breaking news
Vizianagaram
-
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి...
దత్తిరాజేరు: మండల కేంద్రమైన దత్తిరాజేరులో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పువ్వల శ్రీనివాసరావుతో పాటు పది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కుంటుపడిందని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం
విజయనగరం టౌన్: జీఎస్టీ శ్లాబ్ను రెండుకు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఉప రవాణాధికారి డి.మణికుమార్, ఆర్టీఓ విమల, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, రవిశంకర్ ప్రసాద్, శివరాంగోపాల్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందం వెంబడి అంధకారం
● బాణసంచా పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి ● పెద్దలు వెంట ఉంటే ఆనందం మీ వెంటేరామభద్రపురం: జాతి, కుల, మత,వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దివ్య దీపావళి. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయతీ. అయితే దీపావళిని వేడుకగా జరుపుకునే క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాణసంచాలోని రసాయనాలతో కళ్లు దెబ్బతింటాయి. సల్ఫర్, గన్పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు పూర్తిగా కనబడకుండా పోతాయి. నిఘాతోనే అక్రమానికి అడ్డు కట్ట రూ.లక్షల విలువైన సరుకును ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతున్నారు.పండగ రోజు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొదరైతే ఏకంగా నివాస ప్రాంతాల మధ్య నిబంధనలు పాటించకుండా నిల్వ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న దుకాణాల వ్యాపారులు మిగిలిన సరుకును కొన్న చోటకే తిరిగి పంపాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయడం లేదు.పలు చోట్ల గుట్టుగా నిల్వ చేసి ఇతర సమయాల్లోనూ అమ్మేస్తున్నారు.కొందరైతే ఎలాంటి అనుమతులు లేకపోయినా పొరుగు ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి ఇళ్లలోనే టపాసులు తయారు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేయకపోతే అనుమతి లేని వారు విక్రయాలతో పాటు చేసే నిల్వలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.సొంత వైద్యం వద్దు టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసే ముందు కాలిన గాయంపై చల్లని నీరు పోయాలి. అంతేగానీ ఐస్ముక్కలతో రుద్దకూడదు. వెన్న గ్రీజ్, ఇతర పౌడర్లు వంటివి రాయకూడదు. వాటివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దిలీప్కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, రామభద్రపురం కాల్చే ముందు అప్రమత్తం పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చడం ఉత్తమం. టపాసులు కాల్చేటప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకోవాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉదయం 6 నుంచి 8 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.దీపావళి పండుగ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వి.ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంప్రమాద నివారణ, జాగ్రత్తలు ఇలా.. టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా జరగాలి పేలని టపాసులపై వంగి చూడడం మంచిది కాదు కంటికి రక్షణగా ప్లెయిన్ అద్దాలు వాడడం మంచిది పేరున్న సంస్థలు తయారు చేసిన టపాసులనే ఎంపిక చేసుకోవాలి పిల్లలు, యువకులు, మహిళలు ఇలా ఎవరు ఏ రకం టపాసులు కాల్చాలో ముందే నిర్ణయించుకుని ప్రణాళిక మేరకే కొనాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలి బాణసంచాను కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు బాణసంచా కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి వేలాడుతూ అంటుకునే ప్రమాదం ఉంది. కొద్దిగా బిగుతైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి చిన్న పిల్లలను ఎత్తుకుని బాణసంచా కాల్చకూడదు.పెద్ద వారి సహాయం లేకుండా పిల్లలు వారంతట వారే బాణసంచా కాల్చరాదు అప్పుడే పుట్టిన చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై బాణసంచా శబ్దాలు ఎక్కువ ప్రమాదం చూపుతాయి. ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవులను రక్షించుకోవడానికి ఇయర్ ప్లగ్స్ కొంత మేరకు ఉపయోగపడతాయి. పెద్ద శబ్దాలతో పేలే టపాసులు కాకుండా చాలా తక్కువ శబ్ధంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు వంటివి కాల్చడం మంచిది.భూ చక్రాలు, ఔట్లు కూడా ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది. వాటిని అగ్గిపుల్లలతో కాకుండా కాకర పువ్తొత్తులతో కాల్చడం మంచిది. -
గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు: మంచి చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారని కోటి ఆశలతో బిడ్డలను పాఠశాలలకు పంపగా అక్కడ సరైన సదుపాయాలు లేక అనారోగ్యాలకు గురై అమాయక గిరిజన బిడ్డలు మరణస్తున్నారు. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థులు, దివంగత మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావులకు నివాళులు అర్పించి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల ప్రాణాలు రక్షించడంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, ఫలితంగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజనశాఖ మంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మంది విద్యార్థులు మృతిచెందారని, సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతిచెందారన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖమంత్రికి, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశాంవిద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా,సెరిబ్రల్ మలేరియా, జ్వరంతో చనిపోతున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మృతిచెందడం వల్ల జిల్లా మంత్రిగా ఆమె విఫలమయ్యారని, ఈ శాఖలో మరణాలపై సదరు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు
పాచిపెంట: మండలంలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అ భివృద్ధి చేస్తే ‘అరుకుకు దీటుగా అందాలు‘ శీర్షికన గత నెల 29వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని వెలుగు డీపీఎం శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగా ధారగెడ్డకు వెళ్లే దారిలో ఉన్న తుప్పలు డొంకలు గురువారం తొలగించారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న వెలుగు ఏపీఎం శ్రీరాములు ‘సాక్షి‘ తో మాట్లాడుతూ త్వరలో రహదారి నిర్మాణం చేపట్టనున్నామని, వాటితోపాటు ప్రత్యక్షంగా పర్యాటకులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘాల సభ్యులకు లోన్ రూపంలో డబ్బులు మంజూరు చేసి పర్యాటక ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేయించి పర్యాటకులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నెల్లిమర్ల: స్థానిక చంపావతినదిలో బుధవారం గల్లంతైన కనకల అప్పారావు(46) మృతదేహం లభ్యమైంది. జరజాపుపేటకు చెందిన కనకల అప్పారావు థామస్పేట వద్ద చంపావతినదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకసిబ్బంది గాలింపు చేపట్టగా కొండపేట వెళ్లే రహదారిలో జూట్మిల్లు వద్ద మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి–చీపురుపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శ్రీకాకుళం జీఆర్పీ హెచ్సీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పాండిచ్చేరి నుంచి హౌరా వెళ్లే రైలు ఢీకొట్టగా మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహం ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోన్ 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి.. గుర్ల: మండలంలోని తెట్టంగి శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబర్తికి చెందిన తాడేల అచ్యుతరావు (35) మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు చేయడానికి పెనుబర్తి నుంచి గవిడి పేట వెళ్తుండగా తెట్టంగి దాటిన తర్వాత బైక్ ఆదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్పై వెళ్తున్న గుషిడి నారాయణ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు వసంత్ కుమార్, తరుణ్ ఉన్నారు. -
పూరిల్లు దగ్ధం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన బొమ్మరిల్లు రాజారావు పూరిల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రాజారావు కోరుతున్నాడు. హెచ్ఐవీ రొగులకు శస్త్ర చికిత్సలు● స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు విజయనగరంఫోర్ట్: హెచ్ఐవీ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం లేదనే అంశంపై సాక్షిలో ఈనెల 14వతేదీన హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. -
వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలక ప్రాత
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయనగరంఫోర్ట్: వైద్యరంగంలో మత్తు వైద్యులది కీలకపాత్ర అని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం సందర్భంగా సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన ర్యాలీని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర కేసులకు వైద్యం అందించడంలోనూ, శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన మత్తు ఇచ్చేది మత్తు వైద్యులేనన్నారు. కోవిడ్ తర్వాత మత్తు వైద్యులకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మత్తు వైద్య విభాగం అధిపతి డాక్టర్ డి.జయధీర్బాబు, ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ లోక్నాథ్, మానసిక విభాగం హెచ్ఓడీ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. సాలిపేటలో బంగారం చోరీగజపతినగరం: మండలంలోని సాలిపేట గ్రామానికి చెందిన రొంగలి శంకరరావు ఇంట్లో బంగారం చోరీకి గురి కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఉదయం రొంగలి శంకరరావు తన ఇంటికి తాళం వేసి భార్య పద్మతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెవెళ్లాడన్నారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయని, అలాగే బీరువా తలుపులు కూడా దొంగలు పగుల గొట్టారన్నారు. బీరువాలో ఉండాల్సిన సుమారు మూడు తులాలు బంగారం పుస్తెల తాడు, రెండు శతమానాలను దొంగిలించినట్లు బాధితుడు శంకరరావు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ మేరకు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మూగ బాలికపై వృద్ధుడి లైంగిక దాడి యత్నంశృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం గ్రామంలో ఓ మూగ బాలికపై వృద్ధుడు లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమారై మూగబాలిక. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఒంటరిగా ఉన్న బాలిక నోటిపై చెయ్యిపెట్టి తన ఇంట్లోకి వృద్ధుడు లాక్కెల్లాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వృద్ధుడి బారి నుంచి బాలికను రక్షించారు. బాధితురాలి తండ్రి గురువారం జామి మండలం తాండ్రంగి గ్రామానికి చెందిన మానవహక్కుల సంఘం ప్రతినిధి కొత్తలి గౌరునాయుడికి ఫిర్యాదు చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఐ నారాయణమూర్తిని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని విచారణ చేయాల్సి ఉందన్నారు. -
గిరిజనం గుండెఘోష పట్టదా..?
● ప్రజాసంఘాల నాయకులు ● కలెక్టరేట్ ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇంకెంతమంది విద్యార్థులను నిర్లక్ష్యంతో బలిచేస్తారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ గిరిజన విద్యాసంస్థలు విద్యార్థుల పాలిట నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వసతిగృహాల్లో మెరుగైన సదుపాయాలు, వైద్యసేవలు అందించాలి. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వికాస్, బుచ్చి, కార్తీక్, చరణ్, గణేష్, మల్లేష్, చందు, గౌరీశ్వరి, చిన్నారావు, కొందరు తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు శివప్రసాద్, గౌరీశంకరరావు, ఈవీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ చూపినవారికే పట్టం
విజయనగరం: విద్యార్థి దశ నుంచే బాలబాలికల్లో క్రీడాసక్తిని పెంపొందించేందుకు ఏటా ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేరుగా జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపిక పోటీలు ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయి నుంచి నిర్వహించాల్సిన ఎంపిక పోటీల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖరారు చేసింది. ఫెడరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న డీఈఓ షెడ్యూల్ను ప్రకటించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల్లో రాణించిన వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈనెల 17 నుంచి మండల స్థాయి, అనంతరం డివిజన్ స్థాయి, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని డీఈఓ పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ జారీ చేశారు. మూడంచెల పద్ధతిలో ఇలా.. స్కూల్గేమ్స్ పోటీల్లో భాగంగా మొత్తం 50 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండ్–14, 17 విభాగంలో 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా నిర్వహిస్తారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా, అథ్లెటిక్స్ క్రీడాంశాలకు మూడంచెలుగా పోటీలు నిర్వహించనున్నారు. మిగిలిన 43 క్రీడాంశాలకు జిల్లా స్థాయిలో నేరుగా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. మూడంచల్లో నిర్వహించే 7 క్రీడాంశాల్లో ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి జోనల్ స్థాయి, అక్కడ నుంచి జిల్లా స్థాయి, తర్వాత ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. వీటితో వివిధ ఉద్యోగాలకు క్రీడా కోటా కింద 2శాతం రిజర్వేషన్ల సదుపాయం వర్తిస్తుంది. నేటి నుంచి మండలస్థాయి స్కూల్గేమ్స్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలు మొత్తం 7 క్రీడాంశాల్లో జరగనున్న పోటీలు షెడ్యూల్ ఖరారు చేసిన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేటి నుంచి మండల స్థాయి ఎంపికలు: స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పరిధిలోని 23 మండలాల్లో శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 7 క్రీడాంశాల్లో నిర్వహించే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆయా డివిజన్ కేంద్రాలైన విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో ఎంపికలు నిర్వహిస్తారు. ఆ ఎంపికల్లో రాణించిన వారికి జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపికలకు అవకాశం కల్పించనుండగా.... జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.గోపాల్, విజయలక్ష్మిలు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు
● ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన శిక్ష పడేలా కేసులు నమోదుచేయాలని ఎస్పీ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాల పెండింగ్ కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులను డీఎస్పీలు, సీఐలు తరచూ సమీక్షించి, దర్యాప్తు అధికారులకు తగిన సూచనలు చేయాలన్నారు. గంజాయి వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చట్టాలను గౌరవించే వారితో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలన్నారు. తాత్కాలిక అనుమతులు (లైసెన్సు) కలిగిన వ్యాపారులను బాణసంచావిక్రయాలకు అనుమతించాలని సూచించారు. వివిధ కేసుల్లో దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
● అందని వైద్యం
ఈ చిత్రంలోని మహిళ పేరు పద్మ. ఆమెతోపాటు, చేతిలో ఉన్న చిన్నారి కొద్దిరోజులుగా మలేరియాతో బాధ పడుతోంది. గిరి శిఖర ప్రాంతం నుంచి మూడు రోజులుగా పార్వతీపురం మండలం డోకిశీల పీహెచ్సీకి వస్తోంది. అక్కడ వారికి సిబ్బంది ఇచ్చే సూది మందే దిక్కు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం సమ్మె కావడంతో ఎవరూ రావడం లేదు. జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పీడియాట్రిషియన్ను జిల్లా ఆస్పత్రి నుంచి పంపిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 52 గ్రామాలతోపాటు.. సమీపంలో ఉన్న దుగ్గేరు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకూ ఈ ఆస్పత్రే ఆధారం. పార్వతీపురం మండలం పెదబొండపల్లి పీహెచ్సీలో గత నెల వరకు ఇద్దరు వైద్యులు ఉండేవారు. సమ్మె కారణంగా ఇద్దరూ గత నెలాఖరు నుంచి విధులకు రావడం లేదు. దీంతో విజయనగరం మిమ్స్ నుంచి హౌస్ సర్జన్ను తాత్కాలికంగా డిప్యుటేషన్పై నియమించారు. రెగ్యులర్ వైద్యాధికారులు లేకపోవడం వల్ల ఇక్కడ రోగులకు పూర్తిస్థాయిలో అందడంలేదు. వచ్చిన వారిని సైతం జిల్లా ఆస్పత్రికి పంపించేస్తున్నారు. ఫలితంగా గతంలో 50–60 వరకు ఉండే ఓపీ.. ఇప్పుడు 30కి పడిపోయింది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు ఏఎన్ఎం, అటెండర్, ఫార్మాసిస్ట్నే దిక్కవుతున్నారు. పురుడు పోయాలన్నా.. ఏఎన్ఎంలే ధైర్యం చేయాల్సిన పరిస్థితి. -
● జిల్లా ఆస్పత్రికి రిఫర్
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె.అఖిల్. డోకిశీల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లాక అనారోగ్యం బారిన పడ్డాడు. అక్కడ కొద్దిరోజులు చికిత్స పొంది, పాఠశాలకు తిరిగొచ్చాడు. అప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా.. మలేరియా అని తేలింది. పాఠశాల పక్కనే డోకిశీల పీహెచ్సీ ఉంది. అక్కడ వైద్యసేవలు అందకపోవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందురోజే ఇదే ఆశ్రమ పాఠశాల నుంచి మలేరియాతో బాధ పడుతున్న ఆరో తరగతి విద్యార్థి కె.రాజేష్ను కూడా జిల్లా ఆస్పత్రికే తరలించారు. -
పైడితల్లి వనంగుడి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఉదయం 9.30 గంటల నుంచి గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి నవంబర్ 30న సాహితీవేత్తలతో నిర్వహించే సభలో మాట్లాడే అద్భుతమైన అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు సెల్: 83744 49526, 75693 51363, 94401 17116 నంబర్లను సంప్రదించాలని కోరారు. దైవానుగ్రహంతోనే లోక కల్యాణం బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ● ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ విజయనగరం అర్బన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలకు ఉచితంగా ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తామని సంస్థ డైరెక్టర్ డి.భాస్కరరావు తెలిపారు. మగ్గం వర్క్ అండ్ పెయింటింగ్కి 31 రోజులు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్కు 35 రోజులు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న గ్రామీణ మహిళలు అర్హులని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే మహిళా అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల గ్రామీణ మహిళలు ఈ నెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 99595 21662, 99857 87820 నంబర్లను సంప్రదించాలని కోరారు. 40 కిలోల గంజాయి పట్టివేత ● పట్టుబడిన నలుగురిలో ఇద్దరు మహిళలు విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 40 కేజీల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన గీతా సంజయ్ చౌహాన్, పారుబాయి సంజయ్ చౌహాన్లతో పాటు రజిని బీమాపవర్, వైశాలి కాలే వద్ద ఉన్న బ్యాగులలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించారు. కేసు నమోదుచేసి నలుగురినీ రైల్వే కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికి అవసరమైన నిధుల ప్రతిపాదనలను సమగ్ర ఫార్మేట్లో అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. తోటపల్లి, నారాయణపురం, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. చీఫ్ ఇంజినీర్/తోటపల్లి ప్రాజెక్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ స్వర్ణకుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులను, పురోగతిని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టులో గజపతినగరం బ్రాంచ్ కెనాల్కు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న 759 చెరువులు, నలబై చెక్డ్యామ్ పనులు ఉపాధిహామీ నిధులు రూ.8.6 కోట్లతో చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో ఎస్ఈలు ఆర్.అప్పారావు, సుధాకర్, ఈఈలు అప్పలనాయుడు, రమణ పాల్గొన్నారు. -
‘శౌర్యం స్మృతి’ బ్రోచర్ల ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవం సందర్భంగా, విజయనగరం జిల్లా పోలీసు డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘శౌర్యం‘ (తెలుగు) ‘స్మృతి‘ (ఆంగ్లం) పేరుతో రూపొందించిన అమరవీరుల స్మారక బ్రోచర్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అమరవీరుల సేవా తపస్సుకు ఈ సాహిత్య నివాళి ప్రతి పోలీసు సిబ్బందిలో ధైర్యస్ఫూర్తిని నూరిపోస్తుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని చాటుతుందని చెప్పారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభం కావడం విశేషమన్నారు.. భవిష్యత్లో ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేరణారూపంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రముఖ యాంకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో కొట్టుకుపోయిన ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు(54) మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కిరాణా హోల్సేల్ దుకాణంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వసంత గ్రామానికి సోమరాజు వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత గెడ్డ దాటుతూ కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి మంగళవారం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా అచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గెడ్డలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది:
గతంలో మత్తు వైద్యులకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. తెరవెనుకనే వారి పాత్ర ఉండేది. కోవిడ్ రోగులకు సేవలు అందించిన తర్వాత మత్తు వైద్యులకు ప్రాధాన్యం, గుర్తింపు వచ్చింది. గతంలో మత్తు వైద్యులుగా చేయడానికి చాలా మంది వెనుకాడేవారు. రోగికి ఏదైనా అయితే నిందిస్తారేమోనని ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పడు మంచి పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మత్తు వైద్యుల పని సులభతరమైంది. మత్తు ఇవ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడామనే సంతృప్తి ఉంటుంది. డాక్టర్ డి.జయధీర్బాబు, ప్రొఫెసర్, మత్తు విభాగం అధిపతి , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
వైద్యవిద్య వ్యాపారం కాదు!
విజయనగరం గంటస్తంభం: ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బాధ్యతలు వదిలేసి వైద్యవిద్యా వ్యవస్థను వ్యాపారుల చేతుల్లోకి నెట్టొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు యూ.ఎస్. రవికుమార్ అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధులు, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య రంగాన్ని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థులకు, ప్రజారోగ్యానికి భారీ దెబ్బ పడుతుందని పేర్కొన్నారు. వైద్యవిద్య ఫీజులు ఆకాశాన్నంటుతాయని, పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల దూరమవుతుందని, రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్మించారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, నాగమనోహర్, ఫైజల్, సురేష్ బాబు, రాజగోపాల్, వెంకటరావు, దివాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఈడీ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి దృష్టికి విజయనగరం జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తీసుకెళ్లింది. ఈ మేరకు బుధవారం సంఘం ప్రతినిధులు స్థానిక జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఆయనను కలిసి తమ సమస్యల పత్రాన్ని అందజేశారు. జోన్ పరిధిలోని 6 జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్షాప్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జోన్లో ప్రమోషన్లు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని, రన్నింగ్ టైమ్ తగినవిధంగా లేవని, రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో నివాస గృహాల అద్దె సమస్య, టీమ్ రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్డులు వంటి పలు సమస్యలు ఉన్నాయిని వినతిపత్రంలో తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో అక్రమంగా ఇస్తున్న ఓడీలు, ఉద్యోగుల సీనియార్టీలో తేడాలు, రూట్ సర్వేలు, మంచినీటి సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లభించకపోవడం వంటి 30కు పైగా సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బీకేమూర్తి, జోనల్ కోశాధికారి కేఎస్ఎస్మూర్తి, జిల్లా కార్యదర్శి రవికాంత్ ఉన్నారు. -
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న వారి గృహాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్లో ఆర్సీ స్థాయిలో ఉన్నవి పూర్తి కావాలని ఇకపై ప్రతి వారం సమీక్షించనున్నట్లు తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రామ్ సుందర్రెడ్డి -
రహదారులపై చెత్త కనిపించరాదు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం, సాలూరు పట్టణంలోని రహదారులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా చెత్త కనిపించరాదని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వార్డులో పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని, పరిపాలనలో పూర్తిస్థాయి ‘ఈ–ఆఫీసు’ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ విజయనగరం ఫోర్ట్: అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే సీపీఆర్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయినప్పడు అతని ప్రాణాలు రక్షించడానికి సీపీఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ జయధీర్బాబు, అత్యవసర విభాగం హెచ్వోడీ డాక్టర్ శివప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్లు చోరీ ● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరకు పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్లో పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ కానిస్టేబుల్స్కు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ పైడపు నాయుడు, ఎస్ఐ రాము పాల్గొన్నారు. -
మత్తులో ఉంచి వైద్యం
● వైద్యరంగంలో అధిక ప్రాధాన్యం ● ఏడాదిలో లక్ష మంది వరకు రోగులకు ఎనస్థీషియా ● నేడు ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో కొన్నేళ్ల క్రితం వరకు మత్తు వైద్యుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడంతో మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది. సమాజంలో మత్తు వైద్యులు అంటూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. గురువారం ప్రపంచ మత్తు వైద్య దినోత్సవం (వరల్డ్ ఎనస్థీషియా డే) సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వ కాలంలో తలమీద, ముక్క దగ్గర మూలికలు పెట్టి మత్తు వచ్చేలా చేసి చికిత్స అందించేవారు. గతంలో మత్తు వైద్యవిద్యను అభ్యసించడానికి పెద్దగా అసక్తి చూపేవారు కాదు. మత్తు వైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. మత్తు విభాగంలో ఆధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల మత్తు వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. మత్తు వైద్యులకు ప్రాధాన్యం పెరిగింది. ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలు నిలబెట్టడంలో మత్తు వైద్యులు కీలక పాత్ర పోషిస్తారు. శస్త్రచికిత్సలో కీలక పాత్ర ఏదైనా వ్యాధికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తు వైద్యులదే కీలక పాత్ర. సంబంధిత వ్యాధికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మత్తు ఇచ్చినట్లయితే రోగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎముకల సంబంధిత, ఈఎన్టీ, గైనిక్, డెంటల్ శస్త్రచికిత్సలకు, కడుపునొప్పి, అపెండిసైటిస్, పేగుఒరుపు, హెర్నియా, హైడ్రాసిల్, పైల్స్, కేన్సర్, న్యూరోసర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు మత్తు ఇస్తారు. ముఖ్యంగా గుండె మార్పిడి, కాలేయం మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో మత్తు వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రతి సెకెను గుండె ప్రతి స్పందనను గమనిస్తూ మత్తు వైద్యులు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి, పురుగు మందు తాగి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి కూడా మత్తు వైద్యులు మత్తు ఇచ్చి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్పై ఉన్న రోగులకు, ఐసీయూ నిర్వహణ కూడా మత్తు వైద్యులే చూస్తారు. జిల్లాలో విధుల్లో 100 మంది వైద్యులు గతంలో మత్తు వైద్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో 100 మంది వరకు మత్తు వైద్యులు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలోనే ఏడాదికి 12 వేల మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. -
●ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ‘పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ‘ఏపీఐఐసీ–పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్’ పేరుతో నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డ్రైవ్కు సంబంధించిన పోస్టర్ను బుధవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఐఐసీ అధికారులు వారాల వారీగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో ఈ నెల 21వ తేదీ వరకు పరిశ్రమల ప్రాంగణాల్లో పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పచ్చదనం పెంపు, ఈ నెల 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పరిశ్రమలతో భాగస్వామ్యం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు పరిశ్రమల మౌలిక వసతుల ఆధునీకరణ, సుస్థిరత చర్యల అమలు వంటి కార్యక్రమాలను చేపడతారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డీజెడ్ఎం కె.జయచంద్ర, జేసీ వి.రాజేష్ కుమార్ పాల్గొన్నారు. -
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలు బాడంగి: విద్యార్థుల వసతి కోసం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. దానిని ఇప్పటిరకు అందుబాటులోకి తేలేదు. విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఫలితం.. భవనం ప్రారంభించినా ఫలితం లేకపోతోంది. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్క తీరు ‘నాయనా’ అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బాడంగి హైస్కూల్కు అనుబంధంగా కేజీబీ టైప్–4 హాస్టల్ నూతన భవనాన్ని హడావిడిగా సెప్టెంబర్ 9న ఎమ్మెల్యే బేబీ నాయన చేతులమీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ భవనం నిర్వహణకు నోచుకోలేదు. వసతి సదుపాయం ఉంటుందన్న ఆశతో సాలూరు, పాచిపెంట తదితర దూరప్రాంతాలనుంచి హైస్కుల్లో చేరిన బాలికల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఇక్కడకు వచ్చి ఉండేందుకు వసతిలేక ఇంటివద్దనే ఉండిపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇదే విషయంపై బాడంగి హైస్కూల్ హెచ్ఎం సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా వార్డెన్, ట్యూటర్ను ఇచ్చారని, ఇంకా వంటమనిషి, వాచ్మన్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లను నియమించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకం అయితే వసతిగృహం అందుబాటులోకి వస్తుందన్నారు. హాస్టల్ సౌకర్యం ఉంటుందని మా పిల్లల్ని జె డ్పీ హైస్కూల్లో చేర్పించాం. జూన్ నెల నుంచి నాలుగునెలుగా చదువుకు దూరంగా గడుపుతున్నారు. ఇలా అయితే పదోతరగతిలో ఉత్తీర్ణులు ఎలా అవుతారు. త్వరితగతిన వసతిగృహాన్ని ప్రారంభించాలి. – గొర్కాకుమారి, దళాయి సత్యవతి, బాలికల తల్లులు, సాలూరు -
విజయనగరం
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ఫలితమే కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ పువ్వల అంజలి.. ఒక తోయక కల్పన.. సాలూరు నియోజకవర్గంలో కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన.. ఈ చావుల పరంపర వీరితో ఆగిపోలేదు. నిన్న కాక మొన్న మూడో తరగతి విద్యార్థిని శాంత.. తాడంగి పల్లవి.. ఇప్పుడు అభంశుభం ఎరుగని బాలుడు, మక్కువ మండలం మూలవలస గ్రామవాసి, ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదుతున్న విద్యార్థి తాడంగి చిన్నారి. ఇలా.. ఏడాదిన్నర కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న 15 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచారు. మండంగి గౌతమ్, నిమ్మల అవంతి, పత్తిక దినేష్, నిమ్మక నితిన్, నిమ్మక జీవన్ కుమార్ తదితర విద్యార్థుల మరణాలతో మన్యం వణికిపోతున్నా ప్రభుత్వం చలించడం లేదు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 611 మంది విద్యార్థినులకు ఒకే ఏఎన్ఎం సేవలందిస్తున్నారంటే.. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి చిన్నారి మృతదేహం వద్ద బుధవారం ఆందోళన చేశాయి. చిన్నారి మృతికి సమాధానం చెప్పాలంటూ ఐటీడీఏ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని, పాలకులను ప్రశ్నించాయి. చిన్నారి తల్లిదండ్రులు తాడంగి ముగిరి, కాంతమ్మ కన్నీటి రోదన వినాలని, చావులకు అంతం పలకాలంటూ నినదించాయి. మంత్రి సంధ్యారాణి తీరును ఎండగట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్) -
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఈనెల 13న సాలూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరం, విశాఖ కేజిహెచ్కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అలాగే, సాలూరు మండల మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం 7వ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి ఈనెల 11న విశాఖపట్నం తరలించినప్పటికీ సెలిబ్రల్ మలేరియాతో మృతి చెందిందన్నారు. కురుపాంలో కలుషిత నీరు కారణంగా సుమారు 224 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వారికి కష్టమొస్తే పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తక్షణమే విద్యార్థుల మృతికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అందని బిల్లులు.. నిలిచిన పనులు
రామభద్రపురం: ప్రతీ ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్జీవన్ మిషన్ పనులకు బిల్లుల బకాయిలు గుదిబండగా మారాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు రూ.40 కోట్ల బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితం.. మూడునెలలుగా పనులు జరగడంలేదు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. చివరిదశలో నిలిచిన పనులు చాలా గ్రామాల్లో జల్జీవన్ మిషన్ పనులు చివరి దశలో నిలిచిపోయాయి. తాగునీటి పథకాల నిర్మా ణాలు, బోర్ల ఏర్పాటు పూర్తయినా పైప్లైన్ పనులు జరగలేదు. దీంతో ఇంటింటికీ నీటి సరఫరా సా ధ్యం కావడంలేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ట్యాప్లు ప్రారంభానికి ముందే పాడవుతున్నాయి.ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి ట్యాంకు రామభద్రపురం మండలం రావివలస పంచాయతీలోని ఎనుబరువు గిరిజన గ్రామంలోనిది. రూ.17.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించారు. 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. మరో పది శాతం పనులు పూర్తిచేస్తే ఇంటింటికీ తాగునీరు అందుతుందని గ్రామస్తులు సంబర పడ్డారు. ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ చివరిదశలో పనులు నిలిపివేశారు. ఫలితం.. గిరిజనులకు తాగునీరు అందని ద్రాక్షగా మారింది. జల్జీవన్ మిషన్ బిల్లులు చెల్లించని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు దాదాపు రూ.40 కోట్ల మేర బిల్లులు చెల్లింపుకు సిద్ధం చేశాం. ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేశాం. త్వరలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లతో మాట్లాడి చివరిదశలో నిలిచిన పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.కవిత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విజయనగరం -
కక్ష సాధింపులు తగవు
విజయనగరం టౌన్: తపాలా శాఖ యూనియన్లో ఉన్న నాయకులపై కక్ష సాధింపులను తక్షణమే నిలుపుదల చేయాలని ఆల్ ఇండియా పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్–సి రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు వి.రుద్రప్రతాప్ కోరారు. యూనియన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎస్.ఎస్.మహదేవయ్యను డిపార్ట్మెంట్ విధుల నుంచి తొలగించడంపై తపాలాశాఖ కార్యాలయం ఆవరణలో బుధవారం నిరసన తెలిపారు. తపాలాశాఖలో ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలన్నారు. యూనియన్ల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.కిరణ్ కుమార్, ఎ.పెంటపాపయ్య, వి.శ్రీనివాసరావు, పతివాడ శ్రీనివాసరావు, కె.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
ఇంటి ముందు మనిషి పుర్రె
విజయనగరం జిల్లా: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని నేడు ప్రైవేటీకరణకు పాటుపాడడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, జామి కృష్ణ, చంద ఉమామహేశ్వరరావు, వంక చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. 19న జిల్లా స్థాయి యోగాసనాల పోటీలునెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి యోగసనాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా క్రీడా సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మొత్తం ఏడు విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలను 25, 26వ తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను 17వ తేదీలోగా ఫోన్ నంబర్లు 8374904262, 8465954998 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. -
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
● సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలునెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంగళవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి..ఉత్సవమూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, రామ గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
హంసవాహనంపై సిరుల తల్లి
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు... బాణసంచా వెలుగులు.. భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ హంస వాహనంపై పసిడి కాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో మంగళవారం సాయంత్రం జలవిహారం చేశారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టీ వీధి సమీపంలోని చెరువు గట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో మూడుసార్లు జలవిహారం చేస్తుంటే.. గట్టుపై ఉండి కళ్లార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణాకటాక్షాలను అందుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు సాగిన తెప్పోత్సవానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా, ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ● వనంగుడిలో వేదస్వస్తి వనంగుడిలో ముందుగా వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, అధికార భాషా సంఘం పూర్వపు సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష దుశ్సాలువ, నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం అమ్మవారికి పారాయణం, ఆధ్యాత్మిక అంశాలను, పైడితల్లి అమ్మవారి భజనలను వినిపించారు. ● పైడితల్లికి స్నపనం తెప్పోత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ మూడుమూర్లు ప్రదిక్షణ జరిపారు. అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, భాజాభజంత్రీలు, మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టివీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం జరిపించారు. ఉత్సవంలో ఆలయ సిరిమాను అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉత్సవ ప్రత్యేకాధికారి మూర్తి, దీక్షాపరులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కనులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు వనంగుడిలో పైడితల్లికి స్నపనం పెద్దచెరువులో మూడుసార్లు జలవిహారం కనిపించని ప్రజాప్రతినిధులు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఈఓ, సిరిమాను పూజారికే ఈ ఏడాది ఉత్సవం మిగిలింది. ఏటా కనీసం ఐదారుగురైనా అధికారులు ఉత్సవంలో పాల్గొని, అమ్మ ఆశీస్సులందుకుంటుంటారు. ఈ ఏడాది అన్నింటికీ మించి తెప్పోత్సవం ఎవరికీ పట్టకుండా పోయింది. అయినప్పటికీ పైడితల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని భక్తిశ్రద్ధలతో ఆలయ అధికారులు నిర్వహించడం విశేషం. -
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’?
విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబుకు నిరుద్యోగ భృతి అంశం పట్టడంలేదని మండిపడ్డారు. విజయనగరంలోని డీఎన్ఆర్ అమర్ భవన్లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రానికి బీజేపీ–టీడీపీ కూటమి ఏం చేసింది అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛాపురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్మోహన్రెడ్డి పరిపాలన దోహదం చేసిందన్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద కుటుంబాల విద్యార్థులు వైద్యవిద్యకు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని, దీనిని ప్రజావ్యతిరేక కార్యక్రమంగానే పరిగణించి పోరుబాట సాగిద్దామని శాసనమండలి విక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దామన్నారు. సంతకాల సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కానరావడంలేదన్నారు. ఇటీవల గుర్ల మండలం జమ్ము గ్రామంలో జరిగిన సంఘటన అత్యంత దారుణమని, భవిష్యత్తులో ఫలితం అనుభవిస్తారన్నారు. ● పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనేది ప్రజావ్యతిరేక నిర్ణయమని, విద్య, వైద్యం అనేది ప్రజల హక్కు అని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టేలా జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి కళాశాలల ప్రాముఖ్యతను వివరించి సంతకాలు సేకరించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను సోషల్మీడియా వేదికగా ఎండగట్టాలన్నారు. కోటి సంతకాల సేకరణ తరువాత ఈనెల 28న నియోజకవర్గ స్థాయిలో పెద్దస్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్రెడ్డి హయాంలోనే విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం లభించిందన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 108, 104, పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఎన్నో వైద్యసేవలు, విజయనగరంలో మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి చేపట్టిన దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించి కోటి సంతకాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణు, నాలుగు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. రూ.1.19 వేల కోట్లతో డిజైన్చేసిన అమరావతి ఎక్కడుంది? 2014లో మంజూరైన ఎయిమ్స్ కళాశాల పరిస్థితి ఏంటి? ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దాం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
● మృతుడు తాడేపల్లి గూడెం వాసి వీరఘట్టం: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
చెప్పుకోలేను.. విప్పుకోలేను..
పీఏ పోరు పడలేక.. ● అందుకే విజయనగరం నుంచి వెళ్లిపోతా...? ● మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆవేదన చందాల వసూళ్లలోనూ ఒత్తిడి సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులకు సొంత తెలివితేటలు లేవు.. చెబుదామంటే అర్థం చేసుకునే ఓపిక లేదు.. నా కష్టాలు బయటకు చెప్పుకోలేను.. లోలోపల దాచుకోలేను.. ఎందుకొచ్చిన బాధ.. సంచిసర్దుకుని వేరే ఊరు వెళ్లిపోతాను అంటూ మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య లోలోన కుమిలిపోతున్నారట. వాస్తవానికి విజయనగరం మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశానికి అసలు బలమే లేదు. మేయర్... డిప్యూటీ మేయర్, ఇంకో డిప్యూటీ మేయర్... స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ వంటి అన్ని పదవుల్లోను వైఎస్సార్సీపీ నాయకులే ఉన్నారు. నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా.. ఖర్చుతో కూడిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో కౌన్సిల్ నిర్ణయమే అంతిమం. కౌన్సిల్లో తెలుగుదేశానికి పూర్తిగా బలం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే ఉన్న టీడీపీ ఆ ఒక్క పదవి పేరు చెప్పి అడ్డదిడ్డమైన నిర్ణయాలకు కమిషనర్ మీద ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఆయన మేనేజ్ చేయలేక అసలు విషయం అర్థం అయ్యేలా చెప్పలేక సతమతమై బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతోపాటు ఆమె పీఏ కూడా అలవిమాలిన పెత్తనం చేస్తూ ఒత్తిడి తెస్తుండడంతో వారు చెప్పిన పనులు చేయలేక కౌన్సిల్లో వాటిని నెగ్గించలేక కమిషనర్ నల్లనయ్య ఇరకాటంలో పడిపోతున్నట్టు తెలిసింది. కౌన్సిల్లో తీర్మానం లేకుండా ఏ ఒక్క పని కూడా చేయడం సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవి తమది కాబట్టి కౌన్సిల్ నిర్ణయాలను పక్కనపెట్టి మౌఖికంగా చెప్పే ఆదేశాల పాటించాలంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడిని ఆయన భరించలేకపోతున్నారు. ఇటు వైఎస్సార్సీపీ అటు టీడీపీ మధ్య నలిగిపోయి ఇబ్బంది పడడం కంటే వెళ్లిపోవడం మేలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఇదే విషయం టీడీపీ పెద్దల వద్ద ప్రస్తావించగా.. ఉంటే ఉండండి పోతే పొండి అన్నట్లుగా మాట్లాడారని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. కమిషనర్ మనస్తాపానికి ఇవేనా కారణం? ఇటీవల కాలంలో నగరంలో పలు రోడ్ల విస్తరణలో ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ లు ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లను సదరు జాగాలు కోల్పోయిన వాళ్లు బయట ఎవరికై నా విక్రయించి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డు విస్తరణలో 50 గజాలు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇస్తారు. అంటే వంద గజాల స్థలం కోల్పోయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. దానిని సదరు బాధితులు వేరే బిల్డర్లకు విక్రయించుకుని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే, ఇదే క్రమంలో రోడ్డు విస్తరణలో సింహాచలం మేడ, లోయర్ ట్యాంక్ బండ్, కోట వద్ద మాన్సాస్ సంస్థ స్థలాలు కొంతమేర కోల్పోగా వీటికి టీడీఆర్ ఇచ్చే విషయంలో కమిషనర్తో పేచీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఆయనను బాగా ఇబ్బంది కలిగించినట్టు సమాచారం పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కమిషనర్ జోక్యం చేసుకొని రూ.15 లక్షలకు పైగా వసూలు చేసి ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. మున్సిపల్ హెల్త్.. ఎన్విరాన్మెంట్ విభాగం వారితో ఒత్తిడి చేయించి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ అంశంలోనూ కమిషనర్ బాగా ఇబ్బంది పడినట్టు తెలిసింది. ఇలాంటి పలు పరిణామాలు కమిషనర్ను ఇక్కడి నుంచి బదిలీ వైపు పురిగొల్పుతున్నాయన్న చర్చ సాగుతోంది. -
సుజుకి నూతన షోరూం ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డులో వేణుగోపాల్ సుజుకి సంస్థ తమ రెండవ షోరూమ్ను ప్రారంభించింది. మంగళవారం ఈ కొత్త శాఖను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెడ్ అభిషేక్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని, ఉత్తమమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వేణుగోపాల్ సుజుకి సంస్థ విజయనగరంలో ఇప్పటికే ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తోందని, వినియోగదారుల మద్దతుతో రెండో షోరూం ప్రారంభించడం ఆనందకరమ న్నారు. కార్యక్రమంలో బెస్ట్ వాల్యూ ఎస్ఎంఐపీఎల్ ఆపరేషన్స్ హెడ్ వీఎస్.యాస్ పాల్, వేణుగోపాల్ సుజుకి ఎండి జి.అభిరామ్, జీఎం సీహెచ్.ప్రవీణ్ కుమార్, సర్వీస్ మేనేజర్ సంతోష్ వర్మ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎన్.సురేంద్ర, ఏరియా సర్వీస్ మేనేజర్ వి.సాయి కౌటిన్య తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి
● గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్గంట్యాడ: మండలంలోని చంద్రంపేట గెడ్డలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లోని ఓ కిరాణా హోల్సేల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత వసంత గ్రామానికి ముందు ఉన్న గెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. రాత్రి 12 గంటలైనా సోమరాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ స్తులతో కలిసి వెతకసాగారు. తెల్లవార్లూ వెతికినా అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. గల్లంతైన సోమరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెడ్డపై ఇప్పటికై నా పాలకులు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
విజయనగరం ఫోర్ట్: వీరిద్దరికే కాదు అనేక మంది హెచ్ఐవీ రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలు అందడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, ఆప్యాయత చూపాలంటూ ప్రజాప్రతినిధులు దగ్గర నుంచి అధికారుల వరకు ఉపన్యాసాలు చెబుతున్నా.. వైద్యులే సేవలందించేందుకు ససేమిరా అంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యసేవలు ఆందించేందుకు వైద్యులు, సిబ్బంది ఇష్టపడడం లేదని హెచ్ఐవీ బాధితులే వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గైనిక్ సమస్య ఉన్న మహిళలకు, కడుపునొప్పి, పేగు వరపు, హెర్నియా, హైడ్రోసిల్, ఈఎన్టీ సర్జరీ, ఎముకలు, నరాల సంబంధిత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఎస్.కోట, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్సీలు, ఘోషా ఆస్పత్రిలో హెచ్ఐవీ బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, చికిత్స అందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ● ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు... జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 2,755 మంది, మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందక పలువురు హెచ్ఐవీ బాధితులు ఆపదవేళ శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హైడ్రోసిల్, ఫైల్స్ శస్త్రచికిత్సకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ. 70 వేలు వరకు వసూలు చేస్తున్నారు. హెర్నియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ‘విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్ఐవీ బాధితురాలికి గైనిక్ సమస్య రావడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. హెచ్ఐవీ ఉండడంతో శస్త్రచికిత్స చేయలేమని చెప్పేశారు. చేసేదిలేక విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 60 వేలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది.’ ‘చీపురపల్లి ప్రాంతానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగికి కడుపునొప్పి రావడంతో విజయనగరంలో ఉన్న ప్రభుతాస్పత్రిలోని వైద్యుడిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలడంతో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయలేదు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.50 వేలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేసుకున్నారు.’ ఆదేశాలిచ్చాం.. హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ రోగులకు జరగని శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రుపాయలు వెచ్చించి వైద్యం పొందుతున్న హెచ్ఐవీ రోగులు జిల్లాలో 6,610 మంది హెచ్ఐవీ బాధితులు వీరిలో మహిళలే 3,646 మంది -
తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం ఉద యం 11 గంటలకు పెద్దచెరువులో సుమారు 40 మందితో ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, ఆర్డీఓ కీర్తి, వన్టౌన్ సీఐ చౌదరితో పాటు మత్స్యశాఖ అధికారులు తెప్ప ట్రయల్ రన్లో పాల్గొన్నారు. హంసవాహనంపై అమ్మవారు విహరించే ప్రదేశాల్లోకి తెప్పను తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా పరిశీలన చేశారు. అనంత రం ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ తెప్పోత్సవ ఏర్పాట్లను పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు పూర్తిచేశారన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పెద్దచెరువులో అమ్మవారు హంసవాహనంపై విహరిస్తారన్నారు. కేవలం 20 మంది మాత్రమే తెప్పలోకి అనుమతి ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్జీదారు సమస్యను అర్ధం చేసుకోవాలి ● కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: అర్జీదారు సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవాలని, వారు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలని, అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. వినతులపై స్వయంగా సంబంధిత అధికారే ఎండార్స్మెంట్ వేయాలని, కిందిస్థాయి అధికారులకు అప్పగించకూడదని తెలిపారు. జిల్లాలో రీ ఓపెన్ అయిన కేసులు 2.83 శాతం ఉన్నాయని, రీ ఓపెన్కు గల కారణాలను ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ ● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: జేఎన్టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్టీయూ కాకినాడ రెక్టార్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరు లతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకంతోపాటు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పదోన్నతి కల్పించండి విజయనగరంఫోర్ట్: అర్హతకలిగిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షరాలు బి.పైడిరాజు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 284 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు 15 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో చేరినప్పుడు 10వ తరగతి సర్టిఫికెట్స్ సమర్పించినప్పటకీ అధికారులు సరిగా చూడ క, 10వ తరగతిలోపు చదివినట్లుగా ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో అర్హత ఉన్నప్పటికీ అన్యాయానికి గురయ్యారన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి. లక్ష్మి, జి.ఉష, బి.వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు అవార్డు
● గుజరాత్లో మంత్రి చేతుల మీదుగా అందుకున్న సుమతివంగర: మండల పరిధి తలగాం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిమిడి సుమతికి ధైర్య సాహస అవార్డు దక్కింది. ఐదేళ్ల కిందట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో కానిస్టేబుల్గా వెస్ట్ బెంగాల్లోని మెచేడా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆ వ్యక్తిని రక్షించింది. అలాగే రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత పట్ల ఆమె చూపించిన ధైర్యసాహసాలను సంబంధిత శాఖ గుర్తించింది. ఈ మేరకు గుజరాత్లోని వలా్స్ద్ ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా సుమతి సోమవారం అవార్డు అందుకుంది. ఈ మేరకు సుమతిని పలువురు అభినందించారు. -
యజమానే మా కొడుకును చంపేశాడు..
● మృతుడు యలకల రాము తల్లిదండ్రులుచీపురుపల్లి: తండ్రిలా చూసుకోవాల్సిన యజమానే తమ కొడుకును కిరాతకంగా హత్య చేసాడని మండలంలోని పత్తికాయవలస గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన యలకల రాము తల్లిదండ్రులు సింహాచలం, రమేష్ ఆరోపించారు. తమ కుమారుడిని యజమానే హత్య చేసాడని ఆలస్యంగా తెలుసుకున్న వారు సోమవారం ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్స్టేషన్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు నాలుగు సంవత్సరాలుగా తమ గ్రామానికి చెందిన వండాన సన్యాసి వద్ద జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని.. అయినప్పటికీ ఒకే ఊరు కావడంతో ఆయన వద్దనే పని చేస్తుండేవాడని తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి విధులకు వెళ్లిన తమ కొడుకు రాము తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఫోన్ చేసినా అవ్వకపోవడంతో యజమాని సన్యాసికి ఫోన్ చేసి చెప్పగా.. అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిపోయాడని తెలిపాడని చెప్పారు. మరుచటి రోజు యజమాని సన్యాసి గ్రామంలో వేరేవారికి ఫోన్ చేసి రాము అలిగి వెళ్లిపోయాడని.. పదో తేదీన మరి కొంతమందితో భోగాపురం విమానాశ్రయం పనికి వెళ్లిపోయాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడన్నారు. ఇంతలో 11వ తేదీన పుర్రేయవలస ఇటుక బట్టీల వద్ద ఉన్న బావిలో తమ కుమారుడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సన్యాసి తమ కుమారుడ్ని హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని శిక్షించాలని కోరారు. -
గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం..
● జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఎ.డి లక్ష్మణరావు సీతానగరం: జిల్లాలో జరుగుతున్న థర్డ్ ఫేజ్ రీ సర్వే పనులు 30 రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఏడీ పి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం డీడీ, మూడు జిల్లాల ప్రత్యేక అధికారి కె. సూర్యనారాయణతో సమావేశమై రీ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఎ.డి లక్ష్మణరావు మాట్లాడుతూ.. థర్డ్ ఫేజ్ కింద 43 గ్రామాలకు గాను 27,380 ఎకరాల్లో రీ సర్వే చేయాలని నిర్ధారించామని, అందులో ప్రైవేట్ భూమి 18,788 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విప్యూటీ డైరెక్టర్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియ నిర్దేశిత సమయానికి పూర్తి చేసేలా అధికారులకు అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సర్వే పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, ఇందులో భాగంగానే ఇప్పలవలసలో చేపడుతున్న సర్వేను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగిరెడ్డి శ్రీనివాసరావు, మండల సర్వేయర్ చంద్రశేఖర్, స్థానిక సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
● జీతాలందక అవస్థలు
● కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆరోగ్యమిత్రలువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు ఇప్పించాలని పలువురు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రల సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో సిబ్బంది కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైడపునాయుడు, మహేష్, బంగారునాయు డు, జగదీష్, రాజప్పడు, తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 112 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్విప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తెర్లాం ఉపాధ్యాయుడికి గుర్తింపు
● వరించిన అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతెర్లాం: అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తికాయల సునీల్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సోలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా – అమెరికా సంయుక్త రాష్ట్రాలు విద్యా, సాంకేతికతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి తెర్లాం హైస్కూల్లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బోధిస్తున్న సునీల్కు అవార్డు వరించింది.ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు, అనువాద ఏఐ సీఈఓ డాక్టర్ బి.చంద్రశేఖర్, ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణుడు డాక్టర్ జి.పూర్ణచంద్ర నాగరాజు, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఎట్ బర్మింగ్హామ్ (అమెరికా) చేతుల మీదుగా సునీల్ అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 80కి అవార్డులు రాగా.. అందులో ఒకరు జిల్లా వాసి కావడం గర్వకారణమని ఎంఈఓ త్రినాథరావు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, తదితరులు ప్రశంసించారు. -
బుచ్చి అప్పారావు సేవలు అమోఘం
గంట్యాడ: జిల్లాకు గొర్రి పాటి బుచ్చి అప్పారావు అందించిన సేవలు అమోఘమని రాష్ట్ర సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాటిపూడి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ (బుచ్చి అప్పారావు) జలా శయం నిర్మించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ఆయన కృషివల్లే జామి, గంట్యాడ మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కోళ్ల లలితకుమారి, ఆర్వీఎస్ఆర్కే రంగారావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, జనసేన నాయకుడు సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పారదర్శకత
● కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఫిర్యాదుల రీ ఓపెనింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, రెండు వారాల్లో వాటిని తగ్గించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడికీ సక్రమమైన ఎండార్స్మెంట్ ఇవ్వడం, అందులో సంబంధిత రూల్ పొజిషన్ స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరన్నారు. ఎండార్స్మెంట్లు నిర్లక్ష్యంగా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం 60 కాల్స్ చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో కొత్త విధానం.. పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న విద్యాశాఖ, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖకు చెందిన బాధ్యతలను కలెక్టర్, జేసీ, డీఆర్ఓలతో పాటు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు తీసుకున్నారు. ప్రవేశ ద్వారంలోనే వినతులకు సంబంఽధించిన ప్రభుత్వ శాఖను తెలుసుకుని.. ఆ ఆధికారి వద్దకు నేరుగా అర్జీదారులను పంపే విధానాన్ని సోమవారం నుంచి అమలులోకి తెచ్చారు. పీజీఆర్ఎస్కు 184 వినతులు.. పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి 184 ఫిర్యాదులు స్వీరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 69 వచ్చాయి. డీఆర్డీఏకి చెందినవి 28, డీపీఓకు సంబంధించినవి 13, మున్సిపాలిటీలకు సంబంధించి మరో 13, జీఎస్డీడబ్ల్యూస్కు 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీలాగాంధీ, రాజేశ్వరి, కళావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.40 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు 40 వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలవి 5, మోసాలవి 4, నగదు వ్యవహారాలకు సంబంధించినవి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించినవి 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో అభివృద్ధి శూన్యం..
● పూర్తికాని ప్రాజెక్ట్లు ● కానరాని అభివృద్ధి పనులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వంవిజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చినా నేటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్ట్ల ఊసే ఎత్తకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చినా హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో చేసి చూపించలేకపోయారు. జెకా నిధులపై నిర్లక్ష్యం... 2014 సంవత్సరం నుంచి జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగుతోంది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వెంగళరాయ సాగర్కు రూ.64 కోట్లతో టెండర్లు ఆమోదించారు. ఈ పనులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అలాగే పెదంకలాం, ఆండ్ర ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. శిథిలావస్థలో నారాయణపురం ఆనకట్ట .. సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959 – 63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కనబరచడంతో షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్వే వ్యవస్థలతో పాటు కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా జిల్లాలో అభివృద్ధి రూపురేఖలు కనిపించడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్ట్లు నిలిచిపోయాయి. పతంజలి వంటి సంస్థల పరిశ్రమలు కూడా ఊసులకే పరిమితమయ్యాయి. అంతేకాదు, పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం, మౌలిక సదుపాయాల కేటాయింపులో జాప్యం వంటి చర్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూతబడిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ.. చెరకు రైతులకు అండగా నిలబడడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీల పెరుగుదల, ప్రభుత్వ రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఫ్యాక్టరీని మూసి వేయాల్సి వచ్చింది. -
నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు లావణ్య
చీపురుపల్లి: సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం (బీకాం) చదువుతున్న డి.లావణ్య ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన లావణ్యను సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు ఎంపిక చేశారు. దీంతో లావణ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, సిబ్బంది అభినందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది పోస్టులకు గాను 250 మంది హాజరుకాగా..ఆస్పత్రి ఆఫీస్ సూపరింటిండెంట్ నారాయణరావు, ఇతర సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు. -
సత్తా చాటిన జిల్లా స్విమ్మర్స్
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు వేదికగా నిర్వహించిన 7వ రాష్ట్ర పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచారని అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఏలూరులోని బిశ్వనాథ్ ఈత కొలనులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ మెన్ కేటగిరీలో జాగరణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీల్లో సిల్వర్ మెడల్.. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడని తెలిపారు. సబ్ జూనియర్ ఉమెన్ విభాగంలో ప్రియాంకదాస్ బెస్ట్ స్ట్రోక్లో.. మౌనిక 50 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు. ఈ మేరకు విజేతలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామిలతో కలిసి సోమవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
పాటలే పోరాటాలకు స్ఫూర్తి
● రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ ప్రారంభం విజయనగరం అర్బన్: పాట.. మనిషి జీవనానికి గమనం.. పోరాటాలకు స్ఫూర్తి అని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాథ్ అన్నారు. స్థానిక గురజాడ స్కూల్లో జనవిజ్ఞాన వేదిక రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం గురించి పనిచేసే సామాజిక సంస్థ జనవిజ్ఞాన వేదిక అని, చైతన్య రహితంగా నిరక్షరాస్యులుగా ఉన్న జనాన్ని చైతన్య పరచడానికే కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.పృద్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, హరేరాం, గాంధీ, జానీ, గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, ఎ.వి.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్కృష్ణారావు, జిల్లా కోశాధికారి ఎస్.శివాజీ, ఉత్తరాంధ్ర జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘మత్తు’వదిలించేందుకు కదలిరండి
● గంజాయి, మద్యం అమ్మకాలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ మద్యం ‘మత్తు’పై పోరుబాటకు కదలిరావాలని ఐద్వా నాయకులకు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని మద్యం, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు నిషేధించాలంటూ ఎల్బీజీ నగర్, వినాయక నగర్లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ మాట్లాడుతూ గంజాయి పీల్చి గల్లీలో పడిపోతే గృహశాంతి ఎగిరిపోతుందని, మద్యం తాగి భర్త చనిపోతే భార్య విధవ అవుతుందని... ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రాగం వినిపిస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జిల్లాలో బెల్ట్షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఈ మత్తు మయమైన సమాజం నుంచి మహిళలను రక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతపురం వేదికగా సాగే మహాసభల్లో మద్యం, డ్రగ్స్, గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణకు రూపురేఖలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పుణ్యవతి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు పనుల పరిశీలన
పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.డి.కృష్ణబాబు ఏిపీఏడీసీఎల్ ఎం.డి.ప్రవీణ్, కలెక్టర్ రామసుందర్రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ట్రంపెట్ బ్రిడ్జి, విమానశ్రయానికి వెళ్లే అప్రోచ్రోడ్డు, ఎయిర్పోర్టు టెర్మినల్, రన్వేను పరిశీలించారు. నిర్మాణాలపై ఆరా తీశారు. మ్యాపును పరిశీలించారు. టెర్మినల్ భవనం మూడు అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం ఎయిర్పోర్టు కార్యాలయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్టుకు నీటి సరఫరా, విద్యుత్, వర్షపునీరు వెళ్లే మార్గాలు, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, న్యాయ సంబంధిత అంశాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి నిర్ణీత సమయంలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ దాట్ల కీర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.రమణమ్మ, జీఎంఆర్ ఎయిర్పోర్టు సీఈఓ కన్వర్బీర్సింగ్ కలరా, ప్రాజెక్టు హెడ్ బీహెచ్ రామరాజు, సీడీఓ ఎం. కోటేశ్వరరావుతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
తెప్పోత్సవానికి సర్వం సిద్ధం
● సోమవారం ట్రయల్ రన్ ● మంగళవారం సాయంత్రం పెద్దచెరువులో పైడితల్లి తెప్పోత్సవం పైడితల్లి తెప్పోత్సవానికి సిద్ధం చేసిన హంసవాహనం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. ఆలయ సిబ్బందితో కలిసి తెప్పోత్సవం ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెప్పోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్, ఫిషరీస్, మున్సిపాలిటీ, ఫైర్ తదితర శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. 14న మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో వేదస్వస్థ ఉంటుందని చెప్పారు. అనంతరం స్తపన మందిరంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు ఉంటాయని తెలిపారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితుల సహకారంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆలయం బయట పుష్పాలంకరణలో సిద్ధం చేసిన రథంపై ఆశీనులు చేస్తారన్నారు. అక్కడ నుంచి భాజాభజంత్రీలతో సున్నంబట్టీవీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తీసుకువచ్చి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగింపు చేస్తామన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారు హంసవాహనంపై పెద్దచెరువులో మూడుసార్లు విహరిస్తారని తెలిపారు. హంసవాహనంలో 20మందికే అవకాశం అమ్మవారు విహరించే హంసవాహనంలో 20మందికే అవకాశం ఉంటుందని, మిగతావారి కోసం ప్రత్యేక బోట్లను ఏర్పాటుచేశామని ఇన్చార్జి ఈఓ కె.శిరీష తెలిపారు. 30 మంది వరకూ గజఈతగాళ్లు హంసవాహనం చుట్టూ తెప్పలపై ఉంటారన్నారు. ఫైర్ సిబ్బంది లైఫ్ జాకెట్లు, హస్కా లైట్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చేందుకు నిపుణులను ఏర్పాటుచేశామన్నారు. భక్తులందరూ తెప్పోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
15 నుంచి నిరవధిక సమ్మె
● విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ విజయనగరం ఫోర్ట్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ట్రాన్స్కో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలింభిస్తోందని, దీనికి నిరసనగా ఈనెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ తెలిపారు. విజయనగరం జేఏసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ మహాధర్నాకు విజయవాడ, పార్వతీపురం మన్యం సర్కిల్ నుంచి వందలాది మంది సామూహిక సెలవులు పెట్టి బయలు దేరుతున్నట్టు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడంలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో 14వ తేదీన వర్క్ టు రూల్, 15న సమ్మెకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేశారు. సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు బంగారు రాజేష్కుమార్, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలమూర్తి, ఆర్.అప్పలనాయుడు, సత్యనారాయణ, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు. మేకల కాపరి హత్య ● పంట పొలంలో మేకలు దిగాయని కాపరిపై కర్రతో దాడి ● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కాపరి మృతి కురుపాం: వరి పంట పొలంలోకి మేకలు దిగాయన్న కోపంతో ఓ వ్యక్తి మేకల కాపరి తలవెనుక భాగంపై కర్రతో కొట్టగా కాపరి మృతి చెందిన ఘటన కురుపాం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం హుకుంపేట సమీపంలో రాయగడ నల్లన్నదొరకు చెందిన వరి పంట పొలం ఉంది. పంట పొలం గట్ల మీదకు మేదరవీధికి చెందిన పిల్లి రాములు(58) మేకలు ప్రవేశించాయి. వెంటనే మేకల కాపరి రాములు వాటిని బయటకు తరలించేలోపే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో చేతిలో ఉన్న కర్రతో రాయగడ నల్లన్నదొర కాపరి రాములు తల వెనుకభాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో రాములు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సైకిల్పై రాములును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కురుపాం ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములోరికి స్వర నీరాజనం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సింగర్ సాయి వేద వాగ్దేవి శనివారం సందడి చేసింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో పలు భక్తి గీతాలను పాడి స్వామివారికి స్వర నీరాజనం సమర్పించింది. చిన్నారి పాడిన భక్తి గీతాలు భక్తులను ముగ్దులను చేశాయి. తన పాపకు గతంలో మాటలు వచ్చేవి కావని, రామతీర్థం సీతారామస్వామికి మూడుసార్లు మొక్కు చెల్లించుకున్న అనంతరం కొద్ది రోజుల్లోనే మాటలు వచ్చాయంటూ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతోనే సింగర్గా రాణిస్తోందని తెలిపారు. -
‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!
● విగ్రహావిష్కరణలో విభేదాలు, వసూళ్ల వివాదం విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో సోమవారం జరుగనున్న విగ్రహ ఆవిష్కరణ రాజకీయ రంగుదాల్చింది. తూర్పు కాపు–కొప్పుల వెలమ సంఘాల మధ్య విభేదాలు, పాత ప్రభుత్వాల నిర్ణయాలపై కొత్త పాలకుల వైఖరి, చందాల వసూళ్ల వివాదం ఈ కార్యక్రమాన్ని చర్చనీయాంశంగా మర్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడి స్ఫూర్తి చుట్టూ రాజకీయ లెక్కలు, సంఘాల విఽభేదాలు, చందాల వసూళ్లు వెరసి ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేశాయి. వైఎస్సార్సీపీ పాలనలో మొదలైన ప్రణాళిక వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తాడిపూడి రిజర్వాయర్కు గొర్రిపాటి బుబ్బి అప్పారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సమర్పించగా ఆ వినతిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ప్రత్యేక జీఓ జారీ చేసింది. సంఘం జిల్లా కమిటీ కోరిన మేరకు మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పలనరసయ్య ఆర్థిక సహకారంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో బుచ్చి అప్పారావు విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి స్థలాన్ని కూడా గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం ప్రతినిధులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం పాలకపక్షం మారింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ కాపు నేతలు విగ్రహస్థాపన ప్రయత్నాన్ని జరగనీయలేదు సరికదా ఆ జీఓను రద్దు చేయించారు. కొప్పుల వెలమ సంఘం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పాలనలో పలుమార్లు వినతులు సమర్పించినా ఏనాడూ స్పందన రాలేదు. అదే కులానికి చెందిన అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్ పట్టించుకోలేదని సంఘం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో జిల్లా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కోలేక చివరికి కూటమి ప్రభుత్వానికి మళ్లీ కొత్త జీఓ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరో విగ్రహం–మరో కథ కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని కొత్త విగ్రహం తయారు చేయించే ప్రతిపాదన తెచ్చారు. అయితే తొలి నుంచి తమ కులానికి చెందిన సమరయోధుడిగా ఆరాధిస్తూ తాడిపూడి రిజర్యాయర్కు ఆయన పేరు పెట్టాలని పట్టుపడుతూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కృషి చేసిన కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని పక్కను పెట్టి తెలుగుదేశం పార్టీలో స్థానిక మరో కులం తూర్పుకాపు నాయకుల కార్యక్రమంగా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విగ్రహం పేరుతో చందాల వసూలు కొప్పుల వెలమ సంఘం రూ.10 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహం ఆవిష్కరణ పేరుతో ప్రజల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారు. తాడిపూడి రిజర్వాయర్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గ్రామ ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీగా చందాలను బహిరంగంగానే వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు టార్గెట్ ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో ఈ వసూళ్లపై ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. -
బంగారం చోరీ
గంట్యాడ: మండలంలోని కరకవలస పరిధి జగదాంబ నగర్లో తులం ముప్పావు బంగారం చోరికి గురైంది. జగదాంబనగర్లో నివాసముంటున్న కుప్పిలి శ్రీరామమూర్తి ఇంట్లో శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న ఒక్కటిన్నర తులాల గొలుసు, పావు తులం ఉంగరం ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. సాయి కృష్ణ తెలిపారు. ఇద్దరు యువతుల అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు ఆదివారం అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి ఏఎస్సై రామలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అయ్యన్నపేటకు చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు (23) శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. డిగ్రీ చదివిన ఇద్దరూ స్నేహితుల వద్దకు వెళ్లిఉంటారని వారి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అమ్మాయిలిద్దరూ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్నదమ్ములిద్దరూ వన్టౌన్ పోలీస్ స్టేషన్ వకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే.చౌదరి ఆదేశాలతో ఏఎస్సై రామలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్షాక్తో విద్యార్థినికి గాయాలుపాలకొండ రూరల్: స్థానిక ఎన్కే.రాజపురం ప్రాంతానికి చెందిన టి.యామిని అనే విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి వె వెళ్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై గాయాలపాలైంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు ఆమె చేరుకోగా ఆ సమయంలో సహ విద్యార్థులు రాకపోవడంతో తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో పాఠశాల రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి తప్పుకోబోతున్న క్రమంలో అక్కడి ప్రహరీ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగలడంతో షాక్కు గురైంది. ఈ క్రమంలో స్థానికులు గమనించి విద్యార్థినిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షాక్ కారణంగా గాయాలు కావడంతో వైద్యు ప్రథమ చికిత్స అందించటంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్ధిని అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్యలక్కవరపుకోట: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారం కావడంతో మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన కొటాన సంతోష్(26) మనస్తాపం చెందిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై నవీన్పడాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్ విశాఖపట్నంలోని ఒక సంస్థలో ఆవుట్సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. తనకు వచ్చిన జీతం సరిపోక కుటుంబాన్ని పోషించుకోవడం భారమవడంతో శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద గడ్డిమందు తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్ను కుటుంబసభ్యులు గుర్తించి ఎస్.కోట సీహెచ్సీకి, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు మృతుడు తండి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఆహ్లాదం మాటున విషాదం
ఆడలి వ్యూపాయింట్ పరిస్థితి ఇది.. ఆడలి వ్యూ పాయింట్ను అన్ని విధాలా తీర్చిదిద్దారు. సీతంపేట– పాలకొండ మధ్య ఉన్న కుశిమి జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ల మేర సాగే ప్రయాణంలో దారి మధ్యమధ్యలో వచ్చే ప్రతి మలుపులో ప్రకృతి అందాలు అటువైపుగా వెళ్లే వారిని కట్టిపడేస్తాయి. ఇక వ్యూపాయింట్ వద్దకు వెళ్లే సరికి మంచుపొరలు, చల్లనిగాలి వంటి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతాయి. ఘాట్రోడ్లో ఉండే మలుపులే సందర్శకులను భయపెడుతున్నాయి. ఇటీవల ఆడలి వ్యూపాయింట్ వద్ద ఉన్న రక్షణగోడకు ఉన్న బండరాళ్లు పక్కనే ఉన్న క్యాంటీన్పై పడిపోగా క్యాంటీన్లో ఉన్న నలుగురు వ్యక్తులు పరుగులంకించారు. తాజాగా సీతంపేట ఏజెన్సీలో పర్యటించి నూతన కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆడలి వ్యూపాయింట్ను సందర్శించారు. ఇక్కడ ఎకోటూరిజంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సీతంపేట: మరో పక్షం రోజుల్లో పిక్నిక్ల సీజన్ ఆరంభం కానుంది. ఈ సమయంలో పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పర్యాటకులను కట్టిపడేసే అందమైన వ్యూపాయింట్లు చూడడానికి సీతంపేట ఏజెన్సీకి వస్తున్న టూరిస్టులు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. జగతపల్లి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో జగతపల్లి మలుపు వద్ద ఇప్పటి వరకు ఇద్దరు, ఆడలి వ్యూపాయింట్ మార్గంలోని వెల్లంగూడ సమీపంలో మలుపుల వద్ద నలుగురు మృతిచెందారు. ఆరుగురు మృతిచెందగా 30 నుంచి 40 మంది వరకు క్షతగాత్రులై ఆస్పత్రి పాలయ్యారు. పర్యాటకుల ప్రాణాలు ఘాట్రోడ్లు హరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జగతపల్లి వ్యూపాయింట్ను పరిశీలిస్తే.. సీతంపేట ఏజెన్సీలో సుమారు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జగతపల్లి వ్యూ పాయింట్ను అభివృద్ధి చేయదలిచారు. వాటిలో ఇప్పటి వరకు వ్యూపాయింట్ నిర్మించారు. ఇంకా రిసార్ట్ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇక్కడి నుంచి చూస్తే ఏజెన్సీలో పలు గ్రామాలు, పచ్చని కొండలు, ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడి వ్యూ పాయింట్కు సీతంపేట నుంచి దోనుబాయి రోడ్డుకు వెళ్లే మార్గంలో దేవనాపురం మీదుగా జగతపల్లి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ రోడ్డులో పెద్ద పెద్ద మలుపులు ఉన్నాయి. మలుపులు దాటుకుంటూ వెళ్లాలి. ప్రస్తుతం ఆడలి అంత ప్రాచుర్యం జగతపల్లికి లేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇంకా ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యాటక పరంగా నిర్వహించడం లేదు. టిక్కెట్ల ధరలు, ఫొటోషూటింగ్, క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయలేదు. అప్పుడప్పుడు పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. కొన్నాళ్లుగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. జగతపల్లి వ్యూపాయింట్ నుంచి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి మూడేళ్ల క్రితం ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిరోజుల కిందట పాలకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికృష్ణ ఇదే ఘాట్రోడ్లో ద్విచక్రవాహనం స్కిడ్ అయి మృతిచెందారు. ఇక ఆడలిలో 8నెలల కిందట పాలకొండలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన భారతి తన భర్త, పిల్లలతో కలిసి వ్యూపాయింట్ అందాలు చూసి ఇంటికి వెళ్తుండగా వెల్లంగూడ మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈఘటనలో ఆమె మృతిచెందగా మిగతా వారికి గాయాలయ్యాయి. అ ఘటన మరువకముందే శ్రీకాకుళానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో అడలి వ్యూపాయింట్కు వెళ్లి మార్గమధ్యంలోని మలుపువద్ద అక్కడి లోయలోకి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది గాయపడ్డారు. అప్పటికి కొద్దిరోజుల్లోనే పిక్నిక్కు వెళ్లిన మరో కుటుంబం సవర గొయిది సమీపంలో డౌన్ దిగుతుండగా పక్కన ఉన్న గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఆడలి వ్యూ పాయింట్ నుంచి దిగి వస్తున్న ఆటోను దాని వెనుక నుంచి వస్తున్న మరో ఆటో ఢీకొట్టగా ముందు ఆటో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో బూర్జమండలం కురుంపేటకు చెందిన బొడ్డు యశోదమ్మ, వెల్లంగూడకు చెందిన సవర రెల్లయ్య మృతిచెందారు. అలాగే మే 20న సీతంపేటకు చెందిన గిరజాల వేణుమాధవ్ వెల్లంగూడ మలుపు వద్దకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుతప్పి లోయలో పడడంతో మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పిక్నిక్లు పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే ఘాట్రోడ్లలో మలుపుల వద్ద ప్రమాదాలు అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోని పర్యాటకులుఅవగాహన కల్పించినా కానరాని ఫలితం పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ వద్దని సూచించినా కొందరు టూరిస్టులు అవేవీ పట్టించుకోకుండా వ్యవహరించడం మూలాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆడలి వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో రూ.కోటి వ్యయంతో మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. జాగ్రత్తలు తప్పనిసరి వ్యూపాయింట్లకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదముంది. ఘాట్రోడ్లో వాహనాలతో దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. న్యూట్రల్లో కాకుండా గేర్లో రావాలి. ఆడలి, జగతపల్లి వైపు వెల్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి. వై.అమ్మన్నరావు, ఎస్సై, సీతంపేట -
దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు
● గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి కరువు పార్వతీపురం రూరల్: భవిష్యత్ భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బడులు, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు నరక కూపాలుగా మారుతున్నాయి. గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, నేడు కనీస సౌకర్యాలకు నోచుకోక వారి పాలిట శాపాలుగా పరిణమించాయి. పార్వతీపురం మండలంలోని రావికోన గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులే ఇందుకు నిలువుటద్దం. సుమారు 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో, చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఒకే చోట కావడం వారి దుస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేకపోవడం పెను సమస్యగా మారింది. ఉన్న కొద్దిపాటి గదులనే తరగతులకు, భోజనశాలకు, శయన మందిరానికి వినియోగిస్తున్నారు. పగలు ఎక్కడైతే అక్షరాలు దిద్దుతారో, రాత్రి అక్కడే పక్కలు వేసుకుని నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ గదులు కూడా విద్యార్థులందరికీ సరిపోకపోవడంతో, అనేకమంది చలికి, దోమల బెడదకు ఓర్చుకుంటూ వరండాలలోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. తమ బట్టలు, పుస్తకాలు దాచుకునే పెట్టెలను మెట్ల కింద పెట్టుకుని, అక్కడే ఒరిగిపోతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. మంచి నీటికి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, రావికోన పాఠశాలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ తాగే నీటికి, ఇతర అవసరాలకు ఒకే ట్యాంక్ నీటిని వినియోగించాల్సి వస్తుండడం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన విద్యార్థుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం, సంబంధిత శాఖ పరమైన అధికారులు తక్షణమే స్పందించి రావికోన ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు అందించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ
సీతానగరం: మండలంలోని వాహన చోదకులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నిరంతరం పార్వతీపురం, బొబ్బిలి మీదుగా రోజూ వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మార్గమధ్యంలో రోడ్డు, వంతెనపై భారీ స్థాయిలో గోతులు ఏర్పడడంతో నెల రోజులుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల్లో వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో నిండు ప్రాణాలు పోతున్నా ఇంతవరకూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదాలను చూస్తున్న పోలీసులు కొంతమేర గోతులు పూడ్చుతున్నా వర్షాలు, భారీ వాహనాలు వందల సంఖ్యలో మరమ్మతుల సమయంలో తిరుగాడడం వల్ల ఫలితం లేక పోతోంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉపాధిహామీలో ఇంజినీర్ల పాత్ర కీలకం
● పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శివిజయనగరం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల పాత్ర కీలకమని పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్లో ఇంజినీరింగ్ విభాగం పాత్రను మరింత బలోపేతం చేయడం, విజిలెన్స్ ఆండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎదురవుతున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది సర్వీస్ రూల్స్ రూపకల్పన, సవరణలకు సంబంధించిన సూచనలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ లక్ష్యమన్నారు. గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి.వెంకటరెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు యు.సోములు, కార్యదర్శి కె.ప్రసాద్, కోశాధికారి వి.నీరజ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ పనుల్లో అవకతవకల గుర్తింపు
సీతానగరం: మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులు, బిల్లుల చెల్లింపు, మస్తరు వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినంకలాంలో రామమందిరం వద్ద సర్పంచ్ పి.తిరుపతిరావు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ జరిగింది. మధ్యాహ్నం గ్రామసభ ప్రశాంతంగా ప్రారంభించినప్పటికీ క్షేత్ర సహాయకుడు బి. సత్యనారాయణ సమక్షంలో జాబ్ కార్డులు, ఉపాధి పనులుకల్పిం చడం, బిల్లుల చెల్లింపులపై వేతనదారులను సామాజిక తనిఖీ బృందం అడిగి తెలుసుకున్న సమయంలో వివిధ రకాల అభియోగాలు బయటపడ్డాయి. దీర్ఘ కాలంగా గ్రామాంతరం వెళ్లిన వారికి పనుల్లో పాల్గొనక పోయినా మస్తరు వేశారని, గర్భిణులు ప్రసవ సమయంలో పనుల్లో పాల్గొనక పోయినా, ప్రభుత్వం వద్ద గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి, అనారోగ్యానికి గురైన వృద్ధులు ఏళ్ల తరబడి మంచాన పట్టిన వారికి, ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు వేర్వేరు జాబ్కార్డులు పొంది వేతనాలు పొందినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభ నిర్వహించే సమయంలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకోవడం గొడవలకు దారితీసింది. దీంతో గ్రామంలోని రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. ఈ విషయమై డీఆర్పీ గుంపస్వామి వద్ద ప్రస్తావించగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, వృద్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారికి ఉపాధిహామీ బిల్లులు చెల్లించినట్లు గ్రామసభలో గుర్తించామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు చెప్పారు. -
ఇంత నిర్లక్ష్యమా..!
రాజాం: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు తుప్పు పట్టి పాడైపోతున్నాయి. మండలంలో దివ్యాంగులకు ఇచ్చేందుకు ఆరు నెలల కిందట వీటిని ఇక్కడకు తీసుకువచ్చారు. మొత్తం 40కి పైగా ట్రైసైకిళ్లు రాగా వీటిలో కొన్నింటిని పంపిణీ చేయకుండా వదిలేశారు. ఒక్కో ట్రైసైకిల్ సుమారు రూ.18వేలు. ఇంత నిధులు వెచ్చించిన అధికారులు లబ్ధిదారులకు అందించడంలో విఫలమయ్యారు. పోనీ వాటిని భద్రపరిచారా? అంటే అదీ లేదు. కార్యాలయ ఆవరణలో ఆరుబయటే వదిలేయడంతో పూర్తిగా పాడయ్యాయి. ట్రైసైకిళ్లు అవసరమైన వారు మండలంలో పలువురు ఉన్నా... దానికీ ఓ పంపిణీ పద్ధతి ఉందంటూ అధికారులు అలానే వదిలేశారు. వీటిని చూసిన పలువురు అధికారుల తీరును తప్పు పడుతున్నారు. రూ.వేలల్లో ఉండే వీటిని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడమేంటని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. -
ముగిసిన జేవీవీ కళాజాతా శిక్షణ
విజయనగరం అర్బన్: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో స్థానిక గురజాడ స్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళాజాతా శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ నెలలో కర్నూలులో, అక్టోబర్ నెలలో విజయనగరంలో నిర్వహించిన శిక్షణ తరగతులు లక్ష్యాన్ని నెరవేర్చాయన్నారు. గుంటూరులో నవంబర్లో నిర్వహించనున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా పాటల శిక్షణ, డప్పు శిక్షణ, మ్యూజిక్పై శిక్షణ పొందిన వారు, తర్వాత రోజులలో పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో సమావేశాలు జరపాలన్నారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.ఫృధ్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్.కృష్ణారావు, కోశాధికారి ఎస్.శివాజీ, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, పార్వతీపుం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం మొద్దు నిద్ర
కురుపాం: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాము పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఏకలవ్య పాఠశాలను ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు స్పందించకపోవడం వలనే తోయక కల్పన, అంజలి గురుకుల విద్యార్థినులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలలో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడడం ఘోరమని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో తాగునీటి కలుషితం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఒకే తాగునీటి బోరు ద్వారా గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలకు నీటి సరఫరా అవుతుందని అప్రమత్తంగా ఉండాలని తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఒకటో తేదీనే ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థులకు కామెర్లు సోకినట్టు గుర్తించినా ఆరో తేదీ వరకు కూడా విద్యార్థులకు స్క్రీనింగ్ చేయలేదన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఇంతటి తీవ్రమైన సమస్య వెలుగులోకి తీసుకొచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం వెళ్లగా జనరల్ ఫిజీషియన్ లేరని, ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హెపటైటిస్ ఏ ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని అయినా పాలకులకు ఇంత నిర్లక్ష్యం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. మలం కలిసిన నీటి కలుషితం కావడం వల్లే హెపటైటిస్ ఏ వ్యాప్తి చెందిందని నివేదికలు చెబుతున్నాయని, అయినా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంపై హ్యూమన్ రైట్స్కు, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. సరైన వైద్యం అందకే ఇద్దరు విద్యార్థినుల మృతి ఒకే స్కూల్లో 170 మంది పచ్చకామెర్ల బారిన పడడం ఘోరం హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం.. మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి -
పేదల ప్రాణాలకు భరోసా కరువు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలు నిలిచిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. వివిధ రకాల వ్యాధిగ్రస్తులతో పాటు గర్భిణులు కూడా డబ్బులు వెచ్చించి ప్రసవం జరిపించుకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నా కూటమి సర్కార్ స్పందించక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలంటే కూటమి సర్కార్కి లెక్కలేదన్న చందంగా వ్యవహారిస్తుందనే విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. పాత రోజులు గుర్తు చేసుకుంటున్న వైనం ఆరోగ్యశ్రీ పథకం లేనప్పడు ఏదైనా జబ్బు చేస్తే ఇల్లుగాని.. భూమిగాని తాకట్టు పెట్టడం లేదా.. అమ్ముకోవడమో చేసేవారు. మళ్లీ అటువంటి పరిస్థితులే వచ్చాయని రోగులు గుర్తు చేసుకుంటున్నారు. పేదల ప్రాణాలకు ఆపద వస్తే అండగా నిలిచి వారి కి మేమున్నామని భరోసా కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.వేలు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్న రోగులు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం వర్తిస్తే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు కూటమి సర్కార్ చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు సేవలు నిలిపివేశారు. దీంతో వేలాది రుపాయిలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. అపండిసైటీస్, పేగు వరపు, పేగు మడత పడడం, తీవ్రమైన కడుపునొప్పి, నిమోనియా వంటి అత్యవసర పరిస్థితు ల్లో ఉన్న రోగులు సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ఆయా వ్యాధులకు చికిత్స కోసం రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు రోగు లు ఖర్చు చేస్తున్నారు. గర్భిణుల ప్రసవం కోసం ఆస్పత్రిని బట్టి కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవానికి రూ.20 వేలు నుంచి రూ.30 వేలు, మరి కొన్ని ఆస్పత్రుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తున్నారు. సిజేరియన్కు అయితే రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సమ్మె విరమింపజేసే చర్యలు చేపట్టని వైనం..! ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని సమ్మె చేస్తున్నాయి. అత్యంత అత్యవసరమైన పథకం కాబట్టి దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాల్సి ఉంది. కాని కూటమి సర్కార్ ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదు. బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రులు పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందించారు. అయినప్పటకీ స్పందించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. జిల్లాలో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అభినవ్ ఆస్పత్రి, కొలపర్తి, సాయి పీవీఆర్, సాయి సూపర్ స్పెషాలిటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పిజి స్టార్, స్వామి ఐ ఆస్పత్రి, నెప్రోఫ్లస్, మిమ్స్, మువ్వ గోపాల, కాస్వి ఆస్పత్రి, క్వీన్స్ ఎన్ఆర్ఐ, గాయిత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్ ఆస్పత్రి, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, పిలిడోపియా ఆసుపత్రి, అమృత, సంజీవిని, శ్రీ బాపుజీ, సంజీవిని సూపర్ స్పెషాల టీ, సాయికృష్ణ, విజయ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సమ్మె వల్ల వైద్య సేవలు నిలిచిపోయాయి.గంట్యాడ మండలానికి చెందిన పి.కనకరాజు రెండు రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ కుప్పిలి సాయిరాం, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
నేడు తెప్పోత్సవం ట్రయల్ రన్
విజయనగరం టౌన్: హంస వాహనంపై పైడితల్లి అమ్మవారు విహరించేందుకు తెప్పోత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పెద్ద చెరువులో తెప్పోత్సవం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. 30 మంది గజ ఈతగాళ్లతో, హంస వా హనం, రెండు పక్క బోట్లుతో పాటూ అగ్నిమాపక అధికారుల బోట్లు ఉంటాయన్నారు. హంస వాహనిపై విహరించే పైడితల్లి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చే అశేష భక్త జనావళికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ఆర్అండ్బీ అధికారుల సాయంతో వేసిన గ్రిల్స్ వరకూ వచ్చి తెప్పోత్సవాన్ని చూసే అవకాశం కల్పించామన్నారు. పెద్దచెరు వు అవతలి గట్టు నుంచి కోటశక్తి ఆలయం వర కూ తెప్పోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉందన్నారు. మూడుసార్లు అమ్మవారు పెద్ద చెరువు లో హంస వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని తెలిపారు. ట్రయల్ రన్ సుమా రు 50 మందితో నిర్విహిస్తామని, కానీ ఉత్సవానికి మాత్రం 20 మంది వరకే అనుమతి ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంట ల నుంచి నిర్వహించనున్న తెప్పోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి తరించాలని కోరారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద 4 వేల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఆదివారం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 4వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.12 మీటర్లు లెవెల్ నీటిమట్టం నమోదైంది. వచ్చిన నీటిని రెండు గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రామసుందర్రె డ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాల ని సూచించారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాల ని సూచించారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం ఫోర్ట్: సమాజంలో ఎప్పటికప్ప డు వచ్చే అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వైద్యు లు తెలుసుకోవాలని ఐఎంఏ సీజీపీ డీన్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ అన్నారు. ముంబాయిలోని ఐటీసీ హోటల్లో నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ వైద్యుల సమ్మేళనంలో విజయనగరానికి చెందిన ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. సేవాదృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీ య అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుపాళి, ఉపా ధ్యక్షుడు కపాడియా, కోశాధికారి పీయూష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. నేడు పింఛన్దారుల సమావేశం పార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం పింఛన్దారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు, కార్యదర్శి గణపతిరావు ఆదివారం తెలిపారు. సమావేశంలో మండల యూనిట్ల నిర్వాహణ, భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్దారులు హాజరు కావాలని కోరారు. -
పాముకాటుతో మహిళ మృతి
సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గొర్లె దమయంతి (50) పాముకాటుకు గురై మృతిచెందింది. దీనిపై ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న దమయంతి తన పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఆమె నీరు పెడుతున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న భర్త తారకేశ్వరరావుకు ఫోన్లో తెలియజేయగా వెంటనే స్థానికులు డోల రామారావు, చిత్తిరి సూర్యనారాయణలను తీసుకుని పొలానికి వస్తున్న భర్తకు ఎదురుగా వచ్చిన దమయంతి పాము కాటువేసిన గాయాన్ని చూపి స్పృహకోల్పోయింది. హుటాహుటిన అప్రమత్తమైన భర్తతోపాటు గ్రామస్తులు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతురాలి భర్త తారకేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెల్లడించారు. -
పువ్వల నాగేశ్వరరావు మృతి
● దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● నివాళులర్పించిన ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావుసాలూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సాలూరు పట్టణ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం లక్ష్మి థియేటర్ వద్ద ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితర ప్రముఖులు సాలూరు వచ్చి నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగేశ్వరరావు సేవలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నాగేశ్వరరావు సతీమణి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కుమారుడు శ్రీనువాసరావు, కుమార్తె, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల విషన్నవదనాల మధ్య నాగేశ్వరరావు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. -
పిడుగుపడి వ్యక్తి మృతి
రేగిడి: మండల పరిధిలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన కొబగాన నాయుడు (45) శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం నాయుడు ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ తనకున్న కొద్దిపాటి పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే జొన్న పిక్కలను సాయంత్రం 4 గంటల సమయంలో తన పొలంలోనే శ్మశానవాటిక వద్ద ఆరబెడుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరమడంతో దగ్గర్లోనే పిడుగుపడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. దగ్గర ప్రాంతంలో ఉన్న రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారంతా వచ్చి భోరున విలపించారు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె రాధికకు వివాహం చేశారు. లాకిని అనే రెండో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. భార్య సుగుణ, తల్లిదండ్రులు రామినాయుడు, జయమ్మలు నాయుడు మృతితో భోరున విలపించారు. ఈ సమాచారం తెలుసుకున్న వీఆర్వో కె.ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి గోపాలనాయుడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ సిబ్బందితో కలిసి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
డీఎస్డీఓగా వెంకటేశ్వరరావు
● శ్రీధర్రావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్డీఓ)గా ఎస్.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. విశాఖ జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తూ శాప్ ఎం.డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కె.శ్రీధర్రావును పార్వతీపురం మన్యం జిల్లాకు చేస్తూ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా హాకీ కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఎ.మహేష్బాబుకు శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు వెనువెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా నియామకమైన వెంకటేశ్వరరావుకు గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. ఇసుక అక్రమ తరలింపు అడ్డగింతబొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలించేందుకు సిద్ధం చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ ఎం.శ్రీను శనివారం పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీసులతో కలిసి ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అధికారులెవరూ విధుల్లో ఉండరని భావించిన ట్రాక్టర్ యజమానులు శనివారం ఉదయం ఆరు గంటలకే ఇసుక తవ్వకాలకు జేసీబీనీ సిద్ధం చేసుకుని వరుస క్రమంలో జేసీబీతో నదిలో ఇసుకను తోడుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో దాడిచేసే సమయానికి జేసీబీ, కొన్ని ట్రాక్టర్లు తప్పించుకోగా ఇసుకను లోడు చేసేందుకు సిధ్దంగా ఉన్న ఏడు ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకున్నారు. యజమానులను పిలిపించి హెచ్చరించారు. ట్రాక్టర్ల నంబర్లు తీసుకుని అక్రమ ఇసుక రవాణాతో దొరికితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించి విడిచిపెట్టారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశమని మరో మారు దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కాలం చెల్లిన కందిపప్పు
రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన, నాసిరకానిదే కాకుండా కాలం చెల్లిన కందిపప్పును గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఈ కాలం చెల్లిన కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండిపెడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 9వ తేదీన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి రామభద్రపురం మండలకేంద్రంలోని అంగన్వాడీ సెంటర్–5ను అకస్మికంగా తనిఖీ చేసి 8 ప్యాకెట్లు కాలం చెల్లిన కందిపప్పు ఉన్నట్లు గుర్తించి కంగుతిన్నారు. ఇలాంటి కందిపప్పు తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వాటి పరిధిలో మెయిన్, మినీ మొత్తం కలిపి 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి రేషన్ డీలర్లకు, వారి నుంచి అంగన్వాడీ సెటర్లకు సరుకులు సరఫరా చేస్తారు. అయితే సరుకు తయారైన మూడు నెలలకు గోదాంకు చేరుతుందని అధికార సమాచారం. గోదాముకు చేరిన సరుకును ఈ కందిపప్పులో పురుగులు ఉన్నాయో? లేక నాసిరకంగా ఉందో సంబంధిత అధికారులు కనీసం పరిశీలించకుండా వచ్చిన సరుకు వచ్చినట్లు గానే ఒక నెల తర్వాత రేషన్ డీలర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే తయారైన కందిపప్పు అక్కడే సుమారు మూడు నెలల తర్వాత కేంద్రాలకు చేరుతుంది.ఆ పప్పు కాలపరిమితి ఆరు నెలలు. సెంటర్లలో టీచర్లు నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ ఆ పప్పునే కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు వండి పెట్టడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. అయితే గడువు ఉండగానే పంపిణీ చేస్తున్నామని గోదాము అధికారులు చెబుతుండగా, తక్కువ కాలం ఉన్న కందిపప్పు ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం, మరో వైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. పర్యవేక్షణ కరువు..జిల్లా ఉన్నతాధికారుల గోదాముల పర్యవేణలేకపోవడంతో సరుకుల సరఫరా దారులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించిన సీ్త్ర సంక్షేమాధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని పలువురు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకస్మిక తనిఖీలో గుర్తించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు కాల పరిమితి ఉన్న కందిపప్పు సరఫరా మా గోదాముకు మార్చి నెలలో వచ్చిన కందిపప్పును రామభద్రపురం అంగన్వాడీ కేంద్రం–5కు డీలర్ ద్వారా జూలై నెలలో పంపిణీ చేశాం. ఆ పప్పు ఆగస్టు నెలతో కాలం చెల్లుతుంది. అయితే ఆ పప్పు ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా వదిలేయడం అంగన్వాడీ నిర్వాహకుల తప్పిదం. కాట్రాక్టర్ నుంచి నేరుగా గోదాంకు కందిపప్పు ప్యాకెట్లుతో ఉన్న బస్తాలు చేరుతాయి. వాటిని అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తాం. సూర్యప్రకాష్, గోదాం ఇన్చార్జి, బొబ్బిలి సూపర్వైజర్, టీచర్కు మెమోలు రామభద్రపురం అంగన్వాడీ సెంటర్–5లో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి 8 కాలం చెల్లిన కందిపప్పు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఐసీడీఎస్ ఆదేశాల మేరకు సంబంధిత సూపర్వైజర్తో పాటు టీచర్కు మెమోలు జారీ చేస్తున్నాం. ఎం.వరహాలమ్మ, సీడీపీవో బాడంగి -
చేపల దొంగలపై చర్యలు తీసుకోవాలి
● జిల్లా మత్య్సకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న గంట్యాడ: మండలంలోని పెంట శ్రీరాంపురం గ్రామంలోని నల్ల చెరువులో దొంగతనంగా చేపలు పట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మత్య్సకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. పెంట శ్రీరాం పురం గ్రామంలో అక్కివరం, గొడ్డు పాలెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు చేపలు పడుతుండగా గ్రామానికి చెందిన మత్య్సకార సహకార సంఘం సభ్యులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దొంగతనంగా చేపలు పట్టిన వారిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని లేని ఎడల మత్య్సకార సహకార సంఘాల నాయకులం రోడ్డెక్కి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చెరువుల్లో దొంగతనంగా చేపలు పడుతున్న విషయంపై గత నెలలో కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినప్పటికీ సరైన చర్యలు తీసుకోక పోవడం వల్ల మత్య్సకారులకు చెందిన చేపలు చోరీకి గురై ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
చీపురుపల్లిలో భారీ చోరీ
● 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు అపహరణ ● బాధితుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు చీపురుపల్లి: పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెయిన్రోడ్లో ఇద్దరు వృద్ధులను గాయపరిచి భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లిన ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పట్టణంలోని ఆంజనేయపురంలోని విజయకృష్ణ అపార్ట్మెంట్ రోడ్లో నివాసం ఉంటున్న ఒమ్మి సురేష్ అనే ఉపాధ్యాయుడి ఇంటిలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరగడం స్థానికంగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు పోయినట్లు ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు. దొంగలు ఇంటిలోని రెండు బెడ్ రూమ్లలో ఉన్న బీరువాలు, కప్బోర్డులు మొత్తం వెతికి, సామగ్రి చిందర వందరగా పడేశారు. బీరువాల్లో చీరలు, బట్టలు ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోకుండా బంగారం, వెండి, నగదుపైనే దుండగులు దృష్టి సారించారు. ఇదే ఇంటికి పక్కనే ఉన్న విజయకృష్ణ అపార్ట్మెంట్లో రెండేళ్ల క్రితం గంగాధర్ నివాసంలో పడిన దొంగలు 25 తులాల బంగారం అపహరించుకుపోయారు. మళ్లీ అక్కడే పక్క ఇంటిలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి కిటికి గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పొడవాటి స్క్రూడ్రైవర్, మూడు అడుగుల రాడ్డుతో ఇంట్లో ఉన్న బీరువాలను తెరిచారు. బీరువాల్లో లాకర్లు తెరిచి 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు దోచుకెళ్లారు. అయితే చోరీకి తీసుకొచ్చిన స్క్రూ డ్రైవర్, రాడ్డు బెడ్ రూమ్లోని మంచంపైనే వదిలి పెట్టి వెళ్లిపోయారు. పెళ్లికి వెళ్లి వచ్చిన బాధితులు ఉపాధ్యాయుడు సురేష్ భార్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రాజాం పట్టణానికి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. వేడుక ముగించుకుని తిరిగి రాత్రి 1.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముఖద్వారం తాళం తెరిచి లోపలికి వెళ్లి ప్రధాన హాలు తలుపు తీసేందుకు ప్రయత్నించగా రావడం లేదు. లోపల గడియ పెట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. తెలిసిన వారికి ఫోన్లు చేసి రప్పించి పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలో ఇంటి లోపల ఉన్న దొంగలు వెనుక డోర్ నుంచి పారిపోయారు. ఆధారాల సేకరణ విషయం తెలుసుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. చోరీకి వినియోగించిన పరికరాలు, కిటికీ గ్రిల్పై వేలిముద్రలు సేకరించారు. బాధితుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
యువతి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని అయ్యకోనేరు చెరువులో శనివారం సాయంత్రం 6.30 గంటలకు టూటౌన్ పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బాబామెట్టకు చెందిన బెహరా ఈశ్వరరావు దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు రమ్య స్థానికంగా చదువుతోంది. ఈశ్వరరావు భార్య నగరంలోని మహరాణిపేటలో బీవీకే స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి సైకిల్పై వెళ్లిన రమ్య మరుసటి రోజు వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే అందుబాటులో లేదని వచ్చింది. దీంతో శనివారం ఉదయం తండ్రి బెహరా ఈశ్వరరావు టుటౌన్ పోలీసు స్టేషన్కు వచ్చి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. సాయంత్రం అయ్యేసరికి అయ్యకోనేరు చెరువులో మృతదేహం కనిపించింది. ఇంటి నుంచి వెళ్లి పోయిన రమ్యకు పెళ్లి చేసేందుకు కన్నవారు యత్నించారు. అయితే తనకు ఆ పెళ్లి ఇష్టంలేదని గడిచిన కొద్దిరోజుల నుంచి కన్నవారితో రమ్య గొడవపడుతూనే ఉంది. దీంతో ఎవరితో మాట్లాడకుండా ఉండడం, గదిలోకి వెళ్లి ఒంటరిగా ఉండడం వంటి పనులు చేయసాగింది. శుక్రవారం ఫ్రెండ్ దగ్గరకు వెళ్తానని చెప్పి సైకిల్ తీసుకుని వెళ్లి చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసినా మృతదేహం లభించడంతో బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
దీపావళిలోగా పదోన్నతులు ఇవ్వాలి
● ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడువిజయనగరం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ప్రభుత్వం జాప్యం కొనసాగిస్తోందని, దీపావళి పండుగలోగా పదోన్నతుల జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్రప్రధాన కార్యదర్శి జీవీనరసయ్య హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ఆధ్వర్యంలో జరిగిన జోనల్ కౌన్సిల్ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ విలీనమై ఆరేళ్లు గడిచినా ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ జరపలేదని అసహనం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ మెకానిక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు అలాగే డిపో మేనేజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు ఉన్న ఖాళీలను నింపే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారని దీపావళి పండగ వరకు సమస్య పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీనరసయ్య మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది తక్కువ, బస్సులు తక్కువ, అధిక ప్రయాణికుల సేవల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే కనీసం మరో 3 వేల కొత్త బస్సులు, 10 వేల కొత్త నియామకాలు అవసరమరన్నారు. లేకుంటే మరి కొద్దినెలలకు డ్రైవర్లు, కండక్టర్లు అనేకమంది ఆరోగ్య సమస్యలతో సిక్ లీవ్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నందమూరి రామారావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శ రవికిశోర్, వివిధ డిపోల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగించాలి
బొబ్బిలి: ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగించాలని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎన్జీఓ హోంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పి.సత్యంనాయుడు అధ్యక్షతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఆవశ్యకతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో కోరారు. జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు పి.శివానంద్ మాట్లాడుతూ వైద్య రంగం నుంచి తప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే పీపీపీ చర్యలను వెనుకకు తీసుకోవాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభిస్తున్న 17 మెడికల్కాలేజీల్లో 10 కాలేజీలను పీపీ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం ప్రజావ్యతిరేకమన్నారు. ఇది అభివృద్ధి తిరోగమన చర్యగా పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి.ధనుంజయ్, డి.వెంకటనాయుడు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యవిద్యను దూరం చేసే ఈ చర్యను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే ప్రజలకు వైద్యం, వైద్యవిద్య అందుబాటులో ఉంటాయన్నారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వి.ప్రసన్నకుమార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ నిర్మాణదశలో ఉన్న వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు. నిధులు లేవనే కారణాన్ని సాకుగా చూడకూడదన్నారు. విలువైన ప్రజాధనాన్ని, ఆస్తులను ప్రైవేటు పరం చేయడం అంటే అభివృద్ధి నిరోధానికి గేట్లెత్తేయడమేనన్నారు. అనంతరం మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని, పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఇతర వైద్య కళాశాలలను బలోపేతం చేయాలని నినదించారు. ఈ అంశాలను తీర్మానిస్తున్నట్టు జేవీవీ నాయకులు స్వామినాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అ ధ్యక్షుడు రాము, సీఐటీయూ నాయకులు లక్ష్మి, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు కె.కృష్ణదాసు, సుధాకర్, మహేష్, పి.సత్యనారాయణ, శ్రీనివాస్, శివ, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
అదనపు భవనాలు మంజూరైనా పూర్తి చేయని ప్రభుత్వం
కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల సౌకర్యార్థం అదనపు భవనాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాబార్డు నిధులు రూ.1.97 కోట్లు మంజూరు చేసి 2020లో పనులకు శ్రీకారం చుట్టింది. రూ.90 లక్షల ఖర్చుతో నిర్మాణ పనులు చేపట్టింది. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి చివరి దశలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయలేక పోవడంతో విద్యార్థులకు వసతి సమస్యలు తీవ్రతరమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే గురుకులానికి ఆర్వో ప్లాంట్ను మంజూరు చేసినా వాటి పర్యవేక్షణ సైతం గాలికి వదిలేశారు. దీంతో చిన్నారులు కలుషిత నీటి కారణంగా హెపటైటస్–ఎ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. -
పెదమానాపురం గ్రామస్తుల ధర్నా
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం గ్రామస్తులకు రాక పోకలకు ఇబ్బందులు కలగడంతో శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు అంతా కలిసి ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ మేర వాహనాలను నిలుపుదల చేసి వారు పడుతున్న బాధలను తెలియజేశారు. అనంతరం సీఐటీయూ నాయకురాలు లక్ష్మితో కలిసి గ్రామస్తులు కనకరాజు, రామప్పలనాయుడు, ఆదినారాయణ, పైడిరాజు, సత్యారావు, సంజీవి, వెంకటరమణ, రాకేష్, రామునాయుడు మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే కష్టంగా ఉందని కిలోమీటర్ దూరం నడిచి వచ్చినా బస్సులు ఆపడం లేదని, ఎరువులు పట్టుకుని పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని వాపోయారు. తక్షణమే అధికారులు దృష్టి సారించి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామానికి చెందిన జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామం నుంచి కిలోమీటర్ దాటి వెళ్లినా బస్సులు ఆపక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రాత్రి సమయంలో పోలీస్స్టేషన్ దాటి బస్సులు ఆపడం వల్ల ఎవరికి ఏ అపాయం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నామన్నారు. పెదమానాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తక్షణమే స్పందించి గ్రామస్తులకు దారి చూపించాలని కోరారు. ఆర్ఓబీ పూర్తవడంతో రాకపోకలకు ఇబ్బందులు కిలోమీటర్ నడిచి బస్సులు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన అండర్గ్రౌండ్ వంతెన సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి -
డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్ : జిల్లా ఎస్పీగా ఎ.ఆర్.దామోదర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన చాంబర్లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం పది మంది సిబ్బంది తాము అనుభవిస్తున్న, చెప్పుకోలేని, వృత్తి పరంగా, శాఖా పరంగా పడుతున్న బాధలను, సమస్యలను ఫిర్యాదుల రూపంలో వ్యక్త పరిచారు. జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజ్ఞాపనలు స్వీకరించి, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, శాఖ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పోలీసుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం పార్వతీపురం రూరల్: నిరంతరం ప్రజారక్షణ విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి, శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే (గ్రీవెన్స్డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వివిధ హోదాల్లోని అధికారులు, సిబ్బంది తమ వృత్తిపరమైన, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ అక్కడకక్కడే కొన్ని సమస్యలకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. అలాగే మరికొన్ని సమస్యలపై త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు అందించగలరని, వారి సంక్షేమానికి ఎప్పుడు అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ సంతోషికుమార్ తదితరులున్నారు. సమస్యలు ఏకరువు పెట్టిన సిబ్బంది -
గురుకుల విద్యార్థులు
పచ్చకామెర్ల గుప్పిట్లో ● పదుల సంఖ్యలో పిల్లలకు జ్వరాలు ● పాఠశాలలకు ఇంకా సెలవులు ● తల్లిదండ్రులకు సైతం వైద్య పరీక్షలు ● మన్యంలో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో విషజ్వరాలు, పచ్చకామెర్లు వచ్చి పిల్లల ప్రాణాలు హరిస్తున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దాదాపు 611 మంది బాలికలు చదువుతున్న గురుకుల విద్యాసంస్థలో ఆగస్టు నెలలోనే వ్యాధి వెలుగు చూసినా అధికారులు, హాస్టల్ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోకపోగా.. ఇది సహజమే... తగ్గిపోతుందిలే అనే ఉదాసీనతతో మెనూ నుంచి చికెన్ మాత్రం పెట్టడం మానేసి ఊరుకున్నారు. దీంతో ఆ వ్యాధి అలా ఒక్కొక్కరిగా వ్యాప్తిస్తూ ఇప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు దాని గుప్పెట్లో చిక్కుకున్నారు. ● అప్పుడే స్పందిస్తే... ఇంత జరిగేదా..? గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మరణం, వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వడానికి నిర్లక్ష్యమెవరది..? క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ అధికారులదా..? లేక పాఠశాల సిబ్బందిదా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఐటీడీఏ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ మూలకు చేరి సుమారు ఆరు మాసాలు గడుస్తోందని, మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ సమీపంలోనే ఉన్న తాగునీరు బోరు, వంటశాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారు కావడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలలోనే ఓ విద్యార్థినికి పచ్చకామెర్లు వచ్చినట్లు గుర్తించారు. అప్పుడే జాగ్రత్త పడితే ఇంత వ్యాప్తి చెందేది కాదు. గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నది 611 మందికాగా, వీరందరికి ఉన్న మరుగుదొడ్లు 32 మాత్రమే. అవికూడా అధ్వానంగా ఉన్నాయి. వసతిగృహం గదుల్లో విద్యాభ్యాసం, పడుకోవడం, భోజనం చేయడం, వాడుకనీరు సైతం విద్యార్థులు సంచరిస్తున్న ప్రాంతంలోనే ఉండడంతో ఒక్క సారిగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడినట్టు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ● ఐటీడీఏ అధికారుల తీరుపై అసంతృప్తి.. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు సంబంధిత డీడీ, ఏటీడబ్ల్యూఓలు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థులకు అందుతున్న మెనూ, ఆహారంలో నాణ్యత, ఆరోగ్యంపై పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత వసతిగృహ సంక్షేమాధికారుల వద్ద చేతివాటం కారణంగా పర్యవేక్షణ పక్కదారి పట్టి అది విద్యార్థులకు శాపంగా మారిందని గిరిజన సంఘా ల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● ఇప్పుడా చర్యలు..? పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెంది, మరో 160 మంది వరకు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రిపాలైతే కాని అధికార యంత్రాంగం స్పందంచ లేదు. ఇంత తంతు జరిగిన తరువాత మాజీ ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణి గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను వెలుగులోకి తెచ్చిన తరువాత ఐటీడీఏ యంత్రాంగం స్పందించి మూలకు చేరిన ఆర్వో ప్లాంట్ స్థానంలో కొత్తది ఏర్పాటు, అధ్వానంగా ఉన్న మురుగుదొడ్లకు బదులుగా వెంటనే ఫైబర్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ స్పందించని వైనం గురుకుల బాలికలకు హెపటైటిస్–ఏ సోకినట్లు చెప్పుకుంటున్నా ఇప్పటికీ అటు వైద్య ఆరోగ్యశాఖ గానీ, ఐటీడీఏ అధికారులు కానీ పూర్తిస్థాయిలో అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. తాగునీటి కాలుష్యమా? లేదంటే పారిశుద్ధ్యలోపమా? ఆహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారా అన్నది పూర్తిస్థాయిలో అధికారులు తేల్చాల్సి ఉంది. తమ పిల్లలకు ఆరోగ్య భద్రత, ప్రాణ రక్షణ కల్పిస్తేనే చిన్నారులను పాఠశాలకు పంపిస్తామని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థుల మృతిపై ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదృష్టకరంఇటీవల పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినా కూత వేటులో ఉన్న కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్పందించకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. కేవలం కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థుల కుటుంబాలను పరామర్శకు రావడాన్ని విమర్శిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇవ్వడం గానీ, ప్రకటించడం కానీ లేదని, అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా కనీసం నియోజకవర్గంలోని ఏ ఒక్క వసతి గృహాన్ని ఆమె సందర్శించలేదని, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో గాలిలో విద్యార్థుల సంక్షేమం కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదనేది కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన సంఘటనలే నిదర్శనం. ఆ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోవడం, ఆర్వో ప్లాంట్ పాడైనా వెంటనే మరమ్మతు పనులు నిమిత్తం ముందస్తు నిధులు కేటాయించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మృతి చెందిన విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. – తోట జీవన్న, సీపీఐ (ఎంఎల్)రెడ్ స్టార్ట్ జిల్లాకార్యదర్శి -
దివ్యాంగులకు మళ్లీ పరీక్ష
● ఏళ్ల తరబడి ధ్రువీకరణ ఉన్నా ఆగని వేధింపులు ● దాగి ఉన్న ప్రభుత్వం కుట్రపార్వతీపురం రూరల్: పుట్టుకతోనో, ప్రమాదవశాత్తుగానో వైకల్యంతో జీవచ్ఛవాలుగా బతుకులు ఈడుస్తున్న విధి వంచితులు వారు. వారికి ప్రభుత్వం పింఛన్ రూపంలో అందించే సాయం గంజినీళ్లకన్నా తక్కువే. కానీ ఆ కొద్దిపాటి ఆసరాను అందుకోవడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు నిత్యం అగ్నిపరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు పరీక్షల నిమిత్తం వైద్యుల ఎదుట తమ వైకల్యాన్ని నిరూపించుకున్న వారిని, ఇప్పుడు మళ్లీ పునః పరిశీలన పేరుతో ప్రభుత్వ యంత్రాంగం నరకానికి దారులు చూపుతోంది. మళ్లీ పరీక్షకు రండి అంటూ జారీ చేస్తున్న ఆదేశాలు వారి పట్ల పుండుమీద కారం చల్లినట్లుగా మారాయి. ఈ నెల 14 నుంచి పునఃపరిశీలన పేరుతో మళ్లీ పరిశీలన జరగనున్నట్లు 2,484 మందికి హాజరు కావాలని ఇప్పటికే వెలుగు సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఇది సంక్షేమమా? లేక ప్రభుత్వమే దివ్యాంగులను మానసిక క్షోభకు గురిచేయడమా? అని దివ్యాంగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అనర్హుల ఏరివేత పేరుతో అసలైన లబ్ధిదారులకు ఘోష జిల్లా వ్యాప్తంగా అర్హత లేని వారిని ఏరివేసే నెపంతో అధికార యంత్రాంగం చేపట్టిన ఈ పునఃపరిశీలన ప్రక్రియ, అసలైన దివ్యాంగుల పాలిట శాపంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 2,484 మందిని పునఃపరిశీలన కోసం గుర్తించారు. వారిలో అత్యధికులు 1442 మంది శారీరక వైకల్యం ఉన్నవారే. చేతులు చచ్చుపడి కదలలేని స్థితిలో ఉన్నవారిని సైతం పరిశీలన పేరిట తరలి రావాలనడం ఒక విధంగా ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని దివ్యాంగులు వాపోతున్నారు. దృష్టిలోపం ఉన్నవారు 446మంది, వినికిడి లోపం ఉన్న వారు 511మంది, మానసిక దివ్యాంగులు 85మంది ఈ జాబితాలో ఉన్నారు. వారిలో చాలా మందికి ఏళ్ల క్రితమే జిల్లా ఆస్పత్రుల్లోని వైద్యుల బృందం శాశ్వత వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించి, సదరం సర్టిఫికెట్లు జారీ చేసింది. ఇప్పుడు ఆ పత్రాలకు విలువలేదా? ఆ వైద్యుల నిర్ధారణపై ప్రభుత్వానికి నమ్మకం పోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశీలన కేంద్రాల్లో నరకయాతన గతంలో వైకల్య నిర్ధారణ కోసం జిల్లా కేంద్రాలకు, విజయనగరం వంటి ప్రాంతాలకు ప్రయాస పడి వెళ్లిన దివ్యాంగులను ఇప్పుడు మళ్లీ పరిశీలన పేరిట పిలవడం వారికి అగ్నిపరీక్షగా మారింది. ఒకే రోజున వారికి కేటాయించిన సంఖ్యలో పరిశీలనకు వచ్చేవారికి గంటల తరబడి నిరీక్షించక తప్పని పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. ఒకరి సహాయం లేకుండా కదలలేని వారిని ఈ విధంగా పరిశీలన పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ దివ్యాంగులను అవస్థలు పాలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని సామాన్యులు సైతం ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతంతా చూస్తుంటే అనర్హులను ఏరివేయడం కన్నా, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుని ప్రభుత్వం పింఛన్ ఎగవేసేందుకు కుటిల నీతి చేస్తోందన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదు దివ్యాంగుల పట్ల పునఃపరిశీలన పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. కనీస మానవతా దృక్పథంతోనైనా ఆలోచించాలి. ఇప్పటికే ధ్రువీకరణ పొందిన శాశ్వత వైకల్యం ఉన్న వారిని ఈ పునఃపరిశీలన ప్రక్రియ నుంచి మినహాయించాలి. నిజంగా అనర్హులు ఉన్నారని భావిస్తే క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇష్టానుసారం పరిశీలన పేరిట పరిశీలన కేంద్రాలకు విధివంచితులను ఈ విధంగా రప్పించి వేధించడం సమర్థనీయం కాదు. – ముల్లు ప్రసాద్, వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు..!
ఈమె పేరు ఎం. పంకజాక్షి. గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం. గత నెల 27న ఆమెకు విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో నరాల సంబంధిత వ్యాధికి శస్త్రచికిత్స జరిగింది. తదుపరి చికిత్స కోసం శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)కి సంబంధించిన సేవలు నిలిపివేశాం. ఓపీ చూడడం లేదని అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతూ వెనుదిరిగారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దొంతల అప్పన్న. సాలూరు మండలం జన్నివలస గ్రామం. ప్రమాదవశాత్తు పడిపోవడంతో మక్క విరిగింది. శుక్రవారం విజయనగరం తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో చేసేది లేక ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పోయారు. -
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
నెల్లిమర్ల రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్ల మండలంలోని మొయిద గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై ఎస్సై గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కవల కనకలక్ష్మి (42) గుర్ల మండలంలోని పెనుబర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి పక్షవాతం సమస్యతో ఆమె బాధపడుతున్న నేపథ్యంలో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బయటకు పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుర్చీలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి 108కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త నక్కిన శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ శుక్రవారం తెలిపారు. -
అంతరిక్షంలో జీవనం సాధ్యమే
చికెన్బొబ్బిలి: మన ప్రయోగాలు, పరిశోధనల సారాంశం సరికొత్త దశలోకి వెళ్తోందని, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణమే కాదు అక్కడ మానవ జీవనమూ సాధ్యమేనన్న రీతిలో సరికొత్త ఆవిష్కరణలు భవిష్యత్తులో జరగనున్నాయని శ్రీహరి కోట మూడవ లాంచ్ ప్యాడ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.శ్రీనివాస రావు అన్నారు. గడిచిన మూడు రోజులుగా స్థానిక రాజా కాలేజ్లో ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతరిక్షంలో మన ప్రయోగాలు, పరిశోధనల విషయమై స్థానిక విలేకర్లతోనూ మాట్లాడారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి చంద్రమండలంపై అడుగుపెట్టినప్పుడు చెప్పిన ఈ చిన్న అడుగే పెద్ద దూకుడవుతుందన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు. మనదేశం కూడా ఈ రంగంలో ఆసాధారణ ప్రయాణం చేస్తోందన్నారు. 1969లో చిన్న ఆఫీసులో ప్రారంభమైన ఇస్రో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత నమ్మదగిన అంతరిక్ష సంస్థ అయిందన్నారు. మన చంద్రయాన్ మిషన్లు చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కనుగొన్నాయని తెలిపారు. మంగళయాన్ మిషన్ రెడ్ ప్లానెట్ చేరిన మొదటి ఆసియా దేశంగా మన దేశాన్ని ముందు నిలిపిందన్నారు. ఆదిత్య–ఎల్1 అనేది సూర్యుడ్ని పరిశీలిస్తూ భూమిని రక్షించే కీలక ఉపగ్రహంగా నిలిచిందన్నారు. ఇప్పుడు గగన్యాన్ మన దేశ అంతరిక్ష పరిశోధనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయన్నారు. భూమి సహాయం లేకుండా అంతరిక్షంలో శ్వాస తీసుకోవడం, నీరు తాగడం, ఆహారం పొందడం, శక్తిని ఉత్పత్తి చేయడం వంటి ఎన్నో చర్యలను త్వరలో చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. భారత దేశానికి స్వంత అంతరిక్ష కేంద్రం (భారతీయ అంతరిక్ష కేంద్రం)2040 నాటికి సాధ్యపడుతుందన్న భావన వ్యక్తం చేశారు. ఇందుకోసం మన దేశం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాజా కళాశాల చైర్మన్ ఆర్వీఎస్కే రంగారావు మాట్లాడుతూ కాలేజీలో చేపట్టిన ప్రదర్శనలు, ప్రయోగాల నమూనాల ఆధారంగా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రయోగాల్లో వాటికి సంబంధించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇస్రో నిర్వాహకులు టి.హరికృష్ణ, ఈ ప్రదీప్నాయుడు, ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్, అధ్యాపకులు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. శ్రీహరికోట షార్ పీడీ పి.శ్రీనివాసరావు -
రైతుపై టీడీపీ వర్గీయుల దాడి
● అత్యవసర వైద్యం కోసం విజయనగరం తరలింపు చీపురుపల్లి: అధికార పార్టీ అండతో టీడీపీ వర్గీయులు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. పంట పొలాల్లో వచ్చిన తగాదాలపై అక్కడితో ఆగకుండా ఇళ్లకు వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇదే సంఘటన చీపురుపల్లి మండలంలోని నిమ్మలవలస పంచాయతీ మధుర గ్రామమైన గుణిదాంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి గాయడిన బాధితుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణిదాం గ్రామానికి చెందిన గండబోయిన ఆదినారాయణకు ఎర్ర సురేష్కు మధ్య పొలంలో గట్టు వివాదం నెలకొంది. పొలంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగిన అనంతరం సమసిపోయింది. అయితే కక్ష పెట్టుకున్న ఎర్ర సురేష్, మరికొంత మందితో కలిసి కత్తులు, రాడ్లతో అధికార పార్టీ అండతో సాయంత్రం గండబోయిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆదినారాయణ తలపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆదినారాయణను కుటుంబ సభ్యులు చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే ఈ వివాదంలో తమకు గాయాలయ్యాయంటూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.దామోదరరావు చెప్పారు. -
తండ్రిని చంపిన కేసులో తనయుడి అరెస్టు
బాడంగి: మండలంలో సంచలనం రేపిన తండ్రిని చంపిన తనయుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి హత్యకు కారణమైన కుమారుడు బోనుగిరి లక్ష్మణరావును శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం బొబ్బిలి కోర్టుకు తరలించారు. దీ నికి సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్యరెడ్డి వి లేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసగా మారి డబ్బులకోసం తరచూ తండ్రితో లక్ష్మణరావు గొడవ పడుతుండేవాడని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రినుంచి కీచులాట పెట్టుకున్నా ససేమిరా డబ్బులిచ్చేది లేదని తండ్రి చెప్పడంతో చెప్పుల మేకులు చెరిచే గూటంతో గురువారం తెల్ల వారు జామున తండ్రి రాజేశ్వరరావు కుడి చెవిపై బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. నిందితుడిని పిన్నవలస జంక్షన్లో పట్టుకుని ఆరెస్టు చేశామని తెలిపారు. బొబ్బిలిరూరల్ సీఐ. నారాయణరావు, ఎస్సైతారకేశ్వరరావుల కృషిని ఆమె అభినందించారు. -
చిన్నా... లే నాన్నా..
● ఆడుకునేందుకు వెళ్లి అనంత లోకాలకు.. ● విద్యుదాఘాతంతో బాలుడి మృతి ● కన్నీరుపెట్టిన తల్లిదండ్రులు ● పంచాయతీ, విద్యుత్శాఖ నిర్లక్ష్యానికి బాలుడు బలయ్యాడంటూ బంధువుల ఆరోపణ ● శోకసంద్రంలో ఎస్.పెద్దవలస ఎస్సీ కాలనీ మక్కువ: చిన్నా.. లే నాన్నా... ఆడుకుని వస్తానని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయావా... అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా.. మాతో ఎవరు ఆడుకుంటారు... వేగంగా వచ్చేస్తానన్నావు... మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా అంటూ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. అన్నం పెట్టమ్మా.. తిని కాసేపు ఆడుకొని వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందడం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మక్కువ మండలం ఎస్.పెద్దవలస ఎస్సీ కాలనీకు చెందిన కల్లుకోట రమ్య, చందుల కుమారుడు అఖీరా(4) శుక్రవారం ఉదయం ఆడుకునేందుకు మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. రెండు గంటల సమయం దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో తల్లి రమ్య వెతకసాగింది. అఖీరాతో ఆడుకునేందుకు వెళ్లిన మరో బాలుడిని బిడ్డ ఆచూకీ కోసం ఆరా తీసింది. పాఠశాల వైపు వెళ్లాడని ఆ బాలుడు సమాధానం చెప్పడంతో అటువైపుగా వెళ్లిన ఆ తల్లి పాఠశాల ప్రహరీ పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. కేకలు వేస్తూ బిడ్డను హత్తుకునే ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్షాక్ తగలడంతో కాలనీ వాసులు రక్షించారు. లేదంటే తల్లి కూడా బిడ్డతో పాటు మృతిచెందేది. కాలనీకి తాగునీరు సరఫరా చేసే రక్షిత మంచినీటి పథకం విద్యుత్ ప్యానల్బోర్డును పాఠశాల ప్రహరీకి అమర్చారు. దాని పక్కనే జామిచెట్టు ఉంది. చెట్టుకాయలు తెంపేందుకు చిన్నారి వెళ్లాడా? లేదంటే అక్కడ ఆడుకుంటుండగా విద్యుత్షాక్ తగిలిందో తెలియదు.. విగతజీవిగా కనిపించాడు. కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి చందు విశాఖపట్టణం నుంచి హుటాహుటిన చేరుకున్నాడు. నాన్న, చిన్నా లేవరా.. నాతో ఎవరు ఆడుకుంటారు.. లే..నాన్న అంటూ తండ్రి రోదన అందరి కంట కన్నీరు తెప్పించింది. పోస్టుమార్టం కోసం ఆటోలో తరలిస్తున్న బాలుడిని పట్టుకొని ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతదేహం వద్ద కన్నీరుపెడుతున్న తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఎస్సీ కాలనీకు తాగునీరు అందించేందుకు మినీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుచేశారు. తాగునీరు సరఫరా చేసేందుకు పాఠశాల ప్రహరీకి అమర్చిన ప్యానల్ బోర్డు కింద వైరు పాడవ్వడంతో ప్యానల్ బోర్డుకు విద్యుత్ సరఫరా అవుతోంది. కాలనీ వాసులు నిత్యం కర్రలతో స్విచ్ ఆన్, ఆఫ్ చేసి తాగునీరు పట్టుకుంటున్నారు. ఈ విషయం పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. బాలుడు అఖీరా విద్యుత్ షాక్తో మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ స్తంభంపై ఉన్న వైరును తొలగించి, వారిపై ఎటువంటి అపనింద పడకుండా చేసిన ప్రయత్నాలను కాలనీ వాసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పంచాయతీ, విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి? -
‘కూటమి పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం’
విజయనగరం విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు దారిపొడవునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రా ఇలవేల్పు పైడితల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్ర కోణం దాగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మూటికీ జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేనన్న బొత్స... అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన ఘటనపై గౌరవ గవర్నర్ తో పాటు సీఎస్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...పైడిమాంబ జాతర అపశృతిలో కుట్రకోణం..అధికారంలో ఎవరు ఉన్నా విజయనగరం పైడిమాంబ అమ్మవారి ఉత్సవం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరు. ఒకవేళ చేసినా పశ్చాత్తాపంతో వెంటనే సరిదిద్దుకుంటారు. ఉత్తరాంధ్రా ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ కరుణాకటాక్షాలతో ఈ ప్రాంతం సుభిక్షింగా ఉంది. పూర్వం అమ్మవారి ఉత్సవాలను గ్రామంలో పెద్దలు సొంత నిధులతో చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం, అధికారులు ఇన్ వాల్వ్ అయి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడం జరుగుతుంది. నేను కూడా 15 ఏళ్ల పాటు మంత్రిగా, 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు ఉత్సవాల్లో పాల్గొన్నాను. కానీ ఈ ఏడాది దురదృష్టవశాత్తూ ప్రభుత్వంలో ఉన్న అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదు. ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. అమ్మవారి పండగ అందరిదీ.. కానీ కొంతమంది ప్రాపకం కోసం విడ్డూరంగా ప్రవర్తించారు. ఏం మాట్లాడిన పైడితల్లి అమ్మవారికి అపవాదు వస్తుందన్న భయంతోనే నేను మాట్లాడుతున్నాను. అధికారులు మాత్రం ద్వంద్వ ప్రమాణాలతో పండగ జరిపించారు. పండగలో ఆర్భాటం, ఆహంకారం తప్ప సాంప్రదాయాలకు తావివ్వలేదు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్పడం లేదు, విజయనగరం పట్టణంలో ఏ తలుపుతట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్నా ఇదేమాట అంటారని నేను బలంగా విశ్వసిస్తున్నాను.ప్రభుత్వ కార్యాలయాలలో హుండీలు పెట్టి మరీ దోపిడీ...ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న నిధుల మేరకు పండగ నిర్వహిస్తాం. దాతల సహకారం అందిస్తే అది కూడా ఉపయోగించుకోవడం ఆనవాయితీ. ఈ సారి మాత్రం పండగ నిర్వహణ కోసం ఎమ్మార్వో కార్యాలయం, ఆర్డీఓ ఆఫీసు, ఎక్సైజ్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో హుండీలు ఏర్పాటు చేసి కలెక్ట్ చేశారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఎందుకు నిధులు సేకరించారో అర్ధం కావడం లేదు. ఇది ఎందు కోసం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే. రాజకీయ నాయకులు తమ అహంకారాన్ని, గొప్పని చూపించాలని ప్రయత్నం చేయడం సహజం. కానీ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు తమ విధిని సక్రమంగా నిర్వర్తించాలి. ఇదేం పద్దతి ? అకౌంట్ నెంబర్లు ఇస్తారా ?వేదిక కూలిన ఘటనపై గవర్నర్ , సీఎస్ కు లేఖ..గొప్పలు చెబుతున్న గౌరవ గోవా గవర్నర్ గారు ఇంకా విజయనగరంలోనే ఉన్నారు. గతంలో చాలా మాటలు చెప్పారు. వారి ఆలోచన ఏమైంది? ఎందుకు అధికారులకు దిక్సూచిగా నిలబడలేదు ? ఇక నేను అమ్మవారి దర్శనానికి సంబంధించి నా వ్యక్తిగత ప్రోటోకాల్ పై లేఖ రాశాను. వారికి తోచిన ఏర్పాట్లు వారు చేశారు. ఉత్సవాల్లో ఏం జరిగిందో అంతా చూశాం. మాకు ఏర్పాటు చేసిన వేదిక కుప్పకూలిపోయింది. ఇది కుట్రా? అధికారుల అలసత్వమా? లేదంటే మమ్నల్ని అవమానపర్చాలని చేశారా? అంతమొందించాలని చేశారా? అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. వేదిక కూలిన ఘటనలో ఎమ్మెల్సీ సురేష్ బాబు చేయి డిస్ లోకేట్ అయింది. మరొకరికి ఫ్రాక్చర్ కాగా.. మరో అమ్మాయికి దెబ్బలు తగిలాయి. అధికారులకు ఇంగిత జ్ఞానం లేదా? జిల్లా అధికారులుగా పలకరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేదా ? ఉద్యోగంలో కొత్తగా చేరారా? శాసనమండలి ప్రతిపక్షనేత కోసం అధికారుల ఏర్పాటు చేసిన వేదిక కూలిపోతే కనీసం ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అమ్మవారిని నమ్ముకున్న భక్తులుగా నాకు ఎలాంటి ఇబ్బంది లేకపోగా... కొంతమంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మా మీద అధికారులకు వ్యక్తిగతంగా ఎందుకు అంత కక్ష? మమ్నల్ని అవమానపర్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దీనిపై నేను సీఎస్ కు, గవర్నర్ గారికి లేఖ రాస్తాను. అమ్మవారి పండగలో ఒకవైపు అడుగడుగునా నిర్లక్ష్యం, అలసత్వం, కుట్ర కాగా.. మరోవైపు దోపిడీ, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది సరైన విధానం కాదు. ఇలాంటి విషయాలను ఉపేక్షిస్తే సమాజానికే నష్టం. దీని వెనుక ఎవరున్నారన్న పూర్తి వివరాలు బయటకు రావాలి. నేను జిల్లా అధికారులనే ప్రశ్నిస్తున్నాను. రాజకీయ నాయకులు వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కోణంలో ఏవేవో మాట్లాడుతారు. కాని అధకారులకు ఆలోచన ఉండాలి. ఏం జరిగిందన్నది కూడా కనీసం ఆలోచన చేయలేదు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్న విషయం గుర్తించుకోవాలి. దీనికంతటికీ కారణం ప్రభుత్వ అలసత్వం. అధికారుల మీద పట్టు లేకపోవడమే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను దిగజారుస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మాణంలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. 6 కాలేజీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. పులివెందులలో కాలేజీ ప్రారంభమయ్యేనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఆ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాసింది. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయాలని విధాన పరమైన నిర్ణయం తీసుకున్న కూటిమి ప్రభుత్వం ఇందులో భాగంగా తొలి విడతగా 4 కాలేజీలకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ లేఖలు కూడా పిలిచింది. ఆ నేపథ్యంలో.. ప్రజారోగ్యం, విద్య రెండూ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి, వాటిని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుందన్న విధానంతో వైఎస్సార్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ విద్య పేదలకు అందని ద్రాక్ష అవుతుంది కాబట్టి... ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన నేపథ్యంలో... మా పార్టీ అధ్యక్షుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్బంగా విశాఖ పట్నం విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి వెళ్లేంత వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్జగన్ కు మద్ధతు తెలిపారు. ప్రజా స్పందన చూసిన తర్వాత... ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తద్వారా సామాన్య ప్రజలకు వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులో ఉంచాలి. ప్రజలు మిమ్నల్ని ఎన్నుకున్న పాపానికి వారికి ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయవద్దని కోరుతున్నాం. ప్రజలు మిమ్నల్ని ఐదేళ్ల పాలించమని ఎన్నుకున్నారే తప్ప.. యాభై ఏండ్లకు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎందుకు చేయడం లేదంటే.. నిధులు లేవని సాకులు చెబుతున్నారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకా మరో రూ.6వేల కోట్లు అవసరం అవుతాయి. దానికి నిధులు లేవని చెబుతున్నారు. కానీ 16 నెలల కూటమి పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు? ఎవరికి దోచిపెట్టారు? అవి సరిపోక ఇంకా ప్రైవేటు కాలేజీలను కూడా దోపీడీ చేసి తాబేదార్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ప్రజలు మీ తప్పిదాలను క్షమించరు. పేద ప్రజల ఉసురు పోసుకోవద్దు.గిరిజన విద్యార్దినుల పై నిలువెత్తు నిర్లక్ష్యం...ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఇంతమంది పిల్లలు ఒకే స్కూల్ నుంచి ఆసుపత్రి పాలైవడం ఎప్పుడైనా జరిగిందా? 170 మంది పిల్లలకు ఒకేసారి జాండిస్ రావడమా? ఎంత నిర్లక్ష్యం? ఎంత పర్యవేక్షణ లోపం? ఇదేనా పరిపాలన? ఇద్దరు చిన్నారులు చనిపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకో 15 మంది పిల్లలకు జాండిస్ అని తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఐదేళ్లలో కలుషిత ఆహారం, ఆనారోగ్యం వంటి ఘటనలు ఎప్పుడైనా జరిగితే...అందుకు పది శాతం ఎక్కువగా కేవలం ఈ 16 నెలల కాలంలోనే జరిగాయి. ప్రభుత్వ పనితీరుకు, విద్యార్ధుల మీద ఉన్న శ్రద్దకు, ప్రభుత్వ విధానానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులు పిల్లల మీద దృష్టిపెట్టాలని బొత్స సూచించారు. ప్రజల్లో నిరాస, నిస్పృహలు వస్తే ఏం జరుగుతుందో పక్క దేశంలో చూశామని.. . కాబట్టి బాధ్యతతో మెలగాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జూనియర్ కళాశాల విద్యార్థినులు
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ కుమరాపు జనార్దనరావు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన పోటీల్లో వాలీబాల్ విభాగానికి సంబంధించి మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన టి.సూర్యకుమారి, ఎ.నిరోషి, ఎం.గౌతమి, ఎస్.జయశ్రీ, బి.వెంకటలక్ష్మి, సీహెచ్ పవిత్ర, కబడ్డీలో ఎస్.యశోని, స్విమ్మింగ్లో ఎల్.కల్పనలు అండర్–19 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినులను కళాశాల ఆవరణలో అభినందించారు. రాష్ట్రస్థాయిలో కళాశాలకు మంచి పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ప్రిన్సిపాల్తోపాటు పీఎస్ఎన్గుప్త, ప్రసన్నకుమార్, అనిల్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. -
మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘
విజయనగరం క్రైమ్: జిల్లాలోని తెర్లాం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బి.నాగభూషణరావు కుటుంబానికి ‘చేయూత’ సహాయం ద్వారా రూ.1,48,600ల చెక్కును ఆయన భార్య ధనలక్ష్మికి ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్లో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సిద్ధగా ఉన్నామన్నారు. ఇందుకోసం ప్రతి సిబ్బంది స్వచ్ఛదంగా ముందుకు వచ్చి వారి నెలవారి జీతంలోకొంత నగదు పోగు చేసి ఇస్తుండడం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ తరహా చర్యలు పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెంచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించడమేనన్నారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుతో ఇద్దరికి అస్వస్థతబొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామంలో గురువారం సాయంత్రం ఇంటిడాబాపై పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన సింగవరపు సీతారాం, సీహెచ్.ఆదినారాయణలు ఇంటి డాబాపై పని చేస్తుండగా సాయంత్రం ఉరుములు, మొరుపులతో భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రసుత్తం ఇద్దరి పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. షిప్యార్డ్లో ఉద్యోగాలకు శిక్షణపార్వతీపురంటౌన్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్యార్డ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 3 నెలల నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లో ఐటీఐ అభ్యర్థులకు 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చి షిప్ యార్డులో ఉద్యోగం కల్పిస్తున్నట్లు వివరించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్ 9676965949 నంబర్ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో కోరారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు, యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎన్సీసీ గ్రూప్ కమాండింగ్ అధికారి సుమంత్ రాయ్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్సీసీలో చేరాలన్నారు. అనంతరం బీహార్కు బదిలీపై వెళ్తున్న ఎన్సీసీ కమాడింగ్ అధికారి కల్నల్ తపస్ మండల్ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. అలాగే కొత్త కమాండింగ్ అధికారి సుమంత్రాయ్కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, వైస్ చాన్సలర్ ప్రశాంత్కుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి తదితరులు పాల్గొన్నారు. గడ్డి మందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్యవీరఘట్టం: మండలంలోని చిదిమి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బౌరోతు సాయి(23) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై జి.కళాధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి. కాంచన అనే ఆమెతో ఏడాది క్రితం సాయికి వివాహం జరిగింది. బార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు మోహనరావు, విజయల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు
కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ భవన్ మందిర్ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయష్మాన్ భవన్ కార్యాలయంలో గల కంప్యూటర్ల పరికరాలైన సీపీయూ, కీబోర్డులు చోరీకి గురైనట్లు సంబంధిత సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గుమ్మ గ్రామ సమీపంలో చిట్టిగెడ్డ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న బర్లి చందు, సింగమహంతి అవినాష్లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. చోరీ చేసిన కంప్యూటర్ పరికరాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. దర్యాప్తులో ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ శేఖర్మధు పాల్గొన్నట్లు చెప్పారు. -
బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్న చోట కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, తయారీ పరిస్థితులపై పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం ముగ్గురు తయారీదారులు, 15 మంది హోల్సేల్ విక్రేతలు ఉన్నారని తెలియజేశారు. ఆర్డీఓలు డి.కీర్తి, మోహనరావు, ఆశయ్య తమ పరిధిలో జరుగుతున్న విక్రయాలపై వివరాలు సమర్పించారు.కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాణసంచా విక్రయం ఏ స్థాయిలోనైనా నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులపై పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో జరిగే విక్రయాలను వీఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు. అనుమతి పొందిన విక్రేతలు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నీరు అందుబాటులో ఉంచాలి. ఫైర్ సిలిండర్ లభ్యతను నిర్ధారించాలని కలెక్టర్ చెప్పారు. తాత్కాలిక విక్రయాల ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్ళేందుకు తగిన ఖాళీ ఉంచాలని, టెంట్లకు బదులు రేకులతో షెడ్లు నిర్మించాలని సూచించారు. విక్రేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలు వివరించాలని ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, డీఎస్పీ వీర్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాలు -
రూ.1.80 కోట్లతో పైడితల్లి ఆలయ పునర్నిర్మాణం
● వచ్చే ఏడాది పండగలోపు పనులు పూర్తి చేస్తాం.. ● ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్గజపతిరాజు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటీ 80 లక్షల రూపాయల సీడీఎఫ్ నిధులతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది పండగ నాటికి భక్తులకు ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. వారు సంతోషించేలా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి కీర్తిని, ప్రతిష్టను మరింత పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఆలయ భూసేకరణ పూర్తయ్యిందన్నారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు అవకాశం కలిగిందని, పనులను వేగంగా నిర్వహించి ఏడాదిలోపే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయ విస్తరణ వలన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఆలయ ఈవో కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. -
అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు
విజయనగరం: పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని విజయనగరం నగర పాలక సంస్థ ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె.సాంబమూర్తి అన్నారు. ఈ నెల 14న మంగళవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశామని తెలిపారు. నగరంలోని వనంగుడి ప్రాంతంలో ఉన్న ఘాడీఖాన సమీపంలో ఉన్న పెద్ద చెరువు గట్టు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాలను గురువారం చేపట్టారు. ముఖ్యంగా తెప్పోత్సవానికి ప్రారంభ వేదికగా ఉన్న గట్టు ఇతర ప్రాంతాల్లో చెత్త చెదారాలను తొలగిస్తున్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన అంశమని ఆయన అన్నారు. పారిశుధ్య పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. 13నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు విజయనగరం గంటస్తంభం: మహిళా హక్కుల కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర స్థాయి 16వ మహాసభలు ఈ నెల 13, 14, 15 తేదీలలో అనంతపురంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ నగర్లో గురువారం ఐద్వా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఐద్వా మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ సమాజంలో మార్పు తీసుకువస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహిళలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పుణ్యవతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ యువతకు ఉద్యోగ అవకాశాలు విజయనగరం టౌన్: నిరుద్యోగ మైనారిటీ యువతకు హోమ్కేర్ నర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఓవర్సీస్ మెన్ పవర్ కంపెనీ ఖతర్, దోహా దేశాల్లో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ, జీఎన్ఎం అర్హత కలిగి 21 నుంచి 40 ఏళ్లలోపు సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పాస్పోర్ట్, విద్యార్హతల సర్టిఫికెట్, అనుభవం సర్టిఫికెట్ తప్పనిసరన్నారు. వివరాలకు కలెక్టరేట్లో ఉన్న మైనారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భగవద్గీత ఆధునిక యువతకు జ్ఞానదీపిక విజయనగరం టౌన్: ఆధునిక యువతకు భగవద్గీత ఒక జ్ఞానదీపికని, దాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుసరించాలని ప్రముఖ ఆధ్యాత్మిక శిరోమణి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై కామరాజ్ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె గురువారం ప్రసంగించారు. భగవద్గీత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, దాని ప్రకారంగానే మానవ మనుగడ అభివృద్ధి దిశలో అడుగులేస్తుందన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆమెకు జిల్లాలోని పలువురు అభినందనలు తెలిపారు. -
కరుసైపోయావా నాగార్జునా..!
–IIలో4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలిమారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జేసీ ఆదేశించారు.పాడి రైతులపై దాడి కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తన మటుకు తాను పడుకున్న సింహాన్ని జూలు పట్టి లాగి లేపి బక్కిరించుకున్నట్టు అయ్యింది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కిమిడి నాగార్జున పరిస్థితి. ఆత్మ గౌరవం.. ఆవకాయ బద్ద అనుకుంటూ ఏదేదో ఊహించుకొని అనవసరంగా ముళ్ల కంపలో పడినట్టు అయిపోయింది. దశాబ్దాలుగా డీసీసీబీ కాంపౌండ్లో కూర్చుని సిరిమానును చూసే సత్తిబాబును నాగార్జున తన ఉనికి కోసం అక్కడ నుంచి ఖాళీ చేయించి పాత అర్బన్ బ్యాంకు భవనం ప్రాంగణానికి మార్పించారు. ఇదేమయ్యా.. అంటే డీసీసీబీ వాళ్ల జాగీరు కాదు.. ప్రస్తుతం నా కంట్రోల్లో ఉంది.. నా కార్యకర్తలు, మా పార్టీ డైరెక్టర్లు, చైర్మన్లు వచ్చి కూర్చుంటారు.. మేం కూడా సిరిమానును చూస్తాం.. ఇది మా ఆస్తిత్వం.. ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అంటూ ఏదేదో చెప్పారు. ఈ అంశంపై సత్తిబాబు పెద్దగా ఏమి స్పందించకుండా ప్రభుత్వం కేటాయించిన జాగాలోనే కూర్చుని సిరిమాను చూసేందుకు సిద్ధమయ్యారు. ఆ అర్బన్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నాసిరకం కావడం.. నేల చదును చేయకపోవడం వంటి కారణాల వల్ల వేదిక అలా కిందికి దిగిపోగా బొత్స సత్తిబాబుతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు బెల్లాన చంద్రశేఖర్, సురేష్బాబు, బొత్స అప్పలనర్సయ్య వంటి వాళ్లు వేదిక పైనుంచి పడిపోయారు. ఈ సంఘటన సిరిమానోత్సవం రోజు పెద్ద చర్చనీయాంశమైంది. చక్కగా డీసీసీబీ ప్రాంగణంలోనే కూర్చుని సిరిమాను చూసే సత్తిబాబును వేరే చోటకు మార్పించి, అక్కడ సరిగా ఏర్పాట్లు చేయలేదన్న అంశం ప్రజల్లోకి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో చిత్రం ఏమిటంటే సిరిమాను కదిలేటపుడు ఎప్పట్లానే రాజ కుటుంబీకులు కూర్చునే కోట వద్ద.. ఇంకా ఈసారి సత్తిబాబు కూర్చున్న అర్బన్ బ్యాంకు వద్ద కొన్ని క్షణాలు ఆగి కాస్త వంగి ఆశీర్వదించి వెళ్లింది తప్ప డీసీసీబీ వద్ద అర క్షణం కూడా నిలవలేదు. అంటే సత్తిబాబు ఎక్కడ కూర్చున్నా.. ఆయన ప్రాధాన్యం, గౌరవం ఏమాత్రం తగ్గదని మరోసారి రుజువైంది. వ్రతం చేసినా.. ఫలితం దక్కలేదు.. అశోక్కు ఎదురుగా టెంట్ వేయడమా.. ఎంత ధైర్యం! డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున సెల్ఫ్ గోల్ -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్కుగాను 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, పంట కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పంట రకం, దిగుబడి వచ్చే సమయం, సేకరణపై మండల స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. మద్దతు ధర, ట్రక్ షీట్ విధానం తదితర అంశాలపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారి మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీను తీసుకోవడం, అన్ని మిల్లుల పని చేస్తున్నదీ.. లేనిదీ.. తనిఖీ చేయడం, సీఎస్డీటీలకు శిక్షణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలన్నారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, వర్షాలు పడితే టార్పాలిన్లు సరఫరా చేయడానికి మండల కేంద్రాల్లో సిద్ధం చేయాలని మార్కెటింగ్ ఏడీ రవికిరణ్కు సూచించారు. పీఏసీఎస్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి 57 సోసైటీలు సిద్ధంగా ఉన్నాయని వాటికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ బొడ్డేపల్లి శాంతి, ఆర్డీవోలు కీర్తీ, రాంమోహన్, జిల్లా వ్యవసాయ అఽధికారి, జిల్లా సహకార అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమృద్ధిగా తాగునీటి సరఫరా
● జెడ్పీ సీఈవో సత్యనారాయణ మెరకముడిదాం: గ్రామాల్లో తాగునీటిని సమృద్ధిగా సరఫరా చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ అధికారులకు సూచించారు. మెరకముడిదాంలో కోటి 15 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఇంటింటి కుళాయిలను ఎన్జేజేఎం టీమ్ ఎంపిక చేసిన స్కీమ్స్పై గురువారం నిర్వహించిన జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా అధికారులు బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా గ్రామంలో శివాలయం వద్ద, రామాలయం వద్ద వున్న వీధి కుళాయిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో గ్రంథాలయాన్ని ఆనుకొని వున్న 120 కె.ఎల్ పరిమితి గల తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకును పరిశీలించారు. అనంతరం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన రికార్డులను, ఎంపీడీవో కార్యాలయ రికార్డులను సీఈవో పరిశీలించారు. జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరా సంతృప్తికరంగా వుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీలత, ఎంపీడీవో గొర్లె భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివబాబు, ఈవోపీఆర్డీ శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి పూజారి మృతి
గరుగుబిల్లి: చెరువులో స్నానానికి దిగిన ఓ పూజారి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. గరుగుబిల్లి మండలంలో గురువారం జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై ఫకృద్ధీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లిలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన తెలగవీధిలోని రామమందిరం ఆలయ పూజారిగా పనిచేస్తున్న సంగం చంద్రశేఖర్ (53) స్నానానికి బోటువాని చెరువులో దిగుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది సమయం తరువాత చెరువులో చంద్రశేఖర్ మునిగిపోయినట్లు స్థానికులు గుర్తించి స్థానిక ఎస్సైకి సమాచారం అందించడంతో ఆయన సిబ్బందితో వచ్చి మృతదేహం కోసం స్థానికుల సహయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు గ్రామంలో సర్పంచ్ బొంతాడ మహేశ్వరరరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికిచ మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆలయ పూజారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వేపాడ: మండలంలోని బానాది గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు (32) కోనేరులో జారిపడి గురువారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు తల్లి ఎర్రయ్యమ్మచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లింది. బట్టలు మూటకడుతుండగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆంజనేయులు కాలుజారి కోనేరులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఎర్రయ్యమ్మ ఫిర్యాదుపై వల్లంపూడి హెచ్సీ శివకేశవరావు కేసు నమోదుచేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. -
4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను వేగంగా అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ తొలిదశలో భాగంగా వాహనాలు వెళ్లే సౌకర్యం ఉన్న కొమరాడ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పది గ్రామాల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ఉపాధిహామీ పథకం కింద రోడ్లు నిర్మించి, పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇంటర్ నెట్తో ముడిపడి ఉన్నందున ఏ గ్రామంలోనూ సిగ్నల్ సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు. టవర్ల ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే ఉన్న టవర్ల సిగ్నల్ సమస్యలను కూడా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్సప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి, డీఎంజీఓ శ్రీనివాసరావు, పలు మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి -
కోటదుర్గమ్మ దసరా ఆదాయం రూ.32,93,397
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా రూ.32,93,397 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో సూర్యనారాయణ గురువారం తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ.17,98,058 ద్వారా వచ్చిందని తెలిపారు. కుంకుమార్చనల టికెట్ల ద్వారా రూ.2,61,650, అంతరాలయం టికెట్ల ద్వారా రూ.1920, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.3,01,400, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.4,71,240ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పూజలు, ఘటాలు, కేశ ఖండన తదితర ఇతర టికెట్ల ద్వారా రూ.4,62,609 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ.24,47,839లు సమకూరిందని వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.8,45,558 ఆదాయం అధికంగా వచ్చిందని తెలిపారు. -
దగాపడ్డ అన్నదాత!
తన పొలంలో సగం కంకులు బయటకు వచ్చాయని చూపుతున్న రైతు వసంతల బంగారునాయుడు రామభద్రపురం: వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న అన్నదాతకు అటు ప్రకృతి, ఇటు చీడపీడలతో కష్టాలు తప్పడం లేదు. ఇదే సమయంలో నాసిరకం విత్తనాలు వేసి పంటలు దిగుబడులు లేక అన్నదాత మరింత గగ్గోలు పెడుతున్నాడు. గత ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు కూడా నాణ్యమైనవేనని రైతన్నలు నమ్మారు. తాము తెచ్చిన విత్తనాలు నాసిరకం విత్తనాలు అని తెలుసుకోలేకపోయారు. వ్యవసాయాధికారులు 1121 రకం తక్కువ కాలంలో పంటకొస్తుంది.. 125 రోజులలో పంట కోసుకోవచ్చు అనేసరికి ఆనంద పడ్డారు. కానీ కాల పరిమితికి ముందు 30 నుంచి 40 శాతం వరకు దుబ్బులు నుంచి కంకులు బయటకు వచ్చేశాయి. అంతే కాకుండా వీటిలో 20 శాతం వరకు కంకులు పూర్తిగా పండిపోయి ఎర్రబారాయి. మిగిలిన 60 శాతం నుంచి 70 శాతం వరకు కొన్ని దుబ్బులు పొట్ట దశ, మరికొన్ని దుబ్బులు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఈ 60 నుంచి 70 దుబ్బులు కంకులు బయటకు వచ్చేందుకు దాదాపు 15 రోజులు పైబడి పడుతుంది. ఈ లోగా పూర్తిగా పండిపోయిన కంకులలోని గింజలు పూర్తిగా రాలిపోతాయి. చిరు పొట్ట దశలో ఉన్న మొక్కల నుంచి కంకులు బయటకు వచ్చేసరికి పొట్టదశలో ఉన్న కంకులు పూర్తిగా బయటకు వచ్చేసి ముదిరి రాలిపోయే అవకాశం లేకపోలేదు. దాంతో దిగుబడి పూర్తిగా పడిపోయి రైతులు నష్టాలు చవిచూడక తప్పదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2600 ఎకరాలలో 1121 రకం సాగు.. రామభద్రపురం మండలంలో ఏపీ సీడ్స్ సంస్థ సుమారు 803 క్వింటాళ్ల 1121 రకం వరి విత్తనాలు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ల ద్వారా రైతులకు సరఫరా చేయగా 2600 ఎకరాలలో నాట్లు వేసినట్టు అధికార సమాచారం. గత ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసే ముందు సర్టిఫై చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేది. ప్రస్తుతం సాగులో ఉన్న 1121 రకం వరి పంటలు చూస్తే అసలు ఈ ప్రభుత్వం సర్టిఫై చేయకుండా నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేసినట్లుందని రైతులు విమర్శిస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్క ప్రకారం సాధారణంగా 1121 రకం వరి దాదాపు 125 రోజులకు పంటకొస్తుంది. అయితే పంట ప్రస్తుతం కొన్ని దుబ్బులు కంకులు బయటకు వచ్చి పండేస్తున్నాయి. మరి కొన్ని దుబ్బులు అసలు కంకులే బయటకు రాలేదు సరికదా పొట్టదశకు రాకపోవడం చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పరిశీలించిన ఏపీ సీడ్స్, వ్యవసాయాధికారులు 1121 రకం వరి సాగులో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్న విషయాన్ని సాక్షి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో వ్యవసాయ శాఖ ఏవో ఎం.శివ, ఏపీ సీడ్స్ ఫీల్డ్ సూపర్వైజర్ పల్లి చంద్రశేఖర్ రైతు పొలంలోకి వెళ్లి పరిశీలించారు. రైతు చెప్పినట్టుగానే కొన్ని దుబ్బులు కంకులు రావడం, మరి కొన్ని దుబ్బులకు కంకులు రాకపోవడం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దిగుబడి తగ్గిపోతుంది.. ఆర్ఎస్కేలో కొనుగోలు చేసిన నాసికం వరి విత్తనాలు నాటి మోసపోయాను. ఎకరా 50 సెంట్లు భూమిలో 1121 రకం వరి వేశాను. ఎకరా విస్తీర్ణంలో పొట్టదశలో ఉంది. మిగతా 50 సెంట్లు మడిలో సగం కంకులు వచ్చి పండిపోతున్నాయి. మిగతా సగం పొట్టదశలో ఉంది. పూర్తిగా కంకులు వచ్చేసరికి ముందుగా వచ్చిన కంకులలో గింజలు రాలిపోతాయి. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాను. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడ్డాం. చివరకు దిగుబడిపై ప్రభావం చూపడంతో నష్టపోతున్నాం. – చుక్క అప్పలనాయుడు, రైతు, రామభద్రపురం -
తండ్రిని చంపిన తనయుడు
బాడంగి: వ్యసనాలకు బానిసైన కొడుకు మద్యం కోసం డబ్బు లివ్వలేదని కన్నతండ్రినే హతమార్చాడు. బాడంగిలో జరిగిన ఈ విషాదకర సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని సినిమా కాలనీలో నివాసముంటున్న బలిజిపేటకు చెందిన బోనుగిరి రాజేశ్వరరావు(70)ను చిన్నకుమారుడు లక్ష్మణరావు చెప్పులు కుట్టుకునే గూటంతో కొట్టి హతమార్చాడు. మద్యం కొనుగోలుకోసం డబ్బులిమ్మని అడగ్గా తండ్రీకొడుకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఆవేశపరుడైన కుమారుడు చెప్పులు కుట్టే గూటంతో తండ్రి చెవిపైన బలంగా కొట్టగా తండ్రి రాజేశ్వర రావు స్పృహకోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలాడు. గురువారం తెల్లవారుజామువరకు ఈవిషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి సాధారణ మరణంగా నమ్మబలికే ప్రయత్నం చేశారు. కుమారుడే కాలయముడన్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసిపోవడంతో చేసేదిలేక హతుడి భార్య ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా పెద్దకుమారుడు గతంలో రైలు ప్రమాదంలో చనిపోగా కుమార్తెకు వివాహంచేసి అత్తవారింటికి పంపారు. చిన్నకుమారుడు లక్ష్మణరావు సిమెంట్పని, పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వ్యసనాలకు బానిసగా మారి తరచూ తల్లిదండ్రులతో తగాదాలు పడుతుంటాడని ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు తెలిసింది. హత్య సంఘటనపై సమాచారం అందుకున్న బొబ్బిలి రూరల్ సీఐ నారాయణ రావు, ఎస్సై తారకేశ్వరరావు, డీఎఎస్పీ భవ్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
పాడి రైతులపై దాడి
గంట్యాడ: కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నిన్న, మొన్నటి వరకు తమ ప్రతాపాన్ని చూపించిన కూటమి నేతలు తాజాగా పాడి రైతులపై కూడా అరాచకానికి తెరలేపారు. దీంతో కడుపు మండిన రైతులు తీవ్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రతిఘటించారు. పశువుల శాలలు తొలగించే ప్రయత్నం నీలావతి గ్రామంలో పాడి రైతులకు చెందిన పశువుల శాలలను తొలగించేందుకు గురువారం ప్రయత్నించారు. ఈ మేరకు ఉదయం 7 గంటలకే భారీగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో సహా గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత గ్రామంలో ఉన్న 25 మంది పశువుల శాలలను తొలగించాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు దారు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అధికారులు కూడా పశువులు శాలలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన విధంగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల శాలలను రెవెన్యూ అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. మరో వైపు జేసీబీతో శాలను తొలగించేందుకు దించుతుండగా మహిళలు, రైతులు జేసీబీని అడ్డుకున్నారు. పశువులకు, మాకు గోతులు తీసి అందులో పాతిపెట్టిన తర్వాత మీరు పశువుల శాలలను తొలగించుకోండి. మా లాంటి పేదవారి ఉసురు కచ్చితంగా మీకు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రప్రయత్నం చేసిన అధికారులు పశువుల శాలలను ఏవిధంగా నైనా తొలగించేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది పశువుల శాలలకు చెందిన చెక్కలు, కర్రలు, కమ్మలు తొలగించడంతో రైతులు అడ్డుకోగా మరోవైపు జేసీబీతో శాలలను తొలగించేప్రయత్నం చేశారు. ఉదయం7గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వర్షాకాలం ఉన్న పళంగా వెళ్లిపోమంటే పశువులను ఎక్కడ కట్టాలి. వట్టి గడ్డిని ఎక్కడ వేయాలి. మాకు నెలరోజులు సమయం ఇవ్వండని రైతులు తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిని కోరారు. నా చేతిలో ఏమి లేదు, నేను ఏమీ చేయలేనని ఆయన అనడంతో అయితే మాపీకలు కోసేసి మీరు శాలలు తీసుకోండని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. నీలావతి గ్రామంలో పశువుల శాలల తొలగింపు యత్నం తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు జేసీబీల అడ్డగింత వెనుదిరిగిన పోలీస్, రెవెన్యూ అధికారులు -
గోడకూలి మహిళ..
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు బొబ్బిలి: పట్టణంలోని గొల్లవీధి జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఎరుకల వీధికి చెందిన తోనంగి అప్పయ్యమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా కూలీలు రామలక్ష్మి, పొందూరు లక్ష్మణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్సై రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్న వారు ముగ్గురు ఎప్పటిలాగానే లక్కోజు శ్రీనివాసరావు ఇంటి పనులు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటుకల గోడ నానిపోయి పనిచేస్తున్న వారిపై పడగా అప్పయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, లక్ష్మణ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు, అప్పయ్యమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.అప్పయ్యమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. -
● మరో టెంట్..
ఇదిలా ఉండగా దశాబ్దాల నాటి నుంచి తెలుగుదేశానికి సిరిమానోత్సవం వేళ వీక్షించేందుకు ఒకే ఒక్క టెంటు ఉంటూ వస్తుంది. అశోక్గజపతిరాజుగానీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరత్రా నాయకులంతా కూడా అశోక్ కూర్చునే కోట బురుజు మీదకు వెళ్లి ఆయనతో పాటు కూర్చుని సిరిమానును వీక్షించేవారు. అంతేగానీ టీడీపీకి ఎంత ఎక్కువ మంది నాయకులున్నా.. ఇంకో టెంట్ అనేది వేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. అంతేకాకుండా అశోక్ను కాదని వేరే టెంట్ కింద నిలబడేందుకు కూడా టీడీపీ కార్యకర్తలకు ధైర్యం లేదు. నాగార్జునకు ఆ ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట నాగార్జున కొత్తగా టెంట్ వేసి అశోక్గజపతికి ఎదురుగా కూర్చుని జనానికి విక్టరీ సింబల్ చూపిస్తూ నిలబడడం ఆయన కేరీర్ పాలిట పెనుముప్పు అని ఆ పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు. నాగార్జున కూడా కోట పైకెక్కి అశోక్గజపతి కుర్చీ వెనకాల కూర్చుని సిరిమానును చూస్తే అయిపోయేది కదా.. కొద్ది గంటల కార్యక్రమం కోసం నాగార్జున ఏకంగా అశోక్ గజపతి కళ్లలో ఎందుకు పడాలి.. సొంతంగా ఎందుకు టెంట్ వేయాలి.. ఇదంతా ఆయన రాజకీయ భవిష్యత్కు ఇబ్బంది కాదా.. అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున కూర్చున్న డీసీసీబీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరత్రా నాయకులంతా అశోక్గజపతి వెనకాల కూర్చుని సిరిమాను చూశారు. మచ్చుకై నా ఒక్క ఎమ్మెల్యే కూడా నాగార్జున దగ్గర కూర్చుని కాసేపైనా ఉన్నారా... అంటే అదీ లేదు. నాగార్జున, కొద్ది మంది పీఏసీఎస్ డైరెక్టర్లు.. కొందరు చోటా నేతలు తప్ప ఆయన దగ్గర ఎవరూ లేరు. ఇదంతా చూస్తుంటే నాగార్జున సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అని కొందరు ఆ పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమిటో నాగార్జున చేసిన పని చూస్తుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్టుగా ఉందని కొందరు లోలోన గుసగుసలాడుతున్నారు. ఇంకో చిత్రం ఏమంటే... -
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్లో విజేతలుగా నిలవాలి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 10 నుంచి 12 వరకు పశ్చిమగోదావరి జిల్లా రాజమండ్రిలో అండర్ 14,17 బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు, ఈ నెల 10 నుంచి 12 వరకు బాపట్ల జిల్లా రేపల్లెలో జరగబోయే అండర్ 14 తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. వారికి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వర్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముందుచూపు అవసరం
● కళ్లను పరిరక్షించుకోవాలి ● కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమే ● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి కళ్లు, కంటి చూపు కోల్పోతే జీవితం అంధకారమే. ప్రకృతి అందాలను సైతం చూడలేని పరిస్థితి. అందువల్ల నేత్రాల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వివిధ రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చాలా మందికి దృష్టి లోపం సమస్య వస్తోంది. ప్రపంచంలో ప్రతి ఒక సెకెనుకు ఒక వ్యక్తి దృష్టి కోల్పోతున్నాడు. వివిధ కారణాలతో ప్రతి ఒక నిమిషానికి ఒక చిన్నారి దృష్టి కోల్పోతున్నాడు. 2022వ సంవత్సరంలో నిర్వహించిన సర్వే అధారంగా భారత దేశంలో 49 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. అదేవిధంగా 3.50కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది సకాలంలో నేత్ర పరీక్షలు చేసుకోవడం ద్వారా దృష్టి లోపాన్ని నివారించగలిగారు. ఒక వ్యక్తి అంధత్వం బారిన పడడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.1,70, 624 నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు ద్వారా ఎంతో మందికి చూపు కంటి ప్రాధాన్యతను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మందిని అంధత్వం బారిన పడకుండా సకాలంలో కంటి పరీక్షలు నిర్వహించి వారికి చూపును ప్రసాదించింది. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చేయించింది. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటి వెలుగు కార్యక్రమానికి మంగళం పాడేసింది. 2,92,462 మంది విద్యార్థులకు తొలివిడతలో పరీక్షలు డా.వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తొలివిడతలో 3357 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2,92,462 మంది విద్యార్ధులకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రెండోవిడతలో13,109 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3844 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి కంటి అద్దాలు అందించారు. మెల్ల కన్ను శస్త్రచికిత్సలు 18 మందికి, కంటి శుక్లం శస్త్రచికిత్సలు ఐదుగురికి, రెప్పవాలడం శస్త్రచికిత్సలు 20 మందికి నిర్వహించారు. కంటివెలుగు మూడో విడతలో1, 79, 890 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 28, 213 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరం కాగా చేశారు. 43,938 మంది అవ్వాతాతలకు కళ్లజోళ్లు అందించారు.కంటిసమస్యల పట్ల నిర్లక్ష్యం కూడదు కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది కంటి సమస్యలకు పసర మందులు, నాటు వైద్యులను అశ్రయిస్తుంటారు. దీని వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కంటి సమస్యలు వచ్చినప్పడు దగ్గరలో ఉన్న కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కంటి సమస్యలకు సొంత వైద్యం చేయకూడదు. -
నదిలో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పై నుంచి నాగావళి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కళ్లేపల్లి జగదీష్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 7వ తేదీన గరుగుబిల్లి మండలం రావివలస వద్ద చేపల వ్యాపారం ముగించుకుని అదే మండలం మగ్గూరు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో భార్యాభర్తల మద్య తగాదా రావడంతో జగదీష్ వంతెనపై నుంచి దూకేసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక హెచ్సీ దూసి రాములు ఆధ్వర్యంలో పోలీసులు, గజ ఈతగాళ్లు రుషింగి, తలగాం, శివ్వాం తదితర ప్రాంతాల వద్ద నాగావళి నదీతీరంలో గాలింపు చేపట్టారు. చివరికి వీరఘట్టం మండలం మొట్ట–వంగర మండలం సంగాం గ్రామాల సమీపంలో నాగావళి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలిస్తున్నట్లు హెచ్సీ దూసి రాములు తెలిపారు. -
గిరిసీమకు దారేదీ?
పార్వతీపురం రూరల్: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఆధునిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికీ కనీస రహదారి సౌకర్యం కలగానే మిగిలిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 226 గ్రామాలకు సరైన దారి లేక అక్కడి ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వాగులు, వంకలు, కొండలు, గుట్టలే వారికి శ్రీరామరక్షగా మారాయి. ప్రభుత్వ పాలకుల హామీలు నీటి మీద రాతల్లా మిగులుతున్నాయే తప్ప, వారి తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజనం కన్నీటి పర్యంతమవుతోంది. అడుగు బయటపెడితే అష్టకష్టాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల దుస్థితికి అద్దం పట్టే గ్రామాలు కోకొల్లలు. ప్రధానంగా 63.30 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించా ల్సి ఉన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నా యి. మరీ ముఖ్యంగా, 52 గ్రామాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, వాటికి కనీసం కాలిబాట కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వ ర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర వైద్యం అవసరమైతే డోలీలే వారికి అంబులెన్సులు. చదువుకోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాల న్నా, కిలోమీటర్ల కొద్దీ బురద, రాళ్ల మధ్య ప్రాణాల ను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిందే. గ్రామాల వారీగా గణాంకాలు అధికారిక లెక్కల ప్రకారం, కురుపాం, మక్కువ, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు మండలాల పరిధిలో 25 గ్రామాలకు రోడ్లు లేవు. సాలూరు మండలంలోని గంజాయిభద్ర, నేరెళ్ల వలస, కొదమ, సారిక వంటి పంచాయతీలలోని 14 గ్రామాలకు రహదారి నిర్మాణం అత్యవసరం. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురం వంటి అనేక మండలాల్లోని గిరిజన గ్రామాలది కూడా ఇదే దుస్థితి. ప్రతి ఏటా అధికారులు సర్వేలు చేయడం, ప్రతిపాదనలు పంపడం సాధారణ ప్రక్రియగా మారిందే తప్ప, ఆచరణలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల కొరతో, అటవీ అనుమతుల జాప్యమో కారణం ఏదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అమాయక గిరిజనులు. ఇటీవల బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాలతో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ దఫా అయినా పనులు చేస్తారా? లేదా ఎప్పటిలాగానే చేసిన సర్వే లేక్కలు కాగితాలకే పరిమితమవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి. పాలకుల ప్రగల్భాలు.. సంక్షేమ రాజ్యమని, సుపరిపాలన అందిస్తున్నామని ఊదరగొట్టే పాలకుల మాటలకు, గిరిజన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా, జిల్లాలోని 226 ఆదివాసీ గ్రామాలకు కనీసం కాలిబాటను కూడా నిర్మించలేని ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అంటూ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. గిరిజనుల బతుకులు కన్నీటి సుడుల్లో చిక్కుకుంటే, పాలకులు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు. రహదారి సౌకర్యం లేని 226 గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధం నిత్యం నరకం చూస్తున్న ప్రజానీకం వైద్యం అవసరమైతే డోలీలే అంబులెన్సులుగిరిజనుల గోడు పట్టదా? ఎవరికై నా జ్వరం వచ్చినా, గర్భిణికి పురిటినొప్పులొచ్చినా ప్రాణాల మీద ఆశ వదులుకని డో లీలో ప్రయాణించాల్సిందే. వర్షాకాలం వస్తే మ రింత దారుణమైన పరిస్థితి. గిరిజనులు పిల్లల చదువులు, అరకొర అందించే రేషన్ అన్నీ ఆగిపోతాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన కుటమి నాయకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల కలక్టర్ ఆదేశంతో సర్వే చేసిన గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధన కార్యదర్శి -
వీఎల్ఎస్ఐ కిట్ల విరాళం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి, సింథటిక్ ప్రొఫెసర్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న డ్రీమ్ చివ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాలుగు వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా డ్రీమ్ చిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు గోపీకుమార్ బుధవారం మాట్లాడుతూ ఈ కిట్లు ఎఫ్పీజీఏ ఆధారిత చిప్ డిజైన్, పరిశీలన కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక మద్దతుతో రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఎంబెడెడ్ ఏఐ చిప్ డిజైన్, కన్జూమర్ టెక్నాలజీ చిప్ డిజైన్ ఇండస్ట్రీయల్ కంట్రోల్ చిప్ డిజైన్, డ్రోన్ చిప్ డిజైన్, మెడికల్ టెక్ చిప్ డిజైన్, అటోమోటివ్ చిప్ డిజైన్, ఫిన్టెక్ చిప్ డిజైన్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ కిట్లకు డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి ఈ మెయిల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు తమిళనాడులోని చైన్నెలో రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆంధ్ర మెడ్ టెక్ జోన్లో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తయారుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు మురళి, జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ బబులు, ఈసీ విభాగాఽధిపతి ప్రొఫెసర్ కేసీబీ రావు, ఇతర బోధకులు పాల్గొన్నారు. -
ఇతర సమస్యలతో మరణాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో నిమ్మక సుమన్, నిమ్మక ప్రశాంత్లు పచ్చకామెర్ల వల్ల కాదని ఇతర సమస్యలతో మృతి చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నివాసి నిమ్మక సుమన్ (23) సెప్టెంబర్ 14వ తేదీన గుమ్మలక్ష్మీపురల మండలం బాలేసు గ్రామానికి వచ్చాడన్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆయన గత నెల రోజులుగా నెల్లూరులో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడని, సెప్టెంబర్ 30న ఒడిశా రాష్ట్రం లోని దుర్గపాడు జలపాతాన్ని సందర్శించి, అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చాడన్నారు. అక్టోబర్ 4న జ్వరం, రెండు సార్లు విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ ఉదయం 11 గంటలకు కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రాగా వైద్యుడు పరిశీలించి అక్టోబర్ 5న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో చేర్చిన సమయానికి రోగి స్థిరంగా,చురుగ్గా ఉన్నాడని, దురదృష్టవశాత్తు అక్టోబర్ 6న అర్ధరాత్రి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ఎన్సెఫలోపతి కారణంగా మరణించాడని చెప్పారు. అదేవిధంగా నిమ్మక ప్రశాంత్ (31) జియ్యమ్మవలస మండలం చినడోడిజ గ్రామంలో అక్టోబర్ 5న తీవ్రమైన కడుపునొప్పితో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే అప్పటికే దీర్ఘకాలంగా మద్యపానం అలవాటు వల్ల మల్టిపుల్ ఆర్గానన్స్ పెయిల్యూర్ కావడంతో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్తో అక్టోబర్ 5 తేదీన రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ మరణాలు ఇతర సమస్యల కారణంగా జరిగినవే తప్ప , పచ్చకామెర్ల వల్ల కాదని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ డా. ఎస్.భాస్కరరావు -
జేసీబీతో ఇసుక అక్రమ తవ్వకాలు
బొబ్బిలిరూరల్: ఇసుక తరలింపులో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అర్ధరాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.విషయం తెలిసినా అధికార పార్టీ నాయకులు కావడంతో అధినేత ఆగ్రహానికి గురికాకూడదని అధికారులు సైతం మౌనముద్ర వహిస్తున్నారు. దీంతో ఏకంగా నదిలో జేసీబీని వినియోగించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో మంగళవారం ఆర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. దాదాపు 80 ఇసుక ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను జేసీబీతో తవ్వి తీసి కొంతమేర పట్టణంలోని కాంట్రాక్టర్లకు అమ్ముకోగా మరికొన్ని ఇసుక లోడ్లు గ్రామంలోని కొత్తకాలనీలో రహదారిపై వేశారు. అడిగితే గ్రామంలోని రహదారులేకనని నమ్మించే ప్రయత్నం చేయగా గ్రామంలో కొంతమంది ప్రతిరోజూ అలజంగిలో జరుగుతున్న ఇసుక దందాపై ఇతరులకో నీతి,అధికార పార్టీనాయకులకో నీతి అంటూ చర్చించుకుంటున్నారు. పరిశ్రమలకు రాత్రిపూట తరలింపు ఇదిలా ఉండగా గ్రోత్సెంటర్లో ఫెర్రోపరిశ్రమలకు సైతం రాత్రి వేళల్లో ఇసుక అక్ర తరలింపు జరుగుతోంది. స్టాక్ పాయింట్ నుంచి తీసుకోవాల్సిన ఇసుకను ట్రాక్టర్ల యజమానులను సంప్రదించి పెంట వద్ద వేగావతి నది నుంచి రాత్రి 11 గంటలనుంచి తెల్లావార్లూ ఇసుక అక్రమరవాణా జరుగుతోందని, రోడ్లు కొట్టుకు పోతున్నాయని సాక్షాత్తు ఆయా గ్రామాల ప్రజలు తహసీల్దార్ ముందు వాపోయారు. అయినా అధినేత అంక్షలతో చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. నా దృష్టికి రాలేదు అలజంగి గ్రామంలోని వేగావతి నదిలో మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. -
చెట్టు మీద పడి పోడు రైతు మృతి
పార్వతీపురం రూరల్/కొమరాడ: కొమరాడ మండలంలో బుధవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ రైతు మీద మామిడి చెట్టు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడాతలేసు పంచాయతీ పరిధి తీలేసు గ్రామానికి చెందిన పువ్వుల రామారావు(47) కొండపోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజులాగానే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా పెనుగాలి వీయడంతో ఓ భారీ మామిడి చెట్టు రామారావుపై పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రామారావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, డిగ్రీ పూర్తి చేసిన చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. రామారావు ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్ల సత్తా
● సాఫ్ట్బాల్లో బాలురు, బాలికలకు ప్రథమస్థానం తెర్లాం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అండర్–14 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు విశాఖపట్నం జిల్లా గొలుగుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 4 నుంచి జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొని మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరచిన జిల్లా జట్లు ఫైనల్ పోటీలకు చేరాయి. ఫైనల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు జట్టు గుంటూరు జిల్లా జట్టుతో పోటీపడి విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే జిల్లాకు చెందిన బాలికల జట్టు చిత్తూరు జిల్లా జట్టుతో ఫైనల్ పోటీలో తలపడింది. ఈ పోటీల్లో విజయనగరం బాలికల జట్టు విజయం సాధించి ప్రథమస్థానాన్ని సొంతం చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు జట్లు అత్యుత్తమ ఆటతీరును కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్తోపాటు షీల్డ్లను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుజట్ల క్రీడాకారులను జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, కోచ్లు అభినందించారు. రానున్న మరిన్ని పోటీల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -
పోలీస్స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ పోలీస్స్టేషన్లను ఎస్పీ దామోదర్ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్లలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను కొత్త చట్టాల నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన డిస్పోజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే డయల్ – 100, 112 కాల్స్ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని, వాటికి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి తక్షణమే ఘటన స్థలానికి చేరుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల్లో వృద్ధులు, మహిళల పట్ల సామరస్య పూర్వకంగా, అప్యాయంగా మాట్లాడి సమస్యలకు పరిష్కారం సాధ్యమైనంత వరకు చూపాలన్నారు. స్మార్ట్ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలందించాలని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణ, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల, బాల బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తొలుత భోగాపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను సీఐ దుర్గాప్రసాద్ ఎస్పీకి దగ్గరుండి చూపించారు. అనంతరం భోగాపురం స్టేషన్లో తనిఖీ చేశారు. అక్కడున్న ఎస్హెచ్వో దుర్గాప్రసాద్ ఎస్పీకి క్షుణ్ణంగా సిబ్బంది వ్యవహరిస్తున్న పనితీరును వివరించారు. అనంతరం డెంకాడ పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ హెచ్వో సన్యాసినాయుడును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పాపారావు, సూర్యకుమారి తదితరులు ఉన్నారు. -
జగన్ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం
విజయనగరం రూరల్: చంద్రబాబు సర్కారు కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా ఉద్యమానికి ఇచ్చిన పిలుపులో భాగంగా, గురువారం నర్సీపట్నం మెడికల్ కాలేజి పర్యటనను విజయనగరం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేస్తామని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కోలగట్ల నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని, దీంతోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అత్యున్నత విద్య, వైద్యం అందించాలనే ధ్యేయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు – నేడు, ఇంటింటికీ వైద్యం తీసుకువచ్చారన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించాలనే ధ్యేయంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి తమ హయాంలో 7 కళాశాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. నేడు చంద్రబాబు సర్కార్ 10 మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎంతో ముందుచూపుతో వ్యవహరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి తన హయాంలో పెద్దపీట వేశారన్నారు. ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను వెలుగులోకి తీసుకువస్తున్న ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలు మాని ప్రజాహిత పాలనపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఏదైనా నిరసన కార్యక్రమం చేపడితే చంద్రబాబు సర్కారు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. తామేమైనా సంఘ విద్రోహ పనులు చేస్తున్నామా, శాంతియుత నిరసనలు అడ్డుకోవడం చంద్రబాబు సర్కారుకు తగదన్నారు. ఏది ఏమైనా గురువారం నాటి జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన తథ్యమని, దీనికి జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి 100 కార్లతో పార్టీ శ్రేణులు వెళ్లి జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సూర్యనారాయణరాజు, విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్, సీనియర్ కార్పొరేటర్ ఎస్వీవీవీ రాజేష్, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన విజయవంతం చేయాలి వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల -
విదేశాల్లో విద్య, ఉద్యోగాలకు అవకాశాలు
విజయనగరం అర్బన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అఽధికారి జి.ప్రశాంత్కుమర్ తెలిపారు. ఖతార్లోని దోహీ నగరంలో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 21–40 ఏళ్ల వయసు కలిగి, బీఎస్సీ లేదా జీఎస్ఎం నర్సింగ్ అర్హతతో కనీనం రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. అక్టోబర్ 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జర్మనీ దేశంలో ఫిజియోథెరిపీ మరియు ఆపరేషన్ ఽథియేటర్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీపీటీ, ఎంపీటీ, డిప్లమా లేదా డిగ్రీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అర్హత అవసరమని వివరించారు. దీనికి అక్టోబర్ 15 తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రష్యాలోని పర్వూరల్స్కీ మెటలర్జికల్ కాలేజ్లో మెటలర్జీ కోర్సులో స్కాలర్ షిప్ ద్వారా చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. వివరాల కోసం 9492927844, 9966336206 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. 11న విజయవాడలో ఎంటీఎస్ టీచర్ల విజ్ఞాపన సభ విజయనగరం అర్బన్: 1998 డీఎస్సీ మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,072 మంది ఉపాధ్యాయులు ఈ నెల 11న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద విజ్ఞాపన సభను నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీళ్ల రామారావు, మంతిన అప్పలరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం సాధించడమే ఈ సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ, పదవీ విరమణ అనంతరం కనీస పింఛన్ సదుపాయం, వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సౌకర్యవంతమైన బదిలీలు, ఆరోగ్య కార్డుల మంజూరు వంటి అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా పాల్గొనాలని కోరారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆత్మహత్య సాలూరు: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు.. సాలూరు రేంజ్ పరిధిలో పని చేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముద్ద శ్రీకాంత్(43) పట్టణంలో బంగారమ్మ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు సేవించి.. ఉద్యోగం నిమిత్తం గుడివాడ గ్రామానికి బస్సులో వెళ్లారు. అక్కడ నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గజపతినగరం ఆసుపత్రికి అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం ఆసుపత్రిలో శ్రీకాంత్ మృతి చెందారు. మృతుని స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి భార్య నాగజ్యోతి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
చలో నర్సీపట్నంపై ముందస్తు నిర్బంధాలు
బలిజిపేట: చలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకులు హాజరు కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా ఆ పార్టీ నాయకుల ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పి.మురళీకృష్ణ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నందున దానికి మండల స్థాయి నుంచి నాయకులు హాజరు కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ అవాంతరాలు కలిగిస్తూ హుకుం జారీచేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ తన ఇంటికి బుధవారం రాత్రి వచ్చి పోలీస్ శాఖ ద్వారా ముందస్తు హుకుం జారీ చేశారని తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాకూడదని తెలియపరిచి వెళ్లిపోయినట్టు చెప్పారు. -
అక్టోబర్ 8 నుంచి సదరం శిబిరాలు : కలెక్టర్
విజయనగరం అర్బన్: దివ్యాంగుల పెన్షన్ల పునర్ మూల్యంకనలో భాగంగా అప్పీలు చేసిన లబ్ధిదారులకు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అక్టోబర్ 8 నుంచి సదరం శిబిరాలు ప్రారంభమవుతాయని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్, ఈ – క్రాప్ నమోదు, సదరం క్యాంపుల తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసిందని పేర్కొన్నారు. ఎంపీడీవోలు తమ జీఎస్డబ్ల్యూఎస్ లాగిన్ల ద్వారా లబ్ధిదారులకు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. క్యాంపుకు హాజరుకాని లబ్ధిదారులకు పెన్షన్ అందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్లు శిబిరాలను నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలని, అక్టోబర్ 8 నాటికి వైద్య బోర్దులు సిద్ధంగా ఉండాలని సూచించారు. శిబిరాలు సాఫీగా, మానవీయంగా సాగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ–క్రాప్ నమోదును ఈ నెల 25లోపు పూర్తి చేయాలని, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు విజయనగరం అర్బన్: వసతిగృహాలలో విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి హెచ్చరించారు. విద్యా శాఖ అన్ని విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతిగృహాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తాగటానికి తప్పనిసరిగా వేడి నీరు మాత్రమే అందించాలన్నారు. వంట పదార్థాలను పరిశుభ్రంగా తయారు చేసి పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి రోజు విద్యార్థుల ఆరోగ్య స్థితి పరిశీలించి సిక్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఈవో మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ ఎ.రామారావు, డీవీఈఓ తవిటినాయుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు, ఐసీడీఎస్ పీడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డీసీఎంఎస్ పట్ల అలసత్వం..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్) పట్ల కూటమి సర్కార్ అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలవడంతో పాటు అభివృద్ధి పథంలో నడిచేది. అందుకు అవసరమైన సహకారాన్ని కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పట్లో అందించింది. ప్రస్తుతం డీసీఎంఎస్లో సేవలు, వ్యాపార లావాదేవీలు గతంలో కంటే తగ్గాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కంటే సగానికి విక్రయాలు తగ్గినట్టు తెలుస్తుంది. టీడీపీ 2014 – 18 అధికారంలో ఉన్న సమయంలో కూడా డీసీఎంఎస్ను పట్టించుకోకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లింది. డీసీఎంఎస్ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలుగాని, వ్యాపార లావాదేవీలు పెద్దగా చేయకపోవడం అప్పట్లో సంస్థకు నష్టాలు తెచ్చి పెట్టాయి. 2017–18 సంవత్సరంలో రూ.1.51 కోట్లు వ్యాపారం జరిగింది. ఇందుకుగాను స్థూల ఆదాయం రూ.4.75 లక్షలు వచ్చింది. నికర ఆదాయం (లాభం) రాలేదు. రూ.2.47 లక్షలు నష్టం వచ్చింది. అదే విధంగా 2018–19లో రూ.5.16 కోట్లు వ్యాపారం చేయగా రూ.7.67 లక్షలు స్థూల ఆదాయం రాగా, నికర ఆదాయం (లాభం) కేవలం రూ.50 వేలు వచ్చింది. 2014–18 టీడీపీ హయాంలో నష్టాల్లోకి డీసీఎంఎస్ విక్రయాల పెంపునకు చర్యలు డీసీఎంఎస్ ద్వారా 2025 – 26 సంవత్సరంలో రూ.21.50 లక్షల విలువైన ఎరువులు, రూ.1.31 లక్షల విలువైన విత్తనాలు విక్రయాలు జరిగాయి. విక్రయాలు మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సాయికుమార్, బిజెనెస్ మేనేజర్, డీసీఎంఎస్ కూటమి పాలనలో తగ్గుతున్న సేవలు వైఎస్సార్సీపీ హయాంలో భేష్ గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.44 లక్షల ఎరువుల విక్రయాలు ప్రస్తుతం రూ.21 లక్షలకే పరిమితం నిర్లక్ష్యంతోనే... రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెబుతున్న కూటమి సర్కార్ డీసీఎంఎస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు ఉన్నాయి. అందువల్ల వ్యాపార లావాదేవీలు తగ్గాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో డీసీఎంఎస్ రైతులకు అండగా ఉంటూ విత్తనాలు, ఎరువులు వంటి ఎన్నో రకాలు సేవలు అందించేది. ప్రస్తుతం తగ్గిన వ్యాపార లావాదేవీలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం వ్యాపార లావాదేవీలు తగ్గాయి. 2022 – 23లో రూ.44 లక్షల ఎరువులు విక్రయాలు జరిగాయి. 2025 – 26 లో రూ.21 లక్షల మాత్రమే ఎరువుల విక్రయాలు జరిగాయి. విత్తనాలకు సంబంధించి 2022 – 23 లో రూ.12 లక్షల విలువైన విక్రయాలు జరిగితే ప్రస్తుతం రూ.1.31 లక్షల విక్రయాలు మాత్రమే జరిగాయి. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం: మండలం నుంచి ఒడిశాకు రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ డివివి.సతీష్కుమార్ తెలిపారు. ఈ మేరకు తమకున్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి మంగళవారం ఇరిడి సమీపంలో వేచి ఉండగా రెండు పికప్లతో వస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఓ పికప్ వద్ద 50 బస్తాలు, మరో పికప్ వద్ద 40 బస్తాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, రెండు వాహనాలతో పాటు, పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి, బియ్యం తరలించిన వారిపై రెవెన్యూ అధికారులచే 6 ఏ కేసును నమోదు చేయించినట్టు సీఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరి వెంట సీఎస్డీటీ శ్రీనివాసరావు, ఆర్ఐ బి.శివ తదితరులు ఉన్నారు. -
తప్పిన ప్రమాదం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దేరువాడ గ్రామ సమీపంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం బీరుపాడు గ్రామం నుంచి ప్రయాణికులతో వయా కురుపాం పార్వతీపురానికి బయల్దేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మార్గమధ్యలోని దేరువాడ సమీపానికి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి దారి మళ్లించే క్రమంలో రోడ్డు పక్కకు దిగడంతో టైర్లు మట్టిలో దిగబడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారించి బస్సును నిలుపుదల చేయడంతో పక్కకు బోల్తా పడకుండా ఆగింది. దీంతో ఆ బస్సులో ఉన్న సుమారు 118 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతగిరి సమీపంలో ఏనుగులు భామిని: మండలంలో ఏబీ రోడ్డు పక్కనే గల అనంతగిరి సమీపంలో ఏనుగులు మంగళవారం కనిపించాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న మొక్కజొన్న పంట చేలలో నాలుగు ఏనుగులు తిరుగాడుతూ పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏబీ రోడ్డుపైకి ఏ క్షణం అయినా రావచ్చని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముమ్మరంగా పారిశుధ్య పనులు : కలెక్టర్ పార్వతీపురం రూరల్: జిల్లాలో గత రెండు రోజులుగా చేపట్టిన పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతూ మార్పుతో కూడిన ప్రగతి సంతరించుకున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ కాలువల శుభ్రత వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లకు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆ మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయడంతో పాటు మురుగునీటి కాలువలు శుభ్రపరచడం, బ్లీచింగ్ చల్లడం, పూడికలు తీసి స్ప్రేయింగ్ చేయడం గత రెండు రోజులుగా 15 మండలాల్లోని 1125 మంచినీటి ట్యాంకులను శుభ్రపరచి 2,388 మురునీటి కాలువలను శుభ్రపరచినట్టు తెలిపారు. 1398 ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి స్ప్రేయింగ్ చేసినట్టు కలెక్టర్ వివరించారు. గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్పోస్టు వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి ఐదు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నట్టు ఎస్ఐ వెంకటసురేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గుప్తేశ్వరంలో కొనుగోలు చేసి, కాశికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైతు సేవా కేంద్రంలో చోరీ కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం రైతు సేవా కేంద్రానికి చెందిన ఉద్యోగులు విధి నిర్వహించేందుకు వెళ్లారు. కేంద్రానికి వేసిన తాళం పగులగొట్టి కంప్యూటర్తో పాటు సంబంధిత పరికరాలను సైతం సోమవారం రాత్రి చోరీ చేసినట్టు ఉద్యోగులు గుర్తించారు. వెంటనే రైతుసేవా సిబ్బంది కురుపాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల కేసులో విచారణ వేగవంతంగుర్ల: మండలంలోని జమ్ములో జరిగిన దాడుల కేసులో విచారణ వేగవంతం చేస్తున్నట్టు సీఐ జి.శంకరరావు తెలిపారు. జమ్ములో ఫోరెనిక్స్ బృందం మంగళవారం ఆధారాలు సేకరించింది. దాడులలో నమోదు అయిన రెండు కేసుల్లో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు చెప్పారు. ఓడ్రుబంగి వాసి ఒడిశాలో మృతి గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఓడ్రుబంగి గ్రామానికి చెందిన పి.పారయ్య(45) ఒడిశాలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులతో కలిసి ఒడిశాలోని శిఖల ప్రాంతంలో వెటకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు వారి వెంట తీసుకెళ్లిన నాటుతుపాకీ తూటా తగిలి మృతి చెందాడని.. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ఆ మృతదేహాన్ని మంగళవారం ఓడ్రుబంగి గ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఒడిశాలో మృతి చెందడం వలన ఒడిశాకు చెందిన రామన్నగూడ పోలీసులకు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని మరలా స్వాధీన పర్చుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
● కురుపాం బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ కురుపాం: స్థానిక బాలికల గురుకులంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు. పాఠశాలను మంగళవారం సందర్శించారు. గురుకులంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. కిచెన్ గదులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. బాలికలతో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు, కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, సబ్కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట డీడీ కృష్ణవేణి, గిరిజన సంఘం నాయకులు నిమ్మక జయరాజ్ , పాఠశాల సిబ్బంది ఉన్నారు. -
కూటమి కక్ష!
ఆరోగ్యమిత్రలపై..విజయనగరం ఫోర్ట్: ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పని చేస్తున్న ఆరోగ్యమిత్రల పట్ల కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వారికి రెండు నెలలుగా జీతాలు నిలిపివేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు అందకపోవడంతో ఆరోగ్యమిత్రలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ జీతాల గురించి అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల గురించి ఆరోగ్యశ్రీ అధికారులను అడిగితే అప్కాస్లో సమస్య అని, అప్కాస్ వారిని అడిగితే ట్రస్టులో సమస్య అని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు. జిల్లాలో 94 మంది ఆరోగ్యమిత్రలు జిల్లాలో 34 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో 94 మంది ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారు. వీరిలో 72 మంది ఆరోగ్య మిత్రాలకు గత రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వీరికి అందలేదు. సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యమిత్రలు కోర్టును ఆశ్రయించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ ఆరోగ్య మిత్రలకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలకే జీతాలు నిలిచిపోవడం గమనర్హాం. ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ )పరిధిలో ఉన్న వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత వైద్యుని దగ్గరకు వీరు పంపిస్తారు. ఆస్పత్రిలో చికిత్స కోసంగాని, శస్త్రచికిత్స కోసం చేరినట్టయితే వారికి సకాలంలో చికిత్స, శస్త్రచికిత్స జరిగేటట్టు చూడడం ఆరోగ్యమిత్రల యొక్క విధులు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా.. లేదా.. అని పర్యవేక్షించడం, ఏదైనా ఆస్పత్రి సిబ్బంది సేవలు అందించడం కోసం చేతి వాటం ప్రదర్శించినట్టయితే వారి ఫిర్యాదును కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి యొక్క విధి. జీతాలందక అవస్థలు జీతాలు అందకపోవడం వల్ల ఆరోగ్యమిత్రలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ, స్కూలు ఫీజులు వంటివి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. తమతో పని చేయించుకుంటున్న అధికారులు జీతాల గురించి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు.. జిల్లాలో 72 మంది ఆరోగ్యమిత్రలకు జీతాలు రెండు నెలలుగా రాలేదు. దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులను అడిగితే అప్కాస్లో సమస్య అని, అప్కాస్ అధికారులను అడిగితే ట్రస్ట్లో సమస్య ఉందని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. కోర్టును ఆశ్రయించామని జీతాలు నిలిపివేసారో, మరో ఏ కారణం తెలియడం లేదు. జీతాలు రాక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. – జెర్రి పోతుల ప్రదీప్, ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడువాస్తవమే.. ఆరోగ్యమిత్రలకు జీతాలు రాని మాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ సమాన పనికి సమాన వేతనం కావాలని కోర్టును ఆశ్రయించిన ఆరోగ్యమిత్రలు దీంతో 72 మందికి జీతాలు ‘ నిలిపివేసారనే ఆరోపణలు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి అవస్థలు పడుతున్న ఆరోగ్యమిత్రలు రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన మిత్రలకే ఎక్కువ మందికి జీతాలు అందని పరిస్థితి -
విజయనగరం
● పురవీధుల్లో పూజారి రూపంలో పైడితల్లి విహారం ● వర్షంతో భక్తులకు చల్లదనం ● అడుగడుగునా అమ్మకు నీరాజనం ● తిలకించి పులకించిన భక్తజనం ● గంట ఆలస్యంగా ప్రారంభమైన సిరిమానోత్సవం ● అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు ● రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించిన దేవదాయశాఖ మంత్రి ఆనం రేషన్ బియ్యం స్వాధీనం గుమ్మలక్ష్మీపురం నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్చేసినట్టు శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ సతీష్కుమార్ తెలిపారు.భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తున్న సిరిమాను పూజారి వెంకటరావు విజయనగరం టౌన్/విజయనగరం: పూజారి రూపంలో సిరులతల్లి పైడితల్లి కదలివచ్చిన వేళ భక్తజనం పరవసించింది. తల్లి చల్లని కరుణాకటాక్షాల కోసం పరితపించింది. అరటిపళ్లను విసిరి ఆశీస్సులు అందుకుంది. సిరిమానోత్సవానికి తరలివచ్చిన అశేష భక్తజనంతో పైడితల్లి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రతి రూపమైన పూజారి సిరిమానును అధిరోహించి భక్త జనావళికి ఆశీర్వచనాలు అందజేశారు. నిర్ణీత సమయానికన్నా గంట ఆలస్యంగా సిరిమాను సంబరం ప్రారంభమైనా అమ్మవారిని తిలకించేందుకు భక్తులు ఓపికగా నిరీక్షించారు. ● గంట ఆలస్యంగా.. అధికారుల పర్యవేక్షణా లోపం.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్ణీత సమయానికన్నా (మధ్యాహ్నం 3.05 నిముషాలకు) సిరిమాను సంబరం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే ఓ వైపు మేఘాలు కమ్ముకుంటూ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నా సిరిమాను రథాన్ని తయారు చేయించడంలో అధికార యంత్రాంగం లోపం కొట్టిచ్చినట్లు కనిపించింది. ఏటా మూడు నుంచి మూడున్నర గంటల మధ్యలో సిరిమాను సంబరం అరంభమయ్యేది. సిరిమాను సిద్ధంకాకపోవడంతో చీకటిపడేవరకూ సంబరం సాగింది. ● పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. ఆలయానికి నాలుగువైపులా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. దూరప్రాంతాల నుంచి వాహనాల ద్వారా వచ్చేవారికి ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. 2,600 మంది పోలీస్ సిబ్బందితో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ, క్రైమ్ పార్టీలు, కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఎస్పీ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత స్వీయపర్యవేక్షణతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జాతర ముచ్చట్లు.. సిరిమాను సాగిందిలా... సిరి జాతర సంప్రదాయబద్ధంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం 4.03 గంటలకు సిరిమానుపై పూజారి ఆశీనులయ్యారు. 4.24 గంటలకు భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయ ధ్వానాల మధ్య కదిలిన సిరిమానును తనివితీరా చూడాలని లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దుష్టశక్తులను పారదోలుతూ పాలధార ముందుకు కదలగా, జాలరివల, ఎల్ల ఏనుగు, అంజలిరథం వెన్నంటి ఉండి ఉత్సవాన్ని ముందుకు నడిపించాయి. భక్తజన కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను భక్తులందరినీ అలరిస్తూ ముందుకు కదిలింది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు అమ్మను దర్శించారు. గగనాన విహరించే పూజారి బంటుపల్లి వెంకటరావును అమ్మకు ప్రతిరూపంగా భావించి మొక్కుకున్నారు. చదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమానోత్సవం డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేయడం ఆనవాయితీ. సిరిమాను తిరువీధి మూడుసార్లు పూర్తిచేసుకున్న వెంటనే కురిసిన వర్షంతో దేవతమూర్తులపై నుంచి తమకు వర్షపు నీటిబొట్ల రూపంలో ఆశీర్వచనాలను అందించారని భక్తజనం మురిసిపోయింది. 5.47 గంటలకు సిరిమానోత్సవం ముగిసింది. సిరిమానోత్సవం సందర్శకులకు రెవెన్యూ సంఘం ఉచిత సేవలు అందించింది. పట్టణంలోని రైల్వేస్టేషన్, రెవెన్యూ హోమ్ ప్రాంతాల్లో భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమాలను కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు తాడ్డి గోవింద్ మాట్లాడుతూ 2017 నుంచి ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ఆకాంక్షించారు. శ్రీపైడితల్లి అమ్మవారి పండగను రాజకీయాలకు వాడుకోవడం మా తత్వం కాదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరులతల్లి సిరిమాను జాతర ఓ వైపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో చదురుగుడిలో పైడితల్లికి వేదపండితులు లక్షపుష్పార్చన సేవను నిర్వహించారు. ఆలయమంతా వేదమంత్రోచ్ఛరణతో మార్మోగింది. జై పైడిమాంబ జైజై పైడిమాంబ నినాదాలతో భక్తజనం లక్ష పుష్పార్చన సేవలో తరించారు. భక్తులు తమ మొక్కుబడులు చెల్లించేందుకు విసిరిన అరటి పండ్లు, పసుపు, కుంకుమలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది కార్మికులు పనిచేశారు. కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య, ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె.సాంబమూర్తి, ఏసీపీ రమణమూర్తి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర దిగ్విజయంగా జరిగిందని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవం ప్రశాంతంగా విజయవంతంగా జరగడానికి కృషి చేసిన అధికారులు, పోలీసు యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా సంపూర్ణంగా సహకరించిన భక్తులందరికీ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. – విజయనగరం అర్బన్/విజయనగరం/ విజయనగరం ఫోర్ట్ ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజాక్రతువులు పూర్తిచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం మరోసారి అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలను సమర్పించారు. కోటపై నుంచి పూసపాటివంశీయులైన అశోక్తో పాటు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధా గజపతి, ఊర్మిళా గజపతి, ఇతర రాజకుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజుపై నుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తదితరులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. మరోపక్క అర్బన్ బ్యాంక్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక నుంచి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా అధికార యంత్రాంగం ఉత్సవాన్ని తిలకించారు. పూర్వజన్మసుకృతం అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలి. తొమ్మిదోసారి అమ్మవారి సిరిమానును అధిరోహించడం పూర్వజన్మసుకృతం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో ఆనందమయ జీవితం గడపాలి. పంటలు సమృద్ధిగా పండాలి. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిపైనా అమ్మ ఆశీస్సులు ఉంటాయి. – బంటుపల్లి వెంకటరావు, సిరిమాను పూజారి -
అతిథులకు ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం
● కూలిన బొత్స కూర్చున్న వేదిక ● ఎమ్మెల్సీ సురేష్బాబు, తదితరులకు గాయాలు సాక్షిప్రతినిధి, విజయనగరం: పైడితల్లి సిరిమాను ఊరేగింపు సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆఖరుకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ, పార్టీ ఇతర నాయకులూ సిరిమాను చూసేందుకు ఏర్పాటు చేసిన వేదికను కూడా సరిగా వేయలేదు. వేదిక కూలిపోవడంతో బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు సహా వైఎస్సార్ సీపీ నాయకులకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో వారంతా కింద పడిపోయారు. ఈ ఘటనతో సిరిమానోత్సవంలో గందరగోళం నెలకొంది. బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మాజీ ఎంపీలు బొత్స ఝాన్సీ, బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ కూడా కిందపడిపోయారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు కు స్వల్పగాయాలయ్యాయి. వాస్తవానికి దశాబ్దాలుగా బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రాంగణంలో కూర్చుని సిరిమానును తిలకించేవారు. అయితే ఈసారి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆ ప్రాంగణం తమదని, దాన్ని బొత్స సత్యనారాయణకు ఇచ్చేది లేదని అన్నారు. దీంతో ప్రభుత్వం అదే రోడ్డులో ఒకనాటి విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో టెంట్లు వేసి నాసిరకంగా వేదిక ఏర్పాటు చేశారు. వేదికను నామ్ కె వాస్తేగా వేశారే తప్ప అవి ఏమంత పటిష్టంగా లేవు. దీనికితోడు అక్కడి మట్టిని కూడా ఏమాత్రం లెవెలింగ్ చేయకపోవడం... నేల కాస్త సరిగా ఉందా లేదా అనేది కూడా చూసుకోకుండా మామూలుగా ఓ పందిరి మాదిరివేసేసి ఊరుకున్నారు. సిరిమాను చూసేందుకు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, సురేష్ బాబు, బెల్లాన చంద్రశేఖర్, ఝాన్సీ తదితరులు స్టేజి మీదకు ఎక్కి కాసేపు కూర్చున్నారు. అంతలోనే వేదిక ఆలా కుప్పకూలిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా కింద పడిపోయారు.. ఈ ఘటనలో ఎమ్మెల్సీ సురేష్బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ప్రభుత్వ పర్యవేక్షణ,. బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బొత్స వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడికి, పైగా శాసన మండలిలో ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా, ఇచ్చకానికి ఇచ్చినట్లు నాలుగు బల్లలు వేసి అదే వేదిక అని చెప్పి అక్కడే కూర్చుని సిరిమానును చూడాలని చెప్పడం ఆయనను అవమానించడమే అని అంటున్నారు. ఈ తప్పిదానికి ప్రభుత్వానిదే బాధ్యత అని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్శన సమయంలోనూ అవమానించే ధోరణిలో.. ఉదయం రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందరినీ నేరుగా పంపించిన ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణకు దర్శనం కల్పించడంలో కూడా వివక్ష చూపారు. దర్శనానికి వచ్చిన ఆయనను ఆపి ఇలా కాదు.. అలాగ వెళ్లండంటూ మాట్లాడారు. దీనిపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చూసిన వారందరూ ప్రభుత్వం, అధికారయంత్రాంగం తీరును తప్పుబట్టారు. -
కమిషనర్ తీరుపై కలెక్టర్కు చైర్పర్సన్ ఫిర్యాదు
● కౌన్సిల్ తీర్మానాన్ని లెక్క చేయడం లేదు.. ● తగు చర్యలు తీసుకోవాలని వినతి పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పార్వతీపురం మున్సిపల్ పరిధిలో నిరాశ్రయుల వసతిగృహం నిర్వహణ బాధ్యతల అప్పగింతపై నెలకొన్న సమస్యపై మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష వైఖరితో కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బోను గౌరీశ్వరీ మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని నిరాశ్రయుల వసతిగృహ నిర్వహణ కోసం స్థానికత ఉన్న ఆదర్స్ రూరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్కు బాధ్యతలు అప్పగించాలని 30 సెప్టెంబర్ 2024న కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం నంబరు 633 ద్వారా నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ ఏడాది 31 జూలైన మరోసారి పాత తీర్మానాన్ని బలపరుస్తూ తీర్మానం నంబరు 765ను ఆమోదించినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని మినిట్ బుక్లో కూడా స్పష్టంగా నమోదు చేశామన్నారు. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ తీర్మానం మినిట్ బుక్లో నమోదయ్యాక దానిని అమలు చేయాల్సిన బాద్యత కమిషనర్పై ఉంటుందని వివరించారు. కానీ నెలలు గడుస్తున్నా కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఆయనే తేలుస్తారంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై న పాలకవర్గాన్ని, కౌన్సిల్ అధ్యక్షురాలైన తనను ఈ విధంగా వ్యవహరిస్తూ అవమానించడమేనని ఆమె స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. కలెక్టర్ ఈ విషయంలో స్పందించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అర్హత పొందిన సంస్థకు తక్షణమే నిరాశ్రయుల వసతిగృహం బాధ్యతలు అప్పగించేలా కమిషనర్ను ఆదేశించాలని కోరినట్టు చైర్పర్సన్ తెలిపారు. కమిషనర్ వైఖరితో నిరాశ్రయులకు అందాల్సిన సేవల్లో జాప్యం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
నాగావళిలో దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పైనుంచి నాగావళి నదిలో దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వీరఘట్టం మండలం బిటివాడ గ్రామానికి చెందిన కళ్లేపల్లి జగదీష్ (33) వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన పార్వతిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపల వ్యాపారం రీత్యా గరుగుబిల్లి మండలం రావివలసలో స్థిరపడ్డారు. చేపల వ్యాపారం ముగించుకుని మగ్గూరు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న రుషింగి వంతెన సమీపం వచ్చే సరికి వ్యాపార నిమిత్తం భార్యాభర్తలు ఇరువురు తగాదా పడ్డారు. ఈ క్రమంలో వంతెన వద్దే బండిని నిలిపివేసి భార్య ముంగిటే నదిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు చేరుకుని గాలించినా ప్రయత్నం లేకపోయింది. భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నదిలో గల్లంతైన జగదీష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని హెచ్సీ దూసి రాములు తెలిపారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మరణాలు
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ధ్వజంపార్వతీపురం రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనిపై మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మంగళవారం తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద చనిపోయారంటూ ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమన్నారు. ప్రభుత్వం సరైన వసతులు కల్పించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. గిరిజన విద్యార్థుల బాగోగులను ప్రభుత్వం సరిగా పర్యవేక్షించి ఉంటే 120 మందికి పచ్చకామెర్లు ఎలా వచ్చాయి? పది నెలల్లో 11 మంది ఎలా చనిపోయారు? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కలుషిత నీరు, అపరిశుభ్రతే ఈ అనర్థాలకు మూలమని, ఏళ్ల తరబడి ఏఎన్ఎంలను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో వెంటనే ఏఎన్ఎంను నియమించి, సురక్షిత నీరు, పౌష్టికాహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
విజయనగరం అర్బన్: రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జె.జ్యోతి, సీపీవో పి.బాలాజీ, జిల్లా టూరిజం కల్చర్ అధికారి కుమారస్వామి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాణి, మార్క్ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, బీసీ వసతిగృహ సంక్షేమాధికారులు, కలెక్టరేట్లోని వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
రాత్రి వేళ కానరాని ఆర్టీసీ పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మంగళవారం రాత్రి వేళ కనిపించలేదు. వర్షం కారణంగా సిరిమానోత్సవం షెడ్యూల్ రెండు గంటల పాటు జాప్యం జరిగిన నేపథ్యంలో భక్తుల తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అయితే ఆర్టీసీ ప్రత్యేక సేవలను సాయంత్రం 7 గంటలకే ఆపేయడం వల్ల జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు ఇళ్లకు చేరడానికి ఇబ్బంది పడ్డారు. నిజానికి ప్రత్యేక సర్వీసుల షెడ్యూల్ ప్రకారం పండగ రెండవ రోజు మంగళవారం 80 బస్సులను ఏర్పాటు చేయాలి. సిరిమానోత్సవం జరిగేది సాయంత్రం 3 గంటలకు కాబట్టి ఆ తర్వాత ఎక్కువ సర్వీసులు వేయాలి, కానీ వేయకపోడం వల్ల జిల్లా కేంద్రం నుంచి విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల రూట్లలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
అంబరాన్నంటిన సిరిమాను సంబరం
జై పైడిమాంబ... జై జై పైడిమాంబ... అంటూ లక్షలాది భక్తజనం జయజయధ్వానాల నడుమ సిరులతల్లి... విజయనగర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 4.24 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అనంతరం మూడుసార్లు అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు సాగిన ఉత్సవం సాయంత్రం 5.47 గంటలకు ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కోట బురుజుపై నుంచి, విజయనగరం అర్బన్ బ్యాంక్ భవనం ఉన్న ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదిక నుంచి రాష్ట్ర శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. అయితే, ఏర్పాట్లలో డొల్లతనం కారణంగా ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై కూర్చున్న బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఒక ఎస్ఐ, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. – సాక్షిప్రతినిధి, విజయనగరం -
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి
సాక్షి, విజయనగరం: శ్రీపైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వేదికను టీడీపీ నేతలు రద్దు చేశారు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని టీడీపీ నేతలు అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలంటూ ఆదేశించారు. సిరిమాను రథం తిరగకముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పైడితల్లి సిరిమానోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, గుంటూరు: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభ వేళ.. భక్తులను ఉద్దేశిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అని అన్నారాయన. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. నేడు విజయనగరంలో నిర్వహించే సిరుల తల్లి సిరిమానోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. pic.twitter.com/tEKuDLMhMm— YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2025 సిరిమానోత్సవం సందర్భంగా.. అమ్మవారు సిరిమాను అనే చెట్టు కొమ్మపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. మహారాజ కోట నుంచి ప్రారంభమై, ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలతో ఊరేగింపు ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. -
ఊరిమీదపడి అరాచకం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రశాంతమైన పల్లెలో వారంతా కూలీలు... సన్న చిన్నకారు రైతులు... ఇతర పనులు చేసుకునేవాళ్లు... అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్నారు... అలాంటి సమయంలో 40 మంది పోలీసులు ఊరిమీద పడ్డారు. ఇళ్లల్లోకి చొరబడ్డారు... దొరికినవారిని దొరికినట్లు జీపుల్లో కుక్కేసి స్టేషన్కు తరలించారు. ఇదంతా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ములో ఆదివారం జరిగింది. గ్రామంలో శనివారం పండుగ సందర్భంగా చోటుచేసుకున్న చిన్న తగాదాలో అధికార టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు చెలరేగిపోయారు.అసలు ఏం జరిగిందంటే.. జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ వారు వేర్వేరుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీ ఊరేగింపులోని యువకులు వైఎస్సార్సీపీ ఊరేగింపులో అల్లర్లకు దిగారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. వైఎస్సార్సీపీ యువతపై దాడి చేసి లాఠీలకు పని చెప్పారు. ప్రశాంతంగా ఊరేగింపు చేస్తున్నా ఎందుకు కొడుతున్నారని వైఎస్సార్సీపీ యువత ప్రశ్నించారు.ఈ సమయంలో అదుపుతప్పి ఒకరిద్దరు పోలీసులు కిందపడ్డారు. దీన్నే తీవ్రమైన నేరంగా పరిగణించిన పోలీసులు... ఆదివారం అర్ధరాత్రి జమ్ము గ్రామం మీద పడ్డారు. గర్భిణులని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. పురుషుల్లో దొరికినవారిని దొరికినట్లు కొట్టుకుంటూ జీపుల్లోకి ఎక్కించి విజయనగరం రూరల్ స్టేషన్కు తరలించారు. కాగా, సర్పంచ్ జమ్ము నరసింహమూర్తితో సహా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తప్పించి 20 మంది వైస్సార్సీపీ కార్యకర్తలను రిమాండ్కు తరలించారు. -
పైడితల్లి పండుగకు ఆర్టీసీ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి జాతర సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నిర్విహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి. వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు సోమవారం 40 బస్సులు వేయగా.. మంగళవారం 70, బుధవారం 30 బస్సులు తిప్పనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. వైభవంగా మహా పూర్ణాహుతి నెల్లిమర్ల రూరల్: రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులైన ఉమా సదాశివాలయంలో కామాక్షి అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహా పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టారు. ప్రధానార్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించిన అనంతరం శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు, అర్చనలు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు హోమాలు చేపట్టి మహా పూర్ణాహుతి జరిపించారు. పూర్ణాహుతిలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ కారుకొండ కృష్ణారావు, సర్పంచ్ అంబళ్ల కిరణ్, నాయకులు అట్టాడ శ్రీధర్, సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. జాతర చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి జాతర మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అవసరమైన పెద్ద స్క్రీన్ లను విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. మయూరి, అంబేడ్కర్ కూడలిలో స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ నల్లనయ్య తెలిపారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
పీఎం పాలెం: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడబ గ్రామానికి చెందిన మువ్వల శివప్రసాద్ (54) భార్య పద్మజతో పీఎం పాలెం రామాలయం సమీపంలోని ఎల్ఐజీ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. ఈయన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నారు. శివప్రసాద్ ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి, ఇంటి వద్ద బయల్దేరారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు రామాలయం సమీపంలోని కల్వర్టు కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికంగా కలకలం రేగడంతో సంఘటన స్థలంలో పరిశీలించి, చనిపోయిన వ్యక్తి తన భర్త శివప్రసాద్గా పద్మజ గుర్తించింది. భర్త మరణంపై అనుమానం ఉందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడు మద్యం వ్యసనపరుడని, సొంత ఊరులోని ఆస్తిపాస్తులు అమ్ముకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చికిత్స పొందుతూ వివాహిత మృతి సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన మెంటి దేవి (27) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ వి.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం పెద్దపుర్లి గ్రామానికి చెందిన ఎం.గోవిందరావు, మంగమ్మల కుమార్తె దేవికి సంతకవిటికి చెందిన మహేష్తో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సెప్టెంబర్ 28న భర్త తాగి రావడంతో బెదిరించాలనే ఉద్దేశంతో దేవి పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి రాజాంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 29న శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎం.గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోల్డ్స్టార్ జంక్షన్ వద్ద విధ్వంసం
● కోర్టు తీర్పు ఉందంటూ జేసీబీలతో ఇళ్లు నేలమట్టం ● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలులక్కవరపుకోట: కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతూ మండలంలోని గోల్డ్స్టార్ జంక్షన్ వద్ద గల ఇళ్లను మూడు జేసీబీలతో నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించిన సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై నవీన్ పడాల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మల్లివీడు రెవెన్యూ పరిధి గోల్డ్స్టార్ జంక్షన్ వద్ద గల 30 సెంట్ల భూమికి సంబంధించి రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన పినిశెట్టి కిష్టప్పదొర, గేదెల అప్పన్నదొరల మధ్య 2015 సంవత్సరం నుంచి వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో మూడు కుటుంబాల వారు ఇళ్లు నిర్మించుకోవడంతో పాటు 9 షాపులు నిర్మించుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెల 27న అప్పన్నదొరకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని అప్పన్నదొర తమ్ముడు ప్రముఖ వైద్యుడు గేదెల రాము తెలిపారు. ఈ మేరకు నాలుగు రోజుల కిందట సంబంధిత జడ్జిమెంట్ అంశాన్ని స్థానిక ఎస్సై నవీన్ పడాల్కు తెలియజేసి వివాదా స్థలంలో గల కబ్జాలను తొలిగించేందుకు సహకరించాలని రాము కోరారు. దీంతో శాశ్వత జడ్జిమెంట్ వస్తే తప్పనిసరిగా సహకరిస్తానని ఎస్సై బదులిచ్చారు. ఇంతలోనే రాము విశాఖపట్నం, ఎస్.కోట ప్రాంతాలకు చెందిన కిరాయి వ్యక్తులను సుమారు 30 మందిని తీసుకువచ్చి మూడు జేసీబీల సహాయంతో సోమవారం తెల్లవారు జామున ఇళ్లను, షాపులను కూల్చేశారు. విషయం తెలుసుకున్న పినిశెట్టి కిష్టప్పదొర సంఘటనా స్థలానికి వచ్చేసరికి కిరాయి వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. ఇంతలో రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన యువకులు సంఘటనా స్థలానికి రావడంతో కిరాయి వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో యువకులు వారిని వెంబడించి కొంతమందిని పట్టుకుని, జేసీబీలతో సహా పోలీసులకు అప్పగించారు. దీంతో ఇరువర్గాలూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కూటమి నేతల అండతోనే.. వివాదానికి సంబంధించిన స్థలంలో గడిచిన 40 సంవత్సరాలుగా 9 కుటుంబాల వారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చిందని హడావిడిగా జేసీబీలతో ఇళ్లు, షాపులును కూల్చేశారని బాధితులు వాపోయారు. కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. కూటమి నాయకుల అండతోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. -
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరిట మోసాలపై ఎక్కువగా ఫిర్యాదలు వచ్చాయి. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా విన్న ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అలసత్వాన్ని సహించేది లేదు
విజయనగరం అర్బన్: గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పని కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తన చాంబర్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో పారిశుధ్యం, సూపర్ జీఎస్టీ కాంపెయిన్, ఎరువుల సరఫరా అంశాలపై నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్లో ఈ మేరకు పేర్కొన్నారు. గ్రామాల్లో పండుగలు కొనసాగుతున్న దృష్ట్యా రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని, కలుషిత నీరు, ఆహారం తీసుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా షెడ్యూల్లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏ రోజు కార్యక్రమాలను ఆ రోజే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీపై అవగాహన తరగతులను నిర్వహించి విద్యార్థులకు పలు పోటీలు కూడా నిర్వహించాలని సూచించారు.పిడుగుపాటుకు 13 మేకలు మృతిశృంగవరపుకోట: మండలంలోని రేగ పుణ్యగిరిలో సోమవారం సాయంత్రం పిడుగు పడడంతో 13 మేకలు మృతి చెందాయి. కొండపై మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో మూగజీవాలు కళ్లెదుటే చనిపోయాయని చెబుతూ పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం బాధితులకు పరిహారం అందజేయాలని పలువురు కోరారు. -
అర్జీదారుల సంతృప్తే లక్ష్యం
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారుల సంతృప్తే లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సమస్యలు తెలియజేస్తే పరిష్కారమవుతాయనే నమ్మకం అర్జీదారులకు కలిగించాలని అధికారులను సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ సి. యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి సుమారు వంద వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంతవరకు అర్జీదారుని సమక్షంలోనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరవై రోజులుగా 50 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా లేదని, వెంటనే సమస్య పరిష్కరించాలని గరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీకి చెందిన రైతులు వినతి అందజేశారు. అలాగే తమ గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా.. ఉపాధి నిధులు దుర్వినియోగం.. క్షీణించిన పారిశుధ్యంపై వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామానికి చెందిన రామినాయుడు ఫిర్యాదు చేశారు. మార్కెట్ స్థలాన్ని కొందరు ఆక్రమించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన బెహరా కుటుంబ సభ్యులు కలెక్టర్కు అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
పట్టణంలో విస్తృత తనిఖీలు
విజయనగరం క్రైమ్: పైడితల్లి తోలేళ్లు, సిరిమాను జాతర నేపథ్యంలో అంతర్రాష్ట్ర ముఠాలు దిగాయన్న సమాచారంతో విజయనగరం క్రైమ్ పార్టీ బృందాలు సోమవారం నగరమంతా గాలింపు చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, లైవ్ డిటెక్టర్ పరికరాలతో నగరం మొత్తం అణువణువునా గాలించారు. ఉగ్రవాది సిరాజ్ ఘటన పుణ్యమా అని ఎన్ఐఏ తనిఖీలతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరంలో అనుమానంగా సంచరించే వ్యక్తులను గుర్తించి వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా నగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు, రామానాయుడు రోడ్డు , జిడ్డువారి వీధి, ఐస్ ఫ్యాక్టరీ , అంబటిసత్రం, నీళ్ల ట్యాంక్, పాతబస్డాండ్ , రైల్వే స్టేషన్, గూడ్స్షెడ్, కంటోన్మెంట్ మెయిన్ బ్రాంచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, వీటీ అగ్రహారం, కేఎల్పురం ప్రాంతాల్లో బొమ్మల అమ్మకాల పేరుతో ఛత్తీస్గఢ్, ముంబై, భువనేశ్వర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అరాచకాలు సృష్టించనున్నారన్న సమాచారం నిఘా వర్గాలకు అందడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డీఎస్పీ భవ్యారెడ్డి నేతృత్వంలో ఎస్సైలు సురేంద్రనాయుడు, లక్ష్మణరావు, ఇతర సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ప్రత్యేకించి ఆర్మ్డ్ రిజర్వ్ ప్రత్యేక బృందాలతో పాటు డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ కూడా రంగంలోకి దిగింది. -
తక్కువ ధరకే బంగారం పేరిట మోసం
● రూ. 12 లక్షలు కాజేసిన వైనం ● నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులుపార్వతీపురం రూరల్: తన భార్యకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్నే మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని ఏకంగా రూ. 12 లక్షలు కాజేశాడు. తక్కువ ధరకే బంగారాన్ని ఇప్పిసానంటూ నమ్మించి నిలువునా ముంచేసిన ఈ కేటుగాడితో పాటు మరో 8 మంది సభ్యుల ముఠాను పార్వతీపురం రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కేసును ఛేదించారు. అసలేం జరిగిందంటే... శ్రీకాకుళానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి గతంలో శ్రీకాకుళం రూరల్ మండలం సింగువలస వద్ద పనిచేసే సమయంలో నిందితుడు కొత్తూరు మండలం గొట్టుపల్లి పంచాయతీ పుల్లగూడకు చెందిన జి. రిషివర్థన్ భార్య చదువుకునేది. దీంతో ప్రధానోపాధ్యాయురాలితో రిషివర్థన్కు పరిచయం ఉంది. ఈ క్రమంలో తాను బంగారం వ్యాపారం చేస్తున్నానని.. చాలా తక్కువ ధరకే నాణ్యమైన బంగారు బిస్కెట్లు ఇప్పించగలనని ప్రధానోపాధ్యాయురాలిని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది ఆగస్టు 11న రూ. 12 లక్షల నగదు పట్టుకుని బంగారం కొనేందుకు శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వైపు రిషివర్థన్తో వస్తుండగా.. ముందస్తుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం పార్వతీపురం శివారులో వాటర్ పంప్హౌస్ సమీపంలో కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా వచ్చి వీరిని భయభ్రాంతులకు గురిచేసి లక్ష్మి చేతిలో ఉన్న నగదు తీసుకుని పరారయ్యారు. వెంటనే బాధితురాలు పార్వతీపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కా స్కెచ్తో పట్టించారు.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పార్వతీపురం సీఐ రంగనాథం, రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పక్కా వ్యూహంతో ఈ అంతర్ జిల్లా ముఠా గుట్టు రట్టు చేశారు. ముందుగా రిషివర్థన్ కదలికలపై నిఘా పెట్టి ప్రధాన నిందితుడు అతనే అని నిర్ధారణకు వచ్చారు. అతనితో పాటు పార్వతీపురం, సాలూరు, విజయనగరం, ఒడిశాకు చెందిన మొత్తం 8 మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల నగదుతో పాటు కారు, నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. -
విజయనగరం విజయదుందుభి
● రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానంగొలుగొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో విజయనగరం విజయదుందుభి మోగించింది. అండర్–14 బాల, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లలో ఈ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ హైస్కూల్లో ఈ నెల 4న ప్రారంభమైన పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో విజయనగరం, గుంటూరు బాలుర జట్లు తలపడ్డాయి. ఇందులో 2 పాయింట్లు తేడాతో విజయనగరం జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు ద్వితీయ స్థానానికి పరిమితమైంది. అనంతరం బాలికల పోరులో విజయనగరం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో విజయనగరం బాలికలదే పై చేయి అయింది. ఒక పాయింట్ తేడాతో విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లకు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు, కృష్ణదేవిపేట పూర్వపు ఎస్ఐ తారకేశ్వరరావు, సాఫ్ట్బాల్ నిర్వహణ ప్రతినిధులు రమణ, శ్రీనివాసరావు, సుమంత్రెడ్డి, సూర్య దేముడు, సతీష్, భవానీ, చంద్రమోహన్ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.