో ఉంటే సమాచార రకాలు, ప్రైవసీ పరిరక్షణ వంటి అంశాలపై సదస్సు జరిగింది. రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల నుంచి ఐటీ కోర్ టీమ్, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొని, సాంకేతికతపై సమగ్రంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచే దిశగా ఎంతో సహాయపడతాయని అన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి -
ఎవరు చేశారీ పని?
● కలెక్టరేట్ పేరుతో ఉన్న అక్షరాలను తొలగించే ప్రయత్నం పార్వతీపురం రూరల్: కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉన్న బోర్డులో కలెక్టర్ కార్యాలయం అని సూచించే పదాల అచ్చులను గుర్తుతెలియని అకతాయిలు బుధవారం రాత్రి తొలగించారు. ఈ క్రమంలో కొన్ని పదాలకు సంబంధించిన అక్షరాలు బోర్డులో గురువారం ఉదయం లేకపోవడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు డీఆర్ఓ కె.హేమలత, ఈ చర్యలను తీవ్రంగా పరిగణించి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా, సీఐ కె.మురళీధర్ పరిశీలించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అత్తారింటి వేధింపులపై కేసు నమోదుపార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలసలో ఉన్న విజయరామరాజు కాలనీకి చెందిన ఓ వివాహిత భర్తతో పాటు అత్తమామలపై వేధింపుల కేసు పెట్టింది. నిత్యం తనను వేధిస్తూ అధిక కట్నం కోసం డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు. -
రహదారుల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
రేగిడి: ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత రహదారులకు నెల రోజుల్లోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న పాలకొండ–రాజాం ప్రధాన రహదారి పలు చోట్ల పూర్తిగా పాడవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా మజ్జిరాముడుపేట, ఉంగరాడమెట్ట, చిన్నయ్యపేట గ్రామాల జంక్షన్ల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.8.82 కోట్ల నిధులు రోడ్ల కోసం మంజూరుచేసిందని, ఆ నిధులుతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంతమేర పనులను పూర్తిచేశారన్నారు. అప్పట్లో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రూ.4కోట్లు బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులను పూర్తిచేసేందుకు ముందుకురావడంలేదన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ వద్ద 355 మీటర్లు, ఉంగరాడమెట్ట వద్ద 395 మీటర్లు, మజ్జిరాముడుపేట వద్ద 150 మీటర్లు సిమ్మెంట్ కాంక్రీట్ రోడ్డు వేయాల్సి ఉందని, కాంట్రాక్టర్కు బకాయిలు చెల్లిస్తే తప్ప ఈ రోడ్డు పనిపూర్తిచేయలేమని ఇప్పటికే కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్నారు. చెప్పిందొకటి..చేస్తున్నదొకటి ఈ సమస్యను పలుమార్లు ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇటీవల కలెక్టర్ అంబేడ్కర్ సంకిలి నాగావళిని చూసేందుకు వచ్చిన సమయంలో ఈ గోతులను స్వయంగా చూశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తున్నది ఒకటి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రగల్భాలు పలుకుతుండడం వారికి వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే శానసమండలి సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. సమావేశంలో పోలినాటి వెలమ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కింజరాపు సురేష్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, లక్ష్మీపురం సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావులు ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో రామాయణంలో పట్టాభిషేకం సర్గ హవనం చేసి పూర్ణాహుతి జరిపించారు. ఆలయంలోని వెండి మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద నిత్య కల్యాణం జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తి శ్రద్ధలతో తిరువాయ్ మోజి సేవాకాలం: విజయనగరం పట్టణానికి చెందిన పలువురు మహిళా భక్తులు స్వామి సన్నిధిలో తిరువాయ్ మోజి సేవాకాలాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోష్ఠి ప్రతినిధి రమాదేవి ఆధ్వర్యంలో తిరువాయ్ నామాలను పఠించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, రామగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
పోర్టల్లో నమోదు తప్పనిసరి
పార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ నోడల్ ఉపాధ్యాయుల ద్వారా మైజీఓవీ.ఐన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని టీఓఎఫ్ఈఐ జిల్లా నోడల్ అధికారి చొక్కాపు శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పొగాకు వాడకం లేని కార్యక్రమాలుగా పోస్టర్ ప్రదర్శనలు, వీధి నాటకాలు, నినాదాల ప్రదర్శనలు, ర్యాలీలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వాటి వీడియోలు, ఫొటోలను వెబ్సైట్లో ఈ నెల 31 లోపు అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు అమలు కావాలని స్పష్టం చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 50 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మందు బిళ్లలూ కరువే..!
విజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెబుతున్న కూటమి పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కావాల్సిన కనీస మందులను కూడా సరఫరా చేయలేకపోతున్నారు. చివరకు చిన్నపాటి వ్యాధులకు వాడే మందు బిల్లలు సైతం రోగులకు అందించలేని పరిస్థితి. పాలకులు చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. హోమియో, ఆయుర్వేద వైద్యానికి మంచి ఆదరణ ఉంది. దీంతో రోగులు ఆయా వైద్యశాలలకు బాగానే వెళ్తున్నారు. కానీ అక్కడ వైద్యుడి ఓపీ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. జబ్బు తగ్గ్గే మందులు మాత్రం రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి మందులు లేకపోయినా కూటమి సర్కార్ మందులు సరఫరా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయుర్వేదంలో మందుల పరిస్థితి ఆయుర్వేద వైద్యశాలలో సోరియాసిస్ వ్యాధికి, మధుమేహాం, కీళ్ల నొప్పులు, గైనిక్ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, మూత్ర వ్యాధులు, న్యూరాలజికల్ సమస్యలు, రుమథైడ్ ఆర్థరైటీస్, శ్వాసకోశ సమస్యలు, ఎలర్జీ, దగ్గుకి సంబంధించిన మందులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రస్తుతం లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యుడికి చూపించుకున్న తర్వాత మందులు గది వద్దకు వెళ్లిన రోగులు అక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేటు మందులు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉంది. మందుల కోసం ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ఇండెంట్ పెట్టినా ఇంతవరకు మందులు సరఫరా కాలేదని తెలుస్తుంది. బీపీ మిషన్ పాడవ్వడంతో బీపీ చూసే పరిస్థితి లేదు. షుగర్ మిషన్ లేకపోవడంతో పరీక్షించే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ వైద్యశాలకు నెలలో కనీసం 1500 వరకు రోగులు వస్తారు. హోమియోలో కూడా.. హోమియో వైద్యానికి కూడా ప్రస్తుతం సమాజంలో మంచి ఆదరణ ఉంది. దీంతో రోగులు నిత్యం హోమియో వైద్యశాలకు అధికంగానే వస్తారు. ఈ వైద్యశాలకు కూడా 1500 నుంచి 1800 మంది వరకు రోగులు వస్తారు. అయితే హోమియోలో కూడా చాలా వ్యాధులకు మందులు లేవు. ఏడాది కాలంగా మందులు లేకపోయినా కూటమి సర్కార్ సరఫరా చేయని పరిస్థితి. హోమియోలో సీ్త్రల వ్యాధులకు, షుగర్ వ్యాధికి, చర్మ వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల్లేవు. అల్లోపతిలో.. అల్లోపతిలో కూడా మందుల కొరత ఉంది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా ఆసుపత్రులకు ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు సరఫరా చేస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్కు మందులు సకాలంలో సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో పలు రకాల మందులు కొరత ఉన్నట్టు తెలుస్తుంది. నైట్రోగ్లిజరిన్ (మత్తు ఇంజక్షన్), సెఫడ్రాక్సిన్ (యాంటీ బయాటిక్), నైట్రో ఫిరోటోయాన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్కు), ఆపరేషన్ థియేటర్స్లో ఉపయోగించే డై థెరమి ఎర్త్ప్యాడ్, మెట్రోనోజోల్ (యాంటీ బయాటిక్ మాత్రలు), టెనిగ్లిప్టిన్ 20 ఎంజీ షుగర్ మాత్రలు, విటమిన్ కె ఇంజక్షన్, బ్లీడింగ్ కంట్రోల్కు ఉపయోగించే ఇధాలిసిటేట్ ఇంజక్షన్, గాబపెట్టిన్ మాత్రలు(మూర్ఛ వ్యాధికి) ల్యాబ్ ఎటలాల్ ఇంజక్షన్ తదితర రకాల మందులు లేనట్టు తెలుస్తుంది. మందుల్లేవు... చాలా వరకు మందులు అయిపోయాయి. మందుల కోసం ఆరు నెలల కిందట ఇండెంట్ పెట్టాం. ఇంకా రాలేదు. రాగానే అన్ని ఆసుపత్రులకు వాటిని పంపిస్తాం. – ఎం.ఆనందరావు, వైద్యాధికారి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల – జి.వరప్రసాద్, వైద్యాధికారి, ప్రభుత్వ హోమియో వైద్యశాల విజయనగరం పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మోకాళ్ల నొప్పులతో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు కొద్ది రోజులు క్రితం వెళ్లాడు. అక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేటు ఆయుర్వేద మందుల దుకాణంలో కొనుగోలు చేశాడు. ––––––––––––––––––––––––––– విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళ చర్మ సంబంధిత వ్యాధితో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లారు. అక్కడ వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేటు ఆయుర్వేద మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేశారు. ––––––––––––––––––––––––––– గంట్యాడ మండలానికి చెందిన అప్పలసత్యం విజయనగరంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వెళ్తే అక్కడ వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేశాడు. అల్లోపతి, హోమియో, ఆయుర్వేద వైద్యానికి మందుల కొరత ప్రైవేటు ఆసుపత్రులు, షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు కూటమి పాలనలో ఆసుపత్రుల్లో మందుల పరిస్థితి ఇదీ..! -
ఏసీబీ వలలో వీఆర్వో
వేపాడ: మండలంలోని శింగరాయి వీఆర్వో కె.సత్యవతి ఏసీబీ వలకు చిక్కారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య అందించిన వివరాలు.. తన రెవెన్యూ పరిధిలో ఒక రైతు అనుభవంలో ఉన్న శింగరాయి, గుడివాడ భూములకు ముటేషన్ దరఖాస్తు చేశారు. ఇందుకోసం వీఆర్వో సత్యవతి సంబంధిత రైతు నుంచి రూ.లక్షా 70వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం సాయంత్రం వేపాడ సమీపంలో కళ్లాల వద్ద ఫిర్యాదుదారి నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అక్కడ నుంచి వీఆర్వోను వేపాడ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వీఆర్వో సత్యవతి విధులు నిర్వహిస్తున్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను కంప్యూటర్లలో పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్ఐ వాసు నారాయణ, సిబ్బంది, మహిళా పోలీసులు, ఆర్ఐ రామలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెరగాలి
విజయనగరం అర్బన్: విద్యార్థికి కళాశాల దశ నుంచి పరిశోధనా దృక్పథం పెరగాలని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఏటీఎల్ మెంటార్షిప్ ప్రోగ్రాంను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి కేంద్రిత పరిశోధన, ప్రాజెక్టులకు యూనివర్సిటీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీడీఈ కార్యదర్శి అండ్ సీఈవో ప్రొఫెసర్ ఎంఎల్ఎస్ దేవ్కుమార్ మాట్లాడు తూ విద్యార్థుల్లో ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక మెంటార్షిప్ అభివృద్ధికి ఏటీఎల్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు పాల్గొన్నారు.నేడు డయిల్ యువర్ ఆర్టీసీ డీపీటీవోవిజయనగరం అర్బన్: జిల్లాలో అమలులో ఉన్న సీ్త్ర శక్తి పథకం ద్వారా అందిస్తున్న మహిళల ఉచిత ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం డయిల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ఇబ్బందులు, సూచనలను 9959225604 నంబరుకు తెలియజేయాలని సూచించారు.4వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం : కలెక్టర్విజయనగరం అర్బన్: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల 23న నాల్గో శనివారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. డ్రైన్ క్లీనింగ్, పారిశుధ్యం ప్రధానాంశంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీ సచివాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ అంశాలపై గురువారం సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయిలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో స్వచ్ఛాంధ్ర సంస్థలు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతలకు పరిశీలించడం, పాఠశాలల్లో హ్యాండ్ వాష్పై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాల లెక్కకు లోకోస్
ఒక్కోలా.. రాజాం: మహిళా సంఘాల పనితీరు, నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరీ, చెల్లింపులు, లావాదేవీలన్నీ ఐకేపీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు. ఇక ముందు పొదుపు సంఘాల లెక్కలన్నీ పక్కాగా ఉండేలా, ఎవరి లావాదేవీలు వారికి తెలిసేలా లోకోస్ యాప్ పని చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, నెలవారీ చెల్లింపులు, బకాయిలు, డిఫాల్ట్ సభ్యుల వివరాలు వంటివి ఈ యాప్లో నమోదు చేయనున్నారు. ఈ పనులన్నీ ఆయా గ్రామాల్లోని వీవో లీడర్లు పర్యవేక్షిస్తారు. మొత్తం సమాచారం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విభాగానికి అనుసంధానం చేయబడుతుంది. ఇక్కడ మహిళా సంఘాల మొత్తం డేటా ఢిల్లీలో దర్శనమిస్తోంది. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ వంటి రుణాలు బినామీలకు వెళ్లకుండా చెక్ పడుతోంది. ఇప్పటికే శిక్షణ లోకోస్ యాప్ వినియోగంపై జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అపోహాలు విడనాడి ఈ యాప్ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. అన్ని మండలాల్లో వీవోఏలు, వెలుగు సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని మహిళా సంఘాల వివరాలన్నీ ఈ యాప్ల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీసీలు, సీఎఫ్లు, వీవోల ఆండ్రాయిడ్ మొబైల్స్కు ఈ యాప్లు ఇచ్చి ప్లే స్టోర్లో భద్రం చేశారు. ఈ విధానం ద్వారా దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయనేది డీఆర్డీఏ వాదన. ప్రతీ సంఘంలోని లావాదేవీలు, ప్రతీ సభ్యురాలి ఆర్థిక లావాదేవీలు, సంఘ వినియోగం ఈ యాప్లో నమోదు చేయబడుతోంది. జిల్లాలో 62,850 సంఘాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 62,850 సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,92,155 మంది సభ్యులు ఉన్నారు. వీరందరి వివరాలు లోకోస్ యాప్లో నమోదు చేసేందుకు జిల్లా డీఆర్డీఏ విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ఆ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం వివరాలు నమోదు పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది. ఇప్పటి వరకూ 85 శాతం దాటి వివరాలు నమోదైనట్టు డీఆర్డీఏ వెల్లడించింది. అవగాహన లేదు.. లోకోస్ యాప్పై గ్రామాల్లో సంఘాల మహిళలకు అవగాహన లేదు. చాలా మంది మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ యాప్పై సమగ్రంగా అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రతీ మహిళా ఆధార్ కార్డు ఈ యాప్లో పొందుపర్చడం ద్వారా సంఘాల పనితీరు, సభ్యులు పనితీరు తెలుస్తుందనేది ఎంత నిజమో.. మహిళల వివరాలు అన్నీ వేరే వారికి తెలుస్తాయన్నది కూడా అంతే వాస్తవం. ఈ విషయంపై గ్రామ స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. – లావేటి సులోచన, ఎంపీపీ, రాజాం 85 శాతం పూర్తయింది.. రాజాం నియోజకవర్గంలో లోకోస్ యాప్ వినియోగంపై పక్కాగా అవగాహన కల్పించాం. ఈ యాప్ వినియోగంపై మహిళలకు గ్రామ స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తాం. ఎటువంటి అపోహాలు చెందాల్సిన పని లేదు. మహిళా సంఘాల పనితీరు మెరుగుపర్చడంతో పాటు ప్రతీ ఒక్కరికి న్యాయం చేసేందుకు ఈ యాప్ వినియోగపడుతోంది. సాంకేతిక సమస్యలు ఉన్నచోట వాటిని అధిగమిస్తున్నాం. నియోజకవర్గంలో 85 శాతం మేర ఈ యాప్లో వివరాలు నమోదు పూర్తయింది. – ఎ.చిరంజీవి, డీపీఎం, డీఆర్డీఏ, విజయనగరం కొందరికి మోదం.. కొందరికి ఖేదం..! లోకోస్ యాప్పై భిన్నాభిప్రాయాలు ఇక్కడి సమాచారం అంతా ఢిల్లీ చేతికి ఐకేపీ సిబ్బంది స్మార్ట్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు డేటా నమోదుకు తంటాలు కొందరికి సహకరిస్తున్న యాప్లు ఇబ్బందిగా ఉంది.. మా ఆధార్ వివరాలు లోకోస్ యాప్లో అప్లోడ్ చేస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఆధార్ ఇచ్చి అనుసంధానం చేయమన్నాం. ఐతే మా వివరాలు మొత్తం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనన్న భయం కూడా మాకు ఉంది. – సవిరిగాన దమయంతి, వన్నలి, రేగిడి మండలంలోకోస్ యాప్పై కొంతమందికి అపోహాలు ఉన్నాయి. ఇక్కడి సమాచారం అంతా వేరే చోటకు చేరిపోతుందని, వ్యక్తిగత ఆర్థిక వివరాలు మొత్తం ఢిల్లీకి చేరిపోతాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమ వద్ద ఆ యాప్లు, మొబైల్స్ లేనప్పుడు అవి తమకు ఎలా తెలుస్తాయని కొందరు మహిళలు వాదిస్తున్నారు. కొందరు వీవోఏలు ఈ యాప్ను వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ యాప్ ద్వారా తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకూ పారదర్శకత ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ యాప్ వాడడం ద్వారా సంఘాలకు, అందులోని మహిళలకు పైసా వేసినా, తీసినా తెలుస్తుందని డీఆర్డీఏ వివరిస్తుంది. లోకోస్ యాప్లో మహిళా సంఘాల వివరాలు నమోదుపై ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. కొంతమంది వెలుగు సిబ్బంది మొబైల్స్లో ఈ యాప్ ద్వారా సంఘాల వివరాలు నమోదు కావడం లేదని, సాఫ్ట్వేర్ సహకరించడంలేదని వాపోతున్నారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ జిల్లా అధికారులకు తెలియజేస్తే ఎలాగైనా యాప్ను డౌన్లోడ్ చేసి ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు చేయించాలని ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. మరో వైపు ఈ యాప్ వినియోగంపై గ్రామాల్లోని మహిళలు అనాసక్తి చూపుతున్నారని, తమ ఆధార్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని మహిళా సంఘాల గ్రామైఖ్య అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ లోకోస్ యాప్లో వివరాలు నమోదు కొస అంచున నిలిచిపోయింది. -
టీడీపీలో రగిలిన అసమ్మతి
శృంగవరపుకోట: మండలంలోని కృష్ణమహంతిపురం పీఏసీఎస్ కార్యవర్గం నియామకంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కుంపటి రాజుకుంది. పీఏసీఎస్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం బహిష్కరించిన ఆ పార్టీ నేతలు గురువారం గరవపాలెం గ్రామంలో సమావేశమై పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. పీఏసీఎస్ డైరెక్టర్ పదవిని తిరస్కరించిన పెంటకోట రమణబాబు సహా ఐదు పంచాయతీల పరిధిలోని నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. 750 మంది రైతులున్న సొసైటీలో కేవలం 20 మంది రైతులున్న పంచాయతీకి చెందిన వ్యక్తిని చైర్మన్గా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. పార్టీ అంటే ఇద్దరు వ్యక్తులదేనా... ఏంటీ ఈ పంపకాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులిస్తే పార్టీకి అదనపు బలం చేకూరాలని...ఇక్కడ అలా జరగడం లేదని ఆగ్రహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం బహిష్కరించడం బాధ కల్గించినా తప్పలేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని రమణబాబు తదితరులు తెలిపారు. ఒంటెద్దు పోకడ నిర్ణయాలు భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చుతాయన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎస్.సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఒంటి అప్పారావు, సర్పంచ్ యాళ్ల రమణ, ఎంపీటీసీ బోదల దేముడు, ఆడారి సూరిఅప్పారావు, అల్లూరి సత్యనారాయణరాజు, ఐ.శ్రీనివాసరాజు, ఆడారి అప్పారావు, యర్రపాటి సూర్యనారాయణ, కాండ్రేగుల విశ్వేశరరావు, డీవీఏ నారాయణరావు, లగుడు లక్ష్మి, చల్ల రాము, పెంటకోట కృష్ణతో పాటూ పలువురు మాజీ ఎమ్పీటీసీలు, వార్డు సభ్యులు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరై నిరసన వ్యక్తం చేశారు. -
రైతుకు లేని బీమా ధీమా
విజయనగరం ఫోర్ట్: వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నిన్న మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోయాయి. గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అధికశాతం పంటల సాగు వర్షాధారంగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పంటలు పండేవరకు నమ్మలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కూటమి సర్కార్ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడతామని కూటమి సర్కార్ గొప్పలు చెబుతోంది కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు మేలు చేయడం మాట దేవుడెరుగు. ఉన్న ఉచిత పంటల బీమా పథకానికే కూటమి సర్కార్ చేతులెత్తేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. రైతు పంటలు సాగు చేసి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు. ఈక్రాప్ అధారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించేది. పంటనష్టం జరిగితే బీమా పరిహారాన్ని కూడా సకాలంలో చెల్లించింది. గత ఏడాది రబీనుంచి రైతులదే బీమా చెల్లింపు గత ఏడాది రబీ నుంచి రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలని కూటమి సర్కార్ చెప్పేసింది. దీంతో రైతులు రబీసీజన్లో అపరాలకు, మొక్కజొన్నకు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. పంటల బీమాకు రైతులు దూరం ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల బీమాకు దూరంగా ఉన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి రావడంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడం లేదు. లక్షలాది మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 295 దరఖాస్తులే పంటల బీమా కోసం వచ్చాయి. వరి పంటకు ఎకరాకి రూ.200, మొక్కజొన్నకు రూ.165 నువ్వు పంటకు రూ.65 చొప్పన ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లించడానికి ముందుకు రాని రైతులు పంటల బీమాకు కేవలం 295 దరఖాస్తులు ముగిసిన గడువు ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ మంగళం -
వైభవంగా శ్రీరామ పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం ఆలయంలోని వెండి మంటపం వద్ద సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి, స్వామికి పాలు, పె రుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అ భిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో ఈఓ వై. శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు జరిపించిన అర్చకులు -
గిరిజనుల డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?
బొబ్బిలి రూరల్: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇంకా ఎన్నాళ్లు ప్రమాదకరంగా గిరిజనులు ఈ డోలీ మోతలతో ఆస్పత్రుల్లో చేరాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె పుణ్యవతి పాలకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త బట్టివలస గిరిజన గ్రామానికి చెందిన నిండు గర్భిణి మంగళవారం డోలీ మోతతో పిరిడి పీహెచ్సీలో చేరిన విషయం విదితమే.బుధవారం పీహెచ్సీలో తల్లీబిడ్డలను పుణ్యవతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిలో మైదాన ప్రాంతాలకు పెద్దపీట వేసి గిరిజన గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, ఆరోగ్యం, విద్యను పాలకులు అందించలేకపోతున్నారని విమర్శించారు. బట్టివలస గిరిజన గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రి సంధ్యారాణికి ఇవేమీ పట్టడం లేదన్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాలకే ఇటువంటి దుస్థితి వస్తే గిరి శిఖరాలపై నివసిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, డోలీ మోతల్లో తల్లీబిడ్డలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనుకూలమైన వ్యక్తులకు కోట్లరూపాయల కాంట్రాక్టులను అప్పగించి మైదానప్రాంతాల్లో రోడ్లు వేసుకున్నారని, గిరిజన గ్రామాలపై పూర్తి వివక్షచూపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో గిరిజన మహిళలను ఏకం చేసి ఆందోళన బాటపడతామని ప్రభుత్వాన్ని, పాలకులకు హెచ్చరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పుణ్యవతి -
పడాలవలస గిరిజనుల తాగునీటి కష్టాలు
● పట్టించుకోని కార్యదర్శి ● పంటపొలాల నుంచి తాగునీరు సేకరణ సాలూరు రూరల్: ఎక్కడైనా మండు వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ పడాలవలస గిరిజన గ్రామ ప్రజలు వర్షాకాలంలో కూడా గడిచిన 10 రోజులుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని బోరుబావి మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో పక్కనే ఉన్న పంటపొలాల్లో బోరు బావినుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నందున తెల్ల వారేసరికి వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తాగునీటి కోసం కొంత సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటోందని గిరిజన మహిళలు వాపోతున్నారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శికి సమస్యను వివరించినప్పటికీ తాను చేసేది ఏమీ లేదని నాయకులను కలవాలని చెబుతున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఈ క్రమంలో ఎలాగోలా బోరు బావికి మరమ్మతులు చేయాలని బుధవారం గ్రామంలోని కొంతమంది యువకులు ప్రయంత్నించి పైపులు బయటకు తీశారు. అయితే బోరు మరమ్మతులకు కొన్ని కొత్త సామగ్రి అవసరమవుతాయని గుర్తించిన యువకులు ఆ డబ్బులు ఎవరు పెడతారని, ఎక్కువ ఖర్చు అయితే అంత సొమ్ము ఎవరు భరిస్తారని చర్చించుకుని తాము పని విషయంలో సహకరిస్తామే తప్ప డబ్బులు పెట్టే స్థోమత తమకు లేదని ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య అలాగే ఉండి పోయింది. వెంటనే గ్రామ కార్యదర్శి బోరు బావికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బోల్తా పడిన లారీ
బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామం వద్ద జాతీయ రహదారి 26పై మానాపురం నుంచి విజయనగరం వస్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లో బుధవారం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు. 15 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్స్టేషన్ పరిధి జి.శివడ పంచాయతీ పెద్దఅంటిజోల గ్రామసమీపంలో అక్రమంగా సారా విక్రయిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు బుధవారం నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల సారాను ఓ వ్యక్తి కలిగి ఉండడంతో సారా స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా వంటకాలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజృంభిస్తున్న జ్వరాలు● మంచం పడుతున్న ప్రజలు సాలూరు: వర్షాలు తెరిపిచ్చిన క్రమంలో నియోజకవర్గంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వైరల్, మలేరియా, టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గిరిశిఖర దొర్లతాడివలస, జాకరవలస, మూలతాడివలస, కుంబిమడ తదితర గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. తీవ్రజ్వరాలతో బాధపడుతున్నా మెడికల్ క్యాంపులు నిర్వహించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న దొర్లతాడివలసకు చెందిన మధుసూదనరావును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో సుమారు ఏడాది కాలానికి పైగా ఏసీఎం ద్రావణం పిచికారీ చేయలేదని గిరిజనులు అంటున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో దోమలు అధికమయ్యాయని, ఫలితంగా జ్వరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్యశిబిరం ఏర్పాటుగిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్ప్రసాద్ స్పందించి వెంటనే వైద్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో దొర్లతాడివలసలో బుధవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దొర్లతాడివలస, జాకరవలసకు చెందిన 44 మందికి వైద్యపరీక్షలు చేసి మెరుగైన చికిత్స నిమిత్తం పలువురిని తోణాం పీహెచ్సీకి తరలించారు. నూతనబార్ పాలసీ విధానంలో ఫీజుల తగ్గింపు విజయనగరం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంలో లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించినట్లు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత బార్ పాలసీ విధానంతో పోల్చితే లైసెన్స్ దారుడికి అనేక రాయితీలు లభిస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తు విధానంతో పాటు ఒక వ్యక్తికి ఒకటికి మించి బార్లు కేటాయింపు, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకూ బార్ పనివేళలు ఉంటాయన్నారు. ఆరు వాయిదాల్లో లైసెన్స్ పీజు చెల్లింపు చేసుకోవచ్చని, ఐఎమ్ఎల్, బీర్ అమ్మకాలు జరిగిన తదుపరి రెండు నెలల తర్వాత చెల్లింపులు చేయవచ్చన్నారు. సాయికిరణ్కు కన్నీటి వీడ్కోలుసంతకవిటి: మండలంలోని శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్(20) మంగళవారం కాకినాడలో నిర్వహించిన అగ్నిపథ్ (ఆర్మీ) ర్యాలీలో 1600 మీటర్ల పరుగుపందెంలో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. సాయికిరణ్ మృతదేహం బుధవారం వేకువజామున స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సాయికిరణ్ అంతిమయాత్రలో గ్రామస్తులతో పాటు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయికిరణ్ మృతదేహంపై ఆర్మీ క్యాప్, వస్త్రాన్ని ఉంచారు. -
అత్తా,కోడళ్ల ఘర్షణలో అత్త మృతి
జామి: అత్తా,కోడళ్ల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం ఘర్షణకు దారి తీయడంతో కోడలు తోసివేయడంతో అత్త మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ ఎల్.అప్పలనాయుడు, మృతురాలి కుమారుడు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జేడీ వలస గ్రామానికి చెందిన గూనురు అప్పల కొండకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అప్పారావు, కోడలు రాజమండ్రిలో ఉండేవారు. అప్పారావు అనారోగ్యంతో మృతిచెందడంతో భార్య లక్ష్మి అత్తవారిల్లు అయిన జేడీ వలస గ్రామానికి వచ్చి ఉంటోంది. ఇటీవల కొద్దిరోజుల క్రితం పుట్టినిల్లు డెంకాడ వెళ్లి బుధవారం మళ్లీ జేడీ వలస వచ్చింది. వచ్చిన కొంత సమయం తరువాత అత్త గూనురు అప్పలకొండ (72), కోడలు లక్ష్మి మధ్య వివాదం తలెత్తడంతోఘర్షణ పడ్డారు.ఈ ఘర్షణలో అత్తను లక్ష్మి చేతితో తోసివేయడంతో మంచం మీదనుంచి కిందకు పడిపోయి స్తృహ కోల్పోగా కుటుంబసభ్యులు జామి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి మృతదేహన్ని జేడీ వలస గ్రామానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై మృతురాలి రెండవ కుమారుడు రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్సై వీర జనార్దన్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్ధాయిలో విచారణ చేపడతామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. గజపతినగరం రూరల్: మండలంలోని పిడిశీల గ్రామానికి చెందిన కర్రోతు సాయిసుధ మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీర కట్టుకుని ఉరివేసుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపేదని భర్త, పిల్లలతో సరదాగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇంత పనిచేస్తుందని అనుకోలేదని స్థానికుల సమాచారం మేరకు తెలిసిందన్నారు. మృతురాలి తల్లి పిల్ల వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానా స్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం అనందరం వచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నామన్నారు. రాజాంలో శతాధిక వృద్ధురాలు..రాజాం సిటీ: పట్టణ పరిధి బుక్కా వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు మండా గున్నరాజమ్మ(105) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆమె నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం కూడా తీసుకునేదని కుటుంబసభ్యులు తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కోడళ్లు, ఇద్దరు మనుమలు, ఐదుగురు మునిమనుమలు ఉన్నారు. -
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుముతో సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. తదుపరి ఎంపీసీ, చివరి ప్రాధాన్యం ఇతర గ్రూపుల వారికి ఇవ్వనున్నట్లు చెప్పారు.పేకాట ఆడుతున్న ఇద్దరు కార్పొరేటర్ల అరెస్ట్విజయనగరం క్రైమ్: పేకాట ఆడుతుండగా ఇద్దరు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్టేషన్ క్రైమ్ పార్టీ నైట్డ్యూటీలో భాగంగా పేకాటరాయుళ్లను పట్టుకున్నారన్నారు. తమ స్టేషన్ పరిధిలోని మంటపం వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బంగారు నాయుడు, రంగ.రామకృష్ణలతో పాటు స్వాతికుమార్, భాస్కర్, తాడి సురేష్, నాగేంద్రలను పట్టుకున్నామన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడిన పేకాటరాయుళ్ల దగ్గర నుంచి రూ.48 వేల 810 నగదుతో పాటు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రైతు వ్యతిరేకి కూటమి సర్కార్
● ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్సీ పాలవలస మండిపాటువంగర: రాష్ట్రంలో కూటమి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల కేంద్రం వంగరలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామంటున్న సీఎం చంద్రబాబు చేతల్లో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ గ్రామంలో చూసినా ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, యూరియా, డీఏపీ కొరత రైతన్నలను కలవరపెడుతోందన్నారు. రైతులు అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎన్నడూ ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు ముందుగానే రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు తరలించి పూర్తిస్థాయిలో అన్నదాతకు ఎరువులను సరఫరా చేసే ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రైతుల పట్ల జగన్మోహన్రెడ్డి అనుసరించిన విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తున్న ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుర్భర పరిస్థితి నెలకొనడమే కూటమి సర్కారు పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు రైతు చెల్లించుకోవడమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని వర్గాలకూ మోసం వంగర మండలంలోని శివారు గ్రామాలకు తోటపల్లి సాగునీరు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నారు. రైతులు, పింఛన్ లబ్దిదారులు, వికలాంగులు, యువత, విద్యార్ధులు, ఉద్యోగులను చంద్రబాబు సర్కారు మోసం చేస్తోందంటూ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కేంద్రంలో ప్రగల్భాలు పలుకుతున్న నేతలకు ఆంధ్రప్రదేశ్లో రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ ఉత్తారావెల్లి సురేష్ముఖర్జీ, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, ఎంపీటీసీ కనగల పద్మ, సర్పంచ్ పోలిరెడ్డి రమేష్, పార్టీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కాంబోతుల శ్రీనివాస నాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పెంకి సంపత్కుమార్, కాంబోతుల రాము, గొండేల తవిటయ్య మాస్టారు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గణేష్ ఉత్సవాలకు నిబంధనలు తప్పని సరి
విజయనగరం క్రైమ్: గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇప్పటి నుంచే బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్జిందల్ ఆదేశించారు. గణేష్ మంటపాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉత్సవ కమిటీలకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీపీవోలో జరిగిన సమావేశంలో ఎస్పీ అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, పోక్సో, అట్రాసిటి, మిస్సింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో ట్రయల్ రన్ కేసులపై దృష్టి పెట్టాలని ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరుపై కోర్టు కానిస్టేబుల్తో పాటు ఎస్సైలు, సీఐలు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో బాధితురాలి వయస్సు నిర్ధారించాలంటే కచ్చితంగా తహసీల్దార్ లేదా పంచాయతీ అధికారి నుంచి అధికరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలన్నారు. అలాగే కేసు తీవ్రతను బట్టి ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించిన కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇక స్కూల్స్, కళాశాలల్లో ఈగల్ క్లబ్స్, శక్తి వారియర్ టీమ్స్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆయా కళాశాలల్లో విద్యార్థినులు ఆత్మ రక్షణ పొందేందుకు స్పెషల్ ఇన్స్ట్రెక్టర్స్ను పెట్టుకోవాలని సూచించారు. రాత్రి పూట గస్తీ తిరిగే సిబ్బంది రెండు షిప్టుల్లో పనిచేయాలన్నారు. టౌన్ న్యూసెన్స్ యాక్టును విధిగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలని, ఫైనాన్షియల్ లావాదేవీల కేసుల్లో కూడా సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు అనంతరం పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించి గంజాయి అక్రమాలు అరికట్టడం, చోరీలు నియంత్రించడం, లోక్ అదాలత్లో కేసులను త్వరితంగా పరిష్కరించిన సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యారెడ్డి, రాఘవులు, గోవింద, వీరకుమార్, న్యాయసలహాదారు పరశురామ్, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. డీపీఓలో నేర సమీక్షా సమావేశం -
దోమల నివారణకు కృషి చేయాలి
విజయనగరం ఫోర్ట్: దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. దోమకుట్టడం ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని కనుగొన్న రోనాల్డ్ రాస్ చిత్ర పటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ రాణి, డీఎంఓ వై.మణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆలా హజరత్ ఉత్సవాలు విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ ముస్లింలు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ఆబాద్వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియా తుల్ హబీబియా అహ్ మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవ ఊరేగింపును బుధవారం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఇమామ్ల ఆధ్యాత్మిక సభలో హఫీజ్లు మాట్లాడుతూ ప్రపంచంలో దైవ మహమ్మద్ ప్రవక్త సున్నత్లను అధికంగా పాటించిన ఘ నత ఆలా హజరత్కు లభించిందన్నారు. ఉత్సవాల్లో అరీఫ్, మహమ్మద్ సలామ్, షేక్ బహు ర్ అరీఫ్, నౌషాద్, మన్నాన్, మసీజీద్ జాఫర్, ఖానా, జానీ, జిల్లాశాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు. సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకం ● జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ జయసుమ విజయనగరం అర్బన్: సమాజాభివృద్ధికి ఇంజినీరింగ్ విద్య కీలకంగా నిలుస్తుందని, విద్యార్థులు ఆ దిశగా చదువుకోవాలని జేఎన్టీయూ జీవీ రిస్ట్రార్ జి.జయసుమ పిలుపునిచ్చారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం బుధవారం నిర్వహించిన స్టూడెంట్ ఓరియంటేషన్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఇంజినీర్ సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్తేజంతో ఉండి కొత్తకోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ఉద్దేశాన్ని నూతనంగా ప్రవేశించిన ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు, హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల పూర్వవిద్యార్థులు సాధించిన ఉద్యోగాలు, వర్సిటీలోని వసతులను తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజే నాగరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వి.ఎన్.వకుల, లైబ్రరీ ఇన్చార్జ్ డాక్టర్ సీహెచ్.బిందుమాధురి, ఆఫీస్ ఇన్చార్జి డాక్టర్ శివరాం రోలంగి, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ అండ్ బేసిక్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం.సౌభాగ్యలక్ష్మి, ఇతర విభాగాధిపతులు పాల్గొని, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సర్వమానవాళికి దేవుడు శ్రీకృష్ణుడు విజయనగరం టౌన్: గురజాడ కళాభారతిలో ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనలు, చిన్నారుల వేషధారణల నడుమ స్వామివారి విగ్రహాన్ని తిరువీధి జరిపారు. సర్వమానవాళికి భగవంతుడు శ్రీకృష్ణుడని భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ఇఫ్కో డైరెక్టర్ కె.బంగార్రాజు, సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాద్, వంశీ, వెంకి, తదితరులు పాల్గొన్నారు. -
ఎంత భూమి ఉన్నా ఒక బస్తా ఎరువేనా?
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరాలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించడంతో పాటు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. జిల్లా పరిషత్లో 1–7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలిపారు. ఎకరా ఉన్న రైతుకు, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఒకటే యూరియా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు జిల్లాలు వ్యవసాయ శాఖ జేడీలు మాట్లాడుతూ రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు. ● ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతూ, అర్హత ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి పింఛన్లు రద్దు చేయడం అన్యాయమని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. మక్కువ, గజపతినగరం మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు మావుడి శ్రీనివాసరావు, గార తవుడు అర్హులకు జరిగిన అన్యాయంపై డీఆర్డీఏ పీడీ దృష్టికి వివరాలతో తీసుకెళ్లారు. పింఛన్ల రద్దును నిలిపివేయాలని కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అర్హతలేని వారికి పింఛన్ నిలిపివేసినా అర్థం ఉంటుందని, ఎక్కువ శాతం దివ్యాంగత్వం ఉన్న వారికి పింఛన్లు నిలిపివేయడం తగదని, తక్షణమే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ● జిల్లాలో రైతాంగానికి అవసరమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో జాప్యంపై చైర్మన్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సకాలంలో విద్యుత్ కనెక్షన్లు జారీచేయకపోతే రైతులు పంటలను ఎలా సాగుచేస్తారన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ సురేష్బాబు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాలకు చెందిన అధికారులు, వైస్ చైర్మన్ మరిసర్ల బాపూజీనాయుడు, సభ్యులు కె.సింహాచలం, సంకిలి శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలి ఎకరా ఉన్నా, పది ఎకరాలున్నా ఒక బ్యాగు ఇస్తే ఎలా సరిపోతుంది అర్హుల పింఛన్లు పునరుద్ధరించాలి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!
ఇతని పేరు సూరెడ్డి సత్యనారాయణ. ఇతనిది మెంటాడ మండలం లోతు గెడ్డ. ఇతనికి 3.8 ఎకరాల పొలం ఉంది. అందులో వరి పంట సాగు చేశారు. వరి పంటకు యూరియా వేద్దామంటే దొరకక అవస్థలు పడుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు విశ్వనాథం రాంబాబు. ఎల్.కోట గ్రామం. ఈయన 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. అందులో వరి పంట సాగు చేశాడు. వరి పంటకు యూరియా వేయడానికి గత నాలుగు రోజులుగా తిరుగుతున్నాడు. అయినప్పటికీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరపురపు రామునాయుడు. ఇతనిది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగుచేశాడు. వరి పంటకు వేసేందుకు అవసరమైన యూరియా కోసం గత ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ లభ్యంకాలేదు. ఈయన పేరు తాళ్లపూడి అప్పలనాయుడు. ఇతనిది బొండపల్లి మండలం రోళ్ల వాక గ్రామం. ఇతనికి రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట వేశాడు. యూరియా దొరకక దిక్కులు చూస్తున్నాడు. విజయనగరం ఫోర్ట్: జిల్లా రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. అదునుకు ఎరువు దొరకకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. పనులు మానుకుని ఎరువు కోసం పరుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు వరుణుడి కరుణలేక పంటలు సాగుపై రైతులు బెంగ పెట్టుకున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పంటల సాగుకు ఉపక్రమించారు. పంటకు ఎరువు వేద్దామంటే దొరకని పరిస్థితి. డీఏపీ ఎరువు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎరువుల దుకాణాలు, ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ల చుట్టూ తిరుగుతున్నారు. బాబ్బాబు.. ఎరువు ఇప్పించండి అంటూ అధికారులను ప్రాథేయపడుతున్నారు. వీడని ఎరువు కష్టాలు టీడీపీ ప్రభుత్వం ఎప్పడు అధికారంలో ఉన్నా రైతన్నకు కష్టాలు తప్పవని వాపోతున్నారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఎరువుల కోసం చేసిన ధర్నాలు, నిరసనలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పడు కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా నిలుస్తాం. ఎరువుల కొరతరానివ్వం అంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పి ఇప్పుడు కనిపించడమే మానేశారని విమర్శిస్తున్నారు. యూరియా నిల్... జిల్లాలో 505 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 200 మంది వరకు ప్రైవేటు డీలర్లు ఉన్నారు. వీరి చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకని పరిస్థితి. జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 24,300 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడా యూరియా నిల్వలు లేవు. డీఏపీ 9,300 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 8,900 మెట్రిక్ టన్నులు వచ్చింది. డీఏపీ కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. విక్రయించాం యూరియా జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల అవసరం కాగా ఇప్పటి వరకు 24,300 మెట్రిక్ టన్నులు వచ్చింది. యూరియా అంతా విక్రయించడం జరిగింది. రెండు మూడు రోజుల్లో యూరియా రాగానే రైతులకు అందజేస్తాం. యూరియా బస్తా ఈ ఫొటోలో మండుతున్న ఎండలో నేలపై కూర్చొని ఉన్నది విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామ రైతులు. యూరియా కోసం పనులు మానుకుని కుంటినివలస రైతుసేవా కేంద్రం వద్ద బుధవారం గంటల తరబడి నిరీక్షించారు. ఇచ్చిన ఒక బస్తా యూరియా కూడా వీరిలో చాలా మందికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం అన్నదాత అవస్థలు ఆర్ఎస్కేల వద్ద గంటల తరబడి నిరీక్షణ డీఏపీ కూడా దొరకని పరిస్థితి 32వేల మెట్రిక్ టన్నులకు 24,300 మెట్రిక్ టన్నులే సరఫరా -
● తెచ్చుకుంటేనే భోజనం...
చిత్రాల్లో ట్రాలీపై భోజనాలు తెచ్చి దించుతున్నది గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. కళాశాలలో 333 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన మధ్యాహ్నభోజనాన్ని కళాశాలకు అర కిలోమీటరు దూరంలో ఉన్న గజపతినగరం ఉన్నత పాఠశాలలో వండుతున్నారు. వంట ఏజెన్సీ ఒక్కటే కావడంతో పాఠశాలలో చదవుతున్న 350 మంది, కళాశాలలో చదువుతున్న 333 మందికి అక్కడే భోజనాలు వండుతున్నారు. కళాశాల విద్యార్థులకు భోజనం కావాలంటే ప్రతిరోజూ ట్రాలీతో వెళ్లి తెచ్చుకుని వడ్డించుకోవాల్సిందే. దీనికోసం ఐదారుగురు విద్యార్థులు తరగతులు మానుకుని శ్రమించాల్సి వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువుకోసం పంపించిన పిల్లలతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాష్ పట్నాయక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కళాశాల విద్యార్థులకు కావాల్సిన భోజనాన్ని ట్రాలీ రిక్షాపై తెస్తున్నమాట వాస్తవమేనన్నారు. రిక్షాను కళాశాల తరఫున ఏర్పాటుచేశామని, విద్యార్థులను భోజన నిర్వాహకునికి సాయంగా పంపిస్తున్నామన్నారు. ఎండీఎం నిర్వాహకులు వంట చేస్తున్నారే తప్ప విద్యార్థులకు వడ్డించడంలేదని వాపోయారు. – గజపతినగరం రూరల్ -
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి
సీఆర్టీల పోస్టులను డీఎస్సీకి కలపరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయకపోతే యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తాం. – ఎస్. మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు జూన్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలి. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గిరిజన పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
ఉమ్మడి జిల్లాలో ఇలా...
గతంలో విజయనగరం జిల్లా పరిధిలో 23, పార్వతీపురం మన్యంలో ఏడు చొప్పున బార్లు ఉండేవి. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 28, పార్వతీపురం మన్యంలో ఎనిమిది ఏర్పాటు కానున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం వైన్షాపుల మాదిరి బార్లలోనూ కొన్ని కల్లుగీత కార్మికులకు కేటాయిస్తున్నారు. ఈ ప్రకారం విజయనగరంలో 3, పార్వతీపురంమన్యం జిల్లాలో రెండు కేటాయించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 18, బొబ్బిలి మున్సిపాలిటీలో 4, రాజాం నగర పంచాయతీ 5, భోగాపురం వీఎంఆర్డీఏ పరిధిలో ఒకటితోపాటు.. గీత కార్మికులకు విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో 1, నెల్లిమర్ల 1, రాజాం 1 చొప్పున ఉన్నాయి. మన్యం జిల్లాలో మొత్తం పార్వతీపురం 4, సాలూరు 5, పాలకొండ 1 చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఒక దరఖాస్తుకే రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బార్ పొందడానికి లైసెన్సు ఫీజు రూ.55 లక్షలుగా నిర్ణయించారు. సాక్షి, పార్వతీపురం మన్యం : మందుబాబులు ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లో దర్జాగా కూర్చొని తాగేయవచ్చు. మద్యం అడ్డగోలు దోపిడీకి, సామాన్యుల జేబులు చిల్లు చేసేందుకు ప్రభుత్వమే ‘పర్మిట్’ ఇచ్చేసింది. బార్లు తెరిచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇవి తెరిచే ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకే ఈ వేళలు ఉండేవి. నూతన బార్ల కోసం ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మూడేళ్లపాటు ఉండే లైసెన్సుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 26వ వరకు గడువిచ్చారు. 28వ తేదీన లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. నూతన విధానం ద్వారా ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి.. విచ్చలవిడిగా ఏనీటైం మద్యం లభ్యమయ్యేలా చేశారు. సిండికేట్లే ఇక్కడ చక్రం తిప్పి, అధిక దుకాణాలు దక్కించుకున్నారు. కూటమి నాయకులే ఎక్కువగా భాగస్వాములుగా ఉన్నారు. గొలుసు దుకాణాలకు వైన్స్ యాజమానులే తలుపులు తెరిచారు. ఇప్పుడు బార్లతో దొరికినంత దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా సిండికేట్లు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఆదాయ సముపార్జనే లక్ష్యంగా... రోజులో 14 గంటలు బార్లు తెరిచే ఉంటాయ్.. నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతులిచ్చిన విషయం విదితమే. విజయనగరం జిల్లా పరిధిలో తొలుత 153, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 52 దుకాణాలు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. దరఖాస్తుల రూపంలోనే రూ.104.82 కోట్లు ప్రభుత్వం దక్కించుకుంది. ఇవి కాక.. గౌడ కులాలకు రెండు జిల్లాల్లో 19 దుకాణాలు కేటాయించారు. వాస్తవానికి వీటిలో చాలా వరకు మద్యం సిండికేట్దారులే ఉన్నారు. కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాల వల్ల లాభాలు రావడం లేదని వ్యాపారులే గొలుసు దుకాణాలను ప్రోత్సహించారు. ఫలితంగా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు వెలిశాయి. ప్రతి సందులోనూ, పాన్షాపుల వద్ద మద్యం దొరుకుతోంది. 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. ఇవి కాక.. మద్యం దుకాణాల వద్దే కూర్చొని తాగేందుకు పర్మిట్ రూంలకూ అనుమతిచ్చేసింది. ఇప్పుడు బార్లు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి.. నచ్చినంత తాగుకోవాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. -
పంట, ఆస్తి నష్టంపై ఆరా
● నదీతీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ అంబేడ్కర్ ● రూ.280 కోట్లతో 28 చోట్ల కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన వంగర/రేగిడి: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట, ఆస్తి నష్టం పరిశీలించేందుకు నదీతీర గ్రామాల్లో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. వంగర, రేగిడి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. పంట, ఆస్తినష్టంపై ఆరా తీశారు. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులతోపాటు జిల్లాలోని ప్రవహిస్తున్న పలు నదుల సమీపంలో గ్రామాలు, పంటపొలాలు రక్షణకు ముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.280 కోట్లతో 28 చోట్ల కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. ముందుగా వంగర మండలం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టును పరిశీలించారు. నీటి నిల్వను అక్కడి అధికారులను అడిగితెలుసుకున్నారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న గుర్రపుడెక్కను డ్రోన్ల సహాయంతో గుర్తించి నివారణ మందులు పిచికారీ చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు చేయాలన్నారు. ● వంగర మండలంలోని సంకిలి వద్ద నాగావళి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. కరకట్టల అవసరాన్ని అధికారులను అడిగితెలుసుకున్నారు. నాగావళి నదిపక్కన కరకట్ట నిర్మించాలని సంకిలి గ్రామానికి చెందిన రైతు నాయకుడు నారు జనార్దనరావు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నాగావళి నదికి గండికొడితే 11,600 ఎకరాల పంటభూములు ముంపునకు గురవుతాయన్నారు. అనంతరం బొడ్డవలస వద్ద ఉన్న పంపుహౌస్ను కలెక్టర్ పరిశీలించి తాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్డీఓ బి.ఆశయ్య, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్బాబు, తహసీల్దార్లు బి.రాజశేఖర్, కృష్ణలత, ఎంపీడీఓ ఎస్.రఘునాథాచారి, డీఈ పి.అర్జున్, పలువురు డీఈలు, ఏఈలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అందివస్తాడనుకుంటే అనంతలోకాలకు...
సంతకవిటి: డిగ్రీ విద్య పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడు ఉద్యోగం సాధిస్తే కష్టాలు గట్టెక్కుతాయని ఆ తల్లిదండ్రులు భావించారు. చివరికి ఉద్యోగం కోసం సాగించే పరుగులోనే కుమారుడు కుప్పకూలి ప్రాణాలు విడవడంతో బోరున విలపిస్తున్నారు. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయికిరణ్(20) మంగళవారం కాకినాడలో జరిగిన అగ్నిపథ్ ర్యాలీలో 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడి సిబ్బంది కాకినాడలోని జీజేహెచ్లో చేర్పించినా ఫలితం లేకపోయింది. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అప్పన్న, భారతిలు కాకినాడ బయలుదేరి వెళ్లారు. వీరికి సాయికిరణ్తో పాటు ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. అందివస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదం అలముకుంది. ● శోక సంద్రంలో శ్రీహరినాయుడుపేట -
పింఛన్ల తొలగింపుపై నిరసన
–8లోజీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్గున్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. పూసపాటిరేగ/జామి: దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయమంటూ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పలు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద దివ్యాంగులు మంగళవారం ఆందోళనలు చేశారు. ఏళ్ల తరబడి పొందుతున్న పింఛన్ను రద్దుచేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. పింఛన్లు పెంచినట్టే పెంచి రద్దుచేయడం ఎంతవరకు సమంజసం ‘బాబూ’అంటూ ప్రశ్నించారు. పింఛన్లు పునరుద్ధరించాలంటూ ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు. ఇది అన్యాయం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని వైఎస్సార్సీపీ జామి మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, జెడ్పీటీసీ గొర్లె సరయు, ఎంపీపీ సబ్బవరపు అరుణ అన్నారు. కూటమితీరుకు నిరసనగా జామి ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక అర్హుల కు పింఛన్ మంజూరు చేయకుండా ఉన్నవి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో వైద్యులు మంజూరు చేసిన సదరం ధ్రువపత్రం ఆధారంగానే పింఛన్లు పొందుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రీ సర్వే పేరుతో అర్హుల పింఛన్లు తొలగించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. పింఛన్ను రద్దుచేస్తే దివ్యాంగుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. నోటీసులతో దివ్యాంగుల గుండెల్లో దడపుట్టించడం తగదన్నారు. పింఛన్లు రద్దుచేస్తే పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదెల వెంకటరావు, నేతలు చలమూరి సత్యారావు, ఎ.సుబ్రహ్మణ్యం, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నదిలో గాలింపు
● లభించని వృద్ధుని ఆచూకి సంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నదిలో నీరు ఉద్ధృతంగా ఉండండతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోంది. నది ఉద్ధృతి మంగళవారం కాస్త తగ్గడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు. చీకటిపడే సమయానికి ఆచూకీ లభించలేదు. పోక్సోకేసు నమోదు బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారు..?బొబ్బిలి: ఉద్యోగ,ఉపాధ్యాయులకు, పింఛన్దారులకు సంబంధించిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె.సి.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాల యంలో ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యుల అత్యవసర సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధి కారం చేపట్టి 15 నెలలుకావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్దారుల సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రూ.23వేల కోట్ల బకాయిలను అధికారం లోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ఒక్క కరువు భత్యాన్ని కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ ఉదాసీనత కాక మరేమిటన్నారు. అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేసినా బకాయిల విడుదల విషయంలో స్పందించకపోవడం శోచనీయమన్నారు. కేబినెట్ సమావేశాల్లో చర్చించకపో వడం దారుణమని, దీని వల్ల ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. వెంటనే బకాయిలను చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను లీప్యాప్ను ఆధారం చేసుకుని గుర్తించడం సరికాదన్నారు. బోధన, సామాజిక సేవ, విద్యాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఇవ్వాలన్నారు. మూల్యాంకన ప్రక్రియ ఉపాధ్యాయులకు పెనుభారమైందని, పునరాలోచన చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు, మండల అధ్యక్షుడు సీహెచ్. జె. ప్రవీణ్కుమార్, ఆర్.ఎన్.రాజు, సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని కోనాడ జంక్షన్లో గల క్యాంపస్ చాలెంజ్ విద్యార్థులు జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 9న విశాఖలో పారా రాష్ట్రస్థాయి, జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో క్యాంపస్ చాలెంజ్కు చెందిన ఓళ్ల రామచరణ్తేజ లాంగ్జంప్, కొణతాల సోములమ్మ షార్ట్పుట్, 100 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31 వతేదీ వరకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో వారు పాల్గొనున్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్, క్యాంపస్ చాలెంజ్ డైరెక్టర్ సత్యనారాయణ శర్మ, ప్రిన్సిపాల్ గాయత్రి, కోచ్ గౌరి అభినందించారు. -
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
● వణుకు పుట్టిస్తున్న మశకాలు ● రోజురోజుకు పెరుగుతున్న దోమకారక జ్వరాలు ● నేడు ప్రపంచ దోమల నివారణ దినంసీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్గున్యా వంటి జ్వరాలను వ్యాప్తి చేస్తూ నిత్యం వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యేలా చేస్తున్నాయి. వాటి నివారణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా రోజురోజుకు దోమల తీవ్రత పెరుగుతూనే ఉంది. పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈనెల 20న ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. దోమల దినంగా ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగి 1897లో దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఈసందర్బాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టమైన పని. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కానీ దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నప్పుడు వాటిని నాశనం చేయడం చాలా సులువు. ఇవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నీటి పురుగులు, జలగలు అని పిలుస్తుంటారు. ఇలా దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. దోమలపై దాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెలా పచారీ సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్ స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తుంది.దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపట్టాం. ఐఆర్ఎస్ ఏసీఎం 5 శాతం ద్రావణాన్ని ప్రతి ఒక్క ఇంట్లో స్ప్రేయింగ్ చేసుకోవాలని చెబుతున్నాం. గంబూషియా చేపలను కూడా మురికి కుంటల్లో వేస్తున్నాం. – పీవీ సత్యనారాయణ, డీఎంవో, సీతంపేట ఐటీడీఏఅవగాహన కల్పిస్తున్నాం దోమ కారక వ్యాధులు ప్రబలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. యాంటీలార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. మలేరియా, డెంగీ వంటి వ్యాధులకు సంబంధిత పీహెచ్సీల్లో కూడా పూర్తిస్థాయిలో మందులు ఉంటున్నాయి. – జె.మోహన్రావు, మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్, సీతంపేట ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈక్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ రక్తాన్ని పీల్చినప్పుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంథుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు లాలా జలంతో పాటు పారసైట్ మనిషి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతాయి. నివారణ ఇలాచేద్దాం... దోమలు కుడితే ఎంతటి ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతాయో అందరికీ తెలిసిందే మలేరియా, డెంగీ వంటి జ్వరాలకు దోమలే కారణం. మస్కిటో రీఫిల్స్, కాయిల్స్ వంటివి మనం దోమల నివారణకు ఇంట్లో వాడతాం. వాటివల్ల కొందరికి శ్వాసకోస వ్యాధులు వస్తాయి. ఈ నివారణ చర్యలు చేపడితే మంచిదే. వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప, కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర బాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ఇళ్లల్లోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్గానే కాకుండా ఇన్స్టెక్ రిఫ్లెంట్గాను పనిచేస్తుంది. కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ దగ్గర వనంగుడిలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
‘ఓవర్ స్పీడ్’ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్
విజయనగరం క్రైమ్: జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలు, ముఖ్య కూడళ్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘ఓవర్ స్పీడ్‘ తో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో వెళ్లే వాహనాలపై 23 కేసులు నమోదు చేసి, ఈ చలానా కింద రూ.25,665/ లను విధించామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. అతివేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సంబంధిత అధికారులు వివరిస్తూ, వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని, తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి వాహనదారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారని తెలియజేశారు. 23 కేసుల నమోదు రూ.25,665 వసూలు -
జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పార్వతీపురం టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాయ్ పే చర్చలో అనేక సమస్యల్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. సుపరి పాలన తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వం తమకు ఆహ్వానించడం లేదన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ విద్యా సర్వమంగళపీఠంలో దక్షిణామూర్తి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఘనంగా 9వ ఐద్వా జిల్లా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. మహాసభల సందర్భంగా ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహాం నుంచి యూత్ హాస్టల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు భాగంలో 9మంది మహిళలు ఐద్వా జెండాలు చేతపట్టి నడిచారు. అనంతరం యూత్ హాస్టల్లో జరిగిన మహాసభలకు ఐద్వా జెండాను రాష్ట్ర అధ్యక్షరాలు పి.ప్రభావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రభావతి మాట్లాడుతూ...రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నేడు ప్రతి రోజు 50 మందికి తక్కువ కాకుండా మహిళలపై రాష్ట్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. నేడు విస్తారంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు జనాల ప్రాతిపదికన పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అదే జనాభా ప్రాతిపదికన తాగునీరు అందించడంలో, పేదలకు ఇళ్లు ఇవ్వడంలో, మహిళల మీద దాడులను నియంత్రించడంలో, లైంగిక వేధింపులు అరికట్టడంలో చిత్తశుద్ధి లేదన్నారు. మహిళల హక్కుల మీద దాడి జరుగుతోందని, సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయడం లేదన్నారు. మరో వైపు ప్రభుత్వం మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించినప్పటికీ అమలు కాలేదన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు రాష్ట్రంలో ఎక్కడికై నా ఉచిత బస్సు అని చెప్పి నేడు కేవలం పల్లె వెలుగు వంటి బస్సులకు మాత్రమే అవకాశం కల్పించి చేతులు దులుపుకున్నారన్నారు. మరోవైపు మైక్రో ఫైనాన్స్ వేధింపులు తీవ్ర స్ధాయిలో ఉన్నాయన్నారు. మైక్రో ఫైనాన్స్లు నియంత్రణకు చట్టం చేయాలని మహాసభ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. మహిళలు హక్కులు కోసం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో మహిళలు సమస్యలు పరిరష్కారం కోసం మహాసభల్లో నిర్ణయాలు చేసి, భవిష్యత్లో పెద్ద ఎత్తున పోరాటాలకు మహిళలు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. -
అమృత్ భారత్ పనుల్లో జాప్యం తగదు
పార్వతీపురంటౌన్: అమృత్ భారత్ పనుల్లో జావ్యం తగదని రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోరా అన్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్ను అందుబాటులో తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఎఫ్ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం కె.సాందీప్, సీనియర్ డీఎన్, ఏడీఎన్ తదితరులు పాల్గొన్నారు. పనులు పరిశీలించిన రైల్వే డివిజినల్ మేనేజర్ -
డోలీలో ఐదు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యు లు డోలీలో సుమారు 5 కిలోమీటర్ల మేర నిండుగర్భిణిని మోసుకుని గోపాలరాయుడుపేట వద్దకు చేర్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో పిరిడి పీహెచ్సీకి తరలించారు. ఆమె సాధారణ ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సేవలు అందిస్తున్నారు. పురిటినొప్పులు వేళ వైద్యసేవలు అందకపోవడంతో నిండుగర్భిణి ఆక్రందనలు కూటమి నాయకులకు వినిపించకపోవడం విచారకరమని గిరిజన నాయకులు మండిపడ్డారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల రమణి, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నామన్న ప్రభు త్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందని విమర్శించారు. గిరిజనులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డోలీలమోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపండగ పనులను పప్పు బెల్లాల్లా పంచుకుతిన్న కూటమి నాయకులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మరిచిపోయారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ఉపాధిహామీ నిధులతో సొంత ప్రయోజనకర పనులను చక్కబెడుతూ గిరిజనులకు డోలీ కష్టాలను మిగుల్చుతున్నారన్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
వైభవంగా ఉట్లోత్సవం
నెల్లిమర్ల రూరల్: శ్రావణ బహుళాష్టమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వేణుగోపాలస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు జరిపించారు. వేకువజామున సీతారామస్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం ఉపాలయంలో కొలువుదీరిన వేణుగోపాలస్వామికి బహుళాష్టమి సందర్భంగా పంచామృత స్నపనం, విశేష అర్చనలు నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని ప్రత్యేక పల్లకిలో గ్రామ తిరువీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం స్థానిక అయ్యవార్ల మేడ వద్ద ప్రధాన ఘట్టమైన ఉట్లోత్సవాన్ని వేడుకగా జరిపించారు. ఉట్టిని కొట్టేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. కార్యక్రమంలో అర్చకులు నరిసింహాచార్యులు, కిరణ్, రామగోపాల్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు -
మాజీ సైనికులకు లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
విజయనగరం లీగల్: మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు లీగల్ సర్వీసెస్ క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. వీర్ పరివార్ సహాయత యోజన స్కీమ్ 2025ను అనుసరించి ప్రతి జిల్లాలోనూ లీగల్ సర్వీసెస్ క్లినిక్ను ప్రారంభించి మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి కేవీఎస్ ప్రసాదరావు, న్యాయవాది ధనుంజయరావు, పారా లీగల్ వలంటీర్ జి.రమణ, పెద్దసంఖ్యలో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. 29న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలురాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 29న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (31 రోజులు), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), హౌస్ వైరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ (13 రోజులు), ప్లంబింగ్ అండ్ శానిటరీ వర్క్స్ (30 రోజులు), అలాగే సీ్త్రలకు హోం నర్సింగ్ (25 రోజులు), లేడీస్ టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (35 రోజులు), కంప్యూటర్ డీటీీ ప (45 రోజులు)లో శిక్షణ ఉంటుందని అన్నా రు. ఇంటర్వ్యూకు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డులతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కేజీబీవీ ప్రిన్సిపాల్పై కక్ష సాధింపు సరికాదు ● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన నెల్లిమర్ల రూరల్: శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్పై ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ సౌమ్యను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం క్షమించరాని నేరమన్నారు. రాత్రి 10 గంటలు దాటిన వరకు టీడీపీ కార్యాలయంలో సౌమ్యను ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి ఆమెను తీసుకువచ్చిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ
వ్యక్తిగతంగా లేదా.. పాఠశాలల నుంచి వరీక్షలు రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవవచ్చు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జి.లక్ష్మణ రావు, జిల్లా సైస్స్ అధికారిపార్వతీపురంటౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు, పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్న్ మంథన్న్(వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే నెలకు రూ. 2000 వేలు చొప్పున సంవత్ససృజనాత్మకతను వెలికి తీసేందుకే.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ చక్కని వేదికగా నిలుస్తుంది. సైన్స్ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పరీక్షలో ప్రభుత్వ, ఇతర యాజమాన్య, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. – బి.రాజకుమార్, డీఈఓ, పార్వతీపురం మన్యంరానికి రూ.24 వేలు స్కాలర్షిప్ అందుకునే అవకాశం ఉంటుంది. జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. రాష్ట్ర స్థాయికి ఎంపిక ఇలా.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారిగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యార్థి విజ్ఞానన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్న్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆనన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వ తేదీలోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష ఆనన్్ లైన్ పద్ధతిలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్న్లోడ్ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. విద్యార్థి, విజ్ఞాన్ మంఽథన్కు దరఖాస్తుల ఆహ్వానం సెప్టెంబర్ 30 రిజిస్ట్రేషన్లకు తుదిగడువు మూడు విడతల్లో పరీక్ష -
సీఆర్టీల ఆందోళన
కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న సీఆర్టీలు ● హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ పార్వతీపురం రూరల్: సీఆర్టీలు ఆందోళన బాటపట్టారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏడాదిలో 11 నెలలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. ఐటీడీఏ అధికారుల నిర్వాకం వల్ల ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆరోపించారు. డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయని, కొత్తవారికి పోస్టులు కేటాయిస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సుమారు 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయాలంటూ యూటీఎఫ్, సీఆర్టీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పోరుబాటకు పూనుకున్నారు. -
తీరంలో.. అలెర్ట్
● నాలుగు రోజులుగా నిలిచిన చేపల వేట ● మత్స్యకార గ్రామాలను సందర్శించిన అధికారులుపూసపాటిరేగ: తీరప్రాంత గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించి మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు తీరంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండాలని కోరారు. ఎంపీడీఓ ఎం.రాధిక కోనాడ గ్రామంలో పర్యటించారు. కోనాడ సెలయేరు వద్ద చంపావతినది నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చింతపల్లి, తిప్పలవలస గ్రామాల్లో తహసీల్దార్ ఎన్వీ రమణ పర్యటించి మత్స్యకారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. -
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
లీప్ యాప్ ప్రామాణికంగా..వీరఘట్టం: ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారు చేసిన సేవలకు గాను మండల, జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా సత్కరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తమ టీచర్ల ఎంపికకు ‘లీప్’ యాప్ను ప్రామాణికంగా చేస్తూ తీసుకువచ్చిన నూతన విధానాన్ని టీచర్లతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. లీప్ యాప్ ప్రాధాన్యతపై గుర్రు.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రస్తుతం లీప్ యాప్ ఎంతో కీలకం. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్ధుల పురోగతి పర్యవేక్షణ, తల్లిదండ్రులతో సమావేశాలు, విద్యార్థుల వ్యక్తిగత సంరక్షణ, విద్యార్ధుల గ్రీన్ పాస్పోర్టు తదితర కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టీచర్ లేదా..విద్యార్థులతోనైనా ఈ పనులు చేయిస్తుంటారు. అలాంటప్పుడు ‘లీప్’ యాప్ నిర్వహణను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు,టీచర్లు గుర్రుగా ఉన్నారు. వారంతా బెస్ట్ టీచర్లా? ప్రతి రోజు స్కూల్ వేళకు వచ్చి ఆన్లైన్లో అటెండెన్స్ వేసిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.అయితే కొందరు టీచర్లు ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉండి చదువే చెప్పకుండా యాప్లో మాత్రం కచ్చితంగా అటెండెన్స్ వేసే వారు అక్కడక్కడా ఉన్నారు. ఇంకొందరు పాఠశాలకు ఉదయం వెళ్లి యాప్లో అటెండెన్స్ వేసి బయటకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు మళ్లీ వెళ్లి ‘ఔట్’ అటెండెన్స్ వేస్తున్నారు. ఇలాంటి వారు బెస్ట్ టీచర్లు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. లీప్ యాప్ ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక నిపుణులు ప్రతి జిల్లాకు 16 మంది టీచర్లను ఎంపిక చేసి వారి జాబితాలను పంపినట్లు సమాచారం. వారందరినీ జిల్లాస్థాయి అవార్డుకు ఎంపిక చేసేలా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. లీప్ యాప్ ప్రామాణికంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయాలనే నిర్ణయం సరికాదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి 23 లోపు గుర్తింపు 25న జాబితా ప్రకటన రాష్ట్రస్థాయికి ఒక్కో జిల్లా నుంచి 8 మంది ఎంపిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం నరైంది కాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు విశిష్ట సేవలు అందిస్తున్న టీచర్లను పారదర్శకంగా గుర్తించాలని డిమాండ్ఈ విధానం సరైంది కాదు లీప్ యాప్ ప్రామాణికంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు టీచర్లను గుర్తిస్తామనడం సరైన విధానం కాదు. గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.అటువంటి వారిని పారదర్శకంగా గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయాలి. – మండల మురళి, ఏపీటీఎఫ్, మండలశాఖ అధ్యక్షుడు, వీరఘట్టం -
ముగ్గురు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● సెలవు అనుమతి లేకుండా జిల్లా దాటివెళ్తే చర్యలు ● ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలివిజయనగరం అర్బన్: సెలవు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అధికారులను హెచ్చరించారు. సెలవు మంజూరు చేయకుండా సంక్షేమ శాఖ అధికారిణి పీజీఆర్ఎస్కు గైర్హాజరు అవడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా సమయపాలన పాటించకుండా పీజీఆర్ఎస్కు ఆలస్యంగా హాజరైన డీఎంహెచ్ఓ జీవనరాణిపై కలెక్టర్ ఆగ్రహించారు. బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వహించిన కారణంగా మరో అధికారి ఐసీడీఎస్ పీడీ విమలారాణిపై సీరియస్ అయి సరెండర్ ఉత్తర్వులు ఇవ్వమని డీఆర్ఓను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అంగన్వాడీ పిల్లలకు సోమవారం సెలవు ఇవ్వాలని ఆదివారం రాత్రి కలెక్టర్ స్వయంగా ఇచ్చిన సెల్ మెసేజ్ను 24 గంటల వరకు ఐసీడీఎస్ పీడీ చూడలేదు. దీన్ని సీరియస్గా తీసుకుని ఈ ఆదేశాలు జారీచేశారు. ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలాగాంధీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని అర్జీలపై తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 94 అర్జీలు అందజేశారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తన చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ 27 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదుదారుల ముందే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అక్కడికక్కడే ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్ట్ రూపంలో డీపీఓకు పంపాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
భారీ వర్షాలపై అప్రమత్తం
● ఎంపీ తనూజారాణిపాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ఒక ప్రకటనలో కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి ఏజెన్సీతో కలిగి ఉన్న ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం కలెక్టర్ను ఫోన్లో సంప్రదించి చేపట్టవలసి చర్యలు వివరించామని పేర్కొన్నారు. ప్రధానంగా నదీతీర గ్రామాల్లో ప్రజల ను అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి మండలంలోను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతుల పంటలకు, పశు సంపదకు నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని ఈ పరిస్థితుల్లో ముందుగానే వాటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయంలో కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 08963293046కు సంప్రదించాలని స్పష్టం చేశారు. -
పాపం.. ఎవరో ఈమె..!
● వర్షంలో తడుస్తూ అమాయకంగా రోదిస్తూ ● కారు చీకటిలో మూడు రోజులుగా బొప్పడాం జంక్షన్లోనే ● సపర్యలు చేస్తున్న స్థానికులు నెల్లిమర్ల రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలికి సుమారు 80 ఏళ్లు పైనే ఉంటాయి. మూడు రోజుల క్రితం నెల్లిమర్ల మండలంలోని బొప్పడాం జంక్షన్కు వచ్చి..అప్పటి నుంచి అక్కడే ఉన్న బస్టాప్లోనే ఒంటరిగా ఉంటోంది. వర్షానికి తడుస్తూ..అమాయకంగా రోదిస్తూ ఏమీ చెప్పలేని దీనావస్థలో ఉంది. స్థానిక విజయగౌరి యువజన సేవా సంఘం అధ్యక్షుడు పిల్లా సుధాకర్తో పాటు పలువురు స్థానికులు సదరు వృద్ధురాలిని అక్కున చేర్చుకుని మూడు రోజుల నుంచి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయినప్పటికీ రాత్రి సమయంలో కారు చీకటిలో ఒంటరిగా బస్టాప్లోనే కాలాన్ని వెళ్లదీస్తోంది. స్థానికులు ఆరా తీయగా..తన పేరు శ్రీకాకుళం దుర్గమ్మ అని..భర్త పేరు సత్యం అని చెబుతోంది. పెద్ద కూతురు పేరు గంగమ్మ అని, కుమారుడి పేరు సన్యాసిరావు అని చెబుతోంది. ఊరు పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఒక సారి జామి వద్ద బంధువులు ఉన్నారని..మరో సారి పొందూరు, రాజాం అంటూ చెబుతోందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు చెబుతున్నప్పటికీ ఊరి పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోందంటున్నారు. మూడు రోజుల క్రితం విజయనగరం నుంచి బస్సులో బొప్పడాం జంక్షన్లో దిగిందని చెబుతున్నారు. బంధువుల ఇంటికి వెళ్లి తప్పిపోయిందా..? లేక మతిస్థిమితం లేక ఇంటి నుంచి వచ్చేసిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిస్తే ఫోన్ 8374273700 నంబర్కు సమాచారం ఇవ్వాలని సామాజిక కార్యకర్త సుధాకర్ కోరారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, ఎవరూ స్పందించకపోతే వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని ఆయన తెలిపారు. -
నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల
రాజాం: తుఫాన్ వర్షాలకు ప్రభుత్వ, పైవేట్ పాఠశాలలకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. రాజాంలోని చీపురుపల్లి రోడ్డులో గల ప్రభాకర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొండిగా వ్యవహరించి, పాఠశాల తెరవడమే కాకుండా తరగతులకు గైర్హాజరైన విద్యార్థులపై చర్యలు ఉంటాయని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు తెలియడంతో రాజాం ఎంఈఓ యాగాటి దుర్గారావు పాఠశాలకు సోమవారం చేరుకుని తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడం చూసి మండిపడ్డారు. యాజమాన్యాన్ని మందలించడంతో పాటు నోటీసులు అందించారు. వెంటనే తరగతి గదుల్లోని విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించాలని ఆదేశించడంతో పాటు దగ్గరుండి ఇళ్లకు తరలించారు. అనంతరం నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. మరో ప్రైవేట్ పాఠశాల తెరిచి ఉందని తెలిసి అక్కడికి వెళ్లి తనిఖీచేశామని ఎంఈఓ విలేకరులకు తెలిపారు. అప్పటికే అక్కడి విద్యార్థులు వెళ్లిపోయారన్నారు. -
పాముకాటుతో అస్వస్థత
సీతంపేట: మండలంలోని పాతపనుకువలసకు చెందిన కుండంగి బలరామ్ ఆదివారం రాత్రి పడుకున్న సమయంలో విషసర్పం కాటువేసింది. దీంతో అస్వస్థతకు గురవగా స్థానిక ఏరియా ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు వైద్యులు రిఫర్ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువతిని మోసం చేసిన ముద్దాయికి ఏడాది జైలుశిక్షవిజయనగరం క్రైమ్: రెండేళ్ల క్రితం ఒక బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ముద్దాయికి విజయనగరం విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి. కె.నాగమణి ఏడాది జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. నగరంలోని కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు అనే వ్యక్తి 2023లో ఒక మైనర్ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పట్లోనే మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సై లక్ష్మి కేసు నమోదు చేశారు. ఆ కేసులో అప్పటి డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి అభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సాక్షులను, ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో స్పెషల్ ఫర్ పోక్సో కోర్టు నాగమణి ముద్దాయి దశమంతుల లక్ష్మణరావుకు పై విధంగా శిక్ష విధించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఈకేసులో బాధితురాలికి రూ.20 వేలు పరిహారంగా ఇవ్వాలంటూ కోర్టు తుది తీర్పు ఇచ్చిందన్నారు. -
అర్జీలన్నీ పరిష్కారం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం వచ్చిన అర్జీలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు తేల్చిచెప్పారు. కలెక్టర్తో పాటు అర్జీల స్వీకరణలో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణిలు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలన్నీంటినీ పరిష్కారం చూపాలని, ఎక్కడా పెండింగ్ లేకుండా చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. సోమవారం మొత్తం 65 వినతులు పలు సమస్యలపై అర్జీదారులు అందజేశారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు తగ్గిన వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వినతులు తగ్గాయి. ప్రతి సోమవారం 20కు తగ్గకుండా వచ్చే వినతులు ఈ వారం పదిమాత్రమే వచ్చాయి. భారీగా వర్షాలు కురవడం, ఉభాల సీజన్ కావడంతో వినతులు తగ్గాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు వినతులు స్వీకరించారు. టిటుకుపాయికి చెందిన నిమ్మక చిరంజీవితో పాటు పలువురు గ్రామస్తులు కొండచీపుళ్లు కొనుగోలు చేసి, విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని పాలిష్కోటకు చెందిన భవాని కోరగా లాడకు చెందిన సుక్కయ్య వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని అర్జీ అందజేశాడు. పాతరేగులగూడకు చెందిన సుక్కమ్మ పవర్ వీడర్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో పలువురు ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. -
వీరఘట్టంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
● లైసెన్స్ లేని 10 షాపులకు నోటీసులువీరఘట్టం: ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకమైన చిరుతిళ్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, కాలం చెల్లిన స్నాక్స్ తిని చిన్నారులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని సోమవారం సాక్షి లో ప్రచురితమైన ‘డేంజర్ స్నాక్స్’ కథనంపై జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ఎం.వినోద్కుమార్ నాయక్ వీరఘట్టంలోని పలు షాపుల్లో సోమవారం ముమ్మర తనిఖీలు చేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా మరో వైపు షాపుల్లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లు పరిశీలించారు.మొత్తం పది షాపుల్లో తనిఖీలు చేయగా అన్ని షాపుల్లో కూడా ఎక్కడా తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీ గాని, ఎక్స్పైరీ డేట్ గాని లేకపోవడాన్ని గుర్తించారు.ఈ షాపులన్నింటికీ ఆయన నోటీసులు ఇచ్చారు.కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లను సీజ్ చేశారు. అయితే ఊరిలోకి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వచ్చారని తెలియడంతో చాలా షాపులు మూసి వేయడంపై ఆయన షాపుల యజమానుల తీరుపై మండిపడ్డారు.ఆహార పదార్థాలు విక్రయించే ప్రతి షాపు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.ఇక మీదట ప్రతి వారం వీరఘట్టంలో ఉన్న అన్ని షాపులు తనిఖీ చేస్తానని ఆయన తెలిపారు.వ్యాపారులు సహకరించాలని, నిబంధనలు పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. -
పెళ్లి ముచ్చట తీరకుండానే..!
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి రామభద్రపురం: పెళ్లయిన మద్దుముచ్చట తీరకుండానే రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రామభద్రపురం మండలలోని శిష్టుసీతారాంపురం రహదారిపై జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శిష్టుసీతారంపురం గ్రామానికి చెందిన వెన్నెల అప్పారావు(31) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వెళ్లాడు. పనిముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోతుండగా అధికంగా వర్షం కురవడం వల్ల ద్విచక్రవాహనం అదుపు తప్పి సీతారాంపురం గ్రామం రూట్లో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అక్కడిక్కడే దుర్మణం చెందాడు. వెంటనే స్థానికులు మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ప్రశాంతికుమారి, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.పెళ్లయి రెండు నెలలే అయిందని, ముద్దు, ముచ్చట తీరకుండా వెళ్లిపోయావా? అంటూ వారి రోదన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.ఏరియా ఆస్పత్రి కిటకిటసీతంపేట: విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిట లాడింది. జ్వరంతో పాటు వివిధ రోగాల బారిన పడిన వారు ఆస్పత్రికి వస్తున్నారు. మొత్తం ఓపీ 345 మంది రాగా వారిలో జ్వరాలతో బాధపడుతున్న వారు 71 మంది ఉన్నారు. ఇన్పేషెంట్లుగా 71 మంది చేరారు. వారందరికీ రక్తపరీక్షలు చేసి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.చెరువులో పడి వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామానికి చెందిన బోదంకి ఎర్నాయుడు (50) గ్రామంలోని వీర సాగరం చెరువులో పడి మృతిచెందాడు. ఎర్నాయుడు పశువులు మేపుతున్న సమయంలో అవి చెరువులోకి దిగడంతో వాటిని తోలేందుకు చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయాడు. ఎర్నాయుడు చెరువులో దిగి ఎంత సేపటికీ రాకపోవడంతో స్థానికులు చెరువులో దిగి వెతికి బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. -
20న కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరుకావాలి
విజయనగరం క్రైమ్: ఇటీవల విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్గా ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటలకు హాజరు కావాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అభ్యర్థులు తమ సెలక్షన్ అప్లికేషన్తో పాటు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన మూడుసెట్ల విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్సు కాపీలను, మూడు పాస్ఫొటోలు తీసుకురావాలన్నారు. జిల్లాలో నిర్వహించిన పోలీస్ ఎంపిక ప్రక్రియలో 723 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఆర్థిక ప్రోత్సాహకం అందజేయాలని ఆదేశం విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద శస్త్రచికిత్స, చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ (ఆర్థిక ప్రోత్స హకం)ను అందజేయాలని డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి ఆదేశించారు. ఏడాదిన్నర కాలంగా ఎస్.కోట ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోతాహకం అందడం లేదనే అంశంపై ఈనెల 17వ తేదీన ‘అందని ఆర్థిక ప్రోత్సాహకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి డీసీహెచ్ఎస్ స్పందించారు. తక్షణమే ఇన్సెంటివ్ను అందజేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలో 150 ఆధార్ శిబిరాలు ● గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి రోజారాణి విజయనగరం అర్బన్: ఆధార్ నమోదు, అప్డేట్ కోసం జిల్లాలో 150 ఆధార్ శిబిరాలను మంగళవారం నుంచి నిర్వహిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి రోజారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూల్స్లో చదువుతున్న పిల్లలు తమ కోర్ బయోమెట్రిక్ను ఆధార్ డేటా బేస్లో అప్డేట్ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 లక్షల మంది అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్నారు. తల్లికి వందనానికి సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్ల ఎన్పీసీఐ లింకింగ్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమ కాలేదని, అలాంటివారు పోస్టల్లో ఖాతాలు తెరవాలన్నారు. ఈసీ తాటాకు చప్పుళ్లకు భయపడం ● డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ విజయనగరం ఫోర్ట్: ఎన్నికల కమిషన్ తాటాకు చప్పళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఓట్ల చోరీకి నిరసనగా విజయనగరం మూడు లాంతర్ల వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ బీజీపేకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించా రు. ఎన్నికల కమిషన్ తప్పిదాలకు నైతిక బాధ్యతగా సీఈసీ జ్ఞానేశ్వర్, ఎలక్షన్ కమిషనర్లు సుఖబీర్ సింగ్ సందు, వివేక్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూడి శ్రీనివాస్, గణేష్, శ్రీనివాస్, షరీఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు విజయనగరం: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 20న జరుగుతాయని ిసీఈఓ బి.వి.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జెడ్పి సమావేశ మందిరంలో జరగనున్న 1–7 స్థాయీ సంఘ సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. -
వరద తాకిడి
సంతకవిటి/డెంకాడ/వంగర: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగాయి. పంటల పొలాలను వరదనీరు ముంచెత్తింది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ● తుఫాన్ ప్రభావంతో సంతకవిటిలో సోమవారం 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోళ్లవలస, ఎమ్.ఆర్.అగ్రహారం, సంతకవిటి గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. తహసీల్దార్ బి.సుదర్శనరావు నదీ తీర గ్రామాలైన జావాం, కె.ఆర్.పురం, రంగారాయపురం, పి.జె పేట, తమరాం, మేడమిర్తి, బూరాడపేట, హొంజరాం, పోడలి, చిత్తారపురం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలను నదులవైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. ● భారీ వర్షాలకు డెంకాడ మండలం గొడిపాలెం పాలగెడ్డ రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తోంది. ● వంగర మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరదతాకిడి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 8వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 10వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు డీఈ పి.అర్జున్ తెలిపారు. ● నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వంగర మండల పరిధి వి.వి.ఆర్.పేట, రాజులగుమ్మడ, రుషింగి, తలగాం, శివ్వాం తదితర తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు విజయనగరం అర్బన్: జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై సోమవారం సమీక్షించారు. పారిశుద్ధ్య పనులపై ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ మండలాల్లో 100 మిల్లీ మీటర్లపైగా వర్హపాతం నమోదైందన్నారు. నాగావళి పరివాహక ప్రాంతమైన సంతకవిటి, రాజాం, ఆర్.ఆముదాలవలస, వంగర మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మడ్డువలస రిజర్వాయర్ ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో నిలకడగా ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ, రోడ్డు భవనాలు, మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి శాఖలకు సంబంధించిన పనులు పూర్తిచేయాలన్నారు. వసతిగృహాల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. -
దివ్యాంగులపై కూటమి కుట్ర..!
● ఇది అన్యాయం ఈ చిత్రంలో కనిపిపస్తున్న దివ్యాంగురాలి పేరు జాగరపు సత్యవతి. ఈమెది ఎస్.కోట మండలం ఆలుగుబిల్లి( కొత్తకోట). ఆమెకు గత ఆరేళ్లుగా దివ్యాంగుల పింఛన్ అందుతోంది. రెండు రోజుల కిందట దివ్యాంగ్ పింఛన్ నిలిపివేస్తున్నట్టు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ నోటీసు ఇచ్చారు. గతంలో ఆమెకు జిల్లా ఆస్పత్రి (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి) వైద్యులు 66 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్టు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పడు నోటీస్లో పింఛన్ పొందడానికి రీ అసెస్మెంట్లో అనర్హులుగా వైద్యులు గుర్తించినందున తొలిగిస్తున్నట్టు నోటీస్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు వేమలి పెంటయ్య. ఈయనది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి గత 15 ఏళ్లుగా పింఛన్ వస్తోంది. శాశ్వత వైకల్యం ఉన్నట్టు జిల్లా ఆస్పత్రి (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి) వైద్యులు సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సోమవారం ఇతనికి పింఛన్ నిలిపివేస్తున్నట్టు సచివాలయం ఉద్యోగి నోటీసు అందజేశారు. విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోంది. వివిధ పథకాల్లో కోత పెట్టడమే పనిగా పెట్టుకుంది. సర్వేల పేరుతో అర్హులను అనర్హులుగా ముద్రవేస్తోంది. తాజాగా దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టింది. దివ్యాంగ పింఛన్ల పరిశీలన పేరిట అర్హులకు అన్యాయం చేస్తోంది. ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు కొత్త నిబంధనలతో కొర్రీ పెడుతోంది. గత సదరం ధ్రువపత్రాలను రద్దు చేసి, దివ్యాంగత్వ శాతం తక్కువ ఉందన్న నెపంతో వేలాది మందిని లబ్ధికి దూరం చేస్తోంది. దివ్యాంగులు, ఆరోగ్యపరమైన సమస్యలున్న వారి కోటాలో రూ.6 వేలు, రూ.15 వేలు చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు లబ్ధి పొందారన్న ఆరోపణలతో గత జనవరి నుంచి సర్వే చేపడుతోంది. ఈ క్రమంలో చాలా మంది అర్హులకు అనర్హత నోటీసులు అందిస్తుండడంతో వారిలో ఆందోళన మొదలైంది. వారంతా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో పింఛన్ బాధితులు అధికమంది కలెక్టర్కు వినతులు అందజేశారు. ఇదెక్కడి అన్యాయం బాబూ.. పుట్టుకతో దివ్యాంగత్వం ఉన్నా... పుట్టకతో పోలియో బారిన పడిన వారు, పక్షవాతంతో ఏళ్ల తరబడి బాధపడుతున్నవారు, అంధులు, కాలు, చేయి వైకల్యం ఉన్నవారు, మానసిక దివ్యాంగులు, చెవిటి మూగవారు.. ఇలా అనేక మంది పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇవ్వడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పల్లెల్లోని రచ్చబండలపై కూటమి తీరును ఎండగడుతూ, విమర్శనాత్మక చర్చలు జోరందుకున్నాయి. పరిశీలన పేరిట పింఛన్ల తొలగింపు జిల్లాలో వేలాది మందికి ఫించన్లు నిలిపివేస్తూ నోటీసులు జారీ ఆవేదన చెందుతున్న దివ్యాంగులు జిల్లాలో ఐదువేల మందికి పైబడి నోటీసులు పుట్టకతో పోలియో ఉన్నవారికి సైతం నిలిపివేసిన వైనం ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న దివ్యాంగులు, ప్రజాసంఘాలు రేగిడి: దివ్యాంగుల పింఛన్లు రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. రేగిడిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్ అందజేస్తున్నామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు పింఛన్లు రద్దుచేస్తూ నోటీసులు అందజేస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇంతవరకు కొత్తగా ఒక్క దివ్యాంగునికి కూడా పింఛన్ మంజూరుచేయకుండా, ఇప్పుడు ఉన్నవి రద్దుచేసేందుకు నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. దివ్యాంగుల్లో బోగస్ పింఛన్ పొందుతున్నవారు ఉన్నారని చంద్రబాబు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు పింఛన్ రద్దు అయిన వారిలో గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పింఛన్ మంజూరైన వారు ఉన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆధార్ కార్డులు మార్పుచేసుకుని తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారులైన విషయం కూటమి నాయకులు గుర్తెరగాలని వివరించారు. మరోసారి విశాఖపట్నం కేజీహెచ్ వైద్యాధికారులతో పింఛన్ రద్దయిన దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సెప్టెంబర్ నుంచి పింఛన్ నిలిపివేస్తాం రీ వెరిఫికేషన్లో వైద్యులు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్టు నిర్ధారించిన వారికి సెప్టెంబర్ నెల నుంచి పింఛన్ నిలిపివేస్తాం. ఇందులో 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ కింద మార్పుచేసి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అందుకున్న దివ్యాంగులు అప్పీల్కు వెళ్లవచ్చు. సర్వజన ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలో మాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్ను తీసుకుని ఎంపీడీఓకు అందజేయాలి. నోటీస్ అందుకున్న 30 రోజుల్లోగా సర్టిఫికెట్ అందజేయాలి. – శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీపింఛన్ల తొలగింపుపై దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. రూ.200 నుంచి పింఛన్ అందుకుంటున్నామని, ఇప్పుడు రూ.6000 ఇచ్చినట్టే ఇచ్చి తొలగించడంపై గగ్గోలు పెడుతున్నారు. జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. జిల్లాలో ఐదు వేలకు పైగా దివ్యాంగులకు పింఛన్లు తొలిగిస్తున్నట్టు సచివాలయ సిబ్బంది నోటీసులు అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి వచ్చే పింఛన్ తొలిగిస్తున్నట్టు నోటీస్ ఇవ్వడం పట్ల లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. -
కూటమి అడ్డగోలు జీఓపై ఆందోళన
విజయనగరం: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి నిరాకరించేలా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అడ్డగోలు జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యా విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యావిభాగం జిల్లా అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, యువజన నాయకులు జి.ఈశ్వర్కౌశిక్, చాణుక్య మాట్లాడుతూ నారాలోకేశ్ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు తన రెడ్బుక్ పరిపాలనలో భాగంగా నూతన జీఓను తీసుకు వచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ విద్య అందకుండా చేస్తోందని ఆరోపించారు. అనంతరం బాలాజీ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కూటమి దుర్మార్గ పాలనపై అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యా యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. -
చిత్రం చూసి చిత్తరువొందే..!
వేల అక్షరాలు..వందల వాక్యాల్లో తెలియ చేయలేని భావం..ఒక్క చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. కాల గమనం సాగిపోతున్న క్రమంలో గతంలో జరిగిన ఘట్టాలైన సంతోషం, బాధ, సాధించిన విజయాలు మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం ఒక్క ఫొటోతోనే సాధ్యం. ప్రకృతిలోని అందాలను, పొట్టకూటి కోసం వలస కూలీల బతుకు ప్రయాణం, కార్ఖానాల్లో కార్మికుల కష్టాలు, పొలాల్లో అన్నదాతల కష్టాల సాగు, మహిళల తాగునీటి ఇబ్బందులు, మూగజీవాల ఆర్తనాదాలు..రోడ్డు ప్రమాదాల వంటి ఎన్నో ఘటనలను ఒక్క ఫొటో విశదీకరిస్తుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే -
అప్పీల్ పేరుతో ఇబ్బందులా?
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పింఛన్లు అరికట్టేందుకు జరిపిన పునఃపరిశీలనలో భాగంగా చాలామంది అర్హులను కూడా తొలగించడం అన్యాయమని, దీనిని సరిచేయాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్కు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. మంచంపైనుంచి కదల్లేని దివ్యాంగులు ఆస్పత్రులకు వెళ్లి మాన్యువల్ సర్టిఫికెట్ తీసుకోవడం, దానిని 30 రోజుల్లోగా ఎంపీడీఓకు అందజేయడమంటే సాధ్యంకాని పని అన్నారు. అర్హుల పింఛన్ రద్దయితే వారి బతుకు ఛిద్రంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. -
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా
విజయనగరం అర్బన్: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా పెడుతూ విస్తృతంగా దాడులు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట విరుద్ధ చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదం, కోడి–గొర్రె పందాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ పట్టుబడుతున్న నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లే–అవుట్లు, గ్రామ శివారు, నగర శివారు, తోటలు, పాడుబడిన భవనాల్లో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయం తీసుకుంటున్నామని వివరించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ముందుగానే సమాచారం సేకరించి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పేకాట విషయంలో 1,031 మందిపై 141 కేసులు నమోదు చేసి రూ.24,07,398 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడి పందాల విషయంలో 174 మందిపై 35 కేసులు, రూ.1,13,679 నగదు, 75 కోళ్లు, 4 పొట్టేళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెపారు. మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి చట్టవిరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అసాంఘిక కార్యకలాపాలపై ఏమైనా సమాచారం తెలిసినా స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100కు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ -
సమాజం అభివృద్ధికి జర్నలిస్టుల బాధ్యత కీలకం
విజయనగరం గంటస్తంభం: సమాజంలో జరుగుతున్న మంచి, చెడును వెలికి తీసి అభివృద్ధికి దోహదపడే పవిత్ర వృత్తిలో జర్నలిజం కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 68వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, ఏటీకే వ్యవస్థాపకుడు డా.ఖలీల్బాబా జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సీవైచింతామణి, మానుకొండ చలపతిరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అందరూ ఏక తాటిపై నిలిచి ఒకే జాబితా ఇస్తే అర్హులందరికీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వృత్తిలో ఉన్న జర్నలిస్టుల వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కరింగ్ వ్యవస్థను సుమారు 15 నుంచి 20 రోజుల్లో తీసుకొస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ శివప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ జీవనానికి సరిపడ ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తినే నమ్ముకున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు సత్కారం అనంతరం జిల్లాలో 25 ఏళ్లపాటు జర్నలిజం వృత్తిలో ఉన్న 40 మంది సంఘం సభ్యులను సంఘం జ్ఞాపికలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంఎస్ఎన్రాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశర్మ, కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు ఎలిశెట్టి సురేష్, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ, జె.శేషగిరి, జయరాజ్, లింగాల నర్శింగరావు, మంత్రి ప్రగడ రవి, శంకరావు, గోవింద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవం -
గంటేడ పాటల పుస్తక పరిచయం
పార్వతీపురం: ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరునాయుడు రాసిన పాటల పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేటివరకు ఆయన రాసిన పాటలను గుర్తుచేస్తూ వక్తలు ఉపన్యాసాలు ఇచ్చారు. ముందుగా పాయల మురళీకృష్ణ పుస్తక పరిచయం చేయగా పలువురు గంటేడ రాసిన పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ప్రజల జీవన శైలిని ప్రజలకు ఉన్న ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అని, ‘స్నేహకళా సాహితి’ పేరుతో సంస్థను స్థాపించి కళింగాంధ్ర ప్రాంతంలో ఎందరో యువ కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ కృష్ణాజీ హాజరు కాగా చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. దేశ గత చరిత్ర నెత్తిటి మరక పాటల సీడీని డాక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, గజల్ వినోద్, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మేధావులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
దోమకాటు.. ప్రాణాంతకం
పార్వతీపురం రూరల్: ప్రతి వ్యాధికి ప్రస్తుత కాలంలో దోమకాటే మూల కారణమవుతుందని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు దోమ ఎంత ప్రమాదకరమైందో, దోమలతో సోకే వ్యాధుల గురించి తెలుసుకుందాం. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలన్నీ దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. దోమకాటుతో వచ్చే వ్యాధులు–లక్షణాలు మలేరియా: ఆడ అనాఫిలస్ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది. లక్షణాలు: చలి, వణుకుతో జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తూ ఉంటుంది. డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడిస్ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరల్ జ్వరంగా ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో మొదలవుతుంది. ప్లేట్లెట్స్ అమాంతం తగ్గిపోతాయి. లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది. చికున్ గున్యా: ఏడిస్ ఈజిప్ట్ దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లలో, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు. లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం. ఫైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, వెన్ను పాము దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్తనాలు, వరిబీజం, జ్ఞానేంద్రియాలు పాడవుతాయి. మెదడువాపు క్యూలెక్స్ ఆడదోమ కుట్టడంతో వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువ కావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒకపక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్ రావడం. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పునీటి నిల్వలతోనే ప్రమాదం వారం పదిరోజుల వ్యవధిలో పరిసరాల్లో కాని, ఇంట్లో ఉన్న నీటి నిల్వల్లో మలేరియా దోమలు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్లు, చల్లదనం కోసం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాటి ద్వారా వచ్చిన నీటి నిల్వల్లో డెంగీదోమ వ్యాప్తి చెందుతుంది. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 915 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి, రెండవ విడతలో స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. ప్రజలు జ్వరాలు బారిన పడినపుడు కచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. – డా.తెర్లి జగన్మోహన్రావు, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారితీసుకోవాల్సిన జాగ్రత్తలుడెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే మంచిమార్గం. దోమతెర: రాత్రిలో పడుకునే ముందు దోమతెర వాడాలి. లేదంటే శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు వేసుకోవాలి. వేపనూనె: వేపనూనె, కొబ్బరినూనెను 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి. నిమ్మనూనె: దోమల నివారణకు యూకలిప్టస్, లెమన్ ఆయిల్ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటిహాని ఉండదు. కర్పూరం: చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించి 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారిణిగా పనిచేస్తుంది. -
పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు
● గ్రామాల్లో కొనసాగుతున్న సంప్రదాయం వేపాడ: పూర్వీకుల సంప్రదాయాలను పల్లెల్లో నేటికి ఆచరిస్తూ ఉండడంతో నేటి తరానికి సంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయని పెద్దలు అంటున్నారు. వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో ఆదివారం జరిగిన వివాహం సందర్భంగా పెళ్లికూతురును వేపాడ, వల్లంపూడి జంట గ్రామాల్లో పల్లకిలో ఊరేగించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరు ముహుర్తం కావడంతో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. మరో 30రోజుల పాటు వివాహాలకు శూన్యమాసం రావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. రెడ్డివానివలసలో కార్డన్సెర్చ్మెంటాడ: నాటుతుపాకుల ఏరివేతలో భాగంగా మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ మధుర గ్రామం రెడ్డివానివలసలో సీఐ జీఏవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ –సెర్చ్ ఆపరేషన్ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. సోదాల్లో భాగంగా 70లీటర్ల సారా, 1000 లీటర్ల మడ్డి కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కె.సీతారాం తెలిపారు.పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరామభద్రపురం: మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రమేష్ కడుపునొప్పితో బాధపడుతున్నాడు.రోజూలాగానే పొలంలో పనిచేస్తుండగా కడుపులో నొప్పి రావడంతో ఈ నెల 15వ తేదీన గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు బాడంగి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. నాగావళి నదిలో వ్యక్తి గల్లంతుసంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగానే ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నదికి వెళ్లాడు. ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నది దగ్గరికి వెళ్లి చూడగా నది వద్ద దుప్పటి, చెప్పులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్.గోపాలరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అలాగే సంఘటన స్థలాన్ని తహసీల్దార్ బి.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఆర్ఐ కృపారావు, వీఆర్ఓ అన్నారావులు పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో కలెక్టర్ దృష్టిలో పెట్టామని, ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చిన వెంటనే గాలిస్తామని తెలిపారు. పోలయ్య అల్లుడు ఎ.చిన్నారావు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
ఆటోమేటిక్ కష్టాలు
రాజాం: ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లకు ఒకదఫా ఆటో డ్రైవర్లు, యజమానులు తమ ఆటోలను ఆర్టీఓ కార్యాలయం వద్ద తనిఖీలు చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందేవారు. వాటికి తోడు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ప్రతి ఏడాది ఠంచన్గా రూ.10 వేల సాయం అందించేది. వీటితో ఆటో వాలాలు ఇన్సూరెన్స్, ట్యాక్స్ చెల్లించుకునేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సాయం కట్చేశారు. ఆటో డ్రైవర్లకు గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన జీఓలు, హామీలు అమలు కాలేదు. వాటికి తోడు అదనపు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అధిక ఫైన్లు, కొర్రీలతో ఆటోలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు వారిలో కొంతమంది పొట్టకొట్టే పరిస్థితి తెచ్చింది. ఆ జీఓ ఎత్తివేత ఉత్తుత్తిదే సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలను తనిఖీచేసే జీఓ 21ను ఎత్తివేస్తామని, అవసరమైతే సవరిస్తామన్నారు. దీంతో పాటు ట్యాక్స్, ఇనూరెన్స్ల చెల్లింపుల్లో రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఎటువంటి ఫైన్లు ఉండవని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ జీఓ ఎత్తివేయకపోగా, కొత్త ఆంక్షలు మొదలయ్యాయి. రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్టులకు సంబంధించి గత ప్రభుత్వమే నేరుగా నిర్వహించగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ పేరుతో పైవేట్ వారికి అప్పగించి, డ్రైవర్లపై అధిక భారం మోపడం ప్రారంభించింది. పైవేట్ ఏజెన్సీల చేతిలోకి ఫిట్నెస్ టెస్టింగ్ వెళ్లడం ద్వారా రవాణా వ్యవస్థ తారుమారవుతుందని, ఇప్పటికే అధిక ట్యాక్స్లు, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఆటోలు నడపలేని పరిస్థితి ఎదురవుతోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. గతంలో ఆటోవాలకు ఫైన్ నిమిత్తం రూ. 200లు, రూ.300లు ఉండేది. ఇప్పుడు చిన్నపాటి తప్పులను చూపించి రూ.1000లకు మించి ఫైన్లు వేస్తున్నారని ఆటోవాలా వాపోతున్నాడు. కూటమి వచ్చిన తరువాత తమకు ట్యాక్స్, ఇన్సూరెన్స్ తప్పుతాయని అనుకుంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ అవడమే కాకుండా అదనపు కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఒక నెపంగతంలోకంటే ఇప్పుడు ఆటోవాలాకు విధిస్తున్న ఫైన్లు పెనుభారంగా మారాయి, ఆటోలు రోడ్డుమీద కనిపించినా, డ్రైవర్ సీటు పక్కన అదనంగా పాసింజర్లు ఉన్నా ఫైన్ పడుతుంది. ఇవి తనిఖీలు సమయంలో ఆటోవాలాకు తెలియడంలేదు. కొంతసమయం తర్వాత సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. దీంతో ఇదెక్కడి పరిస్థితిరా బాబూ అంటూ ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ఇటు రవాణా శాఖ అధికారులతో పాటు అటు పోలీసులతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ప్రారంభమ య్యాయి. పార్కింగ్ పేరుతో అధిక ఫైన్లు పడుతుండడం శోచనీయం. మరో వైపు వాహన మిత్ర అందకపోవడం దురదృష్టకరంగా మారింది. రాజాం నియోజకవర్గంలో రాజాం నుంచి రేగిడి, వంగర, సంతకవిటి, చీపురుపల్లి, తెర్లాం, పొందూరు, జి,సిగడాం ఏరియాలకు ప్రతిరోజూ 1400 ఆటోలు తిరుతుంటాయి. వారందరికీ గతంలో వచ్చే వాహన మిత్ర అటకెక్కింది. ఎప్పటికప్పుడే వాహనాల తనిఖీ చేస్తున్న అధికారులు అటు రవాణా, ఇటు సివిల్ పోలీస్ అధికారులతో ఇబ్బందులు అవిలేవు..ఇవి లేవంటూ ఫైన్లు ఆందోళనలో డ్రైవర్లుచాలా ఇబ్బందిగా ఉందిగతంలో కంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోడ్డు ట్యాక్స్ పెంచారు. ఇన్సూరెన్స్ చార్జీలకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాటితో పాటు పొల్యూషన్ చార్జీలు, ఇతర ఫైన్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కడికక్కడే వాహన చెకింగ్లు పెరిగిపోయాయి. పాత బకాయిలు అంటూ, మత్తు పదార్థాల రవాణా తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పేరుతో అధికారులు నిత్యం తనిఖీచేసి, ఆటోకు సంబంధించి ఏ చిన్నకాగితం లేకున్నా, ఎక్కువమంది ప్రయాణికులు ఉన్నా అపరాద రుసుం విధిస్తున్నారు. ఆటోతో రోడ్డు ఎక్కాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని సవరిస్తామని చెప్పి, ఇంతవరకూ సవరించలేదు. ఎన్. దుర్గారావు, అమ్మానవదుర్గ ఆటోయూనియన్ నాయకుడు, రాజాం కష్టం ఎక్కువ..ఆదాయం తక్కువ గతంలో ఆటోలు నడిపితే కుటుంబాన్ని అవలీలగా పోషించుకున వారం. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా బేరాలు ఉండడంలేదు. లాంగ్ జర్నీ బేరాలు వస్తే హైవే ఎక్కాలంటే భయమేస్తోంది. ట్యాక్స్, ఇతర కాగితాలు పేరుతో ఫైన్లు పడుతున్నాయి. తనిఖీ అధికారులతో మాట్లాడినసమయంలో ఏమీ ఉండడంలేదు. అనంతరం సెల్ఫోన్లకు మెస్సేజ్లు వస్తున్నాయి. రాంగ్ పార్కింగ్ అని, ఎక్కువ మంది ఉన్నారని ఇలా తప్పులు చూపిస్తున్నారు. వీటికి తోడు ట్యాక్స్, ఇన్సూరెన్స్ చెల్లింపులు పెరిగాయి. జీఓ నంబర్ 21లో సవరణ లేకపోవడంతో ఆటోలకు నిత్యం తనిఖీలు, ఇబ్బందులు పెరిగాయి. వి. మజ్జిగౌరి, ఆటో డ్రైవర్, రాజాం -
తమ్ముడిని రక్షించి..అన్న అనంతలోకాలకు..
పాలకొండ రూరల్: బంధువుల ఇంట గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో వచ్చిన ఓ కుటుంబంలో నాగావళి నది తీరని శోకం మిగిల్చింది. గ్రామంలో శుభకార్యం కావడంతో అంతా సందడిగా ఉండగా కొద్ది క్షణాల్లో తీవ్రవిషాదం గ్రామాన్ని నిశ్శబ్దంలోనికి నెట్టేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నవంపాడు గ్రామానికి చెందిన ద్వారంపూడి రవి, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు పవన్ (16), భార్గవ్సాయి ఉన్నారు. ఆ కుటుంబం పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామాంలో వారి దగ్గర బంధువు పైడితల్లి, రామారావుల నూతన గృహ ప్రవేశానికి శనివారం వచ్చింది. ఆదివారం గృహప్రవేశం కావడంతో పవన్కుమార్ తమ్ముడు భార్గవ్తో పాటు బాబాయి సురేష్తో కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో ఉన్న నాగావళి తీరానికి ఉదయం 6.30గంటల సమయంలో వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాబాయి బహిర్భూమికి వెళ్లగా భార్గవ్సాయి స్నానం చేసేందుకు నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో మునిగి పోయాడు. ఈ విషయం గమనించిన పవన్కుమార్ తన తమ్ముడిని రక్షించేందుకు నదిలోకి దిగాడు. తమ్ముడిని ఒడ్డుకు చేర్చే యత్నం చేశాడు. తమ్ముడు మునిగిపోతున్నట్లు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న బాబాయి భార్గవ్ సాయి రెక్క పట్టుకుని బడ్డుకు లాగాడు. ఇంతలో పవన్కుమార్ మునిగిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు తక్షణమే స్పందించి మునిగిపోయిన పవన్కుమార్ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పవన్కుమార్కు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించేందుకు తీసుకు వెళ్లేయత్నం చేస్తుండగా మృతిచెందాడు. విశాఖలో చదువుతున్న అన్నదమ్ములు మృతుడి తండ్రి రవి భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కల కష్టంతో కుమారులను విశాఖలో చదివిస్తున్నాడు. పవన్కుమార్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. చేతికి అందివస్తున్న పెద్దకుమారుడు ఇలా ప్రమాదంలో మరణించడంతో భార్య వసంత, రవి గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, ఎస్సై కె.ప్రయోగమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని వారి స్వగ్రామం తీసుకువెళ్లారు. నాగావళి నదిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి -
సంగమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
వంగర: హైకోర్టు జడ్జి గేదెల తుహిన్కుమార్కు వంగర మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆదివారం వచ్చారు. తొలుత వంగర విచ్చేసిన ఆయనకు ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రధానార్చకులు సిద్దాంతం గణపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ, పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, దేవదాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అదానీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మర్చేస్తుందని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.ధనలక్ష్మి విమర్శించారు. స్థానిక ఓ ప్రైవేటు రెసిడెన్సీలో ఆదివారం ఆశ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను యూనియన్ నాయకురాలు లంక శాంతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ధనలక్ష్మి మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీకి దేశాన్ని అప్పగించేందుకు మోదీ, అమిత్షాలు ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, మెటర్నటీ సెలవులను ఆరు నెలలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, వయోపరిమితి పెంచాలన్న ఆందోళన చేపడితే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకర్రావు, ఎస్.గోపాలం, యూటీఎఫ్ నాయకురాలు కె.విజయగౌరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆశ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి -
వ్యవసాయంలో మేము సైతం..
మన్యంలోని వ్యవసాయం సాగులో మేము సైతం అంటూ చిన్నారులు తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతున్నారనేందుకు ఈ చిత్రం సజీవ సాక్ష్యం. తండ్రికి తోడుగా తనయులు అన్నట్టు ఖరీఫ్ సీజన్లో ఇటీవల వర్షాలు విస్తారంగా ఏజెన్సీలో కురుస్తుండడంతో ఉభాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగులో పైపులు వేయడం ద్వారా నీటిని పొలాల్లో నిల్వ చేస్తారు. ఈ క్రమంలో రాయిలంకకు చెందిన ఇద్దరు చిన్నారులు తండ్రిగా సాయంగా పైపులు సుదూరంలో ఉండడంతో వాటిని పొలానికి మోసుకుంటూ ఇలా తీసుకువెళ్తూ... ఆదివారం సాక్షి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సాగులో తండ్రికి సాయం చేస్తూ.. ఇలా నిలిచారు. – సీతంపేట -
జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కూటమి తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోందని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎనిమిది నెలల కిందట ప్రకటన విడుదల చేసి ఇప్పటికీ భర్తీ చేయకపోవడంపై అభ్యర్థ
విజయనగరం ఫోర్ట్: ‘తమ్ముళ్లూ.. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి.. లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. అది కూడా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపడతాం...’ ఇదీ సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి నేతలు చెప్పిన మాటలు. గద్దెనెక్కిన తరువాత కూటమి పాలకులు అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు పెడచెవిన పెట్టేశారు. పారదర్శకతకు పాతర వేసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిందే తప్ప ఖాళీలను భర్తీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చి నెలలు తరబడి జాప్యం చేస్తుండడంతో దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023 నవంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పోస్టులు భర్తీ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా 2024 నవంబర్ నెల వరకు జాప్యం చేసింది. దీంతో ఏడాది అయిపోయిందని చెప్పి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఆ పోస్టులు భర్తీ చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కూటమి సర్కార్ జాప్యం చేసి రద్దు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ● 2024 డిసెంబర్లో మళ్లీ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ డిసెంబర్ 28, 2024న మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారా మెడికల్ పోస్టులకు సంబంధించి 20 కేటగిరీల్లో 91 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హత గల 6 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ● జాప్యానికి కారణమేంటో... కూటమి నేతలు చెప్పిన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందువల్లే నెలల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఎనిమిది నెలలైనా భర్తీ చేయకపోవడం పట్ల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులు భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేవారు. ఇప్పడు అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నెలల కిందట నోటిఫికేషన్ నేటికీ పోస్టులు భర్తీ చేయని వైనం 20 కేటగిరీల్లో 91 పోస్టులకు ప్రకటన కూటమి నేతల అనుచరులకే పోస్టులు కట్టబెట్టేందుకు ఈ జాప్యమన్న ఆరోపణలు గతంలో ఇదే తరహాలో ఏడాది జాప్యం చేసి నోటిఫికేషన్ రద్దు ఫైల్ కలెక్టర్కు పంపించాం.. ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ కలెక్టర్కు పంపించాం. అక్కడ నుంచి అనుమతులు రాగానే భర్తీ ప్రక్రియ చేపడతాం. – డాక్టర్ దేవి మాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల ఎనిమిది నెలలైనా.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలు అయినా కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్ కాలపరిమితి ముగియడానికి ఇంకా నాలుగు నెలలే గడువు ఉండడంతో గతంలో మాదిరి నోటిఫికేషన్ రద్దు చేస్తారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు పాఠశాలలకు సెలవు
విజయనగరం అర్బన్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలపు ప్రకటించినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించాలని ఆయన సూచించారు. వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నసీర్ విజయనగరం: పార్టీ సంస్థాగత నియామకాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నూతన నియామకాలు చేపట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించి ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ నసీర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మడ్డువలస నుంచి 10వేల క్యూసెక్కుల నీరు విడుదలవంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.30 మీటర్లు లెవెల్ నీటిమట్టాన్ని అధికారులు స్థిరీకరించారు. ఒక గేటు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. కూటమి పాలనలో మహిళా ఉద్యోగులకు వేధింపులు నెల్లిమర్ల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మండలంలోని గుషిణి గ్రామంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు, అనుచరుల వేధింపులు రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గర్భిణి శ్రావణి ఆత్మహత్యే అందుకు ఉదాహరణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి 10 గంటల తరువాత మహిళ ఉద్యోగులను పార్టీ కార్యాలయానికి రప్పించడమేమిటని ప్రశ్నించారు. రాత్రి 10.30 దాటిన తరువాత వీడియో కాల్స్ చేసి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగి అన్యాయంగా బదిలీ చేయించారన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎస్ఏ అధికారి శశిభూషణ్ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించి దళిత ఉద్యోగి సౌమ్యకు అన్యాయం చేశారని ఆరోపించారు. శశిభూషణ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ చిన్నం అరుణ్కుమార్ పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఏపీవో చిన్నబాబు వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. -
వేటకు అల్పపీడనం దెబ్బ..!
ప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా సముద్ర కెరటాలు పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం వల్ల వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అల్పపీడనం వల్ల వాతావరణ మార్పులతో సముద్ర అలలు కల్లోలంగా మారడంతో వేట సాగడం లేదు. తాజాగా గడిచిన మూడు రోజులుగా కెరటాలు ఉధృతి పెరగడంతో చేపల వేటకు వెళ్లలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల తీర ప్రాంతం వుంది. 21 మత్స్యకార గ్రామాలు వున్నాయి. ఆయా గ్రామాలలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా ఆరు వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సాంప్రదాయ బోట్లు, ఇంజన్ బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు వున్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిష్టర్ అయి వున్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా.. మళ్లీ అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలలు ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయని వాపోతున్నారు. వేట సాగకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. మత్స్యకార జీవన విధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. పతివాడబర్రిపేటలో తీరానికే పరిమితమైన బోట్లు ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పులు కారణంగా వేట చేయలేని పరిస్థితి నెలకొంది. వేట సాగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. తమకు వేట లేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – బర్రి అమ్మోరు, పతివాడబర్రిపేట ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట మూడు రోజులుగా తీరంలో కురుస్తున్న భారీ వర్షాలు గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు -
ఏపీజీఈఏ 6వ వార్షికోత్సవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 6వ వార్షికోత్సవం జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ (మెడికల్) శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ పువ్వల శ్రీనివాసరావు, కోశాధికారి వై.శంకరరావు, ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మీనాయుడు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చింతల వెంకట సతీష్, బియ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రంభ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి వదల్లేరు.. బతుకు చక్రం కదలట్లేదు..!
● వినాయక విగ్రహాలకు డిమాండ్ తగ్గడంతో కుమ్మరుల్లో ఆందోళన ● బతుకు భారమైందంటూ ఆవేదన ● ఆదుకోని కూటమి ప్రభుత్వంసాలూరు: మరో పది రోజుల్లో వినాయకచవితి పండగ రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కుమ్మరి వీధులన్నీ సాధారణంగా వినాయక విగ్రహాల తయారీతో హడావిడిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కుమ్మరి వీధుల్లో కనిపించడం లేదు. రథయాత్ర తరువాత ప్రారంభించే ఈ విగ్రహాల తయారీకి రెండు నెలల ముందు నుంచే సాలూరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వినాయక కమిటీ నిర్వాహకులు వచ్చి భారీ పరిమాణంలో, వివిధ ఆకృతుల్లో వినాయక ప్రతిమల తయారీకి ఆర్డర్లు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని కుమ్మరులు వాపోతున్నారు. పెద్దబొమ్మలు ఆర్డర్లు చాలా వరకు తగ్గాయని, ఆ భయంతో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే బొమ్మలను తయారు చేస్తున్నట్టు తయారీదారులు తెలిపారు. సాలూరు, పాచిపెంట పండగల ఎఫెక్ట్ ప్రతి ఏడాది వినాయక ఉత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఐక్యంగా స్థాయి కొద్దీ మండపాలు ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు, అన్న సమారాధనలు, అనుపోత్సవం చేస్తుంటారు. ఈ ఏడాది సాలూరు, పాచిపెంట గ్రామదేవతల పండగలు జరగడంతో ప్రజల వద్ద చాలా వరకు డబ్బుల్లేవని దీనితో ఈ ఏడాది వినాయక ప్రతిమల ఆర్డర్లు తగ్గాయని కుమ్మరులు చెబుతున్నారు. వినాయకుడిని పెట్టిన తరువాత అన్న సమారాధన, అనుపోత్సవాలకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్వాహకులు కొంత వెనుకంజ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. పెరిగిన తయారీ ఖర్చు బొబ్బిలి నుంచి తీసుకువచ్చే ట్రాక్టర్ మట్టికి కుమ్మరులు సుమారు 3500 రుపాయిలు చెల్లిస్తున్నారు. తయారీలో భాగంగా ముడి సరుకులు, రంగులకు అధిక డబ్బులు ఖర్చవుతున్నాయి. ఇంత డబ్బులతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బందులు పడతామని కావున గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారీచేస్తున్నామని కుమ్మరులు చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి తీసుకువచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన పెద్ద విగ్రహాలకు ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో ఆందోళన నెలకొందని తయారీదారులు వాపోతున్నారు. కుమ్మరి చక్రం కదలనంటున్నా.... కుమ్మరి వృత్తి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తి తమ కడుపు నింపేదని, నేడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రల వినియోగం తగ్గిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వృత్తే జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ వృత్తి కడుపు నింపుతోందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కుమ్మరి చక్రం కదలనంటున్నా.. తమ కుల వృత్తిని వదులుకోలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు చేదోడువాదోడుగా నిలవాలని వారు కోరుతున్నారు.పంటల్లేవు.. పథకాల్లేవు..ప్రజలకు గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద డబ్బులు వారి ఖాతాల్లో జమవ్వడంతో ఆ డబ్బులు వారికి ఇటువంటి పండగలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఉపయోగపడేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజల వద్ద డబ్బులు కొరత నెలకొందని చర్చించుకుంటున్నారు. మరోవైపు పంటల పరిస్థితులు కూడా అనుకున్నంత సానుకూలంగా ఏమీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో పండగ వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. -
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్కుమార్ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. అక్రమంగా పశువుల తరలింపు కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. నూతన బార్ పాలసీ విడుదల విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని టీకే రాజపురం గ్రామస్తులు శుక్రవారం పాలకొండ పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దింటి సూరిబాబుకు చెందిన ఎక్సెల్ వాహనంతో పాటు దోర భానుప్రసాద్కు చెందిన డీలక్స్ ద్విచక్ర వాహనం దగ్ధం చేశాడని ఎస్ఐ కె.ప్రయోగమూర్తి వద్ద వాపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
కనకాంబరాలతో కనక వర్షం
భామిని: పూల సాగులో కనకాంబరాలది ఓ ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాల్లో వాడంబారాలుగా పిలవబడే వీటిని కనకాంబరాలగానే పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏడాది పొడవునా పూలు పూస్తూ సాగుదారులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. వీటిని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు దిగుబడినిచ్చి సాగుదారులకు పుష్కలంగా ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పూలు వాసన లేకున్నా వివిధ రంగుల్లో మహిళలను ఆకర్షిస్తాయి. అదే సమయంలో వివిధ శుభకార్యాల్లో వీటికున్న ప్రత్యేకత వేరు. వీటిని సీ్త్రల శిరోజాల అలంకరణతో పాటు శుభ కార్యాల్లో వేర్వేరు రూపాల్లో అలంకరించి ఆదాయాన్ని పొందుతారు. ఇవి ఎక్కువగా ఆరంజ్, ఎల్లో, ఎరుపు రంగుల్లో పూస్తాయి. మార్కెట్లో ఈ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కొబ్బరి, మామిడి తోటల్లో అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేయవచ్చని చెబుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. స్థానికంగా వీటిని విక్రయించడంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. పాతపట్నం, టెక్కలి, ఒడిశాలోని పర్లాకిమిడి, గుణుపూర్ ప్రాంతాలకు రోజూ రవాణా చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ సీజన్లోనే... ప్రస్తుతం కనకాంబరాలు నాటుకొనే సమయంగా రైతులు చెబుతున్నారు. ఏటా జూలై – ఆగస్టు నెలల్లో కొత్తగా తోటలు నాటుకుంటారు. రెండు నెలలుగా నారు పోసి సంరక్షించుకుని ఆ నారును మెట్టు భూముల్లో వేస్తారు. నాణ్యమైన నారు కోసం రామభద్రపురం, సాలూరు, రాజమండ్రి నర్సరీల నుంచి దీన్ని తెస్తున్నారు. అధిక తేమ, వేడి కలిగిన నేలల్లో సాగుకు ఇది అనుకూలం. చల్లని వాతావరణ పరిస్థితుల్లో అధిక దిగుబడినిస్తాయి. నీరు నిలువ లేని అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం. విత్తన తయారీ.. విత్తనం, కాండపు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలను విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నిల్వ చేసిన విత్తనం మొలకెత్తే శాతం తక్కువ. అప్పుడే పూల గుత్తిల నుంచి వేరు చేసిన విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చు. ఒక మీటరు పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులు సిద్ధం చేసి నారు వేసుకోవాలి. మొక్కలు 4 నుంచి 6 ఆకులు వేసిన 50 నుంచి 60 రోజుల్లో నారును తీసి నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినా అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి అందించాలి. డ్రిప్ పద్ధతిలో అయితే 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. సాగుపై పెరుగుతున్న ఆసక్తి -
శ్రీకృష్ణాష్టమి పూజలు
విజయనగరం: శ్రీకృష్ణుని చల్లని దీవెనెలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషా లు, ఆయురారోగ్యాలతో ఆనందమయమైన జీవితాన్ని సాగించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ధర్మపురి లో శనివారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ రాధాకృష్ణలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు మజ్జి పుష్పాంజలి, సిరిసహస్ర, బడ్డుకొండ ప్రదీప్నాయుడు, భక్తులు పాల్గొన్నారు. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. ప్రాజెక్టు లో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. 64.52 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టులోకి వచ్చిన 7 వేల క్యూసెక్కు ల నీటిని రెండు గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామన్నారు. భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికారుల హెచ్చరికలతో భోగాపు రం మండలంలోని సముద్రతీర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చేపలవేటను మత్స్యకారు లు నిలిపివేశారు. ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం తదితర సముద్రతీర ప్రాంతా ల మత్య్సకారులు తమ పడవలు, వలలను భద్రపరిచి విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం స్థానిక పెన్షన్ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. తొలుత అసోసియేషన్ జండాను ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రపండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ హైకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ విద్యాసాగర్, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, రాష్ట్ర కోశాధికారి సొంటి కామేశ్వ రరావు, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కర్, జి ల్లా కోశాధికారి వై.శంకరరావు, ఆదినారాయ ణ, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
మొక్కలు పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలు పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోసిన తరువాత పూల గుత్తిలను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పూల దిగుబడి పెరుగుతుంది. మొక్కలు నాటిని రెండు లేక మూడు నెలలకు పూత వస్తుంది. జూన్ నుంచి జనవరి వరకు పూత బాగా ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. రెండు రోజులకు పూలు విచ్చుకొంటాయి. ఉదయం లేదా సాయంకాలం మాత్రమే పూలు కోయాలి. – కొల్లి తిలక్, వ్యవసాయాధికారి, భామిని -
భవనం పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం పిట్టగోడ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ కె.సీతారాం శనివారం అందించిన వివరాలు.. మెంటాడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పిట్టగోడ నిర్మాణం జరిగే సమయంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకకు చెందిన గురజాపు అప్పారావు(32) ప్రమాదవశాత్తూ జారి పడి గాయపడినట్టు ఎస్ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన ఆయకట్టు సంఘం చైర్మన్ ఈదిబిల్లి బలరాంనాయుడు వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై మూడు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బలరాంనాయుడు(62) మృతి చెందినట్టు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడి భార్య ఈదుబిల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భోగాపురం: వీరాస్వామి అనే లారీ డ్రైవర్ విజయవాడ నుంచి వస్తూ సుందరపేట హైవే జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుని భోగాపురం అన్నపూర్ణ హోటల్ సమీపంలో శనివారం లారీని కాసేపు ఆపాడు. తరువాత లారీ కింద మృతి చెంది కనిపించాడు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కుంభ జోవేష్ అనే వేరే లారీ డ్రైవర్ వీరాస్వామి మృతి చెందినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి డ్రైవర్ వీరాస్వామి గుండెపోటుతో మరణించాడా? వేరే ఏవిధంగానైన మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్ : అలమండ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం జీఆర్పీ పోలీసులు శనివారం గుర్తించారు. 50 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి తెలుపు రంగు కట్ బనియన్, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, రైలు నుంచి జారి పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జారి పడడంతో తలకు తీవ్ర గాయాలై ఉండొచ్చని జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9490617089, 830990038, 9491813163 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వ్యక్తి ఆత్మహత్య దత్తిరాజేరు: మండలంలోని దాసరిపేట గోపినాధ పట్నాయక్ చెరువు గట్టుపై మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయడు(55) ఉరి వేసుకొని మృతి చెందినట్టు పెదమానాపురం ఎస్ఐ జయంతి శనివారం తెలిపారు. పొలం పనులకు వెళ్తానని ఇంటి వద్ద చెప్పి దాసరిపేట చెరువు గట్టుపై మృతి చెందడంతో బంధువుల ద్వారా సమాచారం తెలియడంతో కుటుంబంలో ఒక్కసారి విషాదం నెలకొంది. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మృతుడికి వివాహం అయిన కుమార్తెతో పాటు కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. -
హామీల జోరు.. అమలులో బేజారు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మంత్రులు, నాయకులు హామీలు ఇవ్వడంలో జోరుగా, హుషారుగా ఉంటారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను బేజారు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఏపీఏ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ● జీఓ 3ను పునరుద్ధరిస్తామని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చుతామని, ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ, 5వ షెడ్యూల్డ్, 1/70 కచ్చితంగా అమలు చేస్తామని, కొఠియా గ్రామాలకు పరిష్కారం చూపుతామని, కుడుమూరు భూ వివాదం పరిష్కారం, డోలీ కష్టాలు లేకుండా చూస్తామని చంద్రబాబునాయుడు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి పరిష్కారం ఊసేలేదు. దీనిపై గిరిజనులు ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. ఇది గిరిజనులను మోసం చేయడం కాదా?. అబద్ధాలతో ఎన్నాళ్లు పాలిస్తారని రాజన్నదొర నిలదీశారు. అబద్ధాలు చెప్పడంతో ఆరితేరిన మంత్రి... మంత్రి సంధ్యారాణి ప్రజాదర్బార్, పత్రికా సమావేశాలు, స్వాతంత్య్రదినోత్సవ వేదిక, చివరికి చట్టసభలలోనైనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సాలూరు శ్యామలాంబ పండగ కోసం రూ.2 కోట్ల అప్పుడబ్బులతో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ, కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ప్రజలు, పత్రికాసమావేశాల్లో మంత్రి సంధ్యారాణి అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేసారు. మహిళల ఆత్మగౌరవం కోసం సాలూరులో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు నిధులు తీసుకువస్తానని చెప్పిన మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోలేదని, ఆ పనులు జరగలేదని, మరి మహిళల ఆత్మగౌరవ నినాదం ఏమైందని రాజన్నదొర ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి పెట్టిన తొలి సంతకం నేటికీ కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. ● 2014–19 మద్య టీడీపీ హయాంలో సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండగా తను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2015లో నాటి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సాలూరు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. తరువాత కలెక్టర్గా వచ్చిన వివేక్యాదవ్ తాగునీరు, రోడ్డ పనుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఆ నిధులు రాకుండా అడ్డుకున్నారని రాజన్నదొర విమర్శించారు. ● సాలూరులో వందపడకల ఆస్పత్రికి వైఎస్సార్సీపీ అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీది అబద్ధాల పాలన ఏడాదిన్నరగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కనిపించని అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలులో కనిపించని చిత్తశుద్ధి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరా జ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ (ఏపీపీఆర్ఎంఈఏ) జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శనివారం జరిగిన ఎన్నికల్లో నూత న కమిటీని ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా సీహెచ్ మురళి, ప్రధాన కార్యదర్శిగా పి.ఎం.రవికుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి.వి.నాగభూ షణరావు, ఉపాధ్యక్షుడిగా టి.ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వి.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాజ్ కుమార్, ఎం.నారాయణరావు, డి.లత, డీహెచ్వీఆర్ ప్రభాకర్, బి.లక్ష్మణ్కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్.అర్జునరావు, వి.ఎ.వర్మ, ఎ.రమణమూర్తి, కె.వి.శ్రీనివాసరావు, జేసీసీ మెంబర్గా బి.వి.గోవిందరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విజయనగరం జిల్లా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు టి.శ్రీధర్బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా పట్టణ ఏపీఎన్జీఓ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.వి.రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గంటా వెంకటరావు, ఆర్.వి.రమణమూర్తి, ఏపీఎన్జీజీఓ జిల్లా కార్యదర్శి ఎ.సురేష్, జిల్లా, తాలూకా యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు. -
కన్యాశుల్కం ప్రదర్శన పూర్వజన్మ సుకృతం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకాన్ని 60 ఏళ్లకు పైబడిన మహిళలతో రవీంద్రభారతిలో ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమని దర్శకులు ఈపు విజయకుమార్ పేర్కొన్నారు. మహాకవి స్వగృహంలో శనివారం సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కంలోని బొంకులదిబ్బ సీన్, మధురవాణి ఇల్లు–మంచం సీన్, అగ్నిహోత్రవధాన్లు ఇళ్లు – తాంబూలాల సీన్, సౌజన్యరావు పంతుల ఇళ్లు (డామిట్ కథ అడ్డం తిరిగింది సీన్)ను కేవలం వయోవృద్ధులైన మహిళలతో విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 12న రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్–2025లో కన్యాశుల్కం ప్రదర్శించి ఆహుతుల మన్ననలు పొందామన్నారు. గాంధీ జ్ఞానప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్రరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బి.సత్యానందం, సినీన టి, సంఘసేవకురాల కరాటే కల్యాణి, అభినయ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నామన్నారు. భోగరాజు సూర్యలక్ష్మి నిర్వహణ బాధ్యతలతో పాటూ గిరీశం పాత్రధారిలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆహుతుల మన్ననలు పొందారన్నారు. వీరితో పాటూ మధురవాణిగా ఎ.సీతామహాలక్ష్మి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవీ, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, వెంకటమ్మగా ఉదయగిరి నీలిమ, రామప్పపంతులుగా సిహెచ్.రాజకుమారి, బుచ్చమ్మగా పూటకూళ్లమ్మ, పోటోగ్రఫీ పంతులు నౌకరుగా సామవేదుల సత్యలత, సౌజన్యరావు పంతులుగా చీకటి చంద్రికారాణిలు పాత్రోచితమైన ప్రదర్శన చేసి ఆహుతుల కరతాళ ధ్వనులందుకున్నారని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్.రమణ రంగాలంకరణ, రూపాలంకరణ చేశారన్నారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోగరాజు సూర్యలక్ష్మి, సుభద్రాదేవీ, కన్యాశుల్కం టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: దేశ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ మసీదుల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.కోట, కురుపాం, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా అహ్మదీయా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు. స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు విజయనగరం క్రైమ్: నగరంలోని ఏడు స్పా(మసాజ్) సెంటర్లలో వన్టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసా జ్ సర్వీసుకు వచ్చే సీ్త్ర, పురుషులను వేర్వేరుగా ఉంచాలని సీఐ ఆర్వీకే చౌదరి నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేర కు సీఐ చౌదరి, ఎస్ఐలు రామ్గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడులు మసాజ్ కేంద్రాలకు వెళ్లి, పరిశీలించారు. తప్పనిసరిగా కేంద్రంలో అర్హులైన ఫిజియోథెరపిస్ట్లు ఉండాలన్నారు. రాత్రి వేళల్లో స్పా సెంటర్లకు అను మతి లేదని, ఎవరూ నిర్వహించవద్దన్నారు. -
గురజాడ సాహిత్య సంపద, స్మారక భవనాన్ని కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: మహాకవి గురజాడ అప్పారావు స్మారక భవనం గురించి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ పట్టకపోవడం శోచనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ రచనలను భద్రపరచాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నాన్నారు. గురజాడ గృహాంలో గురజాడకి శనివారం ఘన నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతు హాల్ చల్ చేసి, సాహిత్య సంపాదని, వస్తువులను చిందరవందర చేసినా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలుగాని గురజాడ ఇంటిని సందర్మించడానికి కూడా తీరిక కల్పించుకోలేని పరిస్థితిలో ఉండడం పట్ల ఆయన మండిపడ్డారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం నలుమూలలకి పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురజాడ అప్పారావు సాహిత్య సంపదకు, గురజాడ స్మారక భవనానికి తగిన రక్షణ కల్పించాలని భీశెట్టి కోరారు. పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్మి జలంత్రి రామచంద్ర రాజు, సహాయ కార్యదర్మి తుమ్మగంటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బొబ్బిలిని మన్యం జిల్లాలో కలపాలి
బొబ్బిలి: ప్రభుత్వం నియోజకవర్గాలను పునర్విభజనకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బొబ్బిలి నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువరు మాట్లాడుతూ మన్యం జిల్లాకు బొబ్బిలి చేరువగా ఉందన్నారు. ఆ జిల్లాలో కలపడం వల్ల ఆర్థికంగా, భౌగోళికంగా ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మరిశర్ల రామారావు నాయుడు, మువ్వల శ్రీనివాసరావు, ఒమ్మి రమణ, కోట అప్పన్న, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగితే చర్యలు తప్పవు
● ఎస్పీ వకుల్ జిందల్ ● ఇప్పటికే 13,260 కేసుల నమోదు ● మందుబాబులకు పోలీసుల కౌన్సెలింగ్ విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జింద ల్ శనివారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టామన్నారు. ఇప్పటివరకు 13,260 కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో పట్టుబడిన మైనర్లైన మందుబాబులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారి భద్రత నియమాలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ–చలానాలను విధిస్తున్నట్టు వెల్లడించారు. -
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవలసను ముంచెత్తిన వాన
● జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జీలు ● కొత్తవలస జంక్షన్ జలమయం కొత్తవలస : మండలంలోని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇంత పెద్ద వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానికులు పేర్కొన్నారు. ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కుండపోతగా కురవడంతో రైల్వే అండర్ బ్రిడ్జీలు, కొత్తవలస జంక్షన్ జలమయమమయ్యాయి. ముఖ్యంగా కొత్తవలస జంక్షన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. ఈ వరద నీటిని అరికట్టేందుకు ఇటీవల సుమారు రూ 3.కోట్లతో నిర్మించిన పై కప్పు నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలాగే కొత్తవలస – విజయనగరం, కొత్తవలస – విశాఖపట్నం రోడ్డు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్ను సైతం వర్షం నీరు ముంచేసింది. -
ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం
● ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ డెంకాడ: ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రమని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్ మలికా గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15న విముక్తి పొందిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వరాదన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు జి.లక్ష్మీనారాయణ, ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి కొమరాడ: కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన వుబ్బిశెట్టి చిట్టిబాబు(62) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు.. వుబ్బిశెట్టి చిట్టిబాబు తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా పనిలేక వెళ్లలేదు. తన ఇంటి బయట విద్యుత్ వైర్ వేలాడుతుండగా ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనుమానాస్పదంగా ఎలక్ట్రీషియన్ మృతి పెందుర్తి: భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సీఐ కేవీ సతీష్కుమార్ తెలిపిన వివరాలు.. పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలోని నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రావురు ప్రసాద్(25)గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు కొన్నాళ్లుగా భార్యతో వివాదాల కారణంగా తల్లితో స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ప్రసాద్ మూడు రోజుల క్రితం పని మీద వెళుతున్నానని తల్లికి చెప్పి, తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణంతో మృతి చెందాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ శకటానికి ప్రథమ బహుమతి
స్వాతంత్య్ర వేడుకల్లో వ్యవసాయ, సెర్ప్గ్రామీణాభివృద్ధి, విద్య, సమగ్ర శిక్ష, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్యారోగ్య, గృహనిర్మాణ, విజయనగరం మున్సిపాలిటీ, పరిశ్రమలు, ముఖ్య ప్రణాళిక, సీ్త్ర శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, తదితర శాఖలు తమ ప్రగతిని తెలియజేసేలా శకటాలు ప్రదర్శించాయి. వీటిలో గ్రామీణ నీటి సరఫరా, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మొదటి రెండు బహుమతులు గెలుచుకోగా జిల్లా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి శాఖలు తృతీయ బహుమతిని ఉమ్మడిగా అందుకున్నాయి. ● అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవం ● ఆకట్టుకున్న శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్ జాతీయ జెండా రంగుల్లో నీటిని ఫైర్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది విజయనగరం ఫోర్ట్/విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయుధ దళాల పోలీస్ కవాతు, వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ శాఖల ప్రగతి ని సూచించే శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 74 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ఎంఎస్ఎం పార్కులను ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 140 కోట్ల జనాభా కల్గిన భారతావని పరాయిపాలన నుంచి విముక్తి పొందిన నాటి నుంచి నేటివరకు ఎన్నో మైలు రాళ్లను అందుకుందన్నారు. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. 2026–27 నాటికి జిల్లాలో అదనంగా 18,515 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని, ప్రకృతి సాగును 15వేల హెక్టార్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ పథకాల లబ్ధిని వివరించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్తో కలిసి ఉత్తమ ఉద్యోగులు, సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శనలు అలరించాయి. ఆపరేషన్ సిందూర్, నెమలి ప్రదర్శనలు ఆసక్తిగా సాగాయి. విజయనగరం, జామి కేజీబీవీలు, ఫోర్ట్ సిటీ స్కూల్, చీపురుపల్లి బాలసదన్, వియ్యంపేట డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కొత్తవలస జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు నృత్యప్రదర్శనలతో దేశభక్తిని చాటిచెప్పారు. వీరిలో జామి కేజీబీవీ బాలికల ఆపరేషన్ సిందూరం ప్రదర్శనకు మొదటి బహుమతి, రాజాం బాలభవన్ విద్యార్థుల నెమలినృత్యప్రదర్శనకు ద్వితీయ బహుమతి, వియ్యంపే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యార్థుల గిరిజన నృత్యప్రదర్శనకు తృతీయ బహుమతులు లభించాయి. పోలీస్ జాగిలాల విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల ఆర్పే ప్రయోగాలు అవగాహన పెంచాయి. ఏపీఐఐసీ శకటం -
మండల సమాఖ్యకు జాతీయ స్థాయి అవార్డు
గంట్యాడ: గంట్యాడ మండల సమాఖ్యకు జాతీయ స్థాయి ఆత్మనిర్బర్ భారత్ సంఘటన్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూస భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి శివజార్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా సమాఖ్య అధ్యక్షురాలు కర్రి అనసూయమ్మ, కార్యదర్శి కంటిపాక సీతమ్మ, ఏపీఎంలు కోరుకొండ సులోచన దేవి, శ్రీనివాస్, ఏపీ సెర్ప్ అదనపు సీఈఓ ఆర్.శ్రీరాములునాయుడు అవార్డును అందుకున్నారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, రూ.3లక్షల చెక్కు ఇచ్చినట్టు సమాఖ్య సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు. పైడితల్లికి అరటిపండ్లతో అలంకరణ విజయనగరం టౌన్: శ్రావణమాసం నాలుగో శుక్రవారం సిరుల తల్లి, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని వనంగుడిలో అరటిపండ్లతో అలంకరించారు. ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్, వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో జెండా పండగ విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ వకుల్ జింద్ ముఖ్యఅతిథిగా హాజరై సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలి
● విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ విజయనగరం: అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్న భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వలసపాలకులను తరిమికొట్టి స్వాతంత్య్రసాధనలో సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనేక కులాలు, మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిసి ఉన్న భారత దేశం ప్రపంచ దేశాల చూపును ఆకర్షించే స్థాఽయికి ఎదిగిందన్నారు. దేశ పౌరులంతా కలిసిమెలసి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం కారుణ్యనియామకాల్లో భాగంగా ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు వర్రి నర్సింహమూర్తి, శాంతకుమారి, కెల్ల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
నేడే మువ్వన్నెల పండగ
విజయనగరం అర్బన్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం పొలీస్ బ్యారెక్స్లో శుక్రవారం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాతీయజెండా వందన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. వివిధ శాఖల పురోగతిని సూచించేలా శకటాల ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్ అంబేద్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్రదినోత్సవ ఏర్పాట్లను జేసీ సేతుమాధవన్ పరిశీలించారు. జెండా పండగలో భాగంగా రైల్వేస్టేషన్, కలెక్టరేట్, నగరంలోని పలు కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
● డోలీలతో నిరసన
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శృంగవరపుకోట మండలంలోని దారపర్తి గెడ్డ వద్ద గిరిజనులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. డోలీలు చూపిస్తూ ఇక్కడి గెడ్డను దాటాలంటే నీటి ప్రవాహంలో గెడ్డను దాటలేని చిన్నారులు, వృద్ధులను ఇలా డోలీలో మోసుకుని వెళ్లాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. దారపర్తి, మారిక డి.కెపర్తి, మూలబొడ్డవార పంచాయతీల్లోని గిరిశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సదుపాయం లేదని, గెడ్డలపై వంతెనలు కూడా లేవని దీంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పాలకులు మారుతున్నా తమ బాధలు మాత్రం తీరడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్లు, వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –శృంగవరపుకోట -
మా భూములు మాకు ఇప్పించండి
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవారలో జిందాల్ నిర్వాసితులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసన గురువారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. మా భూములు మాకు ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కోరుతూ బ్యానర్ ప్రదర్శించారు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల వద్ద మీరు(పవన్ కల్యాణ్) వెళ్లి, విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి రైతులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో కూడా ఓసారి పర్యటించి, తమ బాధలు వినాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడం లేదని మీరే న్యాయం చేయగలరని నమ్ముతున్నామని, మీరే రావాలని మా సమస్యలు ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
భయపెడుతున్న విష సర్పాలు
అందుబాటులో ఏఎస్వీ వ్యాక్సిన్లు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీల్లో ఏఎస్వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓవిజయనగరం ఫోర్ట్: పల్లె ప్రజలను విషసర్పాల భయం వెంటాడుతోంది. సాధారణంగా వర్షాకాలంలో పాముల సంచారం అధికం. అదే సమయంలో పొలాల్లో పనులు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పుడు, కూరగాయలు కోసినప్పుడు, పంట పొలాలకు నీరు కట్టే సమయంలోను, పొలం గట్లపై ఏమరపాటుగా వెళ్లిన రైతులు పాముకాటుకు గురవుతున్నారు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తున్న వారిని సైతం పాములు విడిచిపెట్టడం లేదు. కొంతమంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడో ఓ చోట పాము కాటు బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్లపాము, తాచుపాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చు. రాత్రివేళ పొలాలకు వెళ్లేసమయంలో చెప్పులు వేసుకోవాలి. టార్చిలైట్లతో పాటు శబ్ధం చేసే పరికరాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే బీపీ పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలు ఉన్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభం అవుతుంది. జాగ్రత్తలు తప్పనిసరిపాములపై అవగాహన ఉండాలి పంట పొలాల్లోనే ఎక్కువ.. సాధారణంగా నిర్జీవ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు.. ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకు వస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడుబడిన భవన శిథిలాలు, పూరి గుడిసెలు, గుబురుగా ఉండే పంట చేలల్లో పాములు ఎక్కువగా నివస్తున్నాయి. ఎలుకలు, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో సంచరిస్తూ రైతులకు అపాయం తలపెడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 1222 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల పరిఽధిలో 921 కేసులు నమోదు కాగా, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 301 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. ఏడు నెలల్లో పాముకాటు బాధితులు 1222 మంది వీరిలో నలుగురి మృతి వర్షాకాలం కావడంతో పెరిగిన విషసర్పాల సంచారం పంట పొలాల్లోనే అత్యధికం పొలం పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు -
కార్మికుల జీవితాల్లో కారు చీకట్లు
వీరఘట్టం: కార్మికుల జీవితాల్లో కారుచీకట్లు అలుముకున్నాయి. వారికి ఇచ్చిన ఏ హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల సమయంలో హామీలివ్వడం..గెలిచాక ఏదో సాకుతో దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటుగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఆయనది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలుపై కూడా మాట్లాడని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు ఫైల్పై పెడతామని హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్లోని 42 వేల క్లెయిమ్ల పరిష్కారం, ఉచిత ఇసుకతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. కార్మికుల పిల్లల చదువుకు రూ.20 వేలు, ఇన్సూరెన్స్ సదుపాయం, గర్భిణుల డెలివరీ ఖర్చులు, ఇప్పటివరకు సహజ మరణానికి చెల్లిస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతాం, ప్రమాద మరణం బీమాను రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇవన్నీ నమ్మి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపిమేసీ్త్రలు, తాపి పనివారు, రాడ్బెండర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, మార్బుల్ వర్కర్స్, టైల్స్ వర్కర్స్, రోజువారీ కూలీలు ఇలా అందరూ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 80 వేల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా తమకు ఇచ్చిన హామీల అమలుపై కూటమి సర్కారు నోరు మెదపకపోవడం పట్ల కార్మికులు పెదవి విరుస్తున్నారు. కార్మికుల ఆశలపై నీళ్లు.. ఎన్నికల ప్రచారం సమయంలో తాడేపల్లిలో జరిగిన సభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తనవంతు సాయంగా కోటి రూపాయలు ఇస్తానని పవన్కల్యాణ్ ప్రకటించారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుసున్నా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆయన ఇస్తానన్న కోటి రూపాయలు ఇంకా జమ కాలేదు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారం, ఇన్సూరెన్స్, నష్ట పరిహారంపై ప్రకటన కోసం కార్మికులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల అమలుతో పాటు డిమాండ్ల సాధనకు కార్మికలు గతేడాది నవంబర్ 11న ధర్నాకు దిగి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరమని, వారి హామీలు నమ్మి మోసపోయామని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కలగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎన్నికల ప్రచారంలో బోర్డును పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ బోర్డు ఏర్పాటుకు రూ.కోటి ఇస్తానని తాడేపల్లి సభలో పవన్ ప్రకటన అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు శూన్యం ప్రభుత్వ తీరుపై కార్మికుల మండిపాటు -
పంద్రాగస్టు కవాతు సాధన
విజయనగరం క్రైమ్: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణలో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల కవాతు సాధన గురువారం జరిగింది. ఎస్పీ వకుల్ జిందల్ వారి పరేడ్ పరిశీలనకు వెళ్లగా, వారు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో మరింత ఉత్సాహంగా కవాతు చేసి, చూపరులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఉండాలని ఆ దిశగా సాధన చేయాలని తెలిపారు. వేడుక చూసిన వారిలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా కార్యక్రమం ఉండాలన్నారు. వేడుకల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు దివ్యవాణి మెంటాడ: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెంటాడ మండలం, గుర్లతమ్మిరాజుపేట విద్యార్థిని అల్లు దివ్యవాణి ఎంపికై ంది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్ 20 విభాగంలో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ మేరకు దివ్యవాణికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, చొక్కాపు సన్యాసినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు తదితరులు అభినందనలు తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ ఐటీ సమీపంలో గురువారం త్రుటిలో ఓ ప్రమాదం తప్పింది. రేగిడి మండలం, సరసనాపల్లికి చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. రోడ్డుపై పెద్దగోతులు ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో రాజాం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఈ ఘటనను చూసి షడన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అప్రమత్తమై పడిపోయిన వృద్ధ దంపతులను పక్కకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈ విషయం తెలుసుకన్న ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తమై రోడ్డుపై గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. సారాబట్టీలపై పోలీసుల దాడులు గుమ్మలక్ష్మీపురం: మండలంలోని చెముడుగూడ పంచాయతీ, మంగన్నగూడ పరిసరాల్లో నిర్వహిస్తున్న సారాబట్టీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్విన్పేట ఎస్ఐ బి.శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 1400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి, దానిని బయటకు పారబోశారు. అనంతరం సారా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములను స్వాధీనం చేసుకుని వాటిని కాల్చివేశారు. ఎక్కడైనా సారా తయారు చేసినా తరలించినా సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పార్వతీపురం రూరల్: మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి గురువారం తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. -
గురువుపై దిద్దుబాటు బరువు
ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాథ్యం కాదు ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ బుక్ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. ఐదు తరగతుల ఒక్కో విద్యార్ధికి ఒక్కో సబ్జెక్టు పుస్తకాన్ని నిర్వహించడం వల్ల పాఠ్యాంశాల బోధనలో నాణ్యత లోపిస్తుంది. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్ టీచర్ చేతనే ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి. – జేఏవీఆర్కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ తలకుమించిన భారం ప్రాథమిక స్థాయిలో ఈ విధానం సరికాదు. పుస్తకాలపై పరీక్ష జవాబు పత్రం రాయించి వాటిని జాగ్రత్త పరచడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారం. పాఠాలు చెప్పడానికే సమయం సరిపోదు. అసెస్మెంట్ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. కానీ ఈ విధానాన్ని నిర్వహించడానికి ఇవి పాఠశాలలో లేదంటే ప్రయోగశాలలో అర్థం కావడం లేదు. – చిప్పాడ సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ సమయం పెంచాలి అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని. అసెస్మెంట్ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయులకు రిమార్క్. విద్యార్ధులందరినీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉంచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది. – డి.శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి, పీఆర్టీయూ విజయనగరం అర్బన్/రాజాం: కూటమి ప్రభుత్వ విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదు, రికార్డుల అప్లోడ్ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యాప్రమాణాలు కుంటుపడతాయ న్నది ఉపాధ్యాయులవాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున అసెస్మెంట్ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రాజెక్టు వర్క్ మార్కుల పట్టికల పేజీలను జతజేశారు. ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఫార్మేటివ్ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, రెస్పాన్స్, ప్రాజెక్టు వర్క్ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదుచేయాలి. ఏడాదికి రెండుసార్లు జరిగే సమ్మేటివ్ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 9.06 లక్షల పుస్తకాలు ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అదే విధంగా 3, 4, 5 వ తరగతులకు నాలుగు, 6, 7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10వ తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్ధికీ ఉంటాయి. వీటిని విద్యాసంవత్సర ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్ధి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 1.51 లక్షల మంది విద్యార్ధులు 1 నుంచి 10 తరగతి వరకు చదువుతున్నారు. వీరికి అన్ని సబ్జెక్టులకు 9 లక్షల 6 వేల 679 అసెస్మెంట్ పుస్తకాలు వచ్చాయి. వాటితో ఈ నెల 11 నుంచి ఈ పరీక్షల కొత్త విధానాన్ని నిర్వహిస్తున్నారు. అసెస్మెంట్ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్ నంబర్, పరీక్ష కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్ షీట్లో సరైన సమాధానాలకు బబ్లింగ్ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటవెంటనే మూల్యాంకనం చేయాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు.. పరీక్షల అనంతరం ఆదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్డులు పంపాల్సి రావడం ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా మార్కుల అప్లోడ్లో సాంకేతిక సమస్యలు చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు. ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్లో సంరక్షణ క్లిష్టతరం. అసెస్మెంట్ విధానంలో పుస్తక మూల్యాంకనం ఒక్కో సబ్జెక్ట్కు ప్రత్యేకంగా పుస్తకాలు ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత తలలు పట్టుకుంటున్న గురువులు బోధనకు సమయం ఉండడంలేదంటూ ఆందోళన చెప్పలేని కష్టాలు పుస్తకాలకు మూల్యాంకనం నిర్వహించడం ఉపాధ్యాయులపై పెనుభారం. సింగిల్ ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇబ్బందులు తప్పవు. ఉన్నత పాఠశాలల్లో వందలాదిమంది విద్యార్థులు ఉంటే రోజుల తరబడి మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. మరోవైపు హోలిస్టిక్ కార్డులను కూడా పూరించాలి. ఇదంతా కష్టతరం. – అదపాక దామోదరరావు, ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు, రాజాం స్కూల్ ఎడ్యుకేషన్ విధానానికి తగ్గట్టుగా ... అసెస్మెంట్ పుస్తకాల విధానం గందరగోళంగా ఉందనే విష యం మా దృష్టికి వచ్చింది. మూల్యాంకనంలో ఉపాధ్యా యులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఎస్ఎస్ఏ ఆదేశాలతో ఈ విధానం వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధానాన్ని అమలుచేస్తోంది. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాం -
సాగునీటి సరఫరాలో జాప్యం
● డీఆర్సీలో ప్రశ్నించిన జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: ప్రణాళికలు లేని పాలనవల్లే ఖరీఫ్ సాగుకు సకాలంలో సాగునీటిని అందజేయలేకపోయారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం (డీఆర్సీ) గురువారం నిర్వహించారు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోని తోటపల్లి ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో జూన్ నెలలోనే సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టులో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. కాలవల పూడిక తీత పనులు చేపట్టామని అఽధికారులు చెప్పగా ముందుగా ప్రణాళిక వేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇన్చార్జి మంత్రి అనిత కలుగుచేసుకొని మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాలతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చారు. రైతులకు నీరివ్వడంలో ఈ ఏడాది 15 రోజులు ఆలస్యమైందని అంగీకరించారు. ● డీసీసీబీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఎత్తిపోతల పథకం నుంచి రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. బాడంగి మండలం వాడాడ గ్రామం పరిధిలోని 860 హెక్టార్ల సాగుభూమి కోసం గత ప్రభుత్వ హయాంలో ఈ ఎత్తిపోతల పథకం వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. దీనిపై పూర్తినివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆధికారులను ఆదేశించారు. ● వ్యవసాయ శాఖ సమీక్షలో 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్లు కలెక్టర్ బహిరంగంగానే చెప్పడం, గతంలోనే డిమాండ్ చేసినప్పటికీ ఇంకా పూర్తి సరఫరా జరగలేదని జెడ్పీ చైర్మన్ విమర్శించారు. నానో యూరియా వినియోగంపై ప్రచారం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రైతుల్లో సందేహాలు తొలగడంలేదన్నారు. ● పరిశ్రమల సమీక్షలో జిల్లాలో మూతపడిన పరిశ్రమల జాబితాలు ఇవ్వాలని మంత్రి అనిత చెప్పడం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి స్తబ్దతను తెలియజేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం సీ్త్ర శక్తి బస్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పినా జిల్లాలో 160 బస్సులకు కేవలం 137 బస్సులు మాత్రమే సిద్ధం కావడం, వాటిలో సీసీటీవీ అమలు వంటి పనులు ఇంకా పూర్తికాలేదని తెలియజేశారు. సమావేశంలో వైద్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, డాక్టర గాదె శ్రీనివాసులనాయుడు, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, సీపీఓ పీ.బాలాజీ, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఏ దాట్ల కీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కరు మినహా ఎమ్మెల్యేలందరూ డుమ్మా ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలో పాలకులను చెప్పుకొనే అవకాశం ఉన్న వేదిక డీఆర్సీ. ప్రతి మూడునెలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై జిల్లా అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సమస్యల పరిష్కారాలు చేపడతారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నెల్లిమర్ల ఎమ్మెల్లే లోకం నాగ మాధవి మినహా మిగిలిన వారంతా గైర్హాజరుకావడం గమనార్హం. -
కనకమహాలక్ష్మికి లక్ష పసుపు కొమ్ములతో అర్చన
విజయనగరం టౌన్: పట్టణంలోని సిటీబస్టాండ్ వద్దనున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమిని పురస్కరించుకుని గురువారం లక్ష పసుపు కొమ్ములతో అర్చన జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గాజులతో అమ్మవారిని అలంకరించారు. నీటి సంరక్షణలో ‘విజయ’పథం ● దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరానికి చోటు విజయనగరం అర్బన్: నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. దేశంలోని అత్యుత్తమ పది జిల్లాల్లో విజయనగరం జిల్లాకు చోటుదక్కింది. నీటి సంరక్షణ కట్టడాల కారణంగా జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందంటూ కలెక్టర్ అంబేడ్కర్ను సీఎం చంద్రబాబునాయుడు గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో అభినందించారు. నీటి సంరక్షణలో దేశంలోని మొదటి పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరు జిల్లాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగి, జులై నాటికి 4.15 మీటర్లకు చేరిందని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతు మాధవన్, ఇతర అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేసీకి అభినందనలు విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎస్.సేతుమాధవన్ను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం అభినందించారు. కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కేక్ కట్చేసి జేసీకి అభినందనలు తెలిపారు. దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు తాడ్డి గోవింద, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్ చాన్స్లర్కు అవార్డు నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయం చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ బెస్ట్ ఇంజినీరింగ్ ఎడ్యుకేటర్ అవార్డును అందుకున్నారు. మదనపల్లి ఇనిస్టిట్యూట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఐఎస్టీఈ అధ్యక్షుడు డాక్టర్ దేశాయ్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ సుదర్శన్ చేతుల మీదుగా అవార్డు, ప్రసంసా పత్రాన్ని తీసుకున్నారు. -
● రేషన్ అవస్థలు
రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..గిరిజనుల పాలిట శాపంగా మారింది. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత విధానంలోనే రేషన్ షాపుల వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర కొండలు, వాగులు, వంకలు దాటుకుని కాలినడకన రేషన్ షాపు వద్దకు చేరుకుని, అక్కడ కొన్ని గంటల పాటు వేచి ఉండగా వచ్చిన రేషన్ను మళ్లీ నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, జగనన్న హయాంలోనే బాగుండేదని ఎండీయూ వ్యాన్ ద్వారా గ్రామంలోకి రేషన్ వచ్చేదని అంటున్నారు. అదే విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –సాలూరు రూరల్ -
విజయనగరం
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025 విజయనగరం మండలం దుప్పాడ గ్రామానికి చెందిన కె.సత్యవతికి పొలంలో పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గరివిడి బిసీ కాలనీకి చెందిన వరదా సత్యవతికి ఇంట్లోనే పాము వేయడంతో కుటుంబ సభ్యులు చీపురపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ‘ బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తికి తన ఇంటి వద్ద పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.’ -
కళ తప్పిన కొప్పెర్ల గురుకులం
పూసపాటిరేగ: కొప్పెర్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులం... రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న విద్యాలయం. 1983 జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 20 ఎకరాలు విశాలమైన స్థలంలో ఏర్పాటైంది. ఇక్కడ సీటు సాధించేందుకు పోటీ పడాల్సి వచ్చేది. ఈ విద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఎస్ఐలుగా, రాజకీయనాయకులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం గురుకులం కళతప్పింది. ఇక్కడ భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. సరైన వసతిలేక పోవడంతో తరగతి గదుల్లో విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు నివాసం ఉంటున్నారు. తరగతి గదులు, డార్మిటరీ అధ్వానంగా తయారయ్యాయి. చాలా తరగతి గదులకు డోర్లు లేవు. గు రుకులం ప్రిన్సిపాల్ చొరవతో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని ఇటీవల డోర్లును ఏర్పాటుచేశారు. సీట్లు ఖాళీ.. కొప్పెర్ల గురుకులంలో సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భావించేవారు. నేడు అదే విద్యాలయంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురుకులంలో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 620 సీట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతితో మరో 50 సీట్లలో ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే, ప్రస్తుతం 420 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. సుమారు 200 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా గురుకులంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడంలేదు. ఎస్ఎంఎస్ పరిశ్రమ సహకారంతో కొన్ని తరగతి గదులు నిర్మించారు. మైలాన్ పరిశ్రమ సహకారంతో డార్మిటరీ నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం శిథిల భవనాల మరమ్మత్తులకు ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థలో భవనాలు ప్రారంభానికి నోచుకోని డార్మిటరీ గురుకులంలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి మొత్తంగా 200 సీట్లు ఖాళీఉన్నతాధికారులకు నివేదించాం కొప్పెర్ల గురుకులంలో శిథిల భవనాల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. గురుకులంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. శిథిల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. – అప్పారావు, ప్రిన్సిపాల్, కొప్పెర్ల గురుకులం -
ఇది రిగ్గింగ్ గెలుపు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార బలంతో రిగ్గింగ్ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. కలెక్టరేట్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అయిందో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనమన్నారు. పులివెందులలో గెలచామని చెప్పుకునేందుకు అన్నిరకాల కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులతో పాటు బరిలో నిలిచే అభ్యర్థి సైతం ఓటువేయలేని పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జీర్జించుకోలేక, వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలకు పాల్పడడం విచారకరమన్నారు. కలెక్టర్ దగ్గరుండి చేయిస్తున్న ఓట్ల రిగ్గింగ్ ఫొటోను ట్వీట్ నుంచి తొలగించి రిగ్గింగ్ అంగీకరించారని ఆరోపించారు. ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పులివెందుల ఒక్కటే కాదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్నింటినీ ఒకేసారి ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికలు జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు. -
అదుపు తప్పి బోల్తా పడిన పొక్లెయినర్
మెంటాడ: మండలంలో వాణిజి గ్రామం నుంచి అనంతగిరి మండలం బూరుగ గ్రామానికి రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం పనులు పూర్తయిన తరువాత పొక్లెయినర్ను ట్రాలీపైకి ఎక్కిస్తుండగా అదుపు తప్పి లైటింగ్ చూపిస్తున్న బీహార్కు చెందిన ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్, మెంటాడకు చెందిన తాడ్డి రాంబాబులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తాడ్డి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి ఎస్ఐ సీతారాం చేరుకుని గాయాల పాలైన రాంబాబును జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రమోద్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సీతారాం తెలిపారు. ఒకరి మృతి -
ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి మృతి
● అంబులెన్స్లో మృతదేహంతో గేటు ఎదుట నిరసన ● పరిశ్రమ యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు చర్చలు ● రూ.20లక్షలు పరిహారం ప్రకటించిన యాజమాన్యంపూసపాటిరేగ : మండలంలోని ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి విధి నిర్వహణలో వుండగా అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాసరావు (26) ఎస్ఎంఎస్ పరిశ్రమలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఏ షిప్టుకు హాజరైన శ్రీను విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పరిశ్రమ ఉద్యోగి మృతి చెందడంతో గ్రామస్తులు, మృతుని బంధువులతో మృతదేహం అంబులెన్సులో వుంచి పరిశ్రమ గేటు ఎదురుగా ఆందోళనకు దిగారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ పరిశ్రమలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలిపారు. దీంతో పరిశ్రమ ఉద్యోగికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మృతుని బంధువులు పట్టుబట్టడంతో యాజమాన్య ప్రతినిధులు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు ఐ.దుర్గాప్రసాదు, ఎ.సన్యాసినాయుడు, పాపారావు సిబ్బందితో పాటు గేటు వద్ద బందోబస్తు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని చింతలవలస వద్ద ఆర్అండ్బీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని ధర్మపురి గ్రామానికి చెందిన వలిపల్లి సుధాకర్(37) దివీస్ కంపెనీలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. బి షిప్ట్ కావడంతో బుధవారం మధ్యాహ్నం ధర్మపురి నుంచి తగరపువలస సమీపంలో ఉన్న దివీస్ కంపెనీకి వెళ్తుండగా.. చింతలవలస గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీనిలో వలిపల్లి సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సుధాకర్ను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు గంగుబూడి విద్యార్థులు
లక్కవరపుకోట : మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల లక్కవరపుకోట మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జరిగిన ఎంపికలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల పీడి గాడి రవికుమార్ బుధవారం తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో గొర్లె పూర్ణచందు, జూనియర్స్ విభాగంలో వానపల్లి మనోజ్ ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు ఈ నెల 29 నుంచి 31వ తేది వరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు నుంచి ఆడుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వి.వి.జి.మంగరాజు తదితరులు అభినందించారు. మారెడుబాకలో ఇరు వర్గాల కొట్లాట రాజాం సిటీ: మండల పరిధి మారెడుబాక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఇరువర్గాల కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జరజాన కోటేశ్వరరావు, వర్రి రామకృష్ణల మధ్య చెలరేగిన స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. వర్రి రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది జరిపిన దాడిలో జరజాన కోటేశ్వరరావుతో పాటు సునీత, లత, కుంచి నిర్మల, రాయ లక్ష్మి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు అరెస్టు తెర్లాం: ఓ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసుకు సంబంధించి యువకుడిని అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు బుధవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొలుగువలస గ్రామానికి చెందిన సిరిపురపు వెంకటరమణ, అదే గ్రామానికి చెందిన యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ యువకుడు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోమని కోరినప్పుడు పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించాడని, వేరొక యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ప్రేమించిన యువతి తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై నమ్మించి మోసం చేసినట్టుగా తెర్లాం ఎస్ఐ బి.సాగర్బాబు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన బొబ్బిలి రూరల్ సీఐ యువతిని ప్రేమించి, మోసగించిన యువకుడిని అరెస్టు చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు. సెప్టెంబర్ 14న పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్ర స్థాయిలో పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు శ్రీ వాణి ఆర్ట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ పీజే నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం పట్టణంలో గల లయన్స్ కల్యాణ మండపం వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు పోటీలలో పాల్గొనేందుకు ఆగస్టు 25లోగా ప్రవేశ రుసుము రూ.200 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రత్యేక స్థానాలుగా గుర్తించి ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపకతో పాటు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా నమోదు చేసుకునేందుకు 8186076044, 9849833439, 9948128766 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీ వాణి ఆర్ట్స్ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
19న ఐద్వా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఈ నెల 19న జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.రమణమ్మ కోరారు. ఈ మేరకు బుధవారం స్ధానిక రామకృష్ణ నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో విలేకర్లతో ఆమె మాట్లాడారు. మహిళా హక్కులు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్ర వివక్ష, డ్వాక్రా మహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని వెంటనే ప్రతి మహిళకు రూ.1500 పథకం అమలు చేయాలన్నారు. అన్ని సర్వీసుల్లో రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకులు ఎం.జగదాంబ, కె.రమణమ్మ పాల్గొన్నారు. -
ఆటల్లో సత్తా చాటిన పాఠశాలలకు పురస్కారాలు
● ఈ నెల 18 లోగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ● జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 పాఠశాలలకు దక్కనున్న అవార్డులు ● స్కూల్ గేమ్స్ క్రీడలో ప్రతిభ చూపిన వారికి అవకాశంవిజయనగరం: ఆటల్లో మేటిగా నిలిచే క్రీడాకారులున్న పాఠశాలలకు పురస్కారాల పంట పండనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు క్రీడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలని, ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. 19న దరఖాస్తుల పరిశీలన, 20న అభ్యంతరాల స్వీకరణ, 21న తుది జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహం.. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాలలకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది హాకీ క్రీడాకారుడు ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఆ రోజు అన్ని పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా ఫలితాల ఆధారంగా.. ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ఐదు మంది సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి అత్యధిక విజయాలు సాధించిన పాఠశాలల్లో ఐదింటిని కమిటీ గుర్తిస్తుంది. ఇందుకు ప్రతి క్రీడలో అత్యధిక స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 2024 – 2025కు సంబంధించిన క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రదర్శనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని అన్ని బడుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ సంతకంతో క్రీడాకారులు సాధించిన ధ్రువపత్రాల నకళ్లతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న పాఠశాలలకు 29న జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు తెలిపారు. -
దేవుడితో కూటమి ఆటలు
● ట్రస్టుబోర్డు నియామకంలో కుంపట్లు ● వంశపారంపర్య, వ్యవస్థాపక ధర్మకర్తలకు మొండిచేయి ● నిన్న నవదుర్గామాత ఆలయం.. ● నేడు పోలిపల్లిపైడితల్లి ఆలయంరాజాం: దేవుడితోను..దేవస్థానాలతోను కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. చోటా మోటా కార్యకర్తలు, నాయకుల మాటలకు దేవదాయశాఖ తల ఊపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాలు చేస్తోంది. దేవాలయాల ట్రస్టు బోర్డు నియామకంలో సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయాలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది. హైందవ ధర్మాన్ని అటకెక్కించే పనిలో పడింది. రాజాంలో నిన్న నవదుర్గామాత ఆలయ ట్రస్టుబోర్డు కమిటీ నియామకంలో నిబంధనలు ఉల్లంఘించిన దేవదాయశాఖ, ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన పోలిపల్లి పైడితల్లి ఆలయం ట్రస్టు బోర్డు నియామకంలో కూడా వివాదాలకు తావిచ్చి ంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఆలయ ట్రస్టు బోర్డులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటులో గత ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా కూటమి కుంపటి పెడుతోంది. రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయ ట్రస్టు బోర్డు ఎంపిక పక్షం రోజుల క్రితం జరిగింది. ఆ బోర్డులో ఆలయ వ్యవస్థాపక ఽకుటుంబానికి చెందిన ధర్మకర్తను చైర్మన్గా ఉంచాల్సి ఉండగా, ఆయనను తొలగించి, రాజాం పట్టణ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త పేరును ప్రకటించింది. దీంతో ఇక్కడ పెద్దస్థాయిలో వివాదం చెలరేగడంతో పాటు వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ నియామకాన్ని తిరస్కరించడంతో ప్రస్తుతం ఈ బోర్డు ఎంపిక వివాదాస్పదంగా మారి గాలిలో ఉంది. గతంలో ఈ బోర్డు ఎంపికలో ఇటువంటి ఇబ్బందులు రాలేదని, వ్యవస్థాపక ధర్మకర్త వానపల్లి తమ్మయ్య గురువు కుమారుడు వానపల్లి నర్సింగరావు తెలిపారు. ధర్మకర్త కుటుంబానికి చెందిన చైర్మన్గా ఉంటారని, మిగిలిన సభ్యులను దేవదాయశాఖ నియమించాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విధానంలోనే చైర్మన్గా ధర్మకర్తను కొనసాగించి, ఆలయ అభివృద్ధికి సహకరించిన మిగిలిన భక్తులకు కమిటీలో చోటు కల్పించేవారని వెల్లడించారు. ఈ దఫా ఈ నిబంధనలు అటకెక్కించి, ఆలయానికి రానివారిని, ఆలయం అంటే తెలియని వారిని సభ్యలుగా పెట్టిన పరిస్థితి ఉందన్నారు. తాజాగా మరో వివాదం ఇదిలా ఉండగా ఇప్పుడు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు ఎంపికకు దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ట్రస్టు చైర్మన్ పదవిని ఖాళీ ఉంచి, మిగిలిన కమిటీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాకాకుండా మొత్తం కమిటీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో వివాదం ప్రారంభమైంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్గా ఆలయ ధర్మకర్త కుటుంబానికి చెందిన వాకచర్ల కుటుంబీకులే వ్యవహరిస్తున్నారు. గతేడాది వరకూ ధర్మకర్త కుమారుడైన వాకచర్ల దుర్గాప్రసాద్ చైర్మన్గా వ్యవహరించారు. పైడితల్లి అమ్మవారి ఆలయానికి సంబంధించి అన్ని ఉత్సవాల్లో వారి భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి ధర్మకర్త కుటుంబాన్ని పక్కన పెట్టి, కొత్తవారికోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక్కడ వివాదం ప్రారంభమై, దేవదాయశాఖ తీరుతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇంతటి దురదృష్టకర పాలనను ఇంతకు ముందు చూడలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కమిటీ ఎన్నిక ఎలా జరుగుతుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు.నిబంధనలు మారాయి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు కమిటీ ఎంపిక నోటిఫికేషన్ ఉన్నతాధికారుల నుంచి వచ్చింది. గతంలో వంశపారంపర్య ధర్మకర్తలే చైర్మన్లుగా ఉండేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకే నియామకం ఉంటుంది. నా చేతిలో ఏమీలేదు. బీవీ మాధవరావు, దేవాదాయశాఖ రాజాం మేనేజర్ -
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు ● వివరాలు వెల్లడించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావుకొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయగనరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(36) ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు గ్రామానికి చెందిన సిమ్మ శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడు సిమ్మ అప్పారావును కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక విలేకరుల ముందు నిందితుడిని హాజరుపరిచి వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర క్రితం మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన స్వంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు. ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. సీతంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తుపాకీ కోసం విచారించగా పాతవలస సమీపంలో వుంచినట్లు తెలపగా తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన సీఐ సిహెచ్.షణ్ముఖరావు, ఎస్ఐ పి.ప్రసాద్రావు, పీసీ లు ఎల్.రమేష్, దేముడు తదితరులను అభినందించారు. రివార్డులకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. -
జర్మన్ భాషపై ఆన్లైన్లో ఉచిత శిక్షణ
పార్వతీపురం టౌన్: జర్మనీ దేశంలో అసిస్టెంట్ నర్సు ఉద్యోగాలు పొందేందుకు జిల్లాలోని జి.ఎన్.ఎమ్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓంకాప్, టి.ఎన్.ఏ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆన్లైన్లో శిక్షణ ఉంటుందని వివరించారు. తప్పనిసరిగా జి.ఎన్.ఎమ్ పూర్తి చేసి ఏడాది పాటు సాధారణ ఆసుపత్రుల్లో అనుభవం కలిగి 39 ఏళ్లలోపు వయసున్న వారు జర్మన్ భాష నేర్చుకోవడానికి అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సుమారు 8 నెలల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో ఏ1, బీ2 లాంగ్వేజ్లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.30,000లు సెక్యూరిటీ డిపాజిట్ చేసి, జర్మనీ వెళ్లేందుకు విమాన చార్జీలు, బీ2 పరీక్ష ఫీజు, వీసా చార్జెస్ చెల్లించాలన్నారు. శిక్షణ పూర్తి చేసి బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.2 లక్షల నుంచి 2,50,000ల వరకు జీతం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 7032060773 నంబరును సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య -
గంజాయితో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్ : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి నగేష్ అలియాస్ బాలరాజుకు చెందిన రూ.56 లక్షల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని ఎస్.కోట పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన నగేష్ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పంత్లున్గా పంచాయత్ నందాపూర్ మండలం భాకాపుట్ గ్రామానికి చెందిన వాడని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంపాదించిన సుమారు రూ.56 లక్షల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారుల నుంచి అతని భార్య జమున బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.53 లక్షల నగదు జమ అయినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు సంపాదించిన అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్టు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కొల్కత్తాలోని కాంపిటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్లాయని, సదరు ఆస్తులను ఎవరు కొనుగోలు చేసినా చెల్లనేరవని ప్రజలు దీన్ని గుర్తించాలని ఎసీ కోరారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టర్ వి.నారాయణమూర్తి ఇతర పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
పార్వతీపురం రూరల్ : మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ రైతుకు ద్రోహం చేస్తున్నదని పలు రైతు సంక్షేమ, రైతుకూలి, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు, కార్మిక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ రంగంలోకి ‘కార్పొరేట్’ సంస్థలను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇవ్వడం సరికాదన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఈవీ నాయుడు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు పి.శ్రీనునాయుడు, కృష్ణ వేణి, ఎం.భాస్కరరావు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు పి.సంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిన మోహన్, గేదెల రామకృష్ణ, వంగల దాలినాయుడు, ఏఐటీయూసీ నాయకులు ఆర్వీఎస్ కుమార్, దుర్గారావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు
విజయనగరం అర్బన్: జల వనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టరేషన్ ఆర్ఆర్ఆర్ కింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులను జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆమోదం తెలిపారు. నీటి వనరుల పునరుద్ధరణ, పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం, తాగునీటి లభ్యతను పెంచడం, భూగర్భ జలాల రీచార్జ్కు ఉద్దేశించిన ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ ఎంవీ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ ప్రవీణ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏడీ సంజీవ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీలో ఆమోదం తెలిపిన కలెక్టర్ -
చర్చించడమేనా..! పరిష్కరించరా...?
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, పనుల మంజూరుకు చక్కని వేదిక... జిల్లా అభివృద్ధి సమావేశం(డీఆర్సీ). కూటమి ప్రభుత్వం వచ్చాక డీఆర్సీకి అర్థమే మారిపోయే పరిస్థితి. వివిధ సమస్యలపై చర్చించడమే తప్ప పరిష్కారం కనిపించడంలేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించినా స్వపక్ష ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన సమస్యలను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ప్రజలకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలతో పాటు రాష్ట్రస్థాయిలో నిధులు అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూటమి నేతలు చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధి సమావేశాన్ని మమ అనిపించేస్తున్నారని, జిల్లా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో చర్చసాగడంలేదన్న వాదన వినిపిస్తోంది. ● మే నెలలో జరిగి డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదిత పనులు ఇంకా ప్రారంభించలేదు. పూర్తిగా శిథిలమైన బొబ్బిలి–తెర్లాం రోడ్డు, బాడంగి మండలంలోని ఆకులకట్ట– పినపెంకి రోడ్డు, జిల్లా కేంద్రంలోని ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి ఐనాడ రోడ్డు, రాజాం–పాలకొండ రోడ్డు, రణస్థలం–రామతీర్థం రోడ్ల పనులకు ప్రతిపాదనలన్నీ మంజూరు చేసినట్టు చెబుతున్నా నిధులు విడుదలకాలేదు. దీంతో పనులు ప్రారంభించలేదు. ● జిల్లాలో తల్లికివందనం పథకం అందలేదంటూ సుమారు 18వేల మంది పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశారు. వీరిలో 12వేల మంది దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా అధికారులు నిర్ధారించారు. వీరి ఖాతాలకు ఇప్పటివరకు డబ్బులు జమకాలేదు. ఎప్పుడు నిధులు విడుదల చేస్తారో తెలియదు. దీనిపై డీఆర్సీలో కొందరు నేతలైనా ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ● వ్యవసాయం రంగంలో సేవలు మరింత దిగజారిపోయాయి. ఖరీఫ్ సీజన్లో రైతుకు ఎరువు కొరత వెంటాడుతోంది. అన్నదాత సుఖీభవ నిధులు చాలామంది కౌలురైతులు, డీ పట్టా భూములున్న రైతుకు జమకాలేదు. కొందిరికి పీఎం కిసాన్ నిధులు మాత్రమే జమయ్యాయి. వీటికి పరిష్కారం చూపాలి. ● కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలవుతున్నా స్పౌజ్ పింఛన్లు మినహా ఏ ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. మరోవైపు జిల్లాలో 25వేల మంది పింఛన్లు రద్దుచేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగే డీఆర్సీలో ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారు. ● జలాశయాల్లో నీరున్నా ఆయకట్టుకు అందడంలేదు. సాగునీటి కాలువలు సకాలంలో బాగుచేయకపోవడమే దీనికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి పరిష్కారం చూపుతారోలేదో చూడాల్సిందే. ● కొత్త రేషన్ కార్డుల కోసం వేలామంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కొత్తగా ఒక్కరికీ మంజూరు కాలేదు. ● జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నేడు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో డీఆర్సీ -
ఒకే బెడ్పై ఇద్దరు రోగులకు చికిత్స
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఆదిలక్ష్మి. ఈమెది బొండపల్లి గ్రామం. ఊపిరితిత్తుల్లో కఫం చేరడంతో సర్వజన ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల కోసం ఆమె ల్యాబొరేటరీ దగ్గరకు వెళ్లింది. వైద్య సిబ్బంది వీల్చైర్ ఇవ్వక పోవడంతో ఆమె బంధువే ఆమెను యూరిన్ బ్యాగ్తో పాటు వార్డుకు తీసుకెళ్లింది. ఒకే బెడ్పై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్నది సర్వజన ఆస్పత్రిలోనే. బెడ్స్ ఖాళీ లేక పోవడంతో జనరల్ మెడిసిన్ వార్డులో ఇద్దరికి ఒకే బెడ్పై ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విరేచనాలతో బాధపడుతూ విజయనగరం పట్టణంలోని బలిజివీధికి చెందిన ఎం.శ్రీను, పాముకాటు వేయడంతో బొండపల్లి మండలం గొట్లాంకు చెందిన రెడ్డి అప్పలనాయుడు ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరికీ ఒకే బెడ్పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎ.చిన్నారావు. ఇతనిది అల్లూరి సీతారామారాజు జిల్లా (పాడేరు) అనంతగిరి మండలంలోని కోటపత్తివలస గ్రామం. ఈ నెల 12న శరీరం అంతా నొప్పులు, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదని, నొప్పి భరించలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ● సర్వజన ఆస్పత్రిలో బెడ్స్ఫుల్.. వసతులు నిల్..! ● ఒకే బెడ్పై ఇద్దరు రోగులకు చికిత్స ● చికిత్స అందించడంలో వైద్యుల అలసత్వం! ● ఆస్పత్రిలో రోజుకు 1200 వరకు ఓపీ నమోదు ● ఆస్పత్రిలో బెడ్స్ సంఖ్య 368 ● రూ. 500 కోట్లతో గాజులరేగ వద్ద బోధనాస్పత్రి నిర్మాణం ● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో 1500 పడకలతో విశాలమైన భవనం నిర్మాణం ● ఆస్పత్రిని అక్కడికి తరలించక పోవడంతో రోగులకు తప్పని ఇబ్బందులు విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లాలో అతిపెద్దది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి. జిల్లా ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. రోజుకు 1200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిలో సేవలు మృగ్యంగా మారాయి. వసతులు లోపించాయి. రోగులకు సకాలంలో సేవలు అందడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరల్ వార్డుల్లో ఆస్పత్రిలో చేరిన 24 గంటల వరకు వైద్యులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగులను వార్డులకు, ల్యాబ్కు, సిటీస్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, డ్రెస్సింగ్ రూమ్లకు వెళ్లేందుకు వీల్ చైర్, స్టెచ్చర్ సదుపాయం కల్పించడంలేదని రోగులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గతంలో అందే స్థాయిలో సేవలు అందడం లేదని, పర్యవేక్షణ లోపించిందని వాపోతున్నారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వరండాలోనే చికిత్స పొందుతున్న రోగులు కూటమి నేతల తీరుతో తప్పని ఇబ్బందులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేదుకు వీలుగా గత ప్రభుత్వం గాజులరేగ సమీపంలో సుమారు 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని తలపెట్టింది. వైద్య విద్యార్థులకు తరగతులు కూడా ప్రారంభించింది. బోధనాస్పత్రి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని 1500 పడకలతో విశాలంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న బోధనాస్పత్రికి తరలించేందుకు కూటమి నేతలు అభ్యంతరం చెబుతున్నారు. వసతులు లేక పోయినా, రోగు లు ఇబ్బంది పడుతున్నా ఆస్పత్రిని తరలించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో రోగులతో పాటు వైద్యసేవలందించేందుకు వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లకు తిప్పలు తప్పడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి విశాలమైన భవనాలు నిర్మించిన వైద్య కళాశాలకు ఆస్పత్రిని తరలించకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు వినతులు కూడా అందజేశారు. సర్వజన ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రిలో కలిపి కేవలం 500 బెడ్లే ఉన్నాయని, ఇన్పేషేంట్ల సంఖ్య పెరిగిన సమయంలో సరిపడడంలేదని, ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురు రోగులు సేవలు పొందాల్సి వస్తోందని, బోధనాస్పత్రి వద్దకు సర్వజన ఆస్పత్రిని తరలించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. రోజుకి 1200 వరకు ఓపీ నమోదవుతుండగా, వీరిలో 90 నుంచి 100 మంది వరకు ఆస్పత్రిలో ఇన్ పేషేంట్స్గా చేరుతున్నారు. ఆస్పత్రిలో 368 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇన్ పేషేంట్లు 400 నుంచి 450 మంది వరకు ఉంటున్నారు. దీంతో పడకలు చాలక ఒకే బెడ్పై ఇద్దరిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. బెడ్స్ చాలకపోవడం వల్లే... వ్యాధుల సీజన్ కావడంతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. బెడ్స్ చాలాక పోవడం వల్ల ఒకేబెడ్పై ఇద్దరు చికిత్స తీసుకోవడానికి అంగీకరించేవారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి రాణి విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. హెచ్ఐవీ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.రేఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రోగ్రాం మేనేజర్ ఉమామహేశ్వరరావు, సూపర్ వైజర్ బద్రి, గిరి, శ్రీనివాస్, మేఘన, తదితరులు పాల్గొన్నారు. ప్రతీ పనికి ఒక రేటు ● రెవెన్యూ సిబ్బంది తీరుపై జేసీకి రైతు సంఘం ఫిర్యాదు విజయనగరంఫోర్ట్: జిల్లాలో పనిచేస్తున్న పలువురు రెవెన్యూ సిబ్బంది ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించారు. భూముల రీసర్వే, మ్యుటేషన్ కోసం సెంటుకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనిచేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ సేతుమాధవన్కు రైతు సంఘం కార్యదర్శి బుద్దరాజు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజకీయ బ్రోకర్లు ద్వారా డబ్బులు ఇచ్చిన వారికే పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎరువుల అధిక ధరలను కట్టడి చేయాలని, ఈక్రాప్ బుకింగ్ లోపాలను సరిచేయాలని విన్నవించారు. జేసీని కలిసిన వారిలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, పైడిపినాయుడు పాల్గొన్నారు. వచ్చారు.. వెళ్లారు.. విజయనగరం: శాప్ చైర్మన్ రవినాయుడు జిల్లా పర్యటన వచ్చారు... వెళ్లారు అన్న చందంగా సాగింది. ముందస్తుగా ప్రకటించిననిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా వచ్చిన చైర్మన్ కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో పాటు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు వేచి చూడాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు క్రీడా మైదానాలను స్థానిక ఎమ్మెల్యే అదితిగజపతి రాజుతో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాను స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తామని, దశలు వారీగా క్రీడా మైదానాలను ఆధునీకరిస్తామని చెప్పారు. స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్ను త్వరలోనే పూర్తిచేసి స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభిస్తామని, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం నిధులతో విజ్జి స్టేడియంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను, హాకి కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పనులన్నీ ఎప్పటిలోగా పూర్తిచేస్తామన్నది చెప్పకపోవడంపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. ఆయన వెంట కె.జగదీశ్వరి, ఎం.డి.రమేష్, పీబీఎన్ రాజు ఉన్నారు. -
కొలతల్లో తేడా వస్తే కఠిన చర్యలు
విజయనగరం: వినియోగదారులు కోనుగోలుచేసే వస్తువుల కొలతల్లో తేడావస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్ హెచ్చరించారు. నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో బేకరీ, స్వీట్ దుకాణదారులతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఆహారపదార్థాలు కొనుగోలు చేసే సమయంలో బాక్స్ బరువును మినహాయించి తూకం వేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాటా వినియోగంలో జీరో రీడింగ్ కచ్చితంగా పాటించాలన్నారు. ప్యాకేజీ ఫుడ్స్ విషయంలో ప్రాథమిక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కో ఆర్డినేటర్ చదలవాడ ప్రసాద్, లీగల్ మెట్రాలజీ ఏడీ పి.వి.రంగారెడ్డి, పరిశీలకులు ఎస్.ఉమా సుందరి, తదితరులు పాల్గొన్నారు. లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్ -
జేఎన్టీయూ జీవీలో 130 మంది రక్తదానం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీర్ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది 130 మంది 130 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు స్వయంగా రక్తదానంచేసి విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ జి.జయసుమ, డాక్టర్లు సోమశేఖర్, సునీత, యోగానంద్ పాల్గొన్నారు. -
పైడితల్లి జాతర తేదీలు ఖరారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారైనట్టు ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష బుధవారం తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉత్సవ నిర్వహణ తీరును వివరించారు. సెప్టెంబర్ 12న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మండల దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేరోజు చదురుగుడి వద్ద ఉదయం 9.30 గంటలకు, వనంగుడి వద్ద 11 గంటలకు పందిరిరాట వేస్తామన్నారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్షలు ఉంటాయన్నారు. అక్టోబర్ 6న తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవం, 14న పెద్దచెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 19న సాయంత్రం 5.30 గంటల నుంచి వనంగుడి వద్ద కలశ జ్యోతి ఊరేగింపు, 21న మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి, దీక్షావిరమణ ఉదయం 8 గంటల నుంచి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. దీంతో ఉత్సవం ముగుస్తుందన్నారు. సమావేశంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం అర్బన్: రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమతంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, ఈఓపీఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వెబెక్స్లో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికీ సెలవులు మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆర్డబ్ల్యూస్ అధికారులు పైప్లైన్లను తనిఖీ చేయాలని, మంచినీటి పైపులు ఉన్నచోట డ్రైనేజీ పైపులు లేకుండా చూడాలని, ప్రజలకు నురక్షిత తాగు నీరందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధం ఉండాలని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 089222 36947 ఏర్పాటుచేశామని, 24 గంటల పాటు సిబ్బంది డ్యూటీలో ఉంటారని, అత్యవసర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2 వేల గృహనిర్మాణాలు పూర్తి చేయాలి ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలో 2 వేల గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణ కింద 72,496 గృహాలు మంజూరు కాగా 49,127 గృహాలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్ పాల్గొన్నారు. ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పస్తులతో హాస్టల్ విద్యార్థుల నిరసన
శృంగవరపుకోట: భోజనం బాగులేదంటూ ఎస్.కోట పట్టణం పుణ్యగిరి రోడ్డులో ఉన్న గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. పస్తులతో ఉంటూ నిరసన తెలిపారు. చాలా రోజులుగా హాస్టల్లో మెనూ పాటించడం లేదని, భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఒక్క ఫ్యాన్కూడా లేకపోవడంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విజయనగరంలో ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి రమేష్, నాయకులు మహేష్, చైతన్య స్పందించారు. భోజనం బాగులేదని చెప్పిన విద్యార్థులపై వార్డెన్ సత్యనారాయణ బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన అంశాన్ని వార్డెన్ వద్ద ప్రస్తావింగా ఇటీవల కురిసిన పిడుగుల వానకు ఫ్యాన్లు పాడయ్యాయని, రెండు రోజుల్లో బాగుచేయిస్తామని చెప్పారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
విజయనగరం లీగల్: వచ్చేనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్న్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీల మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా 12 ప్రమాద బీమా కై ్లమ్ కేసులు రాజీకి వచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయ కల్యాణి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ఇన్సూరెనన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.నులిపురుగుల నివారణతో పిల్లలకు ఆరోగ్యం: కలెక్టర్ అంబేడ్కర్గంట్యాడ: పిల్లల్లో నులిపురుగుల నివారణతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, పోషకాహారలోపం తొలగి ఆరోగ్యంగా పెరుగుతారని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్యన ఉన్న పిల్లలు, విద్యార్థులందరితో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. డీ వార్మింగ్ డే సందర్భంగా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపులోని నులిపురుగుల నివారణకు ప్రతీ ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రను ఒకే డోస్గా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఈఓ మాణిక్యంనాయుడు, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, డాక్టర్ హేమలత, పాఠశాల హెచ్ఎం ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.పాత మార్కొండపుట్టిలో గజరాజులుకొమరాడ: తోటపల్లి ముంపు ప్రాంతమైన పాత మార్కొండపుట్టి గ్రామ పరిసరాల్లో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
గురజాడ ఇంటిలో తాగుబోతు హల్చల్
● కోటవెనుక గోడ ఎక్కి మహాకవి ఇంట్లోకి చొరబడిన దొంగ ● పుస్తకాలను విసిరేసిన వైనం ● ఆవేదనలో సాహితీవేత్తలు విజయనగరం టౌన్: విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం సేవించి.. ఆ మత్తులో మహాకవి గురజాడ ఇంటిలోకి కోట వెనుక భాగం నుంచి ఓ దొంగ మంగళవారం వేకువజామున చొరబడ్డాడు. మహాకవి రచనలు తప్పితే అక్కడ ఏమీ కనిపించకపోయే సరికి... ఆ పుస్తకాల విలువ తెలియని తాగుబోతు వాటిని గోడమీదనుంచి బయటకు విసిరేశాడు. చిందరవందర చేశాడు. మద్యం మత్తులో తూగుతూ గోడపై నుంచి దూకేసి అక్కడే మత్తులోకి జారు కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహాకవి రచనలకు భద్రత కరువు? మహాకవి గురజాడ రచనలను భద్రం చేయాల్సిన ఆర్కియాలజీ విభాగం, జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహాకవి ఇంటిని పరిరక్షణ చేయమని, పక్కన ఉన్న ఖాళీ స్థలం వల్ల స్మారకభవనానికి ఇబ్బందులు వస్తున్నాయని, అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తాజా ఘటనతో మహాకవి అభిమానులు, సాహితీ సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మహాకవి రచనలకు భద్రత కల్పించాని కోరుతున్నారు. మహాకవి.. మా పాలకులను మన్నించుమా...విజయనగరం గంటస్తంభం: తెలుగు జాతికి తన రచనలతో వెలుగు దారి చూపిన మహోన్నత వ్యక్తి, కన్యాశుల్కం నాటక రచయిత, మహాకవి గురజాడ అప్పారావు గృహానికి, ఆయన సాహిత్య సంపదను కాపాడడంలో పాలకులు విఫలమయ్యారని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. ఒక తాగుబోతు గురజాడ అప్పారావు గృహంలోకి చొరబడి అక్కడి ఫ్యాన్లు, విలువైన పుస్తకాలు, వస్తువులు చిందరవందర చేసిన విషయం తెలుసుకుని పౌర వేదిక సభ్యులతో కలిసి గురజాడ గృహాన్ని మంగళవారం సందర్శించారు. గురజాడ ఇందిర, ప్రసాద్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురజాడ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గురజాడ జయంతి, వర్ధంతి సభల్లో అధికారులు, నాయకులు ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ వెంటనే మర్చిపోతున్నారన్నారు. గురజాడ గృహం పరిసరాలను ఉచ్చలదొడ్డి మాదిరిగా తయారుచేశారన్నారు. అపరిశుభ్రతలో భవనం ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారన్నారు. మద్యం మత్తులో ఓ దొంగ ఇంటిలో చొరబడి, విలువైన పుస్తకాలను గోడబయ టకు విసిరేయడాన్ని చూస్తే భద్రతలోని డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవన నిర్వహణ బాధ్యతను విజయనగరం కార్పొరేషన్, జిల్లా టూరిజం, పురావస్తు శాఖ అధికారులు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గురజాడ అభిమాను లు దేశవ్యాప్తంగా ఉన్నారని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి వారంతా ఆవేదన చెందుతున్నారన్నారు. గురజాడ గౌరవం కాపాడే దిశగా మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక సభ్యు లు ప్రభాకరరావు, రామచంద్ర రాజు, రామ్మోహన్రావు, పద్మావతి, కనకాచారి, గోపి పాల్గొన్నారు. -
బొబ్బిలిలో రెడ్బుక్ రాజ్యాంగం!
బొబ్బిలి: ఇప్పుడున్నది మా ప్రభుత్వం.. నడుస్తున్నది రెడ్బుక్ రాజ్యాంగం.. ఇక్కడ బంకును మేమే నిర్వహిస్తాం.. తక్షణమే ఖాళీచేసి వెళ్లిపో.. లేదంటే లారీలను అడ్డుగా పెడుతాం.. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటాం.. వ్యాపారమే సాగనీయం... ఇదీ బొబ్బిలి పట్టణంలోని పాతకోర్టు జంక్షన్లోని హెచ్పీ పెట్రోల్బంకు నిర్వాహకునికి స్థానిక నేతల నుంచి ఎదురైన బెదిరింపులు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని లొకర్నో ఏజెన్సీకి ఉన్న స్థలంలో హెచ్పీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. స్థల యజమాని మృతి చెందారు. తదనంతరం కంపెనీకి సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ఉన్న సమస్యల కారణంగా స్థల యజమానికి కంపెనీ ఏళ్ల తరబడి అద్దె చెల్లింపు పెండింగ్లో పెట్టింది. పెట్రోల్ బంక్ లైసెన్సుదారు, సామర్లకోటకు చెందిన దళితుడైన చక్రవర్తి ఇక్కడ బంకును నిర్వహిస్తున్నారు. వ్యాపారం ఆపేయాలని స్థానిక నేతల నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. లైసెన్సు తమకు వదిలేయాలని, నిర్వహణ చూసుకుంటామంటూ బెదిరించారు. ఎమ్మెల్యేను కలవాలంటూ ఆదేశాలిచ్చారు. చేసేదిలేక ఆయన స్థానికంగా బంకులు నిర్వహిస్తున్న విజయ్, రెడ్డిల సహాయం అర్ధించారు. వారి సూచనలతో ఎమ్మెల్యేకు సమస్య చెప్పేందుకు వెళ్లగా కొందరు నాయకులు కలవనీయలేదు. బంక్కు లారీని అడ్డం పెట్టడంతో వ్యాపారం తగ్గిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడి విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డీఎస్ఓ మురళీనాథ్ను విచారణకు ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పౌరసరఫరాల ఉపతహసీల్దార్ రెడ్డి సాయికృష్ణతో కలిసి పెట్రోల్ బంక్కు వెళ్లి విచారణ జరిపారు. లైసెన్సు ఎంత వరకూ ఉంది. స్థల లైసెన్సు, బంక్ నిర్వాహణకు సమయం ఎంత అనే కోణంలో విచారణ చేశారు. బంకుకు అడ్డంగా పెట్టిన లారీలను పరిశీలించారు. ఈ విషయమై మురళీనాథ్ను ప్రశ్నించగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చాననీ, ఇక్కడి పరిస్థితులపై కలెక్టర్కు నివేదిక అందజేస్తానన్నారు. పెట్రోల్ బంక్ నిర్వహించనీయకుండా బెదిరింపులు బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుగా పెడుతున్న లారీలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నిర్వాహకుడు డీఎస్ఓను విచారణకు ఆదేశించిన కలెక్టర్ -
50వేల బంగారు కుటుంబాల దత్తత
విజయనగరం అర్బన్: ఆగస్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. పీ4 కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా, సీజనల్ వ్యాధులు, భారీ వర్షాలు తదితర అంశాలపై ఆన్లైన్లో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదట 67,066 బంగారు కుటుంబాలను గుర్తించగా, వడపోతల అనంతరం ఆ సంఖ్య 60,612 కు తగ్గిందని కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 15 నాటికి జిల్లాలో 50వేల బంగారు కుటుంబాల దత్తతను పూర్తిచేయాల్సి ఉందని, మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, సీపీఓ పి.బాలాజీ, జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
కొత్తవలసలో మరో చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టులో సుమారు 5 కేజీల బంగారం, పెద్ద మొత్తంలో నగదును దొంగలు దోచుకుపోయిన విషయం మరవక ముందే మరో ఇంటిలో పడి పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదును దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో వరుస దొంగతనాలు కొత్తవలస పోలీసులకు తలనొప్పిగా మారింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ సమీప బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మోపాడ కృష్ణంనాయుడి ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 50 తులాల వివిధ రకాల వెండిసామగ్రి, ఆయన కుమారుడి కళాశాల ఫీజు కట్టేందుకు దాచుకున్న రూ.లక్షా 50వేల నగదు దోచుకుపోయారు. కృష్ణంనాయుడు శనివారం రాఖీ పండగ సందర్భంగా ఎస్.కోటలో గల తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లారు.అదే రోజు సమీప బంధువైన ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొని శనివారం రాత్రి ఎస్.కోటలోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం కొత్తవలసలో గల ఇంటికి కుటుంబంతో సహా వచ్చేసరికి ఇంటి ఇనుప కటకటాలకు సబంధించిన గడియలను కోసి ఇంటిలోకి దొంగలు చొరబడి ఇంట్లోని సామాన్లు, బీరువాలో బట్టలను చిందర వదంగా పడేశారు. అన్నీ పరిశీలించగా బంగారం, వెండి, నగదు పోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం విజయనగరం నుంచి క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కృష్ణంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 15 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.లక్షా 50వేల నగదు దోచుకున్న దొంగలు పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస దొంగతనాలు -
అర్జీదారుల ఆకలి తీరుతోంది
పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి సొంత గ్రామాల్లో ఉదయం బయలు దేరి 10గంటల సమయానికి కలెక్టరేట్కు అర్జీదారులు చేరుకుంటారు. అయితే చార్జీలు భరించి వ్యయ ప్రయాసాలతో సామాన్యులు, దివ్యాంగులు తమ సమస్య పరిష్కారం కావాలనే ఆశతో వచ్చిన వారికి అర్జీలు అందజేసిన అనంతరం ఉచితంగా కలెక్టరేట్ ఆవరణలో భోజనం చేసేందుకు ఇటీవల కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ ఆలోచన మేరకు భోజన సదుయాపం కల్పించారు. ఎంతోమంది అర్జీదారులు ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంతమంచి ఆలోచన చేసిన కలెక్టర్కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 44 మంది ఎంపికవిజయనగరం అర్బన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లాలోని 44 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ –2025 పోటీల్లో పాల్గొన్న 100 మంది నుంచి ఈ ఎంపిక జరిగిందన్నారు. ఈ పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన 44 మంది త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా జుట్టాడ ప్రీతి, ఎ.నారాయణ, రమేష్, హర్ష, భాస్కర్, కరుణ వ్యవహరించారు. -
రాష్ట్ర పోటీలకు గుణుపూరుపేట విద్యార్థినులు
డెంకాడ: రాష్ట్ర సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలోని చెవ్వూరులో జరగనున్న పోటీలకు గుణుపూరుపేట ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు ఆబోతుల తేజస్విని, గేదెల మానస ఎంపికయ్యారు. అలాగే వచ్చే నెల అనంతపురంలో జరగబోయే జూనియర్ బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలకు పదవ తరగతి విద్యార్థినులు సీహెచ్ రోహిణి, కెల్ల నవ్య, కెల్ల రేష్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల హెచ్ఎం సీహెచ్ అరుణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ తదితరులు అభినందించారు. -
మేనమామను కడతేర్చిన మేనల్లుడు
బొండపల్లి: మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన వ్యక్తిని సొంత మేనల్లుడు చంపి ఆ తరువాత సహజంగానే చనిపోయినట్లు అందరినీ నమ్మించి దహనసంస్కారాలు నిర్వహించాడు. ఈ విషయంపై 100కు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీడిగేటి అప్పల కృష్ణ (42), మేనల్లుడు నారపాటి సాయి శనివారం మద్యం తాగడానికి గ్రామం బయటకు వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో మేనమామ కృష్ణను సాయి హత్య చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. మేనమామ ఏడని, ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావని మృతుడి భార్య అడగ్గా మద్యం ఎక్కువై పడుకున్నాడని సమాధానం చెప్పాడు. కొద్దిసేపటి తరువాత మృతుడు కృష్ణను సాయి బైక్పై తీసుకు వచ్చి చలనం లేదని, చనిపోయి ఉంటాడని అందరిరినీ నమ్మించే ప్రయత్నం చేసి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. శవాన్ని వారి ఆచారం ప్రకారం పూడ్చిపెట్టారు. కార్యక్రమం అనంతరం సాయి విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లి పోయాడు. మృతుడు కృష్ణ సొంత చెల్లెలి కొడుకు సాయి కాగా కొంతకాలంగా వారు గోపాలపట్నంలో ఉంటున్నారు. తరచూ సాయి మేనమామ ఇంటికి వస్తూ పోతుంటాడు. ఈ క్రమంలోనే శనివారం వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ చనిపోవడం పట్ల పోలీసులకు 100కాల్ రావడంతో సోమవారం రంగంలోకి దిగారు. శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తహసీల్దార్ డోలా రాజేశ్వరావుతో పాటు ఎస్సై యు.మహేష్ వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా? మృతుడి భార్య రాజుతో మేనల్లుడు సాయికి కొన్ని సంవత్సరాలనుంచి వివాహేతర సంబంధం ఉందని ఈ విషయంపై మేనమామతో సాయికి గొడవ జరిగి హత్యకు దారి తీసిఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉండగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. -
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
● రోడ్డున పడిన ఆటోడ్రైవర్లు ● ఆందోళనలో సుమారు 28వేల కుటుంబాలు ● తమ పరిస్థితి ఏమిటని ఆవేదన ● వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ ● కలెక్టరేట్ వద్ద ఆందోళనమా గోడు వినండి .. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించిన మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వనికి చెల్లించాల్సిన రోడ్, గ్రీన్ టాక్స్, రెన్యువల్, పొల్యూషన్ వంటి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో కార్పొరేట్ సంస్థలైన రాపిడో, ఉబర్, ఓలా వంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింది. వ్యక్తిగత వాహనాలపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు అనుమతులను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి హామీ గాలికొదిలేసింది. – కె.సురేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శివాహనమిత్ర అమలు చేయాలి.. కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో నం 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పింది. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటీకీ అవేమీ అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో అంత కంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసే వరకు పోరాడతాం. – ఆటో కార్మికుడు, జి.కూర్మారావు, విజయనగరంవిజయనగరం గంటస్తంభం: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ హామీ కాకరేపుతోంది. ఆ హామీ అమలు చేసి తమ పొట్ట కొట్టొదంటూ ఆటోడ్రైవర్లు ర్యాలీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దంటూ విజయనగరంలో ఆటోడ్రైవర్లు రోడ్డెక్కారు. చలో కలెక్టరేట్ నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో తమకు ఉపాధి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు నడిపే ముందు తమ వ్యవహారం చూడాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయని విజయనగరం ఆటో కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో చక్రం కదిలితేనే బతుకు బండి సాగేది దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 28వేల మంది ఆటో, క్యాబ్ కార్మికులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్ర భుత్వం హయాంలో వారికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథ కం వర్తింపజేయడం ద్వారా లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వారంతా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహనమిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆందోళన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ. 15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్లు సంక్షేమం కోసం రూ. 400 కో ట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ. 10వేలు చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. హమీల అమలుకు ర్యాలీ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసేలోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సోమవారం డ్రైవర్లు, కార్మికులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు.