Vizianagaram
-
నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
కురుపాం/గుమ్మలక్ష్మీపురం: నిద్రలో ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానిక సంత వీధిలో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఓ ఇంటి వరండాలో మహిళ నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పరారయ్యారు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరస్థలం వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఒక అనుమానిత వ్యక్తి ఛాయాచిత్రాన్ని సేకరించారు. చిత్రంలో ఉన్న వ్యక్తి వివరాలు గానీ, ఈ నేరానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించదలచిన వారు ఎల్విన్ పేట సర్కిల్ ఇన్న్స్పెక్టర్ 92487 01917, ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ 7981296171 లేదా నీలకంఠాపురం సబ్ ఇన్న్స్పెక్టర్ 6281897578 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేయనున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు యంత్రాంగం వెల్లడించింది. -
రెచ్చిపోతున్న దొంగలు..!
నెల్లిమర్ల రూరల్: మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలు, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడలో ఉన్న అమ్మవారి ఆలయంలో తాళాలు విరగ్గొట్టి హుండీలోని డబ్బులతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. ఆ ఘటన మరువక ముందే శనివారం అర్ధరాత్రి గొర్లిపేట జగనన్న కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించుకుపోయారు. గతంలో కూడా నెల్లిమర్ల–రణస్థలం రహదారిలో బైక్ చోరీలు ఎన్నో జరిగాయి. రాత్రి వేళ రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉండడం..జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉండడంతో ఈ రహదారిని చోరీలకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెంచాలని కోరుతున్నారు. -
దర్శకుడు ఆదిత్యకు ఇండోనేషియా పురస్కారం
వేపాడ: గత 30 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన మండలంలోని కుమ్మపల్లి గ్రామానికి చెందిన డా.పి.సి.ఆదిత్య(దర్శకుడు)ను 2026 ఇండోనేషియా 2026 ఎక్స్లెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్తో కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్జీఐపీఫౌండేషన్ డైరెక్టర్ పీసీ ఆదిత్యసేవలను గుర్తించి అవార్డు అందజేయడం అభినందనీయమని ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్తా అభినందించినట్లు ఆదిత్య తెలిపారు. మనదేశానికి మిత్రదేశమైన ఇండోనేషియా నుంచి అంతర్జాతీయఅవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
రైతు కంటకన్నీరు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస గ్రామంలో ఆదివారం ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసింది. మజ్జి సింహాచలం అరటి తోటపై దాడి చేయడంతోసుమారు రూ.50 వేల నష్టం వాటిల్లింది. చౌడాడ శ్రీను భూముల్లో పైపులు, బెండులు పాడవడంతో నీరు వృథా అయింది. గోళ్ల అన్నపూర్ణ అరటి తోట కూడా దెబ్బతింది. పంట కోత సమయంలో ఇలాంటి నష్టాలతో ఆర్థికంగా కుంగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి, నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. -
డా. నీలిమకు ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’
విజయనగరం అర్బన్: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో పోటీలో విశాఖపట్నానికి చెందిన డా. నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను అందుకున్నారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా స్థానిక సీతం కళాశాలలో ఆదివారం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. ‘ఐపీ అండ్ స్పోర్ట్స్’ అనే థీమ్పై డా. నీలిమ రూపొందించిన ‘కలరిపయట్టు’ వీడియో విశేష ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి వచ్చిన 182 వీడియోల్లో ఆమె వీడియో టాప్–20లో స్థానం సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి ఎంపికై న ఏకై క ప్రతినిధిగా ఆమె నిలిచారు. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్లో అత్యధిక మద్దతు సాధించి డా.నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సత్య విద్యా సంస్థల సెక్రటరీ–కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, డా. నీలిమ సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు పాల్గొన్నారు. అభినందించిన మాజీ ఎంపీ డా. బొత్స ఝాన్సీ -
ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు
దత్తిరాజేరు: గజపతినగరం వ్యవసాయ శాఖ సహయ సంచాలకురాలి (ఏడీఏ)పై కొద్ది రోజుల క్రితం వీఏఏలు ఆంద్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం దత్తిరాజేరు, బొండపల్లి, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇక్కడికి ఆమె వచ్చినప్పటి నుంచి సిబ్బంది పర్సనాలిటీ, జీవనశైలి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు, ఆమె కుమార్తె పాకెట్ మనీ అంత తమ జీతం ఉండదని, ఆమె ప్లైట్ టిక్కెట్ ఖరీదు మాజీతాలు చేయవని, ఆమె కాళ్లకు వేసుకున్న చెప్పుల పాటి విలువ మా జీతాలు ఉండవని చాలా హీనంగా.అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. మాతో నిర్వహించిన మీటింగ్లకు ఆమె భర్త హాజరై లేనిపోని మాటలు ఆడుతున్నారని ఆమె భర్తతో కాలం చెల్లిన మందులు అమ్మించి రైతులను మోసం చేస్తున్నారని రైతు సేవా కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందిపై లేని పోని అభాండాలు వేసి అక్రమ సంబంధాలు కూడా అంటగడుతున్నారని ఫిర్యాదు చేశారు. గత ఖరీఫ్(2025)మందులకు 2026 జూన్లో తయారైనట్లు స్టిక్కర్లు తగించి మందులు అమ్ముతున్నారని సహకరించక పోతే లేనిపోని మాటలు అడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఇలా జరగడం వల్ల ఈవిషయంపై గతంలో అధికారులు విచారణ చేపట్టినా తూతూమంత్రంగానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా కౌన్సిల్ సమావేశం స్థానిక రింగ్ రోడ్డులోని పీఎస్ఆర్ స్కూల్లో ఆదివారం జరిగింది. తొలుత జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.కష్ణ, అధ్యక్షుడిగా ఎన్.వి. పైడిరాజు, ప్రధాన కార్యదర్శిగా గంట సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏవీ శ్రీనివాసరావు, సీహెచ్. రామారావు, బి.శరత్కుమార్, గుమ్మడి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.దామోదర్ నాయుడు, కేవీ రమణ, కె.శ్రీనివాసులు, ఎన్. సూర్యనారాయణ, పి.రమేష్ నాయుడు, జి.వెంకటరమణ, ఎన్. చిన్నాదేవి, కె. త్రినాథరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎ. సదాశివరావు, డి.ఈశ్వరరావు, వై.సత్యం, ఎం.బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నిండుకున్న మందులు
విజయనగరం ఫోర్ట్: మెరకముడిదాం మండలానికి చెందిన ఓ ఫైలేరియా రోగి విజయనగరంలోని ఫైలేరియా యూనిట్కు వెళ్లి వ్యాధి నివారణకు ఉపయోగించే డీఈసీ మాత్రలు అడగ్గా మందులు లేవనిచెప్పి పంపించేశారు.● గంట్యాడ మండలానికి చెందిన ఓరోగి కూడా విజయనగరంలో ఉన్న ఫైలేరియా యూనిట్కు డీఈసీ మాత్రల కోసం వెళ్లగా అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పి పంపించేశారు. ఇలా వీరిద్దరే ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇది. ఫైలేరియా (బోద) వ్యాధి నివారణలో డీఈసీ మాత్రలు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. దీంతో వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవడానికి అసక్తి చూపుతారు. వేలాది మంది బోదవ్యాధిగ్రస్తులు జిల్లాలో ఉన్నారు. బోధవ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో వివక్ష ఉంది. బోధవ్యాధి సోకినవారిలో చాలా మంది అవివాహితులుగా ఉండిపోతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రోగులు మరింత ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తులకు చిన్న రాయి గుచ్చుకున్నా పెద్దపెద్ద గాయాలై పోతాయి. అంతేకాకుండా సెల్యూలైటిస్ వ్యాధి త్వరగా వీరికి సోకుతుంది. దీంతో వారు మందులు వాడుతూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో 3,238 మంది రోగులు జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధిసోకడం వల్ల వారంతా నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు. మందుల సరఫరా నిలిపివేసిన సర్కార్ ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందించే డీఈసీ మాత్రల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి డీఈసీ మాత్రలు అందడం లేదు. మందులు అవసరమైన రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన మందులకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైలేరియా రోగులు జ్వరం, కాలువాపు, ఇన్ఫెక్షన్స్కు గురవుతారు. అటువంటప్పుడు డీఈసీ మాత్రలు వాడితే అవి తగ్గుతాయి. క్యూలెక్స్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల బోద వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బోధవ్యాధి అంతత్వరగా బయట పడదు. వ్యాధి బయట పడడానికి 10, 15 ఏళ్లు పడుతుంది. కొద్దిపాటి జ్వరానికి తరచూ గురవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, కాళ్లు చేతులపై ఎర్రని చారలు కనబడతాయి. కొంత కాలం తార్వాత కాళ్లు, చేతులు, వృషణాలు , ఇతర జన నేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోద వ్యాధి లక్షణాలే. బోధ వ్యాధిసోకిన వ్యక్తికి 21 రోజుల పాటు తొలుత చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి 12 రోజుల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఫైలేరియాకు మందుల సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం జిల్లాలో 3,238 మంది వరకు ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్న రోగులుకొత్త కేసులకు మాత్రమే ! ప్రస్తుతం వ్యాధిబారిన వారికి మందుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. సంబంధిత పీహెచ్సీలకు వెళితే వారికి డీఈసీ మాత్రలు ఇస్తారు. కొత్తగా నమోదైన కేసులకు మాత్రమే మందులు ఇస్తున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
శ్యామలాంబకు పాలస్నానం రేపు
చీపురుపల్లి: గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత శ్యామలాంబకు ఏటా నిర్వహించే పాలస్నానం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మమారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలస్నానం చేయనున్నారు. పాలస్నానం సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి ధర్మకర్త(ఆశాది) పొన్నాడ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీ, జేసీబీ అడ్డగింతబొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామ పంచాయతీ పరిధిలో గల మంగలి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు, లారీని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. వాల్టా చట్టం నిబంధనలు ఉల్లఘించి గ్రావెల్ను చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు రూ.15 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా గ్రావెల్ను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ హరిప్రసాద్ వీఆర్ఓలు పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ప్రవేశాల ప్రారంభంచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలో గల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో చెవిటి,మూగ,దృష్టి లోపం ఉన్న చిన్నారులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని వెల్ఫేర్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ జీవీఎన్.రామకృష్ణ తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి,ఉచిత భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఫోన్ 9494777905 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆకస్మికంగా ఉపాధ్యాయుడి మృతివేపాడ: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కాపు సత్యనారాయణ (40) ఆదివారం ఆకస్మికంగా మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్దానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జరిగిన ఫంక్షన్లో పాల్గొన్న ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఎస్కోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాపు సత్యనారాయణ ప్రస్తుతం మెంటాడ మండలం బిరసాడవలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య జయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతిపట్ల వేపాడ మండల ఉపాధ్యాయులు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నేడు పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం సోమవా రం సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ కె.శిరీష ఆదివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువుదీరిన పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మేళతాళాలు, భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారిని వనంగుడి నుంచి గాడీఖానా, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటి వద్దనున్న చదురువద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ ఘటాలకు పూజలు, ఊరేగింపు అనంత రం మంగళవారం వేకువజాము నుంచి అమ్మవారు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మళ్లీ పైడితల్లి అమ్మవారు జాతర చివరి ఘట్టమైన ఉయ్యాలకంబాల మహోత్స వం తర్వాత అమ్మవారిని వనంగుడికి తీసుకువస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. విజయనగరం టౌన్: విజయభావన సాహిత్య సదస్సులో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం శ్రీభాష్యం హరిచంద న్ రచించిన ‘శబలత’ గ్రంథావిష్కరణను సాహితీ విజయసారథి డాక్టర్ ఎ.గోపాలరావు ఆదివారం ఆవిష్కరించారు. ప్రముఖ కవి మానాపురం రాజాచంద్రశేఖర్ సమీక్షించారు. సమ్మానకర్తగా కొంకెపూడి అనూరాధ వ్యవహ రించారు. ఈ సందర్భంగా చిరకాలం సేవలందించిన తూట బాబాజీని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భావుకత సామాజిక వాస్తవికత ముప్పేట అల్లికగా గ్రాంథిక వ్యవహార భాషలలో సాగిన చిక్కని కవిత్వం ఈ శబలత అన్నారు. గ్రంథ రచయిత డాక్టర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న వివి ధ అంశాలపై స్పందనగా వచ్చిన కవిత్వమన్నా రు. డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య ఆహ్వానం పలకగా, పార్ధన, పద్యపఠనం చేశారు. కార్యక్రమంలో దశగ్రంథాల సుబ్రహ్మణ్యం, సోమే శ్వరరావు, బాబూజీ, హరిప్రియ, ఆముక్తమా ల్యద, చీకటి దివాకర్, మానాప్రగడ సాహితీ, తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: పట్టణం పండగ సందడిలో మునిగి తేలుతోంది. దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల తొలేళ్ల ఉత్సవాల ముందు రోజు జరుపుకునే దేశమ్మతల్లి వారోత్సవాలు సందడిగా సాగా యి. పాత బొబ్బిలి సరేపోలమ్మ ఆలయ ధర్మకర్త చోడిగంజి రమేష్నాయుడు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రభల ఊరేగింపు క్రతువు సరేపోలమ్మ ఉత్సవాల్లో ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలాగే దిమిలి పొడుగు మనుషుల విచిత్ర వేషధారణలూ ఆకట్టుకున్నాయి. మరో పక్క దేశమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులను ఆశీర్వదించడానికా అన్నట్టు శివపార్వతులు, ఇతర దేవతామూర్తు లు, రుషుల అలంకరణలతో ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి నెట్టాయి. జంట సిరిమానులు తిలకించేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి బంధువులూ, భక్తులు ఆయా బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. విజయనగరం టౌన్: రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అందజేస్తున్న ఎయిర్ ప్యాకేజీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్సీటీసీ టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ కోరారు. శాంకరీదేవీ శక్తిపీఠంతో శ్రీలంక రామాయణ యాత్రలో భాగంగా కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువరెలియా పర్యటన మే 14 నుంచి 19 వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బద్రీనాథ్ యాత్ర, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఉత్తర భారతదేశం చార్థామ్ యాత్ర జూన్ 12 నుంచి 23 వరకూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9281495847, 9550166168 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
స్వీయ గణనపై అవగాహనకు 5 కె రన్
విజయనగరం అర్బన్: ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5 కె రన్ను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి స్థానిక శ్రీపైడితల్లి అమ్మవారి గుడి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి కచ్చితమైన గణాంకాలు అందుతాయని, ఆ గణాంకాల ఆధారంగా అభివృద్ధి పథకాలను సమర్ధవంతంగా అమలు చేయగలుగుతామని చెప్పారు. డిజిటల్ విధానాన్ని వినియోగించి సులభంగా స్వీయ లెక్కింపులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విధానం సమయం ఆదా చేయడంతో పాటు పారదర్శకతను పెంచుతుందన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో అధికారులు, వాలంటీర్లు ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని ఈ ప్రక్రియలో ఎవరూ దూరం కాకుండా చూడాలని సూచించారు. సరిగ్గా నమోదు చేసిన సమాచారం భవిష్యత్తులో సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం కీలకమని పేర్కొన్నారు. ర్యాలీ గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి గుడి 4, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, వైఎస్సార్ కూడలి, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కోట వరకు సాగింది. కోట వద్ద జరిగిన సభలో డీఆర్ఓ సత్తిబాబు మాట్లాడుతూ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణనలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన, మే 1 నుంచి 31 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజల సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఓ బాలాజీ, ఆర్డీఓ సాగర్, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, డీఈఓ మాణిక్యం నాయుడు, మార్క్ఫెడ్ డీఎం ఎంకటేశ్వరరావు తదితర జిల్లా అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నిరుద్యోగులతో బంతాట..! జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. విజయనగరం ఫోర్ట్: టీడీపీ సర్కార్ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మాదారి అడ్డదారి అన్న విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూసి నిరుద్యోగ అభ్యర్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టుల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని వైద్య ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. నియామక ఆదేశాలిచ్చి... ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు కేడర్ పోస్టులకు 2024 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 09, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టు – 01, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు – 01, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు – 01కి నోటిఫికేషన్ ఇచ్చారు. 16 నెలల తర్వాత కొద్ది రోజులు క్రితం పోస్టుల భర్తీ పక్రియ చేపట్టారు. వీరందరికి కొద్ది రోజులు క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వారం రోజుల్లో విధుల్లో చేరాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఆర్డర్స్ పట్టుకుని ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లారు. తీరా అక్కడ అధికారులు ఇప్పుడు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోం... మళ్లీ ఎప్పుడు చేరాలనేది తామే చెబుతామని చెప్పి వెనక్కి పంపినట్టు తెలిసింది. దీంతో ఎంపికై న అభ్యర్థులు చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అసలు తమ నియామక విషయంలో ఏం జరుగుతుందని వారు మదనపడుతున్నారు. నియామక ఆదేశాలిచ్చిన తరువాత ఈ నిర్లక్ష్యమేమిటని వారు వాపోతున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 7వ తేదీలోగా విధుల్లో చేరాలని వైద్య కళాశాల అధికారులు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్నారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ గడువు 7వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు తమకు వస్తాయా? లేక టీడీపీ సర్కార్ మార్చేస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్స్ ఇచ్చేది మేమే కదా తేదీలు మార్చి మళ్లీ ఆర్డర్స్ ఇవ్వవచ్చని చావు కబురు చల్లగా వైద్య కళాశాల అధికారులు చెబుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎప్పుడు ఇలా లేదు.. పోస్టుల భర్తీ విషయంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన ఒకటి రెండు నెలల్లో భర్తీ చేసి విధుల్లోకి తీసుకుంటారు. కానీ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును సర్వత్రా తప్పుబడుతున్నారు. ఇదేమి విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, జీడీఏ, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన మాట వాస్తవమే. వారిని విధుల్లోకి తీసుకోలేదు. క్లారిఫికేషన్ కోసం డీఎంఈకి లెటర్ రాశాం. అక్కడ నుంచి క్లారిఫికేషన్ రాగానే విధుల్లోకి తీసుకుంటాం. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వారినే విధుల్లోకి తీసుకుంటాం. – డాక్టర్ దేవీమాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
యువకుడిపై పొక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్ : విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐ నరసింహమూర్తి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లూరు చెందిన 19 ఏళ్ల యువకుడు, 15 ఏళ్ల బాలిక ఏడాదిగా ప్రేమించు కుంటున్నారు.బాలికతో తరచూ మాట్లాడడం కోసం యువకుడు బాలికకు సెల్ఫోన్ కూడా కొని ఇచ్చాడు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని షికార్లు తిరిగారు. రెండు రోజుల క్రితం వీటీ అగ్రహారంలో ఉంటున్న బాలికకు వాంతులు కావడంతో తల్లికి చెప్పింది. ఆపై భరించలేనంత కడుపు నొప్పి రావడంతో పరీక్ష చేయగా గర్భిణిగా తేలింది. వెంటనే కన్న వారు స్థానిక ఘోషా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులు స్థానిక ఘోషా హాస్పిటల్కు వెళ్లి బాలిక నుంచి వివరాలు తెలుసుకుని చెల్లూరు కు చెందిన కేశవ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దర్యాప్తులో బాలిక పై చేసిన ఘోరం రుజువు కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కామేశ్వరరావుకు లాస్యప్రియ ఉగాది ప్రతిభా పురస్కారంవిజయనగరం టౌన్: ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు, ధర్మాస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పీఎస్వీ.కామేశ్వరరావుకు ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో లాస్యప్రియ ఉగాది ప్రతిభా ఆచార్య పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు మేడిది నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కూచిపూడి సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆటోను ఢీకొట్టిన కారు: 13 మందికి గాయాలు
పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం నెమ్మదిగా వెళ్తున్న లగేజీ ఆటోను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో 13 మందికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదే దిశగా ప్రయాణికులతో వెళ్తున్న లగేజీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన వ్యక్తులను సుందరపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డి.దేవి, కె.సావిత్రి, డి.నాగమణి, డి. లావణ్య, డి.లక్ష్మీదేవి, డి.నిహారిక, డి.మీనాక్షి, డి.రోహిణి, డి. శశాంక్కు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవడంతో సంఘటనా స్థలం నుంచి విజయనగరంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు రాజాం మండలం శ్యాంపురం గ్రామస్తులు కాగా వారు జీవనోపాధి నిమిత్తం విశాఖ సుజాత నగర్లో నివాసం ఉంటున్నారు, శ్రీకాకుళం సమీపంలో రాజులమ్మ ఆమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో సుజాతనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కారులో ప్రయాణిస్తున్న రణస్థలం మండలం జీరుపాలెంకు చెందిన డి. సుశీల, డి.రాముడుకు గాయాలయ్యాయి. వారికి సుందరపేట ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమం -
ఏడాదంతా గజరాజుల బెడదేనా..!
జియ్యమ్మవలస రూరల్: మండలంలో గజరాజుల సంచారంతో ఏడాది పొడవునా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సింగనాపురం గ్రామ సమీపాన పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. వ్యవసాయం, బోర్లు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించలేకపోవడంతో కూటమి ప్రభుత్వం మాట నీటి మూటేనని రైతులు విమర్శిస్తున్నారు. పరిహారం కోసం రైతుల ధర్నా నెల్లిమర్ల: తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 1లో భాగంగా నిర్మిస్తున్న కాలువలో ముంపునకు గురవుతున్న తమ భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సారిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు న్యాయం చేయాలని శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లోని చెట్ల వేలం పాట వేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి అవార్డు ఎంక్వయిరీ కూడా సక్రమంగా చేయలేదని తహసీల్దారు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 1200 ఎకరాల భూములు కోల్పోయి, పూర్తిగా నిరాధారమైన తమ గ్రామానికి పీఏఎఫ్ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు మజ్జి రామారావు, సారిపల్లి గురునాధరావు, మజ్జి నాగరాజు, పాలూరి భానోజి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
విజయనగరం క్రైమ్: స్థానిక రౌతు వీధికి చెందిన రాంబల్పు మనోజ్కుమార్ అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన కొడుకు కనిపించడం లేదని తల్లి దేవి ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి, వెతుకులాట ప్రారంభించామని దర్యాప్తు అధికారి చిన్నయ్య చెప్పారు. విజయనగరం క్రైమ్: వివాహితుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రేగిడి శ్రీకాంత్ ఇంతవరకు ఇంటికి రాలేదని ఆయన భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఐవో రవి తెలిపారు. -
● న్యాయం కోసం మహిళ నిరాహారదీక్ష
కొత్తవలస మండలంలోని మంగళపాలెం, తాడివానిపాలెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు కొంతమందితో కలిసి ఈ నెల 17వ తేదీన చింతపాలెంలోని తమ షాపులు, సమాధులను ధ్వంసం చేశారు.. చంపేస్తామంటూ బెదిరించారు.. కులం పేరుతో ధూషించారు.. పోలీసులు కేసు నమోదుచేసినా సక్రమంగా విచారణ జరగలేదు... పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.. న్యాయం జరిగేవరకు నిరాహార దీక్ష చేస్తానంటూ చింతలపాలెం గ్రామానికి చెందిన బోని లక్ష్మి వివాదాస్పద స్థలంలో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. నిందితులు బహిరంగంగా తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడం అన్యాయమన్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడం విచారకరమని, నిందితులను శిక్షించేవరకు దీక్ష సాగిస్తానని స్పష్టం చేశారు. ఆమె దీక్షకు బీఎస్పీ రాష్ట్ర కార్యద్శి బోని కృష్ణ సంఘీభావం తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తిచేశారు. – కొత్తవలస -
● హెచ్చరిక.. మాకోలెక్కా..?
చిత్రం చూశారా... బొబ్బిలి మండలం నారాయణప్పవలస గ్రామంలోని వెంకమ్మ చెరువు ఇది. దాదాపు అరెకరం వరకు చెరువులో గ్రావెల్వేసి పక్కా కట్టడానికి పునాదులు వేశారు. గతంలో చెరువులో గ్రావెల్వేసి కప్పుతున్న విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ ఎం.శ్రీను పరిశీలించారు. చెరువును కబ్జాచేయడం నేరమని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కొందరు బోర్డును తొలగించి మళ్లీ గ్రావెల్ వేసి, కాంక్రీటుతో పక్కాగా పునాదులతో నిర్మాణం చేపట్టారు. గ్రామ అవసరాలకు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నా వాల్టా చట్టం ప్రకారం చెరువు దురాక్రమణ నేరమని తహసీల్దార్ స్పష్టంచేశారు. పరిశీలించి, కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులో అక్రమనిర్మాణం విషయం తెలియదని వీఆర్వో చెప్పడం కొసమెరుపు. – బొబ్బిలి రూరల్ -
ఆడ బిడ్డలతో
● చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ● న్యాయం కోసం మండుటెండలో మహిళల పోరాటం అక్కడో మాట.. ఇక్కడో ఆట! సాక్షి, పార్వతీపురం మన్యం: చెప్పేవి మహిళా పక్షపాతి మాటలు.. చేసేవి మహిళలను రోడ్డుకీడ్చే చేష్టలు! చంద్రబాబు ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో న్యాయం కోసం అయిదుగురు అబలలు మండుటెండలో గత బుధవారం నుంచి పార్వతీపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజకీయ చదరంగంలో అన్యాయంగా ఉద్యోగాలు పోగొట్టుకుని, పొట్టచేత పట్టుకుని ఆకలి కేకలు పెడుతున్నారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఆమె’కు సమాన హక్కులు అంటూ డ్రామాలు చేస్తున్న పాలకులు... తమ సొంత రాష్ట్రంలో.. సాక్షా త్తు సీ్త్రశిశు సంక్షేమ మంత్రి ఇలాకాలో ఆడ బిడ్డలు.. అందునా చిరుద్యోగులు బలైపోతే... వారి ఆవేదన మన్యం గడప దాటకపోవడం గమనార్హం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒత్తిడి వల్లే కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ ఎప్పటికి స్పందిస్తారో చూడాలి. -
వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి
రాజాం సిటీ: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు. తన తండ్రి శ్రీనివాసరావు చేస్తున్న బట్టల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకుని కొంతకాలం తండ్రితో వ్యాపారం చేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. తరువాత వేరుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టి కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. వ్యాపారంలో నిమగ్నమైన ఆ యువకుడిని వడదెబ్బ రూపంలో మృత్యువు కబళిస్తుందని తెలుసుకోలేకపోయాడు. మండల పరిధి దోసరి గ్రామానికి చెందిన కత్తిరి బాబి (23) వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కత్తిరి బాబి వస్త్ర వ్యాపారం చేస్తూ ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. గుమ్మలక్ష్మీపురంలో నివాసం ఉన్న బాబి ఎప్పటిలాగే ఈ నెల 24న కూడా వ్యాపారానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి కురుపాం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా తను కష్టపడుతూ తన అన్నయ్య అభిని డిగ్రీ చదివించడంతో పాటు ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే కోచింగ్కు అయ్యే ఖర్చు భరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, తన అన్నయ్యను అయినా మంచి ఉద్యోగిగా చూడాలని ఆశపడేవాడని పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న బాబి మృతితో తల్లిదండ్రులు కత్తిరి శ్రీనివాసరావు, మల్లీశ్వరితో పాటు కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వడదెబ్బ కారణంగానే బాబి మృతి చెందాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కురుపాం : మండలంలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాహుల్(9) అనారోగ్యంతో శనివారం సొంతూరులోనే మృతి చెందాడు. రాహుల్ నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడని, పాఠశాలలో ఉండగానే అనారోగ్యంతో బాధపడేవాడని, సంబంధిత సిబ్బంది పట్టించుకోలేదని.. పాఠశాల ఉన్న సమయంలో తమ వెంట పంపించాలని కోరినా పంపలేదని రాహుల్ తల్లి శాంతి కన్నీరుమున్నీరైంది. రాహుల్ కుటుంబానికి పది లక్షలు రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థి గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. రాహుల్ మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోసరిలో విషాదం -
బ్యానర్...
నకిలీపురుగు మందులు విజయనగరం ఫోర్ట్: కంచే చేను మేసిన చందాన ఓ అధికారి తీరు వ్యవసాయశాఖలో చర్చనీయాంశంగా మారింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాల్సిన అధికారే... భర్తతో కలిసి నకిలీ ఎరువులు, పురుగు మందుల విక్రయాన్ని ప్రోత్సహించడం వివాదాస్పదంగా మారింది. పంటలకు అశించే తెగుళ్లు, పురుగుల నివారించాలంటే నాణ్యమైన పురుగు మందులు అవసరం. నకిలీవి, నాణ్యతలేనివి పిచికారీచేస్తే తెగుళ్లు, పురుగుల నివారణ సాధ్యంకాదు. రైతులు పంట నష్టపోతారు. ఆ అధికారి మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. రైతులు నష్టపోతే తమకేం అన్నట్టుగా వ్యవహరించారు. డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని వ్యవసాయ సిబ్బందిపై ఒత్తిడిపెంచారు. భర్త ఎరువుల వ్యాపారానికి సహకరిస్తూ దందాకు దిగారు. వీరి ఆగడాలు, అరాచకాలు శృతిమించడం, రైతులు నష్టపోతుండడంతో సిబ్బంది కొందరు వ్యవసాయ శాఖ కమిషనర్కు నేరుగా ఫిర్యాదుచేశారు. అందులో ఆ అధికారి భర్తతో కలిసి చేస్తున్న దందాను వివరించారు. అయితే, ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు బయటకు పొక్కనీయకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారు. ● గజపతినగరం సబ్ డివిజన్ వేదికగా... గజపతినగరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, గజపతినగరం మండలాల్లో ఏడాది కాలంగా నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ ఏడాది కిందట బాధ్యతలు స్వీకరించిన అధికారి నకిలీ ఎరువులను రైతులకు అట్టగట్టేందుకు ‘నిర్మల’ంగా స్కెచ్వేశారు. అక్రమ వ్యాపారానికి ‘జ్యోతి’ వెలిగించారు. కాలం చెల్లిన క్రిమి సంహారక మందులను రీసైక్లింగ్ చేసి రైతులకు విక్రయించినట్టు సమాచారం. వీటిని అ అధికారి తెరవెనక నుంచి ప్రమోట్ చేయగా, ఆమె భర్త ఎరువుల డీలర్లకు డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు తెలిసింది. ఆ మందులనే విక్రయించేలా డీలర్లపై ఒత్తిడి తేవాలంటూ వ్యవసాయ సిబ్బందికి హుకుం జారీచేసినట్టు భోగట్టా. ● గుట్టుగా విచారణ వ్యవసాయ శాఖ సిబ్బంది కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదుపై వ్యవసాయ అధికారులు గుట్టుగా విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ విచారణకు వ్యవసాయ ఏడీఏను కూడా పిలవడంతో కొంత భయపడుతూ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు అన్నీ వాస్తవాలంటూ నిరూపించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విచారణ సాగుతోంది.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గజపతినగరం సబ్ డివిజన్ ఏడీఏపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. ఏడీఏ భర్త ఎరువులు, పురుగు మందుల డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న మాటవాస్తవమే. వ్యవసాయ శాఖ సిబ్బంది ఏడీఏపై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ పూర్తయింది. నకిలీ ఎరువులు, పురుగు మందులపై వచ్చిన ఫిర్యాదుపై ఏడీఏ స్థాయి అధికారితో విచారణ చేపడతాం. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి భర్త వ్యాపారానికి సాయం.. రైతన్నకు సున్నం.. వెలుగులోకి ఓ వ్యవసాయాధికారి నాసిరకం మందుల వ్యాపార దందా నకిలీ మందుల విక్రయానికి సహకరించాలంటూ సిబ్బందిపై ఒత్తిడి వ్యవసాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు గుట్టుగా విచారణ -
పనులు అడ్డుకుంటే అరెస్టు చేయండి
మక్కువ: మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేయాలని మంత్రి సంధ్యారాణి పోలీసులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులను ఎవరు అడ్డుకున్నా... రోడ్డు విస్తరణ పనులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినా అరెస్డు చేయాలని సాలూరు సీఐ రామకృష్ణను ఆదేశించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలన్నారు. సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆ పార్టీ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మక్కువ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది కనిపించారు. వీరిలో చాలా మంది రోడ్లు, భూ సమస్యలపై, పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. మంత్రి మాటలకు ఉపాధి వేతనదారులు షాక్ ఉచిత బస్సులో ఉపాధి వేతనదారులు పని ప్రదేశం నుంచి ఆర్టీసీ బస్సులో శనివారం మక్కువ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి వేతనదారులతో మాట్లాడుతుండగా ఉపాధి బిల్లులు అందడం లేదని వేతనదారులు సమస్యని తీసుకువచ్చారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ఉపాధి బకాయిలు బ్యాంకులో ఉంటే.. మీ వద్ద ఉన్నట్టే అంటూ మాట్లాడటంతో వేతనదారులు షాకయ్యారు. ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ కె.భరత్కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి సంధ్యారాణి -
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
● ఎన్సీడీ జిల్లా అధికారి జగన్మోహనరావు పార్వతీపురం: వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీడీ జిల్లా అధికారి డా.టి జగన్మోహన్రావు సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదగుడబ పంచాయతీ ఎస్ఆర్పేటను శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల లభ్యతను పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు మందులు క్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించాలని సిబ్బందికి సూచించారు. వేసవి నేపథ్యంలో వాతావరణ మార్పులు–మానవ ఆరోగ్యం కార్యక్రమం ద్వారా గ్రామంలో పోస్టర్లతో అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీటిని కోల్పోతుందని, దాహం లేకపోయినా తరుచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎండలో ఎక్కువ సేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో వైద్యాధికారిణి ఎం.చాందిని, సీహెచ్ఓ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లే.. క్రీడా లోకం...
అనుబంధం.. ఆప్యాయత.. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసేందుకు వివిధ రకాల ఆట వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చులో ఇంట్లోనే కొన్ని రకాల ఆటలను రూపొందించుకోవచ్చు. పాత తరం నుంచి వచ్చే వాటిని అమ్మమ్మ, నానమ్మ, తాతల నుంచి నేర్చుకోవచ్చు. ఇదే క్రమంలో పిల్లల ముందు అవసరానికి మించి ఫోన్ వినియోగించడం ద్వారా వారి మనసు మళ్లే అవకాశం ఉందని గుర్తించాలి. వారితో పాటు కొన్ని రకాల వాటిల్లో భాగస్వాములైతే.. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగనుంది. అందుకు రోజులో కొంత సమయాన్ని తప్పక కేటాయించాలని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆటల ద్వారా గెలుపోటములు సమానంగా స్వీకరించే సామర్థ్యం సొంతమవుతుంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ ఇంటి ఆవరణలో కాస్త ఖాళీ స్థలం ఉంటే.. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్(మినీ సెట్) ఆడుకోవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక్కో సెట్ రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఇద్దరు లేదా నలుగురు ఒకేసారి రంగంలో దిగొచ్చు. వాటి ద్వారా దూరదృష్టి, మెదడు చురుకుదనం పెరుగుతుంది. కండరాలను బలంగా మార్చుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బిజినెస్, లూడో రూ.100 – రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. బిజినెస్ గేమ్లో నలుగురు ఆడవచ్చు. పాచికలతో కూడిన ఆట. వ్యాపార మెలకువలు తెలుస్తాయి. లూడో గేమ్తో కుటుంబం, స్నేహితుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పిల్లల్లో లెక్కలు, సంఖ్యల గుర్తింపు సామర్థ్యం పెంచుతాయి. వైకుంఠపాళి, అష్టాచెమ్మ.. ఒక్కో క్రీడా సెట్ రూ.300 వరకు పలుకుతుంది. వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గెలుపోటములు, హెచ్చుతగ్గులను ఈ ఆటలు బోధిస్తాయి. మెదడుకు చక్కటి వ్యాయామం లభిస్తుంది. వ్యూహాలు నేర్చుకోవచ్చు. రోజంతా వినోదాన్ని పంచుతాయి. చదరంగం.. చెస్ బోర్డు రూ.200 నుంచి రూ.300ల లోపే లభిస్తుంది. ఇద్దరు సరదాగా ఆడుకోవచ్చు. మెదడుకు పదును పెట్టే చురుకై న ఆట. మేధో, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెంపొందుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. -
పాలిసెట్కు 90 శాతం హాజరు
విజయనగరం అర్బన్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2026) పరీక్ష ఉమ్మడి విజయనగరం జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. విజయనగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి, బొబ్బిలి పట్టణాల్లో ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 8,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 7,222 మంది పరీక్షకు హాజరయ్యారు. 832 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 90 శాతం హాజరునమోదైనట్టు పరీక్షల జిల్లా కన్వీనర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పాలిసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ధీరా ఫౌండేషన్, సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల, సీతం కళాశాల సంయుక్తంగా విజయనగరం, గరివిడి, ప్రాంత్రాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద మజ్జిగను పంపిణీ చేశారు. -
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
పార్వతీపురం రూరల్ : మలేరియా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం డ్రై–డే పాటించాలని సూచించారు. దోమ తెరలు వాడటం, లార్వా వృద్ధిని అరికట్టడం ద్వారానే వ్యాధిని నియంత్రించగలమన్నారు. మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమంతో శాఖల మధ్య సమన్వయం పెరిగిందని, ఇది మలేరియా నివారణకు తోడ్పడుతోందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో జ్వర సర్వే నిర్వహించి బాధితులను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, వైద్యులు విజయమోహన్, జగన్మోహనరావు, సూర్యకౌశిక్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
మార్గ‘మద్యం’గా సిండికేట్
రాజాం: రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. ఓ వైపు బెల్ట్ షాపులకు నిరంతరం సరఫరా అవుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. రాజాంలో ఎకై ్సజ్ అధికారులు శనివారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో సీతంపేట మద్యం దుకాణంలో విక్రయించాల్సిన మద్యం బాటిళ్లు రాజాంలోని దుకాణాల్లో ప్రత్యక్షమయ్యాయి. గుట్టుచప్పుగా విక్రయాలు చేయడంపై ఎకై ్సజ్శాఖ సీఐ ఆర్.జైభీమ్తో పాటు సిబ్బంది ఆరా తీశారు. దాడుల్లో 192 మద్యం బాటిళ్లు సీతంపేట మద్యం దుకాణానికి చెందినవిగా గుర్తించారు. వీటి విలువ రూ.19 వేలు ఉంటుందని అంచనా వేశారు. అయితే, మద్యంబాటిళ్లు సీజ్చేసిన ఎక్పైజ్శాఖ పోలీసులు విషయం బయటకురాకుండా జాగ్రత్తపడడం అనుమానాలకు తావిస్తోంది. సిండికేట్లో ‘పచ్చ’పాతం రాజాం మండలంతో పాటు నియోజకవర్గంలోని రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని వైన్షాపులన్నీ సిండికేట్గా మారి మద్యం వ్యాపారం చేస్తున్నాయి. వేలంపాటలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారంతా సిండికేట్గా మారి ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఏ దుకాణానికి ఇచ్చిన బాటిళ్లు ఆ దుకాణంతో పాటు ఆ ఏరియాలో మాత్రమే విక్రయించాలి. ఇక్కడ సిండికేట్లో కొంతమంది వ్యాపారులు తమకు ఇతర ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి సరుకును అక్రమంగా తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. మిగిలిన వ్యాపారులకు తెలియకుండా గుట్టుగా ఈ వ్యాపారం నిర్వహణ జరుగుతోంది. ఈ అక్రమ వ్యాపారం ఎంతకాలం నుంచి నడుస్తోందన్న వివరాలపై ఎకై ్సజ్ శాఖ ఆరా తీస్తోంది. రేగిడి మండలానికి చెందిన ఓ టీడీపీ నేత మద్యం దారిమళ్లిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. మద్యం అక్రమ వ్యాపారం వివరాలన్నీ తెలుసుకున్నాక మీడియా సమావేశంలో వెల్లడించి కేసు నమోదుచేస్తామని రాజాం ఎకై ్సజ్ సీఐ తెలిపారు. ఎకై ్సజ్శాఖ దాడుల్లో బయటపడిన ఇతర ప్రాంతాల మద్యంబాటిళ్లు -
మలేరియా రోగులు సత్వర చికిత్స తీసుకోవాలి
● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్సతీసుకోవాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్మూలనకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సింహాచలం, డీఎల్ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐపై బదిలీ వేటు? బాడంగి: బాడింగి పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన తారకేశ్వరరావును విజయనగరం క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తెర్లాం ఎస్ఐ సాగర్బాబును ఇన్చార్జి ఎస్ఐగా నియమించించారు. ఎస్ఐను ఆకస్మికంగా బదిలీ చేయడం, బదిలీ ఆర్డర్ వచ్చిన గంటల్లోనే రిలీవ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే ఎస్ఐను బదిలీ చేసినట్టు సమాచారం. తెలంగాణాకు చెందిన యూట్యూబ్ జర్నలిస్టు కేవీఆర్ ఎర్రబుక్ను ఎర్రిబుక్గా చేసి మాట్లాడాడన్న ఆరోపణపై టీడీపీ నాయకుడు, బాడంగి మాజీ సర్పంచ్ కండిరమేష్, ఎంపీటీసీ సభ్యుడు డి.శ్రీనివాసరావు 15 రోజుల కిందట ఎస్ఐకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసునమోదుచేసి సీఐ, ఎస్ఐ కలిసి కేవీఆర్ను అరెస్టుచేసి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడి జర్నలిస్టులంతా కలిసి అరెస్టును అడ్డుకున్నారు. 41 నోటీసులు జారీచేసి వెళ్లిపోవాలని, తామే పోలీస్సేషన్కు, లేదంటే కోర్టుకో కేవీర్ను తీసుకొస్తామని పూచీ పడడంతో ఎస్ఐ తిరుగుముఖంపట్టారు. చెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించనందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఎస్ఐపై ఎస్పీ బదిలీవేటు వేసినట్టు భోగట్టా. పక్కాగా ఎన్నికల రోల్స్ మ్యాపింగ్ పార్వతీపురం: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వాటి వివరాలను వెల్లడించారు. 2002 రోల్స్ డేటాను 2025 డేటాతో బీఎల్ఓల యాప్లో మ్యాపింగ్ చేస్తూ 68.53 శాతం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. వాటిలో 273 పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–6 కింద 7,437 దరఖాస్తుల్లో 6,358 కొత్త ఓటర్లు చేరారన్నారు. ఫారం–7 కింద 2,046 ఓట్లు తొలగించగా, నాలుగు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–8 కింద 6,934 సవరణలు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. రీ సర్వేను వేగవంతం చేయాలి పార్వతీపురం: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో వీఆర్వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో రీసర్వే పురోగతిపై శనివారం సమీక్షించారు. దశలవారీగా సర్వే నిర్వహిస్తూ ఈకేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. డ్రాప్ట్ దశకు ముందే అవసరమైన సవరణలు పూర్తిచేయాలని సూచించారు. 95 శాతం ఈకేవైసీ లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి వీఆర్వో రోజుకు కనీసం 50 ఖాతాలు పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ వెర్ఫికేషన్లో ఫొటోలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా సేకరించాలని తెలిపారు. జిరాయితీ ఖాతాల ఆమోదాన్ని ఆర్డీఓ స్థాయికి అప్పగించడంతో ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖాతాలను వారసులకు బదిలీ విషయంలో స్పష్టతతో పనిచేయా లని ఆదేశించారు. -
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
గుమ్మలక్ష్మీపురం: ఇంటి బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు, తాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పారిపోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతవీధికి చెందిన సుజాత ఉక్కపోత కారణంగా ఇంటి బయట నిద్రించింది. శనివారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సుజాత మెడలోని బంగారు గొలుసు లాక్కొని, మళ్లీ మెడలోని బంగారు తాడును కూడా లాక్కొనేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చి ప్రతిఘటించింది. బంగారు తాడు తెగిపోవడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. సుజాత తేరుకుని చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బి.హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అపహరణకు గురైన ఆభరణాలు సుమారు మూడు తులాల వరకు ఉంటుందని తెలిపింది. -
తప్పిన ప్రమాదం
● గ్యాస్ బండ పైపు నుంచి చెలరేగిన మంటలు లక్కవరపుకోట : మండలంలోని బీసీ కాలనీలో ఒక ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వీధిలోకి పరుగులు తీసింది. ఏం జరుగుంతుందో తెలియకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బీసీ కాలనీలో పొలమరశెట్టి వెంకటరావు భార్య శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ పైపు నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దీంతో స్థానికులు ఇంటిలోకి వచ్చి చూడగా మంటలు రేగి వంటింట్లో గల సామాన్లు కాలిపోయాయి. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. స్థానిక యువత పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
వెలుగులోకి ఇలా...
ఎరువులు, పురుగుమందులపై గడిచిన 2025 ఖరీఫ్ సీజన్లో మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ 2026గా పేర్కొనడం వ్యవసాయ సిబ్బందిని అశ్చర్యానికి గురిచేసింది. తీగలాగితే డివిజన్ స్థాయి వ్యవసాయాధికారి, ఆమె భర్త అరాచకాలు వెలుగుచూశాయి. డీలర్లకు వాట్సాప్లో ఎరువుల అమ్మకం సూచనలు, ఒత్తిడి సందేశాలు కనిపించాయి. ఇలాంటి నాసిరకం, నకిలీ ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తే రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో ఆధారాలు సేకరించారు. వాటితో కలిపి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమెకు రాజకీయ పలుకుబడి దండిగా ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏమీ చేయలేరన్న ధీమా వ్యక్తం చేస్తుండడం ఉద్యోగులను విస్మయపరుస్తోంది. డీలర్లకు వాట్సాప్లో పంపిన పురుగు మందుల జాబితా -
పనితీరు ఆధారంగా గౌరవ వేతనం
విజయనగరం ఫోర్ట్: పనితీరు ఆధారంగా గ్రామ సంఘం అసిస్టెంట్ల గౌరవ వేతనాలను ప్రతీ నెల సమయానికి జనరేట్ చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఎంఎస్ అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 31 నాటికి మండల సమాఖ్యలలో ఉన్న బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్యాలెన్స్లు కన్ఫర్మేషన్ ఆన్లైన్ పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్నల్ ఆడిట్లో గమనించిన అంశాలను, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలన్నారు. గ్రామ సంఘాల, మండల సమాఖ్యలు నిధుల స్థితిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. మండల సమాఖ్య నిర్వాహణ ఖర్చులు మొత్తం ఆదాయానికి 30 శాతంకు లోపే ఉండేలా వ్యయ నియంత్రణ చేయాలన్నారు. గ్రామ సంఘాల్లో ఉన్న సొంత నిధుల స్థితిని తెలుసుకుని అంతర్గత అప్పులు ఇవ్వడం, తిరిగి రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు సంచాలకులు కె.సావిత్రి, డీపీఎంలు ఎ.చిరంజీవి, సీతారామయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి -
26న స్వీయగణనపై 5కే రన్
విజయనగరం ఫోర్ట్: భారత జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విజయనగరం పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటలకు 5కే రన్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. 5కే రన్ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ కూడలి మీదుగా కోటకూడలి వరకు సాగుతుందన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పలు శాఖలకు బాధ్యతలు కేటాయించామన్నారు. నేడు పాలిసెట్ ● జిల్లాలో 7,971 మంది కోసం 26 పరీక్ష కేంద్రాల ఏర్పాటు విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7,971 మంది అభ్యర్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ● విజయనగరం పట్టణంలో మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సెంటర్–ఏ,బీ,సీ), భాష్యం ఈఎం హైస్కూల్, ఏజీఎల్ కాలేజ్, సత్య డిగ్రీ–పీజీ కాలేజ్, ఆర్కే డిగ్రీ కాలేజ్, పీఎస్ఆర్ స్కూల్, నారాయణ ఈఎం స్కూల్ తదితర కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ● నెల్లిమర్లలో సీకేఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బాలాజీ పాలిటెక్నిక్, శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, గజపతినగరంలో విజేత డిగ్రీ కాలేజ్, శ్రీ కష్ణ జూనియర్ కాలేజ్, శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. ● చీపురుపల్లిలో జీబీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ కేంద్రాలుగా నిర్ణయించారు. గరివిడిలో ఎస్డీఎస్ కాలేజ్, శ్రీరామ్ జూనియర్ కాలేజ్, బొబ్బిలిలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్, ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కాలేజ్లలో పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్లో ఉద్యోగుల పెన్షన్ ప్రపోజల్స్ ● జిల్లా ఖజానా గణాంక అధికారి నాగమహేష్ విజయనగరం ఫోర్ట్: ఉద్యోగుల పెన్షన్ ప్రపోజల్ సమర్పణ ఇకపై ఆన్లైన్లో సమ ర్పించాలని జిల్లా ఖజానా అధికారి వి.నాగమహేష్ అన్నారు. జిల్లా ఖజానా కార్యాలయంలో విజయనగరం పరిధిలోని డీడీఓలకు రిటైర్మెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్పై శుక్రవారం అవగాహన కల్పించారు. ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, తదితర దరఖాస్తులన్నీ ఆన్లైన్లోని విధి పోర్టల్లో సమర్పించాలన్నారు. సెలవుల్లో తరగతులు ఎలా నిర్వహిస్తారు? పూసపాటిరేగ: మండల కేంద్రమైన పూసపాటిరేగలో మాస్టర్మైండ్స్ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ ఆదేశాలు భేఖాతరు చేయడం, సెలవుల్లో పాఠశాల నిర్వహణపై ఎంఈఓ రాజ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. సుమారు 20 మంది వరకు విద్యార్థులు పాఠశాలలో ఉండడంపై ప్రశ్నించారు. తరగతులతో పాటు హాస్టల్ నిర్వహించడం సరికాదని, వేసవి సెలవులను నిబంధనల ప్రకారం వాడుకోవాలని, ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ను హెచ్చరించారు. వేసవిలో పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వం సెలవులు మంజూరు చేసిందనే విషయాన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు గ్రహించాలన్నారు. -
దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..!
● ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ● ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● దోమ తెరలు వినియోగించాలి. ● ఇంటి కిటికీలకు మెస్లు బిగించాలి. ● తాగిపడేసిన కొబ్బరి బొండాలు, వాడిన టైర్లు ఇంటి పరిసరాల్లో ఉండకూడదు. ● వాటర్ ట్యాంకులకు మూతలు వేయాలి. ● మలాథియన్ స్ప్రేయింగ్ ఇంటి లోపల, బయట చేయించుకోవాలి.విజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. మలేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యేవారు కొందరు..వ్యాధితో పోరాటం చేయలేక మృత్యువాత పడేవారు మరికొందరు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ఆస్కారం ఉంది. శనివారం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. అప్పుడే మొదలైన మలేరియా వ్యాప్తి సాధారణంగా వర్షాకాలంలో మలేరియా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అధికంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం మైదానం, గిరిజన ప్రాంతం తేడా లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా వర్షాకాలం రాకముందే వ్యాధి వ్యాప్తి మొదలైంది. మలేరియా వ్యాప్తికి దోమలే కారణం అనాఫిలిస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుంది. జూన్ నుంచి ఆక్టోబర్ మధ్య కాలంలో ఎక్కువగా మలేరియా కారక దోమలు వ్యాప్తి చెందుతాయి. అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధి క్రిములను రోగి నుంచి ఆరోగ్యవంతులకు కూడా చేరవేస్తుంది. వర్షాకాలం సీజన్లో తరచూ వచ్చే వ్యాధి మలేరియా. దీని లక్షణాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా కారక సూక్ష్మక్రిములు, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫారమ్, ప్లాస్మోడియం బవెల్ రూపంలో ఉంటాయి. వ్యాధి లక్షణాలు: మలేరియా సోకితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సార్లు చలికూడా వేస్తుంది. పాల్సిఫారమ్ మలేరియా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రెండుగంటలలోపు ఆస్పత్రిలో చేర్పించాలి. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు చేయించాలి. రోజు విడిచి రోజు జ్వరం రావచ్చు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతులకు కుట్టిన 10 నుంచి14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. జిల్లాలో 56 కేసులు నమోదు జిల్లాలో జనవరి ఒకటో తేది నుంచి ఏప్రిల్ 23 వతేదీవరకు 56 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2025లో 390 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొదలైన మలేరియా వ్యాప్తి ఇప్పటివరకు 56 కేసుల నమోదు మలేరియా పట్ల నిర్లక్ష్యం తగదు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 2025– 26 లో 390 కేసులు నమోదు నేడు ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవంవ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:చర్యలు తీసుకుంటున్నాం: మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకే ప్రాంతాల్లో దోమల నివారణ మందును మేఒకటో తేదీనుంచి మొదటి విడత స్ప్రేయింగ్ చేయించనున్నాం. జిల్లాలోని 19 మండలాల్లో గల 26 పీహెచ్సీల పరిధిలో 165 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయించనున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
గ్రామాభివృద్ధితో దేశాభివృద్ధి
● జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం రూరల్: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందేలా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలకు సేవలు అందించడంలో ప్రతిభ చూపిన డిప్యూటీ ఎంపీడీఓలు ముగ్గురికి, ఆరుగురు పంచాయతీ అభివృద్ధి అధికారులకు, ఒక్కో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కు, ముగ్గురు మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి,, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు కంకర ట్రాక్టర్ల సీజ్
వీరఘట్టం: వంగర మండలం రుషింగి నుంచి వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి కంకరను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుబొబ్బిలి: పట్టణ సమీపంలోని సరేపోలమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస పట్నాయక్ అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస పట్నాయక్ తన స్వగ్రామం జగన్నాథపురం నుంచి పట్టణంలోకి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుకవైపు నుంచి బైక్తో ఢీ కొని పరారయ్యాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి దగ్గరకు ఏఎస్సై కొండల రావు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదువిజయనగరం క్రైమ్: ఈ ఏడాది ఎనిమిది పోక్సో కేసులలో నిందితులందరికీ యావజ్జీవ ఖైదు విధించినట్లు చిన్నారులు, మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో 46 పోక్సో కేసుల్లోను, 33 క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లోను నిందితులకు కఠినమైన శిక్షలు విధించారన్నారు. పోక్సో కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ, చర్యలు చేపట్టడం సత్ఫలితాలనిస్తోందన్నారు. 2024లో 10, 2025లో 28, ఈ ఏడాదిలో 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు లేదా 20ఏళ్లు కఠిన కారాగార శిక్షలు విధించారన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదంభామిని: మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వస్తున్న ఆర్టీసీ బస్సు బత్తిలి వెర్రిగెడ్డ బ్రిడ్జి ప్రవేశంలో పక్కకు తిప్పి ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులను తప్పించింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జి అంచు నుంచి గెడ్డలోకి దిగిపోవలసిన ఆర్టీసీ బస్సు వెనుక చాసీ గట్టుకు తగిలి గెడ్డలోకి పడకుండా బస్సు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బత్తిలి గ్రామస్తుల సహకారంతో ప్రయాణికులను దించి వేశారు. డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 13 కేజీల గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి 66 వేలు విలువ చేసే 13 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా శుక్రవారం అడ్డుకున్నామని గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీ రావు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం షిమోగాకు చెందిన వి.వరుణ ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైడ్ చేయగా వరుణ్ అడ్డంగా దొరికాడని, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు. -
ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం
విజయనగరం టౌన్: సనాతన గురుకులాశ్రమ గాయత్రి శ్రీ విద్యాపీఠం 33వ వార్షిక బ్రహ్మోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూల్బాగ్లోని ఉన్న విద్యాపీఠం ఆవరణలో కొలువైన అమ్మవారికి యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి విమలానందనాథ గురువర్యులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాపీఠంలో కొలువైన గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూప సంధ్యామూర్తులకు అష్టోత్తరశత కలశాభిషేకం, పంచామృతాభిషేకాలు, శ్రీ చక్ర కుంకుమార్చన, గాయత్రి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి, తరించారు. -
వీడిన మర్డర్ మిస్టరీ
● రౌడీషీటర్ హరనాథ్గా హతుడి గుర్తింపు ● ఐదుగురు కలిసి హత్యవిజయనగరం క్రైమ్: స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన పావాడ హరనాథ్ను అదే బస్తీలో ఉంటున్న స్నేహితులే గంజాయి మత్తులో హత్య చేసినట్లు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ఆధిపత్యం కోసమే తోటి మిత్రుడిని ప్లాన్ చేసి అంతమొందించారన్నారు. ఈ కేసుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వేఆర్కే చౌదరి, క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బృందం మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే మహిళ తన కొడుకు పావాడ హరనాథ్ మార్చి 27 వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని వన్ టౌన్ పోలీసులకు ఈ నెల10వ తేదీన ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివారులోని నూతిలో ఒక వ్యక్తి.. మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు పరిశీలించి మిస్సింగ్ అయిన పావాడ హరనాథ్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పుచేసి, వన్ టౌన్ సీఐ దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతి చెందిన పావాడ హరనాథ్ పై రౌడీషీటు ఉన్నట్లు, ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిసింది. హత్య నేపథ్యం.. జొన్నగుడ్డిలో ఉంటున్న పావాడ హరనాథ్కు అదే ప్రాంతంలో ఉంటున్న బాక్సర్ (ఎ1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణకు ఇటీవల గొడవ జరగ్గా ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం తాను బాక్సర్ లక్ష్మణరావును కొట్టినట్లు పావాడ హరనాథ్ ఎక్కువగా ప్రచారం చేయడంతో ప్రతీకారం తీర్చుకోవాలని బాక్సర్ సొంటేన లక్ష్మణరావు భావించి, అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇదే క్రమంలో బార్లో మద్యం తాగి మత్తులో బార్ బయట పడిపోయిన హరనాథ్ను గమనించిన సొంటేన లక్ష్మణరావు (30) అతని వర్గానికి చెందిన కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20), మచ్చ తేజ (20), రేగిడి వాసుదేవ్ అలియాస్ వాసు (26) ఆటోలో హరనాథ్ను పట్టణ శివార్లలోకి తరలించి, అక్కడ రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని సిమెంట్ పోల్కు తాళ్లతో కట్టి, ఫ్లెక్సీ కప్పేసి పరారయ్యారు. ఇదే కేవలం ఇరు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో జరిగిన హత్య అని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పావాడ హరనాథ్ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. అంతేకాకుండా, నిందితులకు సహకరించిన మరో జువైనల్ను అదువులోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు పాల్గొన్నారు. -
పెన్షన్ మంజూరు చేయండి ‘నాయనా’..
రామభద్రపురం: అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు మంజూరు కావడం లేదు... కాస్త దయచూపాలంటూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను వేడుకున్నారు. పింఛన్ మంజూరుకాకపోవడంతో ఎదురవుతున్న ఆర్థిక కష్టాలపై ఏకరువుపెట్టారు. మండలంలోని నాయుడువలస సచివాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే బేబీనాయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో మొత్తం 59 వినతులు అందగా.. వాటిలో పింఛన్లకు సంబంధించినవే 18 ఉండడం గమనార్హం. ఉపాధిహామీ సమస్యలు, రోడ్లు, కాలువలు నిర్మాణంలో అలసత్వం, భూ సమస్యలు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీలో జాప్యంపై వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలంటూ వృద్ధులు కన్నీరుపెట్టడంతో ప్రభుత్వం తీరు ఇలా ఉందంటూ విస్తుపోవడం అక్కడి వారి వంతైంది. -
వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు
విజయనగరం గంటస్తంభం: వేసవి ఎండలు మండుతుంటే పల్లెల్లో మాత్రం మరో రకమైన సందడి మొదలవుతుంది. చెట్ల మీద పచ్చగా వేలాడే మామిడికాయలు కంటికి హాయిగా కనిపిస్తే, ఇంటింటా ఆవపిండి కాలం వచ్చింది అనగానే గ్రామాల్లో మహిళల కళ్లల్లో ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. మామిడికాయలు ఇంటికి చేరగానే అసలు పని మొదలవుతుంది. ముక్కలు కోసి,ఆవపిండి కలిపి,నూనె పోసి..చివరికి పెద్ద జాడీల్లో నింపే సమయం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉంటారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాడవాడలా ఆవకాయ సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో మాత్రమే కాదు..పట్ట ణాల్లో కూడా ఇంటింటా ఆవకాయ సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడికాయలకు డిమాండ్ పెరిగింది. -
మన్యంలో పొంచి ఉన్న ప్రమాదం
సీతంపేట: మన్యం అంటనే మలేరియా పాజిటివ్ కేసులకు పెట్టింది పేరనే నానుడి ఉంది. ఇప్పుడు మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా మలేరియా విలయతాండవం చేస్తోంది. గిరిజనగ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు 700కు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు. కానీ ఆ సంఖ్య వెయ్యికి పైగానే ఉండొచ్చనేది అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా కేసులు 110 వరకు నమోదయ్యాయి. అధికారులు 233 గిరిజన గ్రామాలను హైరిస్క్ మలేరియా గ్రామాలుగా గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్వరం వచ్చి రక్తపరీక్షలు చేయించుకుంటే మలేరియా,టైఫాయిడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడం పరిపాటిగా మారింది. 3లక్షల దోమతెరలకు 23 వేలే వచ్చాయి... మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 3లక్షల దోమతెరలు అవసరం కాగా కేవలం 23వేల 339 వందల దోమతెరలు మాత్రమే ఈ సంవత్సరం వచ్చాయి. వాటిని 8 పీహెచ్సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయో అక్కడ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 12 వేల దోమ తెరలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆతవ.. అభివృద్ధికి ఆవల
శింగరాయిలో అభివృద్ధికి నోచుకోని ఆతవ చానల్ సిస్టం–1వేపాడ: ఆతవ సాగునీటి చానల్–1.. వేపాడ మండలంలోని శింగరాయి, ఎల్.కోట మండలంలోని కిత్తన్నపేట, సంతపేట, ఎల్.కోట గ్రామాలకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీటి ఆదరువు. చానల్ ఆనకట్ట పూర్తిగా శిథిలమైంది. వర్షాకాలంలో మారిక గెడ్డ నుంచి వస్తున్న నీరు వృథా అవుతోంది. చానల్లో నీరునిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. వర్షాలు అనుకూలించని సమయంలో చివరి దశలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఆనకట్టకు మరమ్మతులు చేయాలని రైతులు వేడుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు శింగరాయి గ్రామంలో రామాలయం నుంచి ఊర్లోకి వెళ్లేందుకు ఆతవ చానల్ (గెడ్డ)పై దశాబ్దాల కిందట నిర్మించిన బిడ్జి శిథిలమైపోయింది. ఇరువైపులా నిర్మించిన రైలింగ్ పూర్తిగా పాడైంది. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో బ్రిడ్జి మధ్యలో కుంగిపోయింది. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ఆతవ చానల్ సిస్టం–1 ఆనకట్ట అభివృద్ధికి జలధార–జలహారతి ప్రొగ్రాంలో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. – ఎం.హేమకుమార్, ఇరిగేషన్ ఏఈఈ బ్రిడ్జి నిర్మించాలి శింగరాయి రామకొవెల నుంచి ఊర్లోకి వెళ్లాలంటే చానల్ సిస్టం కాలువపై నిర్మించిన బ్రిడ్జే ఆధారం. దశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జి శిథిలమైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు కూలిపోతుందో తెలియడంలేదు. తక్షణమే అధికారులు చొరవచూపి బ్రిడ్జి నిర్మించాలి. – గేదెల సత్యం, పాలసంఘం సొసైటీ అధ్యక్షుడు, శింగరాయి, వేపాడ మండలం ఏటా సాగునీటి కష్టాలు ఆతవ చానల్ సిస్టం–1ను అభివృద్ధి చేయడంలేదు. శిథిలమైన ఆనకట్టను బాగుచేయకపోవడంతో మారిక గెడ్డ నుంచి వచ్చే నీరు నిల్వ ఉండడంలేదు. పంటలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. పాలకులు, అధికారులు స్పందించి ఆనకట్టను తక్షణమే బాగుచేయాలి. సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలి. – నిరుజోగి వెంకటరావు, మాజీ సర్పంచ్, శింగరాయి గ్రామం, వేపాడ మండలం నిర్లక్ష్యంలో సాగునీటి చానల్ పూడుకుపోయినా పట్టించుకోని వైనం 2,500 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం ఆవేదనలో రైతాంగం -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
పూసపాటిరేగ: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని విశాఖ రీజియన్ ప్రకృతి వ్యవసాయం టెక్నికల్ మేనేజర్ కె.ప్రకాష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు ముగింపు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగులో అవలంబించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతర ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా అందుబాటులోకి తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది ఇన్పుట్ ప్రిపరేషన్, ఉపయోగాలపై పూర్తిస్థాయిలో తెలియజేశారు. తొలకరికి 15 కేజీల విత్తనాల కిట్లు అందజేస్తామన్నారు. తొలకరి సాగుకు 30 రకాల విత్తనాల ద్వారా పచ్చిరొట్ట ఎరువులు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి అడ్డూరి శ్రీని వాసరావు, విస్తరణాధికారి ఎస్.భాను, ప్రకృతివ్యవసా యం సిబ్బంది కమల, అశ్వని తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్ మేనేజరు ప్రకాష్ -
వైఎస్సార్సీపీలో చేరిన గొల్లుపాలెం మాజీ సర్పంచ్
బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పల్లి రామునాయుడు తన అనుచరులతో కలిసి గురువారం బోడసింగిపేటలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఆయన టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరించగా, తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరగా అయనకు పార్టీ కండువా కప్పి జెడ్పీ చైర్మన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, గ్రామ నాయకులు గొల్లు సతీష్, మూకల చలం నాయుడు, పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ ధర్నాకు పీఆర్టీయూ నాయకులు
విజయనగరం అర్బన్: ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏలు విడుదల, కొత్త పీఆర్సీ అమలు, 30 శాతం ఐఆర్ చెల్లింపు వంటి డిమాండ్లపై విజయవాడలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ధర్నాకు జిల్లాలోని పీఆర్టీయూ నాయకులు తరలివెళ్లారు. విజయనగరం జిల్లా నుంచి 45 కార్లు, 11 ఏసీ బస్సుల్లో శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డి.శ్రీనివాస్, రావాడ రామకష్ణ, చిట్టి రామునాయుడు, పెంకి శ్రీనివాస్, ఎస్.కోట నుంచి ఇందుకూరి అశోక్రాజు, మోహన్రాజు, సూరిబాబు, చీపురుపల్లి నుంచి రవీంద్రనాయుడు, గజపతినగరం నుంచి రావాడ రాంబాబు నాయకత్వంలో ఉపాధ్యాయులు విజయవాడ వెళ్లారు. -
విద్యుత్ షాక్తో వెల్డర్ మృతి
శృంగవరపుకోట: వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్.కోట మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గవరపాలెం గ్రామానికి చెందిన కాండ్రేగుల ఈశ్వరరావు(48) కొంత కాలం పాటు దుబాయ్లో వెల్డర్గా పనిచేసి ఆరేళ్ల క్రితం స్వంత గ్రామానికి వచ్చి భవానీనగర్ వద్ద వెల్డింగ్ దుకాణం పెట్టుకుని పని చేస్తున్నాడు. శుక్రవారం గంట్యాడ మండలంలోని మధుపాడ పంప్హౌస్ వెనుక ఉన్న షెడ్ నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు ఈశ్వరరావు భార్య వ్యవసాయ పనులు చేస్తుండగా, ఇద్దరు కుమారులు షిప్లో పని చేస్తారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. నేల బావిలో పడి వృద్ధుడు..రామభద్రపురం: మండలంలోని తారాపురంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా లక్ష్మణరావు(77) శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లాడు. అయితే దాహం వేయడంతో గ్రామం సమీపంలో ఉన్న చాకిరేవు పొలంలో సామంతుల కొత్తయ్య మాస్టారుకు చెందిన నేలబావిలో నీరు తాగడానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు.కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు హెచ్సీ ఎం.సత్యనారాయణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
మత్స్యకారులపై వేలం పిడుగు!
–8లోవారంతా మడ్డువలస ప్రాజెక్టుకు భూము లిచ్చి నిర్వాసితులుగా మారిన మత్స్యకా రులు. దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టులోని చేపలవేటే వారికి జీవనాధారం. ఇన్నాళ్లూ లీజు విధానంలో కొంత ప్రభుత్వానికి ముట్టజెప్పి చేపలవేట సాగిస్తున్నారు. పాత సంఘం కట్టాల్సిన బకాయిల బరువు ఇప్పుడు వారికి శాపంగా మారిం ది. లీజు స్థానంలో వేలం నిర్వహిస్తామన్న ప్రభుత్వ ఉత్తుర్వులు కంటిమీద కునుకులే కుండా చేస్తున్నాయి. వేలంపాట తేదీ సమీ పిస్తున్నకొద్దీ గుండెలు బరువెక్కుతు న్నాయి. జీవనం కోల్పోతామన్న బెంగ వెంటాడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి వేలం స్థానంలో పాత (లీజు) పద్ధతిలోనే చేపలవేటకు అనుమతి ఇవ్వాలని, వేలం వేసి బతుకు ఆసరా దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. ● ఇదీ పరిస్థితి... దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..! మలేరియా కారక దోమ చిన్నదే అయినా కుడితే ఆస్పత్రికి పరుగు తీయాల్సిందే. వైద్యసేవలు పొందాల్సిందే. వీడిన మర్డర్ మిస్టరీ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పావాడ హరనాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వేలం పాట నిర్వహిస్తామన్న ప్రభుత్వ ప్రకటన మత్స్యకారుల జీవనబాటకు శాపంగా మారింది. దశాబ్దాల నాటి లీజు నిబంధనను తుంగలోకి తొక్కి వేలం నిబంధన అమలుకు సన్నద్ధం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకార సంఘం బకాయిలు కొత్త సంఘంపై రుద్దడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మడ్డువలసలో చేపలవేటకు ఈ నెల 28న కొట్టిశ గ్రామంలో బహిరంగ వేలం వేస్తామని మత్సశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు వెనుకకు తీసుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. పాత పద్ధతిలో చేపల వేటకు అనుమతి ఇవ్వాలని.. లేదంటే తమకు చావేశరణ్యమంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలిసి ప్రాథేయపడుతున్నారు. వినతులు అందజేస్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం సమయంలో భూములు, ఇళ్లతో పాటు సర్వం ఽకోల్పోయిన నిర్వాసితులైన వారే ప్రస్తుతం మత్స్యకారులుగా మారి ప్రాజెక్టులో చేపలవేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2002లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి జాతికి అంకితం చేసినప్పటి నుంచి ప్రాజెక్టులో చేపలు వేటే ఆధారంగా బతుకుతున్నారు. అప్పటి నుంచి ఏటా కొంత డబ్బును లీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి చేపలవేట సాగిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల గడిచిన తరువాత గత కొన్నేళ్ల కిందట లీజు సొమ్ము చెల్లింపులో జాప్యం జరిగింది. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి రూ.45 లక్షలు లీజు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి 2025లో అప్పటి మత్స్యకార సంఘం కాలపరిమితి ముగిసింది. గత ఏడాది నవంబర్ నెలలో కొత్తగా మత్స్యకార సంఘం ఏర్పాటైంది. ఈ సంఘానికి పాత ఫసలీ సొమ్ముతోపాటు ప్రస్తుతం ఉన్న 1435వ ఫసలీ సొమ్ము రూ.18,21,817లు కలిపి రూ.63 లక్షలు చెల్లించాలని మత్స్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలా చేస్తేనే సంఘం ద్వారా చేపలవేట చేసుకునేందుకు లీజు ఆర్డర్ అందజేస్తామని, లేని పక్షంలో లీజు ఆర్డర్ ఇవ్వబోమని, బహిరంగ వేలం(ఓపెన్ ఆక్షన్) వేస్తామని అధికారులు ప్రకటించారు. ఇదెక్కడి అన్యాయం... ప్రస్తుతం బకాయి ఉన్న 1435 ఫసలీ సొమ్ము చెల్లిస్తామని, బహిరంగం వేలం కాకుండా లీజు ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, ఇదెక్కడి అన్యాయమని మత్స్యకారులు వాపోతున్నారు. మత్స్యకారుల్లో విబేధాలు సృష్టించవద్దని కోరుతున్నారు. మడ్డువలస ప్రాజెక్టు చుట్టూ 10 చేపల రేవులు ఉన్నాయి. ఈ రేవుల పరిధిలో 462 మంది మత్స్యకారులు చేపలవేట సాగిస్తారు. బహిరంగ వేలంలో సుమారు రూ.18 లక్షలు చెల్లించాలంటే ఏ ఒక్క మత్స్యకారుడికి సాధ్యంకాదని వాపోతున్నారు. పాత బకాయిలు (1431–1435) ఫసలీలకు సంబంధించి తమ సంఘం కాల పరిధిలో లేవని, న్యాయం చేయాలంటూ మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు గత ఏడాది నవంబర్ నెలలో విశాఖపట్నం మత్స్యశాఖ డీడీ దర్యాప్తు చేశారని, ఆ నివేదిక ఏమైందో ఎవరికీ తెలియడం లేదన్నారు. ఆ నివేదిక ప్రకారం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టులో చేపల వేటకు ఈ నెల 28న కొట్టిశలో బహిరంగ వేలం మత్య్సకారులకు నోటీసులు జారీ ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు వేలం రద్దుచేసి పాతవిధానంలో లీజు ఆర్డర్ జారీచేయాలని డిమాండ్ పాత నిబంధన కొనసాగించాలంటూ ఉన్నతాధికారులకు వినతి ఉన్నతాధికారుల ఆదేశాలతో... మత్స్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో బహిరంగ వేలం వేసేందుకు ఆదేశాలిచ్చాం. గత కొన్నేళ్లుగా ఐదు ఫసలీల కింద సుమారు రూ.63 లక్షలు మత్స్యకార సంఘం చెల్లించాల్సి ఉంది. అలా పూర్తి స్థాయి డబ్బును చెల్లిస్తే తప్ప లీజు ఆర్డర్ ఇవ్వబోం. ఈ నెల 28న బహిరంగ వేలం నిర్వహిస్తాం. – సీహెచ్వీవీ ప్రసాద్, మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, రాజాంమడ్డువలస ప్రాజెక్టులో చేపలవేట అంశంపై బహిరంగ వేలం నిలుపుదల చేయాలి. లేదంటే మత్స్యకారుల్లో విబేధాలు తలెత్తుతాయి. 1435 ఫసలీ సొమ్ము కట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. లీజు ఆర్డర్ ఇవ్వాలి. మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలతో మత్స్యకారుల్లో ఆందోళన ఉంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి మత్స్యాకారులకు న్యాయం చేయాలి. – పెనుబోతు దుర్గారావు, శ్రీసీతారామఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు, కొట్టిశ -
వైఎస్సార్పీలో చేరికలు
● పార్టీలో చేరిన 50 కుటుంబాలకు చెందిన గజపతినగరం యువకులుగజపతినగరం రూరల్: స్థానిక బెల్లాన కన్వెన్షన్లో గురువారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో గజపతినగరం మేజర్ పంచాయతీకి చెందిన 50 కుటుంబాల యువకులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, బొత్స సందీప్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, రుంకాన భాస్కరరావు, వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, కర్రి నానాజీ, ఆల్తి రామనాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం పట్టణంలో ఈ చేరికల వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. -
ఆర్థిక సహాయం చెక్కు అందజేసిన జెడ్పీ చైర్మన్
విజయనగరం రూరల్: అరబిందో ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన ఎం.లక్ష్మునాయుడు కుటుంబానికి అరబిందో ఫార్మా కంపెనీ అందించిన రూ. 30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం తన కార్యాలయంలో అందజేశారు. జెడ్పీ చైర్మన్ కార్యాలయానికి విచ్చేసిన అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబానికి కంపెనీ యాజమాన్యం తరఫున ప్రకటించిన రూ.30 లక్షల చెక్కును జెడ్పీ చైర్మన్కు అందించగా ఆయన మృతుడి భార్య రమణమ్మకు అందజేశారు. అలాగే ఆమెకు అరబిందో కంపెనీలో ఉద్యోగంతో పాటు పిల్లల విద్యాభ్యాసం బాధ్యతలు కంపెనీయే చూసుకుంటుందని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్, బాధిత కుటుంబసభ్యులకు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అరబిందో కంపెనీ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థులను ప్రోత్సహించేలా
గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించేలా సైన్స్ ఎక్స్పోజర్ టూర్ నిర్వహించాం. ఇటీవల 84 మంది విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లి వచ్చారు. నేరుగా వారికి అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో దృశ్యరూప అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన చేయించాం. విద్యార్థులు వారు తిలకించిన ప్రదేశాలు, అక్కడి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని నివేదికలుగా రూపొందించనున్నారు. సహ విద్యార్ధులకు ఆ విషయాలను తెలియచేయడం, ఆ అంశాలపై చర్చరించడం ద్వారా వారిలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికితీసేయత్నం ఈ పర్యటన. పాటోజు బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం. -
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వృద్ధుడు
విజయనగరం క్రైమ్: స్థానిక దాసన్నపేట వసంత విహార్ సమీప వైష్ణవి నిలయం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఓ పెద్దాయన గురువారం ఇరుక్కుపోయాడు. వైష్ణవి నిలయంలో ఉంటున్న ఓ పెద్దాయన తన అపార్టెమెంట్లోకి వెళ్లేందుకు లిప్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో లిఫ్ట్ పైభాగం ఒక్కసారిగా విరిగి కింద జారి పడిపొయంది. దీంతో లిఫ్ట్ ఎక్కబోతున్న పెద్దాయనపై లిప్ట్ రూఫ్ ఒక్కసారిగా పడడంతో కాలు బయట ఉండిపోయే విధంగా అదే లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. వెంటనే వైష్ణవి నిలయంలో ఉన్న వారు కరెంట్ నిలిపివేసి లిఫ్ట్ను ఆపారు.అందులో ఇరుక్కుపోయిన పెద్దాయనను తక్షణమే సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్ వివరాలు కనుక్కుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చిన్నారికి పెద్ద కష్టం..!
ప్రభుత్వం ఆదుకోవాలి బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. నెల తర్వాత కాళ్లు, చేతుల మూమెంట్ ఆగిపోయింది. బెంగళూరులోని న్యూరాలజిస్ట్కు చూపిస్తే రూ.16 కోట్లు వైద్యానికి అవుతుందని చెప్పారు. అంత పెద్ద మొత్తం సమకూర్చడం మాకు సాధ్యం కాని పని. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు స్పందించి మా బాబుకు అవసరమైన వైద్యం చేయించాలి. అనూష, వెంకటేష్, చిన్నారి తల్లిదండ్రులు విజయనగరం ఫోర్ట్: కొడుకు పుట్టాడని అ తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. బాగా చదివించి డాక్టర్నో, ఇంజినీర్నో చేయాలని భావించారు. కానీ ప్రాణంతకమైన వ్యాధి ఆ చిన్నారికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. పుట్టిన నెలరోజులకే అ చిన్నారికి వ్యాధి బయట పడడంతో తల్లిదండ్రుల సంతోషం ఆవిరిపోయింది. చిన్నారి వైద్యానికి కోట్లాది రుపాయలు అవసరమని వైద్యులు చెప్పడంతో అంత పెద్ద మొత్తం ఏ విధంగా సమకూర్చాలో తెలియక దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని పూల్బాగ్ ప్రాంతానికి చెందిన అనూష, వెంకటేష్ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న మగ శిశువు జన్మించాడు. బాబుకు కాళీకృష్ణ అనే పేరు పెట్టారు. బాబు పుట్టిన నెల రోజులు వరకు బాగానే ఉన్నాడు. తరువాత కాళ్లూచేతుల కదలికలు ఆగిపోయాయి. దీంతో బాబును బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా బాబుకు ప్రాణంతకమైన ఎస్ఎంఏ టైప్–1 వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. బాబుకు 6 నెలల లోపు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారి వైద్యానికి దాతలు సహాయం చేయాలని తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. రెండున్నర నెలల చిన్నారికి సోకిన ఎస్ఎంఏటైఫ్1 వ్యాధి నెలరోజుల నుంచి కదలిక ఆగిపోయిన కాళ్లూచేతులు వైద్యానికి అవనున్న ఖర్చు రూ.16 కోట్లు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారి తల్లిదండ్రులు -
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
● వచ్చే నెల 7 నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న పోటీలు విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో బాలుర విభాగంలో 8 మంది, బాలికల విభాగంలో 8 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా దువ్వూరులో జరగబోయే 13వ ఆంధ్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయిలో ఎంపికై న బాలుర క్రీడాకారులకు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో, బాలికలకు విజయనగరంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ప్రోత్సహించారు. రోడ్డు పక్కన వ్యక్తి మృతిసాలూరు రూరల్: మండలంలోని నార్లవలస పంచాయతీ బొర్రపలుకువలస గ్రామానికి చెందిన చిక్కుడుసరువు(50) గురువారం ఉదయం మామిడిపల్లి గ్రామసమీపంలో రోడ్డుపక్కన మృతిచెంది పడి ఉన్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన మంగళవారం ఒడిశాలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి మామిడిపల్లి సమీపంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని రూరల్ ఎస్సై రవీంద్రరాజు తెలిపారు. విద్యుత్ షాక్తో వ్యక్తికి గాయాలుచీపురుపల్లిరూరల్(గరివిడి): మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో పొట్నూరు తౌడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనలో గాయాలపాలైన తౌడును చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఓ ఏజెన్సీ పెదనడిపల్లిలో సోలార్ విద్యుత్ అమర్చే పనులు చేపడుతోంది. దీంతో స్థానికంగా విద్యుత్ పనులు తెలిసిన తౌడును తాత్కాలికంగా పనుల కోసం పెట్టుకున్నారు. అయితే సోలార్ పనులు జరుగుతున్న సమయంలో ఇంటిపైన ఉన్న హైటెన్షన్ వైర్లు తౌడుకు తగలడంతో గాయాలయ్యాయి. వచ్చే నెల 8 నుంచి సర్ విజ్జీ టీ–20 టోర్నీ● జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 8 నుంచి జిల్లా స్థాయిలో పురుషులకు సర్ విజ్జీ టీ–20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు గురువారం తెలిపారు. జిల్లాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు, స్థానికంగా చదువుతున్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పూర్తిగా నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం లేదని వెల్లడించారు. జట్టు నమోదు సమయంలో క్రీడాకారులు ఆధార్కార్డులు తప్పని సరిగా పొందుపరచాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీలోగా తమ జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాకలు ఫోన్70135 08010, 7382482535 నంబర్లను సంప్రదించాలని పిలుపునిచ్చారు. వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన రామనారాయణంలో సీతారాముల కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని, ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణతేజలు స్వామి కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, కల్యాణ వైభోగాన్ని కనులారా తిలకించారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్..
విజయనగరం క్రైమ్: 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరు నిందితులను విజయనగరం జీఆర్పీ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్లపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాకు చెందిన బుడు బరిక, హరీష్ బరికలు ఒడిశా రాష్ట్రంలోని దమన్ జోడి నుంచి కేరళ రాష్ట్రం పాలక్కడ్కు సుమారు రూ. యాభై వేల విలువ చేసే 10 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. 8కిలోల గంజాయితో మరో ఇద్దరు.. 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ మరో ఇద్దరు నిందితులు విజయనగరం జీఆర్పీ సిబ్బందికి గురువారం పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా విజయనగరం రైల్వే ప్లాట్ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగ్లతో అనుమానంగా ఉండడాన్ని గుర్తించి ప్రశ్నించడంతో తడబడుతూ సమాధానం చెప్పారు. వెంటనే వారివద్ద ఉన్న బ్యాగ్లను తనిఖీ చేయగా రూ.40 వేల విలువ చేసే 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. పట్టుబడిన నిందితులు ఒడిశాలోని భద్రక్కు చెందిన ఆకాష్ కుమార్ బరిక్, రాయగడ జిల్లాకు చెందిన సునీల్ నాయక్లని రాయగడ నుంచి సికింద్రాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని ఈ మేరకు కేసు నమోదు చేసి విశాఖ కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించారని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు చెప్పారు. -
శాసీ్త్రయ అవగాహన పెంచేలా.. సైన్స్ ఎక్స్పోజర్ టూర్
● జిల్లా నుంచి భువనేశ్వర్ వెళ్లివచ్చిన 84 మంది విద్యార్థులుపాలకొండ రూరల్: ఏదైనా ఓ దృశ్యం చూస్తే దానిని మరిచిపోవడం దాదాపు అసాధ్యం..తరగతి గదిలో అందించే బోధనతో పోల్చుకుంటే నేరుగా ఓ అంశం పనితీరును చూపిస్తే ఆసక్తి మరింత పెరుగుతుంది. చూసిన విషయాలపై పలువురిలో చర్చ సాగుతుంది. దీనినే అసరాగా చేసుకుని విద్యాశాఖ విద్యార్థులకు బోధనతోపాటు వారిలో శాసీ్త్రయ అవగాహన కల్పించే చర్యలు చేపట్టింది. వివిధ పాఠశాలల నుంచి ఈ ఏడాది సైన్స్ ఎగ్జిబిషన్, నేషనల్ సైన్స్డే, వికసిత్ భారత్ తదితర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన 84 మంది విద్యార్థులను సైన్స్ ఎక్స్పోజర్ టూర్కు ఎంపిక చేశారు. సదరు విద్యార్థులను జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు సారథ్యంలో 16 మంది ఉపాధ్యాయులు మెంటర్స్గా వ్యవహరిస్తూ అంతరాష్ట్ర పర్యటనకు ఒడిశా రాజధాని భువనేశ్వర్కు తీసుకువెళ్లారు. భువనేశ్వర్లో పలు ప్రాంతాల సందర్శన పాఠశాల స్థాయిలో శాసీ్త్రయ విజ్ఙానంపై దృశ్య రూపంలో అవగాహన పెంచుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ వెళ్లిన విద్యార్థులు అక్కడి ప్రముఖ ఐఐటీ కేంద్రం, అడ్వాన్స్ రోబోటిక్స్ ల్యాబ్, మెషిన్ టూల్స్ ల్యాబ్, ఫ్లూయిడ్ డైనమిక్స్ ల్యాబ్తోపాటు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ ల్యాబ్ నిర్వహణను నేరుగా సందర్శించి, అక్కడి విద్యార్థులు, నిర్వాహకులతో మమేకమయ్యారు. ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు, అధ్యాపకులతో చర్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విలువైన సమాచారం సేకరించారు. ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ ప్రదేశమైన కోణార్క్ సూర్యదేవాలయం సందర్శనలో దేవాలయ నిర్మాణంలో దాగి ఉన్న ఆర్కిటెక్చర్, విశిష్ట, ఖగోళ విజ్ఞానంపై అవగాహన పొందారు. సూర్యకిరణాల స్థానానుసారం కచ్ఛితమైన సమయ నిర్ధారణ ఏ విధంగా చేశారో వీక్షించారు. నందన్ కానన్ గల జూలాజికల్ పార్కు సందర్శనలో జీవ వైవిధ్యం, ప్రకృతితో మమేకమై జీవాల మనుగడపై విఫులంగా తెలుసుకున్నారు. లింగరాజ్ ఆలయంలో పొందుపర్చిన భారతీయ శిల్పకళ, రీజనల్ సైన్స్ సెంటర్, సైన్స్పార్కు, డైనోసార్ పార్కు, త్రీడీ షో వంటి ఆసక్తి అంశాలను వీక్షించారు. తద్వారా సృజనాత్మకత, శాసీ్త్రయత, పరిశోధనాత్మక దృక్పథంపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా ఆసక్తి కనబరిచారు. అంతరాష్ట్ర పర్యటనలో తెలుసుకున్న అంశాలపై సదరు విద్యార్థులు సహ విద్యార్థులకు తమ అనుభవాలను పంచనున్నారు. -
‘ఫ్లోటింగ్ జెట్టీ’పై నిర్లక్ష్యం
పూసపాటిరేగ: తీరప్రాంతమైన మండలంలోని చింతపల్లిలో మంజూరైన జెట్టీ నిర్మాణంపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రెండేళ్లుగా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ ప్రక్రియపై నోరు మెదపలేదు. గత ప్రభుత్వంలో రూ.23 కోట్లతో మత్స్యకారుల సంక్షేమానికి ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించారు. అన్ని అడ్డంకులు తొలిగి ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన తరువాత అప్పటి సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సుమారు 2ఏళ్లయిన తర్వాత ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని రూ.16 కోట్లకు కుదిస్తూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీరప్రాంత మత్స్యకారులకు ప్రధాన అవసరమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు మత్స్యకారుల వలస జిల్లాలో తీరప్రాంతమైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఉన్న 27 కిలోమీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లలో సుమారు 4 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. జెట్టీ లేకపోవడంతో వేట సాగకపోవడం తదితర కారణాలతో జీవనోపాధి కోసం విశాఖపట్నం, గుజరాత్, హీరావల్, సూరత్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వలస బాట పడుతున్నారు. కాలుష్యంతో మత్స్యసంపద నాశనం జెట్టీ నిర్మాణంలో అలసత్వం, పరిశ్రమల వ్యర్థ రసాయనాలు తమపొట్ట కొడుతున్నాయని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. రసాయన పరిశ్రమల వ్యర్థ జలాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోంది. కొంత కాలం క్రితం వరకు వేటకు భారీగా మత్స్య సంపద దొరికేది. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. చేపలవేట సాగకపోవడంతో వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై అడుగులు వేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జెట్టీ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు పట్టించుకోని కూటమి సర్కారు తాజాగా నిర్మాణానికి రూ.16 కోట్లకు కుదిస్తున్నట్లు సమాచారం ప్రకృతి వైపరీత్యాల్లో వేట సాగక ఇబ్బంది పడుతున్న గంగపుత్రులుజెట్టీ మంజూరు చేయించినా ఫలితం లేదు..జిల్లా తీరప్రాంత మత్స్యకారులకు సుమారు రూ.23 కోట్లతో ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించాం. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మిస్తే జీవనపరిస్థితులు మెరుగుపడతాయని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచన చేసి మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సుమారు రెండేళ్లు అవుతున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడాన్ని గంగపుత్రులు గమనిస్తున్నారు. జెట్టీ నిర్మాణానికి అడుగులు ముందుకు వేసి గతంలో మంజూరు చేయించిన నిధులుతోనే నిర్మాణాలు జరిపి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి. బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎంఎల్ఏ ఉపాధికోసం ఎదురు చూపులు.. చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు జెట్టీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జెట్టీ లేకపోవడంతో పాటు పరిశ్రమల కాలుష్యంతో వేట సాగక చాలా ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు విజయనగరం -
మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలి
విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరికీ మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాల్ పోస్టర్లు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణకు స్ప్రేయింగ్ చేసేందుకు 165 హైరిస్క్ గ్రామాలను గుర్తించామన్నారు. మే ఒకటో తేదీ నుంచి మొదటి విడత, జూలై 15 నుంచి రెండో విడతగా స్ప్రేయింగ్ చేయనున్నామన్నారు. ఇంటి లోపల, ఇంటి పరిసరాల్లో ప్రజలు స్ప్రేయింగ్ ప్రజలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంఓ ఎం.సింహాచలం, ఎస్ఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి -
కేపీఐ అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల(కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(కేపీఐ) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో కేపీఐ కీలకమని పేర్కొంటూ వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. అంతకుముందు ప్రణాళికాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాంసుందర్రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి సంబంధించిన 396 ఇండికేటర్లలో అత్యుత్తమ గ్రేడ్లు సాధించేందుకు శాఖల ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరారు. మండలాలకు నిర్దేశించిన 199 ఇండికేటర్లలో మెరుగైన పనితీరును ప్రదర్శించాలని సూచిస్తూ ఈ నెల 29వ తేదీ నాటికి అన్ని నివేదికలను సమగ్రంగా సమర్పించాలని ఆదేశించారు. జీఎస్డీపీ లక్ష్యాలను వివరిస్తూ సవరించిన అంచనాలకు అనుగుణంగా మండలాల వారీగా ఎన్డీపీ అంచనాలు రూపొందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
ఆ మాస్ట్టారు మాకొద్దు...
కొత్తవలస: తరచూ మా శరీర ఆకృతులు వర్ణిస్తారు.. చూడరాని బొమ్మలను చూపుతూ వేధింపులకు గురిచేస్తారు.. ఆ మాస్టారు మళ్లీ స్కూల్కు వస్తే మేమంతా బడిమానేయడం తప్ప మారో మార్గం లేదంటూ కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమిక్నోన్నత పాఠశాల బాలికలు గురువారం పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. ఆ ఉపాధ్యాయుడిని మళ్లీ మా బడికి పంపించవద్దంటూ అధికారులను లిఖితపూర్వకంగా వేడుకున్నారు. రిజిస్టర్ పోస్టులో డీఈఓ, కలెక్టర్కు ఫిర్యాదు కాపీ పంపించారు. వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో శాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన జె.వి.సన్యాసిరావు 6,7,8 తరగతుల బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తంచడం, కంప్యూటర్ ప్యానల్ బోర్డులో అసభ్యకరమైన బొమ్మలను చూపడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో డిప్యూటీ ఈఓ విచారణలో నిరూపణ కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాత్కాలికంగా బదిలీచేశారు. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం చివరిరోజు కావడంతో గురువారం వీరభద్రపురం పాఠశాలకు వచ్చి ఆయన రిపోర్టుచేశారు. ఆయనను చూసిన బాలికలు హడలిపోయారు. మళ్లీ ఆ ఉపాధ్యాయుడిని ఇక్కడకు పంపిస్తే పాఠశాలకు మానేయడం తప్ప మరోమార్గం లేదంటూ వాపోయారు. ఆయనను ఇక్కడకు పంపించవద్దంటూ అధికారులను వేడుకున్నారు. ఆయన బడికి వస్తే మానేస్తాం.. వీరభద్రపురం యూపీ స్కూల్ బాలికల ఆందోళన డీఈఓ, కలెక్టర్లకు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు -
చలోచలో..
ఇంటికి పోదాం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో విద్యార్థుల హడావిడి బస్సు ఎక్కేందుకు నిరీక్షిణ, ఆర్టీసీ కాంప్లెక్సు బయట వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్లు సర్దుకుంటున్న విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరం ముగిసింది. స్కూళ్లకు శుక్రవారం నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులతో కలిసి గురువారం మధ్యాహ్నం సొంతూళ్లకు పయనమయ్యారు. వీరి రాకపోకలతో వివిధ కూడళ్లు, బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిశాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
● భానుడి ప్రతాపం.. రక్షకభటుల విలాపం!
భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలైతే చాలు మండిపోతున్నాడు. జనంపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వారం రోజులుగా మండుతున్న ఎండలకు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి. రాకపోకల క్రమబద్ధీకరణ కోసం వివిధ కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. కాస్త వాహనాల రాకపోకలు తగ్గిన సమయంలో చెట్ల కింద సేదతీరుతున్నారు. కొందరు మండే ఎండలోనే విధులు నిర్వహిస్తూ.. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. దీనికి విజయనగరం పట్టణంలో గురువారం కనిపించిన ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మోసకారి కూటమికిబుద్ధి చెప్పండి
గజపతినగరం రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసింది.. పంటను మద్దతు ధరకు కొనుగోలుచేసేవారు లేక మొక్కజొన్న రైతు కన్నీరు పెడుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు.. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గజపతినగరంలోని బెల్లాన కన్వెన్షన్లో నియోజకవర్గ గ్రామ కమిటీల విస్తృతస్థాయి సమావేశం, నూతనంగా నియామకమైన పార్టీ మండలాధ్యక్షుడు పల్లి సంజీవరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కో–ఆర్డినేటర్ బూడి వెంకటరావు బాధ్యతల స్వీకరణకు బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనిట్లు.. లేనిది ఉన్నటు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అందలమెక్కి... ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. ఎన్నికల సమయంలో తమకున్న పచ్చమీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం చంద్రబాబు మోసంచేశారని విమర్శించారు. పథకం లబ్ధిదారులందరికీ అందడంలేదన్నారు. ఉపాధిహామీ పథకాన్ని డొల్ల చేశారని, వంతుల వారీగా కూలీలకు పని కల్పించడం సిగ్గుచేటన్నారు. అన్నదాతను విత్తు నుంచి ఎరువుల వరకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ● తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు పావలా/సున్నా వడ్డీకే రుణాలు అందజేశామని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పావలా వడ్డీ రుణాలు అందని పరిస్థితి నెలకొందని బొత్స విమర్శించారు. రూ.3,60,000 కోట్లు అప్పులుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం పనిలో తెలుగుదేశం నేతలు నిమగ్నమయ్యారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం బాధాకరమన్నారు. గీతం యూనివర్సిటీకి ఐదువేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కట్టబెట్టడం ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా ఒక వితంతుకు పింఛన్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్లు తర్వాత వితంతు పింఛన్లు కానుక అంటూ సిగ్గులేని మాటలు ఆడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవినీతి, దోపిడీ, హత్యరాజకీయాలు ఎక్కువయ్యాయని, వీటిని వైఎస్సార్సీపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పార్టీ నాయకుల నిర్లక్ష్యం, మితిమీరిన ధీమా కారణంగానే ఓడిపోయమన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు లు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాలు దగ్గర నుంచి రైతు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఎక్కడ అన్నారు. సమావేశంలో విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్మోహనరావు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, బొత్స సందీప్, జడ్పిటిసిలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, రౌతు రాజేశ్వరి, ఎంపీపీలు బెల్లాన జ్ఞాన దీపిక , పిరుబండి హైమావతి,గేదెల సింహాద్రి అప్పలనాయుడు, సీహెచ్ చిన్నమనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ వేమిలి ముత్యాలనాయుడు, జిల్లా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి నారాయణమూర్తిరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాక్పాట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్ అవినీతిలో ముందంజలో ఉన్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పరోక్షంగా పేర్కొన్నారని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ అవినీతి కార్యక్రమాలు చేయడంలో ఆరితేరాని విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో అభివద్ధి జాడలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రిని... జిల్లాకు పరిశ్రమలు తెస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా నియోజవర్గానికి ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా అని ప్రశ్నించారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కలెక్షన్లు మొదలుపెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం హయంలో నియమించిన తాత్కాలిక ఉద్యోగులను కక్ష సాధింపుగా తొలగించడం అన్యాయమన్నారు. 2024 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, పచ్చ మీడియాతో జనాల్లో విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలకు రెండేళ్లలో చంద్రబాబు మోసకారి పాలన అర్థమైందని, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని.. మీ వెన్నంటే మేము ఉంటామని.. భయం మా బ్లడ్లో లేదని, ఖబడ్దార్ అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా జలధార–జలహారతి పేరుతో మరో దోపిడీకి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జి బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, అభివద్ధిపై లేదన్నారు. ఈ రెండేళ్లలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి అనుకూల ఓట్లు తొలగించమని మంత్రి స్వయంగా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామన్నారు. నియోజకవర్గంలో ప్రజాబలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ సైనికుల వలే పనిచేయాలని, ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మొక్కజొన్న రైతు కన్నీరు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం ప్రజాసంక్షేమ పథకాలు అందని వైనం చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ -
నేటి నుంచి పాఠశాలకు వేసవి సెలవులు
విజయనగరం అర్బన్: జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు నిర్దేశిత సెలవులను కచ్చితంగా పాటించాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ఐవీ నిర్మూలనపై శ్రద్ధ అవసరం ● రాష్ట్ర ఏపీశాక్స్ పీడీ రోణంకి గోపాలకృష్ణ విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాలతో పాటు హెచ్ఐవీ నిర్మూలనపై దృష్టిసారించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణశాఖ (ఏపీ శాక్స్) ప్రాజెక్టు డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. వైద్యారోగ్యశాఖ, వైద్యవిద్య, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారులతో గురువారం జూమ్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎయిడ్స్ నియంత్రణపై పనిచేస్తున్న సిబ్బంది పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు. జీతం పెంచండి బాబూ.. బాడంగి: చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని, మేనెల మొత్తం వేసవిసెలవులుగా ప్రకటించాలని, మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. యూనియన్ నాయకులు చింతాడ రమణమ్మ, లక్ష్మి, సీత తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల 10 డిమాండ్లలో 9 నెరవేర్చేశామని, జీతాలపెంపు ఒక్కటే మిగిలిందని సంబంధిత మంత్రి అవాస్తవాలు ప్రకటించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటికీ జీతాలు పెరగలేదని, 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయని, వేసవి సెలవుల జీఓ ఇవ్వలేదని, వేతనంతో కూడిన మెడికల్లీవ్ ఇవ్వలేదని, సంక్షేమ పథకాల అమలు, తదితర సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వీరితో పాటు నియోజకవర్గ స్థాయి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీలు పాల్గొన్నారు. మద్యం తాగితే కేసులు నమోదు చేస్తాం ● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డెంకాడ: గంజాయి క్రయవిక్రయాలు జరిపేవారిపైన, బహిరంగంగా మద్యం సేవించే వారిపై కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి నిందితుల ఆస్తులు జప్తుచేస్తున్నామని తెలిపారు. చట్టబద్దంగా నడుచుకునేవారిపై ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుదన్నారు. డెంకాడ పోలీస్టేషన్లో పోలీస్ విశ్రాంత గదులు, ప్రజా సహాయక కేంద్రం, చలివేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్లకు వచ్చే లింక్లను ఓపెన్ చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు దెబ్బ తగలడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు. డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందిని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం.. జిత్తులమారి సర్కార్: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి సర్కార్.. జిత్తులమారి ప్రభుత్వం.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రజలను మోసం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన గజపతినగరంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి కొంతమంది మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు.సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అమ్మ ఒడి జాడ లేదు. వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదు. ‘‘నేడు గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా?. నేడు పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా?. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే పేదవాడి ఆరోగ్యం ఏమవ్వాలి? నాడు వైఎస్ జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చారు’’ అని బొత్స గుర్తు చేశారు. -
వైఎస్సార్సీపీ నాయకుల ఆత్మీయ కలయిక
విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుల ఆత్మీయకలయిక ప్రత్యేకతను సంతరించుకుంది. సాలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనూజరాణి బుధవారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఇంటికి విచ్చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జైహింద్కుమార్ వారికి ఘన స్వాగతం పలికారు. -
ఓరి ‘నాయనో’... వేధింపులు భరించలేం
బొబ్బిలిరూరల్: సహజవనరులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి.. ఇసుక దోపిడీకి ఊతమిస్తుండడం... ఇసుక తవ్వకాల్లో వాటాకోసం అక్రమార్కులకు అండగా నిలబడడం.. కళ్లముందరే వేగావతి నదిని గుల్లచేస్తున్నా పట్టనట్టు ఉండాలంటూ రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేయడం.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవద్దని.. పట్టుకున్నా విడిచిపెట్టాలంటూ ఆదేశాలివ్వడం బొబ్బిలిలోని రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఓరి ‘నాయనో’... ఆ వేధింపులు భరించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, అలజంగి, కారాడ గ్రామాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతున్నా ప్రజానిధి బెదిరింపులకు అటువైపు కన్నెత్తిచూసేందుకు భయపడుతున్నారు. విడిచిపెట్టేయండి... వేగావతి నదిలో ఇష్టారాజ్యంగా సాగుతున్న తవ్వకాలపై స్థానికులు అందించిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఈ నెల 19న దాడులు చేశారు. ఆర్ఐ రామకుమార్ పారాది, అలజంగి వద్ద నిఘాపెట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వాటికి జరిమానా విధించేందుకు సిద్ధపడ్డారు. అక్రమ వ్యాపారులందరూ అధికార పార్టీకి చెందిన చోటానాయకులు కావడంతో స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ పెట్టారు. అంతే.. తమవారి ట్రాక్టర్లను వదిలేయా లని తహసీల్దార్ను ఆదేశించారు. దీనికి అధికారులు ససేమిరా అంటూ రూ.10వేలు చొప్పున అపరాధ రుసుం విధించాలని నిర్ణయించారు. అయితే, అందులో అలజంగికి చెందిన టీడీపీ చోటా నాయకుడి ట్రాక్టర్ను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విడిచిపెట్టాలని రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. అధికారులు సాధ్యం పడదని చెబితే వారిపై ఓ దశలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు సమాచారం. తమ పార్టీ ముఖ్యనాయకుడని, ఇసుక అక్రమ వ్యాపారిగా చూడవద్దని, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాసులు కూడబెడతారంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. చేసేదిలేక ఆ ట్రాక్టర్కు మినహాయించి మిగిలిన 4 ట్రాక్టర్లకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించి వదిలేయడం ఇప్పుడు బొబ్బిలిలో చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి ‘రాజరిక’ పాలన అంటూ అధికారులు నివ్వెరపోతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలతో కాసులను ‘కోట’కు చేర్చేందుకు ఎంతటికై నా దిగజారుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమతరలింపునకు ప్రజాప్రతినిధి అండ! ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులకు చీవాట్లు విడిచిపెట్టేయాలంటూ హుకుం ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వర్షం -
పీ–4పై సమీక్ష
విజయనగరం అర్బన్: పీ–4 కార్యక్రమంపై కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అఽధికారులతో కలెక్టర్ రాంసుందర్రెడ్డి వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించారు. బంగారు కుటుంబాల దత్తత, నిధుల రీయింబర్స్మెంట్, జలధార కార్యక్రమాల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 82,426 బంగారు కటుంబాలను గుర్తించగా ఇప్పటి వరకు 3,941 మంది మార్గదర్శులు 20,157 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. మిగిలిన కుటుంబాల దత్తతను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్డీసీ, ఎంపీ ల్యాడ్స్ నుంచి వివిధ శాఖలకు సర్దుబాటు కింద అందజేసిన నిధులను ఆయా శాఖలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. జలధార, ఉపాధి హామీ పనుల తీరుపై ఆరా తీశారు. జీతం రికవరీ విజయనగరం ఫోర్ట్: ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన ఓ వైద్యురాలు ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడం, మరోవైపు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్ తీసుకున్నారన్న అంశంపై ఈనెల 13వ తేదీన ‘వైద్యురాలి అత్యాస..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్య విధాన్ పరిషత్ అధికారులు స్పందించారు. దీనిపై ఇద్దరు అధికారులతో విచారణ జరిపారు. వైద్యురాలు చైతన్య స్రవంతితో ఉద్యోగం చేస్తున్నట్టు తీసుకున్న జీతంతోపాటు, పీజీ చదువుతున్నట్టు తీసుకున్న స్టైఫండ్ను రికవరీ చేసినట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.పద్మశ్రీరాణి బుధవారం తెలిపారు. వినియోగదారులతో మర్యాదగా మెలగాలి ● జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: గ్యాస్ డెలవరీబాయ్స్ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బుధవారం పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ దుకాణదారులు, గ్యాస్ డెలివరీ బాయ్స్ విని యోగదారులతో ఎల్లప్పుడూ సత్ప్రవర్తనతో మెలగాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వారికి సంబంధించి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో ప్రతికూల స్పందనలు వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్ఓ మురిళీనాథ్ పాల్గొన్నారు. పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తిదారులతో ఈనెల 29న ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖాముఖిలో పార్వతీ పురం, పాలకొండ సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటా రన్నారు. ముఖాముఖికి విచ్చేసే అర్జీదారులు గ్రీవెన్స్ రశీదు, ఎండార్స్మెంట్ కాపీని తీసుకు ని రావాలని సూచించారు. నేడు భగీరథ మహర్షి జయంతి భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువా రం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరారు. -
అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు
సాలూరు: చంద్రబాబు ప్రభుత్వం తీరు ‘అప్పులు కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు’ అన్న చందంగా మారిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్లను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడులతో పాటు మజ్జి శ్రీనువాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు చేసి అవినీతికి పాల్పడడమే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గిరిజనుల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకుందామన్న రీతిలో మంత్రి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ప్రజల కష్టాలు గురించి మాట్లాడితే, తిరిగి నాకు జ్వరం వచ్చింది.. నన్నెవరు చూస్తారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంత్రికి తగదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు, సచివాలయాల భవనాలు, ఆస్పత్రులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మంత్రి ఈ రెండేళ్ల పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులు శూన్యమన్నారు. ఎంపీ గుమ్మ తనూజారాణి అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తూ, గిరిజనులకు మేలుచేసేందుకు కృషిచేస్తున్నారన్నారు. గిరిజన మంత్రి ఇక్కడి సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో మంత్రి, ఆమె కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అందరికీ తెలిసినవేనన్నారు. ప్రజ్యావతిరేక పాలన సాగిస్తున్న మంత్రిపై త్వరలోనే కూటమి నేతలే తిరుగుబాటు చేస్తారన్నారు. ● మొక్కజొన్న రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ చైర్మన్ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిన అగచాట్లు ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతామనే భయంతో టీడీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీ సమావేశాలకు రావడం లేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీలోని పెద్ద నాయకులు పార్టీని వీడినా జగనన్న, రాజన్నదొర వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం గర్వంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసినా ప్రజాసేవలో తరించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ● వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలునాయడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించి జగన్మోహన్రెడ్డిను ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో తాజామాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్నదొర హయాంలోనే సాలూరు నియోజకవర్గ అభివృద్ధి గిరిజన సమస్యలను పట్టించుకోని మంత్రి ఆమైపె కూటమి నేతలే తిరుగుబాటు చేసేరోజు వస్తుంది జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పదవీకాలం పూర్తయిన సర్పంచ్లకు సన్మానం సర్పంచ్లతో విజయోత్సవ సభ నిర్వహిద్దాం వైఎస్సార్సీపీతో ఉంటూ.. జగనన్న, రాజన్న దొరల నాయకత్వంలో నడుస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తూ.. ప్రజలు ఆశీస్సు లు చూరగొంటున్న సర్పంచ్ల సేవలు అభినందనీయమని ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. సర్పంచ్ కుటుంబం నుంచి ఎంపీగా ఎదిగినట్టు పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ మళ్లీ విజేతలుగా నిలిచి విజయోత్సవ సభ నిర్వహించుకుందామన్నారు. -
నమ్మించడం.. నట్టేట ముంచడం సీఎం చంద్రబాబుకు అలవాటైన విద్య అన్నది తరచూ రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులు... ఇలా ఎవరన్నది అనవసరం. అవసరం తీరాక మొఖంచాటేయడమే ఆయనకు తెలిసిన రాజకీయ తంత్రం. ఇప్పుడు వివి
‘విజయనగరం మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కొత్త వాహనం కొనుగోలుకు బీసీ కార్పొరేషన్ అందజేసే రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సమర్పించి ఏడాది దాటినా... ఇప్పటి వరకు రుణం మంజూరు కాలేదు. ఈయన ఒక్కరే కాదు... ఉమ్మడి విజయనగరం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అందరి పరిస్థితి ఇదే.’ విజయనగరం అర్బన్: పేద, మధ్యతరగతి వర్గాల స్వయం ఉపాధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన బీసీ, ఎస్సీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ప్రభుత్వం తీరుతో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులకు రుణాలు మంజూరు కావడం లేదు. ఏడాదికి పైగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కయూనిట్ కూడా మంజూరు కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుణాలు సకాలంలో మంజూరుకాకపోవడంతో స్వయం ఉపాధికి గండిపడుతోంది. ● 49 వేల దరఖాస్తులు.. వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 5,863 యూ నిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ... 49 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్య ర్ధులకు మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత యూనిట్ల మంజూరు చేయాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. బీసీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ విలువలో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ రుణాలు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ల ప్రకటనలకే పరిమితం గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. స్వయం ఉపాధి కల్పిస్తామని పాలకులు చెప్పిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కార్పొరేషన్ల రుణాలు కాగితాలకే పరిమితం ఏడాది నుంచి లబ్ధిదారుల ఎదురు చూపులు స్వయం ఉపాధికి గండి రాయితీ నిధులే రాక... బ్యాంకులు వెనుకంజ -
రాజకీయ కక్షతోనే...
రాజకీయ కక్షతో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం మంత్రి సంధ్యారాణికి తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పీటీజీకి చెందిన కరాసవలస కేజీబీవీ ప్రత్యేకాధికారి, బోధనేతర సిబ్బందితో పాటు నియోజకవర్గంలో పలువురు ఉద్యోగులను కక్ష పూరితంగా తొలగించారని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పాలించినా తనెప్పుడూ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకోలేదన్నారు. జీఓ 3 పునరుద్ధరణ, ఆశ్రమపాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం, పట్టణంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర హామీలను ఇచ్చిన మంత్రి నేటికీ అమలుచేయకపోవడం విచారకరమన్నారు. గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు అడబిడ్డ నిధి అందని ద్రాక్షగా మారిందన్నారు. రెండేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతిగ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు. -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
● నేటి నుంచి మే 20వ తేదీ వరకు వివిధ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో నిర్వహించబోయే వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సీహెచ్ సత్తిబాబు ఆదేశించారు. తన చాంబర్లో వివిధ శాఖల ప్రతినిధులు, కళాశాలల నిర్వాహకులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని సూచించారు. జిల్లాలోని లెండి, అవంతి, ఎంవీజీఆర్, సీతం ఇంజినీరింగ్ కళాశాలతో పాటు అయాన్ డిజిటల్ కేంద్రాల్లో ఈ నెల 23 నుంచి మే 20 వరకు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం ఏపీ ఈసెట్, ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఏపీ పీజీఈసెట్, మే 2న ఏపీఐసెట్, 4న పీజీ లాసెట్, 8న ఏపీ ఎడ్సెట్, 8 నుంచి 11 వరకు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్), 19 నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) జరగనున్నవి. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు చేయాలని, విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరు కేంద్రాల్లో నీట్ జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈనెల 3న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తెలిపారు. పరీక్షకు పక్కాఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి కేవలం రైటింగ్ ప్యాడ్, ఐడీ ప్రూఫ్, పారదర్శక నీటి బాటిల్ మాత్రమే తీసుకురావాలన్నారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డీఈఓ మాణిక్యంనాయుడు, ప్రజా రవాణాఅధికారి జి.వరలక్ష్మి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ దిలీప్ మోదీ, తదితరులు పాల్గొన్నారు. -
● న్యాయం చేసేవరకు పోరాటం
జిందాల్ నిర్వాసితులు సుమారు రెండు వందల రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వినిపించారు. సమస్యల పరిష్కారంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మేమంతా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారమని, తమ బతుకులుతో ఆడుకోవద్దని, తమ భూములు తమకు అప్పగించాలంటూ నినదించారు. న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – శృంగవరపుకోట -
అశ్రునయనాలతో యువకుడి అంత్యక్రియలు
బొబ్బిలి రూరల్: అమెరికాలోని మెరమెక్స్టేట్పార్కు వద్ద ఈనెల 11న ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందిన పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీహరికృష్ణ(26)మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన 12 రోజుల తరువాత హరికృష్ణ మృతదేహం తల్లిదండ్రుల వద్దకు చేరగా తల్లిదండ్రులు రమ, శ్రీనివాసరావులు భోరుమన్నారు. చేతికి అందికొచ్చిన కొడుకు అకాల మరణంతో గుండెలవిసేలా విలపించారు. గ్రామస్తులు,పెద్దలు, బంధువులు హరికృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తల్లిదండ్రులను ఓదార్చారు.అనంతరం అశ్రునయనాలతో హరికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎవరి టెంటు వారే వేసుకోవాలి..!
విజయనగరం ఫోర్ట్: అగ్నిగోళాన్ని తలపించేలా ఎండలు ఉన్నాయి. దీంతో ఇళ్లలోసైతం ఉండలేని పరిస్థితి. పొట్టకూటి కోసం ఎండతీవ్రతను సైతం భరిస్తూ ఉపాధి హామీ వేతనదారులు పనిచేస్తున్నారు. అయితే ఉపాధి హామీ వేతనదారులకు రక్షణ కల్పించడంలో టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండవేడమి నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ అలసత్వం వహించడం పట్ల వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి హామీ వేతనదారులు అల్లాడుతున్నారు. డ్వామా అధికారుల ఉచిత సలహా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు ప్రభుత్వం నీడనిచ్చే టెంట్లు సరఫరా చేయలేదు. ఎవరి టెంట్లు వారే వేసుకోవాలని డ్వామా అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వేతనదారులు తాటి, కొబ్బరి కమ్మలతో టెంట్లు వేసుకుంటున్నారు. అయితే అవి వారికి పెద్దగా రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెంటు నీడలో కాసేపు విశ్రాంతి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులు ఎటువంటి నీడలేని చెరువులు, కాలువులు వంటి ప్రదేశాల్లో పనిచేస్తారు. ఎండలో పనిచేయడం వల్ల త్వరగా అలసట చెందుతారు. అటువంటి వారికి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం టెంట్లు అవసరం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వేతనదారులు పనులు చేయడానికి మళ్లీ వెళ్లుంటారు. అంతేకాకుండా టెంట్ల కింద మంచినీరు కూడా పెడతారు. అంతటి అత్యవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామంలో అదేగ్రామానికి చెందిన చౌడువాడ కన్నయ్యతాత అనే ఉపాధి వేతనదారు మంగళవారం చెరువులో పనిచేస్తూ ఎండ వేడమికి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు సన్నద్ధయ్యేలోగా మృతిచెందాడు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుతం తరుణంలో ఉపాధిహామీ వేతనదారులకు అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి లేకుండా పనులు గతంలో ఉపాధి హామీ వేతనదారులకు వారంలో ఒక రోజు సెలవు ఉండేది. సోమవారం నుంచి శనివారం వరకు పనులు పెడితే ఆదివారం సెలవు ఉండేది. అయితే టీడీపీ సర్కార్ వేతనదారులకు ఒక్క రోజు కూడ విశ్రాంతి లేకుండా ఆదివారం కూడా పనులు పెడుతోంది. ఇది కూడా వేతనదారులకు కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే. జిల్లాలో సగటున రోజుకు 1.50 లక్షల మంది వరకు వేతనదారులు పనికి వెళ్తున్నారు. ఓఆర్ఎస్ వినియోగంపై అవగాహన కరువు వడదెబ్బకు గురికాకుండా రక్షణ ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం ఏవిధంగా వినియోగించుకోవాలి అన్నదానిపై వేతనదారులకు అవగాహన కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెడుతున్నారు. కానీ ఆ ద్రావణం ఏవిధంగా నీళ్లలో కలిపి తాగాలి అనే దానిపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనదారులకు టెంట్లు సరఫరా చేయని టీడీపీ సర్కార్ తాటి, కొబ్బరి కమ్మలతో వేసుకుంటున్న వేతనదారులు వేతనదారులకు రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు గంట్యాడ మండలంలో పనిచేస్తూ ఓ వేతనదారు మృతివేతనదారులే టెంట్లు వేసుకోవాలిప్రభుత్వం నుంచి టెంట్లు సరఫరా లేదు. వేతనదారులే వారికి అవసరమైన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలి. వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేతనదారులకు అందిస్తున్నారు. – ఎస్.శారదదేవి, పీడీ, డ్వామా -
చేపల మృతిపై విచారణ
సంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో అప్పమ్మ చెరువులో ఇటీవల చేపలు మృతి చెందిన విషయమై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విజయకృష్ణ ఆదేశాలతో రాజాం ఫిషరీస్ ఇన్న్పెక్టర్ సీహెచ్.ప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు. అప్పమ్మ చెరువుకు చేరుకుని అక్కడి పరిస్థితులపై మత్స్యకారులతో మాట్లాడారు. చెరువునుంచి నీరు తీయకుండా అడ్డుపడ్డారనే రైతులతో మాట్లాడారు. మత్స్యకారులు పలుమార్లు చెరువునుంచి నీరు తీయవద్దని తెలిపిన రాజాం ఇరిగేషన్ ఆఫీస్ సబార్డినేట్ ముఖలింగంను చెరువు వద్దకు పిలిపించుకుని నివేదిక తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఎంత విలువ చేసే చేపలు విడిచి పెట్టారు తదితర అంశాలను మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను జిల్లా మత్స్యశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శిపై వేటు...
వేపాడ: అధికార దుధుర్వినియోగానికి పాల్ప డుతూ, రాజకీయాలకు వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శిపై ఎట్టకేలకు వేటు పడింది. కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఆరోపణలు వాస్తవాలు అని తేలడంతో కార్యదర్శి సస్పెన్షన్కు ఆదేశాలు జారీచేశారు. వేపాడ మండలంలోని బానాది పంచాయతీ కార్యదర్శి ఏఎస్ఎస్ఎన్ మూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు మంగళవారమే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి అందినా ఎంపీడీవో మాత్రం విషయం బయట పెట్టకపోవటం విశేషం. వేపాడ మండలంలో బానాది పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఎస్ఎస్ఎన్ మూర్తి తీరు వివాదాస్పదమైంది. సకాలంలో గ్రామసభలు జరపకపోవడంవ, విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతగా వ్యవహరించకపోడడం, పారిశుధ్యపనులు నిర్వహించకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, పంచాయతీ రికార్డులు తన ఇంటికి తీసుకుపోవడం, మహిళా సర్పంచ్ పట్ల దురుసుగా వ్యవహరించడం వంటి పలు అంశాలపై సర్పంచ్ కర్రి యశోద జిల్లా అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్చి 20న డీఎల్పీఓ విచారణ నిర్వహించి, నివేదికను జిల్లా అధికారులకు అందజేయడంతో స్పందించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ సీహెచ్ సూర్యనారాయణ తెలిపారు. -
ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరువాసికి సన్మానం
సాలూరు: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సాలూరు వాసి డా.రేగాన షణ్ముఖరావును బుధవారం సన్మానించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో పీఆర్ఓగా పనిచేస్తున్న రేగాన షణ్ముఖరావు జర్నలిజం విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా, సమాచార పౌర సంబంధాల శాఖ, షెడ్యూల్ కులాల స్థితిగతులపై అధ్యయనాలు, పరిశోధనల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రముఖులు ఆయనను సన్మానించి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు ఆయనకు సాలూరుకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు.మొక్కజొన్నల లారీ బోల్తాగజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ శివారులో బుధవారం మొక్కజొన్నల లోడ్ తీసుకువెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పెదకాద, ఎం.గుమడాం, మరుపల్లి రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను లోడ్ చేసి విజయనగరం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 3803 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేతసీతంపేట: సీతంపేటలోని రెండు వేర్వేరు కిరాణా దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 3803 కిలోల పీడీఎస్ బియ్యాన్ని పార్వతీపురం డీఎస్వో ఆశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లో ఉంచినట్లు ఆర్ఎస్డీటీ శ్రీ విద్య తెలిపారు. -
బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి
బొబ్బిలి: పట్టణ పరిధిలోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో డైలీ లేబర్గా పనిచేస్తున్న కొరికాని కృష్ణ(40)కంపెనీలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన కృష్ణ పండగ నిమిత్తం స్వగ్రామం వెళ్లాడు. తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి విధుల్లో చేరాడు. విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా కార్మికులు, తండ్రి పెంటయ్య,బంధువు స్వామినాయుడులు స్థానిక అభయ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కృష్ణకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. రూ.50లక్షల పరిహారమివ్వాలి గ్రోత్ సెంటర్లోని బెర్రీ పరిశ్రమలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, గతంలో ఈ కంపెనీలో పనిచేసిన వారు ఎంతోమంది అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటనలున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, నాయకులు సింగిరెడ్డి గోపాలం, బల శ్రీనులు అన్నారు. బుధవారం స్థానిక అభయ ఆస్పత్రిలో కృష్ణ మృతదేహం వద్ద వారు మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలున్న మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీలో కార్మికులకు తాగేందుకు నీరు, రక్షణ పరికరాలు, రెస్ట్ హాలు లేవన్నారు. కంపెనీలన్నీ ఒకటై కార్మికుల కడుపు కొడుతున్నాయని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారన్నారు. వారితో రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. లేబర్ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదని, దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మృతి చెందిన కార్మికుడికి రూ.50లక్షల పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. చికిత్స పొందుతూ యువకుడు.. భామిని: మండలంలోని సతివాడకు చెందిన యువకుడు పొట్నూరు మనోజ్ కుమార్(24) బుధవారం విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్ కుమార్ ఒంటిపై పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కాలిన మంటలతో వీధిలో పరుగెడుతున్న మనోజ్కుమార్ను స్థానికులు వీధిలోని పెంటగుమ్మిలో తోసి ప్రమాదం నుంచి రక్షించారు. వెంటనే కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి అనంతం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్కుమార్కు మతిస్థిమితం లేక పోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బత్తిలి ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో హెచ్సీ సంగమేస్ కేసు నమోదు చేసి కేజీహెచ్కు వెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. -
మలుపు తిరుగుతున్న అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పోర్ట్ సిటీ స్కూల్ సమీపంలో రెండు రోజుల క్రితం గుర్తించిన మృతదేహం ఎవరిది అన్నకోణంలో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ (24)గా గుర్తించిన పోలీసులు హరనాథ్ రౌడీషీటర్ అని విజయనగరం వన్ టౌన్, టూటౌన్ పీఎస్లలో పలు హత్య కేసులు ఉన్నాయని చెబుతున్నారు. కాగా బావిలో మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు బయటకు తీసి పోస్ట్ మార్టానికి తరలించగా హత్యగా తేలింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి విజయనగరం వన్ టౌన్ సీఐ చౌదరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వారు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుపై సీఐఆర్వీకే చౌదరి మాట్లాడుతూ పావాడ సంతోషి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బావిలో మృతదేహాన్ని గుర్తించామని పొస్ట్ మార్గం నివేదికలో హత్యగా తేలిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఎనిమిది మంది -
గడువులోగా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్న రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రూపొందించిన ప్రణాళిక ప్రకారం మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, రైతు ముంగిటకే 1 బీ పంపిణీ, పాస్ పుస్తకాల ముద్రణ వంటి ప్రక్రియలను క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. మండల, గ్రామాల వారీగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్ అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్ అందించాలని స్పష్టం చేశా రు. వంటగ్యాస్ సరఫరాలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే అరోపణలపై గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇప్పటికే పంపణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలోని తప్పులను సరిదిద్ది, మ్యుటేషన్లు, సబ్డివిజన్లు, ఫారం–8, జాయింట్ ఎల్బీఎం సమస్యలను పరిష్కరించి జూన్ నాటికి తప్పుల్లేని పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఐదు విడతలుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి -
మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణకొమరాడ: ఏజెన్సీ గ్రామల్లో ప్రజలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ బంజుకుప్ప గ్రామంలో ‘మా ఊరికి మలేరియా’ అనే కార్యక్రమానికి హాజర య్యారు. ఆనంతరం అక్కడ ఉన్న మలేరియా జర్వపీడితులతో మాట్లాడి చిక్సిత అందించి వారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల్లో మురుగునీరు నిల్వలేకుండా చేసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని కాచి చల్ల ర్చిన నీటి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మామిడి, టేకు తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కె.ఎస్.ఆర్.పురానికి చెందిన జగన్నాథసాగర్ పక్కన ఉన్న మామిడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తోట కాలిపోతుండడాన్ని గుర్తించిన పరవాడ జగదీష్ తక్షణమే వాటర్ ట్యాంక్తో నీరు తీసుకెళ్లి లగుడు అప్పలకొండ సహాయంతో మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పెద్దనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని స్థానికులు చెబుతున్నారు. కంచిరెడ్డి పాలెంలో జీడితోట బొండపల్లి: మండంలోని కంచిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 10 ఎకరాల్లో జీడితోట దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బర్ల లక్ష్మమ్మ జీడితోటలో మంటలు చేలరేగి క్రమంగా పక్కనే ఉన్న తోటలకు వ్యాపించి 10 ఎకరాల్లో చెట్లు కాలిపోయినట్లు తెలిపారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక వాహనంతో వెళ్లి మంటలు చుట్టుపక్కల ఉన్న తోటలకు అంటుకోకుండా అర్పివేసినట్లు చెప్పారు. మహిళా రోగి పట్ల అసభ్యకర ప్రవర్తనవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ మహిళా రోగి పట్ల శానిటేషన్ వర్కర్ (మేల్) అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల20 వతేదీన ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ ఒకరు రోగికి సహాయం చేస్తానని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్కు సిబ్బంది తెలిపారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఓ మహిళా రోగి పట్ల మేల్ శానిటేషన్ వర్కర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసిందని, వెంటనే శానిటేషన్ సూపర్ వైజర్ను పిలిపించి వర్కర్ను అక్కడి నుంచి మార్చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలువిజయనగరం క్రైమ్ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి అనుచితమైన పోస్టులు పెట్టినా, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరో మారు హెచ్చరించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకం నిఘా పెట్టిందన్నారు. ఒక బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నామని ఇతరులతో గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలను హెచ్చరించారు. -
ఫిడే ఆర్బిటర్ టైటిల్ సాధించిన ప్రసాద్
చీపురుపల్లి: ప్రపంచంలో ప్రతిష్టత్మకంగా బావించే ఫిడే ఆర్బిటర్ టైటిల్ను చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్ఎస్వీ. ప్రసాద్ సాధించారు. ఇంతవరకు సీనియర్ నేషనల్ ఆర్బిటర్గా ఉన్న ప్రసాద్ను అంతర్జాతీయ స్థాయిలో చదరంగం టోర్నమెంట్లు నిర్వహించే ఫిడే సంస్థ ఫిడే ఆర్బిటర్గా గుర్తించిన మేరకు ఫిడే అధ్యక్షుడు ధురవీకరణ పత్రం పంపించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఫిడే కౌన్సిల్ సెమినార్ లో దేశవ్యాప్తంగా 35 మంది పోటీ పడగా అందులో 12 మందిని ఫిడే ఆర్బిటర్లుగా ఎంపిక చేశారు. అందులో ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ ప్రస్తుతం విజయనగరం జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శిగా, రాష్ట్ర ఆర్బిటర్ కమిటీ కన్వీనర్గా, ఫెయిర్ ప్లే కమిటీ మెంబర్గా, మన్యం జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తునారు. ఈ టైటిల్ను ఆయన సాధించినందుకు పలువురు చదరంగం క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా చదరంగం అసోసియేషన్ అధికారులు అభినందనలు తెలియజేశారు. -
● ట్రైన్లో కార్డన్ సెర్చ్
● బ్యారెక్స్లో పీఎస్ఓల ట్రైనింగ్ క్యాంప్బొబ్బిలి/విజయనగరం క్రైమ్: ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్లే భవానీపట్నం ఎక్స్ప్రెస్లో బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్థానిక ఏపీ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగిల్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఒక్కసారిగా రైలెక్కి చేపట్టిన తనిఖీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. తనిఖీల ఉద్దేశాన్ని ప్రయాణికులకు పోలీస్ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా మద్యం, గంజాయి, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, గుట్కాల అక్రమరవాణాను అడ్డుకునేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సహకరించాలని కోరారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారి బ్యాగులు, సూట్కేస్లు, పలువురు తీసుకువెళ్తున్న గోనె సంచులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐ కె.నారాయణరావుతో పాటు రామభద్రపురం, తెర్లాం, మానాపురం ఎస్సైలు జ్ఞానప్రసాద్, సాగర్బాబు, జయంతి, జీఆర్పీఎఫ్ ఎస్ఐ బాలాజీరావుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. వీఐపీల భద్రతలో అలెర్ట్ ముఖ్యంవిజయనగరం క్రైమ్: వీఐపీల భద్రత విషయంలో పోలీస్ శాఖ రాజీ పడే ప్రసక్తే లేదని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. వీవీఐపీల భద్రతలో సిబ్బందికి అలెర్ట్ అత్యంత ఆవశ్యకమన్నారు. ఈమేరకు డీపీఓలోని బ్యారెక్స్ మైదానంలో పీఎస్ఓల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాజరైన ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ వ్యక్తిగత భద్రత విధులు (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్ఓలు) తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం వారిని ఉత్తమంగా నిలుపుతాయన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు, వీఐపీ సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగ్ ప్రాక్టీస్, వీఐపీ భద్రత విధుల నిర్వహణలో ఏం చేయాలి, ఏంచేయకూడదన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల పునశ్చరణ తరగతులను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకుని, తమ వృత్తి నైపుణ్యాన్ని, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవా లని సూచించారు. పీఎస్ఓ విధులు ఎక్కడ, ఎవరి వద్ద నిర్వహించినా క్రమశిక్షణతో మెలగాలని, నీట్ యూనిఫాం, చక్కని శారీరక దారుఢ్యంతో కనిపించాలని, విధుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ, వీఐపీ భద్రతకు ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత నిర్వహించే పీఎస్ఓలు చెడు వ్యసనాలకు దూరంగా, మంచి నడవడికతో ఉండాలని తద్వారా జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలని హితవు పలికారు. శిక్షణ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆర్ఐ పి.శ్రీనివాసరావు, అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, ఎంటి ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై ముబారక్ అలీ వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్ఓలు) పాల్గొన్నారు.నియామక పత్రాలు అందజేత విజయనగరం రూరల్: స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులకు ఉద్యోగోన్నతి, నిరుద్యోగులకు కారుణ్య నియామక పత్రాలను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. సింగన్నపాలెంలో సెకెండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ స్వామిబాబు మృతిచెందడంతో ఆయన భార్య ఎస్.రమాదేవిని చీపురుపల్లి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఓఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 9 మందితో పాటు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఎస్టాబ్లిష్మెంట్ ఏఓ ఎన్.రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఉద్యమ బాట
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ మంగళవారం ఆందోళన చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేయాలని, సీపీఎస్ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాతపెన్షన్ వర్తింపజేయాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్నల్లీవ్ ఎన్క్యాష్మెంట్ అంశాలను అమలు చేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని సూచించారు. జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, జీఓ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆయా సంస్థల్లో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ నాయకులు ఈశ్వరరావు, ఏపీయూఎస్ నాయకులు బల్ల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.రవీంధ్రనాయుడు, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, ఇందుకూరు అశోక్రాజు, బంకపల్ల శివప్రసాద్, శంకర్నాయుడు, రెడ్డి గణపతి, పైడిరాజు, డెక్క వెంకటరావు, చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్ణ, మెహన్రాజ్, జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దేవదాయ భూముల వేలంలో ఉద్రిక్తత
● సచివాలయం వద్ద కౌలు రైతుల ఆందోళన ● చివరకు వేలంపాట వాయిదా గజపతినగరం రూరల్: మండలంలోని పీ.ఎస్.ఆర్ పురం గ్రామంలోని 47 ఎకరాల దేవదాయశాఖ భూములకు మంగళవారం నిర్వహించిన కౌలు వేలంటపాట ఉద్రిక్తతగా మారింది. భూములను సాగుచేస్తున్న 19 మంది కౌలు రైతులు వేలంపాట నిర్వహించిన సచివాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 70 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నామని, ఏటా ఠంచన్గా దేవదాయ శాఖకు కౌలు చెల్లిస్తున్నామని, వేలంపాట లేకుండా తమకే కౌలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.శ్యామ్ప్రసాద్, శ్రీరామ్లు మాట్లాడుతూ ఇన్చార్జి ఈఓలు ఉండడం వల్ల ప్రతి మూడేళ్లకు నిర్వహించాల్సిన వేలంపాట 12 ఏళ్లుగా నిర్వహించలేదని, వేలంపాటకు రైతులు సహకరించాలని కోరారు. ఎస్ఐ కిరణ్కుమార్నాయుడు సైతం సర్దిచెప్పారు. వేలంపాటలో పాల్గొని భూములను కౌలుకు తీసుకోవాలని సూచించారు. దీనికి రైతులు ససేమిరా అనడంతో మరో పది రోజులు గడువు ఇస్తామని, వేలంపాట పాడిన వారికే భూములను కౌలుకు ఇస్తామని చెబుతూ దేవదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. -
వలస కార్మికుల కోసం టోల్ ఫ్రీ నంబర్
విజయనగరం గంటస్తంభం: అంతర్రాష్ట్ర వలస కార్మికులు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడలో 24 గంటల పాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 1800–425–8587 నంబర్కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే ఉద్దేశంతో కార్మికశాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. మృత్యు‘ధార’.. శృంగవరపుకోట: మృత్యువు ఏ రూపంలో.. ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. దీనికి ఎస్.కోటలో మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదమే నిలువెత్తునిదర్శనం. కొత్తూరు గ్రామానికి చెందిన కక్కల రాము (48) అదే గ్రామంలో బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఏళ్ల తరబడి చేస్తున్న అలవాటైన పని. ఎప్పటివలే బైక్కు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న ప్రయత్నంలో గన్ను పైకిలేపాడు. అంతే.. నీటిధారపైన ఉన్న విద్యుత్ లైన్ను తాకింది. దానిగుండా విద్యుత్ ప్రవహించడంతో వెంటనే రాము షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న రామును ఎస్.కోటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తె, కుమారునికి వివాహాలు అయ్యాయి. బైక్ సర్వీసింగ్ కార్మికుడి మృతితో కొత్తూరులో విషాదం అలుముకుంది. విద్యుత్ షాక్తో హోటల్ యజమాని మృతి పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో దేవి హోటల్ నిర్వహిస్తున్న చిక్కాల అనిల్కుమార్(29) విద్యుత్షాక్తో దుర్మరణం చెందాడు. హోటల్ వెనకభాగంలో నీటిపైపుతో ఇంటిని శుభ్రం చేస్తుండగా షాక్ తగిలి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య అనురాధ ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీహెచ్సీ సేవలపై ఆరా బాడంగి: బాడంగి సీహెచ్సీని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్పత్రి ముందు వర్షపునీరు నిల్వ ఉన్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓకు ఫోన్చేసి నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. ఆస్పత్రి భవన నిర్వాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎంఐడీసీ డీఈఈ నరేంద్ర, తహసీల్దార్ వరప్రసాద్, సూపరింటెండెంట్ డాక్ట్టర్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు ఉన్నారు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రెండేళ్లుగా రెడ్బుక్ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. రేగిడిలో స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికార దాహంకోసం సూపర్సిక్స్ హామీలిచ్చి అమలులో చేతులెత్తేయడం విచారకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ కింజరాపు సురేష్, పాడి లక్ష్మునాయుడు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ, టంకాల బుచ్చెన్నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
జీవన 'మార్క్'ట్..!
రామభద్రపురం అంతరరాష్ట్ర మార్కెట్... ఉత్తరాంధ్రాలోనే పెద్దది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతోంది. ఆకలి తీర్చుతూ ఆనందం కలిగిస్తోంది. అంతులేని సంతృప్తినిస్తోంది. అమ్మలా ఆదుకుంటోంది. నాలుగు రాష్ట్రాలకు నిరంతరం కూరగాయలు ఎగుమతికి కేరాఫ్గా నిలుస్తోంది. ప్రతిరోజూ రూ.35 లక్షల నుంచి రూ.45లక్షల మధ్య కూరగాయలు, పండ్ల వ్యాపారానికి కేంద్రంగా... అటు రైతులు, ఇటు వ్యాపారులు, కలాసీలు, రవాణా వాహనదారులు, టీ షాపుల వారు ఇలా పలువర్గాల ప్రజల జీవనానికి దిక్సూచీగా నిలుస్తోంది. ఏడాది పొడవునా శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే మార్కెట్పై ‘సాక్షి’ అక్షర రూపం. రామభద్రపురం: రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్లో రాత్రి 2 గంటలైతే చాలు... జన సందడి ఆరంభమవుతుంది. వాహన రాకపోకలు, కూరగాయలు, పండ్లను తీసుకొచ్చే వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఛాయ్వాలా నుంచి చిరువ్యాపారుల వరకు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలను చక్కబెడుతూ తమ జీవనమార్గాన్ని వెతుక్కుంటారు. రైతులే మూలం.. మార్కెట్కు రైతులే మూలం. రైతులకు మార్కెట్టే ఆధారం. ఈ ప్రాంతంలో 25 సెంట్లు నుంచి 2 ఎకరాల భూమి ఉన్న ఆసామీ వరకు నిరంతరం శ్రమిస్తారు. భూమిని సారవంతంగా మలచి బంగారు పంటలు పండిస్తారు. ధరలు బాగుంటే ఆనందిస్తారు. ధరలు పడిపోయిన సమయంలో దిగులు చెందుతారు. వ్యవసాయం ఓ వ్యాపకంగా ముందుకు సాగుతారు. అందుకే... ఈ మార్కెట్లో 365 రోజులూ కూరగాయలు, సీజన్వారీ పండ్ల వ్యాపారం సాగుతుంది. వ్యాపారులు, కలాసీలు, వాహనదారులకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ కూరగాయల ధరలు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే లభించడంతో ఉత్తరాంధ్రతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్కు వచ్చి క్రయవిక్రయలు జరుపుతారు. తమ జీవనానికి మార్కెట్టే ఆధారమని చెబుతారు. » రామభద్రపురం మార్కెట్ రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల రైతులు సాగుచేసిన కూరగాయలు, పండ్ల విక్రయాలకు ఆధారం. రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఇక్కడకు తెస్తుంటారు. » ఈ మార్కెట్ నుంచి రోజూ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, సుంకి, పొట్టంగి, జగదల్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్నాటక, మహారాష్ట్రలకు కూరగాయలు తరలిస్తారు. ఉదయాన్నే కోసిన కాయగూరలను నేరుగా మార్కెట్లోకి రైతులు తేవడంతో కొనుగోలుకు వ్యాపారులు మొగ్గుచూపుతారు. » శుభకార్యాలకు కూరగాయలు కొనుగోలు చేయాలంటే గుర్తొచ్చేది రామభద్రపురం మార్కెట్. »ఈ మార్కెట్పై ఆధారపడి పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు, కార్మికులు వందల సంఖ్యలో జీవనం సాగిస్తుంటారు. » ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. కార్మికులకు ఉపాధి భరోసా..రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి పలువురు కార్మికులకు ఉపాధినిస్తోంది. కూరగాయలు, పండ్ల మూటలను లారీలకు లోడ్చేయడం వల్ల రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు కూలి వస్తుంది. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతులు కష్టపడి పంట పండిస్తేనే మా లాంటి వారికి ఉపాధి. – సవరాల శ్రీనివాసరావు, కార్మికుడు, రామభద్రపురం జీవనాధారం ఇదే.. మా తాతదండ్రులనుంచి కూరగాయల సాగే మాకు జీవనాధారం. సీజన్లో అయితే రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తాం. అన్సీజన్లో ఒకటి రెండు రకాలే పండిస్తాం. నిత్యం ఏదో ఒక రకం కూరగాయ పంటలు పండిస్తాం. ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో వంగ, మిరప, చిక్కుడు తదితర కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. రామభద్రపురం మార్కెట్కు తెచ్చి విక్రయిస్తున్నాం. – తూముల సింహాచలం, రైతు, రామభద్రపురంమూటలు కట్టుకుని జీవనం.. ఈ ప్రాంత రైతులు అధికంగా కూరగాయల పంటలు సాగుచేయడం వల్లే రామభద్రపురం మార్కెట్కు మంచి పేరువచ్చింది. రైతు, మార్కెట్ లేకుంటే మా లాంటి వారి జీవనం దుర్భరంగా ఉండేది. పదేళ్లుగా ఇక్కడే కలాసీగా పనిచేస్తున్నాను. కాలువిరిగిపోవడంతో మూటలు కట్టుకుని బతుకుతున్నాను. – బోను అప్పలనాయుడు, రామభద్రపురం -
ప్రశాంత వాతావరణంలో అమ్మవార్ల జాతర
● డీఎస్పీ గోవిందరావు బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 28న జరిగే దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల జోడు సిరిమానోత్సవాలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ ఆర్ గోవిందరావు సూచించారు. పాత బొబ్బిలిలోని ధర్మకర్త చోడిగంజి రమేష్నాయుడు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులతో సోమవారం రాత్రి సిరిమానోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో రహదారులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అల్లర్లు చేసే వారిపై దృష్టి సారించాలని సీఐ కె.నారాయణరావుకు సూచించారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. కౌన్సిలర్ కోట పెదరాములు, నాయకులు మింది రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదాం విజయనగరం గంటస్తంభం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. విజయనగరంలో సోమవారం నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు భారీ ప్రదర్మనతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎర్రజెండాలతో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్మించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం దారుణమన్నారు. ఈ నెల 26 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయపద్రం చేయాలని కోరారు. సీపీఐ నేతలు పి.కామేశ్వరరావు, ఓమ్మి రమణ మాట్లాడుతూ, ఏఐటీయూసీ 106 ఏళ్లుగా కార్మికుల పక్షాన పోరాడుతోందని, వారికి ఎల్లప్పుడూ సీపీఐ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నేతలు బుగత అశోక్, పడాల రమణ, కె.స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. -
మా గోడు వినండి బాబూ..
నివాసం ఉన్న చోటే పట్టాలివ్వాలి దశాబ్దాలు నివసిస్తున్నాం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 30 ప్రకారం వంద గజాల ఇంటి స్థలానికి పట్టాలివ్వడంలో జాప్యంపై విజయనగరం నగర పరిధిలోని ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, రామకృష్ణ నగర్, వినాయక నగర్, గొడగల వీధి కాలనీవాసులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులను నిలదీశారు. తాగడానికి గుక్కెడు నీరు, నడవడానికి రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ వాపోయారు. కార్యాక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు బి.రమణ, నగర కమిటీ సభ్యులు రంభ శ్రీనివాసరావు, ఆనంద్, రాజు పాల్గొన్నారు. -
పీఎం రాహత్తో నగదు రహిత వైద్యం
విజయనగరం ఫోర్ట్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ) ద్వారా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎంరాహత్ పథకం వాల్ పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాద బాఽధితులకు గోల్డెన్ అవర్లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పీఎంరాహత్ పథకాన్ని జిల్లాలో 23 ఆస్పత్రుల్లో అందిస్తామన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీఆర్వో సత్తిబాబు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం, డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీసీహెచ్ఎస్ ఎన్.పద్మశ్రీరాణి, తదితరులు పాల్గొన్నారు. -
కాలు కోల్పోయినా కనికరం లేదు..
నా పేరు ఆర్నిపల్లి శివ. మాది బాడంగి మండలం పాల్తేరు గ్రామం. మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో ఎడమ కాలికి దెబ్బ తగలడంతో మోకాలి పైవరకు కాలును తొలగించారు. అప్పటి నుంచి ప్లాస్టిక్ కాలుతో, కర్ర సహాయంతో నడుస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నాను. వైద్యులు 72 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం ధ్రువపత్రం ఇచ్చారు. దానిని పట్టుకుని రెండేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్నా మంజూరు కావడం లేదు. వైద్య ఖర్చులకు కూడా అప్పు చేస్తున్నాను. పింఛన్ సైట్ ఓపెన్ చేయకపోవడం విచాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా లాంటి వారికి బతుకు కష్టాలు తప్పడంలేదు. -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...
● 27న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం ● 28 నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం చాటింపు ప్రక్రియ సోమవారం సాయంత్రం ఆలయం వద్ద నిర్వహించారు. ఆలయ తలయారులు రామవరపు చినపైడిరాజు బృందం అమ్మవారికి మనవి చెప్పి, ఈ నెల 27న సోమవారం దేవరమహోత్సవం నిర్వహిస్తారని, 28న మంగళవారం నుంచి అమ్మవారు చదురుగుడిలో భక్తులకు దర్శనమిస్తారంటూ చాటింపు వేశారు. అనంతరం ఆలయ ఈఓ కె.శిరీష మాట్లాడుతూ 27న సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి వనంగుడిలో పంచామృతాలతో అభిషేకాలు, స్తపన కార్యక్రమాలు అనంతరం ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. వేదపండితుల వేదస్వస్తి అనంతరం విచిత్రవేషధారణలు, భాజాభజంత్రీలతో అమ్మవారిని గాడీఖానా, సీఎంఆర్ కూడలి, ఎన్సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకెళ్తామన్నారు. రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. 28న మంగళవారం ఉదయం 6 గంటలకు అమ్మవారు పూజలందుకుంటారన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల వరకూ చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జలధార పరిమితం
● ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులే కొత్తగా చేపట్టినట్లు జలహారతివిజయనగరం ఫోర్ట్: ఓ సినిమాలో నటుడు చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి అన్న విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తయారైందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్తగా ఎటువంటి పనులు చేయకుండానే పాత పనులనే కొత్తగా చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. టీడీపీ వ్యవహారిశైలిని చూసిన వారంతా ఇదేం చోద్యం రా బాబు అని చర్చించుకుంటున్నారు. కొత్త పనులు చేపడితే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కావున పాతపనులనే కొత్తపనులుగా మమ అనిపించే విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 6వతేదీన టీడీపీ సర్కార్ జలధార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న గ్రామాల్లో చెరువుపనులు, నీరు చెట్టు వంటి పనులు చేపట్టాలి. తద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంచాలన్నది కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే జలధార పథకం కింద ఎలాంటి పనులు గుర్తించలేదని తెలిసింది. ప్రాథమిక కసరత్తు, పనుల గుర్తింపు వంటివి ఏవీ ఇంకా ప్రారంభం కాలేనట్లు తెలుస్తోంది. -
మండే సూరీడు..!
● సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● ఎండ వేడమితో విలవిల ● మధ్యాహ్నం 12 గంటలకే ఖాళీ అయిన రోడ్లు విజయనగరం ఆర్అండ్ఆర్ రైతు బజార్ రోడ్డులో పండ్లు వదిలేసి నీడకు వెళ్లిపోయిన చిరు వ్యాపారులు విజయనగరం ఫోర్ట్: భానుడు భగ్గుమన్నాడు. జనంపై నిప్పుల వర్షం కురిపించాడు. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ ఏడాదిలో అధ్యధికంగా సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అపసోపాలు పడ్డారు. ఇటుకబట్టీలు, ఫుట్పాత్ వ్యాపారులు, ఉపాధి హామీ వేతనదారులు, కర్రలు కొట్టేవారు, కళాసీలు ఎండ వేడమికి తాళలేక ఉదయం 10 గంటలకే ఇళ్లకు వచ్చేశారు. పుట్పాత్లు, రోడ్డు పక్కన కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు ఎండ వేడమికి తాళలేక నీడకు వెళ్లి పోయారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వృద్ధులు, పిల్లలు, చర్మసంబంధిత వ్యాధిగ్రస్తులు ఎండ ధాటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ను తాగారు. ఎండలో తిరగరాదు ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలో తిరగడం, ప్రయాణించడం మంచిదికాదు. సాధ్యమైనంతవరకు 10 గంటల లోగా పనులు ముగించుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
జాబితా విడుదల
టీచర్ల సీనియారిటీ ● ఈ నెల 21 నుంచి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ ● డీఈఓ యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలు సమానమైన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులు తమ వివరాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పదోన్నతుల జోన్లో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, అందరూ తమ సీనియారిటీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు తెలిపారు. జీఓ 610 ద్వారా జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ డీఎస్సీ మార్కులు, ర్యాంక్ వివరాలను సమర్పించి సీనియారిటీ సరిచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేకపోతే వారిని సంబంధిత డీఎస్సీలో జూనియర్గా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే నోషనల్ సీనియారిటీ పొందిన ఉపాధ్యాయులు తగిన ఆధారాలు సమర్పించి సీనియారిటీ తప్పులు ఉన్నట్లు గుర్తించినందున, వాటిని సరిచేసుకుని అప్డేట్ చేయాలని సూచించారు. -
కలకలం రేపిన లేగ దూడల కళేబరాలు
జామి: మండలంలోని అలమండ, కొవ్వాడ గ్రామాల మధ్యలో ఉన్న పల్లె గెడ్డలో సుమారు 15 లేడదూడల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం స్థానికులు గెడ్డలో లేడదూడల కళేబరాలను చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ కళేబరాలు ఈ గెడ్డలో ఏ విదంగా పడి ఉన్నాయి అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని మృత్యువాత పడిఉండడం గమనార్హం. స్థానికులు లేగ దూడలను, పశువులను సంతలకు పెద్ద పెద్ద లారీలపై తరలిస్తుంటారని సోమవారం అలమండ సంత కావడంతో వాటిని కబేళాకు తరలించడానికి వాహనాల్లో కాళ్లకు తాళ్లు కట్టి చుట్టూ గోనె సంచులు కడుతుంటారని దీంతో గాలి లేక చిన్నవి కావడంతో మృత్యువాత పడి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పశువులను కబేళాలకు ఏవిధంగా తరలిస్తున్నారో అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశురవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అధికారులు బృందం సందర్శన విషయం తెలుసుకున్న ఎస్సై వీర జనార్దన్, పశు వైద్యాధికారి నరేష్కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మ ఘటనా స్ధలానికి వెల్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
చచ్చుబడిన కాళ్లు.. చలించని ప్రభుత్వం
సాగు భూమి పోతే చావే శరణ్యం నాలుగు తరాలుగా సుమారు 48.30 ఎకరాల ఎండోమెంట్ దేవస్థానం భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ,గ్రామంలోని కొందరు స్వార్థపరులు తమకు ఆ భూములు కావాలని, వేలం వేయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వేలం ప్రక్రియను నిలిపివేసి, తమకే సాగుకు భూములు ఇవ్వాలంటూ గజపతినగరం మండలం పాత, కొత్త శ్రీరంగరాజపురం గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తంచేశారు. చిత్రంలో కాళ్లుచచ్చుబడిపోవడంతో ట్రైసైకిల్కే పరిమితమైనది.. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల యుగందర్. చెట్టుమీద నుంచి పడిపోవడంతో నడవలేని స్థితికి చేరాడు. పింఛన్ మంజూరు చేయాలంటూ రెండేళ్లగా డాక్టర్లు ఇచ్చిన సదరం ధ్రువపత్రం పట్టుకుని తిరుగుతున్నా ఫలితం శూన్యం. కొత్తపింఛన్లు మంజూరుకు వెబ్సైట్ ఓపెన్ కాలేదని అధికారులు చెబుతున్నారని, నా లాంటి వారు ఎలా బతకాలో పాలకులు, అధికారులే చెప్పాలంటూ గగ్గోలు పెట్టాడు. -
చేపలు మృత్యువాత
● దాదాపు రూ.20 లక్షలు నష్టంసంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అప్పమ్మ చెరువులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువులో ముళ్ల నాచు అధికంగా పేరుకు పోవడంతో చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయని దాదాపు రూ.20లక్షలు నష్టం వాటిల్లిందని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. దాదాపు దశాబ్దాలనుంచి ఈ చెరువునే నమ్ముకుని శ్రీ గణేష స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘ సభ్యులం బతుకుతున్నామని చేపలు మృత్యువాత పడడంతో వీధిన పడ్డామని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘంలో దాదాపు 65 మంది సభ్యులున్నారు. చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా ఓ రైతు అడ్డుపడడంతో చెరువులో నీరు అధికంగా ఉండడంతో నాచును చెరువునుంచి తీసేందుకు వీలు కాలేదు. ఎండలకు నీరు తగ్గడంతో చేపలు తిరుగాడేందుకు వీలుకాక ఊపిరాడక చనిపోయాయాని గ్రామానికి చెందిన సభ్యుడు దువ్వారపు శ్రీను వాపోయాడు. -
నాలుగు కిలోల కణితి తొలగింపు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్లిష్టతరమైన శస్తత్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ అల్లు పద్మజ సోమవారం వెల్లడించారు. చీపురుపల్లి ప్రాంతానికి చెందిన రైతు పెంటమ్మ అనే వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి కడుపు నొప్పితో వచ్చింది. జనరల్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ పీఏ రమణ, ఇతర వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి కడుపు లోపలి భాగంలో రెట్రోపెరిటోనియల్ ట్యూ మర్ ఉన్నట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న కణితిని రెట్రోపెరిటోనియల్ ప్రాంతంలో అన్ని వైపులా విస్తరించి, సమీపంలోని కిడ్నీ, ముఖ్యమైన రక్తనాళాలకు అంటుకుని ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి వల్ల రక్తనాళాలకు, ఇతర అవయవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 4 కిలోల కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు పీఏ రమణతో పాటు, చైతన్య బాబు, జగదీష్, వెంకటనాయుడు, ధర్మ కిషోర్, శశిధర్, అక్షిత, హేమసుందర్ నాయుడు పాల్గొన్నారు. వారిని సూపరింటెండెంట్ అభినందించారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
● 215 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినతుల పరిష్కానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు సత్వర పరిష్కారం అయ్యేలా కృషి చేస్నున్నారు. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్ వద్ద ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కూర్చుని సమస్యలు వివరించేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తాగునీరు వంటి వసతులు కల్పించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు చక్రాల సైకిళ్ల ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 215 వినతులు స్వీకరించగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. పంచాయతీ రాజ్–24, మున్సిపల్–8, విద్యుత్–9, హౌసింగ్–2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ–3, గ్రామ సచివాలయ శాఖ–2, విద్యాశాఖ–1 ఇతర శాఖలకు మరో 62 వినతులూ అందాయి. వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100 ద్వారా అందిన ఫిర్యాదులపై కూడా బాధ్యతగా స్పందించాలని సూచించారు,. ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అర్జీదారులతో మాట్లాడిన వివరాలను రికార్డు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. వినతుల పెండింగ్పై ప్రజల్లో అసంతృప్తి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం అసంతృప్తి కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీదారులు తమ వినతులు సమర్పించినప్పటికీ చాలా సమస్యలు వెంటనే పరిష్కారం కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల జాప్యం వంటి అంశాలు ఎక్కువగా రావడం, రెవెన్యూ వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం పరిమితంగా ఉండడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమైంది. అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి పార్వతీపురం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన వినతులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత. ఎస్ఈసీ దిలీప్ చక్రవర్తి కలిసి 93 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 24, ఇతర వినతులు 69 వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట గడువులోగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 27 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏవో సునీల్ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. భామిని మండలం పాలవలస గ్రామానికి చెందిన కడ్రక గోపాలం, పీఎల్పురానికి చెందిన లక్ష్మీనారాయణలు పవర్ టిల్లర్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాజమానుగూడ గ్రామానికి చెందిన సవర శివకుమార్ తాగునీటి ట్యాంకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తబర్న గ్రామానికి చెందిన ఆరిక వెంకటరావు రచ్చబండ నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, డీఈ రాధారాణి, ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, జీసీడీవో రాములమ్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
జర్నలిజంపై ఉక్కుపాదం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి పత్రిక చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్టు తీరు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడడం అత్యంత దుర్మార్గమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ప్రదర్మన నిర్వహించాయి. ● ఇదెక్కడి అన్యాయం... అరెస్టుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులను పోలీసులు పూర్తిగా విస్మరించారని జర్నలిస్టు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ముందస్తుగా సెక్షన్ 41–ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, శ్రీహరి విషయంలో నేరుగా అరెస్టు చేయడం పోలీసుల అతిగా ప్రవర్తించడమేనని విమర్మించారు. అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని, స్పష్టమైన ఐడెంటిటీ కార్డులు కలిగి ఉండాలన్న నిబంధనలను గాలికొదిలేశారని, డీకే బసు మార్గదర్మకాలకు తూట్లుపొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● ప్రభుత్వ కక్షసాధింపు చర్యే... ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే జర్నలిస్టులపై కక్ష కట్టిందని నేతలు ఆరోపించారు. కేవలం వార్తలు రాసినందుకు దేశద్రోహం, 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లు బనాయించడం భావప్రకటన స్వేచ్ఛను ఖూనీ చేయడమేనన్నారు. నిరసన కార్యక్రమంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి యుగంధర్, చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు కె.జె.శర్మ, ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్నాయుడు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్మి ఎం.ఎస్.రాజు, వారితో పాటు పాత్రికేయులు వి.ఎం.ఎల్.లక్ష్మణరావు, డేవిడ్రాజు, ఉమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యురాలు దేవి, తదితరులు పాల్గొన్నారు.అక్రమ అరెస్టులు ఆపాలి జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం. శ్రీహరి అరెస్టులో నిబంధనలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా బనాయించిన కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. – పి.ఎస్.ఎస్.వి.శివప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఏపీడబ్ల్యూజే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా నడుచుకోవాలి పోలీసులు ఒక పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం దారుణం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. – వి.ఎం.మహాపాత్రో, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నిరంకుశత్వానికి పరాకాష్ట జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో భయపెట్టలేరు. ప్రభుత్వం తన పద్ధతి మార్చకోవాలి. – ఎంఎంఎల్ నాయుడు, 10టీవీ, సీనియర్ రిపోర్టర్ చట్టాన్ని గౌరవించాలి.. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్మకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. చట్టాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి హానికరం. మహిళా జర్నలిస్టులపై కూడా నిరాధార కేసులు నమోదు చేయడం ఆందోళనకరం. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపివేసి, ప్రజల కోసం పనిచేసే పాలన కొనసాగాలి. – విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ పూడి శ్రీహరి అరెస్టు రాజ్యాంగ విరుద్ధం అక్రమ అరెస్టుపై భగ్గుమన్న జర్నలిస్టు లోకం సుప్రీంకోర్టు మార్గదర్మకాలకు పాతర ఖాకీల అత్యుత్సాహంపై ఆగ్రహం విజయనగరం కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
జేఈఈ మెయిన్స్లో ‘విజయ’కేతనం
విజయనగరం అర్బన్: దేశంలో అత్యున్న ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ–2026 మెయిన్స్ ప్రవేశపరీక్ష ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థి పేరు: యర్రమిల్లి శ్రీకృష్ణ ఆదిత్య ఊరు: విజయనగరం పర్సంటైల్: 99.820 ర్యాంకు: 2,974 (జాతీయ స్థాయి) తల్లిదండ్రులు: నాగస్వరూపలలిత, వై.వి.శివశంకరమూర్తి (మిమ్స్ పీడియాట్రిక్ విభాగాధిపతి) విద్యార్థి పేరు: తోతాడి శైలేష్ ఊరు: విజయనగరం పట్టణం పర్సంటైల్: 99.102 ర్యాంకు: 14,393 ఙ (జాతీయస్థాయి) (ఓబీసీ–3,630) తల్లిదండ్రులు: బలగ కళావతి (గృహిణి), సత్యారావు (టీచర్) విద్యార్థి పేరు: చింతల వెంకటసాయి వర్షిత్ ఊరు: ఎస్.చింతలవలస(రామభద్రపురం మండలం) పర్సంటైల్: 99.72 ర్యాంకు: 4,443 (జాతీయస్థాయి) (ఓబీసీ–915) తల్లిదండ్రులు: త్రివేణి(గృహిణి), రామారావు (రైతు) -
వాల్మీకి రామాయణంపై ప్రకాష్రాజ్ వ్యాఖ్యలు సరికాదు
● వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ విజయనగరం రూరల్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ వాల్మీకి రామాయణంపై చేసిన అవమానకరమైన, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రామనారాయణంలోని వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాముడిని ఉత్తరం నుంచి దక్షిణానికి వలస వచ్చిన కూలీగా చిత్రీకరించడం ప్రకాష్రాజ్కు ఈ మహా ఇతిహాసం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికత పరమైన గొప్పతనంపై సరైన అవగాహన లేమిని స్పష్టం చేస్తుందన్నారు. వాల్మీకి రామాయణం ఒక సాధారణ కావ్యం కాదని, ఇది భారతదేశ నైతిక విలువలకు, కుటుంబ వ్యవస్థకు, సమాజ నిర్మాణానికి పునాదని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం ద్వారా ధర్మం, న్యాయం, పాలనా విలువలు నేటికి మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, దాని నైతిక విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక ఐక్యత న్యాయం, సంక్షేమం ఆధారంగా ఉన్న ప్రజా విధానాలు భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కుల ఆత్మ అని అన్నారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలను రగిలించే ప్రమాదం ఉందని, జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని మండిపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రముఖులు ఇలాంటి విషయాలలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ఇలాంటి గొప్ప గ్రంథాలపై వ్యాఖ్యలు చేసే ముందు సరైన అధ్యయనం, అవగాహన అవసరమని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు భావోద్వేగాలను దెబ్బతీయడమే కాకుండా, సత్యాన్ని కూడా వక్రీకరిస్తాయని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని సరిదిద్దడానికి, రామాయణంలోని మహత్తర విలువలను ప్రతిబింబించే ఒక సార్థక కళాఖండం (సినిమా/నాటకం) రూపొందించడం ఉత్తమ మార్గమని మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. -
ఆటోలో నుంచి జారిపడి యువతి మృతి
గంట్యాడ: కుటుంబానికి తోడుగా నిలవాలని ఆశించిన ఓ పేదింటి యువతి ప్రాణం రోడ్డు ప్రమాదంలో కరిగిపోవడం గంట్యాడ మండలాన్ని కలిచివేసింది. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరవ గ్రామానికి చెందిన బోనెల రేణుక(18) మృతి చెందింది. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరంలో ఓ బట్టల షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న రేణుక..నిర్వాహకుల సూచనల మేరకు ముకపాక, సిరిపురం, పెదవేమలి గ్రామాల్లో ప్రచారం కోసం సహచరులతో కలిసి ఆటోలో బయలుదేరింది. ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పెదవేమలి సమీపంలో ఆటోలో నుంచి అనుకోకుండా జారిపడింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన సహచరులు వెంటనే అదే ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే రేణుక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. కుటుంబానికి ఆదరణ అవసరం పేద కుటుంబానికి చెందిన రేణుక, చిన్న వయస్సులోనే కుటుంబ భారం తగ్గించాలని ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆధారంగా నిలబడాలని కృషి చేసింది. అలాంటి సమయంలోనే జరిగిన ఈ దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. గ్రామస్థులు, స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం, పరిహారం అందించాలని కోరుతున్నారు. గుండెపోటుతో పీహెచ్సీ ఉద్యోగిని..జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మ వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓగా పనిచేస్తున్న బిడ్డిక హైమావతి శుక్రవారం రాత్రి తన స్వగ్రామం గుమ్మలక్ష్మీపురంలో గుండెపోటుతో మరణించారు. ఆమె రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నుంచి బదిలీపై జియ్యమ్మవలస పీహెచ్సీకి వచ్చారని, మరో 40 రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారని ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు. తోటి ఉద్యోగులతో సన్నిహితంగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని తన కుమారుడి వివాహం చేసే పనిలో రెండు రోజులుగా సెలవులపై వెళ్లారని, ఇంతలో ఆమె మృతి చెందడంపై సహచర సిబ్బంది, వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెకు ఆత్మశాంతి కలగాలని వారంతా కోరారు. -
దిగుబడులు కొండంత.. కొనుగోలు గోరంత..!
● వేల టన్నుల అపరాల దిగుబడి ● జిల్లాలో సుమారు 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడి ● ప్రభుత్వం కొనుగోలు చేసింది 39 టన్నులు మాత్రమే.. ● దిగుబడుల్లో పది శాతం కూడా కొనుగోలు చేయని సర్కార్ ● తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించిన రైతులు విజయనగరం ఫోర్ట్: కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెత మాదిరి తయారైంది టీడీపీ సర్కార్ పరిపాలన తీరు. రబీ సీజన్లో రైతులు పండించిన అపరాలు (పెసర, మినుము) కొనుగోలు చేసేందుకు టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల తీరు ఇలానే ఉంది. జిల్లాలో పెసర, మినుము పంటల ఉత్పత్తి వేలాది టన్నులు వస్తే అందులో కనీసం 10 శాతం పంటను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఒరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు పంటను రైతులు 60 నుంచి 70 శాతం విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు పంటను విక్రయించుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసింది 39.2 మెట్రిక్ టన్నులే.. జిల్లాలో అపరాల దిగుబడులు ఆశించిన విధంగానే వచ్చాయి. మొత్తంగా 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. అయితే టీడీపీ సర్కార్ జిల్లాలో నాలుగు అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జామి మండలం విజినిగిరి, సంతకవిటి, గజపతినగరం, బొబ్బిలిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో విజినిగిరి మినహా మిగిలిన ఎక్కడా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. విజినిగిరి కొనుగోలు కేంద్రంలో 39.2 మెట్రిక్ టన్నులు మినుములు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు దక్కని మద్దతు జిల్లాలో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర కూడా లభించలేదు. అమావాస్య వెళ్లిన ఆరు నెలలు తర్వాత అల్లుడు వచ్చిన సామెత చందాన రైతులు పంట విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ఎంతో శ్రమించి ఆరుగాలం కష్టపడి పంటలు దిగుబడులు సాధిస్తుంటే ప్రభుత్వ తీరుతో నష్టాలే తప్ప లాభాల బాట పట్టలేకపోతున్నామన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. తక్కువ ధరకే.. అపరాలు (పెసర, మినుము) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం వల్ల వ్యాపారులు రైతుల నుంచి పంటను తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు పెసలు రూ. 8,768, మినుములు క్వింటా మద్దతు ధర రూ. 7800గా నిర్ణయించింది. వ్యాపారులు మాత్రం క్వింటాకు పెసలు రూ.7 వేలు, మినుములు రూ. 6800లకు కొనుగోలు చేశారు. దీని వల్ల క్వింటాకు రైతులు పెసలకు రూ.1800, మినుములు రూ. 1000 వరకు నష్టపోయారు. మూడు నాలుగు క్వింటాళ్లు పండించిన రైతులు అయితే పెసలు రూ. 5400, మినుములు 3 వేల వరకు నష్టపోయారు. పంట చేతికి వచ్చిన ఆరంభ దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేదని రైతులు చెబుతున్నారు. పెసర, మినుము పంటలకు సంబంధించి జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జామి మండలం విజినిగిరి కొనుగోలు కేంద్రంలో మినుములు 39.2 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశాం. మిగిలిన కేంద్రాల్లో కొనుగోలు జరగలేదు. – ఎన్.వెంకటేశ్వరావు, జిల్లా మేనేజర్, మార్క్ఫెడ్ -
పక్కాగా జనగణన చేయాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి సీతానగరం: గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న 2026 జనగణన పక్కాగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని సూరంపేట పంచా యతీ, మరిపివలస రామమందిరంలో వెలుగు ఏపీఏ కె.పద్మ పర్యవేక్షణలో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న వ్యక్తిగత జన గణన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపుసంఘాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న జనగణన పక్కాగా ఉన్నప్పుడే ప్రణాళికలు సక్రమంగా ఉంటాయని తెలియజేశారు. ఎన్యూమరే్షన్ చేయడం వల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి, సంక్షేమ పథకాల మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జనగణన చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికార సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాట్లలో వివక్ష తగదు
విజయనగరం టౌన్: స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాట్లలో వివక్ష చూపడం తగదని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావు, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్య, టీవీ.దుర్గారావు, దిమిలి పైడిరాజు, షాజహాన్లు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రజా గ్రంథాలయంలో ఆదివారం లచ్చన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన జీవితాంతం కార్మికులు, కర్షకుల, పేద, దళితుల పక్షాన నిలబడి ఆనాటి వ్యవస్ధలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాయోధుడని కొనియాడారు. అటువంటి మహానీయుడి విగ్రహాన్ని జిల్లాలో ఏర్పాటుచేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆ యన జయంతిని రాష్ట్ర పండగగా గుర్తించిన ప్రభుత్వం విగ్రహం ఏర్పాటులో నిర్లక్ష్యదోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో చెలికి లక్ష్మణరావు, జంపాన చిన్న, తదితరులు పాల్గొన్నారు. -
సీసీలా..సర్వేయర్లా..!
● డిప్యుటేషన్పై సర్వేయర్లుగా డీఆర్డీఏ సీసీలు ● కొద్ది నెలల క్రితం మళ్లీ సీసీలుగా డీఆర్డీఏకు ● వారిలో కొంతమంది రెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విజయనగరం ఫోర్ట్: డీఆర్డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) పరిధిలో పనిచేసే కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల(సీసీ)లో కొంతమంది వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. డీఆర్డీఏ శాఖలో పనిచేస్తున్న 12మంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖకు డిప్యుటేషన్పై వెళ్లారు. కొద్ది నెలల క్రితం తిరిగి డీఆర్డీఏకు వచ్చేశారు. దీంతో వారిని సీసీలుగా డీఆర్డీఏ అధికారులు వివిధ మండలాల్లో నియమించారు. అయితే రెవెన్యూశాఖ నుంచి డీఆర్డీఏకు వెనక్కి వచ్చినప్పటికీ కొంతమంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ రెవెన్యూ అధికారులతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే చేయడానికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓవ్యక్తి వారిపై డీఆర్డీఏ అధికారులకు, సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్డీఏ అధికారులు దాచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన తరువాత ఓ సీసీని విజయనగరం నుంచి వేరే మండలానికి బదిలీ చేసినట్లు సమాచారం.రెవెన్యూలో తప్పులతో మాకేం సంబంధంరెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా చేసినప్పుడు వారు చేసిన తప్పుల గురించి మాకేం సంబంధం. రెవెన్యూ శాఖ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత వారిని సీసీలుగా నియమించాం. కొంతమంది సీసీలు సర్వేయర్లుగా చలామణీ అవుతున్న విషయం తెలియదు. ఓ సీసీని వేరే కారణంతో బదిలీ చేశాం. శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ -
బతుకు వేటపై వేటు
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలు వేట చేస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకుల్లో అంధకారం అలుముకుంది. చేపల వేట నిషేధం అమలు చేయడంతో వారి కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడ్డాయి. కొట్టిశకు చెందిన శ్రీసీతారామ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు ఈ ప్రాజెక్టులో నిత్యం చేపలు వేట సాగిస్తున్నారు. ఈ సొసైటీలో ఉన్న సుమారు 500 మంది మత్స్యకారులకు ఈ ప్రాజెక్టే జీవనాధారం. గతంలో ప్రభుత్వానికి లీజు సొమ్ము చెల్లించకపోవడంతో మత్స్యశాఖ అధికారులు ప్రాజెక్టులో చేపల వేట నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులకు తమను బాధ్యులను చేయవద్దని, తాజాగా మత్స్యకార సొసైటీ నూ తనం కార్యవర్గం ఎన్నికై న తరువాత చెల్లించాల్సిన లీజు మొత్తం చెల్లిస్తామని వారు చెబుతున్నారు. దీనికి అధికారులు ససేమిరా అనడంతో మత్స్యకార కుటుంబాల్లో చీకటి అలుముకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బీసీలు ఇదే ప్రాంతంలో మత్స్యకారులుగా మారి జీవనం సాగిస్తుండగా.. వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాజెక్టులో చేపల వేటే జీవనాధారం. రూ.63 లక్షలు చెల్లించాల్సిందే ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. గడిచిన ఐదేళ్ల నుంచి మత్స్యకార సొసైటీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు సొమ్ము సకాలంలో చెల్లించలేదు. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి గత ఏడాది జూలై నాటికి సుమారు రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంది. మత్స్యకార సొసైటీ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఆ పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే గత ఏడాది నవంబర్ 11వ తేదీన నూతన కార్యవర్గం ఎన్నికై ంది. పాత బకాయిల చెల్లింపులో వెసులుబాటు ఇవ్వాలని, ప్రస్తుతం చెల్లించాల్సిన 1435 ఫసలీ డబ్బులు రూ.18,21,817 చెల్లిస్తామని సంఘం సభ్యులు అధికారుల ఎదుట వెల్లడించారు. దీనిపై గత ఏడాది నవంబర్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జేడీ లక్ష్మణరావు దర్యాప్తు చేపట్టి నివేదికను ప్రభుత్వానికి, మత్స్యశాఖ కమిషనర్ ద్వారా అందించారు. అప్పటి నుంచి ఆ దర్యాప్తు నివేదిక ఏమైందో తెలియని పరిస్థితి, ఏమి చర్యలు తీసుకున్నారో తెలియని దుస్థితి నెలకొంది. తాజాగా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినప్పటికీ ప్రాజెక్టులో చేపల వేట చేసేందుకు ఇటీవల ఓపెన్ ఆక్షన్ పెడతామని అధికారులు ముందస్తు ప్రకటన జారీ చేశారు. దీంతో మత్స్యకారులంతా ప్రతిఘటించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. 1435 ఫసలీ సొమ్ము చెల్లించి మత్స్యకారులంతా చేపల వేటకు సిద్ధమని అధికారులకు తెలియజేసినప్పటికీ గత పాత నాలుగు ఫసలీల సొమ్ము రూ.45 లక్షలు, ప్రస్తుతం కొత్త ఫసలీ సొమ్ము మొత్తం రూ.18.21 లక్షలు కలిపి మొత్తం రూ.63 లక్షలు చెల్లించాల్సిందేనని మత్స్యశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో మత్స్యకారుల్లో గందరగోళంలో నెలకొంది. చేపల వేట నిషేధిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని, నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఉద్యమబాట పట్టే యోచనలో మత్స్యకారులున్నట్లు తెలుస్తోంది. మత్స్యకారుల బతుకుల్లో అంధకారం మడ్డువలసలో చేపల వేట నిషేధం పాత బకాయిల పేరుతో లీజు ఆర్డర్ నిలుపుదల సమస్య పరిష్కరించాలంటూ 500 మంది మత్స్యకారుల డిమాండ్చేపల వేట నిషేధిస్తే ఎలా? ప్రాజెక్టులో చేపలు వేట చేసి జీవనం సాగించే తమకు వేట నిషేధం చేస్తే జీవనం కష్టతరమవుతుంది. 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయి. గత నాలుగు ఫసలీల లీజు సొమ్ము చెల్లించనంత వరకు అధికారులు నిద్రావస్థలో ఉండడమే ప్రధాన సమస్య అయింది. పాత బకాయిలు కలిపి తమను కట్టమంటే ఎలా కట్టగలం. మల్లీడ తవిటందొర, మత్స్యకారుడు, సంగాం అన్ని ఫసలీల సొమ్ము చెల్లించాలిగతంలో బకాయి పడిన మొత్తం సొమ్ముతో పాటు ప్రస్తుతం 1435వ ఫసలీ సొమ్ము చెల్లించాలి. చేపల వేట నిషేధం వాస్తవమే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. మత్స్యకారుల పట్ల మాకు ఏమీ కక్ష లేదు. మత్స్యకారులు సమస్యపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సీహెచ్.వి.వి.ప్రసాదరావు, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్, రాజాం.మత్స్యశాఖ అధికారుల కక్ష మత్స్యకారులపై అధికారులు కక్ష గడుతున్నారు. ప్రస్తుత కాలానికి లీజు సొమ్మును చెల్లించేందుకు మా సంఘం సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చాం. గతంలో ఉన్న బకాయిలు ఇప్పుడు చెల్లించమంటే ఎలా చెల్లించగలం. ఉన్నతాధికారులు పునరాలోచించి చేపల వేట నిషేధం ఎత్తివేయాలి. 1435 ఫసలీ సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు లీజు ఆర్డర్ ఇవ్వాలి. కోల రాము, మత్స్యకారుడు, మగ్గూరు. -
ద్వారపురెడ్డి దారెటు?
● టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ రాజకీయ భవితవ్యంపై చర్చ ● మాజీ ఎమ్మెలేలు, చిరంజీవులు, భంజ్దేవ్లకు అవమానం సాక్షి, పార్వతీపురం మన్యం: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి ఉంటుందన్నది జగత్విదితమే. సుదీర్ఘ కాలంపాటు పార్టీకి సేవలందించిన నాయకులను..అవసరం తీరాక కరివేపాకు మాదిరి తీసి పడేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన..రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించిన.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఆయనతోపాటు..మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిన విషయం విదితమే. నియోజకవర్గంతో పాటు, జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెంది న జగదీష్..నిన్న మొన్నటి వరకూ పార్టీ ఆదేశాలను దాటక, విధేయుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఏ రోజుకై నా వాస్తవాలను గ్రహించి, పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనను మరింత కుంగదీశాయన్న ప్రచారం నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్వతీపురం మండలం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటిరామినాయుడువలసలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఆ సందర్భంలో ఆయనతోపాటు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులుకు తీవ్ర అవమానం జరిగింది. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందని భావించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానం పట్టించుకోకపోగా..ఇటీవల నియామకం చేపట్టిన పార్టీ కమిటీల్లోనూ ఆయనకు చోటు కల్పించకపోవడం తీవ్రంగా బాధించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధిగానూ ఆయనను తొలగించారు. చాలా రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. భంజ్దేవ్కూ పరాభవం జగదీష్, చిరంజీవులు వంటివారే కాదు.. సాలూరుకు చెందిన సీనియర్ నేత భంజ్దేవ్కూ పార్టీలో తీరని పరాభావమే ఎదురవుతోంది. ఇటీవల ఓ విచారణ విషయమై పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సొంత పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వచ్చారని సన్నిహితుల వద్ద వాపోయారు. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్రసాయిలో సేవలందించిన ఆయనకు..పార్టీ కమిటీలోనూ చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో కష్టకాలంలోనూ తనతోపాటు నిలిచిన పార్టీ కార్యకర్తలతో నేడో, రేపో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది. వారితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అవమానాలు భరిస్తూ, పార్టీలో నే ఉండాలా? లేదా మరోచోటకు వెళ్లిపోవా లా? అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
అక్షయ తృతీయకు ధరల సెగ
విజయనగరం: శుభకార్యమైనా.. వివాహ వేడుకై నా పసిడి మెరవాల్సిందే.. వెండి మురవాల్సిందే. పేదింట్లో అయినా, కలవారి కుటుంబమైనా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయం. ఇక పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ రోజున పుత్తడికి గిరాకీ మరింత పెరుగుతుంది. అదే సమయంలో ధర ౖపైపెకి చేరుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాయి. అక్షయ తృతీయ పర్వదినం ఇక అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధనిక.. పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు రెట్టింపయ్యాయి. ఏటా సంప్రదాయంగా కొనుగోలు చేసేవారు ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో గతేడాదిలో కొన్న దానిలో సగమైనా తీసుకుందామని యోచిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దూరంగానే ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతంలో సామాన్యుల వివాహ వేడుకకు అన్ని ఖర్చులు కలిపి మొత్తంగా రూ.10 లక్షలలోపు పూర్తయ్యేది. ప్రస్తుతం అదే తరహాలో జరిపించడానికి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. గడిచిన రెండు మూడేళ్లలో వ్యయం 60 శాతం పెరిగినట్లయింది. ఈ మోయలేని భారం వల్ల బంగారు ఆభరణాలకు దూరం చేస్తుంది. ఈసారి అంతంతే... ఉమ్మడి జిల్లాలో బంగారం వ్యాపారానికి విజయనగరం పెట్టింది పేరు. సుమారు 12 వరకు కార్పొరేట్ సంస్థలతో పాటు చిన్న, చితక అన్నీ కలిపి మరో 300 వరకు దుకాణాలు ఉన్నాయి. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాదితో పొలిస్తే అంత సందడి కనిపించడం లేదు. ఇళ్లలో ఉన్న బంగారాన్ని విక్రయించి వస్తువులు చేయించుకోడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరీ చిన్నదుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో తక్కువ రేటులో బంగారం కొని ఉంచుకున్న వారు ఈ గరిష్ఠ ధరలో విక్రయించి, పెట్టుబడులు ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. పెరిగిన బంగారం ధరలతో వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఊహించని విధంగా ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బంగారం దిగుబడి తగ్గడంతో పాటు మూడుసార్లు పెరగడం ఈ రేట్లు పెరుగుదలకు ప్రధాన కారణం. యుద్ధం ముగిసేంత వరకు రేట్లు ఇలానే ఉంటాయి. ఆ తర్వాత తగ్గే అవకాశాలున్నాయి. కొన్ని నెలల్లోనే 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా రూ.లక్ష దాటడంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పెళ్లిళ్ల సీజన్లో మా అంచనాలు తల్లకిందులయ్యాయి. పెద్ద వస్తువులు కొనేవారు తగ్గిపోయారు. అవసరమైన చిన్న వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. – మాధవ, గోల్డ్ మర్చంట్, విజయనగరం రోజురోజుకు పెరుగుతున్న పసిడి ప్రస్తుతం తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరువైంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,80,200, 22 క్యారెట్ల బంగారం ధర తుల రూ. 1,65800 పలుకుతోంది. అదే వెండి కిలో రూ.2,65,000 అమ్ముతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారు. గతంలో రూ.10 లక్షల వరకు పెళ్లికి ఖర్చవగా ఇందులో రూ.3 లక్షల వరకు బంగారానికే కేటా యించేవారు. ప్రస్తుతం ఇతర ఖర్చులు తగ్గించుకుని బంగారానికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. -
సాక్షి విలేకరి మృతి
దత్తిరాజేరు: ప్రముఖ పత్రికలలో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడు, ప్రస్తుతం సాక్షి దినపత్రికలో కలెక్టరేట్ డేట్లైన్తో వార్తలు రాస్తున్న విలేకరి సుంకరి రాజేశ్వరరావు(శివ)(49)ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. కొద్ది నెలల క్రితం ఆనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి వెలుగులో పనిచేస్తున్న భార్య ఇందిర, కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలుసుకున్న వెంటనే ఆర్కే టౌన్షిప్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాలనర్సింగరావు, జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు పెద్ద ఎత్తున చేరుకుని మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు, -
నాటి సంస్కరణలతోనే నేటి సత్ఫలితాలు
తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి బూసాయవలస కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాను. ఇక్కడ ఇంటర్లో 947 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కేజీబీవీలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టకుంటే ప్రైవేటు కాలేజీల్లో డబ్బులు ఖర్చుపెట్టి నాలాంటి వారు చదవాల్సి వచ్చేది. అంత స్తోమత మాకు లేదు. జగన్ మామయ్య సంస్కరణలు నా చదువుకు ఎంతగానో ఉపకరించాయి. వెటర్నరీ డాక్టర్ కావడమే నా లక్ష్యం. –ఎస్,షర్మిల, సెకండియర్ టాపర్ విద్యార్థిని రామభద్రపురం: పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఓ సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది. పేదింటి పిల్లలు ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. ప్రతి ఇంట్లో ఇంజినీరు, డాక్టర్ ఉండాలన్న లక్ష్యంతో 2018లో జిల్లాలో ఒక్క కేజీబీవీలో మాత్రమే ఇంట ర్ విద్య ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని కేజీబీవీల్లో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 26 కేజీబీవీలను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. నాడు – నేడు, అమ్మ ఒడి, వసతి, విద్యాదీవెన తదితర పథకాలు అమలు చేశారు. ఫలితంగా నేడు కేజీబీవీల్లో విద్యార్థినులు ఇంటర్లో సత్ఫలితాలు సాధించారు. ఇదంతా గత ప్రభుత్వం చలువేనని తల్లిదండ్రులు, విద్యార్థినులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. జిల్లాలో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగర మండలాల్లో ఉన్న మొత్తం తొమ్మిది కేజీబీవీలు ఇంటర్ ఫస్టియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. అలాగే రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, పూసపాటిరేగ, రేగిడి, తెర్లాం మండలాల్లో ఉన్న మొత్తం పది కేజీబీవీలు ఇంటర్ సెకండియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల మండలాలో ఉన్న కేజీబీవీలలో మొత్తం ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో విద్యా రంగంలో చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పేద బాలికలకు పైసా ఖర్చు లేకుండా వసతితో కూడిన నాణ్యమైన విద్య బోధనను ప్రభుత్వం నుంచి ఉచితంగా లభిస్తుండడంతో కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో మరింత మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అప్పట్లో 26 కేజీబీవీలో ఒకొక్క జూనియర్ కళాశాలలో ఒక్కో గ్రూపు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో గ్రూపునకు 40 మంది చొప్పున ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 1040 మంది విద్యార్థినులు చదివేందుకు అవకాశం ఉంది. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు చదివేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రవేశాలు పెరిగాయి. బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, గరివిడి, మెంటాడ, కొత్తవలస, ఎల్.కోట, నెల్లిమర్ల కళాశాలలో ఎంపీసీ గ్రూపు నిర్వహిస్తున్నారు. రామభద్రపురం, భోగాపురం, బొండపల్లి, పూసపాటిరేగ, రాజాం, తెర్లాం, వంగర, విజయనగరం, గంట్యాడలో గల కళాశాలల్లో బైపీసీ గ్రూపులు ఉన్నాయి. సంతకవిటిలో సీఈసీ, ఆర్.ఆమదాలవలస, వేపాడ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్(సీఎస్ఈ), బొబ్బిలి, డెంకాడ, జామి కళాశాలల్లో ఎంపీహెచ్డబ్ల్యూ, గుర్ల కళాశాలలో ఫిజియోథెరిఫీ, దత్తిరేజేరు కేజీబీవీ కళాశాలలో ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. టీచర్ కావాలన్నదే నా లక్ష్యం. బూసాయవలస కేజీబీవీ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ బైపీసీలో 927 మార్కులు సాధించాను. సెకండ్ టాపర్గా నిలిచాను. గత ప్రభుత్వ చలువతో పాటు అధ్యాపకుల బోధనతో ఇది సాధ్యమైంది. – ఎన్.మోహిని, కేజీబీవీ విద్యార్థిని -
చిట్టిబాబు సేవలకు ఏయూలో ఘనసత్కారం
విజయనగరం టౌన్: ఆంధ్రాయూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖలోని ఏయూ కన్వెన్షెన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా ఉన్న జిల్లాకు చెందిన పెంకి చిట్టిబాబుకు ఘనసత్కారం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి దోహాలో నిర్వహించిన రెండవ సోషల్ సమ్మిట్లో పాల్గొనడమే కాకుండా, బాలల హక్కులు, దళిత ఆదివాసీ హక్కులపై సుబ్రహ్మణ్యం జా తీయ అవార్డు పొందిన చిట్టిబాబుకు యూనివర్సిటీ రెక్టార్ పి.కింగ్ చేతుల మీదుగా అభినందించారు. సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎస్.హరినాథ్, ఆచార్య ఆర్.స్వామిదాస్, విశ్రాంత ప్రొఫెసర్లు టి.శోభ, పి. అర్జున్, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలి రూరల్: పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ రామకుమార్ ఆదివారం పట్టుకున్నారు. కొద్ది రోజులుగా వేగావతి నదిలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరగుతున్నాయని స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎం.శ్రీను ఆదేశాలతో తమ సిబ్బందితో దాడులు చేయగా అలజంగి వద్ద రెండు,పారాది వద్ద మూడు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుబడ్డాయని ఆర్ఐ తెలిపారు.పట్టుకున్న ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని, సోమవారం ఆర్డీఓ ఆదేశాలతో జరిమానా విధిస్తామని తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలినెల్లిమర్ల రూరల్: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు సూచించారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన కౌశల్ సాథీ కార్యక్రమంలో వీసీతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతోందని, నైపుణ్యాల ఆధారిత ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. అందువల్ల యువత తమకు ఇష్టమైన రంగంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సూచించారు. వీసీ ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రెగ్యులర్ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం పలువురు విద్యార్ధులకు కౌశల్ సాథీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పల్లవి, అధ్యాపకులు పాల్గొన్నారు. అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన నెల్లిమర్ల: స్థానిక శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం చిన్నారులు చేసిన భరతనాట్య ప్రదర్శన అలరించింది. అంతకుముందు భీమునిపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీరామకృష్ణానంద చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు టి.జగన్నాథరాజు, బి.వంశీపావని తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు రేషన్ కష్టాలు
● సింధునగరం, పెద్దూరు గ్రామస్తులకు తప్పని పాట్లు ● స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలంటున్న గిరిజనులువీరఘట్టం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డు దారులకు గడప వద్దకే రేషన్ బండి వచ్చి రేషన్ బియ్యాన్ని అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రేషన్ బియ్యం కోసం గడపదాటి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని దశుమంతపురం పంచాయతీ పరిధి పెద్దూరు, సింధునగరంలలో ప్రజలు తమ రేషన్ సరుకుల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశుమంతపురం గ్రామానికి వెళ్లి ప్రతి నెలా తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రేషన్ సరుకుల కోసం ఈ రెండు గ్రామాల గిరిజనులు ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నా వారి గోడు వినే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు. ఇదీ పరిస్థితి మండలంలోని దశుమంతపురం గ్రామపంచాయతీలో పెద్దూరు, సింధునగరం హేమ్లెట్ గ్రామాలుగా ఉన్నాయి. పెద్దూరులో 48 మంది కార్డుదారులు, సింధునగరంలో 24 మంది కార్డుదారులు ఉన్నారు. వారికి ప్రతినెలా 1985 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం దశుమంతపురంలో ఉన్న రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. గ్రామం నుంచి పంట పొలాల్లో, నాగావళి ఎడమకాలువను దాటుకుని నడిచి వెళ్తే 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.ఇంకొకటి వీరఘట్టం,చలివేంద్రి గుండా రోడ్డు మార్గంలో వెళ్తే 15 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా ఈ రెండు మార్గాల గుండా బియ్యం తెచ్చుకునేందుకు ఈ రెండు గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. తమ ఇబ్బందులు గుర్తించి గ్రామంలో స్టాక్ పాయింట్ పెట్టి బియ్యం పంపిణీ చేయాలని ఈ రెండు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
25, 26న కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు
విజయనగరం టౌన్: వైశాఖ శుద్ధ దశమి ఆదివారం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయం పాలకమండలి అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యాలయం ఆవరణలో దేవాలయ గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. 25న 108 మంది దంపతులతో అష్టోత్తర శత కలశ ప్రదక్షిణ, 26న అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు, బంగారు చీర, వజ్రకీరీటంతో విశేష అలంకరణ ఉంటుందన్నారు. 108 రకాల పిండివంటలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం, కర్రసాము, పులివేషాలతో అమ్మవారి ఊరేగింపు పండగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, కుమ్మరిగుంట శ్రీనివాస్, రవ్వా శ్రీనివాస్, వెత్సా సత్యనారాయణమూర్తి, మామిడిపాక జగన్, విజ్జపు వెంకట శ్రీనివాసరావు, బలభద్రుని నానాజీ, మురుగన్, బుడ్డెపు వెంకటరావు, పెంటపాటి కామరాజు, వెత్సా శ్రీనివాస్, గోపాలకృష్ణ, బాల తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై చాకుతో దాడి
రాజాం సిటీ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో యుకుడిపై చాకుతో విచక్షణా రహితంగా గాయపర్చిన ఘటన రాజాం పట్టణంలోని శ్రీనివాసకాలనీలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న కురిటి కిరణ్ టిఫిన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే కాలనీలో నివసిస్తున్న నల్ల మురళి ప్రతిరోజు మాదిరిగా శుక్రవారం రాత్రి మద్యం సేవించి గొడవపడుతుండగా కిరణ్ అక్క కురిటి పద్మ వచ్చి ఇక్కడ గొడవ పడవద్దని చెప్పింది. ఆమెతో మురళీ గొడవకు దిగి గాయపర్చాడు. దీనిపై ప్రశ్నించిన పద్మ తండ్రి సత్యనారాయణను కూడా తోసేశాడు. వెంటనే అక్కడున్న కిరణ్ కలుగజేసుకుని అక్క, తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయినా, మురళి వారిని వెంటాడాడు. ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న చాకుతో కిరణ్పై దాడికి పాల్పడ్డాడు. వీపు, మెడ, ఎడమ చెవి, ఎడమ చేయిపై విచక్షణా రహితంగా గాయపర్చాడు. స్థానికులు గాయపడిన కిరణ్ను రాజాం సీహెచ్సీలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.ఉమావెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల కాలంలో రాజాంలో మద్యం, గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వీటిని సేవించిన యువత విచక్షణ కోల్పోయి దాడికి తెగబడుతున్నారన్న చర్చ సాగుతోంది. మద్యం మత్తులోనే మైనర్ అయిన మురళీ దాడిచేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
‘చంపావతి’లో పడి వ్యక్తి దుర్మరణం
బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ(58) శుక్రవారం రాత్రి ఆటో ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందినట్టు బాడంగి పోలీసులు శనివారం తెలిపారు. సత్యనారాయణ శుక్రవారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుస్తుండగా రామభద్రపురం నుంచి బాడంగి వైపు వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వెనుక నుంచి వచ్చి ఢీకొన్నాడు. దీంతో సత్యనారాయణ తలకు తీవ్ర గాయమైంది. భుజానికి, కాలికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. బాడంగి సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిపారు. మృతుడి సోదరుడు తాతయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్ఐ సాగర్బాబు కేసు నమోదు చేసినట్టు హెచ్సీ ప్రసాద్ చెప్పారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గజపతినగరం : మండలంలోని పురిటిపెంట ఎస్సీ కాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(48) చంపావతి నదిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రమణ కొన్నేళ్ల కిందట వివాహమైంది. తరువాత భార్యకు దూరమై ఓ ప్రైవేటు దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మద్యం సేవించి అటుగా వెళ్తున్న సమయంలో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. సంతకవిటి: మండలంలోని రామారాయపురం గ్రామానికి చెందిన యెన్ని ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో శనివారం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా చెట్టు కొమ్మ పడి గుండెకు బలంగా తాకడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య గౌరి, కొడుకు కార్తికేయ, కూతురు జ్ఞాన మనస్వి ఉన్నారు. భార్య పిల్లలు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని తాడివలసలో అమ్మవారి పండగ నిమిత్తం అత్త వారింటికి వారం కిందట చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కార్మికులకు ఉపాధి భరోసా..
రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి పలువురు కార్మికులకు ఉపాధినిస్తోంది. కూరగాయలు, పండ్ల మూటలను లారీలకు లోడ్చేయడం వల్ల రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు కూలి వస్తుంది. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతులు కష్టపడి పంట పండిస్తేనే మా లాంటి వారికి ఉపాధి. – సవరాల శ్రీనివాసరావు, కార్మికుడు, రామభద్రపురం జీవనాధారం ఇదే.. మా తాతదండ్రులనుంచి కూరగాయల సాగే మాకు జీవనాధారం. సీజన్లో అయితే రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తాం. అన్సీజన్లో ఒకటి రెండు రకాలే పండిస్తాం. నిత్యం ఏదో ఒక రకం కూరగాయ పంటలు పండిస్తాం. ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో వంగ, మిరప, చిక్కుడు తదితర కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. రామభద్రపురం మార్కెట్కు తెచ్చి విక్రయిస్తున్నాం. – తూముల సింహాచలం, రైతు, రామభద్రపురం మూటలు కట్టుకుని జీవనం.. ఈ ప్రాంత రైతులు అధికంగా కూరగాయల పంటలు సాగుచేయడం వల్లే రామభద్రపురం మార్కెట్కు మంచి పేరువచ్చింది. రైతు, మార్కెట్ లేకుంటే మా లాంటి వారి జీవనం దుర్భరంగా ఉండేది. పదేళ్లుగా ఇక్కడే కలాసీగా పనిచేస్తున్నాను. కాలువిరిగిపోవడంతో మూటలు కట్టుకుని బతుకుతున్నాను. – బోను అప్పలనాయుడు, రామభద్రపురం -
జిల్లా ఉపాఽధి శిక్షణ అధికారిగా మెస్సీ ఇవాంజిలిన్
విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా ఆర్.మెస్సి ఇవాంజిలిన్ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారిగా రెగ్యులర్ బాధ్యతలను కూడా చేపట్టారు. ఏపీపీఎస్ గ్రూప్–1 సర్వీస్లో ఎంపికై న ఇవాంజిలిన్ ఇప్పటి వరకు జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వహీదా నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాఽధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ముగిసిన పారా లీగల్ వలంటీర్ల శిక్షణ విజయనగరం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా పారాలీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారే పారా లీగల్ వలంటీర్స్ అని పేర్కొన్నారు. చిన్నచిన్న సమస్యలను వలంటీర్లు పరిష్కరిస్తారన్నారు. ఐదు రోజుల్లో 54 మంది పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారిలో అంగన్వాడీ టీచర్లు, ట్రైబల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఆశా వర్కర్స్ గ్రూప్ సభ్యులు, ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారు. వీరందరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేశారు. గిరిజనుడి ఆత్మహత్యసీతంపేట: మండలంలోని మెట్టు హడ్డుబంగి పంచాయతీ ఉప్పరజమ్మి గ్రామానికి చెందిన సవర మహేంద్ర (23) క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ వై.అమ్మన్నరావు చెప్పిన వివరాలు.. మృతుడు తండ్రి కడాయికి ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మహేంద్ర డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన దీవెనతో ఏడాది కిందట వివాహమైంది. ఇద్దరు కలిసి శ్రీకాకుళంలోని వేర్వేరుగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మహేంద్ర ఐస్క్రీం పార్లర్లో పని చేస్తున్నాడు. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తుంది. వీరిరువురి మధ్య ఇటీవల మనస్పర్దలు రావడంతో శ్రీకాకుళం నుంచి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు చూసి సమాచారం అందించారన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. చింతలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత ● నలుగురిపై కేసు నమోదు కొత్తవలస : మండలంలోని చింతలపాలెం గ్రామం వద్ద అరుకు – విశాఖ రోడ్డుకు ఆను కొని ఉన్న స్థలంలో గల షాపులు, సమాధులను కొంతమంది వ్యక్తులు శుక్రవారం సాయంత్రం చిందరవందర చేశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతలపాలెం గ్రామానికి చెందిన బోను లక్ష్మికి సంబంధించిన స్థలంలో షాపు లను సమాధులను మంగళపాలెం గ్రామానికి చెందిన పి.బాలరాజుతో పాటూ మరో ముగ్గురు వ్యక్తులు జేసీబీ సాయంతో చిందరవందర చేసి లక్ష్మిని కులం పేరుతో దూషించారని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎప్పీ రాఘవులు క్షేత్ర స్థాయిలో శనివారం విచారణ నిర్వహించారు. బాధితురాలు నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రాఘవులు సీఐ షణ్ముఖరావుకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
‘బడి పిలుస్తోంది’ ప్రారంభం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన ర్యాలీకి శ్రీకారం చట్లారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిచిన్నారి విద్యను పొందడం అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీవన మార్క్ట్..!
రామభద్రపురం: రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్లో రాత్రి 2 గంటలైతే చాలు... జన సందడి ఆరంభమవుతుంది. వాహన రాకపోకలు, కూరగాయలు, పండ్లను తీసుకొచ్చే వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఛాయ్వాలా నుంచి చిరువ్యాపారుల వరకు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలను చక్కబెడుతూ తమ జీవనమార్గాన్ని వెతుక్కుంటారు. రైతులే మూలం.. మార్కెట్కు రైతులే మూలం. రైతులకు మార్కెట్టే ఆధారం. ఈ ప్రాంతంలో 25 సెంట్లు నుంచి 2 ఎకరాల భూమి ఉన్న ఆసామీ వరకు నిరంతరం శ్రమిస్తారు. భూమిని సారవంతంగా మలచి బంగారు పంటలు పండిస్తారు. ధరలు బాగుంటే ఆనందిస్తారు. ధరలు పడిపోయిన సమయంలో దిగులు చెందుతారు. వ్యవసాయం ఓ వ్యాపకంగా ముందుకు సాగుతారు. అందుకే... ఈ మార్కెట్లో 365 రోజులూ కూరగాయలు, సీజన్వారీ పండ్ల వ్యాపారం సాగుతుంది. వ్యాపారులు, కలాసీలు, వాహనదారులకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ కూరగాయల ధరలు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే లభించడంతో ఉత్తరాంధ్రతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్కు వచ్చి క్రయవిక్రయలు జరుపుతారు. తమ జీవనానికి మార్కెట్టే ఆధారమని చెబుతారు. ● రామభద్రపురం మార్కెట్ రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల రైతులు సాగుచేసిన కూరగాయలు, పండ్ల విక్రయాలకు ఆధారం. రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఇక్కడకు తెస్తుంటారు. ● ఈ మార్కెట్ నుంచి రోజూ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, సుంకి, పొట్టంగి, జగదల్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్నాటక, మహారాష్ట్రలకు కూరగాయలు తరలిస్తారు. ఉదయాన్నే కోసిన కాయగూరలను నేరుగా మార్కెట్లోకి రైతులు తేవడంతో కొనుగోలుకు వ్యాపారులు మొగ్గుచూపుతారు. ● శుభకార్యాలకు కూరగాయలు కొనుగోలు చేయాలంటే గుర్తొచ్చేది రామభద్రపురం మార్కెట్. ● ఈ మార్కెట్పై ఆధారపడి పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు, కార్మికులు వందల సంఖ్యలో జీవనం సాగిస్తుంటారు. ● ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. -
వాడేశారు.. వదిలేశారు..!
● సీనియర్లను తొక్కేసిన టీడీపీ అధిష్టానం ● పత్తాలేని కొండపల్లి, చిరంజీవులు, పతివాడ ● జాడలేని యువజనం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అవసరానికి వాడుకోవడం.. మోసం చేయడం.. వదిలేయడం టీడీపీ నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. వారు ఓటర్లా.. ప్రజలా.. నాయకులా.. అన్నది కాదు. ఆయన దృష్టిలో ఎవరైనా ఒక్కటే. అవసరం, వారి నుంచి స్వప్రయోజనం లేదని తెలిస్తే ఎంతటివారైనా కరివేపాకుతో సమానం. ఈ విషయం ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు బోధపడుతున్నట్టు ఉంది. ఇన్నాళ్లూ పార్టీలో మాదే పెత్తనం.. మాదే పెద్దరికం అనుకుంటూ వస్తున్న పలు కుటుంబాలు మొన్నటి టీడీపీ రాష్ట్ర కమిటీలో పత్తా లేకుండా పోయాయి. నిన్నమొన్నటివరకు పార్టీలో మాదే రాజ్యం.. నాయకులమైనా, సేవకులమైనా అంతా మేమే అనుకున్న వాళ్లంతా ఆ కమిటీలో గల్లంతైపోయారు. జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పినవాళ్లు నేడు కనుమరుగయ్యారు. దీనిపై ఎవరినీ అడిగే పరిస్థితి లేదు. సమాధానం చెప్పే వారూ లేకపోవడంతో అందరూ ఎవరికివారే సమాధానం చెప్పుకుని లోలోపల కుమిలిపోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. 2014–19 మధ్య గజపతినగరం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడు ఆ తర్వాత 2024 వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. చివరి వరకు టికెట్ ఆశించి చివరకు అన్న కొడుకు శ్రీనివాస్ టికెట్ ఎగరేసుకుపోవడంతో అసంతప్తితో రగిలిపోయారు. ఆయనకు ఎన్నికల వరకు ఎన్నికల సమన్వయకర్తగా బుజ్జగిస్తూ పార్టీ అధిష్టానం వచ్చింది. ఎన్నికల్లో కొండపల్లి శ్రీనివాస్ గెలవడం, మంత్రి అయిపోవడం జరగగానే అప్పలనాయుడును పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. నిన్నటి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అధిష్టానంతో అనుబంధం ఉండే రాష్ట్రస్థాయి పదవి దక్కితే భవిష్యత్తులో తన ఉనికికే ముప్పు వస్తుందని భావించి ఏ పదవీ లేకుండా మంత్రి చక్రంతిప్పారంటూ అప్పలనాయుడు అనుచరవర్గం లోలోన రగిలిపోతుంది. పతివాడ ఫ్యామిలీకి పదవి లేదాయె.. పతివాడ నారాయణ స్వామి నాయుడు ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం తరఫున మంత్రిగా కూడా పనిచేసి పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు తమ్మి నాయుడు మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. నేటి కొత్త కమిటీలో వారికి స్థానం లేకుండా పోయింది. దీంతో ఇక పతివాడ కుటుంబానికి తెలుగుదేశం రాజకీయ తెర దించేసిందన్నది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. నాయుడు కరుసైనట్లే... -
ఎం.గుమడాంలో...గంపెడు సమస్యలు
తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం తాగునీటిని దూరంగా ఉన్న బోరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేయలేదు. తాగునీటి పథక నిర్మాణాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టేశారు. అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – ఆవాల సూర్యం, ఎం.గుమడాం బీసీ కాలనీ అసంపూర్తి పనులు బీసీ కాలనీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ నిర్మించలేదు. మురుగునీరు కాలనీలోనే నిల్వ ఉంటోంది. ఇబ్బందులు పడుతున్నాం. కాలువ పనులు పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలి. – ఎం.నరసయ్య, ఎం.గుమడాం బీసీ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం గజపతినగరం మండలం ఎం.గుమడాం బీసీ కాలనీలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణంలో ఉంది. పనులు పూర్తిచేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతాం. – ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం.శ్రీనివాసరావు(గజపతినగరం) గజపతినగరం: గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామస్తులు సమస్యల చట్రంలో నలిగిపోతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బీసీకాలనీ వాసులు సుదూరంలో ఉన్న బోరునీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. బిందెడు నీటికోసం బోరువద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వం గ్రామంలో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనులను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టకపోవడంతో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి పథక నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు మురుగునీటి సమస్య గ్రామస్తులను వెంటాడుతోంది. కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా విడిచి పెట్టడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బిందెడు నీటికోసం మహిళలకు అష్టకష్టాలు మురుగుకాలువల నిర్మాణంలో అలసత్వం పూర్తికాని జల్జీవన్ మిషన్ పనులు నిలిచిన తాగునీటి పథకం పనులు ఆవేదనలో ఎం.గుమడాం వాసులు -
ఆ లోకంలో... వేధింపులే ప్రసాదం
ఉద్యోగులపై ఆక్రోశమా..! సాక్షి టాస్క్ఫోర్స్: పంచాయతీల్లో ఏ చిన్నపని చేపట్టినా తమ అనుమతి తీసుకోవాలి... చెప్పిందే చేయాలి.. లేదంటే చర్యలు తప్పవు.. ఖబడ్డార్.. అంటూ నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలకనేత భర్త హెచ్చరికలు ఉద్యోగ వర్గాల్లో అలజడిరేపుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి నేతల వేధింపులు తట్టుకోలేక గతంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల వంతు వచ్చింది. కీలకనేత సమక్షంలోనే ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగులపై ఆమె భర్త వేధింపులకు దిగడం, ఆమె కిమ్మనకపోవడం ఉద్యోగవర్గాలను కలవరపెడుతున్నాయి. స్థానిక నేతల పదవీకాలం ముగిసి రెండు వారాలు గడిచింది. ప్రత్యేక అధికారుల పాలన ఆరంభమైంది. కీలకనేత కనుసన్నల్లోనే నియోజకవర్గంలో అధికారుల నియామక ప్రక్రియ సైతం పూర్తయినట్టు సమాచారం. ఇది చాలదన్నట్టు... సచివాలయ ఉద్యోగులపై కీలకనేత భర్త వేధింపుల పర్వం మొదలెట్టారు. రికార్డులు పట్టుకుని తన ప్రైవేటు కార్యాలయానికి రావాలంటూ భోగాపురంలోని ఓ ఐదు సచివాలయాల సిబ్బందికి రెండు రోజుల కిందట హుకుం జారీచేశారు. కీలకనేతతో కలిసి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పంచాయతీల్లో ఎటువంటి పనులు చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని, అదే ‘ప్రసాదం’ంగా భావించాలంటూ ఆదేశాలిచ్చారట. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ప్రత్యేకాధికారులతో పాటు సచివాలయ సిబ్బంది తమ అనుమతులు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లేదంటే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో సమావేశానికి హాజరైన భోగాపురం మండలంలోని ఎ.రాయివలస, నందిగాం, భోగాపురం–1, భోగాపురం–2, ముక్కాం సచివాలయాలు సిబ్బంది బిక్కమొహం వేశారు. ఏ అధికారంలేని వ్యక్తి పంచాయతీ రికార్డులు చూపించాలంటూ హుకుం జారీచేయడంపై విస్తుపోతున్నారు. భూ అక్రమాల్లో ‘మిరాకిల్’ బయటపడకుండా ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆది నుంచి టీడీపీ, జనసేన నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కూటమిగా ఉంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. పెత్తనం కోసం ఇరుపార్టీల వారు పాకులాడుతూ.. పలుసార్లు అధికారుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. దీనిపై ఎవరికి వారు తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు పంచాయతీ పాలకుల పదవీకాలం ముగియడం, ప్రత్యేకాధికారుల పాలన రావడంతో తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెక్పెట్టేందుకు, వారు చెప్పే ఏ పనిచేయకూడదన్న ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. అందుకే... తన ప్రైవేటు కార్యాలయంలో రికార్డులు చూపించాలని, అన్నీ పక్కాగా ఉండాలంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ‘అత్తమీద కోసం దుత్తమీద చూపిన’ చందంగా కీలకనేత భర్త వేధింపులు ఉన్నాయంటూ ఉద్యోగులు నిట్టూర్చుతున్నారు. వేధింపులు భరించలేమంటూ కొందరు ఉద్యోగులు సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ‘లోకం’లో పనిచేసే ఉద్యోగులకు వేధింపులే ‘ప్రసాదం’గా మారాయంటూ వాపోతున్నారు. ఇలాంటి పాలన మునుపెన్నడూ చూడలేదని, పాలనఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు కొందరు ఉద్యోగులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. చెప్పిందే చేయండి.. లేదంటే ఖబడ్డార్.. సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హుకుం తన ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగులతో ‘ప్రత్యేక’ సమావేశం ఏ పనిచేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు లేదంటే ఉద్యోగాలు ఉండవంటూ బెదిరింపులు భీతిల్లుతున్న ఉద్యోగులు టీడీపీ నేతలపై ఉన్న ఆక్రోశం ఉద్యోగులపై చూపుతున్న వైనం -
భాషా పండితులు, పీఈటీల ఆందోళన
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా అధికారుల అలసత్వం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ) పార్వతీపురం ఐటీడీఏ వద్ద శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. జీవో 27 ప్రకారం తమను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పాలక రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 417 మందికి పదోన్నతులు లభించగా, పొరుగున ఉన్న సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అక్కడ ఏప్రిల్ 1 నుంచే పదోన్నతులు అమల్లోకి వచ్చినా.. పార్వతీపురంలో మాత్రం 33 మంది ఉపాధ్యాయులకు నేటికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. జీవో 45 నిబంధనల ప్రకారం క్లియర్ వేకెన్సీ ఉన్న చోట గిరిజన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలుమార్లు పీఓ, డీడీలకు విన్నవించినా నిర్లక్ష్యం వీడడం లేదని, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయకుంటే శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిరుద్యోగి ఆశలు ఆవిరి!
విజయనగరం గంటస్తంభం: అయ్యా..మా బిడ్డ పెద్ద చదువు చదివితే మా దరిద్రం వదులుతాదనుకున్నాం. సర్కారు సాయం చేస్తాదంటే అప్పులు చేసి చేసి కాలేజీలో చేర్పించినాం. తీరా చూస్తే సర్కారు మొహం చా టేసింది. ఇప్పుడు కాలేజీ వాళ్లు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. అటు ఉద్యోగాల్లేవు...ఇటు భృతి లేదు... మా బతుకులు నట్టేట మునిగినట్లేనా?..ఇది జిల్లాలోని ఓ నిరుద్యోగి తండ్రి ఆవేదన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, త ల్లిదండ్రుల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి. నమ్మించి గొంతు కోశారు.. ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీలిచ్చి, అధికార పీఠమెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా ప్రభుత్వం వస్తే చదువులకు కష్టముండదు..నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటాం అని చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మూటలయ్యాయి. రూ.5,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయి ఉంటే, విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డెక్కి పోరాటం చేస్తే తప్ప సర్కారులో చలనం రాలేదు. తీరిగ్గా కేవలం రూ.1,200 కోట్లు విదిల్చి, అంతా చేసేశాం అని డబ్బాలు కొట్టుకోవడం చూస్తుంటే..విద్యార్థులను ఎంతలా వంచించారో అర్థమవుతోంది. భృతి అందని ద్రాక్షేనా? నిరుద్యోగికి నెలకు రూ.3,000 ఇస్తాం...ధీమాగా ఉండండి అన్న హామీ ఏమైంది..ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఒక్క పైసా కూడా నిరుద్యోగి ఖాతాలో పడలేదు. పట్టణాల్లో రూము అద్దెలు కట్టలేక, రీడింగ్ రూమ్ ఫీజులు భరించలేక యువత సతమతమవుతున్నారు. గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, ఇక్కడ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక గంజి తాగి గడుపుతున్నారు. నోటిఫికేషన్లు లేవు..బతుకు దెరువు లేదు! చదువు పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ల ఊసే లేదు. ఒకవైపు చదువు కోసం పెట్టిన ఖర్చు తడిసి మోపెడవుతుంటే, మరోవైపు వయస్సు మారిపోతుందన్న భయం నిరుద్యోగులను వెంటాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి, పెండింగ్లో ఉన్న మొత్తం ఫీజు బకాయిలను విడుదల చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విద్యార్థి లోకం సర్కారు కోటను కదిలిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగం లేదు..భృతీ లేదు ఊరించిన భృతి..ఉసూరుమనిపించిన సర్కారు కోచింగ్ ఫీజులు కట్టలేక..ఊరు వెళ్లలేక సతమతం ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన -
● కోనేరు.. కన్నీరు..
ఈ చిత్రంలో పిచ్చిమొక్కల నడుమ అధ్వానంగా మారిన కోనేటిని చూశారా... అది నేనే.. బొబ్బిమండలం కోమటిపల్లిలోని మంచినీటి కోనేరును. దశాబ్దాల తరబడి కోమటిపల్లి ప్రజల స్నానాలు, తాగునీటికి వినియోగపడేదానిని. వేసవిలో సైతం నీరు నిండుగా ఉండేది. ఇక్కడి గట్టుపైన రామాలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, షిర్డి సాయిబాబా ఆలయాలు సైతం ఉన్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించేవారు. కార్తీకమాసంలో స్వాముల సన్నిధిలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేవి. పవిత్రంగా, శుద్ధిగా ఉండే కోనేటిని ఇటీవల కాలంలో నిర్లక్ష్యం చేశారు. అందుకే.. ఇదిగో ఇలా పిచ్చిమొక్కలు, రెల్లిపొదలతో అధ్వానంగా మారాను. గట్టువద్దనే కొందరు మందుబాబులు మద్యం సేవించి ఆ సీసాలు సైతం కోనేటిలోనే పడేస్తున్నారు. పవిత్రతను మంటగలుపుతున్నారు. ఇప్పటికై నా గ్రామపెద్దలు, యువత, ప్రత్యేకాధికారులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని ఎదురుచూస్తున్నాను. ఏం చేస్తారో చూడాలి మరి. – బొబ్బిలి రూరల్ -
గిరిజనుల భూములపై దౌర్జన్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏళ్ల తరబడి ఆ భూములు గిరిజనుల సాగులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకాలూ వారి పేరిటే ఇచ్చారు. అదే భూమిపై కాస్త సర్వే నంబర్లు అటూఇటు మార్చి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. దర్జాగా తన ఫొటో పెట్టుకుని, కింద ఉన్న సంతకాన్ని సైతం చెరిపేసి, ఆ భూమి తనదంటూ దౌర్జన్యానికి దిగాడో వ్యక్తి. బాధిత గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా..ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా రెవెన్యూ అధికారుల నుంచి స్పందన ఉండడం లేదు. జిల్లా అధికారులే తమ మొర వినాలని బాధిత గిరిజనులు కోరుతున్నారు. సీతంపేట మండలం గొయిది పంచాయతీ ఎంగుపేట రెవెన్యూ పరిధి జక్కరవలస గ్రామంలో సర్వే నంబరు 19–2, 19–3ల్లో దాదాపు పదెకరాల వరకు భూమిని తాతముత్తాతల కాలం నుంచి సవర సన్నాయి, సవర కరువయ్య కుటుంబసభ్యులు సాగు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన అసలు పాస్ పుస్తకాలు కూడా వారి వద్ద ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం సవర శంకరరావు అనే వ్యక్తి అది తన భూమి అంటూ వచ్చాడు. సాగులో ఉన్న గిరిజనులు అడ్డుకోవడంతో వెనుదిరిగాడు. కొద్దిరోజుల తర్వాత నకిలీ పత్రాలు సృష్టించాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పట్టాల్లో గతంలో ఉన్న పేరును చెరిపేసి, తన ఫొటో అతికించి, రెవెన్యూ అధికారుల సంతకాలతో పత్రాలు సృష్టించడం గమనార్హం. దీనిపై బాధిత గిరిజనులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. కొంతకాలంగా ఈ భూమి ఎవరి పేరిట ఉందో, ఎక్కడ మార్చారో తెలియజేయాలని ఆర్టీఐ ద్వారా కోరారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదంటూ అధికారులు దాటవేశారు. దీంతో చేసేదిలేక గిరిజనులు శుక్రవారం కలెక్టరేట్కు వచ్చారు. తాము గిరిజనులం కావడం వల్లే అధికారులు సైతం మోసం చేస్తున్నారని, కళ్ల ముందే అన్యాయం కనిపిస్తున్నా ఏ ఒక్కరూ న్యాయం చేయడం లేదని వారు వాపోయారు. పేర్లు మార్చేసి..భూములు కొట్టేసి -
విద్యార్థి లోకం క్షమించదు!
ఎన్నికల ముందు ఊరూరా తిరిగి విద్యార్థులు, నిరుద్యోగులకు అబద్ధపు హామీలిచ్చి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. రూ.5,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్ధుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. ప్రభుత్వం విదిల్చిన రూ.1,200 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ సర్టిఫికెట్లు ఆపేస్తుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలా..నిరుద్యోగ భృతి ఊసే లేదు. తక్షణమే పూర్తి నిధులు విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, విజయనగరంనిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తాం అని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. చదువుకుని ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకుండా మా కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికై నా హామీని నిలబెట్టుకుని,నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి. – సూరిబాబు, నిరుద్యోగి -
రైలు నుంచి జారిపడి ప్రయాణికుడికి తీవ్రగాయాలు
ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చింతల్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున రైలునుంచి జాడిపడిన ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన ఎం.రాముడు(55) హైదరాబాద్లో కపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ఎక్కి ఆంధ్రాకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. అతని పాదం నుజ్జునుజ్జు కాగా.. కుడి భుజానికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
ఫ్యామిలీ డాక్టర్కు వైద్యులు డుమ్మా..!
విజయనగరం ఫోర్ట్: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమం అమలుపై పర్యవేక్షణను గాలికి వదిలేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం తూతూమంత్రంగా జరుగుతోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై పర్యవేక్షణ కొరవడడంతో వైద్యసిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైద్యులు డుమ్మా కొట్టడం వల్ల వారు అందించాల్సిన సేవలు రోగులకు అందని పరిస్థితి నెలకొంది. సంపన్నులకే ఉండే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమంపట్ల అలసత్వం వహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ జిల్లాలో 48పీహెచ్సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఆదివారం మినహా ప్రతిరోజు ఫ్యామిలీడాక్టర్ కార్యక్రమం నిర్వహించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యామిలీ డాక్టర్ శిబిరాన్ని నిర్వహించాలి. శిబిరానికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి మందులు అందించాలి. మెరుగైన చికిత్స అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి బీపీ, సుగర్, జ్వరం, దగ్గు, జలుబు ఉన్న రోగులు ఎక్కువగా వస్తారు. బీపీ, సుగర్ రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులు అందించాలి. గర్భిణులకు వైద్య తనిఖీలు నిర్వహించాలి. హిమోగ్లోబిన్ ( హెచ్బి) తక్కువగా ఉన్నవారికి హెచ్బీ పెరగడానికి ఐరన్ మాత్రలు, సుక్రోజ్ ఇంజక్షన్లు అందించాలి. అదేవిధంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలు అనారోగ్యంతో బాధపడతున్నవారు ఉంటే వారికి వైద్య సేవలు అందించాలి. మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యుడు సేవలు అందించాల్సి ఉంది. కాని ఈకార్యక్రమం జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి: సిబ్బందితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు కార్యక్రమంపై కొరవడిన పర్యవేక్షణ టీడీపీ సర్కార్ హయాంలో గాలికి వదిలేసి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కానరాని వైద్యులు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 11 గంటలైనా కొన్నిచోట్ల వైద్యులు శిబిరానికి రావడం లేదు. మరి కొన్ని చోట్ల మధ్యాహ్నం 12, ఒంటి గంటకే వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల వైద్యులు రాకుండానే సిబ్బందితో మమ అనిపించేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం లక్ష్యానికి తూట్లు పడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. డుమ్మా కొడితే చర్యలుఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఎవరైనా వైద్యులు డుమ్మా కొట్టినా, మధ్యలో వెళ్లిపోయినా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
● మొక్కజొన్న పనుల్లో రైతులు బిజీ
మొక్కజొన్న పంట చేతికొచ్చింది. కండెలు వేరుచేయడం, ఆరబెట్టడం, నూర్పిడిచేసే పనుల్లో జిల్లా రైతులు బిజీ అయ్యారు. పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందడం లేదని, దళారులకు క్వింటా రూ.1700కే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో మొక్కజొన్న రైతుకు ఈ ఏడాది పెట్టుబడి కూడా రాలేదని, శ్రమటోడ్చి పండించిన పంటను కారుచౌకగా విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
షార్ట్సర్క్యూట్కు అవకాశం లేకుండా వైరింగ్ చేయాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా విద్యుత్ వైరింగ్ చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రిలో అత్యవసర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్ పైప్ లీకేజ్ లేకుండా చూడాలని, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన అదనపు పంపులు నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఏపీఎంఎస్ఐడీసీ డీఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్యానల్స్ దగ్ధంగజపతినగరం రూరల్: మండలంలోని తమ్మారాయుడుపేట గ్రామానికి చెందిన కోరాడ పైడితల్లి పొలంలో కోసి ఆరబెట్టిన మొక్కజొన్న తోటలో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సోలార్ ప్యానల్స్, మోటరు వైర్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.1,50,000 ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక అధికారి రవిప్రసాద్ ఆధ్వర్యంలో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాల్చిన సిగరెట్టు/ బీడీ ఆజాగ్రత్తగా పారవేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. త్వరితగతిన పైడితల్లి ఆలయ అభివృద్ధివిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ పనులపై అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను స్వీయపర్యవేక్షణ చేసి, పలు సూచనలు, సలహాలు అందించారు. నిర్ణీత సమయంలోపు పనులు పూర్తిచేయిస్తామని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి మరింతగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. అనుమానంతో భార్యపై దాడివిజయనగరం క్రైమ్: తాళి కట్టిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త తారస్థాయికి చేరింది. కన్న వారింట్లో ఉంటున్న ఇల్లాలి వద్దకు వచ్చిన భర్త కత్తితో ఆమె మెడపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పల్లివీధిలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి టూటౌన్ ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలం అమకాంకు చెందిన రాంపల్లి శ్రీనివాస్తో విజయనగరానికి చెందిన సాయికళకు 2012లో పైళ్లెంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా హేమశ్రీ, యశ్వంత్లు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పిల్ల లను తీసుకుని విజయనగరంలోని కన్నవారింటికి వచ్చి సాయికళ ఉంటోంది. అప్పుడుప్పుడు అత్తగారి ఊరైన అమకాం వెళ్లి వస్తూ ఉంటుంది. భర్త శ్రీనుకూడా విజయయనగరంలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. కన్నవారింట్లో ఉంటున్న భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనమానంతో భార్యతో భర్త గొడవపడి కత్తితో ఆమైపె దాడి చేశాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సాయికళను ఆమె అన్నయ్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. ఆమె కోలుకున్న అనంతరం తన భర్తే తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
● గోతుల రోడ్డుపై రవాణా పాట్లు
సంతకవిటి మండలంలోని మందరాడ–గోవిందపురం రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకోగుంత ఏర్పడడంతో ప్రయాణ, రవాణా కష్టాలు తప్పడం లేదు. మందరాడ నుంచి మోదుగుల పేట గ్రామానికి మొక్కజొన్న బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు గోతిలో దిగడంతో నిలిచిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవారు, కళాసీలు కలిసి ముందుకు నెట్టడంతో ట్రాక్టర్ కదిలింది. పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే రోడ్డును బాగుచేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. ఓటేసి గెలిపించాక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం టీడీపీ పాలకులకు అలవాటుగా మారిందన్నారు. – సంతకవిటి -
జెడ్పీ సీఈఓగా నాగలక్ష్మి
విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ సీఈఓగా ఇ.నాగలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీసేసింది. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న బీవీ సత్యనారాయణకు అనకాపల్లి జిల్లా డీఎస్జీఎస్డబ్ల్యూఓగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖ జిల్లా డీడీవోగా పనిచేస్తున్న నాగలక్ష్మికి ఉద్యోగోన్నతిపై విజయనగరం జెడ్పీ సీఈవోగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలి ● కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. ర్యాంప్ పథకంలో భాగంగా స్థానిక మహారాజా కోటలోని ఆనందగజపతిరాజు ఆడిటోరియంలో ‘లఘు ఉద్యోగ్ భారత్’ ఆధ్వర్యంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వెండార్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలని కోరారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో జిల్లా ఆర్ధిక ముఖచిత్రం మారుతుందని, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పరిశ్రమల శాఖ జీఎం ఎం.వి.కరుణాకర్, వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఏపీఎంఐపీ పీడీ పీఎన్వీ లక్ష్మీనారాయణ, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ, ఎల్యూబీ జాతీయ కమిటీ సభ్యులు ఎ.కె.బాలాజీ, ఎన్ఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్ టి.కామేశ్వరి, ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ ఏడీ డీవిఎస్ఆర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్పం, చైతన్యం, అభ్యదయం 2.0’ పేరుతో వంద రోజుల కార్యక్రమం తలపెట్టినట్టు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో ఆస్తి జప్తు, ఎన్డీపీఎస్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 19 కేసుల్లో 18 మంది ముద్దాయిల నుంచి సుమారు రూ.11.63 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజింగ్ చేసినట్టు తెలిపారు. మరో 32 మందికి జైలు శిక్ష పడిందన్నారు. గంజాయి విక్రయం, రవాణాదారులను ఉపేక్షించవద్దని ఐదు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
గుర్ల: ఈత సరదా 17 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన గుర్ల మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గుర్ల గ్రామానికి చెందిన కమ్మిండి సూర్య చంద్ర, స్నేహితులు కలిసి గుర్లలోని చంపావతి నది పరీవాహక ప్రాంతంలో సహపంక్తి భోజనాలను గురువారం ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం సమయంలో చంపావతిలో స్నానం చేయడానికి దిగారు. సూర్య చంద్రకు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. ఈ విషయం గమనించిన మిగిలిన యువకులు సూర్యచంద్రను బయటకు తీసి నెల్లిమర్ల సీహెచ్సీకి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారులు ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు తెలిపారు. సూర్య చంద్ర మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఆ మేరకు గుర్ల ఎస్సై పి.నారాయణ రావు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లి కమ్మిండి లక్ష్మి, సోదరుడు ఉన్నారు. పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం పరిధిలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తొత్తడాం గ్రామానికి చెందిన రాయ లక్ష్మణరావు (46) విద్యుత్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా నూతన విద్యుత్లైన్లు వేస్తుండగా విద్యుత్ సరఫరా అవుతున్న లైన్లు తగలడంతో షాక్కొట్టి అక్కడకక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అరుణకుమారి, కుమార్తె జయలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెట్తో సంబంధం లేకుండా ఉద్యోగోన్నతి కల్పించాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులకు హక్కుగా వచ్చే పదోన్నతుల అర్హత టెట్తో సంబంధం లేకుండా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హోటల్లో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు 57 అమలు చేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సరెండర్ లీవ్ మంజూరు చేయాలి హైస్కూల్ ప్లస్లను బలోపేతం చేసి రెగ్యులర్ పద్ధతిలో పీజీటీలను నియమించాలని 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటర్మ్ రీలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకూడదని 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నియోజవర్గ కన్వీనర్, రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారు తమ్మినేని ఆనందరావు, రాష్ట్ర క్యాదర్శి ఇజ్జురోతు రామునాయుడు, ఎంపీ.శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు వీవీజేసుబ్రహ్మణ్యం, రమణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు శివరామప్రసాద్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, విశాఖ పట్నం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ -
నాగావళి.. ఇసుక ఖాళీ..
● యంత్రాలతో ఇష్టారాజ్యంగా... ● ప్రమాదం అంచున రోడ్లు రాజాం/రేగిడి/వంగర/సంతకవిటి: ఇసుక అక్రమ రవాణాకు రాజాం నియోజకవర్గంలోని నాగావళి నదీ తీరం కేరాఫ్గా మారింది. అధికార బలంతో నదిలో ఇసుకను ఖాళీ చేస్తున్నారు. సాగునీరు అందకుండా నదిలో పెద్దపెద్ద గోతులు చేస్తున్నారు. రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గతంలో అనుమతులు ఇచ్చి గడువు ముగిసిన ఇసుక రీచ్లను మళ్లీ ప్రారంభించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో ఒకచోట ఇచ్చిన ఇసుకరీచ్ అనుమతులు మళ్లీ అదే ప్రాంతంలో ఇచ్చే నిబంధనలు లేవు. సంతకవిటి మండలంలోని తమరాం–మేడమర్తి గ్రామాల మధ్య ఇసుకరీచ్ గత రెండేళ్లుగా కొనసాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఇక్కడ వంతెన సమీపంలో భారీ గోతులు ఏర్పడడంతో నదీతీర ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మేడమర్తి వద్ద ఇసుకరీచ్ల్లో తవ్వకాల కారణంగా గ్రామసమీపంలోకి నదీ ప్రవాహం చేరడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నాగావళి నదిలో అనుమతులు ఉన్న ఇసుకరీచ్లలో సైతం యంత్రాలతో ఇసుకను తవ్వేందుకు అనుమతులు లేవు. లారీలకు, ట్రాక్టర్లకు వేతనదారులతో లోడింగ్చేయాలి. ఇక్కడ అలా కాకుండా భారీ పొక్లెయిన్లు పెట్టి, నదిలో రోడ్లు వేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కోచోట మూడు నుంచి నాలుగు పొక్లెయిన్లు పనిచేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక వ్యాపారులు ఇచ్చే మామ్మూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో రాజాం నుంచి సంతకవిటి, పొందూరు నుంచి సంతకవిటి వచ్చే రోడ్డు గోతులుమయమయ్యాయి. సింగిల్ రోడ్లలో 20 టన్నులకు మించి లోడుతో వాహనాలు రవాణా చేయకూడదు. ఇసుక రీచ్లు నుంచి 40 టన్నుల ఇసుకను తరలించే వాహనాలు తిరగడంతో రోడ్లన్నీ పాడయ్యాయి. సాగునీటి కాలువులుపై ఉన్న కల్వర్టులు కూలిపోతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. నాగావళి నదిలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా భారీ యంత్రాలతో నదిని గుల్లచేస్తున్న వైనం ఇసుక లారీల రాకపోకలతో పాడవుతున్న పల్లె రోడ్లు, కూలుతున్న కాజ్వేలు అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే ఇసుక దందా... స్వామిభక్తిచూపుతున్న అధికార యంత్రాంగం! ఆందోళనలో నదీతీర ప్రాంత ప్రజలు -
బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపిక
విజయనగరం టౌన్: విజయనగరం జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య 2026–2028కి గాను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తూ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డీవీ శ్రీకాంత్ గురువారం ప్రకటించారు. సమాఖ్య అధ్యక్షుడిగా భరద్వాజ చక్రవర్తి, కార్యదర్శిగా భోగరాజు సూ ర్యలక్ష్మి, కోశాధికారిగా దామరాజు పర్వతాలు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.రామారావు, భరద్వాజ ప్రకాష్లు ఎంపికయ్యారు. అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా భైరవభట్ల విజయాదిత్య, వెలువర్తి రామకృష్ణలతో పాటు 20 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలి పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని, నిరుపేద విద్యార్థులకు సమాఖ్య తరఫున పూర్తిస్థాయిలో సహకారమందిస్తామన్నారు. ఎంపిక చేసిన సమాఖ్య ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు
విజయనగరం ఫోర్ట్: అంగనవాడీ కేంద్రాలకు సకాలంలో పాలు చేరకపోవడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారనే అంశంపై ‘అంగన్వాడీలకు చేరని పాలు’ అనే శీర్షికన ఈ నెల 12వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. చెరువుల అభివద్ధికి చర్యలు ● డ్వామా పీడీ శారదాదేవి గజపతినగరం రూరల్: జిల్లాలో చెరువుల అభివద్ధికి చర్యలు చేపడుతున్నట్టు డ్వామా పీడీ పి.శారదాదేవి తెలిపారు. మండలంలోని పిడిశిల గ్రామంలోని సింగరాయ చెరువును ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువుల అభివద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. చెరువుల్లో ఏ రకమైన పనులు చేయించాలి, గుర్తించిన పనులను ఏ విధంగా చేయాలి అనే అంశాలపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.కళ్యాణి, ఏపీఓ కృష్ణవేణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. రక్తం ఉచితంగా అందించాలి విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ ఎనీమియా రోగులకు ఉచితంగా రక్తం అందించాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సికిల్సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సికిల్ సెల్ ఎనీమియా రోగులకు తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుందన్నారు. రక్తం తగ్గినప్పుడల్లా రక్తం ఎక్కించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు అనిల్, విక్రాంత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు బొబ్బిలి: మండలంలోని మెట్టవలస మాజీసర్పంచ్ పువ్వల మాధవరావుపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ కె.నారాయణరావు తెలిపారు. బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చేనెల 3 నుంచి మెట్టవలస గ్రామ దేవత పండగ నిర్వహణపై ఈనెల 10న గ్రామస్తులంతా సమావేశమయ్యారు. చందాల రూపంలో వచ్చే ప్రతీపైసాకు లెక్క చెప్పాలని గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు కోరాడు. దీనికి గ్రామ పెద్దలు ఆంగీకారం తెలిపారు. ఇదే విషయంపై అప్పారావు పలురకాలుగా మాట్లాడుతూ ఈ నెల 14న స్థానిక బస్టాండ్లో గ్రామస్తులతో పాటు కూర్చొని ఉన్న మాధవరావుపై తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడిచేశాడు. ఆ సమయంలో మాధవరావు పక్కనే కూర్చున్న రౌతు రామకృష్ణ అడ్డుకోవడంతో అతని కాలికి గాయమైంది. ఎప్పటికై నా మాధవరావును చంపేస్తానని బెదించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బొబ్బిలి రైల్వేస్టేషన్లో ఉన్న సమయంలో గురువారం సాయంత్రం ఏఎస్సై డి.కొండలరావు తన సిబ్బందితో కలిసి పట్టుకుని అరెస్టు చేశారని సీఐ తెలిపారు. -
జిల్లా కోర్టులో ఉచిత వైద్య శిబిరం
విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో న్యాయవాదుల సంఘం గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఉచిత వైద్య శిబి రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్థానిక వెంకటరామ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ చిట్టి రమణారావు, వారి వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించి మెమెంటోలు అందజేశారు. న్యాయవాదులు, వారి గుమస్తాలు ఈ శిబిరంలో పాల్గొని అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ లాడ్స్ గడువులోగా పూర్తి చేయాలి
విజయనగరం గంటస్తంభం: ఎంపీ లాడ్స్(పార్టమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదిక గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు ఇంకా పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో విజయనగరం ఎంపీ నుంచి 68, విశాఖ ఎంపీ నుంచి 4, ముగ్గురు రాజ్యసభ సభ్యుల నుంచి 8 పనులు మంజూరయ్యాయని వెల్లడించారు. జాప్యం వద్దు..పారదర్శకత ముఖ్యం పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్, మున్సిపాలిటీలు, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల వారీగా పనుల స్థితిగతులను ఆరా తీశారు. సివిల్,విద్యుత్ పనుల్లో జాప్యం ఉండకూడదని, భూ వివాదాలు ఉంటే తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని, పనులు పూర్తయిన వెంటనే వివరాలను పోర్టల్లో ఆప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
మూలన పెట్టేశారు..!
● అధ్యక్షుడిగా చేసిన సీనియర్కు ఉపాధ్యక్ష పదవి ● మంత్రి‘కళ’ లేనట్టేనా? సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్టీయార్తో కలిసి భోజనం చేశాను.. ఆ రోజుల్లో ఆయనపక్కనే మనకు ప్రత్యేకంగా కుర్చీ ఉండేది.. ఏంటి బ్రదర్ అనేవారు.. అదీ మన రేంజి అంటూ క్యాడర్ వద్ద తరచూ చరిత్ర చిట్టావిప్పే సీనియర్ను టీడీపీ అధిష్టానం మూలనపెట్టేసింది. కలెక్టర్గా చేసిన అధికారిని బిల్లు కలెక్టర్గా వేసినట్లు.. మేనేజర్గా చేసిన పెద్దాయన్ను బంట్రోతుగా మార్చినట్లు.. అప్పుడెప్పుడో మంత్రి పదవులు, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేసేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావును తాజా రాష్ట్ర కమిటీలో ఉంచీ ఉంచనట్లుగా ఉంచారు. ఉందో లేదో తెలియని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో నియమించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ● ‘కళ’ తప్పింది... వాస్తవానికి కళావెంకటరావును మొన్న కొత్తమావాస్యకు కేబినెట్లోకి తీసుకుంటాం అన్నట్లుగా ప్రచారం మొదలెట్టారు. అంతలోనే అమావాస్య అడ్డొచ్చిందో ఏమో కానీ అలాక్కాదు గానీ.. టీటీడీ చైర్మన్ ఇస్తారట అంటూ ఇంకో ఫీలర్ వదిలారు. తీరాచూస్తే పార్టీ పొలిట్ బ్యూరో నుంచి కూడా తొలగించి పార్టీ పరంగా ఎలాంటి అధికారాలు లేని రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కళావేంకటరావు ఇప్పుడు కొత్త జనరేషన్ వ్యక్తి అయిన పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నమాట. నాల్రోజులు ఆగండ్రా మన రేంజి మారిపోతుంది అంటూ క్యాడర్ వద్ద చెబుతూ వస్తున్న పెద్దాయన... ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో.. ఎలా సమాధాన పరచాలో తెలియక సతమతమైపోతున్నారట. మరోవైపు గజపతినగరం నియోజకవర్గానికి చెందిన శ్రీదేవిని పార్టీ పాలిట్ బ్యూరోలోకి తీసుకోవడం కళావెంకటరావుకు మరో షాకింగ్ అంశం. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం మంత్రిగా ఉంటూ లోకేశ్ కనుసన్నల్లో మెలుగుతూ తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక మండల స్థాయి మహిళను ఏకంగా పొలిట్ బ్యూరోలోకి తీసుకునేలా అధిష్టానాన్ని ప్రభావితం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ మోస్ట్ కళావెంకటరావు కన్నా రాజకీయాల్లో ఫ్రెషర్ అయిన కొండపల్లి శ్రీనివాస్కే పార్టీలో పరపతి ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో కళావెంకటరావు ప్రభ మసకబాటుతున్నట్లే అని క్యాడర్ సైతం అర్థం చేసుకుంటోంది. మున్ముందు ఇక ఆయనకు మంత్రి పదవి గట్రా మరి ఇచ్చేది ఉండకపోవచ్చని, అందుకే ఏదో పదవి పేరిట ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేసి సరిపెట్టారన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఒకనాడు రాష్ట్ర స్థాయిలో కరప్రెత్తనం చేసిన కామందు వార్థక్యంలో కుక్కిమంచానికి పరిమితమైనట్లు.. ఒకనాడు ఊరందరినీ అదలించిన మునసబుగారి మునకాల కర్ర మూలకు చేరినట్లు కళా వైభవం కూడా మసకబారుతోందని అంటున్నారు. వాస్తవానికి కళా రాజకీయ భవిష్యత్తుపై గతంలోనే ‘సాక్షి’ ఓ కథనాన్ని వెలువరించగా దాన్ని పాఠకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ మున‘కళ’ కర్ర మొత్తానికి మూలకు చేరిందయితే అనుకుంటున్నారు. -
కార్మికులకు భరోసా
విజయనగరం గంటస్తంభం: కార్మిక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ ఉపకమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు కోరారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ తర్వాత కార్మికశాఖలో రిజిస్టర్ అయిన వారికి కూడా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు పేర్లు నమోదుచేసుకున్నారన్నారు. వీరి కుటుంబ సభ్యుల వివాహాలు, ప్రసూతి, ప్రమాదాలు, మరణాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.ఈ ఫొటోలో కూలినది రేగిడి–సంతకవిటి మండలాలను అనుసంధానం చేసే సాయన్నచానల్ వంతెన. సంతకవిటి మండలం కొండగూడేం–రేగిడి మండలం ఖండ్యాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిని కలిపే ఈ కల్వర్టు భారీ ఇసుకలారీలు రవాణా కారణంగా ఏడాది కిందట కూలిపోయింది. ఇంతవరకూ ఇక్కడ కొత్త వంతెన నిర్మించలేదు. 12 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగుతోంది. కొండగూడెం, మాధవరాయపురం, వన్నలి, కృష్ణంవలస, జావాం, ఖండ్యాం ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి పాలకులకు ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ వంతెన నిర్మాణంలో లేదని ఈ ప్రాంతీయులు విమర్శిస్తున్నారు. పొరపాటున ప్రశ్నిస్తే ‘గాండ్రు’మంటున్నారని వాపోతున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీ సమీపంలో గల బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం స్థానికులు కనుగొన్నారు. స్థానికుల నుంచి ఈ సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి స్టేషన్ సిబ్బందిని ఘటనా స్థలికి పంపించి వివరాలు సేకరించారు.సుమారు 40 నుంచి 50 ఏళ్లు వయస్సు కలిగి ఉండి, నాలుగు రోజుల క్రితం నూతిలో పడి ఉన్నట్లు గుర్తించామని సీఐ చౌదరి తెలిపారు. తెలుపు రంగుపై నలుపు గడులు కలిగిన షర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్, నడుముకు లుంగీ, మాసిన తెలుపు రంగు గడ్డం ఉన్న మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నంబర్ 9121109419 కు తెలియజేయాలని సీఐ కోరారు. -
మాజీ సర్పంచ్పై హత్యాయత్నం
బొబ్బిలిరూరల్: మండలంలోని మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్ పువ్వల మాధవరావుపై అదే గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు మంగళవారం రాత్రి హత్యాయత్నానికి తెగబడ్డాడు. తన పక్కనే ఉన్న స్నేహితుడి సహయంతో మాజీ సర్పంచ్ మాధవరావు త్రుటిలో తప్పించుకోగా స్నేహితుడు రౌతు రామ్మూర్తి కాలిపై గొడ్డలి వేటు పడడంతో గాయమైంది. ఈ ఘటనపై ఏఎస్సై కొండలరావు,స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మే నెలలో గ్రామంలో జరగనున్న గ్రామదేవత పండగను పురస్కరించుకుని పండగ మూడు రోజుల పాటు మద్యం బెల్ట్ షాపు నిర్వహణకు లక్షల్లో వేలం పాట జరిగింది. వేలంపాటలో పాల్గొన్న అప్పారావు తనకు పాట దక్కలేదన్న అక్కసుతో వేలం పాటను వీడియోతీసి సోషల్మీడియాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మాజీ సర్పంచ్ మాధవరావు, అప్పారావుల మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో మాధవరావు, అప్పారావుపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన అప్పారావు మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆటోస్టాండ్ వద్ద కానాపై స్నేహితుడు రామ్మూర్తితో మాధవరావు చర్చిస్తుండగా మోటారు సైకిల్పై వచ్చి వెనుకనుంచి గొడ్డలితో మాధవరావును నరికేందుకు ప్రయత్నించాడు. మాధవరావు త్రుటిలో తప్పించుకోగా అప్పారావు అక్కడినుంచి పరారయ్యాడు. హత్యాయత్నం ఘటనపై మాధరావు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. నిందితుడి బైక్ దగ్ధం నిందితుడు అప్పారావు మోటారుసైకిల్ను అక్కడే వదిలి పరారవగా మంగళవారం రాత్రి మోటారుసైకిల్కు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమైంది. మోటార్ సైకిల్ దగ్ధమైన విషయం తమ దృష్టికి రాలేదని ఏఎస్సై తెలిపారు. -
మార్కులే జీవితం కాదు..
విజయనగరం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారిలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ..చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఇవి గుర్తుంచుకోండి.. ● పరీక్ష మీ తలరాతను మార్చలేదు. ● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం. ● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు.ఇవి చేస్తే మేలు..పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహపూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి. ఓటమి నుంచే విజయం వరిస్తుందని..స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి. పరీక్షల్లో ఫెయిలైనా.. మార్కులు తక్కువొచ్చినా.. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి. జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి. అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి. ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు. అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యాన్ని నింపాలి. ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి. మార్పు తెచ్చే మార్గాలు ఎన్నో చదువులో సాధించే మార్కులే శాశ్వతం కాదుఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా, మళ్లీ ప్రయత్నించి ఓటమి నేర్పిన పాఠాలతో జీవితంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మార్కులు తక్కువ వస్తే జీవితమే ఆగిపోయినట్లు భావించకుండా మళ్లీ ప్రయత్నించాలి. అపజయం తర్వాత వచ్చే విజయం ఎంతో బలాన్ని అందిస్తుంది. డాక్టర్ సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం


