Vizianagaram
-
సీతం కళాశాలలో ‘ఇ–గేమ్’ పుస్తకావిష్కరణ
విజయనగరం అర్బన్: సీతం కళాశాలలో ‘ఈ–గేమ్ (ఎ డిఫరెంట్ అప్రోచ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్) అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పౌరులు, వీరమరణం పొందిన సైనికులకు తొలుత ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ, సత్య సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఇ–గేమ్ (ఇంగ్లీష్ గ్రామర్ ఆక్సిస్ మేడ్ ఈజీ) పుస్తకం ద్వారా విద్యార్థులు సులభంగా, తర్కబద్ధంగా, సరదాగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోగలుగుతారన్నారు. ఇందులో స్వప్టిప్స్ అనే 7 ప్రధాన అంశాల (వాక్యాలు, క్రియలు, ఆర్టికల్స్, స్పీచ్ భాగాలు, కాలాలు, ప్రశ్నార్థకాలు–ఆదేశాలు, పొజిషన్ మార్కులు)తో పాటు అడ్వాన్స్డ్ గ్రామర్, ప్రశ్నా బ్యాంకులు, రిడిల్స్, పాల్ప్స్ వంటి వర్డ్ గేమ్లు, ఎక్సలునీమ్, వెర్సనీమ్, ఫ్యాక్టనీమ్, స్లింగ్, ఐథెర్, స్పెల్ స్ప్రెడ్స్ వంటి వినూత్న అంశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ భాష అనివార్యమని, ఈ పుస్తకం ద్వారా అలవోకగా నేర్చుకోవచ్చని తెలిపారు. మేన్ ఆఫ్ విజ్డం సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులలో ఇంగ్లీష్ భాషాపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కలిగించగలదన్నారు. రచయిత ఆర్యూ నరసింహాన్ని ‘మేన్ ఆఫ్ విజ్డం’ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ–జీవీ రిజిస్ట్రార్ డాక్టర్ జయసుమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత ఆర్యూ నరసింహం పుస్తక విశేషాలను వివరించి, గ్రామర్ నేర్చే పద్ధతిని సరదాగా మార్చేందుకు ఈ పుస్తకం సహాయపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్. మజి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, విశాఖ సాంస్కృతిక పత్రిక ఎడిటర్–పబ్లిషర్ శ్రీ సిరెలా సన్యాసిరావు, ఇతర కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకస్వాములు చక్రతీర్థ స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో పూర్ణాహుతి హోమం జరిపించారు. అనంతరం శ్రీ సుదర్శన స్వామి పెరుమాళ్లను రామపుష్కరిణి వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామికి చక్రస్నానం చేయించారు. తరువాత గ్రామ బలిహరణ, బాలభోగం జరిపించి యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. సాయంత్రం ధ్వజా రోహణం చేపట్టి వేణుగోపాలుడి కల్యాణ మహోత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, రామగోపాల్, భక్తులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు
● ఉత్తమ ప్రదర్శనగా చీకటి పువ్వు నాటిక ● ద్వితీయ, తృతీయ ప్రదర్శనలుగా కొత్త పరిమళం, రైతేరాజు చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు మూడు రోజుల పాటు వైభవంగా జరిగి ఆదివారం ముగిశాయి. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాం హైస్కూల్ ఆవరణంలో జరిగిన నాటిక పోటీల ప్రదర్శనలో..కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అదేవిధంగా బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా హైదారాబాద్కు చెందిన కళాంజలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతేరాజు నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. నగదు బహుమతుల అందజేత.. ఈ నాటికల ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన చీకటిపువ్వు బృందానికి రూ.15వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన కొత్త పరిమళం నాటిక బృందానికి రూ.12,500, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన నాటిక బృందానికి రూ.10వేలు నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు. అలాగే ప్రతి నాటిక ప్రదర్శనకు రూ.25వేలు ప్రోత్సాహంగా అందజేశారు. అదే విధంగా కొత్త పరిమళం రచయిత కేకే.ఎల్ స్వామికి రూ.5వేలు, చీకటిపువ్వు నాటిక దర్శకుడు రమేష్ మంచాలకు రూ.5వేల నగదు బహుమతిని కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. -
చిత్తశుద్ధితో అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు అందిన 92 వినతులుపార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 92 మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించగా, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యమై వినతులను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కావున అర్జీలను చిత్త శుద్ధితో త్వరితగతిన పరిష్కారం చేఆయలని అధికారులను ఆదేశించారు. అర్జీలు కొన్ని ఇలా.. ● పాలకొండ నగర పంచాయతీలో పొరుగు సేవల కింద శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడగా హైకోర్టులో కేసు ఉంది. దానిపై తుది తీర్పు రాకముండే ఆ పోస్టును భర్తీ చేస్తున్నారని, కావున తీర్పు వచ్చేంతవరకు దాన్ని నిలుపుదల చేయాలని పాలకొండకు చెందిన కొనపల వీరభద్రపురం వినతి పత్రాన్ని అందజేశాడు. ● గుమ్మలక్ష్మీపురం మండలం పాముల గీసాడ జంక్షన్ నుంచి చిన్న రావికోన గ్రామం వరకు తారు రోడ్డు వేయాలని చిన్న రావికోన గ్రామానికి చెందిన తోయక జమ్మన్న విజ్ఞప్తి చేశాడు. ● బలిజిపేట మండలం పెద్దింపేట నుంచి ముదిలి జనార్దన్ అర్జీని ఇస్తూ తమ గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సుమారు 200 మంది వేతనదారులకు జనవరి మూడవ వారం నుంచి నేటివరకు వేతనాలు చెల్లించలేదని, వాటిని మంజూరు చేయాలని కోరారు. ● పార్వతీపురం మండలం డి.ములగ నుంచి చౌదరి రాణి వినతి పత్రాన్ని అందజేస్తూ, తాము పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమకు ఆధార్, రేషన్ కార్డులు లేనందున వాటిని మంజూరుచేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికాారులు చొరవ చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి చూసి ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేదింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై ఎస్పీ 12 ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 22 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 22 వినతులు వచ్చాయి. విద్యుత్ట్రాన్స్ఫార్మర్ వేయించాలని భామిని మండలం సన్నాయిగూడ రైతులు కోరారు. వరదగోడ మంజూరు చేయాలని టిటుకుపాయిగూడకు చెందిన ఆరిక శ్యామల రావు, మల్లి గ్రామానికి చెందిన బూగన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, ఈఈ రమాదేవి, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఇన్చార్జ్ డిప్యూటీఈవో చంద్రరావు, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 136 అర్జీలు
విజయనగరం క్రైమ్: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 136 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా వినతులను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, కేఆర్సీ ఎస్డీసీ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు పరిశీలించారు. ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలకు చట్టపరిధిలో పరిష్కారం విజయనగరం క్రైమ్: జిల్లాపోలీస్ కార్యాలంయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ పకుల్జిందాల్ సిబ్బందిని ఆదేశించారు. డీపీవోలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఏడు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పీజీడీఆర్ఎస్ లో మొత్తం 46 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్లు పాల్గొన్నారు.కూలికి వెళ్లి.. విగతజీవుడై..●● విద్యుత్ షాక్కు గురై యువకుడి మృతితెర్లాం: కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనికోసం వెళ్లిన ఓ యువకుడు విగతజీవుడయ్యాడు. పెళ్లిలో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్ తగలడంతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగిరెడ్డివలస పంచాయతీ పరిధి ఆమిటి సీతారాంపురం గ్రామానికి చెందిన కొత్తకోట చిరంజీవి(20) ఆదివారం కొల్లివలసలో జరిగిన ఓ వివాహానికి టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికోసం వెళ్లాడు. పెళ్లి అయిన తరువాత టెంట్లు విప్పుతుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిరంజీవికి తండ్రి, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారిని పోషించేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల్లో టెంట్లు, లైటింగ్ పనులు చేసేందుకు కూలికి వెళ్తుంటాడు. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతిచెందిన సమాచారం తెలియడంతో తెర్లాం ఎస్సై సాగర్బాబు సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిపాచిపెంట: మండలంలో ని పద్మాపురం పంచా యతీ బడ్నాయక వలస గ్రామానికి చెందిన అంగర బోయిన లక్ష్మణరావు(31) బైక్ అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘ టనపై ఎస్సై వెంకట సురేష్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణరావు మద్యానికి బానిసై తరచూ భార్య ఉషారాణితో తగాదా పడుతూ ఉండేవాడు. రోజులాగానే ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో తగాదాపడ్డాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన భార్య ఇంట్లో ఉన్న ఏవో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు సాలూరు సీహెచ్సీకి తరలించారు. సాలూరులో చికిత్స పొందుతున్న భార్యను చూడడానికి లక్ష్మణరావు, ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై సాలూరు వెళ్తుండగా పి.కోనవలస సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా 108 సహాయంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. బైక్ ఢీ కొని వ్యక్తికి గాయాలుకొమరాడ: మండలంలోని కంబవలస సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పి.శంకరరావు బైక్ ఢీకొని గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మీపేట గ్రామానికి డిజిట్ అసిస్టెంట్ శంకరారావు వెళ్తుండగా జంఝావతి డ్యాం దాటిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి సారా కేన్లు బైక్తో తీసుకు వెళ్తూ మద్యం మత్తులో డిజటల్ సహాయకడు శంకరరావును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆయన హెల్మెట్ పెట్టుకున్నందున ముఖం, చేతికి చిన్నపాటి గాయాలయ్యయి. యువకుడి ఆత్మహత్యసాలూరు: పట్టణంలోని డబ్బివీధికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారీ క్లీనర్గా పనిచేస్తున్న గంట దినేష్(29) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం మద్యానికి డబ్బులు ఇవ్వమని తల్లిని అడగగా, ఇంట్లో డ బ్బులు లేవని తెలిపింది. దీంతో మనస్తాపానికి గురైన దినేష్ ఇంటిలో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
ఉద్యోగాల కల్పనకు కృషి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్గజపతినగరం రూరల్: ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబ్మేళాను నిర్వహిస్తోందని రాష్ట్ర సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాను సోమవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటుచేయనున్నామన్నారు. పార్కుల ఏర్పాటు ద్వా రా పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధి కి శతశాతం కృషి జరుగుతుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్మాక్లస్టర్, పెట్రో కెమికల్స్, పరిశ్రమలు, స్టీల్స్పరిశ్రముల ఏర్పాటు కానున్నాయన్నారు. యువతకు వేతనం తక్కువైనా సరే అవకాశాన్ని అందిపుచ్చుకుని అనుభవాన్ని సంపాదించిన నాడు జీవితంలో మరింత ఉన్నతస్ధాయికి చేరుకుంటారని సూచించారు. ప్రతి ఒక్కరు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాధికారి జి.ప్రశాంత్కుమార్, సంబంధిత శాఖ సిబ్బంది, టీడీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం సాధించాలి
విజయనగరం: ఆత్మరక్షణ విద్య తైక్వాండోలో క్రీడాకారులు మరింత ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఒలింపిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఆకాంక్షించారు. ఈ మేరకు న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో తలపెట్టిన మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సెమినార్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొనగా..క్రీడాకారులకు ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ నూతన మెలకువలను నేర్పించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పురుషోత్తం సూచించారు. అంతర్జాతీయ యవనికపై తలపడే క్రీడాకారులకు ఈ సెమినార్ దోహపడుతుందని పేర్కొన్నారు. సెమినార్లో నేర్చుకున్న అంశాలను నిరంతరం సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సెమినార్లో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అబ్బాస్ షేక్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్పై ఎంపీడీఓకు ఫిర్యాదు
● పని కల్పించాలంటూ వేతనదారుల ధర్నాగంట్యాడ: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనికి వెళ్లే వేతనదారులకు పనికల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్పై గ్రామసర్పంచ్, వేతనదారులు సోమవారం ఫిర్యాదు చేశారు. పెదవేమలి గ్రామంలో గత వారం 160 మంది వేతనదారులకు పనికల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ అలసత్వం వహించారని, ఈవారం కూడా 30 నుంచి 40 మందివరకు వేతనదారులకు పనిలేకుండాచేశారని పెదవేమలి గ్రామ సర్పంచ్ వర్రి పాపునాయుడు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల వేతనదారులు నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పని కావాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారికి పని కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సదరు ఫీల్డ్ అసిస్టెంట్పై తగిన చర్యలు తీసుకుని వేతనదారులకు పనికల్పించాలని కోరారు. పనికల్పించాలని ధర్నా అలాగే మండలంలోని నరవ గ్రామానికి చెందిన వేతనదారులు సోమవారం ఎంపీడీఓకార్యాలయం ఎదుట తమకు పని కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి సిబ్బంది తీరు వల్ల తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్గా చలామణి అవుతున్న మహిళపై ఫిర్యాదు నరవ గ్రామంలో డ్వామా శాఖ నుంచి ఎటువంటి అపాయింట్ మెంట్ ఆర్డర్ లేకుండా షాడో ఫీల్డ్ అసిస్టెంట్గా చలామణి అవుతున్న మహిళపై చర్యలు తీసుకోవాలని అదేగ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రెండు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా సదరు మహిళకు ఉపాధి హామీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ మాదిరి మస్తర్లు పరిశీలించడం, పనులు పురమాయించడం చేస్తున్నారని ఆరోపించారు. -
నీరుపేద రైతుల ఆందోళన
● సాగునీటి కష్టాలు తీర్చండంటూ వేడుకోలు ● ఇబ్బందులు పడుతున్న ఐదుగ్రామాల రైతులు ● సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ఆవరణలో నిరసనపార్వతీపురంటౌన్: కొమరాడ మండలం కోటిపాం గ్రామ ప్రజలు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా వ్యవసాయపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గెడ్డపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో తమకు సాగునీరు అందడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోటిపాం గ్రామలో 500 కుటుంబాలున్నాయని వనకాబడి గెడ్డ ఆయకట్టు నుంచి వచ్చిన నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. వనకాబడి గెడ్డ నుంచి వనకాబడి, బట్టిమాగవలస, చినఖేర్జల, లింగందొర వలస, బూర్జి వలస మీదుగా వచ్చి కోటిపాం కొత్తచెరువులో గెడ్డ నీరు కలుస్తుందని, చెరువు నిండిన తర్వాత ఈ చెరువు నుంచి సుమారు పది చెరువులు, బందలు నిండుతాయని, ఈ నీటి వనరుల మీదే తాము సాగుచేసుకుంటూ బతుకుతున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాలకు ఈ సాగు నీరే ఆధారం వెయ్యి ఎకరాల సాగు ఈనీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. వనకాబడి ఆయకట్టు నీరు ప్రధానంగా కోటిపాం గ్రామానికి వస్తుంది. కావున గత 28న వనకాబడి గెడ్డపై చెక్డ్యామ్ నిర్మించేందుకు పరిశీలించారని, దీనికి సంబంధించిన చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణం అలాగే ఉంటే తమ గ్రామానికి రావాల్సిన ఆయకట్టు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ కొత్తగా చెడ్డ్యామ్ నిర్మించడం వల్ల మా గ్రామానికి రావాల్సిన నీరు ఆగిపోతుంది. దీంతో చాలామంది రైతులు ఇబ్బందికి గురవుతారని తెలియజేస్తున్నారు. తమ గ్రామ రైతులకు వ్యవసాయానికి ఈ చెక్డ్యాం ద్వారా వచ్చే నీరు మాత్రమే ఆధారమని, పరిశీలించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేసి తమకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. కొత్త చెడ్డ్యామ్ నిర్మాణం వద్దు గ్రామంలో 500మంది కుటుంబాలకు సంబంధించిన సుమారు 1000 ఎకరాలకు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ప్రాంతంలో కొత్తగా మరో చెక్డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల రైతులకు తీవ్రనష్టం చేకూరుతుంది. అధికారులు ఈ విషయంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – ఎజ్జు గుంపస్వామి, రైతు, కోటిపాంరైతులను ఆదుకోండి ఎన్నోఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతులను ఆధికారులు ఆదుకోవాలి. వనకాబడి ఆయకట్టు గెడ్డపై నిర్మించనున్న చెక్డ్యాం పనులను ప్రారంభించరాదు. సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి సాగునీరు అందిస్తున్న గెడ్డపై ప్రస్తుతం ఉన్న చెక్డ్యాంను యథావిదిగా ఉంచి రైతులకు సాగునీటిని అందజేయాలి. – పాండ్రంకి రామకృష్ణ, రైతు, కోటిపాం500 కుటుంబాల జీవనాధారం పోతుంది నూతన చెక్డ్యాం నిర్మాణం వల్ల గ్రామంలో గల 500మంది కుటుంబాలకు జీవనాధారం పోతుంది. ఐదు గ్రామాలకు సాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి చెక్డ్యాం నిర్మాణం చేపట్టకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాం ద్వారానే నీటిని సరఫరా చేయాలి. – పప్పల సోమేశ్వరరావు, రైతు, కోటిపాం -
పశువైద్య విద్యార్థుల డిమాండ్లు నెరవేరేనా?
● గరివిడి వెటర్నరీ కళాశాలకు వీసీఐటీఎం రేపు రాక ● 16వ తేదీ వరకు కళాశాల పరిశీలన చీపురుపల్లిరూరల్(గరివిడి): వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన బృందం గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు ఈనెల 14న రానుంది. 16వ తేదీ వరకు కళాశాలలోనే ఉండి సదుపాయాల ను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోనుంది. వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి వీసీఐ బృందం వెటర్నరీ కళాశాలలను సందర్శించడం, నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం పరిపాటి. అందులో భాగంగానే గరివిడి కళాశాలకు బృందం రానుంది. కళాశాలలో ఫ్యాకల్టీ పరిస్థితి, భవన సదుపాయాలు, ల్యాబ్, వసతులు తదితరవి పరిశీలించనుంది. న్యాయం జరుగుతుందా... వీసీఐ బృందానికి ఈ సారి విద్యార్థుల నుంచి డిమాండ్లు వినిపించనున్నవి. కళాశాలకు వీసీఐ గుర్తింపుతో పాటుగా స్టైఫండ్ను రూ.7,600 నుంచి రూ.25 వేలకు పెంచాలని కోరుతూ విద్యార్థులు సుమారు రెండు నెలలపాటు ఆందోళనలు కొనసాగించారు. వీరి సమస్యను పరిష్కరించడంలో కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులను రోడ్డె క్కించింది. 327 మంది వెటర్నరీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరవధిక దీక్షలు చేపట్టారు. కళాశాల నుంచి రిలీవ్ కాబోతున్న విద్యార్థులకు వీసీఐ గుర్తింపు లేకపోతే వెటర్నరీ విద్యను అభ్యసిస్తున్న తమ జీవితాలు ఏమి కావాలని అప్పట్లో ప్రశ్నించారు. కళాశాలలో సరిపడా భవనాలు, ల్యాబ్ సౌకార్యాలు, వసతులు, అధ్యాపక సిబ్బంది లేని కారణంగా వీసీఐ గుర్తింపు రావడంలేదని, కళాశాలకు గుర్తింపు ఉంటేనే ఇంటర్న్షిప్లో ఎన్రోల్ కావడానికి, పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్ర న్స్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంద న్నది విద్యార్థుల వాదన. విద్యార్థుల డిమాండ్ల మేరకు వారి స్టైఫండ్ను రూ.7,600 నుంచి రూ. 10వేలకు పెంచుతూ జీఓ విడుదల చేయడంతో విద్యార్థులు నిరవధిక దీక్షను విరమించారు. కళాశాలకు వస్తున్న వీసీఐ బృందానికి తమ డిమాండ్లను వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. -
జనసేన నాయకుడి బరితెగింపు
● ఎమ్మెల్యే సమక్షంలో రెచ్చిపోయిన వైనం ● గందరగోళంగా మండల సర్వసభ్యసమావేశం ● జనసేన, వైఎస్సార్సీపీ నాయకులు వేర్వేరుగా ఎంపీడీఓకు ఫిర్యాదు పూసపాటిరేగ: పూసపాటిరేగ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జనసేన, టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సభ్యులుకాని జనసేన నాయకుడు పతివాడ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు ఇజ్జరోతు ఈశ్వరరావు సమావేశానికి హాజరై సభ్యులను ప్రశ్నించడం వాగ్వాదానికి దారితీసింది. రోడ్ల ఆక్రమణపై ఎమ్మెల్యే లోకం నాగమాధవికి పతివాడ ఎంపీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనాయుడు ఫిర్యాదు చేస్తుండగా రెల్లివలస సర్పంచ్ ఇజ్జరోతు అప్పలరాజు అడ్డుతగిలారు. ఆక్రమణలు చేసినది మీరంటే మీరే అంటూ ఆరోపణలు చేసుకున్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత పై అంతస్తు నుంచి గ్రౌండ్ఫ్లోర్కు దిగుతుండగా జనసేన నాయకుడు పతివాడ శ్రీనివాసరావు, ఎంపీపీ మహంతి కల్యాణి భర్త మహంతి శ్రీనివాసరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త తోపులాటకు దారితీయడంతో పోలీసులు సర్దిచెప్పారు. అర్హత లేకుండా సభకు రావడమే కాకుండా సభ్యులపై పతివాడ శ్రీనివాసరావు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం ఎంపీడీఓ రాధికకు ఎంపీపీ మహంతి కల్యాణి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్ సర్వసభ్యసమావేశంలోకి వచ్చి గొడవలకు కారణమైన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీఓను కోరారు. ఎంపీపీ కల్యాణి లేకుండా ఆఫీసు గది తలుపులు తీయడం నిబంధనలకు విరుద్ధమని జనసేన నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదుచేశారు. -
విజయనగరం
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025చదురుగుడికి.. సిరుల తల్లి ● శోభాయమానం.. పైడితల్లి దేవర మహోత్సవం ● ఉత్సవ రథంపై ఊరేగిన అమ్మవారు ● హుకుంపేటలో ఘటాలకు పసుపు, కుంకుమలతో అభిషేకాలు ● అడుగడుగునా అమ్మకు పూజలు చేసిన భక్తజనం ● చదురుగుడికి చేరిన సిరులతల్లి ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో ‘చీకటి పువ్వు’ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. –8లోదేవర ఉత్సవం ఊరేగింపులో కళారూపాలు విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పైడితల్లి దేవరమహోత్సవం సోమవారం శోభాయమా నంగా సాగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి సిరులతల్లి చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా వనంగుడి స్తపన మందిరంలో సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు, భక్తులు, పూజారులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఆలయం చుట్టూ జై పైడిమాంబనామ స్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం అప్పటికే ఆలయం బయట సిద్ధంగా ఉంచిన ఉత్స వ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతిచ్చారు. మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మ రథం ముందుకు కదిలింది. దారిపొడవునా పూజలు సిరులతల్లి వనంగుడి నుంచి చదురుగుడికి బయలుదేరిన వేళ... విద్యల నగరంలో ఆద్యంతం భక్తిభావం ఉప్పొంగింది. రైల్వేస్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్ కూడలి, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్ ఆఫీస్, కమ్మ వీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను పెట్టారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకూ భక్తులు దర్శించుకున్నారు. తాడేపల్లి గూడెం కళాకారులు ప్రదర్శించిన నవదుర్గలు, కాళికామాత వేషధారణలు భక్తిభావాన్ని పెంపొందించాయి. తప్పెటగుళ్లు, కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఇన్చార్జి ఈఓ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సంప్రదాయబద్ధంగా.. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి వద్ద రాత్రి 7 గంటల సమయంలో అమ్మవారి ఘటాలకు హుకుంపేట ప్రజలు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. ఈ ఏడాది సిరిమానోత్సవ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా చూడాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా కాపాడాలంటూ పైడితల్లిని ప్రార్థించారు. హుకుంపేట నుంచి రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మండపం వీధి, శివాలయం మీదుగా సుమారు 2 గంటల ప్రాంతంలో ఊరేగింపు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి చేరుకుంది. అక్కడ ఆలయంలో ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారీ రామవరపు చినపైడిరాజు బృందం సాయంతో జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా తలయారి, పూజారి, కొందరు భక్తులు చెరువు వద్దకు వెళ్లి అమ్మవారికి మనవి చెప్పారు. అక్కడి మట్టిని అమ్మవారి బొమ్మగా మలచి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ రోజు నుంచి అమ్మవారు చదురుగుడిలో దర్శనమిస్తారని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు. న్యూస్రీల్ -
జీతం విడుదల చేయండి
విజయనగరం ఫోర్ట్: సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల)లకు వెంటనే ఏప్రిల్ నెల జీతం విడుదల చేయాలని జీహెచ్ఓలు మౌనిక, కనకదుర్గ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీహెచ్ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని, ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించా లని డిమాండ్ చేశారు. 30 శాతం జీతం పెంచా లని కోరారు. కార్యక్రమంలో సీహెచ్ఓలు శ్రీను, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. చలో కలెక్టరేట్ రేపు ● డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్ధులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఈ నెల 14న తలపెట్టిన చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్ఐ) సభ్యులు పిలుపునిచ్చారు. కోట కూడలిలో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు పోరాడి డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి, రెగ్యులర్ డిగ్రీ పాస్ అయిన వారికి సమాన అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాకు ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలన్నారు. 14న కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో డీఎస్సీ అఽభ్యర్థులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వరరావు, శ్రీను, కిషోర్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్కు ఫిర్యాదు రామభద్రపురం: మండలంలోని మిర్తివలస పంచాయతీ మధుర గ్రామం కాకర్లవలసలో ఈ నెల 10న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మిర్తివలస సర్పంచ్ను ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు సోమవారం ఫిర్యాదు చేశామని జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మజ్జి రాంబాబు తెలిపారు. శిలాఫలకంపై మిర్తివలస పంచాయతీ సర్పంచ్ పేరు రాయకుండా కొట్టక్కి పంచాయతీ సర్పంచ్ పేరు రాయడంపై అభ్యంతరం తెలిపారు. ఇది తనతో పాటు గ్రామ ప్రజలను అగౌరవ పరిచినట్టేనన్నారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పాలకుల వైఖరిలో మార్పుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి బొబ్బిలి: పాలకుల వైఖరిలో పూర్తిస్థాయి మార్పు వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్య మని ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు అన్నారు. బొబ్బిలిలోని ఎన్జీఓ హోంలో ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో రామమూర్తినాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అపారమైన ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి చెందుతాం తప్ప రాజకీయల వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన వంటి చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు మెరిగాని గోపాలం మాట్లాడుతూ స్థానిక గ్రోత్ సెంటర్లో స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కార్యక్రమంలో వెంకటనాయుడు, అప్పలరాజు, డి. సత్యంనాయుడు, రెడ్డి దామోదరరావు, చింతల శ్రీనివాసరావు, బొత్స గణేష్ పాల్గొన్నారు. -
తలసరి ఆదాయం పెంపునకు చర్యలు
● జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత ● సంకిలి చక్కెర కర్మాగారంపై స్పష్టత ఇవ్వండి: జెడ్పీచైర్మన్ విజయనగరం క్రైమ్: విజన్–2047లో భాగంగా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్చార్జి మంత్రి, హోమ్శాఖ మంత్రి వంగలపూడి అనిత కోరా రు. దీనికోసం అందుబాటులో ఉన్న సహజ వనరు లను వినియోగించుకోవాలన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి సూచనల మేరకు భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతు పనులు పూర్తికాలేదంటూ రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంత్రి దృష్టికి తెచ్చారు. బోర్ల మరమ్మతుల పనులు వేగంగా జరగడం లేదని ఎమ్మెల్సీ సురేష్బాబు తెలియజేశారు. కొత్తవలసలో చెరువు లో అక్రమ రోడ్డు నిర్మాణం, రేగ, పుణ్యగిరి, ధారపర్తి తదితర గిరిజన ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాసరావుపై ఫిర్యాదులు ఎక్కువ గా వస్తున్నాయని, అతనిని సరెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. సంకిలి చక్కెర కర్మాగారాన్ని మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోందని, దీనిపై వివరణ ఇచ్చి రైతులకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరంలో మూడవ పట్టణ పోలీస్స్టేషన్ను, డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఎమ్మె ల్యే అదితి కోరారు. సివిల్ సప్లయ్ డీఎంగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన మీనాకుమారిపై విజలెన్స్ విచారణకు ఆదేశించినట్టు మంత్రి ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్, మంత్రి కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కళలను ప్రోత్సహించాలి
చీపురుపల్లి రూరల్(గరివిడి): నాటికలు కళలకు జీవమని, కళలను మరింతగా ప్రోత్సహించాలని సినీ నటి కవిత అన్నారు. గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళల మీద అభిమానం ఉన్న వాళ్లు మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటాన్ని హర్షించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. జయలలిత మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల్లో రెండు రోజులుగా భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు. గరివిడి ప్రాంతంలో ఇలాంటి నాటిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మంచి పరిణామమని కొనియాడారు. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ప్రతినిధులు వాకాడ గోపి, రవిరాజ్, బమ్మిడి కార్తీక్, కంబాల శివ, వాకాడ శ్రీనువాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, లోక్సత్తా పార్టీ నాయకులు భీశెట్టి బాబ్జీ, కె.త్రిమూర్తులరాజుతో పాటుగా అతిథులుగా రచయిత్రీ జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్లు రవితేజ, అరుణ తదితరులు పాల్గొన్నారు. సినీ నటీమణులు కవిత, జయలలిత -
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
గజపతినగరం : రాష్ట్రంలో మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం సరికాదని, ఈ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. జీవో నంబరు 117 ద్వారా అనేక మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు పొందిన వారిని వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెడ్ మాస్టర్లుగా నియమించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికే కనీసం ప్రమోషన్లు రాక ఎస్జీటీలు ఎంతో వేదన చెందుతున్నారని, ఈ వేదనను ప్రభుత్వం మరింత పెద్దది చేసిందన్నారు. అసలు డీఎస్సీలో బీఎడ్ అనేది ప్రైమరీ ఉపాధ్యాయుడికి అర్హత కాదన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రైమరీ పాఠశాలలో పని చేయడానికి అర్హత ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రరావు -
ఆకలితో అలమటిస్తున్నా... కనికరించరా...!
నా పేరు పిల్ల బుచ్చమ్మ. మాది పూసపాటిరేగ గ్రామంలోని భూడి వీధి. నా భర్త పిల్ల బంగారప్పడు గత ఏడాది జూన్ నెలలో మృతి చెందాడు. అప్పటి నుంచి కనిపించిన ప్రతి ఒక్క అధికారిని, నాయకులని పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాను. నా మొర ఆలకించడం లేదు. వృద్ధాప్య పింఛన్, వితంతువు పింఛన్కు అర్హత వుంది. కనీసం ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. పింఛన్ కోసం తిరిగి తిరిగి శక్తి సన్నగిల్లింది. ఎలా బతకాలో తెలియడం లేదు. – పిల్ల బుచ్చమ్మ, భూడి వీధి, పూసపాటిరేగ పూసపాటిరేగ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి కనీసం వెబ్సైట్ తెరవలేదు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా పింఛన్లు మంజూరు కాక ఆశతో ఆకలితో ఎదురు చూస్తున్నారు. భర్త చనిపోతే అదే నెలలో స్పౌజ్ కోటాలో అనుమతిచ్చి, ఏడాది కాలంగా భర్త చనిపోయి ఎటువంటి ఆదరణకు నోచుకోని మహిళలు పింఛన్కు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయమని వితంతువులు వాపోతున్నారు. వందల సంఖ్యలో వితంతువులకు పింఛన్ అందక కనీసం మందుల ఖర్చుకు కూడా డబ్బుల్లేక అల్లాడుతున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత వున్న ప్రతి ఒక్కరికి వలంటీర్లు దరఖాస్తు చేసిందే తడువుగా పింఛన్ మంజూరయ్యేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాలు దేముడెరుగు కనీసం సామాజిక పింఛన్లు అయినా మంజూరు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు 3200 మంది అర్హులైన పింఛన్దారులు వున్నారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాలు చుట్టూ వందలాది మంది అర్హులైన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. పూసపాటిరేగ గ్రామంలో భర్త చనిపోయి ఏడాది దాటుతున్నా పిల్ల బుచ్చమ్మ, బెల్లాన రాములమ్మ, జలమాదుల సరస్వతి అనే మహిళలకు పింఛన్ మంజూరు కాలేదు. దీంతో వీరు బతుకు జీవనంతో పడరాని పాట్లు పడుతున్నారు. అలాగే కుమిలి గ్రామంలో కోండ్ర లక్ష్మి, ఉప్పాడ అసిరమ్మ, బూర్లె అప్పయ్యమ్మ, పొట్నూరు రమణమ్మతో పాటు పలువురు ఇలానే పింఛన్ మంజూరు కాక ఆవేదన చెందుతున్నారు. ఇలా అర్హత వున్న ఎంతో మంది పింఛన్కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లినా వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని వెనక్కి పంపిస్తున్నారు. గతంలో పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి నిరంతరాయంగా వెబ్సైట్ ఓపెన్ అయి వుండేది. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా వుంది. ఓ వైపు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండానే మరోవైపు వున్న పింఛన్లు ఊడ దీయడానికి గ్రామాలలో సర్వేలు చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. నా గోడు పట్టదా.. నా పేరు బెల్లాన రాములమ్మ. మాది పూసపాటిరేగ గ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి ఆదరణ లేదు. నా భర్త బెల్లాన బుల్లి మరణించి ఏడాది దాటింది. నాకు వితంతవు పింఛన్, వృద్ధాప్య పింఛన్కు అర్హత వుంది. కానీ ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కనిపించిన అధికారులు, ప్రజాప్రతినిధులను ఏడాదిగా వేడుకుంటున్నా.. ఫలితం దక్కలేదు. దిక్కులేని కుటుంబాలకు దేవుడే దిక్కు అనుకుంటే ఆ ఆశ కూడా సన్నగిల్లింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హత వున్న పింఛన్ దక్కలేదు. – బెల్లాన రాములమ్మ, రాజా వీధి, పూసపాటిరేగ అర్హత ఉన్నా సామాజిక పింఛన్ అందని వైనం గొల్లుమంటున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు తెరుచుకోని వెబ్సైట్ -
పోలీసుల తీరు అభ్యంతరకరం
● అధికారం శాశ్వతం కాదు.. ● మాజీ మహిళామంత్రి రజని పట్ల ఇలానే వ్యవహరిస్తారా..! ● రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు.. ● భవిష్యత్లో చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు ● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండిపోదనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ మహిళా మంత్రి విడదల రజని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఆక్షేపనీయంగా ఉందని తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఓ మహిళ, మాజీ మంత్రి అయిన విడదల రజని పట్ల పోలీసులు అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించారని దుయ్య బట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో కొందరు పోలీసులు తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. పోలీసులు తమ నిబంధనలను అతిక్రమిస్తున్నారని హైకోర్టు కూడా ఆగ్రహించిన సంఘటనలు రాష్ట్రంలో నేటి పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ఎన్టీ రామారావు వంటి వ్యక్తే అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకప్పుడు ఓడిపోయిన పవన్కల్యాణ్ నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని సూచించారు. భవిష్యత్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనే భ్రమలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తాను పని చేసిన కాలంలో ఏనాడూ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లమని పోలీసులకు చెప్పలేదని గుర్తు చేశారు. నేటి రెడ్ బుక్ రాజ్యాంగంలో నిబంధనలు అతిక్రమిస్తున్న అధికారులు, పోలీసులు భవిష్యత్లో చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. -
కంది పప్పు మార్కెట్లో రూ.140
బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. వీటిలో కందిపప్పు ధర మరింత ఎక్కువగా ఉంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు వీటి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం గడిచిన మూడు నెలలుగా రేషన్ సరుకుల్లో కంది పప్పుకు కోత పెట్టింది. బియ్యం, పంచదారతో సరిపెట్టేసింది. మూడు నెలలుగా కంది పప్పు రేషన్ ద్వారా అందుతుందని ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి పాలకులపై లబ్ధిదారులు రుసరుసలాడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని రకాల రేషన్ సరుకులు సరఫరా చేస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలకు దిక్కు లేకుండా పోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపీణి చేసే సరుకుల్లో కోత పెట్టి ప్రజలకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. దీంతో విస్తుపోవడం ప్రజల వంతు అయింది. గత కొద్ది నెలలుగా ప్రజలకు అందించాల్సిన కందిపప్పును కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రజలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మార్కెట్లో కంది పప్పు ధర చూస్తే భగ్గుమంటోంది. దీన్ని కొనుగోలు చేయలేని స్థితిలో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది భారం అయినప్పటికీ తప్పని పరిస్థితి. ● హామీల అమలు ఉత్తిదే.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పన అందిస్తామని కూటమి నేతలు చెప్పారు. ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు లేవు. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చి రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని గొప్పగా చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. 11 నెలలైనా అమలు చేయలేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పారు. ఒక్క మహిళకు అమలు చేసిన పాపాన పోలేదు. ● 5,71,354 రైస్ కార్డులు జిల్లాలో 5,71,354 రైస్కార్డులు ఉన్నాయి. వీరికి ఒక నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. మార్చి నెల నుంచి కంది పప్పు సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.11.48 కోట్ల వరకు భారం తగ్గింది. కోట్లాది రుపాయిల భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి సర్కార్ కందిపప్పు సరఫరా నిలిపివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు పప్పు దినుసులు అందులోనూ కందిపప్పు ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పడు అది కూడా పేదలకు అందే పరిస్థితి లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కందిపప్పు కొనుగోలు చేయలేక.. ఇటు ప్రభుత్వం సరఫరా చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రైస్ కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైస్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయని, కందిపప్పు ధర మరింత ఎక్కువగా మార్కెట్లో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రేషన్ సరుకుల్లో కందిపప్పును మళ్లీ సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. కేటాయింపుల్లేవు.. రైస్ కార్డుదారులకు కందిపప్పుకు సంబంధించి ఎటువంటి కేటాయింపుల్లేవు. ఈ ఏడాది మార్చి నెల నుంచి సరఫరా కాలేదు. – బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లై శాఖ మూడు నెలలుగా నిలిచిపోయిన కందిపప్పు సరఫరా ఎన్నికల వేళ గొప్పలు...తరువాత చుక్కలు జిల్లాలో 5,71,354 రైస్ కార్డులు నెలకు వీరికి అందించాల్సిన కందిపప్పు 571.354 మెట్రిక్ టన్నులు రూ.11.48 కోట్లు మిగుల్చుకున్న ప్రభుత్వం రేషన్ బియ్యం, పంచదారతో సరి రైస్ కార్డులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులను పంపిణీ చేస్తుంది. అయితే కూటమి సర్కార్ గత మూడు నెలలుగా బియ్యం, పంచదార (అర కేజీ)తో సరిపెడుతుంది. కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.140 వరకు ఉంది. రేషన్ షాపుల్లో రాయితీపై కేజీ రూ.67లకు చొప్పన ఇచ్చేవారు. రేషన్ షాపుల్లో తక్కువ ధరకు లభించడంతో కార్డుదారులు కొనుగోలు చేసే వారు. అయితే ఈ ఏడాది మార్చి నెల నుంచి కంది పప్పు సరఫరా కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. దీంతో రైస్ కార్డు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. -
14న ఏపీటీఎఫ్ రాష్ట్ర స్థాయి ధర్నా
బొబ్బిలి: పాఠశాల విద్యలో అసంబద్ధ విధానాలను వెంటనే సరిచేయాలని కోరుతూ ఈ నెల 14న విజయవాడ ధర్నా చౌక్లో చేపడుతున్న రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడెమిక్ కన్వీనర్ జేసీ రాజు పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ స్థానిక కార్యాలయంలో సీహెచ్ ప్రవీణ్కుమార్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వానికి ప్రయోగశాలలుగా మారాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అంచెల వారీ పాఠశాలలను నడిపితే ఈ ప్రభుత్వం పోటీగా 9 రకాల పాఠశాలల అమలుకు సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. ఒక్కో పాఠశాలకూ ఒక్కో నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులుండాలనే షరతులున్నాయన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రమేష్, నాగేశ్వరరావు, చిన్నారావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి పార్వతీపురం టౌన్: జిల్లాలో పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశా రు. స్థానిక ఎన్జీవో హోంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ నీటి ప్రాజెక్టులపై ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి ప్రాజెక్టులపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న జంఝావతి, అడారుగెడ్డ, కారిగెడ్డ, వనకబడి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు నిధులు నిల్గానే ఉన్నాయని దుయ్యబట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి అధికారులు రూ.590 కోట్లు ప్రతిపాదించగా ఉద్యోగుల భత్యం కోసం రూ.47 కోట్లు విడుదల చేసిందని ఇది చాలా అన్యాయమని దుయ్యబ ట్టారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడి తిప్పికొట్టాలని అందుకు తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితుల, రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగమే ముందుగా రైతులు సంతకాలు చేసి గ్రామ సచివాలయాల వద్ద మే 21 నుంచి 24 వరకు నిరసనలు తెలియజేసి వినతులు అందిస్తామని, అనంతరం ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, కరణం రవీంద్ర, రైతులు పాల్గొన్నారు. -
హృదయాలను తాకిన నాటికలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణంలో గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు రోజున ప్రదర్శించిన కొత్త పరిమళం, చీకటిపువ్వు, దేవరాగం నాటికలు చక్కటి కథా సారాంశాన్ని అందించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతి,మత,కుల,ప్రాంతాల పేరుతో విధ్వంసాలు రేగుతున్న భూమండలంలో ప్రేమ, అభిమానం, అనురాగం అనువణువునా నింపుకుని మనిషిని మనిషి ప్రేమిస్తే ఈ భూమండలం శాంతివనంగా మారుతుందన్న కథా సందేశంతో కొత్త పరిమళం నాటిక ముగుస్తుంది. అదే విధంగా కరీంనగర్కు చెందిన చైతన్య కళాబారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురైన విలువైన సారాంశాన్ని అందించింది. పరిస్థితులకు ఏ మనిషి అతీతం కాదని, అవసరం ఏర్పడో, అవకాశం లేకనో ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేయడం సహజం. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన వారిని దూరం పెట్టొద్దని, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉందని, ప్రాణం పోయిన తరువాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించాలంటూ తెలియజెప్పే కథాంశంతో చీకటిపువ్వు నాటిక ముగుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన సౌజన్య కళాస్రవంతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన దేవరాగం నాటిక బలమైన బందాన్ని తెలియజెబుతుంది. రక్త సంబంధాలు, పేగు బంధాలు, అనుబంధాల కంటే మనిషి సహజ లక్షణాలు అనేవి వాటన్నింటినీ మించిన బందం పేగుబంధం. ఈ బంధం విచ్ఛిన్నమైతే తల్లిదండ్రులకు వృద్ధాప్యం శాపమవుతుందని, ఈ బంధం బలంగా ఉంటే వృద్ధాప్యమే ఆ తల్లిదండ్రులకు మధురమైన మలి దశలోని బాల్యం అవుతుందని తెలియజెప్పే కథా సారాంశంతో దేవరాగం నాటిక సమాప్తమైంది. -
దేవర మహోత్సవానికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు దేవర మహోత్సవ ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చే అద్భుతమైన అపురూప ఘట్టానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి వనంగుడిలో స్తపన మందిరంలో అమ్మ ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. వేదపండితుల వేదమంత్రోచ్చారణలతో పూజారి బంటుపల్లి వెంకటరావు, భక్తుల చేతుల మీదుగా అమ్మవారిని అప్పటికే ఆలయం బయట పుష్పాలతో సిద్ధం చేసిన ఉత్సవరథంపై ఆశీనులను చేస్తారు. జయజయ ధ్వానాల మధ్య బాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలు, కోలాటం బృందాలు, డముకు వాయిద్యాలతో రైల్వేస్టేషన్ నుంచి గాడీకానా, సీఎంఆర్ జంక్షన్, వైఎస్సార్ సర్కిల్, ఎన్సీఎస్ రోడ్, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో ఘటాలతో అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారికి మనవి చెప్పిన అనంతరం కోటలో కొలువైన కోటశక్తికి పూజలు చేస్తారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో అమ్మవారు సాక్షాత్కరించిన పెద్దచెరువు పశ్చిమభాగానికి ఘటాలతో చేరుకుని మనవి చెప్పి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, ఘటాల్లో పసుపు, కుంకుమలతో పాటు పూజ చేసిన అక్షింతలను తీసుకుని మంగళవారం వేకువజామున 5 గంటలకు చదురుగుడికి చేరుకుంటారు. ఇన్చార్జ్ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అనంతరం ఆలయంలో అమ్మవారికి డప్పువాయిద్యాలు, సన్నాయి మేళంతో పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ అపురూప ఘట్టాలను తనివితీరా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల మహోత్సవం తర్వాత రోజున బుధవారం మళ్లీ అమ్మవారు చదురుగుడి నుంచి వనంగుడికి చేరుకుంటారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని ఆలయ ఈఓ ప్రసాద్ కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఊరేగింపు మంగళవారం నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం -
నీలి కిరణాలతో అంధత్వం
నేత్ర తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యంచికిత్స, నివారణ..కళ్లకు తేమను కలిగించేలా కృత్రిమంగా కన్నీళ్లు తరచుగా వాడడం ● కళ్ల రెప్పలను తరచుగా మూయడం ● దృష్టిలోపాలకు వాడే అద్దాలు బ్లూఫిల్టర్ ఉండేలా చూడడం ● స్క్రీన్ టైం తగ్గించుకోవడం ● 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకెన్లపాటు వీక్షించడం. ● కంప్యూటర్, సెల్ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ను సర్దుబాటు చేసుకోవడం ● కంప్యూటర్, సెల్ఫోన్లో అక్షరాలను పెద్దవిగా చేసుకోవడం. ● సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు డ్రై ఐ గురించి కంటి వైద్యులను సంప్రదించడం● సెల్ఫోన్, కంప్యూటర్ అతిగా వాడకంతో ఇబ్బందులు ● చిన్న వయసులోనే దృష్టిలోపాలు ● పెరుగుతున్న దూరదృష్టి సమస్యలు ● కంటివైద్యుల వద్దకు క్యూకడుతున్న బాధితులు కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు.. ● ప్రతి అరగంటకు ఒకసారి మొబైల్, కంప్యూటర్, లాప్టాప్ నుంచి రెండు మూడు నిమిషాలైనా దృష్టిని మరల్చాలి. ● కంటికి స్క్రీన్ను 25 నుంచి 40 అంగుళాల దూరం ఉంచాలి. ● యాంటీగ్లేర్, యాంటీ రిఫ్లెక్టివ్ అద్దాలను వాడితే కంటికి రక్షణగా ఉంటుంది. ఇవి అధిక కాంతిని కళ్లపై పడకుండా అడ్డుకుంటాయి. ● కళ్ల మంటలు, నీరు కారడం వంటి సమస్యలుంటే కాసేపు మానిటర్లు చూడడం ఆపేయాలి. ● తరచూ చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రించే సమయంలో కళ్లపై కాసేపు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. ● కంటికి కసరత్తులు సైతం అవసరం. ఇందుకోసం కళ్లను కుడిఎడమలకు నిమిషంపాటు తిప్పాలి. రెండు అరచేతులు రుద్దకుని వేడెక్కిన తరువాత కళ్లపై కాసేపు ఉంచి కసరత్తు చేయాలి. -
ఇంటర్లో కొత్తపాఠాలు
● సీబీఎస్ఈ అమలుకు సిద్ధం ● అధ్యాపకులకు శిక్షణ పూర్తి ● విద్యార్థులకు అదనపు ప్రయోజనంవిజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ విద్యాబోధనలో నూతన సంస్కరణలను ప్రభుత్వం ఈ ఏడాది చేపడుతోంది. జూనియర్ కళాశాలల్లో సీబీఎస్ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంబైపీసీ కోర్సును అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ సైతం ఇచ్చారు. మిగిలిన గ్రూపుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం పరీక్షల విధానం, మార్కుల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫాకల్టీ అధ్యాపకులకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు స్పెల్లలో ఇటీవల శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. కోర్సుల నూతన విధానం ఒకే సబ్జెక్టుగా గణితం–ఎ, ఎ, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం కలిపి బయాలజీగా రూపొందించారు. ఇందుకు తగ్గట్లు మార్కుల విభజన చేశారు. పార్ట్–1 సబ్జెక్టు కింద ఆంగ్లమే ఉంటుంది. పార్ట్–2 కింద జాతీయ భాషలతోపాటు మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థి అభీష్టం మేరకు దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పార్ట్–3లో ఎంపీసీ, బైపీసీ సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులుంటాయి. సెకెండ్ లాంగ్వేజీకి సంబంధించి తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులు గణితం, ఎంపీసీలో చేరిన వారు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులుగా బయాలజీని తీసుకోవచ్చు. విద్యార్థులకు అదనపు ప్రయోజనం నూతన విధానంలో భాగంగా ఎంపీసీ తీసుకున్న విద్యార్థి అదనంగా బయాలజీ, బైపీసీ తీసుకున్నవారు గణితం తీసుకునే అవకాశం కల్పించారు. పార్ట్–1, 2, 3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే పరిగణిస్తారు. అదనంగా తీసుకున్న సబ్జెక్టుల మార్కులను ఇందులో కలపరు. కనీసం 35 మార్కులొస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లు. ఉత్తీర్ణులు కాకపోయినా ధ్రువీకరణ పత్రం ఇస్దారు. అదనపు సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో మెడికల్, ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితర కోర్సులు అభ్యసించేందుకు అవకాశం ఉంటుంది. సదరు విద్యార్థి నీట్, ఏపీఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త సిలబస్ ఆధారంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలకు ప్రశ్రపత్రాలు మారుతాయి. ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సిలబస్లో గానీ, పరీక్ష ప్రశ్నపత్రంలో గానీ ఎటువంటి మార్పు ఉండదు.విద్యార్థులకు మంచి అవకాశం ఇంటర్లో ఎంబైపీసీ కోర్సులు విద్యార్థులకు విభిన్న రంగాలలో చదువుకోవడానికి మంచి అవకాశం. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పోటీపడే అవకాశాలు లభిస్తాయి. సీబీఎస్ఈ సిలబస్ పాఠ్యాంశాల మార్పులతో పాటు కొత్తకోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తున్నాయి. విద్యార్ధులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నతవిద్యలో మరిన్ని అవకాశాలు సాధ్యం. శివ్వాల తవిటినాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈఓ) -
అనధికార మద్యం దుకాణాలపై దాడి
● 10 మద్యం బాటిల్స్తో వ్యక్తి అరెస్టు పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపులపై భోగాపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్ ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో చోడమ్మ అగ్రహారానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో 10 మద్యం బాటిల్స్తో అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరూ అనధికారికంగా మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించరాదని, ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎస్సై చంద్రమోహన్ హెచ్సీ రామారావు, కానిస్టేబుల్ మహేష్లు పాల్గొన్నారు. ఎండవేడికి కాలిపోయిన ట్రాక్టర్ ఇంజిన్శృంగవరపుకోట: మండలంలోని పోతనాపల్లి పంచాయతీ పరిధి ఎరుకులపేట హోలీ స్పిరిట్ పాఠశాల సమీపంలో గల ఇటుకల బట్టీ వద్ద ఉంచిన ట్రాక్టర్ ఇంజిన్లో ఎండవేడికి ఒక్కసారిగా మంటలు వచ్చి ఆదివారం కాలిపోయింది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పొట్నూరు శివ తన ట్రాక్టర్ను ఇటుకల బట్టీ వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉంచి పక్కనే సేదతీరాడు. అంతలోనే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలను ఆదుపు చేయడానికి స్థానికులు సాహసించినా నిలువరించ లేకపోయారు. దీంతో ఎస్.కోట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయిందని శివ తెలిపాడు. బైక్ ఢీకొని వ్యక్తి మృతికొత్తవలస: కొత్తవలస–దేవరాపల్లి రోడ్డులో దేవాడ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామానికి చెందిన గాడి తాత (63) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాడి తాత దేవాడ జంక్షన్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై వేగంగా వచ్చి వెనుకనుంచి వచ్చి తాతాను ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన తాతను స్థానికుల సహాయంతో 108 వాహనంలో విశాఖపట్నం తరలించే క్రమంలో పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించగా అప్రటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడుకి భార్య సన్యాసమ్మతో పాటూ ఒక కూతురు ఉంది. ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. . లారీ ఢీకొని యువకుడు..బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామ పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారి26పై లారీ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలం, మక్కువ గ్రామంలోని శ్రీదేవి కాలనీకి చెందిన యువకుడు తుమరాడ జానకీరాం (22) ద్విచక్రవాహనంపై విశాఖపట్నం నుంచి స్వగ్రామం ఆదివారం వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో జానకీ రాం అక్కడిక్కడే మృతిచెందాడు. మృతేదేహాన్ని పంచనామా నిమిత్తం విజయనగరంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
భారత సైన్యానికి క్రీడాభివందనాలు
శృంగవరపుకోట: భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో ఆదివారం బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. భారత దేశ ప్రజల ధన,మాన ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్న మన భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి మద్దతుగా కీడ్రాకారులు ర్యాలీ నిర్వహించారు. శిక్షణ శిబిరం కోచ్, ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టరు పొట్నూరు శ్రీరాములు ఆధ్వర్యంలో కేంబ్రిడ్జి స్కూల్ నుంచి దేవీ బొమ్మ, వన్వే ట్రాఫిక్ పెద్దవీధి, కాపువీధి మీదుగా భారత్ మాతాకి జై అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. -
నానాటిక అభివృద్ధి చెందాలి
కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు మరో ముఖ్యఅతిథి, సినీనటుడు నరసింగరావు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో మంచి సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు జరిగేవని, అలాంటి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు మంచి ఆలోచన చేసి, ఈ సాంస్కృతిక నాటిక కార్యక్రమాన్ని తలపెట్టిన కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. గరివిడి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపి, అధ్యక్షుడు రవిరాజ్, ఉపాధ్యక్షుడు బమ్మిడి కార్తీక్, ప్రధాన కార్యదర్శి కంబాల శివ, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో అతిథులుగా జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్ రవితేజ, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో పాటు పలువురు మండలస్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● దేశం నలుమూలలా గరివిడికి పేరు ప్రఖ్యాతులు ● సినీనటుడు ఆర్.నారాయణమూర్తిచీపురుపల్లిరూరల్(గరివిడి): అన్ని రంగాల మాదిరిగానే నాటిక రంగానికి కోటా ఉండాలని, నాటిక రంగం మరింతగా అభివృద్ధి చెందాలని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ఆకాంక్షించారు. ఈ మేరకు గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ రంగస్థలం కళాకారులకు అమ్మఒడి అని, రంగస్థలం పుణ్యస్థలమన్నారు. నాటిక రంగం బతకాలని, నాటిక రంగం ఒక జీవం లాంటిదని అభిప్రాయ పడ్డారు. కళలు బతికుండాలని, కళలతోనే సమాజం ముడిపడి ఉందన్నారు. గరివిడి ప్రాంతంలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవం కార్యక్రమంలో ప్రథమంగా కీర్తిశేషులు దుర్గాప్రసాద్ షరాఫ్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాసంస్థలతో పాటు ఉక్కు కర్మాగారాలు నెలకొల్పి భారతదేశంలోనే గరివిడికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని కొనియాడారు. గరివిడికి మంచి ఎదుగుదల 1975లో దుర్గాప్రసాద్ షరాఫ్ హయాంలో నాటి సాంస్కృతిక కార్యక్రమాలను 29 ఏళ్ల తరువాత నేడు గరివిడిలో మరోసారి సాంస్కృతిక పునరుజ్జీవం చేస్తామని నడుం బిగించి కార్యక్రమానికి నాంది పలికిన గరివిడి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సాంస్కృతిక నాటిక పోటీలు గరివిడి ప్రాంతాన్ని మంచి ఎదుగుదలకు తీసుకువెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గరివిడి పట్టణానికి చెందిన గరివిడి లక్ష్మి (బుర్రకథ) ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఘంటసాల, సుశీలమ్మ ఇలా ఎంతో మంది కళాకారులను కళామతల్లికి అందించిన విజయనగరం కళల కాణాచి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినిమాలో సాంగ్ పాడి సందడి చేశారు. -
బళ్ల కృష్ణాపురం కేసు దర్యాప్తు వేగవంతం
సీతానగరం: మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బొత్స రమణమ్మ కేసుపై వచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని పార్వతీపురం సీఐ గోవిందరావు అన్నారు. మండలంలో ఆదివారం రాత్రి బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన బొత్స రమణమ్మ(78)ను ఆమె ఇంట్లోని బీరువాలో నగదు, బంగారం చోరీ చేయడానికి హత్యచేసి ఉంటారని అనుమానం ఉందని కుమార్తె లక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన సీఐ ఎస్.గోవిందరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు నేరానికి పాల్పడిన వారిని గుర్తించడానికి ఇన్చార్జి ఎస్సై నీలకంఠం, బలిజిపేట ఎస్సై సింహాచలంతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని.ఇప్పటికే క్లూస్ టీమ్ సహకారంతో నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విద్యారంగంలో తీవ్ర సంక్షోభం
● ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమం ● కూటమి ప్రభుత్వంలో పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం ● జిల్లా కేంద్రంలో ఏపీటీఎఫ్ నిరసనపార్వతీపురంటౌన్: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక ప్రయోగశాలగా మారిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విఫల ప్రయోగాలు చేపడుతోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అశాసీ్త్రయమైన తొమ్మిది రకాల పాఠశాలలను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తున్నామని ఏపీటీఎఫ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో కూడిన మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 55ప్రకారం ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆ తరువాత ప్రతి 35 మందికి ఒక్కొక్కరు చొప్పున పాఠశాల సహాయకులను నియమించాలని, పూర్వ ప్రాథమిక విద్యాకేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా కొనసాగించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలు గత పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, నూతన పే రివిజన్ కమిటీని నియమించి కనీసం 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ధర్నా శిబిరంలో వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లా సబ్ కమిటీ సభ్యులు, జిల్లా కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు
శృంగవరపుకోట: మండలంలోని చామలాపల్లి గ్రామంలో సంచలనం రేకెత్తించిన హత్య కేసులో నిందితుడిని ఎస్.కోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చామలాపల్లిలో ఈనెల 7వ తేదీ సాయంత్రం నడుపూరు మురళి అనే వ్యక్తి గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్పై దాడి చేసి తల నరికేసి హత్యకు వినియోగించిన కత్తి పట్టుకుని పరారయ్యాడన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా బైక్పై విశాఖపట్నం వెళ్తున్నట్టు అందిన సమాచారంతో పోతనాపల్లి వద్ద అదుపులోకి తీసుకుని, హత్యాయుధాన్ని, బైక్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తన తమ్ముడు ప్రసాద్ను మురళి హత్య చేసినట్లు మృతుడి అన్న బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు మురళి భార్యకు మృతుడు ప్రసాద్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మురళి హత్యకు పాల్పడినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం
విజయనగరం టౌన్: శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ నెల 10, 11 తేదీల్లో ఏలూరులోని మహాలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మంటపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సేవాతత్పరురాలు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం అందజేయనున్నట్లు సంస్ధ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదుగుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన దాడిలో స్వాధీనం చేసుకున్న సారా, ద్విచక్రవాహనాన్ని కురుపాంలోని తన కార్యాలయంలో చూపించారు. సారా అక్రమ అమ్మకాలు నిరోధించే కార్యక్రమంలో భాగంగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ద్విచక్ర వాహనంపై సారాను అక్రమంగా తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి దగ్గర 80 లీటర్ల సారాతో పాటు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురంటౌన్: సెకెండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ఆన్లైన్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఇ.అప్పన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిగ్రీ మార్కుల లిస్ట్, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టెట్ మార్కుల లిస్టు జిరాక్స్, పాస్పోర్ట్ ఫొటోలు 2, దరఖాస్తులతో జత చేయాలని సూచించారు. నల్లబెల్లం పట్టివేతసీతంపేట: మండల కేంద్రంలో ఎస్టీఎఫ్ మొబైల్ టీమ్ మురళీధర్, ఎస్సై హనుమాన్నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సీతంపేటలో సారాకు వినియోగిస్తున్న నల్లం బెల్లాన్ని పట్టుకున్నారు. స్థానికంగా ఓ గోదాంలో నిల్వ ఉంచిన వందకు పైగా బెల్లం చక్కీలను సీజ్ చేసినట్లు సమాచారం. బెల్లం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జ్వరంతో బాలుడి మృతిసీతంపేట: మండలంలోని నాయకమ్మగూడ గ్రామానికి చెందిన ఆరిక మోహిత్ (7) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడికి మందులు వాడినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు దోనుబాయి పీహెచ్సీకి గురువారం తీసుకువెళ్లారు.అక్కడ వైద్యసేవలందించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారి భానుప్రతాప్ స్థానిక ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేయగా ఇక్కడికి తీసుకువచ్చేసరికే మృతిచెందినట్లు సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి
ప్రాథమిక పాఠశాలలైన 1–5 తరగతుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగానే కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలి. గ్రామాల్లో అదనంగా ఫౌండేషన్ పాఠశాలల పేరుతో 1,2తరగతుల కోసం ప్రత్యేక బడిని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన ధోరణి. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాలను పూర్తిగా ఏపీటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాం. – ఎన్. బాలకృష్ణ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పుస్తక హుండీకి విశేష స్పందన
విజయనగరం టౌన్: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తక హుండీ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంఘం వ్యవస్ధాపకుడు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షుడు కె.దయానంద్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో ఉన్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమను సంప్రదించగా ఆయన ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామ న్నారు. పుస్తక హుండీ నిరంతర ప్రక్రియ అని, ఇలా సేకరించిన పుస్తకాలను వివిధ గ్రంథాలయాలు, విద్యార్థులకు అందజేస్త్నునామన్నారు. సెల్ ప్రభావంతో అన్ని వయసుల వారు పుస్తక పఠనానికి దూరమవుతున్న నేపథ్యంలో మళ్లీ పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించి గ్రంథాలయాలవైపు నడిపించేలా సంఘం నిరంతరం కృషిచేస్తుందని చెప్పారు. -
పెరుమాళి పీఏసీఎస్లో దర్యాప్తు
తెర్లాం: పెరుమాళి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)పై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించామని, నివేదికను జిల్లా కలెక్టర్కు, తమ శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్ వెల్లడించారు. పెరుమాళి పీఏసీఎస్లో పలు అంశాలలో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కొద్ది రోజుల క్రితం బొబ్బిలి సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి, పెరుమాళి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ పద్మజ దర్యాప్తు జరిపారు. ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదని శివరామరాజు మళ్లీ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్తో పాటు పలువురు అధికారులు పెరుమాళి పీఏసీఎస్కు వచ్చి బోర్డు సభ్యులు, రైతులు, ఫిర్యాదుదారుని సమక్షంలో దర్యాప్తు జరిపారు. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన ప్రతీ అంశంపై వివరణ ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా పీఏసీఎస్ సీఈవో జీతం ఎందుకు పెంచారని, పెట్రోల్ బంక్లో పలు అవకతవకలు జరుగుతున్నాయని, రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదని, ధాన్యం కొనుగోలు సమయంలో హమాలీలకు చార్జీలు ఇవ్వడం లేదని, రుణాలు మంజూరు చేసినప్పుడు కమీషన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ పీఏసీఎస్లో రైతులకు ఎటువంటి సమస్యలు లేవని, రుణాలు సక్రమంగానే ఇస్తున్నారని, సీఈవో బాగానే పని చేస్తున్నారని దర్యాప్తులో తెలిపారు. అలాగే మరికొంత మంది సభ్యులు మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్లో క్షత్రియులకు తప్ప మిగిలిన కులాలకు ఎటువంటి పోస్టులు ఇవ్వడం లేదని వారంతా ఆరోపించారు. ఫిర్యాదుదారుడు, బోర్డు సభ్యులు తెలిపిన అంశాలన్నింటిపై సమగ్రంగా నివేదికను తయారు చేసి తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఈ సందర్భంగా డీసీవో తెలిపారు. దర్యాప్తులో డీఆర్ రమణమూర్తి, అకౌంట్స్ అధికారులు పద్మ, పి.పద్మ, పెరుమాళి పీఏసీఎస్ సీఈవో రమాదేవి, సూపర్వైజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలపై జిల్లా కో ఆపరేటివ్ అధికారుల విచారణ జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తాం.. జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్ -
సంస్కృతీ, సంప్రదాయాలు చాటిచెప్పేలా తీర్థాలు ..
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు లక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తలారి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సత్యవమ్మ పేరంటాల అమ్మవారి తీర్థం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇటువంటి తీర్థాలు సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు మన సాంప్రదాయ క్రీడలను గుర్తుకు తెస్తున్నాయని కొనియాడారు. ముందుగా జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి కోలాటం పోటీలు నిర్వహించి మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి గుర్రాలు, ఎడ్లు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 20 గుర్రాలు, 12 జతల ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. విజేతలకు జెడ్పీ చైర్మన్ నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు రిఫరీగా డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు వ్యవహరించారు. వేల మందికి అన్న సమారాధాన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శ్రీనురాజు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు వాకాడ రాంబాబు, గుమ్మడి స్వాతికుమారి పాల్గొన్నారు. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అందరి సమన్వయంతోనే అభివృద్ధి ● మున్సిపల్ ఆర్డీ రవీంద్ర విజయనగరం గంటస్తంభం: అన్ని శాఖల సమన్వయంతో నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందే దిశగా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ వి.రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. విభాగాల వారీగా ప్రగతి నివేదికలను పరిశీలించి, వాటి ఆధారంగా పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అంతకు ముందు నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వసతిగృహాల తనిఖీ విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ విజయనగరంలో ఉన్న కొన్ని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను శుక్రవారం తనిఖీ చేశారు. విజయనగరం కొత్తపేటలోని సోషల్ వెల్ఫేర్ బాలుర వసతిగృహం, విద్యుత్ స్టేడియం దగ్గర్లో ఉన్న బాలుర వసతిగృహం, నెల్లిమర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. వంట, భోజన శాలలను, మరుగుదొడ్లు, స్టోర్ రూములను పరిశీలించారు. వసతిగృహాల సీలింగ్, ప్రహరీల విషయమై సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నారు. వంట గదులు, భోజన శాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని హోమ్ నిర్వాహకులకు, ఆయాలకు వంట వారికి హితవు పలికారు. వసతిగృహాల రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు. జిల్లాలో ఉన్న అన్ని చిల్డ్రన్ హోమ్స్, ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాలను సందర్శించి వాటి నివేదికలను రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థకు పంపుతామని తెలిపారు. తివ్వా కొండల్లో ఏనుగులు భామిని: మండల సరిహద్దులోని తివ్వా కొండల్లోకి ఏనుగులు శుక్రవారం వెళ్లాయి. మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు నాలుగు ఏనుగులు తాటిమానుగూడ – ఇప్పమానుగూడ మీదుగా కొండల పైకి చేరుకున్నాయి. వర్షాకాలంలో బురద ప్రాంతాల్లో ఏనుగులు ఉండలేవని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. కురుపాం – గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దులోని చీడిగూడ నుంచి తిత్తిరి వైపు వెళ్లిన ఏనుగులు తాజాగా తివ్వా కొండల్లోకి చేరుకున్నాయి. -
ఐసీడీఎస్లో షటిల్ సర్వీసెస్..!
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ శాఖలో పని చేస్తున్న కొందరు జిల్లా కేంద్రం, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడం వల్ల కేంద్రాలపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను గాడిలో పెట్టాల్సిన అధికారులే దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడం వల్ల అంగన్వాడీలు కూడా సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ శాఖలో అధికారుల నుంచి అంగన్వాడీ కార్యకర్తల వరకు చాలా మంది స్థానికంగా ఉండడం లేదనే విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు కాగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2206 కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 5,889 మంది ఉన్నారు. అదే విధంగా 7 నెలలు నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 39, 976 మంది ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు 27,918 మంది ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసేటప్పుడే స్థానిక నివాసిత అయి ఉండాలనే నిబంధన ఉంటుంది. అలా నియమించబడిన అంగన్వాడీ కార్యకర్తలు సైతం స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి. అయితే కొంతమంది జిల్లా కేంద్రం, మండల కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రాకపోకలు సాగించడం వల్ల వారి పరిధిలో ఉన్న పిల్లలకు, గర్బిణులకు, బాలింతలకు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో.. సకాలంలో అందడం లేదనే చర్చ జరుగుతోంది. కొరవడుతున్న పర్యవేక్షణ విశాఖపట్నం, జిల్లా కేంద్రం నుంచి పలువురు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టులకు సీడీపీవోలు, సూపర్వైజర్లు రాకపోకలు సాగిస్తున్నట్టు విమర్శలున్నాయి. దీని వల్ల వారు అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి విధి నిర్వహణలో రాకపోకలకే ఎక్కువ సమయం పడుతుంది. సీడీపీవోలు, సూపర్వైజర్లు వారి పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి. సమయ పాలన నుంచి పౌష్టికాహారం పంపిణీ వరకు ప్రతీది పర్యవేక్షించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. కానీ ఆ పరిస్థితులు చాలా చోట్ల లేవు. ఆన్లైన్ నమోదులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని కార్యకర్తలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. కానీ చాలా మంది సమయం దాటి పోయిన తరువాత వస్తుండడంతో విధి నిర్వహణలో ఉరుకులు, పరుగులు పెడితే సరిపోతుందన్న విమర్శలు లేకపోలేదు. మరెక్కడ సేవలు అందిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్రాలు గాడి తప్పుతున్నాయని చాలా చోట్ల వినిపిస్తోంది. పది కిలోమీటర్ల దూరం వరకు ఓకే... ఐసీడీఎస్ శాఖలో పని చేసే వారు వారు పని చేసే ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరం వరకు ఉన్నా పరవాలేదు. అంతకు మించి దూరం నుంచి రాకపోకలు చేసేందుకు వీల్లేదు. అంగన్వాడీ కార్యకర్తలైతే వారు పని చేసే గ్రామాల్లోనే తప్పనిసరిగా ఉండాలి. అందరూ స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. – రుక్సానా సుల్తానా బేగం, పీడీ, ఐసీడీఎస్ జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. బొబ్బిలి, బాడంగి, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ, ఎస్.కోట, వియ్యంపేట, గరివిడి, చీపురుపల్లి, రాజాం, భోగాపురం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 11 మంది సీడీపీవోలు, ఒక ఏసీడీపీవో ఉన్నారు. అదే విధంగా 71 మంది సూపర్వైజర్లు ఉన్నారు. 2499 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 2499 మంది ఆయాలు ఉన్నారు. స్థానికంగా ఉండని అధికారులు, కార్యకర్తలు జిల్లా కేంద్రం, విశాఖ నుంచి రాకపోకలు జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు 2,499 అంగన్వాడీ కేంద్రాలు స్థానికంగా లేకపోవడంతో పర్యవేక్షణ కరువు -
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు..
ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా.. పత్రికా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలకు భంగం కలగకుండా చూడాల్సిందే.. వ్యవస్థ గాడి తప్పుతున్నప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా.. మాట్లాడే పరిస్థితి రాజకీయాల్లో పెరిగిపోయింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి పెను ప్రమాదం. పోలీసులు, అధికారులు, నాయకులు తమ పరిధి దాటకుండా ఉండాలి. – భీశెట్టి బాబ్జీ , పౌరవేదిక జిల్లా అధ్యక్షుడు దాడిని ఖండిస్తున్నాం.. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. వాస్తవాలు ప్రజలకు చేరవేయడమే నేరంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని తెలుసుకోలేకపోతోంది. – బుగత అశోక్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి. విజయనగరం: ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటి మీద దాడి చేయడం.. ప్రజాస్వామ్యంపైన, పత్రికా స్వేచ్ఛపైన దాడి చేయడమేనని... ఇది మంచి పరిణామం కాదని పలువురు ఖండించారు. ఈ దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ లోపాలను, తప్పులను ఎత్తిచూపడం మీడియా విధి అని.. అభ్యంతరాలుంటే ఖండించాలే తప్ప ఇటువంటి సంస్కృతి మంచిది కాదని ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించిన వారి మాటల్లోనే.... పిరికి పంద చర్య రెడ్ బుక్ పాలనలో పత్రికా స్వేచ్ఛ ఖూనీ అవుతుంది. సాక్షి దినపత్రిక ఎడిటర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే పత్రికలు, మీడియాపైన దాడులు చేయడం పిరికి పంద చర్య. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా పత్రికా విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. – రెడ్డి శంకరరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాల్సిందే.. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క సాక్షినే కాదు.. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్య వాదులంతా, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా ఖండించాలి. – ఎం.కృష్ణమూర్తి, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
వేతనదారులకు నీడ కరువు..!
ఈ చిత్రంలో మృతుడి పేరు గేదెల రామారావు. ఈయనిది గంట్యాడ మండలం నరవ గ్రామం. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పోవడంతో తోటి వేతనదారులు చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే రామారావు మృత్యువాత పడ్డాడు. పనిముట్ల సరఫరా లేదు... ఉపాధి వేతనదారులకు గునపాలు, పారలు, టెంట్లు గత కొన్నేళ్లుగా సరఫరా కావడం లేదు. వేతనదారులే వారికి కావాల్సిన గునపాలు, పారలు సమకూర్చుకోవాలి. తాటి ఆకు పందిళ్లను వేసుకోవాలని చెప్పాం. మంచి నీళ్లు కూడా వేతనదారులు తెచ్చుకోవాలి. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న జిల్లాలోని లక్షలాది మంది వేతనదారులు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. పనులు చేసే చోట సరైన నీడ సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో పని చేసేందుకు అవసరమైన పనిముట్లు గునపాం, పార వంటివి కూడా వేతనదారులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో పనిముట్లు అందించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాగడానికి మంచినీళ్లు కూడా వేతనదారులే తెచ్చుకోవాల్సిన దుస్థితి. గతంలో వేతనదారులకు ఏదైనా గాయం అయితే ప్రధమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్టు పని చేసే ప్రదేశంలో ఉండేది. అది కూడా ప్రస్తుతం లేకుండా పోయింది. ఇలా గతానికి భిన్నంగా పని ప్రదేశంలో వేతనదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో జాబ్ కార్డులు 3.85 లక్షలు జిల్లాలో 3.85 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ జాబ్ కార్డులు 3.53 లక్షలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.08 లక్షల వేతనదారులు ఉన్నారు. వీరిలో యాక్టివ్ వేతనదారులు 5.95 లక్షలు ఉన్నారు. వీరు ఉపాధి పనులకు వెళ్తారు. ప్రతీ గ్రూపునకు ఒక టెంట్ ఉండాలి ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 8 వేల వరకు గ్రూపులు ఉన్నాయి. ప్రతీ గ్రూపునకు ఒక టెంట్ ఉండాలి. ప్రభుత్వం వీటిని సరఫరా చేయలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాటి ఆకులతో పందిరి వేస్తున్నారు. కొన్ని చోట్ల అవి కూడా వేయడం లేదు. దీని వల్ల పని చేసి అలసటగా ఉన్న వేతనదారులకు సేద దీరడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో వేతనదారులు ఇబ్బంది పడుతున్నారు. పనిముట్లు కూడా కరువే.. వేతనదారులు పని చేయడానికి అవసరమైన పనిముట్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం మానేసింది. దీంతో ఉపాధి పని చేయడానికి అవసరమైన గునపాం, పారలు కూడా వేతనదారులే పనికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ప్రతీ 10 మంది వేతనదారులకు 3 గునపాలు, 3 పారలు, నాలుగు తట్టలు ఉండాలి. వీటి సరఫరా నిలిచిపోవడంతో వేతనదారులు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లూ కరువే.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే సమయంలో వేతనదారుల్లో ఎవరికై నా గాయం అయితే ప్రధమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్టు అందుబాటులో ఉండేది. అయోడిన్, కాటన్, బాండేజ్, పారాసిటమాల్, డైక్లోఫినక్, ఎమాక్సిలిన్, కత్తెర తదితర మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్టు పనిచేసే చోట అందుబాటులో ఉండాలి. అయితే వాటి సరఫరా కూడా ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీంతో ఏదైనా గాయం అయితే గ్రామంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.ఓఆర్ఎస్ ద్రావణంపై అవగాహన తక్కువే.. ఎండలో పని చేయడం వల్ల వేతనదారులు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుంది. పని చేసే చోట ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో లేవు. అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్న చోట కూడా చాలా మందికి అవగాహన లేక వాటిని వినియోగించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారం రోజుల కిందట వేతనదారు మృతి పనిముట్లు కూడా కరువే.. గునపాలు, పారలు వేతనదారులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఫస్ట్ ఎయిడ్ కిట్లు కరువే.. అవస్థలు పడుతున్న వేతనదారులు జిల్లాలో జాబ్ కార్డులు 3.53 లక్షలు జిల్లాలో వేతనదారులు 5.95 లక్షలు -
పాత తలుపునకు కొత్త రాడ్డు
సంతకవిటి మండలం రంగారాయపురం వద్ద నారాయణపురం ఆనకట్టలో జరుగుతున్న స్కవర్వెండ్స్ మార్పిడి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. నదిలోకి నీటిని మళ్లించేందుకు నాలుగు స్కవర్ వెండ్స్ను తొలగించి కొత్తవి అమర్చాలి. ఒక స్కవర్ స్లూయీస్ తలుపును తొలగించకుండా పాతదానికే కొత్త స్క్రూ రాడ్డును బిగించారు. దీనిపై రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. డబ్బులు మిగుల్చుకునే పనులు చేయొద్దని, పాత తలుపును తొలగించి కొత్త తలుపును అమర్చాలని కోరుతున్నారు. – సంతకవిటి -
జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలను అమలు చేయాలి
విజయనగరం ఫోర్ట్: జల్జీవన్ మిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. జాతీయ జల్జీవన్ మిషన్ సభ్యుల సూచనల మేరకు కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ జేజేఎం అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్లు జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. కవిత పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ -
హైరిస్క్ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి
సీతంపేట: హైరిస్క్ మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక ఐటీడీఏలోని సీతంపేట, కుశిమి, దోనుబాయి, మర్రిపాడు, బత్తిలి, భామిని తదితర పీహెచ్సీ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వరం, ఇతర వ్యాదులు ఉన్న వారికి వెంటనే తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఐఆర్ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని స్ప్రేయింగ్ చేయాలని చెప్పారు. ఫాగింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలని కోరారు. దోమకాటు వ్యాధులపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏసీటీ, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి యాంటీ మలేరియా మందులు సమృద్ధిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి కె.విజయపార్వతి, డీఎంవో సత్యనారాయణ, సబ్యూనిట్ ఆఫీసర్ మోహన్రావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో భాస్కరరావు -
ఒక్క సిలిండర్తో సరి..!
విజయనగరం ఫోర్ట్: అధికారం కోసం కూటమి సర్కార్ అనేక హామీలను ప్రజలకు ఇచ్చింది. అలవికాని హామీలు అయినప్పటికీ ప్రజలను బాగా నమ్మించింది. అందులో మహిళలను ప్రభావితం చేసింది ఉచిత గ్యాస్ పథకం. ప్రతి ఏడాదీ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఊరూరా గొప్పగా ప్రచారం చేశారు. కానీ ఇప్పడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2024–25లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో చెప్పిన విధంగా 2024–25 సంవత్సరంలోనే మూడు సిలిండర్లు ఇవ్వాలి. కానీ 2024–25 మార్చి నెల లోపు ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి సరిపెట్టేశారు. అంటే ఒక ఏడాదిలో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు గాను రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇది కోట్లాది రుపాయల భారం తగ్గించుకునే ఎత్తుగడ అనే విమర్శలు సర్వత్రా వినినిస్తున్నాయి. గుర్తించిన లబ్ధిదారులు 5.02 లక్షలమంది జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 7 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్కోసం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందులో 2024–25 సంవత్సరానికి సంబంధించి 4,46,846 మంది గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు. 55,808 మంది గ్యాస్ బుక్ చేసుకోలేదు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు: జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 7,04,273 ఉన్నాయి. అందులో జనరల్ గ్యాస్ కనెక్షన్లు 3,46,455. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 1,29,277, సీఎస్ఆర్ కనెక్షన్లు 34,287 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,254 ఉన్నాయి. ఉచిత గ్యాస్పై కొత్త భాష్యం ఉచిత గ్యాస్పై ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ఏడాదికి మూడు సిలిండర్లపై ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉంటున్నాయి. 2024–25 లో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు ఆ ఏడాదిలో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. కానీ నవంబర్ 2024 నుంచి నవంబర్ 2025 లోగా మూడు సిలిండర్లు ఇస్తామని కూటమి సర్కార్ చెబుతుంది. ఇలా అయితే 2024వ సంవత్సరానికి సంబంధించి రెండు సిలిండర్లు ఎగనామం పెట్టినట్లేననే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల్లో కోత వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలనే చూస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి మూడు ఇస్తామని ఎన్నికల్లో హామీ జిల్లాలో ఉచిత గ్యాస్ లబ్ధిదారులు 5,02,654 మంది మొదటి విడత వినియోగించుకున్న వారు 4,43,334 మంది మూడు సిలిండర్లుగా పరిగణన 2024–25 నవంబర్ నుంచి 2025–26 నవంబర్ నాటికి మూడు సిలిండర్లుగా పరిగణిస్తున్నాం. 2024–25 నవంబర్ నుంచి మార్చి 2025 నాటికి ఒక సిలిండర్ అందజేశాం. కె.మధుసూదన రావు,జిల్లా పౌరసరఫరాల అధికారి -
ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష
● తీర్పునిచ్చిన విజయనగరం మహిళా కోర్టు విజయనగరం క్రైమ్: నాలుగేళ్ల క్రితం జిల్లాలోని బొబ్బిలి పీఎస్ పరిధిలో నమోదైన కేసులో విచారణ అనంతరం ముద్దాయికి విజయనగరం మహిళా కోర్టు పదేళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధించినట్టు ఎస్పీ వకుల్ జిందల్ గురువారం వెల్లడించారు. ఆ కేసుకు సబంధించి ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలంలోని సీతయ్య పేటకు చెందిన దివనాపు అఖిల్ అంబేడ్కర్(29) పాచిపెంటకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఆమెకు దగ్గరై వాంఛలు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడగ్గా నిరాకరించడంతో 2022లో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి సీఐ నాగేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం మహిళ కోర్టు ఐదవ ఏడీజే పద్మావతి ముద్దాయికి శిక్ష విధించారని ఎస్పీ చెప్పారు. ఏపీజీఈఏ ఉపాధ్యక్షుడిగా కిరణ్కుమార్విజయనగరం ఫోర్ట్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా ఉపాధ్యక్షుడిగా ట్రెజరీ శాఖ నుంచి పీఎస్. కిరణ్కుమార్, జిల్లా జాయింట్ సెక్రటరీగా ముదిలి ఆదినారాయణలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర కార్యదర్శి ఎల్వి. యుగంధర్, పట్టణ జాయింట్ సెక్రటరీ పి. సురేష్బాబు, గజపతినగరం తాలుకా అధ్యక్షుడు బి.సింహాచలం, ఉప ఖజనా అధికారులు ఐ.రమేష్, సురేష్, శతపతిలు అభినందనలు తెలియజేశారు. అతి ఉత్కష్ట సేవా పతకం● కమ్యూనికేషన్ వింగ్ ఇన్స్పెక్టర్కు ప్రదానం విజయనగనరం క్రైమ్: పోలీస్శాఖలో కమ్యూనికేషన్ వింగ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన పివీ.రమణమూర్తికి అతి ఉత్కష్ట సేవా పతకాన్ని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం అందజేశారు. పోలీస్ఽశాఖలో సుదీర్ఘంగా ,క్రమశిక్షణతో, సంతృప్తికరంగా, నిస్వార్ధంగా విధులు నిర్వహించిన సిబ్బందికి కేంద్రప్రభుత్వం అతి ఉత్కష్ట సేవా పతకం అందిస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. శాఖలో కమ్యూనికేషన్ వింగ్లో నిస్వార్ధంగా 38ఏళ్లు పని చేసిన రమణమూర్తి ఎంతో నిజాయితీగా క్రమశిక్షణగా విధులు నిర్వహించారని ఎస్పీ ఈ సందర్భంగా అన్నారు. అప్పట్లోనే ఇన్స్పెక్టర్ రమణమూర్తి సేవలను గుర్తించి పథకం జాబితాకు పేరు పంపారని ఎస్పీ గుర్తుచేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ యాదవ్, పీవీ రమణమూర్తి, కిరణ్మయి పాల్గొన్నారు. గంజాయి కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్రామభద్రపురం: గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఒడిశా నుంచి మధ్యప్రదేశ్కు అక్రమంగా గంజాయి రవాణాచేస్తున్న నిందితుల్లో నాలుగో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ కె నారాయణరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు, మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా అప్పట్లో ఒడిశా నుంచి మధ్యప్రదేశ్కు అక్రమంగా రవాణాచేస్తున్న 830 కిలోల గంజాయి, లారీ, మహీంద్రా వ్యాన్, బొలెరో, కారుతో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారన్నారు. ఆ ముగ్గురిని విచారణ చేయగా ఈ అక్రమ రవాణాలో 9 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. తొమ్మిది మందిలో నాలుగో వ్యక్తి ఎ–6 నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ పోండాయ గ్రామానికి చెందిన దిలీప్ దసర్ బారక్ స్థానిక బైపాస్ రోడ్డులో సంచరిస్తుండగా గురువారం పట్టుపడ్డాడన్నారు. దీంతో నిందితుడిని సాలూరు కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. -
పట్టుబడిన ట్రాన్స్ఫార్మర్ల దొంగలు
● ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు ● సుమారు రూ.5లక్షల సొత్తు స్వాధీనంలక్కవరపుకోట: ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాలతో పాటు విజయనగరం రూరల్ పరిధిలో గల పలు గ్రామాల్లో గడిచిన మూడు నెలల నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు (16 కేవీ సామర్థ్యం) చోరీకి గురవుతున్న అంశం పోలీసులకు సవాల్గా మారింది.దీంతో పోలీసులు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ దొంగలు వేపాడ మండలంలోని అరకు–విశాఖ రోడ్డులో పాటూరు జంక్షన్ వద్ద ఆటోలో చోరీ సొత్తును తరలిస్తుండగా గురువారం పట్టుబడ్డారు. ఈ విషయమై సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను, చోరీ సొత్తును విలేకరల సమావేశంలో ప్రదర్శించారు. ఈ కేసులకు సంబంధించి సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల మేరకు గడిచిన మూడు నెలల వ్యవధిలో ఎస్.కోట రూరల్, సర్కిల్ పరిధిలో వేపాడ మండలంలో–2, లక్కవరపుకోట మండలంలో–3, జామి మండలంలో–4, కొత్తవలస మండలంలో –2, విజయనగరం రూరల్ పరిధిలో ఒకటి మొత్తంగా 15 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి, ఈ మేరకు అప్పట్లో కేసులు నమోదు చేయగా దర్యాప్తు చేయగా వేపాడ మండలం పాటూరు గ్రామానికి చెందిన రుద్ర బంగారునాయుడు, కర్రి యుగేంద్ర, షేక్ సలీం, ముమ్మన ఆదిత్య, బొద్దాం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీద్లతో పాటు పాటూరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసిందన్నారు. ముందస్తు సమాచారంతో మాటు వేసి.. ముఠా సభ్యులు చోరీ చేసిన సొత్తును విశాఖపట్నంలో అమ్మేందుకు ఆటోలో తరలించేందుకు పాటూరు జంక్షన్లో సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వేపాడ, ఎల్.కోట ఎస్సైలు సుదర్శన్, నవీన్పడాల్లు తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం విచారణలో నిందితులు నేరం అంగీకరించడంతో వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్లలో గల కాపర్ వైర్లు, బ్యాటరీలు, సబ్మెర్సిబుల్ మోటార్లు, అల్యూమిలియం విద్యుత్ తీగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్.కోట, వేపాడ, జామి ఎస్సైలు నవీన్పడాల్, సుదర్శన్, వీరజనార్దన్, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
మద్యం దుకాణంలో చోరీ నిందితుల ఆరెస్టు
కొత్తవలస: మండలంలోని రాజా సినిమాహాల్ సమీపంలో గల 202 కాలనీ వద్ద ఉన్న మద్యం దుకాణంలో గత నెల 28వ తేదీన దొంగలు చొరబ డి తాళాలు విరగ్గొట్టి 240 మద్యం సీసాలను ఎత్తు కు పోయారు. కాగా అప్పట్లో సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్ర మంలో కొత్తవలస ఆర్చి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 202 కాలనీకి చెందిన ఇద్దరు పాత నేరస్తులను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు.ఈ మేరకు పి.యోహాను, పి.దర్శన్బాబు, పి.యేసులుగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం యేసు పరారీలో ఉన్నాడని మిగిలిన ఇద్దరు నిందితుల దగ్గర కొన్ని మద్యం సీసీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం కొత్తవలస కోర్టులో నిందితులను హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు. కార్యక్రమంలో ఎస్సై మన్మథరావు, ఏఎస్సై యువరాజు, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
అన్నా క్యాంటీన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి
● బీజేపీ, జనసేన నాయకుల డిమాండ్ నెల్లిమర్ల: నెల్లిమర్లలోని అన్నా క్యాంటీన్ సిబ్బంది నిర్వాకం వల్ల పేదలకు అందాల్సిన ఆహార పదార్థాలు పక్కదారి పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చింనాయుడు, జనసేన నాయకుడు మజ్జి రాంబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నడిపేన నారాయణమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లిమర్లలోని అన్నాక్యాంటీన్లో టిఫిన్, భోజనం పేదలకు అందకుండా పక్కదారి పడుతోందని విమర్శించారు. అన్నా క్యాంటీన్లో పార్శిల్ కట్టే నిబంధన లేకున్నా సిబ్బంది కొంతమందికి పార్శిల్ చేస్తున్నారని, దీంతో పేదలకు ఆహారం అందడం లేదన్నారు. ఉదయం టిఫిన్ 9 గంటలకు వరకూ ఉండాల్సి ఉన్నా పార్శిల్స్ కట్టడం వల్ల 7.30 గంటలకే పూర్తవుతోందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహార పదార్థాలు అందేవిధంగా చూడాలని కోరారు. సాక్షిపై అక్కసు తగదు నెల్లిమర్ల రూరల్: వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్న సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం అ క్కసు పెంచుకోవడం తగదని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం సరికాదన్నారు. ప్రజా స మస్యలను నిత్యం వెలుగులోకి తెస్తున్న పత్రికల పై, సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతోందన్నారు. ఇటీవల ఏలూరులో కూడా సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్నారు. పత్రికా స్వేచ్ఛ కు భంగం కలిగించరాదని హితవు పలికారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: భార్య తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మానసిక అవేదన చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్ల మండలంలోని వల్లాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. గుర్ల మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన రుంకాన రాంబాబు (29)కు రెండు నెలల క్రితం అదే మండలంలోని కెల్ల గ్రామానికి చెందిన వాణిశ్రీతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో రాంబాబు మానసికంగా అవేదన చెందుతుండేవాడేని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య వాణిశ్రీని తీసుకువెళ్లడానికి కెల్ల బయలుదేరిన రాంబాబు జమ్ముపేట రైల్వేట్రాక్పై గుర్తు తెలియని రైలు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో యువకుడు.. బలిజిపేట: మండలంలోని గౌరీపురం సమీపతోటలో కె.ఫణీంద్ర (27) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి తమ్ముడు సిద్ధార్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సింహాచలం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన కె.ఫణీంద్రకు వ్యక్తిగతంగా ఉన్న అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న ఆటో: ఒకరికి గాయాలు
రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి జంక్షన్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒమ్మి గ్రామానికి చెందిన పడాల సూర్యవంశీ గాయాలపాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఒమ్మి గ్రామం నుంచి శ్రీకాకుళం ఆటోలో మామిడిపళ్లు తీసుకువెళ్తున్నారు. బొబ్బిలి జంక్షన్కు వచ్చేసరికి డివైడర్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సూర్యవంశీ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం అందించగా హుటాహుటిన వచ్చి క్షతగాత్రుడికి ఈఎంటీ ఆలుగుబిల్లి శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్కు గాయాలుమండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని రెండో మైలు రాయి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పొగిరి గ్రామానికి చెందిన పొగిరి గంగారాం తీవ్రగాయాలపాలయ్యాడు. గంగారాం రాజాం నుంచి స్వగ్రామం పొగిరి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పగా రోడ్డుపై పడిపోయాడు. పొగిరి గ్రామానికి చెందిన గంగారాం బొద్దాం పీహెచ్సీ సీనియర్లో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ ఎ.శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం తరలించారు. -
విజయనగరం
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025● ప్రజాసమస్యలపై గొంతెత్తనీయకుండా దాడులు ● పత్రికా స్వేచ్ఛను హరించే యత్నంపై నిరసన ● సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి ఖండన ● నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన విజయనగరం జిల్లా జర్నలిస్టులు ● పోలీసుల దాడులు అరికట్టాలంటూ డీఆర్వోకు వినతిపత్రం అందజేత హైరిస్క్ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్ఓ భాస్కరరావు ఆదేశించారు. పట్టుబడిన ట్రాన్స్ఫార్మర్ల దొంగలు వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి, విజయనగ రం రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. –10లో జర్నలిజంపై దాడి సిగ్గుసిగ్గు బొబ్బిలి: జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేయడం ప్రజాస్వామ్యం గొంతునొక్కడమేనని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు అన్నారు. సెర్చ్వారెంట్ లేకుండా విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డి ఇంటిలోకి చొర బడడం, దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. దీనిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పత్రికపై దాడి సిగ్గుసిగ్గు అంటూ నినదించారు. రెడ్బుక్ రాజ్యాంగంలో ఎడిటర్ స్థాయి వ్యక్తిపై దాడులకు పూను కుంటున్నారంటే సాధారణ విలేకరుల పరిస్థితి ఏమిటన్నారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపకుండా జర్నలిస్టులను భయపెట్టడమే దీని వెనుక ఉన్న అసలు కారణమన్నారు. దాడిని ఖండిస్తూ తహసీల్దార్ ఎం.శ్రీనుకు వినతిపత్రా న్ని అందజేశారు. పాత్రికేయులు, పత్రికా రంగానికి రక్షణ కల్పించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి రేగులవలస వ్యాస్బాబు, జర్నలిస్టు సంఘాల సభ్యులు చుక్క జగన్మోహనరావు, రుంకాన రమేష్, వెలమల తిరుమల, సత్యనారాయణ, వీఎన్ శర్మ, బొద్దాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: ప్రజాస్వామ్య పాలనలో ఫోర్త్ ఎస్టేట్గా పిలవ బడే పత్రికల గొంతు నొక్కడంపై జర్నలిస్టు సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై ప్రభుత్వం ఆక్రోశం వెళ్లగక్కడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి అనుమతులు లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసులు దాడిచేయడం, సోదా లు నిర్వహించడాన్ని తప్పుబట్టాయి. ప్రజాస్వామ్య పాలనలో ఇదొక మాయనిమచ్చని పేర్కొన్నాయి. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా విజయన గరం కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీవిగ్రహం వద్ద సాక్షి మీడియా, ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు... ఉయ్ వాంట్ జస్టిస్... పత్రికా స్వేచ్ఛపై సంకెళ్లు ఖండించాలి... ఖండించాలి... అంటూ ప్లకార్డులు ప్రద ర్శించి నినదించారు. అనంతరం డీఆర్వో శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందేశారు. ఈ సందర్భంగా జర్న లిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తగదన్నారు. ప్రజాసమస్యలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టే జర్నలిస్టులపైన, పత్రికలపైన పోలీసులను దాడులకు పురిగొల్పడం సరికాదని హెచ్చరించారు. బెదిరించే క్రమంలో అక్రమకేసులు బనాయిస్తే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మండల కేంద్రం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిలో పోలీసులు సోదాలు చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఉన్న పత్రికల పట్ల చట్టపరమైన, విధానపరమైన చర్యలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాక్షస నీతితో వ్యవహరించడాన్ని తూర్పారబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా జర్నలిస్టులకు, పత్రికలకు ప్రభుత్వం అండగా నిలవాలని, పోలీసుల దాడులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్, పాత్రికేయులు నరేష్, గౌరీశంకర్, ఎర్నినాయుడు, సత్యనారాయణ, తిరుపతిరావు, అప్పలనాయుడుతో పాటు సంతోష్, కన్నన్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయ కుండా తనిఖీలు నిర్వహించడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 9 సార్లు జర్నలిస్టులపై దాడులు నిర్వహించడం దారుణం. పత్రికా రంగంలో తప్పొప్పులు జరిగితే అనేక రకాలైన మార్గాల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. జర్నలిస్టు సంఘాలతో చర్చలు జరపడం ద్వారా సమస్యను సద్దుమణిగించుకోవచ్చు. అలాకాకుండా పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం సరికాదు. ఎడిటర్ స్థాయి వ్యక్తి ఇంటిపై అనధికారికంగా దాడిచేయడం, ఇంటిలో సోదాలు నిర్వహించడాన్ని తప్పుబడుతున్నాం. ఇటువంటి చర్యలు ఆపకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అధికారులపై ప్రైవేటు కేసు నమోదు చేసేందుకు వెనుకాడం. – పి.వి.శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం -
హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష తగదు
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె. రాణివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష తగదని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం హెచ్ఐవీ, ఎయిడ్స్పై వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటే హెచ్ఐవీ బారిన పడకుండా ఉండవచ్చాన్నారు. హెచ్ఐవీ సోకిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, ఐసీటీసీ సూపర్ వైజర్ సాక్షి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్: హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బి.సుందర్ రావుకు చేయూత కింద రూ.3,25,180 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమష్టిగా పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది డ్యూటీ అలవెన్స్ కింద పోగు చేసిన సొమ్మును చేయూత కింద ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇది ఒక రకంగా పోలీస్ శాఖలో స్ఫూర్తిని నింపినట్లేనని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. చేయూత పథకాన్ని, దాన్ని సిబ్బంది అమలు చేస్తున్న తీరును ప్రశంసించారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ టి.ఆనందబాబు, ఆర్ఎస్సై రమేష్ కుమార్, సూపరింటెండెంట్ రామకృష్ట, పీఆర్ఓ కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్ కృష్ట, శ్రీనివాస్, వెంకటేష్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. రూ.3 లక్షల చెక్ అందజేసిన ఎస్పీ -
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఆహ్వానపు నాటిక పోటీలు
చీపురుపల్లిరూరల్ (గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన పు నాటిక పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గరివిడి శ్రీరాం హైస్కూల్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు నాటిక పోటీల ప్రదర్శన సాగనుంది. ఈ మేరకు గరివిడి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైద రాబాద్కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ’స్వేచ్ఛ’, హైదరాబాద్కు చెంది న మిత్ర క్రియేషన్స్ వారు ‘ఇది రహదారి కా దు’ అనే నాటికలు ప్రదర్శిస్తారు. మొదటిరోజు జరగనున్న కార్యక్రమంలో సినీనటుడు నారాయణమూర్తి, నరసింహరాజుపాల్గొననున్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి గంట్యాడ: పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరా ణి వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదమజ్జిపాలేం పీహెచ్సీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈడీడీ చార్టన్ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నెలకు పది వరకు ప్రస వాలు నిర్వహించాలని సూచించారు. పీహెచ్సీ లో సుఖ ప్రసవాలు చేస్తామన్న నమ్మకాన్ని గర్భిణులకు కలిగించాలని అన్నారు. అప్పుడే గర్భిణులు ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకునేందుకు ముందుకు వస్తారన్నారు. అదే విధంగా ఓపీ సంఖ్యను పెంచాలన్నారు. మాతృ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రసవ తేదీకి మూడు నాలుగు రోజుల ముందే గర్భిణులు ఆస్పత్రుల్లో చేర్పించాల న్నారు. హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. తరువాత తామరపల్లి లో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పీహెచ్సీ వైద్యులు డాక్టర్ పల్లవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థుల నిరసన విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ ఆధ్వర్యంలో విజయనగరం కోట కూడలి వద్ద గురువారం ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి నిరుద్యోగులు ఎదురుచూశారన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం లేకపోవడం ఆందోళనకు గురవుతున్నామన్నారు. వయోపరిమితి 44 సంవత్సరా లే కావడంతో చాలామంది వయో భారంతో అర్హత కోల్పోతున్నట్టు వెల్లడించారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాము, భాను, ఈశ్వరరావు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో జ్యూయలరీస్ షాపు యజమాని
విజయనగరం క్రైమ్: స్థానిక గంటస్తంభం వద్ద ఎన్వీఆర్ జ్యూయలరీ షాపును రన్ చేస్తున్న యజమానికి వన్టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ షాపు యజమాని నాగుల కొండ వెంకట కిశోర్పై రెండు ఎన్బీబ్ల్యూ కేసులతో పాటు ఒక ఎన్ఐఏ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు గతంలో ఒక మహిళను వేధించాడని అప్పుడే కేసు నమోదైందన్నారు. అలాగే ఒక చెక్బౌన్స్ కేసులో కూడా నిందితుడని చెప్పారు. షాపుకు వచ్చిన కొనుగోలుదారులకు నకిలీ బంగారం ఆశ చూపి డబ్బులు కాజేసేవాడన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని సీఐ చెప్పారు. ఈ మేరకు షాపు యజమాని కిశోర్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ప్రతిభకు పురస్కారంపార్వతీపురం: సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజేయస్వామి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో 600 మార్కులకుగాను 558 మార్కులు సాధించిన జి.అనితను సన్మానించి ఘనంగా సత్కరించారు. దీనిపై సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతితెర్లాం: తెర్లాం జంక్షన్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. మాసిపోయిన గడ్డం, గళ్ల లుంగీ కట్టుకుని ఉన్నాడని, సుమారు 65 నుంచి 70ఏళ్ల వయస్సు ఉంటుందని తెలియజేశారు. ఫొటోలో చూసి ఎవరైనా గుర్తుపడితే బాడంగి సీహెచ్సీకి వచ్చి వివరాలు తెలియజేయాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
మద్యం మత్తులో ఓ పోలీస్..!
● కారు నడిపి ఆటోను ఢీకొట్టి.. ● ఒకరి మృతికి కారణమై.. ● వాహనం నంబర్ ప్లేట్ మార్చి.. ● నిందితుడిని కాపాడే ప్రయత్నంలో పోలీసులు ● బాధితులకు అండగా సీపీఎం గరుగుబిల్లి/పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండల పరిధిలోని సీతారాంపురం జంక్షన్లో మంగళవారం సాయంత్రం పోలీస్వాహనం ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఉల్లిభద్ర గ్రామానికి చెందిన బి.గణేష్ (42)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా నిందితుడు తనవంతు ప్రయత్నాలు చేశాడు. సంఘటనలో తీవ్ర గాయాలపాలైన గణేష్ చికిత్సపొందుతూ మృతి చెందడంతో పోలీసులకు బుధవారం సమాచారం అందించగా స్థానిక ఎస్సై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపిన పోలీసు ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనం నడిపి ఒకరి మృతికి కారణమయ్యారు. జియ్యమ్మవలస మండల పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎ.ప్రసాద్ డ్యూటీ డ్రెస్లో ఉండి మద్యం తాగి కారు నడిపి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ విషయమై చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు వద్ద ప్రస్తావించగా ప్రమాదం జరిగిన సమయంలో కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అని మెడికల్ టెస్టులు, రక్తపరీక్షలు చేయించామని, తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డికి నివేదించినట్లు తెలిపారు. నంబర్ ప్లేట్ను మార్చిన పోలీసులు ప్రమాదం జరిగినప్పుడు కారుకు ఓన్బోర్డు ఉన్న నంబర్ ప్లేట్ను బుధవారం ఉదయానికి ట్యాక్సీ నంబర్ ప్లేట్గా (ఎల్లోబోర్డు) మార్చివేశారు. మార్చిన నంబర్ ప్లేటుతోనే కారును గరుగుబిల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా నంబర్ ప్లేట్లను మార్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులకు అన్యాయం చేయడంతో పాటు చట్టాన్ని పక్కదోవ పట్టించేలా వ్యవహరించడంపై ఔరా అంటూ పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. బాధితులకు అండగా సీపీఎం మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగినప్పటికీ బుధవారం ఉదయం వరకు కేసు నమోదు చేయకపోవడంపై సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బీవీ రమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదుపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని పోలీస్స్టేషన్లో సిబ్బందిని ప్రశ్నించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడైన కానిస్టేబుల్ను రక్షించేందుకు పోలీసు సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ మృతి చెందడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసును నమోదు చేశారు తప్ప బాధితులకు న్యాయం చేద్దామని కాదన్నారు. ప్రమాదంపై తక్షణం విచారణ నిర్వహించి కానిస్టేబుల్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, మరణించిన గణేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నంబర్ ప్లేట్లు మార్చడం పట్ల, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రహదారి నిబంధనలు పోలీసులకు వర్తించవని ఈఘటనతో తెలుస్తోందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు కె. రవీంద్ర, డి.వెంకటనాయుడు, వై.మన్మథరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఉల్లిభద్ర జంక్షన్ వద్ద ప్రమాదంలో మృతిచెందిన గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మహిళలు, పెద్దలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై రమేష్ నాయుడు ధర్నా స్థలానికి వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తులలో నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు పాల్గొని పలు అంశాలపై వివరించి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ నేరస్థలం పరిశోధనలో దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించాల్సిన సమయంలో అందుకు అనుగుణంగా నేరం జరిగిన చోటుకు పోలీసులు ఏవిధంగా రక్షణ కల్పించాలో, అలాగే డీఎన్ఏ, రక్తనమూనాలు, అవయవాలు, వెంట్రుకలు, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, వివిధ రకాల విషపదార్థాలు, ఆడియో, వీడియో, ప్రధానమైన పలు నేరాలు రుజువు చేసేందుకు అవసరమయ్యే అన్ని సాక్ష్యాధారాలను భౌతికంగా ఏ విధంగా సేకరించాలి? అలాగే ప్యాకింగ్, నిల్వ భద్రపరచడం, ల్యాబ్ నుంచి వచ్చే నివేదికను వారంలోనే పొందే విధానం, కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి ప్రధానమైన అంశాలపై వర్క్షాప్ జరిగినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ వర్క్షాపులో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీఐ అప్పారావు, ఫోరెన్సిక్ నిపుణులు ఎం.రాంబాబు, ఎస్.నళిని, వి.ప్రశాంతి, గోపాలకృష్ణతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ వైద్యులు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మలేరియా నిర్మూలనకు ఏసీఎం స్ప్రేచేయాలి
విజయనగరం ఫోర్ట్: మలేరియా నిర్మూలనకు ఇంటిలోపల గోడల మీద ఏసీఎం 5శాతం 9 ఆల్ఫా సైఫర్ మెత్రిన్ స్ప్రే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో అమలు చేయనున్న మలేరియా నిర్మూలన కార్యక్రమంపై వ్యాధి ఎక్కువగా ఉన్న 18 మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, వైద్యాధికారులు, మలేరియా సబ్యూనిట్ అధికారులతో ఆయన బుధవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాప్తిని నిరోధించడానికి మొత్తం 22 పీహెచ్సీల పరిధిలోని 157 గ్రామాల్లో రెండు విడతలుగా ఏసీఎం మందును పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగేళ్ల నివేదికల అధారంగా ప్రతి వెయ్యిమంది జనాభాకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ మలేరియా కేసులు నమోదైన గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా మే 1నుంచి జూన్ 15 వరకు మొదటి విడత, జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు రెండో విడత ఏసీఎం మందులను పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల గోడలపై వాలే దోమలు శక్తిని కోల్పోయి క్రమంగా నశించిపోతాయన్నారు. ఇలా మందు పిచికారీ చేసినప్పడు ఆ ఇంటి గోడలపై 10 నుంచి 12 వారాల పాటు ఆ మందు ప్రభావం ఉంటుందని, ఆలోగా గోడలను కడగడం గాని సున్నం వేయడం గాని చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని కోరారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎంఓ వై.మణి తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ -
ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!
సమస్యలివే.. ● మెదడు కుచించుకుపోయి మతిమరుపు వస్తుంది ● రక్తంలో కలిసిన రసాయనాలు మెదడులోని కీలక భాగాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా నరాలసమస్యతో కాళ్లు, చేతులు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. కొందరికి పక్షవాతం కూడా రావచ్చు. ● వాసన గ్రహించలేకపోతారు. ● పార్కిన్సన్ (వణుకుడు రోగం) వ్యాధి రావచ్చు ● డిప్రెషన్కు గురవుతుంటారు ● హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ కావు ● పిల్లల్లో ఎదుగుదల సమస్య తలెత్తవచ్చు ● ఫిట్స్, మైగ్రేన్, తలనొప్పి రావచ్చు జన్యుపరమైన లోపాలే కాకుండా సమతుల్య ఆహార విధానలేమి, శ్రమలేని జీవన విధానాల వంటి వాటితో పాటు పర్యావరణ సంబంధిత వాహన కాలుష్యం వంటివి కూడా మధుమేహవ్యాధి సంక్రమించడానికి ముఖ్యభూమిక పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.● మెదడుపై తీవ్ర ప్రభావం ● డిప్రెషన్, మతిమరుపు సమస్యలు ● పార్కిన్సన్స్ వచ్చే ఆస్కారం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులురాజాం సిటీ: వాహనాల వినియోగం పెరగడంతో పాటు కాలం చెల్లినవి రోడ్లపై పరుగులు తీస్తుండడంతో అధికంగా కాలుష్యం వెలువడుతోంది. నిత్యం ద్విచక్రవాహనాలపై తిరిగే వారికి వాహన కాలుష్యంతో పాటు మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా రసాయనాలు రక్తంలో కలిసి మెదడుపై ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయని వెల్లడిస్తున్నారు. కాలుష్యం కారణంగా సమస్యలకు గురవుతున్న వారిని తరచూ చూస్తున్నామని వైద్యులు తెలియజేస్తున్నారు. అదుపులో ఉండని దీర్ఘకాలిక వ్యాధులు.. కాలుష్య ప్రభావానికి గురయ్యే వ్యక్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉండవు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు అదుపులో లేకపోవడంతో కీలక అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు, కిడ్నీల ఫెయిల్యూర్, రక్త ప్రసరణ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు.ఏం చేయాలంటే.. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా తగ్గించుకోవచ్చు. ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్తోపాటు సర్జికల్ మాస్క్లాంటిది పెట్టుకుంటే మంచిది కాలం చెల్లిన వాహనాల వినియోగాన్ని నివారించాలి ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి. అలాగే రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి.మధుమేహం వచ్చే ప్రమాదం..నైట్రోజన్ డయాకై ్సడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్లకన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలో చేరి అక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతకు కారణమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా మధుమేహం రావచ్చు. డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాంమెదడుపై ప్రభావం.. కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావంచూపి న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు. కాలు చేయి పట్టు తప్పడం, బ్రెయిన్స్ట్రోక్, వణుకుడు రోగం వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్టణంలో తిరిగేవారు మాస్క్ధరించడం మంచిది. డాక్టర్ కరణం హరిబాబు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం -
జాతీయ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
విజయనగరం: ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. నగరంలోని విజ్జి స్టేడియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 20 మంది జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభ గల క్రీడాకారులకు విజయనగరం పెట్టింది పేరుగా వాఖ్యానించారు. ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, ప్రధాన కార్యదర్శి సూర్యలక్ష్మి, ఉపాధ్యక్షులు కేఆర్కే రాజు, సహాయ కార్యదర్శి హరిగోపాల్, కోశాధికారి రవికుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, వి.ఆనంద కిశోర్, పి.సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
9,500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): నవోదయం 2.0లో భాగంగా మంగళవారం ఒడిశా సిబ్బందితో కలిసి రాయగడ జిల్లాలోని కెరడ, వనజ, సుళవ గ్రామాల పరిధిలో నిర్వహిస్తున్న సారా బట్టీలపై దాడి చేసి 45 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఈ దాడిలో 460 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో విజయనగరం ఈఎస్ఐఎఫ్ సీఐ రామచంద్రకుమార్, సీతానగరం ఎకై ్సజ్ సీఐ పద్మావతి తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు. -
బొబ్బిలి చీరల్లో వైరెటీ చూపించాలి
● చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్బలిజిపేట: చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని నారాయణపురంలో చేనేత కార్మికుల స్థితిగతులను మంగళవారం ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు చేస్తూ బొబ్బిలి చీరలకు వైరెటీ కల్పించాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బుటా చీరలను తయారుచేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రకరకాల చీరలను తయారుచేసేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించనున్నట్లు చెప్పారు. చీరలు తయారుచేసేందుకు అవసరమైన మెటీరియల్ ఏమిటి? ఎక్కడ నుంచి వస్తుంది? ఇంకా ఎటువంటి మెటీరియల్ అవసరం, నైపుణ్యాలను పెంచాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? చేనేత రంగాభివృద్ధికి శాఖా పరమైన సహాయసహకారాలు ఎంతమేర అవసరం అనే విషయాలపై వారితో చర్చించి వారినుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంచి నాణ్యమైన సరుకులు తయారుచేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి.నాగేశ్వరరావు, శ్రీకాకూళం ఎ.డి జనార్దన రావు, అసిస్టెంట్ డివిజనల్ అధికారి రమణ, చేనేత కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన అవసరం
● జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శివిజయనగరం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ మే డే వారోత్సవాల్లో భాగంగా విజయనగరంలోని కార్మికశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికశాఖలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎంతమంది కార్మికులు లబ్ధి పొందారో ఆరాతీశారు. అనంతరం కార్మిక శాఖ భవనం ఆవరణలో అసంఘటిత కార్మికులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అసంఘటిత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వేతన సవరణ చట్టం, హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1 5 1 0 0కు ఫోన్ చేసి న్యాయ సలహాలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎ.శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నామినేటెడ్ సభ్యుడు జి.తిరుపతి పాల్గొన్నారు. -
దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు ముఖ్యం
● మిమ్స్లో ఒకరోజు శిక్షణవిజయనగరం క్రైమ్: కేసుల దర్యాప్తులోను, నిందితులపై నమోదైన కేసుల్లో పోరెన్సిక్ ఆధారాలు చాలా ముఖ్యమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారరలకు మంగళవారం మిమ్స్లో ఫోరెన్సిక్ నిపుణులతో ఒక్కరోజు శిక్షణ జరిగింది. ఈ శిక్షణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు ప్రియాంక, సుమాలిక, ప్రశాంతిలు దర్యాప్తు అదికారులకు ఽఆధారాలు సేకరించడంలో మెలకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నేర స్థలం నుంచి ఆధారాలు సేకరించడంలో దర్యాప్తు అధికారులు సీరియస్గానే దృష్టి పెట్టాలని సూచించారు. శాసీ్త్రయ పద్ధతులలో ఆధారాలు సేకరించడం, లేబిలింగ్ చేయడం కోర్టులో నిరూపిండచం అత్యంత కీలకమని ఎస్పీ అన్నారు. ఆధారాలు సేకరించడంలో సిరాలజీ, ఫోరెన్సిక్ ఫిజిక్స్, డీఎన్ఏ, టాక్సికాలజీ, నార్కోటిక్, సైబర్, ఆడియో, వీడియో పరీక్షలకు పంపడంలో మెలకువలను ఫోరెన్సిక్ అధికారులు, దర్యాప్తు సిబ్బందికి తెలియజేశారు. నేరస్థలం నుంచి వేలిముద్రలు సేకరించడం, మత్తు పదార్థాలు, మానవ అవయవాలు, విష పదార్థాలు, రక్త నమూనాలు, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు, మెమరీ కార్డ్స్, సిమ్కార్డ్స్ వంటివి ఎలా సేకరించాలో? ఏవిధంగా భద్రపరచాలో ఫోరెన్సిక్ నిపుణులు ఈ ఒకరోజు శిక్షణలో దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. అనంతరం నిపుణులను ఎస్పీ వకుల్ జిందల్ జ్ఙాపికలతో సత్కరించారు. -
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని మేదరవీధి జంక్షన్ సమీపంలో ఉన్న లక్కీ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో మంగళవారం వేకువజామున విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు వరకు ఉన్న ఈ వస్త్ర దుకాణంలో కింద అంతస్తు పూర్తిగా దగ్ధమవగా మొదటి అంతస్తు పాక్షికంగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమాచారం మేరకు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు మాట్లాడుతూ ముందుగా ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేసి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అదుపుచేశామన్నారు. అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తినష్టాన్ని వస్త్ర దుకాణ యజమాని నుంచి బిల్లులను పరిశీలించి అంచనా వేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఆటోబోల్తా: పలువురికి గాయాలు
పార్వతీపురం రూరల్: మండలంలోని పెదమరికి గ్రామం నుంచి కారాడవలస గ్రామానికి దినసరి కూలీలతో వెళ్తున్న ఆటో కృష్ణపల్లి గ్రామ శివారు ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఓ యువకుడి కాలికి తీవ్రగాయమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి 108 వాహనం చేరుకుని క్షతగాత్రులను పార్వతీపురం కేంద్రాస్పత్రికి తరలించింది. గాయా ల పాలైన వారిని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య గంట్యాడ: గజపతినగరం మండలం ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన వసాత హరీష్ (30) గంట్యాడ మండలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని వైఎస్సార్నగర్లో ఉంటూ అరకులో బీఎస్ఎన్ఎల్ టవర్లో హరీష్ పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి అధిక మొత్తంలో అప్పలు చేవాడు. అవితీర్చలేనేమోనన్న బెంగతో గంట్యాడ మండలం కొండతామరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న తోటలోకి వెళ్లి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గడ్డిమందు తాగేశాడు. పరిస్థితి విషమంగా మారడంతో భార్యకు ఫోన్ చేయగా కుటుంబసభ్యులు చేరుకుని విజయనగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8:20 గంటలకు మృతిచెందాడు. హరీష్కు ఏడాది క్రితం వివాహమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. -
విద్యల నగరంలో బాలమేధావి
విజయనగరం: సాధారణంగా చిన్నపిల్లలు వీడియో గేమ్స్ లేదా కంప్యూటర్ గేమ్స్తో కాలం గడుపుతారు. కానీ విజయనగరానికి చెందిన 1వ తరగతి చదువుతున్న ఐదేళ్ల బాలుడు గరుగుబెల్లి కునాల్ కష్టసాధ్యమైన జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సులభంగా చెప్పేస్తున్నాడు. ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న కునాల్ 140కు పైగా దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను అవలీలగా గుర్తుపట్టడమే గాక, వందకు పైగా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ సముద్రాలు, వివిధ ఖండాలు, చారిత్రాత్మక యుద్ధాలు, ప్రదేశాలు, రాజధానులు తదితర అంశాలను అడిగిన వెంటనే చెప్పి అబ్బురపరిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం గురజాడ స్మారక గ్రంథాలయంలో బాలమేధావి కునాల్ ప్రదర్శన విజయవంతంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీతో కలిసి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ బాలమేధావికి పతకాన్ని, బహుమతిని అందించి అభినందించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ముళ్లపూడి సుభద్రాదేవి, గిరిజా ప్రసన్న, ఎం.చంద్రశేఖర్, బాలమేధావి తల్లిదండ్రులు అశోక్, రాజులమ్మ పాల్గొన్నారు. -
సుర్రుమంటున్న సూరీడు..!
● విలవిల్లాడుతున్న వన్యప్రాణులు ● వేసవిలో ఇబ్బందుల్లేకుండా అటవీశాఖ చర్యలు ● అభయారణ్యంలో పుష్కలంగా నీటివసతులు ● జంతువుల కోసం నీటికుంటలు, చెక్డ్యామ్లు, చెలమలు ● తాగునీటి కోసం గ్రామాలకు రాకుండా అడవిలోనే ఏర్పాట్లువన సంపదపై ప్రజలకు అవగాహన వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకునేందుకు సమీప అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ‘వన్యప్రాణుల చట్టం–1972’ గురించి వివరిస్తున్నాం. వన్యప్రాణులను చంపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలియజేస్తున్నాం. అలాగే అటవీ సిబ్బందితో ప్రతినిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాం. పటిష్ట చర్యలు చేపట్టడంతో వన్యప్రాణులను కాపాడుకోగలుగుతున్నాం. వన్యప్రాణులు తాగునీటికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం కూడా వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి అటవీశాఖ ద్వారా చేపట్టే చర్యలు చాలా అవసరం. అయితే వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్నప్పుడు వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కాబట్టి, అటవీశాఖతో పాటు ప్రజలు కూడా వన్యప్రాణులను కాపాడడానికి సహకరించాలి. దాహం కోసం జంతువులు అడవిని వీడి నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తుంటాయి. ప్రజలు వాటికి హాని తలపెడితే శిక్షార్హులవుతారు. – విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు -
పైడితల్లికి పుష్పాలంకరణ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
పట్టాలు ఇప్పించండి సారూ..!
పార్వతీపురంటౌన్: గడిచిన 60ఏళ్లుగా చేస్తున్న వ్యవసాయ భూములకు సంబంఽధించి పట్టాలు ఇప్పించాలని వీరఘట్టం మండలం శాంతిగూడ, గదబవలస, జడగూడ, సింధునగరం, పెద్దూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలియజేసి డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకులనుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఫారెస్టు అధికారులు తమ భూములు ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమపై దయఉంచి ఈ భూములకు సంబంధించి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● డీఆర్ఓ హేమలత ● పీజీఆర్ఎస్కు 98 వినతులుపార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఆర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీ ఓపెన్ కారాదని అధికారులను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి భాగస్వామ్యమై 98 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యత గల ఎండార్స్ మెంట్ అందజేయాలని అధికారులకు సూచించారు. చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులలో ప్రధానంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సైలు ఫకృద్దీన్, జగదీష్నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 26 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయి. దబర పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని ప్రసాదరావు తదితరులు కోరారు. మేడఒబ్బంగి, కొండాడ గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని అక్కడి గిరిజనులు అర్జీ ఇచ్చారు. సెల్టవర్ నిర్మించాలని లాడ గ్రామస్తులు కోరారు. ఆర్ఓఎఫ్ ఆర్ భూములు సర్వే చేసి పట్టాలు ఇప్పించాలని పొగడవెల్లి గ్రామస్తులు విన్నవించారు. అంబలిగండి నుంచి కుంబి గ్రామానికి రహదారి నిర్మించాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
సీతానగరం: మండలంలోని బల్లకృష్ణాపురం గ్రామంలో సోమవారం ఉదయం బొత్స రమణమ్మ (75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీనిపై పార్వతీపురం సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం రమణమ్మ గ్రామంలోని తన నివాసంలో గెడ్డలుప్పి గ్రామానికి చెందిన తన కుమార్తు సొంగల లక్ష్మితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి ఎలుకలు, చిన్న ఇల్లు అని వేరొకరి ఇంట్లో నిద్రించడానికి మృతురాలి కుమార్తె వెళ్లింది. ఆ రాత్రి ఇంట్లో ఒంటరిగా రమణమ్మ నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున లక్ష్మి ఇంటికి వచ్చి తల్లి రమణమ్మను లేపేందుకు చూడగా విగతజీవిగా పడి ఉండడం గమనించి భోరున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గ్రహించారు. రమణమ్మకు మెడనొప్పి నివారణ కోసం మెడకు బెల్టు కట్టుకుని నిద్రించే అలవాటు ఉంది. తన తల్లిది సాధారణ మరణం అని కుమార్తె లక్ష్మి తొలుత భావించింది. అయితే మృతురాలిపై చీర వేయడం నిమిత్తం ఇంట్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి తెరవగానే అందులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించక పోవడంతో ఆందోళన చెందింది. తమ ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు డబ్బులు చోరీ చేసి తల్లిని హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనాస్థలానికి సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఇన్చార్జ్ ఎస్సై నీలకంఠం, సిబ్బంది చేరుకుని క్లూస్టీమ్, గాగ్స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రమణమ్మ మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి ఇద్దరు కుమారులు విశాఖపట్నం, హైదరాబాద్లో ఉంటారు. -
బొబ్బిలిలో జిల్లా స్థాయి టేబుల్టెన్నిస్ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల ఏవీ హాలులో సోమవారం జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో బి.హర్షిత్, బి.అభినయ కార్తీక్లు విన్నర్, రన్నర్లుగా, సీనియర్ విభాగంలో బి.ధనుంజయ్, టి.సత్యనారాయణలు విన్నర్, రన్నర్లుగా నిలిచా రని పీడీ వెంకటనాయుడు తెలిపారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్, బాల్బ్యాడ్మింటన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఏబీసీ నాయుడు, రాజీవ్, అరుణ్కుమార్, జలగం శ్రీనివాస్ ప్రభాకర్, హెచ్ఎం సునీత తదితరులు పాల్గొని విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. -
కొఠియా సమస్యపై ముఖ్యమంత్రి,గవర్నర్లతో మాట్లాడాలి
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు గ్రామాలైన వివాదాస్పద కొఠియా గిరిజనులను ఒడిశా అధికారులు, పోలీసులు ఇబ్బందులు పెడుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గవర్నర్లతోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ అతిథిగృహంలో చైర్మన్తో సమావేశమై కొఠియా వివాదాస్పద గ్రామాల్లో జరుగుతున్న పరి ణామాలపై చర్చించారు. గడిచిన 55 సంవత్సరా లుగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 21గ్రామాల్లో 6 పంచాయతీల్లో వివాదం ఉందని వివరించారు. కార్యక్రమంలో పౌరవేదిక ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రామ్మోహన్ రావు, థాట్రాజు రాజారావు, తి రుపతిరావు, గోపాలరావు, ప్రధాన కార్యదర్శి జ లంత్రి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతిపత్రం -
సంతృప్తి చెందేలా వినతుల పరిష్కారం
విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ప్రధానంగా ఆడిట్ టీమ్ రిమార్కుల్లో సంతృప్తి చెందినట్లు రాయాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఅర్ఎస్లో ఇన్చార్జ్ కలెక్టర్ ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ వినతులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 177 వినతులు అందాయి. ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో కీర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వర్షాల పట్ల అప్రమత్తం రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 32 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 32 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలత స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూ తగాదాలు 15,, కుటుంబ కలహాలు3, మోసాలు3 ఇతర సమస్యలకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్ఆఫీసర్లతో ఎస్పీ చర్చించారు. ఫిర్యాదుల పట్ల సానుకూలంగా సిబ్బంది స్పందించాలని సూచించారు. ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలించి అందులో వాస్తవాలను అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని సిబ్బందిని ఆదేవించారు. ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ పీజీఆర్ఎస్కు 177 వినతులు -
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లుండాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే విధంగా ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయనగరం మండల కేంద్రం ఎదుట సంఘం క్యార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు రెండు టీచర్ పోస్టులకు తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, పీడీ పోస్టులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్ధులు దాటిన చోట రెండవ సెక్షన్ ఇవ్వాలని కోరారు. 12వ పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలు తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. అనంతరం వినతిపత్రాన్ని మండల అధికారికి అందజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, పీవీప్రసాద్, మజ్జి రమేష్, గురుమూర్తి, మర్రాపు శ్రీనివాసరావు, తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సంపూర్ణలత, పి.లత, కె.శ్రీనివాసన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ -
మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలి
చీపురుపల్లి: మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఆర్డీఓ జీవీ.సత్యవాణి అన్నారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డివిజిన్ స్థాయి జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతు సంక్షేమ చట్టం ప్రకారం పశువుల అక్రమ రవాణా చేయకూడదని హితవు పలికారు. అక్రమ రవాణా, జంతుబలులు తదితర సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల నేతృత్వంలో పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు రెండు వందల మీటర్ల సమీపంలో ఎలాంటి జంతుబలులు జరగకూడదని చెప్పారు. పశువుల అక్రమ రవాణాపై పోలీస్ శాఖ పటిష్ట నిఘా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య ముద్రించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదరరావు, ఎ.డి ఆర్.శారద, రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రాములప్పనాయుడు, ఆర్డీఓ కార్యాలయం ఏఓ ఈశ్వరమ్మ, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ సత్యవాణి -
23.400 కేజీల గంజాయి పట్టివేత
కొత్తవలస: ఒడిశా రాష్ట్రం నుంచి అరకు, విశాఖపట్నం మీదుగా హైదరాబాద్కు కారులో 23 కేజీల,400 గ్రాముల గంజాయి తరలిస్తుండగా కొత్తవలస పోలీసులు మండలంలోని మంగళపాలెం జంక్షన్ సమీపంలో సోమవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి కారులో తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై మన్మథరావు తన సిబ్బందితో మంగళపాలెం జంక్షన్ వద్ద మాటు వేశారు. దీంతో ముందుగా పల్సర్ బండిపై ఒక వ్యక్తి వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి ఆపగా బైక్ అక్కడే వదిలేసి తప్పించుకుని పారిపోయాడు. ఈ దృశ్యాన్ని వెనుక ఫిఫ్ట్ డిజైర్ కారులో వస్తున్న వారు గమనించి కారు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు కారులో గల ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు నాలుగు డోర్ల పై కవర్లు విప్పి అందులో 23 కేజీల,4వందల గ్రాముల గంజాయిని 48 ప్యాకెట్లుగా విభజించి దాచి యథావిధిగా డోర్స్ కవర్లు వేసి ఉండడం గమనించారు. దీంతో నిందితులను, కారును పోలీస్స్టేషన్కు తరలించి తహసీల్దార్ బి.నీలకంఠరావు సమక్షంలో కారు డోర్లు తెరిచి అందులో గల గంజాయిని వెలుపలకు తీశారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముధాలవలస మండలం పెద్దచెర్ల గ్రామానికి చెందిన పాలవలస జనార్దన్, పాలవలస రాంబాబులుగా నిందితులను గుర్తించారు. వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి హైద్రాబాద్కు కారులో తరలిస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. పాచిపెంటలో 127 కేజీలు.. పాచిపెంట: కారులో అక్రమంగా తరలిస్తున్న 127 కేజీల గంజాయిని పాచిపెంట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సాలూరు రూరల్ సీఐ రామ కృష్ణ సోమవారం పాచిపెంట పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని పద్మాపురం జంక్షన్లో సోమవారం మధ్యాహ్నం అనుమానస్పదంగా ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించిన స్థానిక వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకట సురేష్ సిబ్బందితో వెళ్లి కారును పరిశీలించి, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో తూనిక వేసి స్వాధీనం చేసకుని కేసు నమోదు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
నేడు ఈసెట్, ఐసెట్ రేపు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీ ఈసెట్–2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 2,184 మంది అధ్యర్థుల కోసం ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాజాం జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సీతం ఇంజినీరింగ్ కళాశాల, లెండి ఇంజినీరింగ్ కళాశాల, అంతి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఏపీ ఐసెట్–2025 ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ పరీక్ష రాస్తున్న 1,548 మంది అభ్యర్థుల కోసం రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగ ఐయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులుగా ఈ పరీక్ష జరుగుతుంది.విద్యార్థికి ల్యాప్టాప్ అందజేతపార్వతీపురంటౌన్: సాలూరు మండలం, శివరాంపురం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు అల్లు.ఉదయ్ కిరణ్కు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు రూ: 33 వేల విలువైన ల్యాప్టాప్ను ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మారెడ్డి సోమవారం పీజీఆర్ఎస్. సమావేశ మందిరంలో అందజేశారు. కడప జిల్లా డా.వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం పెయింటింగ్లో డిగ్రీ చదువుతున్న ఉదయ్కిరణ్ మూగ, చెవుడుతో బాధపడుతూ విద్యనభ్యసిస్తున్నాడు. తన చదువుకు, ఉపాధికి ల్యాప్ టాప్ మంజూరు చేయాలని కోరగా, ఆ విద్యార్థికి సోమవారం ల్యాప్టాప్ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిభోగాపురం: భోగాపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం ఉదయం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన దుబ్బక సంతోష్ (37) వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వేకువజామున జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. బహిర్భూమికని చెప్పి పొలంలో నుంచి జాతీయ రహదారికి అవతలి వైపు వెళ్లెందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డివైడర్పై ఉన్న మొక్కల పొదల్లో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి అప్పన్న, తల్లి ఈశ్వరమ్మ ఉన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు. రెండు పూరిళ్లు దగ్ధంగరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్రలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన జక్కువ కంచమ్మ, ముడుదాపు నాగభూషణకు చెందిన పూరిళ్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. కట్టుబట్టలతో బాధితులు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వీఆర్ఓ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని నివేదికను తహసీల్దార్కు సమర్పించారు. -
ఆస్తమా..అలక్ష్యం..అంతే..!
విజయనగరం ఫోర్ట్: ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి పిల్లలతో పాటు పెద్దలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. జన్యుపరంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే పొగతాగేవారికి ఆస్తమా ఉంటే వ్యాధి మరింత తీవ్రమవుతుంది. మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆస్తమా బాల్యదశలో కూడా చిన్నారులకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని వాడుక భాషలో పాల ఉబ్బస అంటారు. ఈ వ్యాధి సోకితే మనిషిని కుదురుగా ఉండనీయదు. ముఖ్యంగా చలికాలంలో ఈవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో కాస్త ప్రశాంతంగా ఉంటారు. వేసవిలో కూడా ఆస్తమా ఉన్నవారు చల్లటి నీరు తాగితే వ్యాధి తీవ్రం అవుతుంది. సైన్సైటిస్, ఇస్నోఫిలీయో ఆస్తమాగా మార్పు సైనసైటిస్, ఇస్నోఫిలియో, ఫుడ్ఎలర్జీ, డస్ట్ఎలర్జీ క్రమేణా ఆస్తమాగా మారుతాయి. ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే ఆస్తమా బారిన పడకుండా ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి బారిన పడతారు. చలికాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో 800 నుంచి 1000 కేసుల నమోదు జిల్లా వ్యాప్తంగా నెలలో 800 నుంచి 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. సర్వజన ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 300 మంది ఆస్తమా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. జిల్లాలో నెలకు 800 నుంచి 1000 వరకు కేసుల నమోదు సకాలంలో చికిత్స చేసుకోకపోతే మృత్యువాత పడే ప్రమాదం నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవంసొంతంగా మందులు వాడకూడదు ఆస్తమా లక్షణాలు ఉన్న వారు మెడికల్ షాపుల్లోను, ఆర్ఎంపీల వద్ద మందులు కొనుగోలు చేసి వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా తగ్గినప్పటికీ వ్యాధి తీవ్రమవుతుంది. ఆస్తమా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పలమనాలజిస్ట్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇన్హేలర్స్ వాడడం ద్వారా వ్యాధి అదుపులోకి వస్తుంది. – డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాలజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రివ్యాధి లక్షణాలు ఆయాసంగా ఉండడం పిల్లికూతలు రావడం చాతీ భారంగా ఉండడం కఫం ఎక్కువగా ఊరుతుండడం ఊబకాయం వల్ల కూడా అస్తమా వస్తుంది గర్భిణుల్లోనూ ఆస్తమా వచ్చే అవకాశం వ్యాధి తీవ్రమైతే మృత్యువాతపడే ఆస్కారం వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పలమనాలజిస్ట్ను కలిసి చికిత్స చేయించుకోవాలి. వ్యాధి తీవ్రమైతే శ్వాసవ్యవస్థ ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం రోజుకు 100మంది ఆస్తమాతో ప్రాణాలు వదులుతున్నారు. -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకువచ్చే దేవర మహోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 12న నిర్వహించనున్న దేవర మహోత్సవ ఘట్టాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారీ రామవరపు చినపైడిరాజు బృందం సోమవారం సాయంత్రం ఆలయ ఆవరణలో చాటింపు వేసింది. అమ్మవారికి భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ సాంబ్రాణి ధూపంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మనవి చెప్పారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్, సిబ్బంది, అధికారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ చాటింపు వేశారు. భక్తులందరూ ఆ రోజు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవాలని కోరారు. ఏర్పాట్లు చేస్తున్నాం ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ మాట్లాడుతూ దేవర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మే 12వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గాడీఖానా, ఎన్సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురువద్దకు తీసుకువెళ్లి పూజలు చేస్తామన్నారు. రాత్రి 10 గంటలకు హుకుంపేట నుంచి ఊరేగింపుగా మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్ద నున్న చదురుగుడి వద్దకు తరలించి ఆశీనులు చేస్తారని తెలిపారు. అప్పటి నుంచి అమ్మవారు ఉయ్యాల కంబాల మహోత్సవం వరకూ చదురుగుడిలోనే కొలువై భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ దేవర మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపర్ వైజర్ ఏడుకొండలు, రమేష్ పట్నాయక్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. మే 12న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం చాటింపు చేసిన ఆలయ తలయారీలు -
దాడితల్లి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం
బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు దాడితల్లి సిరిమానోత్సవానికి సర్వంసిద్ధమైంది. తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిరిమానోత్సవాన్ని పక్కా ఏర్పాట్లు చేశారు. గొల్లపల్లిలోని పైల వీధిలో గద్దె ఉన్న ప్రాంతంలో అంగడి కట్టిన ఇంటి వద్ద పూజారి బత్తిన కృష్ణ సిరిమానును మంగళవారం సాయంత్రం 5 గంటలకు అధిరోహిస్తారు. గత 30 ఏళ్లుగా బత్తిన కుటుంబ సభ్యులే సిరిమాను పూజారిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు దాడితల్లి సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ సతీష్కుమార్లతో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. రోడ్ మ్యాప్ను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను తెలుసుకున్నారు. ఏంఎసీ కూడలి నుంచి కృష్టాపురం మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భక్తుల దర్శనాలు, ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ సావు మురళీకృష్ణారావుతో పాటు కమిటీ సభ్యులు మండల జనార్దనరావు, వజ్జి రవి, ఎస్.ఎస్.హేమంత్, స్థానిక పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిమానోత్సవానికి 300 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించామన్నారు. 90 సీసీ కెమెరాలతో నిఘా వేశామన్నారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు సిబ్బంది డ్యూటీలో ఉంటారన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు సిరిమానోత్సవాన్ని వీక్షించవచ్చన్నారు. ప్రజలంతా పోలీసులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలకు సహకరిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని సూచించారు. 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు 90 సీసీ కెమెరాలతో నిఘా ఏంఎసీ కూడలి నుంచి కృష్ణాపురం మీదుగా వాహనాల మళ్లింపు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ వకుల్జిందల్ -
గిరిజన విద్యార్థులకే అధిక సీట్లు
విజయనగరం అర్బన్: కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్థులకు అధిక సీట్లు కేటాయించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఎస్టీ కమిషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. అలాగే యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులపై గిరిజన యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ టీవీ కట్టిమణి, ఇతర అధికారులు, అధ్యాపకులతో సమావేశమై గిరిజనుల అభివృద్ధిలో యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్ర, అందిస్తున్న కోర్సులపై సమీక్షించారు. యూనివర్సిటీ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు వీసీ, తదితరులు శంకరరావును సత్కరించారు. పనుల పురోగతిపై ఆరా.. దత్తిరాజేరు/విజయనగరం అర్బన్: మెంటాడ మండలం కుంటినవలస వద్ద చేపడుతున్న గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఆరా తీశారు. 561 ఎకరాలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. భూములు ఇచ్చిన రైతులకు రూ. 61.06 కోట్లు, అప్రోచ్ రోడ్డుకు రూ. 16 కోట్లు.. సబ్స్టేషన్ నిర్మాణానికి రూ. 48.61 కోట్లు కేటాయించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జాతీయ రహదారి నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్కు చేరుకునేందుకు అనుసంధాన రోడ్డు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. భవన నిర్మాణాలు త్వరతిగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను అందుబాటులోకి తీసుకువస్తామని చైర్మన్కు వివరించారు. పరిశీలనలో బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహనరావు, యూనివర్సిటీ ఏఓ సూర్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, విజయనగరం ఆర్డీఓ కీర్తి, తదితరులు ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలసి గిరిజన విశ్వవిద్యాలయంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు. కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు -
అవి దేవస్థానం భూములే..
● స్పందించిన జాయింట్ కలెక్టర్ ● రెవెన్యూ అధికారుల పరిశీలన ● నీలకంఠేశ్వస్వామి దేవస్థానం భూములేనని నిర్ధారణ చీపురుపల్లి: నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూము ల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ‘దేవుడి భూము ల్లో అక్రమ కట్టడాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ స్పందించారు. తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆర్డీఓ సత్యవాణిను ఆదేశించారు. ఆర్డీఓ సూచనల మేరకు చీపురుపల్లి ఇన్చార్జి తహసీల్దార్ కె.సూర్యకాంతం, మండల సర్వేయర్ శ్రీనివాస్, వీఆర్వో భవానీ, చీపురుపల్లి పట్టణ సర్వేయర్ కాళీ, దేవదాయశాఖ సిబ్బంది మణికంఠ తదితరులు చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములను సోమ వారం పరిశీలించారు. ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 135లో 18.86 ఎకరాల భూమి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవేనని నిర్ధారించామని చెప్పారు. ఇదే విషయాన్ని నివేదిక సిద్ధంచేసి ఆర్డీఓకు అందజేస్తామని స్పష్టంచేశారు. అదే సర్వే నంబర్లో చాలా ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాజాం రోడ్డులోని బంగారమ్మకాలనీలో సర్వేనంబర్ 209–6లో శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానానికి చెందిన భూముల్లో ఆక్రమణలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులు మేరకు ఆ భూములను కూడా పరిశీలించినట్టు చెప్పారు. రికార్డుల పరంగా ఆ భూములు కూడా దేవస్థానానికి చెందినవేనని, అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరపరాదని నివేదిక అందజేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు విజయనగరం అర్బన్: పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ.. సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. గత మూడు నెలల్లో పరిశ్రమల స్థాపనకు 149 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇప్పటివరకు 138 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. చేతి వృత్తిదారులకు చేయూత నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోందని.. ఈక్రమంలో వీలైనంత వేగంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. విశ్వకర్మ యోజన పథకానికి 86,386 దరఖాస్తులు రాగా.. మూడు దశల్లో వాటిని పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 1,080 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం పట్ల ఇన్చార్జ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, సహాయ సంచాలకుడు బి.రామకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. పరీక్షల కన్వీనర్, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ఎస్.తవిటినాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు సుమారు 15,000 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,000 మంది విద్యార్థులు హాజరుకాన్నారని తెలిపారు. ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల
ఇసుక దోపిడీ!బొబ్బిలి: రూపాయి ఖర్చు లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను తరలించకుండా నదుల్లోని ఇసుకను అక్రమంగా తరలించుకుపోయేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కాసు లు వెనకేసుకుంటున్నారు. గ్రోత్ సెంటర్లోని కంపెనీలకు ఇతర ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తరలించేందుకు ఇసుకాసురులు అక్రమ మార్గాలే తప్ప సక్రమంగా ఇసుక తరలిద్దామన్న ఊసే లేదు. జిల్లాలోని ఇసుక రేవుల్లో ఇసుక నిల్వలు లేవని, నదుల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేస్తే సాగు, తాగునీటి వనరులకు ఇబ్బందులు వస్తాయని నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఇక్కడ ఇసుకను తవ్వనీయకుండా ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చి జిల్లాలోని నాలుగు పాయింట్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా పాయింట్లకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుకను తరలించి నిల్వ చేసి అవసరాన్ని మేరకు నామమాత్రపు ధరతో అందజేసేవారు. కాంట్రాక్టర్లు, వినియోగదారులు తమకు వచ్చిన నామమాత్రపు ధరలో ఇసుకను ట్రాక్టర్లు, లారీలతో తర లించేవారు. ఇందుకోసం మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖలు పర్యవేక్షించేందుకు తమ సిబ్బందిని సైతం నియమించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వీలు లేకుండా జిల్లాలోని అన్ని రీచ్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేసి నియంత్రించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస, డెంకాడ తదితర ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇసుక తోడేస్తున్నారు.. పట్టణంలోని గ్రోత్ సెంటర్ ఇసుక పాయింట్లో సుమారు 10వేల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల నుంచి ఇసుకను తీసుకునేందుకు ఎవ రూ ముందుకు రావడం లేదు. పక్కనే ఉన్న వేగావతి,సువర్ణముఖి నదుల నుంచి ఇసుకను అక్రమంగా పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, లారీలతో తరలించుకుపోతు న్నారు. కనీస రుసుము కూడా చెల్లించనక్కర లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. పొక్లెయినర్లు, ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నా అక్రమార్కులు ఆగడం లేదు. ర్యాంపులు లేకపోయినా వేగావతి నదీ పరీవాహక ప్రాంతాలైన పారాది, భోజరాజపురం, కారాడ, అలజంగి ప్రాంతాల్లో ఎక్కడా ఇసుక ర్యాంపులు లేవు. ఈ ప్రాంతాల్లో ఇసుక తరలింపునకు అనుమతులు లేకపోయినా కూటమి ప్రభుత్వంలోని వేగావతి తీరం పరిసర గ్రా మాల టీడీపీ నాయకులు ఇసుకను తరలిస్తున్నారు. లోపభూయిష్టం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న కంపెనీల్లో ఇసుక అవసరం. ఈ ఇసుకను యాజమాన్యాలు సమీకరించుకోలేక కాంట్రాక్టుకు ఇస్తుంటాయి. ఆయా కంపె నీలకు ఇసుకను తరలించేందుకు పలువురు టీడీపీ నాయకులు కాంట్రాక్టును తీసుకున్నారు. కంపెనీల కు కావాల్సినంత ఇసుకను తరలించేందుకు ట్రాన్స్పోర్టు, ఇసుక ధర, లేబర్ చార్జీలను కలుపుకుని కాంట్రాక్టుకు పాడుకున్న కాంట్రాక్టర్లు వేగావతి నదిలో ని ఇసుకను నాటుబళ్లతో తరలిస్తున్నారు. నాటు బండికై తే రూ.500 నుంచి 800ల లోపున చెల్లించి ఒకే చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను ఆయా కంపెనీలకు తరలిస్తున్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ఇసుక డంపింగ్ యార్డులో 10,000 టన్నుల ఇసుక నిల్వలున్నాయి. కానీ ఇక్కడ ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇక్కడ నిర్ణీత ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని, సదరు కాంట్రాక్టుదారులు ఇన్ఫిల్టరేషన్ బావులు, వంతెనల వద్ద ఉన్న ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఆర్డీఓ రామమోహనరావు, తహసీల్దార్ ఎం.శ్రీను సైతం ఇసుక అక్రమ తరలింపును అడ్డు కుని జరిమానాలు విధిస్తున్న సందర్భాలున్నాయి. గృహ నిర్మాణానికి అని చెప్పి బొబ్బిలి పట్టణానికి తాగునీరందించే ప్రధాన నీటివనరు కేంద్రానికి చెందిన ఇన్ఫిల్టరేషన్ బావుల చుట్టూ ఇసుకను తవ్వుతున్నారు. అక్కడి నుంచి సమీప గ్రామాలకు నాటుబళ్లతో తరలిస్తున్నారు. డంపింగ్ చేసిన చోటు నుంచి కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీలకు తరలిస్తున్నారు. మూతపడుతున్న ఇన్ఫిల్టరేషన్ బావులు పట్టణానికి తాగునీరందించే ఇన్ఫిల్టరేషన్ బావులు ఇసుక తవ్వకాల వలనే మూతపడుతున్నాయి. ఇటీవలే ఒక ఇన్ఫిల్టరేషన్ బావి మూతపడింది. ఇసుక కోసం బావుల చుట్టూ పూర్తిగా తవ్వేయడంతో నీరు ఊరక బావులు మూతపడుతున్నాయని అధికారు లు గుర్తించారు. దీని వలన పట్టణానికి రోజు విడిచి రోజు తాగునీరు అందించే పరిస్థితి ఏర్పడింది. పాయింట్లోని ఇసుక వద్దు అక్రమ రవాణ ముద్దు వృథాగా 10వేల టన్నుల ఇసుక రూ.10వేల జరిమానా విధిస్తాం.. ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నా దృష్టికి వచ్చింది. ఆయా వాహనా లు నాకు ఎదురయ్యాయి. వాటిని విడిచిపెట్టకుండా సీజ్ చేయించాను. ఇక ముందు ఇసుకను ఎవ రు అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తీసుకుంటాం. రూ.10వేల జరిమానా విధిస్తాం. గ్రోత్ సెంటర్ స్టాక్ పాయింట్లో ఇసుకను ఎవ రూ కొనుగోలు చేయడం లేదు. ఇసుకంతా వృథా అవుతున్నా నదిలోనే అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక ముందు వారి ఆటలు సాగనివ్వం. – జేవీఎస్ఎస్ రామమోహనరావు, ఆర్డీఓ, బొబ్బిలి -
18 కిలోల గంజాయి పట్టివేత
శృంగవరపుకోట: శృంగవరపుకోట సమీపంలో పందిరప్ప జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 18 కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులకు అందిన సమాచారం మేరకు పందిరప్ప జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెడ్ కలర్ మాక్సిమో ప్లస్ హౌస్హోల్డ్ ఫర్నిచర్ కలిగిన వాహనాన్ని తనిఖీ చేయగా 18 కిలోల గంజాయి పట్టుబడింది. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పడంతో ఆ వ్యక్తిని అరెస్టుచేసి వ్యాన్, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
కార్మికుల కంటకన్నీరు..!
● జ్యూట్ ఫ్యాక్టరీ తెరిపించరా అంటూ వేడుకోలు ● ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరిన కార్మికులపై మంత్రి ఆగ్రహం ● అపాయింట్మెంట్ లేకుండా ఎలా వస్తారంటూ మండిపాటు ● విస్తుపోయిన కార్మికులు, నాయకులుసాలూరు: పట్టణంలో శ్యామలాంబ పండుగ 15 ఏళ్ల తరువాత జరుగుతున్న నేపధ్యంలో ప్రజలందరూ పండగను ఘనంగా జరుపుకునేందుకు బంధువులకు పిలుపులు పెడుతూ సరదాగా పండగను చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేసి, ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో పట్టణంలో, మండలంలోని జీగిరాంతో పాటు పలు గ్రామాల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిన చిత్రాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టికున్న కార్మికుల కలలు కల్లలుగా మారిపోయాయి. అంతేకాదు ఇటీవల తమ గోడును వెళ్లబుచ్చుకుని ఫ్యాక్టరీ తెరిపిస్తామని నాడు ఎన్నికల సమయంలో హామీలిచ్చిన ప్రస్తుత మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణిలకు ఆ హామీని అమలుచేయాలని కోరేందుకు ఇటీవల పలువురు జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ కార్మికులు, నాయకులు మంత్రి సంధ్యారాణి ఇంటికి వెళ్లగా ,మంత్రి నుంచి వచ్చిన స్పందన చూసి కంగుతిన్నారు. అసలు అపాయింట్మెంట్ లేకుండా ఎలా వస్తారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించడంతో సదరు కార్మిక సంఘం నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడిన పరిస్థితి ఎదురైంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా నేడు మంత్రిగా మరోలా మారిన ఆమె తీరుపై కార్మికులు,నాయకులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషిచేసిన రాజన్నదొర ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటూ గత ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీ యజమానులు లాకౌట్ విధించగా, నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజన్నదొర ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు మేలు చేసేందుకు శతవిధాలుగా కృషిచేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఫ్యాక్టరీ యజమానులు, కార్మిక నాయకులతో కలిసి చర్చలు జరిపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. తరువాత ఎన్నికలు వచ్చిన క్రమంలో ఫ్యాక్టరీ తెరవాలంటూ కార్మికులు వద్ద ధర్నా చేపట్టగా నాడు సంధ్యారాణి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ సాలూరు పట్టణంలో ఎన్నికల సమయంలో నిర్వహించిన యువగళం సమావేశంలోను ఈ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామిలిచ్చిన ఇద్దరు నేతలు నేడు మంత్రులుగా ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం సమీపిస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో కార్మికులు ఉసూరుమంటున్నారు. వలసబాట పట్టిన కార్మికులు 1986లో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది కార్మికులు పనిచే శారు. ఫ్యాక్టరీ మూతబడడంతో వారంతా రోడ్డునపడ్డారు. కుటుంబపోషణ కష్టంగా మారడంతో కార్మికులు పొట్టకూటి కోసం వలసబాట పట్టారు. పలువురు ఏలూరు, రాజాంలతో పాటు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. కొందరు పట్టణంలో పండ్ల దుకాణాలు, టిఫిన్ దుకాణాల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్యామలాంబ పండుగ జరగనుందని దూరప్రాంతాలకు పనులకు వెళ్లిన కార్మికులకు తెలియడంతో, ఫ్యాక్టరీ తెరిచి ఉండి ఉంటే అక్కడే పనిచేసుకుంటూ, కుటుంబాలతో ఘనంగా పండుగ చేసుకునే పరిస్థితి ఉండేదని బాధపడుతున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోను ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన నేతలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏకై క ఈ జూట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతున్నారు. కాగా పక్కనున్న విజయనగరం జిల్లాలో ఫ్యాక్టరీలు పునఃప్రారంభమవుతుండగా ఈ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.ఇచ్చిన హామీని మంత్రి నిలబెట్టుకోవాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీగిరాం జ్యూట్ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి ఆ హామీని నిలబెట్టుకుని ఫ్యాక్టరీని తెరిపించాలి. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు నేడు పొట్ట చేతపట్టుకుని వేర్వేరు రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. –ఎన్వైనాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
నీట్–2025 పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్–2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,548 మంది హాజరు కావాల్సి ఉండగా 1,523 మంది హాజరయ్యారు. పట్టణంలోని జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ప్రాంగణంలోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను, భద్రత, బందోబస్తు తదితరులను పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, పరీక్ష కేంద్రం ఇంచార్జ్ వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. -
పీహెచ్సీల్లో ప్రసవాల మెరుగుకు కృషి చేయాలి
పార్వతీపురం టౌన్: మాతా, శిశు వైద్య సేవలు, పీహచ్సీలో ప్రసవాల మెరుగు కోసం స్టాఫ్నర్సులకు శిక్షణ ఇచ్చామని ఆ దిశగా వారంతా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న పీహెచ్సీ స్టాఫ్ నర్సులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం సాయంత్రం ఆరోగ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. శిక్షణ నైపుణ్యాన్ని సద్వినియోగం చేయాలని డీఎంహెచ్ఓ ఈ సందర్భంగా వారికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు వైద్య సేవలను మరింతగా మెరుగు పరిచే లక్ష్యంగా, పీహెచ్సీలలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేసే దిశగా స్టాఫ్నర్సులకు ఎస్బీఏ (స్కిల్డ్ బర్త్ అటెండెంట్) రీఓరియంటేషన్ శిక్షణ నిర్వహించామని ఫిబ్రవరిలో ప్రారంభించి బ్యాచ్ల వారీగా ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డా. ఎం.నారాయణరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.కేవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్మోహనరావు, డా.పీఎల్. రఘుకుమార్, డీపీహెచ్ఎన్ఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
చెరకు టన్ను ధర రూ.5 వేలు ఉండాలి
● ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు రేగిడి: చెరకు రైతులు సాగు విస్తీర్ణం పెంచాలంటే చెరకు టన్ను ధర రూ.5 వేలు ఉండాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. రేగిడిలో విలేకరుల తో ఆయన ఆదివారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 10.25 శాతం రికవరీ ఆధారంగా చెరకు టన్ను ధర రూ.3550లు ప్రకటించిందని వెల్లడించారు. పెరిగిన ఖర్చులు దృష్ట్యా రైతుకు ఇది గిట్టుబాటు కాదని పేర్కొన్నారు. కనీసం టన్నుకు రూ.5వేలు చెల్లిస్తే కూలీల కొరత, పంటకు పెట్టుబడి పోను రైతుకు కొంత లాభదాయంగా ఉండేందుకు వీలుంటుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీతో కూడిన యాంత్రీకరణలు రైతులకు అందజేయాలని కోరారు. స్థానిక యాజమాన్యం రైతులకు గతంలో ఇచ్చే విధంగా ఇన్పుట్ సబ్సిడీ కొన సాగించాలని, ఉప ఉత్పత్తులలో వచ్చే లాభాల లో రైతులకు వాటా ఇవ్వాలని సూచించారు. రైతులు సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట అయిన చెరకుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కోరారు. చక్కెర పరిశ్రమ దేశ వ్యాప్తంగా సంక్షోభంలో ఉందని, దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల ఫలితంగా పంచదారకు సరైన ధర లేదని అన్నారు. ప్రశాంతంగా ఎంజీపీఏపీ ఆర్జేసీ సెట్ నెల్లిమర్ల : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశా ల కోసం ఆదివారం నిర్వహించిన ఎంజీపీఏపీ ఆర్జేసీ సెట్–2025కు 449 మంది విద్యార్థులు హాజరయ్యారు. నెల్లిమర్ల బాలికల కళాశాల కేంద్రంలో 401 మందికి గాను 297 మంది, గజపతినగరం కేంద్రంలో 198 మందికిగాను 152 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు కేంద్రాల్లో 150 మంది గైర్హాజరయ్యారు. గురుకులాల జిల్లా కన్వీనర్ డాక్టర్ కేబీబీ రావు, మత్స్యకార బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీబీసీబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూఓ యశోధనరావు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించారు. మహనీయుల ఆశయాలను సాధించాలి విజయనగరం అర్బన్: భగీరథ మహర్షి జయంతి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ముందుగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను సాధించడ మే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి కె.జ్యోతిశ్రీ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటీ రామారావు, గృహ నిర్మాణ శాఖాధికారి గండి మురళి, సహాయ మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, ఏబీసీడబ్ల్యూఓ యశోధనరావు పాల్గొన్నారు. -
గోపాలకృష్ణ మాస్టారుకు పురస్కారం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన పుర్లి గోపాలకృష్ణ మాస్టారును తెలుగువెలుగు సాహితీవేదిక ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసినందుకు గుర్తించి పురష్కారాన్ని అందించి సత్కరించారు. ఈ పురస్కారం అందించిన తెలుగువెలుగు కార్యనిర్వాహక కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామనన్నారు. గోపాలకృష్ణ మాస్టారుకు పురష్కారం రావడంపట్ల అంబకండి గ్రామస్తులతో పాటు మండల విద్యాశాఖాధికారులు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైస్ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు అభినందించారు. పెండింగ్ ఈ చలానాలపై ఎస్పీ సీరియస్● చెల్లించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశాలు విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఈ–చలానాల వసూళ్లపై అధికారులు, సిబ్బంది సీరియస్గా దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది, అధికారులతో ఆదివారం ఆయన సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వాహనాల పెండింగ్ చలానాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలు నిర్వహించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆయా వాహనాలపై పెండింగ్ చలానాలు ఉన్నట్లయితే వాటిని వాహనదారులు చెల్లించేంతవరకు వెంటాడాలని ఎస్పీ ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఽఘిస్తున్న వారిపై ఈ చలానాలు విధిస్తున్నా చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ చలానాలు కుప్పలు, కుప్పలుగా పెండింగ్లో ఉంటున్నాయన్నారు. సిబ్బంది పెండింగ్ ఈ చలానాలపై దృష్టి పెట్టాలని ఆ చలానాలు చెల్లించకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే వాహనాల తనిఖీ సమయంలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.ఇక ఎంవీ నిబంధనలను ఉల్లంఽఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. మహిళ దుర్మరణంరామభద్రపురం: మండలకేంద్రంలోని సాలూరు వెళ్లే రూట్లో కర్రల మిషన్ సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల సత్యవతి(64) కొన్నేళ్లుగా అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూలాగానే ఆదివారం కూడా వేకువజామున 5 గంటల సమయంలో కూరగాయల మార్కెట్కు వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి రెండు నిమిషాల్లో మార్కెట్కు వెళ్లే లింకు రోడ్డు దిగుతుందన్న సమయంలో సాలూరు నుంచి రామభద్రపురం వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం మితిమీరిన వేగంతో వచ్చి సత్యవతిని బలంగా ఢీ కొట్టి సుమారు 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె అక్కిడికక్కడే మృతిచెందింది. పోలీసులు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఢీ కొట్టిన వాహనాన్ని కనిపెడుతున్నారు. మృతురాలి కుమారుడు ఈశ్వరరావు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. కుమారుడు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేసక్ 2025కు సురవరం వ్యక్తి ఎంపిక
సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన బాసా మురళి వియత్నాంలో ఈ నెల 5 నుంచి 14 వరకు జరగనున్న వేసక్ ఫెస్టివల్– 2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన సిల్చర్లోని అస్సాం యూనివర్సిటీలో కళల ప్రదర్శన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2017 నుంచి పనిచేస్తున్నారు. భారత్ నుంచి ఐసీసీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) నుంచి ఢిల్లీకి చెందిన పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ ఈ ఫెస్టివల్లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ గ్రూపునకు మురళి సాంకేతిక సహకారం కోసం ఎంపికయ్యారు. పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ గౌతమ బుద్ధుడి జీవితంలో వివిధ ప్రధాన ఘట్టాల ఆధారంగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నృత్యరూపకాన్ని రూపొందించగా, ఆ నృత్య రూపకాన్ని మురళి సాంకేతిక సహకారంతో క్రియాత్మకంగా తీర్చిదిద్దారు. మొత్తం 14 మంది సభ్యులతో ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వియత్నాం బయలు దేరి వెళ్లారు. -
20న దేశ వ్యాప్త సమ్మె
● కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఐక్యవేదిక విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సమ్మె సన్నద్ధానికి సంబంధించి ఐఎఫ్టీయూ నాయకుడు కె.అప్పలసూరి, స్వతంత్ర ఫెడరేషన్లు ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సదస్సులు, కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు జరపాలని, మే 10న విజయనగరంలో సదస్సు నిర్వహించాలని, మే 16, 17, 18 తేదీల్లో జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్మనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను పెట్టుబడిదారులకు విక్రయిస్తున్న వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని తీర్మానించారు. వీటిని కాపాడుకోవాల్సి న బాధ్యత ఉద్యోగులు, ప్రజలపై ఉందని పలు వురు పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శంకరరావు, ఎ.జగన్మోహనరావు, కె.సురేష్, ఏఐఎఫ్టీయూ నాయకులు బెహరా శంకరరావు, రైతు సంఘం నాయకుడు బి.రాంబాబు, ఇతర సంఘాల నాయకులు రెడ్డి శంకరరావు, రవికుమార్, కె.గురుమూర్తి, అప్పలరాజు, గౌరినాయుడు, కె.ఆదినారాయణ, పాపారావు, రమణ, హరీష్, జగన్మోహన్ పాల్గొన్నారు. -
రైతులను తిప్పించుకోవద్దు..
మెరకముడిదాం: రైతులను మీ చుట్టూ తిప్పించుకోవద్దు, వారు పనులు మాని మీ చుట్టూ తిరగాలంటే కుదరదు కదా..మీరు వాళ్ల వ్యవసాయ బోర్లకు అవసరమైన సర్టిఫికెట్లను త్వరితగతిన అందజేయండి. అంటూ మెరకముడిదాం తహసీల్దారు అజూరఫీజాన్కు మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లతో కలిసి మండలంలోని చినబంటుపల్లి మిల్లు వద్ద మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఏవైనా సమస్యలున్నాయా? అని అడిగారు. దానికి మండలంలో చాలా మంది రైతులు వ్యవసాయ బోరు బావులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన ఫారం–3 సర్టిఫికెట్లను జారీ చేయడంలో స్థానిక తహసీల్దారు అజూరఫీజాన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ బొత్స వెంటనే సర్టిఫికెట్లను జారీ చేయాలని తహసీల్దారు అజూరఫీజాన్కు ఫోన్ ద్వారా సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ల మంజూరులో మార్పులు తీసుకురావడంతో చాలా మంది వితంతువులకు పింఛన్లు మంజూరు కావడం లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, సత్తారు జగన్మోహన్రావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్కు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచన పార్టీ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన -
విదేశీ అతిథులకు స్వాగతం
● సైబీరియా వలస పక్షుల రాక ● మే నెల నుంచి నవంబరు నెల వరకు విహారం ● నవంబరు తర్వాత స్వదేశానికి పిల్లలతో ప్రయాణంబొండపల్లి: ఏటా క్రమం తప్పకుండా వచ్చే విదేశీ వలస పక్షులు సైబీరియా దేశం నుంచి వచ్చి చెరువుల్లో విహరిస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వేలాది కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా దేశం నుంచి ప్రయాణం చేస్తూ ఏటా వచ్చి బొండపల్లి మండలంలో విడిది చేసి ఆహారం సంపాదించుకునే ప్రాంతాలను గుర్తించేందుకు వచ్చే ఈ పక్షులు ఈ ఏడాది కూడా మండలానికి వచ్చాయి. మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న రాజు చెరువులో సంవత్సరం పొడవునా నీరు ఉండడంతో పాటు చెరువు గట్ల చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం, పక్షులకు కావాల్సిన ఆహారం పీతలు, పురుగులు, ఇతర ఆహారం పుష్కలంగా దొరికే అవకాశం ఉండడంతో క్రమం తప్పకుండా ఇక్కడికి పొడవైన కాళ్లు, పొడవైన ముక్కు, తెల్లని రెక్కలు, మెడ కింద ఎర్రని వెంట్రుకలతో కూడిన ఈ పక్షులు దేశం కాని దేశం నుంచి వస్తుంటాయి. నవంబర్ వరకూ ఇక్కడే బస ఈ పక్షులు ఏటా మే నెలలో వచ్చి నవంబరు నెల వరకు చెరువుల్లో దొరికే ఆహారాన్ని పగలంతా సేకరించి తిని రాత్రయ్యే సరికి గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో గల చింత చెట్లుపై విశ్రాంతి తీసుకుంటాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ పక్రియ సాగుతోంది. వాటికి ఏ ఒక్కరూ హాని చేయడం, వేటాడడం వంటి పనులు చేయరు. ఆ పక్షులకు హాని చేయకూడదని గ్రామస్తులు వారికి వారే అంక్షలు విధించుకుని..ఈ పక్షులు వస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారు. మే నెలలో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలు ఎగిరి వాటికి అవే ఆహారం సంపాదించుకునే పరిస్థితి వచ్చాక పిల్లలతో సహా ఈ పక్షులు స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతుంటాయి. ఈ ప్రక్రియ ఏటా క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఈ పక్షులు వచ్చి చెరువులో ప్రసుత్తం కనువిందు చేస్తున్నాయి. -
రీసర్వే పక్కాగా నిర్వహించాలి : ఆర్డీవో
చీపురుపల్లి: భూములు రీసర్వే ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని ఆర్డీవో జివి.సత్యవాణి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఎనిమిది మండలాల్లో పని చేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వో, విలేజ్ సర్వేయర్లకు రీసర్వే కార్యక్రమంపై శనివారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆమె మాట్లాడుతూ రీసర్వే నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్షాప్లో ప్రతీ అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. వర్క్షాప్లో నిర్దేశించిన విధంగా గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలన్నారు. ప్రధానంగా వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు రీసర్వేపై పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. రీసర్వేకు సంబంధించి ఇప్పటికే మండలాల్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు వారిని సమన్వయం చేసుకోవాలన్నారు. జూన్ నుంచి మొక్కల పంపిణీ● డీఎఫ్ఓ కొండలరావు బొండపల్లి: వనమిత్ర కేంద్రాలతో పాటు, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో జూన్ నుంచి మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ ఆర్. కొండలరావు తెలిపారు. స్థానిక వనమిత్ర కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. కేంద్రంలో ఏయే రకాల మొక్కల పెంపకం చేపడుతున్నా రో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాదం, కానుగ, వేప, తదితర మొక్కలు ఉచితంగా కావాల్సిన చిన్న, సన్నకారు రైతులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భూమి పాసు పుస్తకాల జెరాక్స్లతో దరఖాస్తులను నర్సరీ అధికారులకు అందజేయాలని సూచించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు, పెద్ద రైతులు తమకు కావాల్సిన మొక్కల వివరాలను సమర్పిస్తే తక్కువ ధరకు మొక్కలు అందిస్తామని చెప్పారు. వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓ ఎల్.సింధూ, ఫారెస్టు రేంజ్ అధికారి బి.అప్పలరాజు ,వనమిత్ర కేంద్రం సహాయకుడు పి.అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం కనకమహాలక్ష్మి కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడిఉండడాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయడంతో సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సుమారు 60 ఏళ్ల వయసు ఉంటుందని, పచ్చ, నలుపు చారలతో టీ షర్ట్ ధరించాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా సంబంధిత బంధువులు గుర్తిస్తే రాజాం పోలీసుస్టేషన్ను సంప్రదించాలని సూచించారు. కాశీలో బొద్దూరు వాసి మృతి సంతకవిటి: మండలంలోని బొద్దూరుకు చెందిన గేదెల దామోదరరావు(55) గుండెపోటుతో కాశీలో శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి కాశీకి వెళ్లిన ఆయన గురువారం తిరుగుపయనమయ్యారు. రైలు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రైలు దిగి అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. సాయంత్రం కాశీలోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏపీ కబడ్డీ జట్టు కోచ్గా చైతన్య
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్గా విజయనగరానికి చెందిన పాలూరి చైతన్య నియామకమయ్యారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు బిహార్లోని రాజ్గిరిలో 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచ్గా చీపురుపల్లి మండలానికి చెందిన పాలూరి చైతన్య ఎంపికయ్యారు. చైతన్య ప్రస్తుతం శాప్ కబడ్డీ కోచ్గా విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టిన చైతన్యను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలమంచలి శ్రీకాంత్, విజయనగరం కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కోరాడ ప్రభావతి అభినందించారు. -
జానపద కళలను ఆదరించాలి
విజయనగరం టౌన్: అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించి కళాకారులకు ప్రదర్శనలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని గిడుగు రామూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు కోరారు. కోట ప్రాంగణంలో ఉత్తరాంధ్ర నవచైతన్య నాట్య కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కళాకారులు, కార్యవర్గ సమావేశం కార్యదర్శి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో హైదరాబాద్, అరకు, భోపాల్ వంటి చోట్ల జిల్లా జముకులు, తూర్పు భాగవతం, చెక్కభజన కళాకారులకు అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, దేవదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ అంతరించిపోతున్న జానపద కళలను ఆదరించాలని కోరారు. ప్రజలు కూడా వీటిని ఆదరించి మన సంస్కృతిని కాపాడాలని కోరారు. 50 ఏళ్లు దాటిన కళాకారులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. ఉత్తరాంధ్రలోని అతివేగంగా అంతరించిపోనున్న తూర్పు భాగవతం, రుంజ వాయిద్యం, జముకుల పాట, తప్పెటగుళ్లు, బుడగ జంగాల పాటలు, దాసర్ల పాటలు, చెక్క భజనలు, సాముగరిడీలు, పులివేషాలు వంటి కళలను ఆదరించి భావితరాలకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లాలోని జముకుల పాట, చెక్కభజన, సాముగరిడి తదితర బృంద గురువులైన అట్టాడ లక్ష్మీనాయుడు, మత్స తవిటినాయుడు, మక్కువ మారినాయుడు, సింహాచలం, మిరియాల జగన్, పోలిరాజు, పి.సురేష్, రెడ్డి శంకరరావు, తౌడు, యువ కళాకారులు పాల్గొన్నారు. -
సంకిలి చక్కెర ఫ్యాక్టరీ మూతపడకుండా చూడాలి
బొబ్బిలి: సంకిలి చక్కెర ఫ్యాక్టరీని మూత వేసి బీర్ల కంపెనీ పెట్టే యోచనలో యాజమాన్యం ఉందని, ఆ దిశగా యాజమాన్యాన్ని వెళ్లనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.గోపాలం అన్నారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న లచ్చయ్యపేట, భీమసింగి చక్కెర పరిశ్రమలు మూతపడటంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చెరకును పండించేందుకు అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ఫ్యాక్టరీని మూత పడనీయకుండా చర్యలు తీసుకోకపోతే చెరకు రైతు కనుమరుగు కావడం ఖాయమన్నారు. జిల్లాలో విమానాశ్రయాలు, ఆయుధ బాండాగారాల వలన రైతులకు, ప్రజలకు వచ్చిన ప్రయోజనాలు లేవని, రైతు సంబంధ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, రెడ్డి త్రినాధ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం డిమాండ్ -
ఆధిపత్యం చెలాయిస్తున్నారు...!
నెల్లిమర్ల: కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని తెలిపారు. స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు పాలనా విషయాల్లో తలదూర్చి తనను పూర్తిగా నియంత్రించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన పార్టీలోకి మారిన తర్వాత కూటమి పార్టీకి చెందిన ఇంకో వ్యక్తి తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాలను సభ్యుల సూచనల మేరకే తాను ఆమోదిస్తానని చైర్పర్సన్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ప్రవేశపెట్టిన కల్యాణ మండపం విస్తరణ, పార్కు ప్రహారీ నిర్మాణం వంటి అంశాలను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడంతో తాను కూడా తిరస్కరించినట్లు వివరించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు కలిసి తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోందని, కూటమి ప్రభుత్వంలోని తనపై కూటమిలోని వేరే పార్టీ ఎలా అవిశ్వాసం పెడుతుందని సరోజిని ప్రశ్నించారు. పలు విషయాల్లో కమిషనర్తో తాను కుమ్మక్కయ్యానన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జనసేన పార్టీ నాయకులు అప్పికొండ రవికుమార్, రవ్వా నాని, పాండ్రంకి సత్యనారాయణ మాట్లాడుతూ చైర్పర్సన్కు సంబంధించి ఏవైనా లోపాలుంటే టీడీపీ నాయకులు, సభ్యులు జనసేన పార్టీ దృష్టికి తీసుకు రావాలని, అంతేగాని కౌన్సిల్ సమావేశాల్లో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. అలాగే చైర్పర్సన్ పిలుపునిచ్చిన సమావేశానికి ఎలా గైర్హాజరు అవుతారని ప్రశ్నించారు. కాలువలపై అక్రమణలు తొలగించి పట్టణాన్ని అభివృద్ధి చేసే చర్యలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణాభివృద్ధికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాలతో కూటమి పార్టీలకు చెందిన నాయకులతో కలసి నడవాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, బంగారు భానుప్రకాష్, బంగారు శంకరరావు, పలిశెట్టి దొరబాబు, సారిపల్లి శంకరరావు, పళని తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ చైర్పర్సన్ సరోజిని -
గిరిజనుల పొట్ట కొట్టొద్దు
వేపాడ: హైడ్రో పవర్ప్లాంట్ ఏర్పాటుకు అదానీ కంపెనీకి భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక గ్రామంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీపీఎం ఆల్ ఇండియా కమిటీ సభ్యుడు లోకనాథం, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ తాతల, తండ్రుల నుంచి కొండలను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల పొట్టకొట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్తో కాని, ఇక్కడి ప్రజలతో కాని ప్రభుత్వం మాట్లాడకుండా గిరిజనులు నివసిస్తున్న కొండలు, గుట్టల్లో దాదాపు 213 ఎకరాలు అదానీకి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయాలన్న, అక్కడి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలన్నా అటవీశాఖ అనుమతులు ఉండాల ని చెబుతున్న ప్రభుత్వం.... ఇప్పుడు మరి ఏ అనుమతులు తీసుకుని అదానీకి ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్మినేని సూర్యనారా యణ మాట్లాడుతూ అధికారులు ముందుగా గ్రామసభ నిర్వహించి, 70శాతం మంది ప్రజలు అనుమతిస్తేనే భూసేకరణ చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించి గిరిజనులను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యిందని మండిపడ్డారు. 125 గిరిజన కుటుంబాలకు అన్యాయం చేస్తుంటే సహించేది లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరకవలస సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ, సీపీఎం, ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. -
సేవల్లో వెనుకబడిన.. ఏపీవీపీ ఆసుపత్రులు..!
● బీ గ్రేడ్లో ఆరు ఆసుపత్రులు ● సీ గ్రేడ్లో చీపురుపల్లి ఆసుపత్రి ● ఓపీ, ఐపీ సేవల్లోనూ వెనుకబాటే.. ● జిల్లాలో ఏడు ఏపీవీపీ ఆసుపత్రులు ● అన్ని ఆసుపత్రుల్లో తగ్గిన సేవలు ● డెప్యూటేషన్పై కాలయాపన చేస్తున్న కొందరు వైద్యులు విజయనగరం ఫోర్ట్: వైద్య విధాన్ పరిషత్ ఆసుపత్రులు సేవల్లో వెనుకబడ్డాయి. ప్రభుత్వం ప్రతీ నెల ప్రకటించే గ్రేడ్ల్లో ఈ విషయం తేటతెల్లమైంది. అన్నీ ఆసుపత్రుల్లోనూ సేవలు తగ్గాయి. కూటమి ప్రభుత్వం వైద్య శాఖను పట్టించుకోకపోవడం వల్ల ఆసుపత్రులు గాడి తప్పాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది డెప్యూటేషన్ల పేరుతో కాలయాపన చేయడం వల్ల కూడా సంబంధిత ఆసుపత్రుల్లో సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల సేవల్లో వెనుకంజలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపీ, ఐపీ సేవల్లో కూడా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లాలో వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. వాటిలో ఎస్.కోట ఏరియా ఆసుపత్రి, గజపతినగరం ఏరియా ఆసుపత్రి, బాడంగి, బొబ్బిలి, చీపురుపల్లి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్సీలు ఉన్నాయి. బీ గ్రేడ్లో ఆరు ఆసుపత్రులు 2025 మార్చి నెలలో ప్రభుత్వం ఆసుపత్రులకు గ్రేడ్లను ప్రకటించింది. ఆసుపత్రులు అందించే సేవలు అధారంగా ఏ, బీ, సీ గ్రేడ్లు ప్రకటిస్తారు. జిల్లాలో ఆరు ఆసుపత్రులకు బీ గ్రేడ్ ఇవ్వగా, ఒక ఆసుపత్రికి సీ గ్రేడ్ ఇచ్చారు. చీపురుపల్లి ఆసుపత్రికి సీ గ్రేడ్ ఇవ్వగా.. ఎస్.కోట, గజపతినగరం, భోగాపురం, నెల్లిమర్ల, భోగాపురం, బొబ్బిలి ఆసుపత్రులకు బీ గ్రేడ్ ఇచ్చారు. ఏరియా ఆసుపత్రి, సీహెచ్సీల్లో అందించే సేవలు ఏరియా ఆసుపత్రి, సీహెచ్సీల్లో గైనిక్, పిడియాట్రిక్, ఎముకలు, కంటి, దంత, జనరల్ సర్జరీ తదితర విభాగాలకు చెందిన రోగులను పరీక్షించి ఓపీ సేవలు అవసరమైన ఓపీ సేవలు అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన ఇన్పేషేంట్గా ఆస్పత్రిలో చేర్పించి సేవలు అందిస్తారు. అదే విధంగా గర్భిణులకు వైద్య తనిఖీలతో పాటు ప్రసవాలు, సిజేరియన్లు చేస్తారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎక్సరే వంటి సేవలు అందిస్తారు. డెప్యూటేషన్లతో కాలయాపన వైద్య విధాన్ పరిషత్లోని కొంత మంది వైద్యులు డెప్యూటేషన్లపై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధాన పరిషత్కు సంబంధించి ఇద్దరు వైద్యులు డెప్యూటేషన్పై డీసీహెచ్ఎస్ కార్యాలయంలో పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా ఆసుపత్రుల్లో సంబంధిత వైద్యులు అందించాల్సిన సేవలు రోగులకు పూర్తి స్థాయిలో అందడం లేదని రోగులు వాపోతున్నారు. -
సమ్మర్ బూట్ క్యాంప్ను సందర్శించిన డీఈవో
శృంగవరపుకోట : మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిసున్న ఏటీఎల్ సమ్మర్ బూట్ క్యాంప్ను డీఈవో యు.మాణిక్యాలనాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. పేపర్ట్రోనిక్స్, రొబోటిక్స్పై విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు డవలప్ చేసిన కంప్యూటర్ గేమ్ను చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చిన్నతనంలో ఆటోమేటిక్ కార్ల బొమ్మలు బజారులో కొనుక్కునే వారమని, ఇప్పుడు మీరే తయారు చేయటం ఆశ్యర్యం, అద్భుతం అన్నారు. ఇలాంటి వసతులు సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, వాటిని వాడుకోవాలన్నారు. సమ్మర్ బూట్ క్యాంప్లో కోడింగ్, ఆటోమేషన్, పేపర్ట్రోనిక్స్, పిక్టోబ్లాక్ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటివరకూ ల్యాబ్ సాధించిన విజయాలను జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, హెచ్.ఎం ఉమామహేశ్వరరావు, ల్యాబ్ ఇంచార్జ్ వి.రమేష్లు డీఈవోకు వివరించారు. 2019లో ప్రారంభమైన ల్యాబ్ జాతీయ స్థాయిలో హబ్ అటల్ ల్యాబ్గా గుర్తింపు సాధించిందన్నారు. రమేష్ మాట్లాడుతూ ఫ్రాన్స్కు చెందిన లా పౌండేషన్ డస్సాల్సిస్టమ్స్ సహకారంతో యూరిన్ రెగ్యులేటరీ డివైస్, బనానాకాటన్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేశామని, సి.డి.పి.ఎం.డి ప్రోడక్ట్స్ పేటెంట్ కోసం రిజిస్టర్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏఎంవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ శాక్స్ నిధులపై ఆడిట్
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ (ఏపీ శాక్స్) ద్వారా జిల్లాలో ఉన్న ఐసీటీసీలకు 2023–24 సంవత్సరంలో విడుదలైన నిధులపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ కార్యాలయంలో శనివారం ఆడిట్ నిర్వహించారు. ఏపీ శాక్స్ నుంచి వచ్చిన ఆడిట్ ఉద్యోగి శ్యామ్కుమార్ ఐసీటీసీ సెంటర్స్, ఎస్టీఐ క్లినిక్స్ సిబ్బంది నుంచి రికార్డులు తెప్పించుకుని ఆడిట్ నిర్వహించారు. నిధులు ఎంత విడుదల అయ్యాయి... వాటిని సక్రమంగా వినియోగించారా.. లేదా..., వినియోగించిన దానికి బిల్లులు ఉన్నాయా.. లేదా.., రికార్డుల్లో నమోదు చేసిందీ.. లేనిదీ... ఆడిట్లో పరిశీలించారు. -
ఆర్అండ్ఆర్ కాలనీలో పోలీసు పికెట్
● వైఎస్సార్సీపీ మండల కన్వీనర్పై దాడి నేపథ్యంలో గ్రామంలో పర్యటించిన సీఐ, ఎస్ఐ ● దాడులకు పాల్పడితే కఠిన చర్యలువంగర: నాయకులు, వ్యక్తులపై దాడులకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై దాడి కేసు నమోదైన నేపథ్యంలో ఎస్ఐ షేక్శంకర్తో కలిసి గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు కక్షపూరితంగా వ్యవహరించొద్దని, గుంపులుగా తిరగవద్దని, అవాంఛనీయ ఘటనలకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎటువంటి వివాదాలకు పాల్పడొద్దని, శాంతియుతంగా మెలగాలని సూచించారు. శ్రీహరిపురం ఆర్అండ్ఆర్ కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుదర్శనరావుపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ శనపతి సత్యారావు, ప్రజలు పోలీసులను కోరారు. -
నేడు నీట్ ప్రవేశ పరీక్ష
● 1,550 మంది కోసం 5 పరీక్ష కేంద్రాల ఏర్పాటు విజయనగరం అర్బన్: మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–2025 పరీక్ష జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం జరగనుంది. పట్టణంలోని జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీలో రెండు, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, కేంద్రీయ విద్యాలయంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,550 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 11వ తేదీ వరకు కలెక్టర్ సెలవు ● ఇన్చార్జి కలెక్టర్గా జేసీ సేతు మాధవన్ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆదివారం నుంచి 11వ తేదీ వరకు వ్యక్తిగత సెలవుపై వెళ్లనున్నారు. ఆయన తిరిగి ఈ నెల 12వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ కాలంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఇన్చార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో తెలిపాయి. 5న ఎస్టీ కమిషన్ చైర్మన్ గిరిజన వర్సిటీ సందర్శన విజయనగరం అర్బన్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి జెడ్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ సందర్శకులను కలిసిన అనంతరం 10.15 గంటలకు బయలుదేరి కొండకరకాం పరిధిలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి వెళ్తారు. అక్కడి పరిపాలనా సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మెంటాడ మండలం కుంటినవలస వద్ద నిర్మాణంలో ఉన్న గిరిజన వర్సిటీ పనులను పరిశీలిస్తారు. అధికారులు, సిబ్బందితో చర్చించిన అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి విజయనగరం జెడ్పీ అతిథి గృహానికి చేరుకుంటారు. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్క్ ● రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాలను ఎంపిక చేసి నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో శనివారం మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజధాని నిర్మాణాలను పునఃప్రారంభించినట్టు వెల్లడించారు. 58 వేల కోట్ల రూపాయలతో కూడిన విజన్ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించడం శుభపరిణామం అన్నారు. -
రాష్ట్రంలో బీహార్ సంస్కృతి
● ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ● వైఎస్సార్సీపీ వంగర మండలాధ్యక్షునిపై దాడి హేయం ● వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం ● మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రాజాం సిటీ: రాష్ట్రంలో బీహార్ సంస్కృతి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై టీడీపీ గూండాల దాడిని ఖండించారు. సుదర్శనరావును రాజాంలో శనివారం పరామర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి దాడులు చేసి భయపెట్టాలనుకోవడం హేయమైనచర్యగా పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొంది రాజకీయంగా ఎదుగుతున్నవారిపై దాడులుచేసి, భయపెట్టి లొంగదీసుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకాలు అధికమయ్యాయన్నారు. దాడులు, తప్పులు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షిస్తే ఇటువంటి దాడులు పునరావృతం కావన్నారు. ఇప్పటికీ తమకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా ఎటువంటి దాడులు, ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శాంతియుత పరిపాలన చేశారని, సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నారన్నారు. పార్టీ అధికారంలో ఉందని ఇష్టానుసారం దాడులు చేయడం, చట్టాల ను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే ప్రజా కోర్టులో ఫలితం వేరేగా ఉంటుందన్నారు. సుదర్శనరావుకు మేమంతా భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులకు భవిష్యత్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ● వైఎస్సార్ సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధినాయకత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పునకు అనుకూలంగా పాలన చేయాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. అధికారం శాశ్వతం కాదని, మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు చేస్తున్న హేయమైన ఘటనలకు చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రజల తరఫున పోరాడే వ్యక్తులపై దాడులు చేస్తే తగ్గేదేలేదని, న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ● వైఎస్సార్ సీపీ రాజాం ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి పగ, ప్రతీకారాలతో రగలిపోతున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు జరుగుతుండడం విచారకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలే భద్రయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ పట్టణ, మండలాల అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, కరణం సుదర్శనరావు, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైస్ ఎంపీపీలు యాలాల వెంకటేష్, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, కిమిడి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
మట్టితవ్వితే చర్యలు
మెరకముడిదాం: మండలంలోని గర్భాం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 311లో ఉన్న ఎర్ర చెరువులో మట్టితవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని గర్భాం మేజర్ పంచాయతీ ఈఓ విశ్వనాథం హెచ్చరించారు. ఈ మేరకు చెరువు గర్భంలో హెచ్చరిక బోర్డును శనివారం ఏర్పాటుచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవల చెరువులో మట్టితవ్వకాలు జరుపుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ● గర్భాం ఎర్రచెరువులో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు -
ఐసీడీఎస్లో సూపర్వైజర్ల కొరత
విజయనగరం ఫోర్ట్: సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్)లో సూపర్వైజర్ల కొరత నెలకొంది. పర్యవేక్షణ లోపం వెంటాడుతోంది. జిల్లాలో 2,499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు కాగా, 2,206 మెయిన్ కేంద్రాలు. వీటి పరిధిలో 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 5,889 మంది ఉన్నారు. 7 నెలలు నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 39,976 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు 27,918 మంది ఉన్నారు. వాస్తవంగా ఐసీడీఎస్లో 100 సూపర్ వైజర్లు ఉండాలి. ప్రస్తుతం 71 మంది మాత్రమే ఉన్నారు. 29 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో గ్రేడ్ –1 సూపర్ వైజర్ పోస్టులు 54 కాగా 52 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్ సూపర్ వైజర్ పోస్టులు 46 కాగా 16 మంది రెగ్యులర్ సూపర్ వైజర్లు, ముగ్గురు కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు ఉన్నారు. 27 సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా చోట్ల అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ లోపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధులు ఇలా.. ఒక్కో సూపర్ వైజర్ 20 నుంచి 25 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి. పోస్టుల ఖాళీలతో కొంతమంది సూపర్ వైజర్లు 50 కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. సరుకుల సరఫరా, నాణ్యత లోపిస్తే సరుకులను తిప్పిపంపించడం, అంగన్వాడీ కార్యకర్తలు అందించే సేవలు ఆన్లైన్ నమోదులో సాంకేతిక సమస్యలు పరిష్కరించడం, అంగన్వాడీ కార్యకర్తకు, సీడీపీఓకు సమన్వయకర్తగా వ్యవహరించడం వంటి విధులను సూపర్ వైజర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఐసీడీఎస్ డీపీ రుక్కానా సుల్తానా బేగం తెలిపారు. -
కానరాని హెచ్చరిక బోర్డులు....
అధికార బలం ఉంది. నియోజకవర్గ నేత అండ దండిగా ఉంది. దేవుడి భూములను ఆక్రమిస్తే అడిగేవారెవరని విర్రవీగుతూ.. చీపురుపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా చీపురుపల్లిలోని ఉమానీ లకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములను అమ్మకానికి పెట్టేశాడు. రూ.లక్షలు ఇచ్చేవారికి స్థలాలు కట్టబెడుతూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నాడు. కళ్లముందే దేవుడి భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం భూమిలో సాగుతున్న నిర్మాణాలు చీపురుపల్లి: విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారికి ఆనుకుని, చీపురుపల్లి–గరివిడి పట్టణాల మధ్య ఉన్న చీపురుపల్లి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఎకరా ధర రూ.కోట్లలో పలుకుతోంది. వీటిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. తనదైన శైలిలో ఆక్రమణలకు పథకం రూపొందించాడు. మార్కెట్లో బేరం పెట్టేశాడు. రూ.లక్షల్లో డబ్బులు వసూలుచేసి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నాడు. ఈ పాపంలో దేవదాయశాఖ అధికారులను భాగస్వాములు చేస్తున్నట్టు సమాచారం. అందుకే.. దేవస్థానం భూముల్లో కళ్లముందే కట్టడాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవుడి భూములను పరిరక్షించేందుకు పెద్ద వ్యవస్థ ఉన్నా కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆక్రమణల వ్యవహారమంతా ‘పైసామే పరమాత్మ’ అన్నట్టు సాగుతోందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అటు నాయకులు.. ఇటు అధికారులు కలిసి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములకు శఠగోపం పెడుతున్నట్టు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు క్యాంప్ కార్యాలయానికి సమీపంలో దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడాలు సాగుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. అక్రమ నిర్మాణాలు, కట్టడాలు అధికారులకు తెలిసే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఓ నాయకుడు నిర్మాణదారులు, దేవదాయశాఖ అధికారుల మధ్యన డబ్బుల మధ్యవర్తిత్వం నడుపుతున్నట్టు సమాచారం. నియోజకవర్గ నేత అండ ఉందని, అంతా చూసుకుంటానని నమ్మించి దేవుడి భూముల్లో కట్టడాలకు దన్నుగా నిలుస్తున్నాడు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. మధ్యవర్తిత్వం నడుపుతున్న టీడీపీ నాయకుడిపై ఆ పార్టీ వర్గాలే గుర్రుగా ఉన్నాయి. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. నిర్మాణాలు ఆపేదెవరు? రెవెన్యూకు దరఖాస్తు చేశాం సర్వే నంబర్ 135లో 18.89 ఎకరాల నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు గతంలోనే రెవెన్యూకు దరఖాస్తు చేశాం. రెవెన్యూ సదస్సుల్లోనూ అధికారులకు విన్నవించాం. ఆక్రమణల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. దేవస్థానం భూముల్లో త్వరలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. 18 ఆలయాల బాధ్యతలు చూస్తున్నాను. ప్రధానంగా తను రామతీర్థంలో ఉంటాను. – వై.శ్రీనివాసరావు, ఈఓ, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం, చీపురుపల్లి కళ్లెదుటే నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని దేవదాయశాఖ కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టని వైనం అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకుడు డబ్బులతో బేరసారాలు! చీపురుపల్లిలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములకు రక్షణ కరువు ఆవేదనలో భక్తజనం చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం, వంగపల్లిపేట ప్రాంతంలో ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నంబర్ 135లో 18.89 ఎకరాలు భూములు ఉన్నాయి. పూర్వ కాలం నుంచి దేవస్థానం భూములే అయినప్పటికీ 2018లో నిషేధిత భూములు జాబితా అమల్లోకి వచ్చినప్పుడు ఈ భూములను 22(ఎ)కి చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అంతకుముందు మాత్రం క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగేవి. 2018 తరువాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆ భూముల్లో నిర్మాణాలు నిషేధమని దేవదాయశాఖ కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం గమనార్హం. విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములు విలువ ఎకరా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య పలుకుతోంది. అంతటి విలువైన స్థలం ఆక్రమణలకు గురై, యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతుంటే దేవదాయశాఖ అధికారులు కనీసం నిలువరించే చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్మాణాలు జరుపుతున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడి నిర్మాణాలపై దేవదాయశాఖ అధికారుల తీరు చూస్తుంటే ‘కంచే చేనుమేస్తే’ అన్న చందంగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నువ్వెంతంటే నువ్వెంత..!
నెల్లిమర్ల రూరల్: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ అరుపులు, కేకలతో శుక్రవారం దద్దరిల్లింది. టీడీపీ నేతలు, ప్రాజెక్టు నిర్వాహకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంతంటే నువ్వెంత..! అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నెలకొంది. టీడీపీ నేతలు, ప్రాజెక్టు ప్రతినిధులు ఒకరిపైఒకరు భూతుల దండకం వినిపించారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఇరువర్గాలవారు వినిపించుకోలేదు. చివరకు ప్రాజెక్టు నిర్వాహుకులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెనుదిరిగారు. అసలేం జరిగిందంటే..! తారకరామతీర్థ సాగర్ ముంపు గ్రామమైన కోరాడపేట పంట పొలాల్లో మట్టిని తవ్వేందుకు ప్రాజెక్టు నిర్వాహుకులు శుక్రవారం సన్నద్ధమయ్యారు. దీనిని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ముంపు గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు యంత్రాలతో పనులకు సిద్ధం కావడంతో స్థానికులు ప్రతిఘటించారు. తెలుగు భాష రాని ఇద్దరు కార్మికులపై స్థానికులు దాడి చేశారనేది ప్రాజెక్టు నిర్వాహుకుల ఆరోపణ. పనులు అడ్డుకున్న మహిళలపై కార్మికులు అణుచిత వ్యాఖ్యలు చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రాజెక్టు డీఈ, ఏఈతో పాటు కాంట్రాక్టర్ రంగారావు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పనులు చేస్తున్నవారిని స్థానికులు కొట్టారని, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే గ్రామస్తుల తరఫున టీడీపీ నేతలు గేదెల రాజారావు, పోతల రాజప్పన్న కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అనంతరం ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. తమ భూమిని ఎన్ని సంవత్సరాలు వాడు కుంటారని ప్రాజెక్టు డీఈ, కాంట్రాక్టర్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించగా... పనికిమాలినోలంటూ.. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్కు చేరిన టీఆర్టీఎస్ ప్రాజెక్టు పంచాయితీ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ముంపు గ్రామ నిర్వాసితులు అరుపులు, కేకలతో దద్దరిల్లిన పోలీస్ స్టేషన్ న్యాయం చేసి పనులు చేయండి: నిర్వాసితులు తమకు నెల్లిమర్ల పట్టణంలో నివాస స్థలాలు, ప్రభుత్వం తమ వద్ద తీసుకున్న భూమికి భూమి తిరిగి అప్పగించాలని కోరాడపేటకు చెందిన తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ప్రాజెక్టు నిర్వాహుకులు, అధికారులు మాత్రం తమకు సహకరించడం లేదని వాపోయారు. సర్వే నంబర్ 45, 54 లో ఉన్న తమ భూమిని ప్రభుత్వ భూమిగా గతంలో తప్పుగా నమోదుచేసి అన్యాయంగా ప్రాజెక్ట్కు అప్పగించారని వాపోయారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాకే మట్టి తవ్వకాల పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కోరాడ అప్పలనాయుడు, రామునాయుడు, రామారావు, లక్ష్మి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, గౌరి, చిన్నంనాయుడు, సీతారాంతో పాటు గ్రామానికి చెందిన 100 మంది నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు మూడు నెలల్లో ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉందని, గట్టు నిర్మాణానికి సహకరించాలని ప్రాజెక్టు అధికారులు నిర్వాసితులను కోరారు. -
ఒక్క గింజ కొంటే ఒట్టు..!
విజయనగరం ఫోర్ట్: రైతన్నపై కూటమి ప్రభుత్వ అలసత్వానికి, కపట ప్రేమకు జిల్లాలో అపరాల కొనుగోలు ప్రక్రియే నిలువెత్తు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల హెక్టార్లలో రబీలో అపరాల పంటలను రైతులు సాగుచేశారు. 14,201 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదంటే ప్రభుత్వ తీరు అద్దం పడుతోంది. వాస్తవంగా అపరాల పంటలు ఫిబ్రవరి నెలలోనే చేతికొస్తాయి. మార్చి నెలకు ఇంచుమించుగా పూర్తవుతాయి. రైతులను ఆదుకోవాలి, మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశం ఉంటే పంట చేతికి వస్తుందన్న వారం రోజుల ముందుగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. వాటిపై ప్రచారం చేపట్టాలి. రైతులు తీవ్రస్థాయిలో గగ్గోలు పెట్టడంతో తీరిగ్గా ఈ ఏడాది మార్చి 19వ తేదీన జిల్లాలోని గంట్యాడ, బొబ్బిలి, జామి మండలం విజినిగిరి, సంతకవిటి, గజపతినగరంలలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. సుమారు 43 రోజులు అయినా ఒక్క గింజకూడా సేకరించకపోవడం గమనార్హం. ఈ మాత్రం దానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం దేనికని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకుందని చెబుతున్నారు. పెసర, మినుము పంటలను విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని విమర్శిస్తున్నారు. తక్కువ ధరకే విక్రయం.. అపరాలు (పెసర, మినుము) పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు పెసర, మినుములను తక్కువ ధరకే విక్రయించేశారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు పెసలు రూ.8,682, మినుములు రూ.7,400. అయితే అధిక శాతం మంది ఫిబ్రవరి నెలలోనే చేతికొచ్చిన పెసలు, మినుములను వ్యాపారులకు విక్రయించేశారు. పెసలు క్వింటాను రూ.6,500, మినుములు క్వింటా రూ.6 వేలు చొప్పున విక్రయించారు. ప్రభుత్వ అలసత్వంతో క్వింటాకు రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు రైతులు నష్ట పోయారు. సాగు ఇలా.. జిల్లాలో పెసర పంట 6,116 హెక్టార్లలో సాగుకాగా, 3,792 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మినుము పంట 16,523 హెక్టార్లలో సాగుకాగా 10,409 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చినట్టు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 22 వేల హెక్టార్లలో అపరాల సాగు జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఒక్క గింజకూడా కొనుగోలు చేయని వైనం తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించిన రైతులు కొనుగోలు జరగలేదు.. జిల్లాలో ఐదు చోట్ల అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగింది. అపరాలు కొనుగోలు జరగలేదు. – ఎన్.వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ -
హత్యాయత్నం
వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్పై..వంగర: విజయనగరం జిల్లాలోని వైఎస్సార్సీపీ వంగర మండల కన్వీనర్, శ్రీహరిపురం ఎంపీటీసీ సభ్యుడు, జెడ్పీటీసీ రాధమ్మ భర్త కరణం సుదర్శనరావుపై శుక్రవారం రాత్రి హత్యాయ త్నం జరిగింది. టీడీపీ గూండాలు కారును అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. డ్రైవర్ చాకచక్యంతో కారును ముందుకు తీసుకువెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో వంగర మండలం ఉలిక్కిపడింది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారన్నాయుడువలస–పెదగళావల్లి గ్రామాల మధ్య జరిగిన దాడి ఘటనపై పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరణం సుదర్శనరావు స్వగ్రామం శ్రీహరిపురం ఆర్అండ్ఆర్ కాలనీ. రాజాం పట్టణంలో నివసిస్తుండడంతో తన కారుపై శుక్రవారం రాత్రి 6.40 గంటలకు పయనమయ్యారు. కింజంగి, గంగాడ, నారన్నాయుడువలస గ్రామం దాటుకొని పెదగళావల్లి వైపు ప్రధాన రోడ్డు వద్దకు రాత్రి 7.20 గంటలకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న తామరచెరువు తుమ్మతోట వద్ద రోడ్డుపై అడ్డంగా పెట్టిన బైక్ను తప్పించేందుకు డ్రైవర్ కారు వేగాన్ని అదుపు చేశాడు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు రాడ్లు, కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశా రు. అనంతరం తనపై దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని సుదర్శనరావు వెల్లడించారు. డ్రైవర్ శంకరరావు రోడ్డు మధ్యన ఉన్న బైక్ను తప్పించి కారు వేగాన్ని పెంచి సమీపంలోని గళావల్లి గ్రామానికి చేరుకోవడంతో ప్రాణాలు దక్కినట్టు వెల్లడించారు. తొలుత వంగర పోలీస్ స్టేషన్కు... విషయం తెలుసుకున్న ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, సమీపంలో ఉన్న వంగర మండలానికి చెందిన పలు గ్రామాల వైఎస్సార్సీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు కరణం సుదర్శనరావుతో సహా వంగర పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఘటన తీరును వంగర ఎస్సై షేక్శంకర్కు వివరించారు. తనను హతమార్చేందుకు శ్రీహరిపురం ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు పాడి అన్నంనా యుడు, చీమల వాసులు, చీమల గణపతి, పా డి రాంబాబు, చీమల దాలినాయుడు, చీమల గౌరినాయుడు ప్రయత్నించారని, కారును అడ్డగించి దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యం వల్ల తన ప్రాణాలు దక్కాయని సుదర్శనరావు తెలిపారు. ఇటువంటి ఘటనలు వంగర మండలంలో ఎన్నడూ జరగలేదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సురేష్ముఖర్జీ ఎస్సైను కోరారు. ఉన్నతాధికారులతో ఎస్సై ఫోన్లో ట్లాడారు. ఘటన జరిగిన ప్రదేశం పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీస్స్టేషన్ పరిధిలోనిదని, అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. రాత్రి 10.30 గంటల సమయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకుల సమక్షంలో బలిజిపేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఆరుగురు వ్యక్తులపైన సుదర్శనరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బలిజిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దారికాచి హతమర్చేందుకు టీడీపీ గూండాలు యత్నం రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టి.. కారును అడ్డుకొని దాడి కారు అద్దాలు ధ్వంసం డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రాణాపాయం పార్వతీపురం మన్యం జిల్లా శివారులో ఘటన బలిజిపేట పోలీసులకు ఫిర్యాదు -
పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి
● డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల నాయకుల వినతి విజయనగరం అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ బాధ్యతలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకే అప్పగించాలని ఎస్టీయూ, పీఆర్టీయూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల సత్ఫలితాలు రావన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి.శ్యాం, పీఆర్టీయూ పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రామునాయుడు, ఎస్టీయూ జిల్లా నాయకులు శ్రీనివాసదొర, ఎం.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. ఐరన్ సుక్రోజ్ వ్యాక్సిన్లతో రక్తహీనత నివారణ ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: రక్తహీనతతో బాధపడే గర్భిణులకు పీహెచ్సీల్లో ఐరన్ సుక్రోజ్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నవంబర్ 2024 నుంచి మార్చి 2025 మధ్య జరిగిన నాలుగు మాతృ మరణాలు, 15 శిశు మరణాలకు కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలతో పాటు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు ప్రతిరోజు తినేలా చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ప్రసవ తేదీకి ముందే ఆస్పత్రులో చేర్పించాలని సూచించారు. సమావేశంలో డీఐఓ అచ్చుతకుమారి, డీసీహెచ్ఎస్ ఎన్.పి.పద్మశ్రీరాణి, జీవీకే సత్యనారాయణ, ఆర్.సుజాత, కిశోర్కుమార్, అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ బి.తవిటినాయుడు, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ వినతులపై విచారణ విజయనగరం అర్బన్: సీఎం, డిప్యూటీ సీఎం, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి వచ్చిన వినతులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శుక్రవారం తన చాంబర్లో విచారణ జరిపించారు. అర్జీదారులను, అధికారులను పిలిపించి ముఖాముఖి విచారణ చేశారు. డెంకాడ మండలం పెదతాడివాడకు చెందిన పొంతపల్లి లక్ష్మి తన భూమిని ఆక్రమించారనే అంశంపై డిప్యూటీ సీఎంకు దరఖాస్తు చేశారు. విచారణ జరపగా తనే ఆ భూమిని అమ్మివేసినట్టుగా రికార్డులో ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశంపై ఆమె ఇప్పటి వరకు 11 సార్లు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ప్రతిసారి దరఖాస్తు రాయడానికి రూ.500 చెల్లిస్తున్నట్టు ఆమె కలెక్టర్కు తెలి పారు. ఆమె వెనుక ఒక లాయర్ ఉండి రాయిస్తున్నారని వివరించారు. కలెక్టర్ సందిస్తూ దీనిపై సమగ్ర నివేదికను డిప్యూటీ సీఎంకు పంపించాలని డెంకాడ తహసీల్దార్కు సూచించారు. అలాగే, వంగర మండలం మడ్డువలస గ్రామానికి చెందిన పడాల సన్యాసిరావు తన 7 ఎకరాల భూమిని రీసర్వేలో వేరొక పేరు మీద రాసేశారన్న ఫిర్యాదుపై విచారణ జరిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, డీపీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ రమణమూర్తి, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు. -
దెబ్బకు ఠా..బెట్టింగ్ ముఠా..!
● ఐపీఎల్ బెట్టింగ్ యాప్ గుట్టురట్టు ● 11మంది నిందితుల అరెస్ట్ ● విలేకరుల ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ ● రూ 14లక్షల నగదు, ల్యాప్టాప్, 13మొబైల్స్ సీజ్ విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల రూపాయల సొమ్ము అక్రమంగా సంపాదిస్తున్న ముఠా గుట్టును బొబ్బిలి పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు విజయనగరం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం విలేకరుల ముందు నిందితులను ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డితో కలిసి ఎస్పీ వకుల్జిందల్ మాట్లాడారు. బొబ్బిలి పోలీస్ సబ్ డివిజన్ పరిధి బొబ్బిలి పీఎస్ పరిధి శివరాంపురం మామిడి తోటలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ముఠా గుట్టురట్టయిందని ఎస్పీ తెలిపారు. పార్వతీపురం–మన్యం జిల్లాకు చెందిన ముషిడిపల్లి దివాకర్ ప్రధాన నిందితుడిగా బెట్టింగ్ల్లో డబ్బు సంసాదించాలనే ఉద్దేశంతో బెంగళూరుకు చెందిన నిరంజన్రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకున్నాడు. రాధే ఎక్సేంజ్ అనే బెట్టింగ్ యాప్ను తీసుకుని అడ్మిన్గా ఉంటూ దాదాపు 200 మంది యువకులను ఈ యాప్ల ద్వారా ఆకర్షించాడు. కమీషన్ ఆశ చూపి యువతను నకిలీ బెట్టింగ్యాప్ల వలలో చేరుస్తున్నాడు. ఏజెంట్లుగా నియమించిన యువతతో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయిస్తూ కమీషన్ ఎరచూపి వాట్సాప్ లింకులు షేర్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ యాప్లను మరింతగా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో పార్వతీపురం–మన్యం జిల్లాకు చెందిన నవీన్, సంతోష్లతో కలిసి నేషనల్ ఎక్సేంజ్ అనే మరో బెట్టింగ్ యాప్కు అడ్మిన్ అయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఆకర్షించి డబ్బులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకునే వారని విచారణలో వెల్లడైందన్నారు. ఇలా బెట్టింగ్లకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. అలాగే నిందితుల దగ్గర నుంచి రూ 14లక్షల నగదు, ల్యాప్టాప్, 13మొబైల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. పరారీలో నలుగురు నిందితులుఅయితే పరారీలో ఉన్న మరో నలుగురు అడ్మిన్లైన నిరంజన్రెడ్డి, సంతోష్ , కార్తీక్, నవీన్ల కోసం గాలిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడైన ముషిడిపల్లి దివాకర్ ఏజెంట్లకు 3 శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు పొగొట్టుకున్న వ్యక్తుల నగదులో 50 శాతం సొమ్మును ఏజెంట్లకు ఇచ్చి వారిని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు ప్రొత్సహించేవాడని ఎస్పీ వకుల్జిందల్ తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించడం చట్ట వ్యతిరేకమని, జీవితాలు నాశనం చేసే బెట్టింగ్ల జోలికి ఎవరూ పోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. సిబ్బందికి అభినందనలు క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన బొబ్బిలి సీఐ సతీష్, ఎస్ఐ రమేష్, పీసీలు సత్యనారాయణ, సతీష్ కుమార్, ఎర్రంనాయుడు, అప్పారావులను ఎస్పీ అభినందించారు. -
కూరగాయల ధరల పతనం వాస్తవమే..
రామభద్రపురం: ఈ ఏడాది వంగ, బెండ కూరగాయలతో పాటు పలు రకాల కూరగాయల ధరలు పతనం కావడం వాస్తవమేనని, మార్కెటింగ్ శాఖ అధికాకారులతో మాట్లాడి కూరగాయలకు మద్ధతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ అన్నారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన కూరగాలయ పంటలకు మార్కెట్లో ధరలు పతనం కావడంతో కనీసం కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో అన్ని రకాల కూరగాయలకు ఊహించని రీతిలో ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై ఈ నెల 02వ తేదీన ‘కూరగాయల రైతు కుదేలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉద్యానశాఖాధికారి ఏవీఎస్వీ జమదగ్ని స్పందించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులతో మాట్లాడాలని మండల ఉద్యానశాఖాధికారి మోహనకృష్ణను ఆదేశించారు. ఆయన సీహెచ్ పైడిపునాయుడు, పూడి వెంకటరావుతో కలిసి రామభద్రపురంలో సాగుచేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కరోనా సమయంలో తప్ప ఈ సీజన్లో కూరగాయల ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఎన్నడూ చూడలేదని, క్రేట్తో కూరగాయలు మార్కెట్లో అమ్మేసి రవాణా, ఆశీలు చెల్లించి ఉత్తిచేతులతో ఇంటికి వెళ్లిపోతున్నామంటూ ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం అందడంలేదన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతులంతా ఒకే పంట వేయకుండా డిమాండ్ ఉన్న మిశ్రమ పంటలు సాగుచేయాలని సూచించారు. 6 నెలల పంట కాలం ఉన్న గ్రాఫ్టెడ్ టమాటా, వంగ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యానశాఖాధికారులు పి. కొండలరావు, సీహెచ్ అప్పలనాయుడు, ఎల్.హైమావతి, తదితరులు పాల్గొన్నారు. మద్ధతు ధర కల్పనకు చర్యలు తీసుకుంటాం మండల ఉద్యానశాఖాధికారి మోహనకృష్ణ -
ఈకేవైసీకి గడువు పెంపు
పార్వతీపురం: ఈకేవైసీ గడువు మళ్లీ పొడిగించారు. దీంతో పేదలకు టెన్షన్ తీరింది. ఏప్రిల్ 30వరకు ఈకేవైసీకి గడువు విధించడంతో రానున్న నెలల్లో రేషన్ నిలిచిపోతుందని పలువురు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈకేవైసీ చేయించుకునేందుకు జూన్ 30వరకు గడువును పొడిగించింది. దీంతో కార్డుదారులు కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 38వేలమంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట రేషన్ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్కార్డుల్లోని సభ్యులంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా చర్యలు చేపడుతున్న తరుణంలో రేషన్కార్డులో లబ్ధిదారులంతా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని 15 మండలాల్లో 2,77, 153 రేషన్ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు 7.80లక్షమందివరకు ఈకే వైసీ చేయించుకోగా మిగిలినవారు చేయించుకోవాల్సి ఉంది. ఈకేవైసీ చేయించుకునేందుకు ఇంతవరకు రెండుసార్లు గడువును విధించి పొడిగిస్తున్నారు. తాజాగా జూన్ 30వరకు గడువు విధించారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్, విశాఖపట్నం, చైన్నె, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వలసవెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్ కార్డులో పేర్లను కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు దూరం అవకూడదనే ఉద్దేశంతో రేషన్కార్డులను వినియోగిస్తూ ఆయాప్రాంతాల్లో రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు కూడా ఈకేవైసీ చేయించాలని ఆదేశించడంతో వారి వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. జూన్ 30వరకు సమయం లబ్ధిదారులకు తీరిన టెన్షన్ జూన్ నెలాఖరు లోగా చేయించుకోవాలి రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకునేందుకు జూన్ నెలాఖరువరకు గడువును పొడిగించారు. ఇంకా చేయించుకోని లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి. ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా -
బస్సులు లేక అవస్థలు
బస్సులు లేక బోసిపోయిన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ అమరావతిలో శుక్రవారం జరిగిన ప్రధాని మోదీ సభకు జనాలను తరలించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి సుమారు 100 బస్సులు వినియోగించారు. బస్సులు లేక విజయనగరం కాంప్లెక్స్ బోసిపోయింది. ప్రధాన రూట్లతో పాటు, మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు కాంప్లెక్స్ల నుంచి బంధువుల సాయంతో బైక్లపై గమ్యస్థానాలకు చేరుకోగా, మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్, ఆటోలకు అధిక డబ్బులు వెచ్చించి ప్రయాణం సాగించారు. దీనికి ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు
బొబ్బిలి: పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో మూడు నియోజకవర్గాల రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్ ఈఈ టీవీ రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో 2, రాజాంలో 2, గజపతినగరంలో 3 రహదారుల మరమ్మతులు చేసేందుకు నాబార్డ్ నిధులు రూ.12.87 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ రహదారులకు సంబంధించి త్వరలోనే ఆన్లైన్ టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. అలాగే మూడు నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.109 కోట్లతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ పనుల్లో ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన 1046 పనులు పూర్తయ్యాయని, వాటికి రూ.10 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు టీఎల్ఎం కిట్లుపార్వతీపురం: ప్రత్యేక అవసరాల పిల్లలకు టీఎల్ఎం కిట్లను సెంటర్ ఫర్ రిహ్యాబిలిటేషన్ కౌన్సిల్, నెల్లూరు సంస్థ అందించినట్లు ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి డి.రమాజ్యోతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక అవసరాల కేంద్రంలో ఇంటలెక్చువల్ డిజేబులిటి (మేధో వైకల్యం) కేటరిగిలో 13మంది ఎస్టీ కమ్యూనిటీకి చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలకు రూ.1.30లక్షల విలువచేసే టీఎల్ఎం కిట్లను ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆమె అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన కిట్లు అందించేందుకు నెల్లూరులోని స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. టీఎల్ఎం కిట్లును సద్వినియోగం చేసుకునేలా ఐఈఆర్పీలు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీసీ రెడ్డి తేజేశ్వరరావు, సెక్టోరియల్ అధికారి మధుకిషోర్, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ భానుమూర్తి, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. సారాతో ఇద్దరి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం ప్రొహిబిషన్/ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామం వద్ద సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి 22 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. అక్రమంగా సారా అమ్మకాలను నిరోధించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తమ సిబ్బంది దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా సారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి సంఘటనలు గ్రామాల్లో జరిగినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఆర్.చంద్రకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం అర్బన్: ఉద్యోగావకాశాలు లభించే సాఫ్ట్వేర్ డెవలపర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సుల శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వీటీఅగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ టీవీ గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చే ఈ కోర్సులకు ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువుకున్న వారంతా అర్హులేనని, 35 ఏళ్ల వయసులోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లను నమోదు చేసుకొని ఆధార్ కార్డు, 2 ఫొటోలతో నేరుగా స్థానిక ఐటీఐ కళాశాలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7780658035 నంబరును సంప్రదించాలని సూచించారు. -
బర్త్ సర్టిఫికెట్ల దరఖాస్తుల స్వీకరణలో అలసత్వం వద్దు
పార్వతీపురం టౌన్: జిల్లాలో 6 ఏళ్ల లోపు వయసు గల పి ల్లలకు జారీచేయనున్న బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో అలసత్వం వద్దని జాయింట్ కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ సీతంపేట, బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పాలకొండ, పార్వతీపురం, సాలూరు అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు దరఖాస్తులు స్వీకరించక పోవడంపై ఆమె ఆరా తీశారు. శనివారం ఉదయానికి ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలని, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బర్త్ సర్టిఫికెట్లు మంజూరైతే, ఈ నెలాఖరులోగా పిల్లలకు ఆధార్ కార్డులు వస్తాయని, కావున దీనిపై అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నరేగా పనుల్లో కూడా అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సగటు దినసరి వేతనం రూ.300లు ఉండేలా అధికారులు చొరవ చూపాలని చెప్పారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫారంపాండ్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, కావున దీనిపై దృష్టి సారించి ప్రతి గ్రూపు కనీసం ఐదు ఫారంపాండ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ అదికారులు చొరవ చూపాలి జిల్లాలో చేపడుతున్న గృహనిర్మాణాల్లో ఇంజినీరింగ్ అధికారులు చొరవ చూపేలా మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రతిరోజూ గృహ నిర్మాణాల ప్రగతి ఉండాలని, లేదంటే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉండే గృహ నిర్మాణాల్లో ముందుగా తుది దశకు చేరుకున్న గృహాలపై ప్రత్యేక దృష్టిని సారించి వాటిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పథకాల గృహాలతో పాటు ముఖ్యంగా పీఎం జన్మన్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జేసీ స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ త్వరితగతిన పరిష్కారం కావాలి ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే దరఖాస్తులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జేసీ అన్నారు. సోమవారం రోజున వచ్చే దరఖాస్తులన్నీ వచ్చే సోమవారానికి ఏ ఒక్కటీ పెండింగ్ లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, గృహనిర్మాణ సంస్థ, డీఆర్డీఏ, డ్వామా, పీడీలు డా.పి.ధర్మచంద్రారెడ్డి, ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, పంచాయతీ అధికారులు కె.రాబర్ట్పాల్, బి.శ్యామల, డా.ఎన్.మన్మథరావు, టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నరేగా పనుల్లో మరింత ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి హౌసింగ్పై మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక -
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు గేదెల రామారావు (60) వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఎప్పటి లాగా శుక్రవారం కూడా గ్రామంలోని డెంకాడ చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనికి వెళ్లాడు. ఉదయం 9.30 గంటల సమయంలో సొమ్మసిల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో తోటి వేతనదారులు చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. విద్యుత్ షాక్తో యువకుడు..గుమ్మలక్ష్మీపురం(కురుపాం): తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో విద్యుత్ షాక్ తగిలి కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ డంగులగూడ గ్రామానికి చెందిన బిడ్డిక ప్రశాంత్(23) మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రశాంత్ గోపాలపురంలోని ఓ రొయ్యిల చెరువులో కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం చెరువులోని పనికి వవెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడంటూ..ఫోన్ ద్వారా రొయ్యిల చెరువులో పనిచేస్తున్న సహచర కూలీలు, రొయ్యల చెరువు యజమాని సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు తెలియజేశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే గోపాలపురం పయనమయ్యారు. లారీ ఢీకొని వ్యక్తి..సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీ వద్ద శుక్రవారం లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం, పెదకాద గ్రామానికి చెందిన గంగవరపు సత్యం(50)సీతానగరం కుమ్మరివీధిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, సమీపబంధువుల ఆధ్వర్యంలో తామరఖండిలో నిర్వహిస్తున్న ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. ఒడిశా నుంచి యాష్ లారీ ఇటుకల బట్టీలో అన్లోడ్ చేయడానికి వచ్చింది. అన్లోడ్ చేయడానికి ఇటుకబట్టీని ఆనుకుని లారీ వెనక్కి మళ్లిస్తుండగా మధ్యలో ఉన్న గంగవరపు సత్యం ఇరుక్కుపోవడంతో ప్రమాదం జరిగి గాయాలపాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి కేసునమోదు చేసినట్లు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. -
సమస్యల పరిష్కారం, సంక్షేమానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపడతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తూ సిబ్బంది వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్న్స్–డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది పాల్గొని వారి సమస్యలను తనకు నేరుగా తెలియజేయాలని ఎస్పీ కోరారు. వచ్చిన సమస్యలను కూలంకుషంగా విని, విన్నపాలను పరిశీలించి సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మహిళల సంరక్షణపై డేగకన్ను
విజయనగరం క్రైమ్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల కోసం, వారి సంరక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహిళా సంరక్షణ పోలీస్వింగ్ను కూటమి ప్రభుత్వం కాస్త మార్పులు చేసింది. వారి విధులను పర్యవేక్షించడానికి ప్రత్యేకించి ఓ వెబ్సైట్ను రూపొందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం వీసీ హాలులో వెబ్ సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు వాల్పోస్టర్ను తన చాంబర్లో ఆవిష్కరించారు. తొలిసారిగా విజయనగరం జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రప్రథమంగా లాంచ్ చేశామని చెప్పారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు నిర్వర్తించే విధులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ, శక్తి యాప్ డౌన్లోడ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, బాల్య వివాహాలు, అసాంఘిక కార్యక్రమాలు వంటి సమాచారాన్ని తెలియపరచడంతో పాటు చైతన్యం కలిగించే అంశాలను సదరు వెబ్సైట్లో పొందుపరచనున్నామన్నారు. ప్రధానంగా ఈ పనికి మహిళా పోలీసులను గుర్తించి సమర్థవంతంగా పని చేసేవారికి ఇచ్చిన లక్ష్యాలను బేరీజు వేసుకుని వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. నెలాఖరున నిర్వహించిన విధులు, సాధించిన లక్ష్యాల ఆధారంగా ఐదుగురిని జిల్లా కేంద్రానికి పిలిచి అభినందించి ప్రొత్సాహకాలు ఇస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్సైట్ -
ప్రకృతి వైపరీత్యాలతో ఆందోళన చెందవద్దు
● జాగ్రత్తలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు ● అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలుమక్కువ: ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. ఈ మేరకు మక్కువ మండలంలోని వెంకట భైరిపురం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు, తహసీల్దార్ షేక్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ బృందం సభ్యులు ప్రకృతి వైపరీత్యాల్లో ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. వెంకటభైరిపురం గ్రామం సమీపంలో కొత్తవలస ఆనకట్టపై వరద ఉధృతి వచ్చేటప్పుడు, ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆనకట్టు నీటిలో ప్రాక్టికల్స్ నిర్వహించారు. వెంకట భైరిపురం హైస్కూల్లో ఫైర్ బ్రిగేడియర్ ఆపరేషన్పై, భూకంపాలు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అకస్మికంగా గ్యాస్ లీక్ అయితే, ఏ విధంగా మంటలను అదుపు చేయాలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ, వైద్యశాఖ, పోలీస్, పంచాయతీరాజ్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
గంగపుత్రుల బెంగ..!
● ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం ● గతంలోనే రూ.23 కోట్లు మంజూరు ● శంకుస్థాపన చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ● అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా ఊసెత్తని కూటమి ● అవస్థలు పడుతున్న గంగపుత్రులుపూసపాటిరేగ: జిల్లాలోని తీరప్రాంతం చింతపల్లికి మంజూరైన ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. పది నెలల క్రితం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చింతపల్లికి రూ.23 కోట్లుతో జెట్టీని మంజూరు చేశారు. అన్ని అడ్డంకులు తీరి ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన తరువాత అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలవుతున్నా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం ఊసెత్తలేదు. జిల్లాలో తీరప్రాంత మత్స్యకారులు ప్రధాన అవసరమైన ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్టీ నిర్మాణం కాకపోవడం, తరచూ తుఫాన్ హెచ్చరికలు జారీ అవడం వంటి కారణాలతో తీరప్రాంతం వీడి సుమారు 3 వేల మంది మత్స్యకారులు వలసబాట పట్టారు. జిల్లాలో తీరప్రాంతమైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది చేపల వేటనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి ఉన్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 885 బోట్లలో సుమారు 3798 మంది మత్స్యకారులు నిత్యం వేటను సాగిస్తుంటారు. వేటలేక వివిధ కారణాల రీత్యా మరో 3 వేల మంది మత్స్యకారులు బతుకు తెరువుకోసం విశాఖ, గుజరాత్ , హీరావళి, సూరత్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. తీరంలో జెట్టీ లేకపోవడంతో విపత్తుల సమయంలో పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోయి నష్టాలు చవిచూస్తున్నామని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. కాలుష్యంతో మత్స్యసంపద నాశనం జెట్టీ సమస్యతో పాటు పరిశ్రమల వ్యర్థజలాలు తమ పొట్టలు కొడుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. రసాయన పరిశ్రములు వ్యర్థజలాలను సముద్రంలో కలిపేయడంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపల వేటకు వెళ్తే భారీగా వలకు చేపలు చిక్కేవని నేడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. వేట సాగక పోవడంతో వలస వెళ్లే పరిస్థితి అని మత్స్యకారులు వాపోతున్నారుతక్షణమే ఫ్లోటింగ్ జెట్టీ నిర్మించాలి జెట్టీ లేకపోవడంతో వేట చేసిన తరువాత ఒడ్డుకు చేరిన పడవలకు రక్షణ లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. గత ప్రభుత్వంలో జెట్టీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం జెట్టీ నిర్మాణంపై నిర్లక్ష్యం చేయకుండా నిర్మాణంపై తక్షణమే దృష్టిసారించాలి. బి.కొర్లయ్య, చింతపల్లి మత్స్యకారుడు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలిఅధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. జెట్టీ నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారులు జీవనోపాధి మెరుగుపరచాలి. బి. అప్పలస్వామి, మత్స్యకారుడు పతివాడ బర్రిపేట. -
అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న శిబిరాలపై పెద్దఎత్తున దాడి నిర్వహించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం, సారా తయారీని నివారించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్న ఎకై ్సజ్ శాఖ, ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి గురువారం బందుగాం బ్లాక్ లోని అత్తిగుడ, చైన బంకిడి, ఎగువబద్ద గ్రామాల్లో ఏకకాలంలో పెద్ద ఎత్తున దాడి చేశామన్నారు. ఈ దాడిలో 10,800 లీటర్ల ఎఫ్జే వాష్, 40 లీటర్ల ఐడీ లిక్కర్, 200 కిలోల బ్లాక్ జాగరి, 40 కిలోల అమ్మోనియాను పట్టుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన క్రాస్–బోర్డర్ కార్యకలాపాల గురించి ఇంటెలిజెన్న్స్ సమాచారం ఆధారంగా ఈ రైడ్ నిర్వహించామని, ఈ పదార్థాల నుంచి ప్రమాదకరమైన నకిలీ మద్యం తయారు చేసి ప్రాణనష్టానికి కారకులవుతున్నారన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మరింత విజిలెన్న్స్ పెంచి, అక్రమ మద్యం తయారీని పూర్తిగా నిర్మూలించడానికి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. ఈ ఆపరేషన్లో పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, సాలూరు ఎస్హెచ్ఓ బృందాలు, బీఎంపీపీ సాలూరు, ఈఎస్టీఎఫ్ విజయనగరం, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు మొత్తం 27 మంది పాల్గొన్నట్లు తెలిపారు. -
మందుగుండు గోదాములపై దాడులు
విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని జెడ్పీలో జరిగిన అగ్నిప్రమాదంతో పోలీసులు అలెర్టయ్యారు. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అయినప్పటికీ వేసవికాలం దృష్ట్యా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా మందుగుండు గోదాములను తనిఖీ చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఆయా స్టేషన్హౌస్ ఆఫీసర్లు మందుగుండు గోదాములను చెక్చేశారు. లైసెన్స్డ్ గోదాములను చెక్చేసిన పోలీసులు మందుగుండు సామగ్రి నిల్వలు, భద్రతా ప్రమాణాలు,వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ అనధికారికంగా లైసెన్స్ లేని మందుగుండు గోదాములపై కేసులు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన ప్రమాణాలను గోదాములు నిర్వహిస్తున్న యజమానులకు వివరించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా గోదాములలో జరిగే తనిఖీలను బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పరిశీలించాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు -
పదోన్నతి నియామక పత్రాల అందజేత
విజయనగరం: జిల్లా పరిషత్ పరిధిలోని వివిద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పదోన్నతి నియామక పత్రాలు అందజేశారు. పార్వతీపురం సబ్డివిజన్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వై.దేవానంద్ను డెంకాడ మండ ల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించారు. అలాగే జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జి.లీలావతికి భైరిపురం జిల్లా పరిషత్ పాఠశాల జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి క ల్పించారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన చాంబర్లో నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీవీ.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్రామన్లు పాల్గొన్నారు. క్రీడలతోనే మంచి సమాజం● కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరం: క్రీడలతోనే మంచి సమాజ స్థాపన సాధ్యమవుతుందని కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విజ్జి మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాడ్మింటన్, బాక్సింగ్, హ్యాండ్బాల్, తైక్వాండో క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం కోసం,విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించాలని వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు, వివిధ క్రీడా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టుసాలూరు రూరల్: మండలంలోని కందులపధం గ్రామంలో గురువారం పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతానికి చేరుకుని పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులతో పాటు 3 మోటార్సైకిల్స్, రూ.26,190 నగదు సీజ్ చేశామన్నారు. భూ ఆక్రమణలపై జోక్యం చేసుకోవాలి● ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి విజయనగరం అర్బన్: అనంతగిరి మండలం బీంపోలు పంచాయతీ సరియాపల్లి గ్రామ ప్రజల భూఆక్రమణలపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు.తమ భూమి గిరిజనేతరుల ఆక్రమణకు గురైందని వాపోయారు. దీనిపై స్పందించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిషన్ చైర్మన్ను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ ఎం.అప్పలకొండ, ఎంపీటీసీ అశోక్, సతీష్ తదితరులు ఉన్నారు. వ్యక్తి అదృశ్యంవంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన సాకేటి లక్ష్మణరావు (47) అదృశ్యమైనట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. వంగరలో హెచ్పీ గ్యాస్ ఆఫీస్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు ఆయన భార్య సాకేటి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పంటల సాగుకు ముందస్తు ప్రణాళికలు అవసరం
గరుగుబిల్లి: ఖరీఫ్లో పంటల సాగుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన తోటపల్లిలోని జట్టు ట్రస్టు ప్రాంగణంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు ఖరీఫ్ పంటలప్రణాళిక తయారీ, నవధాన్యాల సాగు తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుతుపవనాలు రావడానికి నెల రోజుల ముందు నవధాన్యాలు సాగుచేసుకోవాలని సూచించారు. ప్రధాన పంటను సాగుచేయడానికి ముందు నవధాన్యాలు సాగుచేసుకుంటే భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెప్పారు. నవధాన్యాల కిట్లు రైతు సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. డీపీఎం షణ్ముఖరాజు మాట్లాడుతూ భూములకు భూపరీక్షలను చేయించుకుంటే పోషకాల లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రీజినల్ టెక్నికల్ అధికారి జి.హేమసుందర్ మాట్లాడుతూ ఏడాదంతా భూమిపై పంటలు పండించేలా ప్రణాళిక చేసుకుంటే బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి విజయభారతి, జట్టు డైరెక్టర్ ప్రహరాజ్, రైతు సాధికార సంస్థ ప్రతినిధి బి.భాను తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
పాలకొండ: ఇటీవల సైబర్ క్రైమ్ కేసులను పోలీసులు త్వరగా ఛేదించి మన్ననలు అందుకుంటున్నారు. పాలకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన పలు సైబర్ నేరాలను ఇప్పటికే ఛేదించిన పోలీసులు తాజాగా ఫోన్ దొంగిలించి అందులోని ఫోన్పే ద్వారా డబ్బులు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఆ వివరాలను డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. గత ఏడాది నవంబర్ నెలలో తన ఫోన్ దొంగిలించి ఫోన్పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని భామిని మండలానికి చెందిన బోదేపు నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలకొండలో పనులు పూర్తి చేసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సుకోసం వేచి ఉన్న సయమంలో ఫోన్ దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ టీమ్ను అప్రమత్తం చేసి ఖాతాలో ఉన్న మిగతా మొత్తం విత్డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం అప్పటికే ఫోన్పే ద్వారా రూ.92, 200 డ్రా చేయడంతో దాని ఆధారంగా కేసు దర్యప్తు చేపట్టారు. నిందితులు చిలకపాలెం పెట్రోల్ బంక్లో ఫోన్పే చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఇలా పలు చోట్ల ఫోన్ పే చేస్తాం డబ్బులు కావాలని అడిగి నగదు తీసుకున్నారు. దీంతో సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సాంకేతికను ఉపయోగించి నిందితులు తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. బుధవారం మరోసారి నిందితులు పాలకొండ వచ్చి ఒక లాడ్జిలో బస చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మేకల వెంకటేష్, విజయనగరం జిల్లాకు చెందిన పసుపురెడ్డి గోపీచందు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహమ్మద్ బాషాలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.92, 200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యప్తులో కీలకంగా వ్యవరించిన సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
మాజీ ఎమ్మెల్యే పెద్ద మనసు
● రోడ్డు ప్రమాద బాధితులకు సపర్యలు ● దగ్గరుండి ఆస్పత్రికి తరలింపుపాలకొండ రూరల్: మండలంలోని పనుకువలసకు చెందిన టి.మన్మథరావు, ఎస్.విశ్వనాథం గురువారం తమ సొంత పనులమీద ద్విచక్ర వాహనంపై వీరఘట్టం వైపు పయనమయ్యారు ఈ క్రమంలో గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురై గాయపడ్డారు. వారిద్దరూ ప్రధాన రహదారిపై రక్తమోడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో పాలకొండ వస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి క్షతగాత్రులను గుర్తించి తన వాహనం నిలిపి క్షతగత్రులకు తన తల్లి మనసు చూపించి తక్షణ సపర్యలు అందజేశారు. అటుగా వస్తున్న పీహెచ్సీ వైద్యాధికారిని ఆపి బాధితులకు సేవలు అందించాలని కోరారు. క్షతగాత్రులను పరిశీలించిన వైద్యాధికారి వారిని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. 108 వాహనానికి మాజీ ఎమ్మెల్యే కళావతి ఫోన్ చేయగా వాహనం పార్వతీపురం దగ్గరలో ఉండడంతో అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రత్యేకంగా ఆటోలో బాధితులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అనంతరం కళావతి కూడా ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సరైన సమయంలో స్పందించిన మాజీ ఎమ్మెల్యే కళావతి బాధితులను రక్తమోడిన గాయాలతో బాధపడుతుండగా ఆమె కళ్లు చెమర్చాయని, మానవత్వం చాటుకున్నారని ఘటనాస్థలంలో ఉన్నవారు చర్చించుకున్నారు. -
ఫలితాలు ‘ఆదర్శ’ నీయం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో గ్రామీణ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డులో గురువారం పెట్టారు. రుషాంత్ అనే విద్యార్థి 100కు 92 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అంబళ్ల సూర్యతేజశ్వని–89, ముడి వాసు–86, రౌతు ప్రేమ్సాయి–85, సత్యగాయత్రి–84, యడ్ల కృపాంజలి–82, యామిని– 81 మార్కులతో వరుసగా ఏడు ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన 444 మందిలో 104 మంది విద్యార్థులు 60కు పైగా మార్కులు సాధించారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు. చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి దత్తిరాజేరు: మండలంలోని గడసాం గ్రామంలో చింత చెట్టుపై నుంచి జారిపడిన మజ్జి రామునాయుడు (35) గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న చింతచెట్టు నుంచి కాయలు కోస్తుండగా జారి పడడంతో రామునాయుడుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నాలుగేళ్ల కిందట కుమారుడు చెరువులో పడి మృతిచెందగా.. ఇప్పుడు భర్త చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో భార్య గంగ కన్నీటిపర్యంతమవుతోంది. కుమార్తె హారికకు దిక్కెవరంటూ రోదిస్తోంది. కేసు నమోదుచేసినట్టు పెదమానాపురం ఎస్ఐ తెలిపారు. జాతీయ లోక్అదాలత్ వాయిదా పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 10వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్అదాలత్ జూలై 5వ తేదీకి వాయిదా పడిందని రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా సాధికారత కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మో టార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదా ల పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ కక్షిదారుడు వినియోగించుకుని లబ్ధిపొందాల ని ఆయన కోరారు. వీరఘట్టంలో కుండపోత వీరఘట్టం/విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిలాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వీరఘట్టంలో గంట కాలంపాటు కుండపోతగా వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జనజీవనం స్తంభించింది. వీరఘట్టం బీసీ కాలనీ వద్ద పొల్లరోడ్డులో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. వండవ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. -
అతిథులారా.. రారండోయ్!
ప్రయాణ కష్టాలు సాక్షి, పార్వతీపురం మన్యం/ విజయనగరం అర్బన్: అయిపోయిన పెళ్లికి కూటమి నాయకత్వం మళ్లీ భజంత్రీలు వాయిస్తోంది. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి... ఆ మొత్తాలను తమ ప్రచారాలకు, ఆర్భాటాలకు ఖర్చు చేస్తోంది. కేవలం గ్రాఫిక్ హంగులతో కూడిన అమరావతి నిర్మాణాలు చేపట్టిన బాబు సర్కారు.. నేడు మరోమారు పునఃప్రారంభ కార్యక్రమాల పేరిట ప్రజా ధనం రూ.కోట్లు వెచ్చిస్తోంది. అప్పట్లో ప్రారంభో త్సవానికి ప్రధాని మోదీ రాకను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేశారు. వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్తోపాటు పలు శాఖల పరిధిలో మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి వేతనదారులను, దిగువస్థాయి సిబ్బందిని అమరావతి తరలించారు. దీనికోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ఈ తరహా చర్యలకు తెర తీశారు. అమరావతి రాజధాని పునఃనిర్మాణమంటూ కూటమి ప్రభుత్వం మరోసారి హడావిడి చేస్తుండగా.. అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని కూటమి ఎమ్మెల్యేలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వారేమో అధికారులకు ‘టార్గెట్’లు ఇచ్చారు. ఎక్కువగా మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలను గుంటూరు జిల్లా అమరావతికి తరలించారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను వినియోగించారు. విజయనగరం నుంచి తరలిన బస్సులు విజయనగరం జిల్లా పరిధిలోని ఎస్.కోట, విజయనగరం డిపోల 43 బస్సులు అమరావతి సభకు వేశారు. ఇందులో బొబ్బిలి నియోజకవర్గంలో 5, చీపురుపల్లి 5, గజపతినగరం 5, నెల్లిమర్ల 5, రాజాం 5, ఎస్.కోట 5, విజయనగరం నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున బస్సుల ద్వారా జనాలను తరలించారు. ఒక్కో బస్సుకు 40 నుంచి 50 మంది వరకు వెళ్లారు. ఇవి కాక, ప్రైవేట్ సర్వీసుల ద్వారానూ పెద్ద ఎత్తున జనం వెళ్లారు. ● పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల నుంచి ఆర్టీసీ సేవల్లో కోత పెట్టి అమరావతికి తరలించారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి దాదాపు 60 బస్సుల్లో డ్వాక్రా సంఘ సభ్యులు, ఉపాధి వేతనదారులను అమరావతికి తీసుకెళ్లారు. ఈ తంతు నేరుగా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే సాగడం గమనార్హం. మండలానికి ఒకట్రెండు బస్సులు వెళ్లాయి. ప్రధానంగా ఉపాధిహామీ వేతనదారులు, డ్వాక్రా సభ్యులను తరలించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఈ బాధ్యతను దిగువస్థాయి సిబ్బందికి అప్పగించారు. వారిపై నాయకులు, శాఖాపరమైన అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చారు. ● పాలకొండ డిపో నుంచి 14 బస్సులు గుంటూరుకు కేటాయించగా.. మరో ఐదు సర్వీసులను నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అమరావతికి పంపించారు. గురువారం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ–2, శ్రీకాకుళం–1, కొత్తూరు–5 సర్వీసులు రద్దు చేసి ప్రత్యామ్నాయ సేవలు అందించే ఏర్పాటు చేశారు. ● పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి అయిదు బస్సులు చొప్పున వెళ్లాయి. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో పార్వతీపురం డిపో 14, పాలకొండ 14, సాలూరు డిపో నుంచి 12 బస్సులు చొప్పున వెళ్లాయి. ఇవి కాక.. కొన్ని ప్రాంతాల నుంచి అదనంగా ఉన్న ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను కూడా వినియోగించారు. పార్వతీపురం కలెక్టరేట్ నుంచి చుట్టుపక్కల మండలాల ప్రజల కోసం 20 బస్సులు గురువారం బయల్దేరి వెళ్లాయి. ఇలా 15 మండలాలకూ లక్ష్యాలను నిర్దేశించారు. మండలానికి కనీసం వంద మంది బయల్దేరినట్లు తెలుస్తోంది. అమరావతి పునఃనిర్మాణమంటూ మళ్లీ.. భజంత్రీలు మోదీ రాక నేపథ్యంలో భారీ జనసమీకరణకు ఏర్పాట్లు మండల స్థాయి నుంచి పెద్ద ఎత్తున అమరావతికి తరలింపు మహిళా సంఘాలు, ఉపాధి వేతనదారులే అధికం హడావిడిలో కూటమి నాయకులు అధికారులకు బాధ్యతలు.. టార్గెట్లు రూ.లక్షల ప్రజాధనం వృథా విజయనగరం, పాలకొండ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని రద్దీమార్గాలోని బస్సులను అమరావతికి జనాల తరలింపునకు వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయా రూట్లలో వెళ్లేవారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు అమరావతి ప్రయాణమంటేనే విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి మూడు రోజులు కేటాయించాల్సి వస్తుందని.. అన్ని రోజులు కుటుంబాలను, పిల్లలను వదిలి వెళ్లడం కష్టంగా ఉంటుందని పలువురు మహిళలు వాపోయారు. దీనికితోడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బస్సుల్లో అంత దూరం ఎలా వెళ్లగలమంటూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. వెళ్లకపోతే పనులు కల్పించబోమని హెచ్చరించడంపై పలువురు ఉపాధిహామీ వేతనదారులు నిలదీశారు. అయితే, పై నుంచి వచ్చిన ఆదేశాలంటూ అధికారులు సర్దిచెప్పేప్రయత్నం చేశారు. -
కూరగాయల రైతు కుదేలు
రామభద్రపురం: రైతన్నకు గడ్డు పరిస్థితి. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. కనీసం పంట కోత, తరలింపు ఖర్చులు రావడం లేదు. ఏ రకం కూరగాయలు తీసుకెళ్లినా కిలో రూ.5 చొప్పున ధర పలుకుతుండడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకునేవారు లేక కన్నీరు పెడుతున్నారు. కష్టకాలం ఆరంభమైందంటూ నిట్టూర్చుతున్నారు. పడిపోయిన ధరలు సాధారణంగా శుభకార్యాలు జరిగే సీజన్లో కూరగాయలకు గిరాకీ ఉంటుంది. కానీ ఈ ఏడాది పంటను కొనుగోలు చేసేవారే కరువయ్యారు. రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేవారికోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఊహించని రీతిలో ధరలు పతనం కావడంతో లబోదిబోమంటునారు. వంగ, చిక్కుడు, బెండ, క్యాబేజీ, దొండ వంటి కూరగాయలతో పాటు బంతి, కనకాంబరాలు తదితర పూలకు గిట్టుబాటు ధర లేదు. 20 కిలోల బరువు ఉన్న క్రేట్ ధర రూ.200 లోపే పలుకుతోంది. సగటున సరాసరి కిలో రూ.5లు నుంచి రూ.10ల మధ్యలో ధర ఉంది. ఎకరం పంట సాగుకు కోతకు వచ్చే వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు లేకపోవడంతో పంట పెట్టుబడిని పక్కనపెడితే పంటను కోసేందుకు, మార్కెట్కు తరలించే ఖర్చులు కూడా రావడం లేదు. కొందరు రైతులు పంటను కోయకుండానే వదిలేస్తున్నారు. చంద్రబాబుకు పట్టని అన్నదాత గోడు రైతన్న గోడు సీఎం చంద్రబాబుకు పట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంటలకు మద్దతు ధర కల్పనకు చొరవ చూపడం లేదు. విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతన్నకు పరిహారం అందడం లేదు. సంబంధిత మంత్రి వ్యవసాయం దండగంటూ ప్రకటనలు చేయడం కర్షకుడిని ఆవేదనకు గురిచేస్తోంది. గత ఐదేళ్లూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి ఏటా వైఎస్సార్ భరోసా కింద రైతు కుటుంబానికి రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేది. ఉచిత పంటల బీమాతో సాగుధీమా కల్పించేది. విపత్తుల సమయంలో ఆదుకునేది. ఆర్బీకేల నుంచి రైతన్నకు సాయం అందించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడం రైతులు కాడి విడిచి కూలిపనులకు వెళ్లే పరిస్థితులు నెలకున్నాయి. ● అప్పు చేసి కూలీలకు ఇస్తున్నాం.. నేను 20 సెంట్ల విస్తీర్ణంలో చిక్కుడు పంట సాగు చేశాను. కాపుకొచ్చిన చిక్కుడు చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లభించడం లేదని బాధపడాలో తెలియడం లేదు. పండిన పంట మార్కెట్కు తీసుకొచ్చి అమ్మితే కూలీలకు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కూలీలకు, పురుగు మందులు, ఎరువుల కొనుగోలుకు అప్పు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. – బూరుగు కృష్ణ, రైతు, బూసాయవలస ● పెట్టుబడి రావడం లేదు.. మార్కెట్లో 20 కిలోల వంకాయలు రూ.150 నుంచి రూ.180ల మధ్యలో అడుగుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా నష్టపోయాం. నేను 20 సెంట్లలో వంగ పంట సాగు చేస్తున్నాను. రూ.10 వేలు ఖర్చుచేశాను. ఇప్పటి వరకు రూ.2 వేలు కూడా చేతికందలేదు. మా కుటుబం కష్టం పోయినా కనీసం సగం పెట్టుబడి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – చొక్కాపు పైడిపునాయుడు, రైతు, రామభద్రపురం ● ఆదుకోండి ‘బాబూ’... ఖరీఫ్ సీజన్లో వరుస తుఫాన్లు కారణంగా కూరగాలయ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు నష్టపోయాం. ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయంలో ధర లేదు. రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తక్షణమే రైతు సుఖీభవ నిధులు విడుదల చేయాలి. మార్కెట్లో కూరగాయలకు ధర కల్పించే చర్యలు చేపట్టాలి. – పూడి వెంకటరావు, రైతు, రామభద్రపురం కూరగాయల ధర పతనం వంగ, బెండకాయలు కిలో రూ.5 కూలి ఖర్చులు రాని వైనం అందని అన్నదాత సుఖీభవ రైతుగోడు వినిపించుకోని చంద్రబాబు ఆవేదనలో సాగుదారులు -
ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు. -
మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలి
విజయనగరం అర్బన్: మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి వారి గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతిని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానుభావుల త్యాగం, గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకొని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం గొప్పవారి జీవిత చరిత్రలను చదవాలన్నారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో సెట్విజ్ ఇన్చార్జి సీఈఓ సోమేశ్వరరావు, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, టూరిజం అధికారి కుమారస్వామి, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, జేడీ తారకరామారావు, కలెక్టరేట్ ఏఓ దేవ్ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పాలిసెట్కు 6,938 మంది హాజరు
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 23 కేంద్రాల్లో పరీక్ష రాయాల్సిన 8,134 మందిలో 85.3 శాతంతో 6,938 మంది హాజరయ్యారు. బాలురు 88.53తో 4,083 మంది, బాలికలు 81.06 శాతంతో 2,855 మంది పరీక్ష రాశారు. పట్టణంలోని ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పరీక్షా సమయం వరకు ఒక కేంద్రం వద్ద ఉండిపోయి చివరి నిముషంలో అక్కడ కాదని తెలిసి పరుగులు తీశారు. ఈ క్రమంలో సమయం మించిపోవడంతో పలువురు విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. ఇదే విషయంపై పరీక్షల జిల్లా కన్వీనర్, ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జె.ఆశారమణి స్పందిస్తూ మూడు పరీక్ష కేంద్రాల్లోనే కాకుండా, నెల్లిమర్ల పరీక్ష కేంద్రాల విద్యార్థులు కూడా పలువురు గందరగోళానికి గురయ్యారన్నారు. సమయానికి పరీక్ష కేంద్రానికి వచ్చిన వారిని అనుమతించామన్నారు. నిర్దేశిత సమయం దాటి వచ్చిన వారికి మాత్రమే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. -
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే కాదు.. మూగజీవుల సంక్షేమంపైనా అక్కసువెళ్లగక్కుతోంది. పాడి రైతులకు అండగా, పశువులకు తక్షణ వైద్యం అందించే సంచార పశు ఆరోగ్య వాహన సేవలకు మంగళం పాడేసింది. వాహనాలను పశు సంవర్థక శాఖ ఏడీ కార్యాలయాలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసి
సంచార పశు ఆరోగ్య సేవ వాహనం ● జిల్లాలో నిలిచిన సంచార పశుఆరోగ్య సేవలు ● మొదటి విడతలో నిలిచిన కొన్ని వాహన సేవలు ● తాజాగా మిగిలిన వాహన సేవలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ● వాహనాల్లో పనిచేసే సిబ్బందిని తొలగించిన జీవీకే సంస్థ ● వాహనాలను పశుసంవర్ధక శాఖ ఏడీ కార్యాలయాలకు అప్పగించాలని ఆదేశం విజయనగరం ఫోర్ట్: ఇది పాడి రైతులకు ఆవేదన, ఆందోళన కలిగించే వార్త. ఇన్నాళ్లూ.. అత్యవసర వేళ పశుశాలల వద్దకు వచ్చి వైద్యసేవలందించే వాహన సేవలు నిలిచిపోయాయి. మూగ జీవాలకు సంచార వైద్య సేవలు ఇక అందవు. కూటమి సర్కారు సంచార పశుఆరోగ్య సేవ వాహనాలను బుధవారం నుంచి పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఆరంభించిన సేవల నిలిపివేత ప్రక్రియను ముగించింది. మూగ జీవాల వైద్యం కోసం ఎప్పటి మాదిరి పశువైద్యశాలలకు తీసుకెళ్లాల్సిందే. రైతులు వ్యయప్రయాసలు భరించాల్సిందే. మొదటి విడత సిబ్బందికి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడంతో వారంతా గత రెండు నెలలుగా రోడ్డున పడ్డారు. తాజాగా రెండో విడత వాహనాల్లో పనిచేసే సిబ్బందికి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలోకి వస్తే లక్షాలాది ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కూటమి సర్కారు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలు అప్పగించాలని ఆదేశం జిల్లాకు మొదటి విడతలో మంజూరైన విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని ఏడు సంచార పశు ఆరోగ్యసేవ వాహన సేవలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. తాజాగా గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట, రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లిలో ఉన్న మరో ఆరు వాహన సేవలను నిలిపివేసింది. ఈ వాహనాలను పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుల కార్యాలయాలకు అప్పగించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంచార పశు ఆరోగ్య సేవను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ నిర్వహించేది. ఆ సంస్థ టెండర్ కాలపరిమితి ముగియడం, కొనసాగింపు ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేయకపోవడంతో బాధ్యతల నుంచి సంస్థ వైదొలగింది. ఆదేశాలు వచ్చాయి సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులకు అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. సిబ్బందిని తొలగిస్తూ సంస్థ నుంచి వచ్చిన ఆదేశాలు అందజేశాం. సంచార వైద్యసేవలు ఇక ఉండవు. – బి.నారాయణరావు, జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ జిల్లా మేనేజర్ పశువైద్యం ఇక దూరం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాడి రైతులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా 2022 సంవత్సరంలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాకు 13 వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, పారావిట్, పశు వైద్యుడు పనిచేసేవారు. ఆరు వాహనాలకు ఒక రిలీవర్ ఉండేవారు. మూగ జీవాలు అనారోగ్యానికి గురైతే వైద్యులు వాటి చెంతకు వెళ్లి సేవలు అందించేవారు. దీనివల్ల రైతులకు ఎలాంటి వ్యయప్రయాసలు ఉండేవికావు. పాడి రైతుకు పశువైద్య భరోసా కలిగేది. వాహనాలు రాకముందు పశువులకు జబ్బు చేస్తే పశు వైద్యశాలలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పాత రోజులే వచ్చే పరిస్థితి వచ్చిందని పాడిరైతులు వాపోతున్నారు. -
క్రీడా శిక్షణకు వేళాయె..
ప్రాంతాల వారీగా శిక్షణ శిబిరాలు ఇలా..● నేటి నుంచి ప్రారంభం కానున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ● ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్రీడాకారులకు శిక్షణ విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా క్రీడాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 శిక్షణ శిబిరాలు నిర్వహించాలని శాప్ ఆదేశాల జారీ చేసింది. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ దరఖాస్తులు స్వీకరించి నిష్ణాతులైన శిక్షకులను ఎంపిక చేసింది. వివిధ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడలకు శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచారు. జిల్లాలో ప్రాంతాల వారీగా ఆదరణ ఉన్న క్రీడాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు శిబిరాలు కేటాయించినట్టు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక్కో శిబిరానికి రూ.7వేలు వేసవిలో నిర్వహించే ఉచిత క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్ బడ్జెట్ విడుదల చేసింది. ఒక్కో శిబిరానికి రూ.7 వేల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రూ. 5వేలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేయాలి. నిర్వహిస్తున్న శిక్షకుడికి గౌరవ వేతనం కింద రూ.2000లు కేటాయించారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఒక్కో శిబిరంలో 25 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆటలాడుతున్న క్రీడాకారులు ఆర్చరీ: రామనారాయణం (విజయనగరం) అథ్లెటిక్స్: విజ్జి స్టేడియం (విజయనగరం), చింతపల్లి, రాజాం, బొండపల్లి బాల్ బ్యాడ్మింటన్: జెడ్పీహెచ్ఎస్ నెమలాం, జెడ్పీహెచ్ఎస్ మెరకముడిదాం బాస్కెట్ బాల్: విజ్జి స్టేడియం, విజయనగరం బాక్సింగ్: ద్వారపూడి, సవరవల్లి, నెల్లిమర్ల, దుప్పాడ, విజయనగరం విజ్జి స్టేడియం, బీపీఎం స్కూల్ విజయనరగం, కొండవెలగాడ. బ్యాడ్మింటన్: జెడ్పీహెచ్ఎస్ ధర్మవరం, బొబ్బిలి, రాజాం ఫుట్బాల్: విజ్జి స్టేడియం (విజయనగరం), నెల్లిమర్ల, జొన్నగుడ్డి (విజయనగరం), విజయనగరం రాజీవ్ స్టేడియం ఫెన్సింగ్: కస్పా హైస్కూల్, విజయనగరం హ్యాండ్బాల్: జెడ్పీహెచ్ఎస్ డెంకాడ, ఏపీ మోడల్ స్కూల్ అక్కివరం, గరివిడి ఖోఖో: జెడ్పీహెచ్ఎస్ పూల్బాగ్, జెడ్పీహెచ్ఎస్ తోండ్రంగి, కస్పా హైస్కూల్ విజయనగరం, పెదవేమలి కబడ్డీ: రెల్లివలస, గరివిడి, వల్లాపురం, సారిపల్లి, జీజీహెచ్ఎస్ విజయనగరం కరాటే: విజయనగరం పీఎస్ఆర్ కాలనీ, విజయనగరం ఉడాకాలనీ సాఫ్ట్బాల్: భోగాపురం, పారాది తైక్వాండో: విజయనగరం కస్పా హైస్కూల్, బొబ్బిలి, విజయనగరం మదర్ థెరిసా క్లబ్, బొబ్బిలి సంస్థానం వాలీబాల్: జెడ్పీహెచ్ఎస్ కొత్తవలస, జెడ్పీహెచ్ఎస్ భోగాపురం, గరివిడి, పెదమజ్జిపాలెం, జీజీహెచ్ఎస్ విజయనగరం -
కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన
రాజాం: పట్టణంలోని వస్త్రపురికాలనీ సమీపంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన జీఎంఆర్ వరలక్ష్మీ కళా క్షేత్రాన్ని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశశేఖర్ బుధవారం సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కళాకారుల కోసం కళాక్షేత్ర భవన నిర్మాణానికి అప్పటి ఎంపీ బెల్లాన నిధులు సమకూర్చారు. అక్కడి స్థలాన్ని జీఎంఆర్ ఉచితంగా అందజేసింది. కళాక్షేత్రం నిర్మాణం పూర్తికావడంతో క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు కళాకారులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎక్స్రే ఫిల్మ్లు లేక ఎం.ఎల్.సి రోగులు అవస్థలు పడుతున్న అంశంపై ‘ఎంఎల్సీ రోగులకు తిప్పలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఎక్సరే, సిటీ, ఎంఆర్ఐ ఫిల్మ్లు రోగులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఐటీఐ కోర్సులు పాసైన విద్యార్థులకు మైలాన్ లేబొరేటరీ పరిశ్రమలో అప్రెంటిస్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ కోర్సులు పాసైన విద్యార్థులకు విజయనగరం బయోటెక్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ 2వ తేదీన కన్వీనర్ ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 98491 18075 నంబర్ను సంప్రదించాలన్నారు. నేడు కార్మికులకు సెలవు విజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మి క దినోత్సవం (మే డే) రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటించాలి. ఒకవేళ యజమానులు ఆ రోజున పనిచేయించుకుంటే 30 రోజులలోపు ఏదో ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఆ రోజుకు రెట్టింపు వేతనం కార్మికులకు ఇవ్వా ల్సి ఉంటుందని కార్మికశాఖ జిల్లా ఉప కమిషనర్ ఎస్.డి.వి.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ కాలేజీలు తెరిపించండి విజయనగరం అర్బన్: మూతపడిన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు (డైట్) తిరిగి తెరిపించాలని బీఈడీ, డైట్ కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తోటపాలెంలో ఓ ప్రైవేటు కాలేజీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడుకి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి విద్యను ప్రోత్సహించాలన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్ మోహన్, డాక్టర్ అప్పలనాయుడు, రాఘవ కుమార్, పీఆర్టీయూ నాయుకులు డి.శ్రీనివాస్, బంకపల్లి శివప్రసాద్, రామకృష్ణ, మోహన్, తదితరులు ఉన్నారు. -
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
సాలూరు: పాచిపెంట మండలం తంగ్లాం గ్రామంలో గిరిజనుడు పోయి అప్పలస్వామి హత్యకేసులో నిందితుడు పోయి రాజును అరెస్ట్చేసినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పలస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా పోయి అప్పలస్వామిని హత్యచేసినట్లు నిందితుడు పోయి రాజు స్వయంగా వీఆర్ఓ వద్ద లొంగిపోయాడని తెలిపారు. భూ వివాదంతోపాటు చిల్లంగి అనుమానంతో అప్పలస్వామిని రాజు హత్యచేసినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని చెప్పారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో వ్యక్తికి గాయాలు
వంగర: మండల పరిధి అరసాడ జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్సర్క్యూట్తో బుధవారం ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మగ్గూరు గ్రామానికి చెందిన రొంగలి సత్యనారాయణ జంక్షన్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో ఉండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్సర్క్యూట్కు గురయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 వాహన సిబ్బంది బాధితుడిని రాజాం సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతున్నాడు. తేనెటీగల దాడి: ఏడుగురికి గాయాలువంగర: మండల పరిధి శివ్వాంలో బుధవారం పెళ్లి జరుగుతున్న సమయంలో తేనెటీగలు దాడిచేయడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. పెళ్లికుమార్తెను గ్రామ సమీపంలోని ఓ చెట్టు వద్ద నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అంతలో తేనెటీగల పట్టు చెదిరిపోవడంతో అక్కడ ఉన్న బిల్లాన రామారావు, అలజింగి ప్రేమ్కుమార్, బిల్లాన ప్రతాప్, కుప్పిలి నితిన్, కిరణ్తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారందరినీ వంగర పీహెచ్సీకి తరలించగా వైద్యురాలు సీహెచ్జ్యోతి ప్రథమ చికిత్స అందించారు. బాధితులంతా శివ్వాం గ్రామస్తులే. తాటిచెట్టు పైనుంచి జారిపడి వ్యక్తికి గాయాలువంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన దమరసింగి పైడియ్య తాటిచెట్టుపై నుంచి జారిపడి గాయపడ్డాడు. బుధవారం గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి తాటికాయలు దింపేందుకు వెళ్లాడు. తాటికాయల గెల తీస్తుండగా అదుపు తప్పి కిందపడిపోవడంతో ఎడమ చేయి సోల్డర్ జారిపోగా, పక్కటెముకకు తీవ్రంగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు రాజాంలో చికిత్స పొందుతున్నాడు. -
రైల్వేస్టేషన్లో నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో సెల్ఫోన్ అపహరించి వెళ్లిపోతున్న వ్యక్తిని జీఆర్పీ సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తన సిబ్బందితో కలిసి విజయనగరం రైల్వే స్టేషన్లో తని ఖీ చేస్తుండగా ప్లాట్ఫాంపై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పట్టుకుని వి చారణ చేశారు. ఈ విచారణలో విజయనగరంలోని లంకాపట్నానికి చెందిన పొట్నూరు వెంకటేష్ అలియాస్ విక్కీ(27) రూ.25 వేల విలువ చేసే సెల్ఫోన్ను అపహరించినట్లు గుర్తించా రు. వెంటనే జీఆర్పీ ఎస్సై బాలాజీ కేసు నమో దు చేసి నిందితుడి దగ్గర ఉన్న సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. 10 లీటర్ల సారా పట్టివేతనెల్లిమర్ల: నవోద యం 2.0లో భాగంగా నెల్లిమర్ల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటరావు ఆధ్వర్యంలో సబ్ఇన్స్పెక్టర్ ఎం.నాగేశ్వరరావు, సిబ్బందితో గుర్ల మండలంలోని దేవుని కణపాకలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి అచ్చాలు తాలుకా ఖాళీస్థలంలో 10 లీటర్ల సారా పట్టుబడింది. నిందిత వ్యక్తి పరారీలో ఉన్నందున కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. దాడుల్లో హెచ్సీలు ఎం.అప్పారావు, పీసీలు డీకే శంకర్, కె.సీతాలక్ష్మి పాల్గొన్నారు. వృద్ధుడి అదృశ్యంచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన పిల్ల అప్పలనాయుడు (75) గడిచిన 20 రోజులుగా కనిపించడం లేదని భార్య పిల్ల పైడమ్మ, కుటుంబసభ్యులు తెలిపారు. ఏప్రిల్ 9న గ్రామం నుంచి బయటకు వెళ్లిన ఆయన మళ్లీ ఇంటికి రాలేదని, ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదని, ఇదే విషయం పోలీస్స్టేషన్కు కూడా సమాచారం అందించామని చెప్పారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 8374474305, 8187035696 నంబర్లకు సమాచారం తెలియజేయాలని కోరారు. ఐదుగురిపై దాడి కేసు నమోదుసంతకవిటి: మండలంలోని కొండగూడెం గ్రామంలో తాడి పార్వతిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు ఈ నెల 25 న దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఎం.వాసుదేవరావు తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పార్వతిపై శుక్రవారం రాత్రి గ్రామస్థులు దాడి చేయడంతో గ్రామంలో పెద్దల వద్దకు వెళ్లారు. అక్కడ ఎటువంటి న్యాయం జరగక పోవడంతో బుధవారం జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 600 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసంసీతంపేట: మండలంలోని చిన్నబెత్తుపురం పరిసర ప్రాంతాల్లో ఎస్సై వై.అమ్మన్నరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి సారా వండడానికి సిద్ధం చేసి దాచిన 600 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని ఎస్సై అమ్మన్నరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. పసుకుడి చేరిన ఏనుగుల గుంపుభామిని: ఒడిశా వెళ్లిన ఏనుగుల గుంపు తిరిగి ఆంధ్రా చేరింది. బుధవారం భామిని మండలం పసుకుడి తీరంలో నాలుగు ఏనుగులు రైతుల పంట చేలలో అలజడి సృష్టించాయి. ఒడిశా గ్రామాల మీదుగా ఏనుగుల గుంపు ప్రయాణించడానికి ఆటంకంగా భావించిన ఒడిశా పారెస్ట్ అధికారులు, ట్రాకర్స్ ఆంధ్రా వైపు రాత్రిపూట వెళ్లగొడుతున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఒడిశా గ్రామాల్లో రాత్రి పూట కరెంట్ తీసివేసి ఏనుగుల గుంపును వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అటు వైపు ఎవరూ వెళ్లొద్దు..!
చీపురుపల్లి: ‘అటు వైపు ఎవరూ వెళ్లొదు.. అదంతా సార్కి ఇష్టం ఉండదు.. డీసీసీబీ చైర్మన్ అయితే విజయనగరం ఆఫీస్లో ఉండాలి.. ఇక్కడేం పని.. వెళ్లొద్దని అన్ని గ్రామాల కేడర్కు తక్షణమే సమాచారం అందించండి.. అదే సమయంలో సార్ రాజాంలో అందుబాటులో ఉంటారని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పంపించాం చూసుకోండి’ తాజాగా డీసీసీబీ చైర్మన్గా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్వాగత ర్యాలీకు హాజరుకాకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి అందిన మౌఖిక ఆదేశాలు పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నాయకులు సెల్లకు వచ్చిన మెసేజ్లను చూపిస్తూ.. చీపురుపల్లిలో బుధవారం సాయంత్రం జరిగిన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్వాగత ర్యాలీకు ముఖం చాటేశారు. నాలుగు మండలాల్లో ఉండే మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, ప్రధాన నాయకుల నుంచి పంచాయతీల్లో సర్పంచ్, మాజీ సర్పంచ్లు వరకు ఎవ్వరూ హాజరుకాకపోవడంపై చర్చ సాగింది. కేవలం ద్వితీయ శ్రేణి క్యాడర్, అభిమానులతో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. నాగార్జున వద్దకు క్యాడర్ను వెళ్లొద్దని చెప్పడం అధిష్టానం నిర్ణయాన్ని అగౌరవ పరచడం కాదా అంటూ కొందరు కార్యకర్తలు బహిరంగంగా విమర్శించారు. చర్చకు దారితీసిన మెసేజ్.. డీసీసీబీ చైర్మన్గా నియమితులైన కిమిడి నాగార్జున బుధవారం సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రమే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పంపించారు. పార్టీ క్యాడర్కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో స్వాగత ర్యాలీ చేసేందుకు క్యాడర్ సిద్ధమైంది. రాత్రి 7.46 గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్యే కళా వెంకటరావు రాజాం నివాసంలో అందుబాటులో ఉంటారని మెసేజ్ వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం అందుబాటులో ఉండరని, 4 గంటల తరువాత మాత్రమే అందుబాటులో ఉంటారని గమనిక మెసేజ్గా పెట్టడం చర్చకు దారి తీసింది. నాగార్జున స్వాగత ర్యాలీకి ఎవరూ వెల్లొద్దని ఫోన్లో ఆదేశాలు ఇచ్చినట్లు సొంత పార్టీ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. కిమిడి నాగార్జునకు పదవి రావడంతో బలం పెరుగుతుందన్న భయం కళావెంకటరావును వెంటాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వాగత ఫ్లెక్సీలు వేసేవారిని కూడా నిలువరించినట్టు సమాచారం. ‘కిమిడి’ కుటుంబంలో అంతర్యుద్ధం కొనసాగుతుందనేందుకు ఈ సంఘటన మరోసారి అద్దం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ క్యాడర్కు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆదేశాలు డీసీసీబీ చైర్మన్ నాగార్జున ర్యాలీకు ముఖం చాటేసిన ప్రధాన క్యాడర్ ‘కిమిడి’ కుటుంబంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం -
భక్తుల దుర్మరణం దురదృష్టకరం
విజయనగరం అర్బన్: సింహాచలం చందోత్సవానికి వచ్చిన ఏడుగురు భక్తుల దుర్మరణం దురదృష్టకరమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. సింహాద్రి అప్పన్న దర్శనార్థం వచ్చిన భక్తులు గోడకూలి మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని వారికి అవసరమైన సహాయ సహకారాలందించాలని డాక్టర్ శంకరరావు కోరారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు -
పన్ను ఎగవేతదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
విజయనగరం అర్బన్: పన్ను ఎగవేతదారులకు సంబంధించి ఎఫ్ఐఆర్లను నమోదు చేయించేందుకు పోలీస్ యంత్రాంగంతో తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రపన్నుల సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి, సంబంధిత తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన చాంబర్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ వారు జీఎస్టీ బకాయిలు, జనరల్ సేల్స్ట్యాక్స్, వ్యాట్ చట్టంలో గల బకాయిలు, రెవెన్యూ రికవరీ కేసులకు కేసులకు సంబంధించి పన్ను ఎగవేతదారుల నుంచి బకాయి రాబట్టేందుకు జిల్లా యంత్రాంగం సహకారం కోరారు. దీనికి జేసీ స్పందిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్లార్లకు మార్గనిర్దేశం చేశారు. సరైన ప్రణాళికను సిద్ధం చేయాలని సంయుక్త కమిషనర్, రాష్ట్ర పన్నులు, ఉప కమిషనర్ రాష్ట్రపన్నుల శాఖకు సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ కీర్తి, జిల్లా అధికారులు, సంయుక్త కమిషనర్, రాష్ట్ర పన్నులు, ఉప కమిషనర్, రాష్ట్ర పన్నులు, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి, విజయనగరం, సంబంధిత తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. జేసీ సేతు మాధవన్ -
హక్కుల పోరుకు నెత్తుటి తిలకం
● కార్మిక పోరు ఫలించిన వేళ..! ● శ్రమచేద్దాం..శ్రమను గుర్తిద్దాం.. శ్రమను గౌరవిద్దాం ● గొడ్డు చాకిరీ నుంచి కార్మికులకు విముక్తి కలిగిన రోజు ● 1886 మే 1 నుంచి 8గంటల పని విధానం అమలు ● నేడే మేడేకార్మికులపై ప్రభుత్వాల దాడి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గంపై పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని అమలు చేయడం లేదు. చిరుద్యోగులను, కార్మికులను రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారు. పనిభారం పెరుగుతోంది. 8గంటల పనిదినం, కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు.కనీస వేతనాలు అమలు, బేరసారాలు ఆడే హక్కు, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి చట్టబద్దమైన హక్కుల్ని నిరాకరించే 4 లేబర్ కోడ్ల అమలకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మే డే స్ఫూర్తితో 8 గంటల పనిదినాన్ని కాపాడుకుంటాం. లేబర్ కోడ్ల అమలును అడ్డుకుంటాం. –సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్ మోహన్ రావువిజయనగరం గంటస్తంభం: ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడేను అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మేడే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపునిచ్చి వారిని సన్మానించడం. కార్మిక దినోత్సవం మూలాలు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1886, మే 1న దాదాపు 2లక్షల మంది కార్మికులు 8గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాకుండా చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం, తక్కువ వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. షికాగోలో హిసాత్మకంగా మారింది. షికాగోలోని హే మార్కెట్ స్క్వేర్లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక చేసేదిలేక ప్రభుత్వం దిగొచ్చి 1894లో కార్మిక దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఆరోజు సెలవుదినంగా ప్రకటించింది. 1916లో తొలిసారిగా రోజుకు 8 పని గంటలు మాత్రమే అన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక..భారత్లో మొదటిసారిగా 1923 మే 1వ తేదిన కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. మనదేశంలో ఇతర దేశాల కంటే ముందే కోల్కత్తాలో కార్మికుల పనిగంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. 1923లో తొలిసారిగా భారత్ దేశంలో మేడేను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. దీంతో మేడే పాటిస్తున్నారు. కార్మిక సంక్షేమం కోసం.. సాప్ట్వేర్ ఇంజినీర్ నుంచి చిన్న కూలీ వరకూ నేడు సెలవును కచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ కోసం అనేక పథకాలు ఈరోజు ప్రకటిస్తాయి. రాజకీయ పార్టీలు సైతం కార్మికులను ఆకట్టుకునేందుకు రేపటి వేదికలను తమకు అనుకూలంగా మార్చుకోవడం రొటీన్గా మారింది. అలాగే మే 1వ తేదీన తమకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని కార్మిక సంఘాలు కూడా ఆశిస్తుంటాయి. కార్మికులకు పండగ రోజు మే డే నాడు అనేక ఉద్యమాలు ప్రాణం పోసుకున్న సందర్భంలో కార్మికులు విజయోత్సవాలు కూడా ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. కార్మిక సంఘాలు తమ వేతనాలు పెంచాలని, సంక్షేమ కార్యక్రమాల ను వేగవంతం చేయాలని, పెరుగుతున్న ధరలకు అ నుగుణంగా తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ..ఆందోళనకు దిగుతాయి. మే 1వ తేదీన వారికి అనుకూలంగా కొంత ప్రకటనలు వచ్చే చాన్స్ లేకపోలేదు. అందుకే మే డే వస్తుందంటే కార్మికుడికి పండగలాంటిదే. కేవలం సెలవుదినంగానే వారు మే డేను చూడరు. తమకు ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు వెట్టి చాకిరీని నుంచి విముక్తి కల్పించిన రోజుగానే భావించి కార్మికులందరూ ఒకచోట చేరి సంబరాలు చేసుకుంటారు. అదే మేడే ప్రత్యేకత.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి సమానపనికి సమాన వేతనం చట్టాలు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం, లాభాల్లో నడుస్తున్న రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బొగ్గు పరిశ్రమ, విశాఖ ఉక్కు లాంటి 37 ప్రభుత్వరంగ పరిశ్రమలను దేశ ప్రజల ఆస్తులను ప్రైవేటీకరించడం లాంటి చర్యలు దుర్మార్గం. దేశాన్ని మతోన్మాదం వైపు మళ్లిస్తూ ఆర్థికంగా నాశనం చేస్తూ, అభివృద్ధిని అథఃపాతాళానికి తొక్కేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు మేము వ్యతిరేకం. అసంఘటిత కార్మికులకు కార్మిక చట్టాలు అమలు వంటి నినాదాలతో జిల్లాలో నేడు కార్మిక దినోత్సవం చేస్తున్నాం. సీపీఐ విజయనగరం జిల్లా నగర కార్యదర్మి బుగత అశోక్దోపిడీదారులకు చౌకగా భూమి దోపిడీ దారులైన టీసీఎస్, ఉర్సా కంపెనీలకు ఎకరా భూమి 99పైసలకే ఇవ్వడం దుర్మార్గం. భవననిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాం. కార్మికుల సహకారాన్ని గుర్తుచేయడమే కాకుండా.. కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ..సమాజానికి వారు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. –సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు -
జెడ్పీలో అగ్నిప్రమాదం
● రెండు కంప్యూటర్లు దగ్ధంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ కారణంగా జెడ్పీలోని ఇంజనీరింగ్ విభాగంలో రెండు కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. జెడ్పీలో పని చేస్తున్న సిబ్బంది సత్యనారాయణ వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడంతో హుటాహుటిన శకటంతో సిబ్బంది వచ్చి జెడ్పీలో తగలబడుతున్న కంప్యూటర్లను అర్పేయత్నం చేశారు. దాదాపు మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం కారణంగా రూ.లక్షా 90 వేల నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సహాయ అధికారి సోమేశ్వరరావు చెప్పారు. -
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం
రేగిడి: సమష్టి పోరాటంతో సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటుకు రైతులంతా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. రైతులకు అన్నివేళలా అండగా నిలుస్తామని, రైతుల హక్కులు కాపాడేందుకు పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద కర్మాగారం పరిధిలోని 8 మండలాల చెరకు రైతులు మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు కర్మాగారం దృష్టిసారించకపోవడం, కొంత మంది సిబ్బందిని తొలగించడం, ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తివేయడం, ప్లాంటేషన్ను నిర్వహించకపోవడం వంటి పరిస్థితులు కర్మాగారం మనుగడపై రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. చక్కెర కర్మాగారం ప్రారంభ సమయం 1995లో 75వేల మెట్రిక్ టన్నులు చెరకు క్రషింగ్ జరిగేదని, అనంతరం అంచెలంచెలుగా 8 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి పెరిగిందన్నారు. ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 50వేల మంది రైతులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. అప్పట్లో రైతులకు అవసరమైన అన్ని రకాల రాయితీలను ఇవ్వడంతో పాటు భరోసా కల్పించడం వల్లే చెరకును సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపారన్నారు. కాలక్రమేణా రాయితీలు ఎత్తేయడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లిందన్నారు. కర్మాగార యాజమాన్యం కూడా క్రషింగ్ను పక్కనపెట్టి ఇతర విభాగాలపై మొగ్గుచూపుతోందన్నారు. కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కర్మాగారం నుంచే జేఏసీ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే జేఏసీ నిర్వహణకు అవసరమైన భవన సౌకర్యం సొంతంగా కల్పిస్తామని భరోసానిచ్చారు. చెరుకు సాగు విస్తరణకు రైతులు మొగ్గుచూపాలని కోరారు. వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ వేలాది రైతు కుటుంబాలకు జీవనాధారమైన చక్కెర కర్మాగారాన్ని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం జెడ్పీటీసీ బండి నర్శింహులు, లావేటి రాజగోపాలనాయుడు, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, కిమిడి సూరపునాయుడు, కిమిడి సీతబాబు, కెంబూరు వెంకటేశ్వరరావు, చింత సంగంనాయుడు, నారు జనార్ధనరావు, సాసుబిల్లి జగన్నాధనాయుడు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. కర్మాగారం కొనసాగకపోతే నష్టపోతాం ప్రస్తుతం నేను 15 ఎకరాల్లో చెరకును పండిస్తున్నాను. ఈ తరుణంలో కర్మాగారం రైతులకు ప్రోత్సా హం అందించకపోతే నష్టపోతాం. కర్మాగారం కొనసాగింపును విస్మ రిస్తే ఉద్యమిస్తాం. చక్కెర కర్మాగారం కొనసాగింపునకు జేఏసీతో ప్రణాళికలు రూపొందిస్తాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా నేతలను కలుస్తాం. – నక్క శ్రీనివాసరావు, రైతు, బొద్దాం, రాజాం మండలం పార్టీలకు అతీతంగా రైతులు ముందుకు రావాలి జేఏసీ ఏర్పాటుతో యాజమాన్యంతో చర్చలకు అవకాశం చెరకు రైతులు సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన కిల్లి సత్యనారాయణను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా నియోజకవర్గ పరిశీలకులు పనిచేస్తారు. పార్టీలో సీనియర్ నేతగా, సుదీర్ఘకాలం సర్పంచ్గా, రెండు పర్యాయాలు ఎంపీపీగా సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వెబ్సైట్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో 29 ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లో పొందుపరచినట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే మే నెల 3వ తేదీలోగా డీసీహెచ్ఎస్ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. బాల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలి ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 32 బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వీటిలో ప్రభుత్వ ఆధ్వర్వంలో ఐదు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 27 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు అందినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. జువైనల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కేంద్రాల ఏర్పాటుకు డీపీఓ కన్వీనర్గా ఉన్న ఇన్స్పెక్షన్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. వాటిని కలెక్టర్ చాంబర్లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, ఏఎస్పీ సౌమ్యలత, ఐడీసీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, తదితరులు పాల్గొన్నారు.