Komaram Bheem
-
సహాయక వేదికగా భరోసా కేంద్రం
ఆసిఫాబాద్అర్బన్: వేధింపులు, హింస, లైంగిక దాడులు, గృహ హింస వంటి కేసుల్లో బాధితులకు భరోసా కేంద్రం ఒక సహాయక వేదికగా పనిచేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను మంగళవారం తనిఖీ చేశారు. నమోదైన కేసులు, కౌన్సెలింగ్ సేవలు, బాధితులకు సహాయ చర్యలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి ఎస్సై దివ్యతోపాటు సిబ్బందికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతీ కేసులో సున్నితంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులు, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి అవసరైమన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
‘దామిని’తో తప్పును ముప్పు
ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నా రు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గాల్లో కలుస్తున్న ప్రాణాలుజాగ్రత్తలే రక్ష -
చకచకా ‘శక్తి భవనం’
ఆసిఫాబాద్అర్బన్: మహిళల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను అన్ని విధాలుగా ప్రో త్సహిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాల మంజూరు, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సమాఖ్యను వ్యాపారాల్లో ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో మహిళా సంఘా కోసం రూ.6 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మి స్తోంది. సమన్వయ కర్తలు, సభ్యులకు శిక్షణ, జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణకు ఈ భవనం వేదికగా నిలువనుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. ఇటీవల కలెక్టర్ కె.హరిత అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణజిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాలకు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని వినియోగించనున్నారు. విస్తృత సమావేశాలకు విశాలమైన హాల్తోపాటు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నారు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. వీటితోపాటు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీవోఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నైసుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇందిర మహిళా శక్తి భవనం కేంద్రంగా మారనుంది. 8,236 మహిళా సంఘాలుజిల్లా వ్యాప్తంగా 8,236 మహిళా స్వయం సహాయ క సంఘాలు ఉండగా, ఇందులో 94,569 మంది స భ్యులుగా కొనసాగుతున్నాయి. మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నారు. మ రింత ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఇందిరా మహిళా శక్తి భవనాలను వేదికలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. నిపుణులతో పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు వీలుగా నిత్యం సమావేశాలు నిర్వహించనున్నారు. మహిళలకు ప్రయోజనం జిల్లా కేంద్రంలో ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణంతో మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. సమావేశాల నిర్వహణ, వృత్తి నైపుణ్య శిక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. – శ్రీలక్ష్మి, మహిళా సంఘం నిర్వాహకురాలు, ఆసిఫాబాద్ మూడు నెలల్లో పూర్తి మహిళా సంఘాల సభ్యుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
కుమురం భీం
7చినుకు పడితే కరెంట్ కట్! తిర్యాణి మండలంలో చిన్న గాలివానకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. నిత్యం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురుస్తుంది. వీడని ‘అన్న’బంధం! బాసర వద్ద పుణ్యస్నానమాచరించేందుకు గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు అన్నదమ్ములు నీట మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల రోదన్నలు మిన్నంటాయి.బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026 -
విధుల్లో అలసత్వం వహిస్తే సహించం
ఆసిఫాబాద్: వైద్యాధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించమని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదన పు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మంగళవారం జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లన్నారు. వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమయపాలన పాటించాలని సూ చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు, పనితీరును యాప్లో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్ర, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలుఆసిఫాబాద్: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకా శాలు లభిస్తాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జై నూర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మంగళవారం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు హైదరాబాద్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పి స్తారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియ న్, ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్, ఫాబ్రికేష న్, బైక్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటీవ్(బాలికలు), ఎలక్ట్రికల్ హోం అప్లయన్సెస్ రిపేరింగ్, ఏసీ రిపేరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
వెల్కమ్ పోలీస్ బాస్
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర పోలీస్ బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. వీరు బుధవారం ఆదిలా బాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషన ల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. -
పేదోడికి కూరగాయాలు
దహెగాం: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం నిర్వహించిన వారసంతల్లో నిత్యావసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు చుక్కలన్నంటాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పోషకాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సదుపాయాల కొరత తదితర అనేక కారణాలతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. స్థానిక రైతులు పండించడపోవడంతో వారసంతలకు సరఫరా తగ్గుతుంది. ఆగస్టు వరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. -
దిందాలో ‘పోడు’ ఉద్రిక్తత
చింతలమానెపల్లి: మండలంలోని దిందా అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్వో సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టగా, దిందా గ్రామానికి చెందిన పలువురు పోడు రైతులు అడ్డుకున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. మహిళలు, రైతులు ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు. దీంతో అటవీ సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్, కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సముదాయించినా వినకపోవడంతో అటవీశాఖ వాహనాల్లో కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తరలించారు. అవగాహన కల్పించిన అనంతరం రాత్రి వరకు వారిని వదిలిపెట్టారు. కాగా, డీఎస్పీ వహీదుద్దీన్ దిందాలోని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘పోడు’ సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి – ఎఫ్డీవో అప్పయ్య కాగజ్నగర్టౌన్: అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా పోడు సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎఫ్డీవో అప్పయ్య తెలిపారు. ఖర్జెల్లి అటవీ డివిజన్ పరిధిలోని దిందా గ్రామ పంచాయతీలో పోడు వ్యవసాయం చేస్తున్న 25 మంది పోడు రైతులను మంగళవారం కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారికి పోడు వ్యవసాయం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎఫ్డీవో అప్పయ్య మాట్లాడుతూ దిందా ఫారెస్ట్లో 1600 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఒక్కో కుటుంబం 30 నుంచి 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ఫారెస్ట్ను ఆనుకుని ఉన్న 800 ఎకరాల ఫారెస్ట్ భూముల్లో ట్రెంచ్లు ఏర్పాటు చేసి ప్లాంటేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూనే, కొత్తగా అడవులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుభాష్, బండెపల్లి పోడు రైతులు దన్నూరి లక్ష్మయ్య, హన్మంతు, బక్కయ్య, అంకులు, డోకె అంకులు, సురేష్, తిరుపతి, కమలాబాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’ సమస్యలు పరిష్కరించండి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో ని పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని అరణ్యభవన్లో మంగళవారం ఇన్చార్జి పీసీసీఎఫ్ వినయ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలమానెపల్లి మండలం దిందా, కర్జెల్లి, బెజ్జూర్ మండలం పాపన్పేట్, పెంచికల్పేట్ మండలం దరోగపల్లి తదితర గ్రామాల్లో అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలి పారు. వెంటనే పోడు భూముల స్వాధీన ప్ర క్రియ నిలిపివేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి డీఎఫ్వోకు ఆదేశాలు ఇస్తామ ని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎల్ల్ములే మల్లయ్య, డబ్బుల మురళి, తుకారాం, చౌదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షు డు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ గతేడా ది నవంబర్ 12 నుంచి కెరమెరి పీహెచ్సీ పరిధిలోని మోడి, దేవాపూర్ సబ్ సెంటర్లు, అడ పీహెచ్సీ పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్ సెంటర్లలో ఎంఎల్హెచ్పీలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమం
కాగజ్నగర్టౌన్: నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం వార్డు సభలు నిర్వహించారు. 15, 16 వార్డుల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేదికగా మారిందన్నా రు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. వార్డుల వారీగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మెప్మా అధికారులు మోతిరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశుభ్రతతో ఆరోగ్యం
ఆసిఫాబాద్: వర్షాకాలంలో పరసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలకు వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి తేవాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, దూడల లక్ష్మి, మున్సిపల్ మేనేజర్ సర్వర్, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీరాజం, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారు బడులను చక్కదిద్దుతా
ఆసిఫాబాద్రూరల్: ‘విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ తక్కువ అక్షరాస్యతతో జిల్లా చదువులో వెనుకబడింది. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సర్కారు బడులను తీర్చిదిద్ది చిన్నారులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తాం..’అని నూతన జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిత్యం పర్యవేక్షిస్తూ.. విద్యాశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల హాజరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. సాక్షి: వెనుకబడిన జిల్లాలో విద్యారంగాన్ని బలోపే తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఈవో: జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. 2,072 మంది ఉపాధ్యాయులు ఉండగా, 39,249 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ గైర్హాజరు కాకుండా చూస్తా. విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తాం. ప్రాథమిక విద్యను బ లోపేతం చేస్తాం. 24 గంటలపాటు అందుబాటులో ఉంటాను. క్షేత్రస్థాయిలో పాఠశాలలను రోజు వారీగా తనిఖీ చేస్తూ విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: 2026– 27 విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? డీఈవో: ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్ర మం ప్రారంభమైంది. 15వ తేదీ నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటింటికీ తిరుగుతూ సౌకర్యాలు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంతోపాటు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉదయం పూట స్నాక్స్ గురించి వివరిస్తున్నారు. బడిబాటలో ఇప్పటివరకు 754 మందికి నూతన అడ్మిషన్లు ఇచ్చాం. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 శాతం ప్రవేశాల సంఖ్య పెంచుతాం. సర్కారు బడిలో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలి గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. తల్లి దండ్రులు సైతం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వా రంలో ఒకరోజు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుంది. సాక్షి: విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తరలించాం. జిల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 90,320 పుస్తకాలు వచ్చాయి. యూనిఫాం స్టిచ్చింగ్ కొనసాగుతుండగా, 50 శాతం పూర్తయ్యింది. జూ న్ 15న పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అలాగే జిల్లాలో రెండు విడతల్లో 212 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలి. సాక్షి: ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? డీఈవో: జిల్లాలో మొత్తం 115 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ప్రభు త్వ నిబంధనలను పాటించాలి. అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం పేరుతో వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదు. -
మైనర్లు వాహనాలు నడపొద్దు
పెంచికల్పేట్: మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. మండలంలోని చేడ్వా యి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎ దిగే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పొద్దని సూచించారు. వాట్సాప్ గ్రూ పుల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పోస్టులు పెట్టడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు. గ్రామాల్లో గంజాయి, నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నానాజీ, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
మిల్లు పునః ప్రారంభం నుంచీ స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. దేవాపూర్, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీల్లో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీఎంలో ఎందుకు నిర్వహించడంలేదు..? గుర్తింపు యూనియన్ వస్తే యాజమాన్యం చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలు బయటపడుతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారు. కార్మికుల నిరాహార దీక్షలు, మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. – డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్ కె.హరిత వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్, కల్యాణ్, తుంగెడ గ్రామానికి చెందిన సంధ్య వేర్వేరుగా అర్జీలు అందించారు. వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తే కబ్జా చేశారని, తిరిగి తనకు ఇప్పించాలని సిర్పూర్(టి) మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం హుక్టూ విన్నవించాడు. తన భర్త మరణించిన నేపథ్యంలో ఎల్ఐసీ బీమా డబ్బులు ఇప్పించా లని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ వేడుకుంది. ఆసరా పింఛన్ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెంది న పెరుగు కమలాబాయి అర్జీ చేసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్ను వెంటనే పునరుద్ధరించాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కోరాడు. ఉపాధి కల్పించాలని బెజ్జూర్ మండలం రెబ్బెనకు చెందిన మల్లేశ్ దరఖాస్తు చేసుకున్నాడు.గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు ఇవ్వండి కెరమెరి మండలం కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామాల్లో 26 ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్లం గుడిసెల్లో బతుకు వెల్లదీస్తున్నాం. కాలమేదైనా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా సొంతిళ్లు మంజూరు చేయాలి. – కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామస్తులు, మం.కెరమెరి మృతదేహాలు పాతిపెట్టడం ఆపాలి జిల్లా కేంద్రంలోని సిద్ధివి నాయక కాలనీ(10 వార్డు)ని ఆనుకుని ఉన్న స్థలంలో అనధికారికంగా మృతదేహాలను పాతిపెట్ట డం ఆపాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాలనీ గుండా మృతదేహాలను తీసుకెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సిద్ధివినాయక కాలనీవాసులు, ఆసిఫాబాద్ -
కార్మికశాఖ మంత్రితో ఎమ్మెల్యే హరీశ్బాబు భేటీ
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన మార్గం చూపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఎస్పీఎం కార్మికుల ఆందోళనల గురించి వివరించారు. 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికల గురించి పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ను పిలిపించి పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 10న కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్పీఎం యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. -
అన్నదాతకు చల్లని కబురు
ఆసిఫాబాద్: అన్నదాతలకు చల్లని కబురు అందిస్తూ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మబ్బులతో ఒక్కసారి చల్లబడింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. వారం రోజులుగా ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో సందడిగా కనిపిస్తున్నాయి. వర్షం రాగానే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7,500 ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సాధారణ వర్షపాతం 18.4 మిల్లీమీటరు నమోదు కావాల్సి ఉండగా, 15.7 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం 15 మండలాల్లో 4 మండలాల్లో సాధారణం కంటే కాస్త అధికంగా వర్షం కురవగా, రెండు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో వర్షాలు కురవలేదు.కాగజ్నగర్ మండలంలో వర్షంకాగజ్నగర్రూరల్: మండలంలో సోమవా రం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో మోస్తారు వర్షం ఉరుములతో కురిసింది. గాలుల ధాటికి భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని మద్దెల జ్యోతి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి ఇంటి గోడ పూర్తిగా కూలింది. ఇంట్లో జ్యోతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. తలదాచుకునేందుకు నీడలేకుండా పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే నా మానగర్ వద్ద తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. -
తొలగని సందిగ్ధం!
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహణపై సందిగ్ధంతొలగడం లేదు. కార్మిక సంఘాలు 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. యాజ మాన్యం నుంచి స్పందన లేకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ నిర్వహణకు జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్పీఎంలో 2014 నుంచి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగడం లేదు. 2018లో నిర్వహించాల్సి ఉన్నా యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మిల్లులో 373 మంది పర్మినెంట్ కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 800 మంది జాబ్ కార్మికులు, ఏసీఎస్ కంట్రోల్ సిస్టంలో 415 మంది పని చేస్తున్నారు. మొత్తం 1,900 మందికి పైగా కార్మికులు ఉన్నారు. కార్మిక సమస్యలపై పట్టింపేది..?2014లో మూతపడిన మిల్లును 2018లో జేకే పేపర్ మిల్లు యాజమాన్యం టేకోవర్ చేసుకుని 1,050 మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కార్మికుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దసంఖ్యలో కార్మికులు ఉన్నా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారు. వేతన సవరణ, బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి అంశాలపై మిల్లు ప్రతినిధులను నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని కార్మికులు వాపోతున్నారు. కోర్టు పరిధిలో వివాదంప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం తొలగితే తప్ప ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మిల్లులోని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యమై జేఏసీగా ఏర్పడి ఎస్పీఎం గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కార్మికుల ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించకుండా జాప్యం చేస్తుంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసింది. ఆ కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఎస్పీఎం గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. – వెంకటేశం, కార్మిక సంఘం నాయకుడు -
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.ఏ బస్తీలో చూసినా..మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.వారం రోజుల్లో..పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. -
అడ్మిషన్ల వేట
కెరమెరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల వేట ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో తిరుగుతూ పదో తరగతి పాసైన విద్యార్థులను గుర్తిస్తున్నారు. ఈ నెల 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కాగా, ప్రతీ కళాశాలలో కనీసం 150 నుంచి 200 మంది మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. గ్రూపులుగా తిరుగుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటి ప్రచారంజిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్లో 2,400 మంది, సెకండియర్లో 2,200 మంది విద్యార్థులను చేర్చుకోవా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 614 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజుల చెల్లించే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లోనే మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఏటా జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉత్తమ ఫలితాలు సాధించడం సానుకూలంశంగా మారింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్పాస్ సౌకర్యంతోపాటు ఉచిత అడ్మిషన్, పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. ఫలితాలను మెరుగుపర్చేందుకు కళాశాల ప్రారంభం నుంచే స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వీక్లీ, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మా త్రమే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎంపీసీ, బైపీసీ సెకండియర్లో 30 మార్కుల ప్రాక్టికల్స్ ఉండగా, ఇక నుంచి మొదట సంవత్సరంలో 15, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వివరాలు -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజల భద్రత కో సం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం అందించాలన్నారు. అ నంతరం సరైన పత్రాలు లేని 40 వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చీకట్లో డబుల్ ఇళ్లు
కాగజ్నగర్టౌన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం సమీపంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు గత నెల 8న ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే నెలరోజులు కావొస్తున్నా లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సరైన వసతులు లేకపోవడంతో ఇళ్లలో ఉండేందుకు సుముఖత చూపడం లేదు. సరైన రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో వర్షాలకు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంది. కాలనీల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. రాత్రిపూట చీకటి అలుముకుంటుంది. అంతేకాకుండా ఊరు చివరన డబుల్ బెడ్రూం ఇళ్లు ఉండగా కనీసం రక్షణగా ప్రహరీ కూడా నిర్మించలేదు. రాత్రిపూట భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి అద్దెలు కట్టలేక ఎదురుచూసిన వారి సొంతింటి కల నెరవేరినా ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. సందిగ్ధత తొలగేనా..?కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం రోడ్ సమీపంలో 12 బ్లాక్ల్లో 288 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 248 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించి ప్రొసీడింగ్లు కూడా అందించారు. మరో 40 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఇళ్లలో కరెంట్ లేకపోవడంతో చీకట్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పైపులైను వేసినా నీళ్లు సరఫరా కావడం లేదు. వేసవిలో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు నీరు అందుబాటులో లేదు. అయితే ప్రభుత్వమే ఉచితంగా మీటర్లు అందిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూస్తుండగా, అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. దీనిపై స్పష్టత వస్తేనే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే అవకాశం కనిపిస్తుంది. సౌకర్యాలు కల్పించాలి డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చి నెల రోజులవుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వెళ్లలేదు. కరెంట్ మీటర్, మంచినీళ్లు లేవు. సరైన దారి కూడా లేదు. అందరూ ఇళ్ల చూసి వస్తున్నా ఎవరూ నివాసం ఉండటం లేదు. అధికారులు మీటర్ల బిగింపుపై స్పష్టత ఇవ్వాలి. – బండయ్య, లబ్ధిదారుడు, కాగజ్నగర్ ఎలా ఉండాలి కొన్నేళ్లపాటు కాగజ్నగర్లో కిరాయికి ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. తీరా అక్కడి వెళ్లి చూస్తే సరైన వసతులు లేవు. కరెంటు, నీళ్లు లేకుంటే కుటుంబంతో ఎలా ఉండాలి. – యశోద, లబ్ధిదారు, కాగజ్నగర్ పనులు పూర్తయ్యాయి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులకు అప్పగించాం. 248 మంది లబ్ధిదారులకు కేటాయించారు. వాటర్ ట్యాంక్లు, నల్లాలు కూడా ఏర్పాటు చేశాం. విద్యుత్ స్తంభాలనూ ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు మీటర్లకు దరఖాస్తు చేసుకుని బిగించుకోవాలి. – ప్రకాశ్రావు, హౌసింగ్ పీడీ -
వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: గిరిజన హాస్టళ్లలో పని చేస్తున్న దినసరి, ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమాచారి డిమాండ్ చేశారు. మండలంలోని హట్టి బేస్ క్యాంపులోని కుమురంభీం విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కమి టీ సమావేశంలో మాట్లాడారు. గతంలో జరి గిన 44 రోజుల సమ్మెలో గిరిజన శాఖ మంత్రి పాల్గొని పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్కర్లకు టైంస్కేల్, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు సురేఖ, సంపత్, బిజులాబాయి, లక్ష్మీబాయి, జారుబాయి, లలిత తదితరులు పాల్గొన్నారు. -
కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో!
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్బోర్డు అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్బోర్డు నుంచి 4వ వేజ్బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి..ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్ బైపార్టియేట్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్ ఈ జేబీసీసీఐకి చైర్మన్గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని ఆయా కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది.కేంద్రంపై ఒత్తిడి..నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. -
● గృహ అవసరాల సిలిండర్పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం
ఆసిఫాబాద్: గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరి గింది. ప్రతీ సిలిండర్పై రూ.29 పెంచినట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం, హార్మోజ్ జలసంధి వద్ద ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇంధనం సరఫరాలో అంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పెట్రో, వంట నూనెల ధరలు మండుతున్నాయి. వంటనూనెలు లీటర్కు రూ.10 వరకు పెరిగాయి. మూడు నెలలతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు హోల్సేల్ మార్కెట్లో లీటర్కు రూ.161 నుంచి రూ.171 వరకు చేరాయి. ఈ పెంపు జిల్లాలోని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు గిరిజనులకు మోయలేని భారంగా మారింది. జిల్లా ప్రజలపై అదనపు భారంజిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు 1.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేల కు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. మూడు నెలల క్రితం గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరగడంతో రూ.982 కు చేరింది. తాజాగా మరోసారి రూ.29 పెంచడంతో రూ.1011కు చేరింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.27 లక్షల అదనపు భారం పడుతుంది. నిలకడ లేకుండా..గతంలో గ్యాస్ ధరలు నిలకడగా ఉండేవి. కానీ రెండేళ్లుగా ఒడిదొడులకు లోనవుతున్నాయి. 2022 మా ర్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ. 875 ఉండగా 2023 జనవరిలో రూ.976కు చేరింది. ఏప్రిల్లో సిలిండర్పై రూ.50 పెంచారు. జూన్లో మళ్లీ సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1019 నుంచి రూ.1072కి చేరింది. గత ఆగస్టులో వంట గ్యాస్ రూ.1172 ధర ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ ఊరట కలిగించింది. మరోసారి 2024 మార్చిలో సిలిండర్పై రూ. 100 తగ్గించింది. మళ్లీ గతేడాది సిలిండర్పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. గత మార్చి 7న సిలిండర్పై రూ.60 పెరిగి రూ.982కు చేరింది. తాజాగా సిలిండర్పై రూ.29 పెంచడంతో రూ.1011 చేరింది. అంతేకాక డెలివరీ బాయ్స్ రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఒక్కో సిలిండర్కు రూ.1061 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టిఫిన్, టీ రేట్లకు రెక్కలుగృహ అవసరాల సిలిండర్తోపాటు వాణిజ్య సిలిండర్ల ధరల్లో కూడా నిలకడ ఉండటం లేదు. గత మార్చి 7న కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరగడంతో రూ.2,144కు చేరింది. కమర్షి యల్ సిలిండర్ ధర పెరగడంతో జిల్లా కేంద్రంలోని హోటళ్ల యజమానులు సైతం అమాంతం రేట్లు పెంచారు. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లపై అదనంగా రూ.10 పెంచారు. ప్లేట్ ధర రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50కి చేరింది. అలాగే టీ సైతం రూ.10 నుంచి రూ.13కి పెంచి అమ్ముతున్నారు. -
సదస్సుకు తరలిన టీబీజీకేఎస్ నాయకులు
రెబ్బెన: గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఆధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు బెల్లంపల్లి ఏరియా నుంచి ఆ యూనియన్ నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణే ధ్యేయంగా టీబీజీకేఎస్ పోరాటం చేస్తోందని అన్నారు. తమ హయాంలో కేసీఆర్ సహకారంతో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించామన్నారు. వాటిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం కాలరాస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు కార్నాథం వెంకటేశ్, తిరుపతి, బొంగు వెంకటేశ్, చందర్ తదితరులు పాల్గొన్నారు. -
చెలిమలలో బర్డ్వాక్
తిర్యాణి: ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టు ఆవరణలో బర్డ్వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ అధికారి రమాదేవి మాట్లాడుతూ చెలిమల వాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో దాదా పు 180కి పైగా అరుదైన పక్షి జాతులు ఉన్నట్లు తెలి పారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డెక్కన్ బర్డర్స్ సభ్యులు, జెడ్పీ పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలపై తక్షణమే స్పందించాలి
వాంకిడి: వర్షాకాలంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డీపీవో భిక్షపతి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని సవాతి, దొడ్డిగూడ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణ, వనమహోత్సవం, మ్యాజిక్ ఇంకు డు గుంతల నిర్మాణం, దోమల నివారణ, స్వచ్ఛత, పారిశుద్ధ్యం, తదితర అంశాలు వివరించారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా నాటే మొక్కల సంరక్షణను అందరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. సమగ్ర ఓటరు సవరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరద ప్రభావిత గ్రామాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, ఎంపీవో ఖాజా అజీజుద్దీన్, ఏవో గోపికాంత్, ఏపీవో శ్రావణ్ కుమార్, సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ పథకాలు
కాగజ్నగర్టౌన్: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. శనివారం పట్టణంలోని 8, 9, 10, 11, 12 వార్డుల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రెయినేజీలు ఆక్రమణకు గురికావడంతో వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని, సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు వినతిపత్ర ం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ తిరుపతి, సీఐ ప్రేంకుమార్, కౌన్సిలర్ గజ్జెల లావణ్య, గజ్జెల లక్ష్మన్, ము న్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి
రెబ్బెన: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్ అన్నారు. శనివారం మండలంలోని తుంగెడలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ నిబంధనలు, మహిళాలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, ఈవ్టీజింగ్ వంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం షీ టీంలు, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో డయల్ 100, డయల్ 112 నంబర్లను సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1030 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలగాణి బుచ్చక్క, ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై వెంటకరమణ, డిప్యూటీ తహసీల్దార్ లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎస్పీఎం కార్మికులకు నిరాశే మిగిల్చారు
కాగజ్నగర్టౌన్: జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సభలో ఎస్పీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడుతారని అనుకుంటే వారికి నిరాశే మిగిల్చారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 17 రోజులుగా కార్మికులు రిలే నిరహారదీక్షలు చేస్తున్నా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పట్టించుకోకపోవ డం దారుణమన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా వెళ్లి పోయారని విమర్శించారు. తమగోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన కార్మికులను పోలీస్స్టేషన్కు తరలించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి వెంటనే స్పందించి మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. -
నో పైరవీ.. నో రెక్వెస్ట్
సాక్షి, ఆదిలాబాద్: ఆదాయం అధికంగా ఉండే శా ఖల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చే సుకుంటుందంటే అందులో పైరవీలు, రెక్వెస్టులు సాధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మరో ఆఫీసర్ రెక్వెస్ట్ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వె నకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయితే ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్ డిప్యూటీ కమిషనర్(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పోస్ట్ కావాలని పైరవీ చేసుకోలేదని, రెక్వెస్ట్ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం ఎక్సైజ్శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలకు ప్రమోషన్ లభించింది. డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియ చోటు చేసుకుంటుంది. పక్కనున్న పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు,రెక్వెస్ట్లు చేసుకుంటుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదాయం ఉండదనే ది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి అని బాహాటంగానే చెప్పుకోవడం గమనించదగ్గ విషయం. కొరవడిన పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లా బాస్ డీసీ ఇన్చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో ప ర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇన్చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్సుల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇ టీవల జిల్లాలో గంజాయి సాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబా కేసులు కూడా పో లీసులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా రఘురాం ఇన్చార్జి ఆఫీసర్గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఇన్చార్జి డీసీగా కొనసాగుతున్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్ లను నియమించనున్నారని, రఘురాంను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారికి పోస్టింగ్ ఇవ్వడం ఖాయమని శాఖలో చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) లుగా హిమశ్రీ, నందా గోపాల్, జ్యోతి కిరణ్, రజాక్ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బదిలీలు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్ కూడా పైరవీ, రెక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు. -
విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్అర్బన్: విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. శనివారం డీఈవో సచ్చిదానందచారితో కలిసి తిర్యాణి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మాణిక్యాపూర్లోని కేజీబీవీని సందర్శించారు. తరగతి గదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ఆకాంక్షిత బ్లాక్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ఆసిఫాబాద్: వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పరి సరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయడం వల్ల మురుగు నీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వార్డు సమస్యలు కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, జెబాషేక్, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీనారాయణ, నాయకులు సాయి శ్రావణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: ఈ నెల 21న నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హై దరాబాద్ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కిషోర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్యదేవరాజన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం పటిష్ట బందోబస్తు మధ్య, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ స్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి మండలానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులలో స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఎస్పీ నితికా పంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేశవరావు కమిటీని స్వాగతిస్తున్నాం
కాగజ్నగర్టౌన్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేశవరావు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్రావు అన్నారు. శనివారం పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారునలు గుర్తించి జాబితా తయారు చేస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు కూడా నేడు ఉద్యమకారులుగా చెప్పుకుంటూ సర్టిఫికెట్ల పేరుతో రూ.500 చొప్పున వసూలు చేస్తున్న విషయం తమదృష్టికి వచ్చిందన్నారు. నిజమైన ఉద్యమకారులు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే హరీశ్బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యలో త్వరలోనే చైర్మన్ కేశవరావును కలుస్తామన్నారు. సమావేశంలో నాయకులు సుభాష్, పాల్వాయి సుధాకర్రావు, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, రమేశ్గౌడ్, జయదేవ్, అబ్రహం, తుమ్మ రమేశ్, దుర్గం విస్తారు, జాడి కేశవ్, గోగర్ల కన్నయ్య, తాజ్బాబా, కొప్పుల శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
పర్సనల్ హెచ్వోడీగా కిరణ్బాబు బాధ్యతలు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా పర్సనల్ హెచ్వో డీగా డీజీఎం కిరణ్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హెచ్వోడీగా పనిచేసిన ఎస్వీ రాజేశ్వర్రావు ఎస్టీపీపీకి బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న కిరణ్బాబు బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు. డిపార్టుమెంట్ ఉద్యోగులు నూతన డీజీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్టీపీపీకి బదిలీపై వెళ్తున్న పర్సనల్ డిపార్టుమెంట్ డీవైపీఎం రాజేశ్వర్రావును శుక్రవారం గోలేటి టౌన్షి ప్లో జీఎం శ్రీరమేశ్, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, డీజీఎంలు ఉజ్వల్కుమార్, కిరణ్బాబు, మదీనా బాషా, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట బహిరంగ సభ
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేసుకోవాల నే డిమాండ్తో త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. పట్టణంలో ని దీక్ష శిబిరం వద్ద శుక్రవారం జేఏసీ నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వర్కర్స్ యూనియన్ల నుంచి ఇద్దరి చొప్పున కమిటీ ఏర్పాటు చేశామని, జేఏసీ కన్వీనర్గా గోగర్ల రాములు, కోకన్వీనర్గా వెంకటేశంను ఏకగ్రీవంగా ఎ న్నుకున్నామని తెలిపారు. సభ అనంతరం చలో ఆదిలాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేపడుతామన్నారు. శ్రీనివాస్, సురేందర్, రమణయ్య, నానాజీ, వెంకటేశం, ముంజం శ్రీనివాస్, రాజేశ్, ఓదెలు వేణుగోపాల్, కన్నయ్య, పోచం పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పెంచికల్పేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెంచికల్పేట్ ఫారెస్ట్ డివిజన్లో ఎస్పీ నితిక పంత్, డీఎఫ్వో బాలామణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్లతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను వాడితే ప్రకృతిని కాపాడుకోవచ్చన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రత పెరగడం, నీటి లభ్యత తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదమని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడాలని, ప్రతీ వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చూడాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్య, రేంజ్ అధికారి అనిల్కుమార్, సర్పంచ్ రాంచందర్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. యాప్లోనే ఇసుక అనుమతులుకాగజ్నగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా ను అరికట్టేందుకు మన ఇసుక వాహనం యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, యాప్లోనే స్లాట్ బుక్ చేసుకుని ఇసుక అనుమతులు పొందాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం అడ్డుకుని అనుమతి పత్రాలు పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా వాగులు, ఒర్రెల నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘బడిబాట’ విజయవంతం చేయాలిఆసిఫాబాద్రూరల్: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద, చారి, డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్ అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్వో శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, డీఎల్పీవో ఉమర్ హ్సుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
షీర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు
కెరమెరి: షీర్ వాల్ టెక్నాలజీతో 15 రోజుల్లో నే కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సీఎం పర్యట నలో నిర్మాణ పనులు సైతం పరిశీలించారని పేర్కొన్నారు. బుధవారం కాంక్రీట్ పోయగా, గురువారం డీషెటరింగ్ చేసినట్లు వివరించా రు. సివిల్ పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలి న పనులు త్వరలో చేపడతామని తెలిపారు. శుక్రవారం హౌసింగ్ అధికారులు ఇంటిని పరిశీలించారు. త్వరలో గృహ ప్రవేశానికి సిద్ధం చేసుకోవచ్చని హౌసింగ్ డీఈ వేణుగో పాల్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్కుమార్, సర్పంచ్ శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా బాక్సింగ్ పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలబారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు అట్టహాసంగా నిర్వహించా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వి భాగాల్లో ప్రతిభ చూపిన 25 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. అనంతరం విజేతలకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిర్, ముత్తు బాక్సింగ్ క్లబ్ చైర్మన్ శివకుమార్, కార్యదర్శి మదురై శేఖర్, వైస్ ప్రెసిడెంట్ జయేందర్, ఎస్సై మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రుణం.. అధనం
తిర్యాణి: స్వయం ఉపాధి కల్పనకు మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు మరింత అందనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యాన్ని పెంచుతూ ఖరారు చేశారు. అతివలు స్వయం ఉపాధిలో రాణించేలా సోలార్ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వ్యాపారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి రుణాలు ఉపయుక్తంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక చేయూత అందిస్తూ ఏటా తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తుంది. సభ్యులు తీసుకున్న మొత్తాలను నెలవారీ వాయిదాల రుణంలో తిరిగి చెల్లిస్తుంటారు. ఈ ఏడాది రూ.239.77 కోట్ల చెల్లింపులుజిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏటా పరిమితికి మించి బ్యాంకులు రుణాలు చెల్లిస్తున్నాయి. గత ఆర్థిక సంవతర్సంలో రూ.232 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే లక్ష్యానికి మించి రూ.234 కోట్లను సంఘాలకు చెల్లించారు. ఈ నేపథ్యంలో 2026– 27 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితి మరింత పెంచారు. జిల్లాలో 8,163 సంఘాలకు రూ.239.77 కోట్ల రుణాలు చెల్లించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కాగజ్నగర్ మండలంలో రూ.27.46 కోట్లు, ఆసిఫాబాద్లో రూ.20.92 కోట్లు, వాంకిడి మండలంలో రూ.19.25 కోట్లు అందించనుండగా, అత్యల్పంగా పెంచికల్పేట్ మండలంలో రూ.8.09 కోట్లు, సిర్పూర్(యు)లో రూ.8.41 కోట్లు, లింగాపూర్లో రూ.9.37 కోట్లు చెల్లించనున్నారు. బస్సులు, సోలార్ ప్లాంట్తో అభివృద్ధి బాటప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రుణాలకే పరిమితి కాకుండా స్వయం ఉపాధి పొందేలా ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులు, వడ్ల కొనుగోళ్లు తదితర పనులు అప్పగిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్ను రూ.6కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ను రూ.3.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో వచ్చిన లాభాల్లో రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల సమైక్యలతోపాటు జిల్లా సమైక్యకు చెల్లిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఇప్పటికే జిల్లాలో 15 మండల సమైక్యల కోసం 15 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్సు ద్వారా ప్రతినెలా రూ.69,485 ఆదాయం సమకూరుతోంది.మండలాల వారీగా బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యంమండలం సంఘాలు లక్ష్యం (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 682 20.92 బెజ్జూర్ 467 15.21 దహెగాం 535 16.19 జైనూర్ 575 18.22 కాగజ్నగర్ 900 27.46 రెబ్బెన 690 18.93 సిర్పూర్(యు) 312 8.41 సిర్పూర్(టి) 507 13.84 వాంకిడి 743 19.25 తిర్యాణి 511 15.59 పెంచికల్పేట్ 267 8.09 లింగాపూర్ 279 9.37 కౌటాల 622 18.12 కెరమెరి 556 15.31 చింతలమానెపల్లి 517 14.79 మొత్తం 8,163 239.77 లక్ష్యం నిర్దేశించాం జిల్లాలో 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 8,163 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.239.77 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించాం. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు అందించి రాష్ట్ర స్థాయిలో మన్ననలు అందుకున్నాం. అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం టార్గెట్ చేరుతాం. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. – నరేందర్, డీపీఎం -
కుమురం భీం
7‘మినరల్’ పేరుతో దోపిడీ జిల్లా కేంద్రంలో మినరల్ వాటర్ పేరుతో కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలపై అధికారుల నిఘా కరువైంది. 9లోuఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాలలో మాయలేడీలు..! మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. 8లోuశనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026 -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
ఆసిఫాబాద్రూరల్: అంకితభావంతో పనిచేస్తే ఉపాధ్యాయులు గుర్తింపు పొందుతారని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం 2025– 26 విద్యాసంవత్సరంలో ఉత్తమ సేవలు అందించిన 200 మంది ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన 800 మంది విద్యార్థులకు సంబంధించిన ప్రశంసాపత్రాలను సంబంధిత ఎంఈవోలకు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యన్నతికి నిరంతర కృషి, విధి నిర్వహణలో అంకితభావం, 90 శాతానికి పైగా హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో క్రమశిక్షణకు కృషి చేసిన ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ప్రశంసాపత్రాలు పంపించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేసి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్టినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ కోఆర్టినేటర్ కె.శ్రీనివాస్, ఎంఈవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్‘లెస్’ బస్సులు!
ఆసిఫాబాద్అర్బన్: నూతన విద్యాసంవత్సరం ప్రా రంభానికి సమయం ఆసన్నమవుతున్నా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫి ట్నెస్ను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా బ స్సులు సామర్థ్య పరీక్షలకు నోచుకోలేదు. విద్యార్థులను తరలించేందుకు 91 బస్సులు వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటివరకు కేవలం 52 బస్సుల కు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించారు. మరో వైపు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ అధికారులు వా హన సామర్థ్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో పరిస్థితి ఇలా..జిల్లావ్యాప్తంగా 116 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో 31,116 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని తరలించేందుకు యాజమాన్యాలు 91 బస్సులను నడిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పాఠశాలలు, కళాశాలలు మూసి ఉండటంతో యా జమాన్యాలు బస్సులను సాధారణంగా వాడకుండా ఉంచుతాయి. చాలామంది అద్దె కోసం సభలు, స మావేశాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుంటాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల ల ప్రారంభం నాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఆ తర్వాతే బస్సులను రోడ్లపైకి అనుమతిస్తారు. ఇప్పటివరకు జిల్లాలోని 91 బస్సుల్లో కేవలం 52 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించుకోగా, మిగిలిన 39 బస్సులకు త్వరగా పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. జూన్ 12వ తేదీ తర్వాత ఫిట్నెస్ పత్రాలు, సరైన అనుమతులు లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులపైనా బాధ్యతచిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించే తల్లి దండ్రులు పాఠశాలలో సదుపాయాలు, తరగతి గ దులు, బోధనా విధానంతోపాటు ప్రైవేట్ బస్సులపైనా దృష్టి సారించాలి. బస్సులు కండిషన్లో ఉ న్నాయా.. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా..? అనే విషయాలపై ఆరా తీయాలి. అర్హత కలిగిన డ్రైవర్ ఉన్నారో లేదో గమనించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆటోలు, ఇతర వాహనాల్లో పంపించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.నిబంధనలు ఇవే.. -
పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
కాగజ్నగర్టౌన్: పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. పట్టణంలోని రాజీవ్గాంధీ చౌర స్తా, తిరందాజ్ టాకీస్ వరకు గల రోడ్డును గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాలువలు శుభ్రపర్చాలని, తడిపొడి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గురుకృప టిఫిన్ నిర్వాహకులు వినియోగించిన ప్లేట్లను రోడ్డుపై పడివేయగా, యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను చెత్తకుండీల్లో వేయాలని సూచించారు. వీరి వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, సిబ్బంది ఉన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలుఅనుమతులు లేకుండా ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం, మండువ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల్లోని చెరువులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను నజ్రుల్నగర్ విలేజ్ నం.12 సమీపంలో అడ్డుకున్నారు. అనుమతులు, సరైన పత్రాలు లేకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మధుకర్, సిబ్బంది ఉన్నారు. పకడ్బందీగా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు బూత్స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించి ధ్రువపత్రాలు జత చేసిన ఫారాన్ని తిరిగి తీసుకుని బీఎల్వో యాప్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 358 పోలింగ్ కేంద్రాల్లో హేతుబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జమీల్, డీటీలు శ్యాంలాల్, రామ్లాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో నిందితులకు శిక్షపడేలా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ కాస్తూ డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. అనంతరం అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆసిఫాబా ద్ మండలం బాబాపూర్ పంచాయతీలో గ్రామ స భ నిర్వహించారు. అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయ న మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని, ఇంటి వద్దే పొడి, తడి చెత్తను వేరు చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువల శుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వ్యా ప్తిని అరికట్టేందుకు పరిశుభ్రత పాటించాలన్నారు. రైతులు పంటల మార్పిడి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని, నీటి లభ్యత, మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రాముఖ్యత, ఓటరు జాబితా నవీకరణలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనిక, సర్పంచ్ రాజన్న, ఉపాధిహామీ ఏపీవో బుచ్చన్న, పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన జీఎం
ఆసిఫాబాద్: సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీరమే శ్ గురువారం కలెక్టర్ కె.హరితను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ పై సుదీర్ఘంగా చర్చించారు. బెల్లంపల్లి ఏరి యాలో అభివృద్ధిలో గోలేటి ఓపెన్ కాస్ట్ గని ఎంతో కీలకమైందని, త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం కేవలం ఒక్క ఖైరిగూర ఓసీ నుంచి మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. భవిష్యత్లో ప్రారంభం కానున్న గనులు, ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న వివిధ మైనింగ్ ప్రాజెక్టుల వివరాలను అందించారు. కొత్తగనుల ప్రారంభానికి ప్రభుత్వపరంగా అనుమతులు వేగంగా లభించేలా జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందించాలని కోరారు. -
కుమురం భీం
7దస్నాపూర్లో అగ్నిప్రమాదం దస్నాపూర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. 8లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం అక్కడక్కడ ఉరుములతో వర్షం కురుస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ఊరట! రాష్ట్రప్రభుత్వం ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 8లోu శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026 -
పంట మారుద్దాం..
ఎల్నినోను ఎదుర్కొందాం.. కౌటాల: రుతుపవనాల రాకకు ముందే అడపాదడ పా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సాగు కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చేలు సిద్ధం చేసుకు ని భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయి తే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ ర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగుపై కాకుండా.. పంట మార్పిడి విధా నం పాటించాలని వ్యవసాయ అధికారులు సూచి స్తున్నారు. తక్కువ నీటితో పంటలు పండిస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చంటున్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి పంట మార్పిడి చేసుకుంటే భూసారం పెరుగుతుందని, తెగుళ్ల బెడదను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. తగ్గుతున్న పత్తి దిగుబడులుజిల్లాలో 4.50లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు పండిస్తుండగా, అందులో అత్యధికంగా 3,70,919 ఎకరాల్లో తెల్ల బంగారంగా పిలిచే పత్తి, ఆ తర్వాత 42,228 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 2010 త ర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ప్రారంభంలో ఎర్ర నేల్లో 10 క్వింటా ళ్లు, నల్లరేగడి నేలల్లో 15 క్వింటాళ్ల దిగుబడి రాగా కాలక్రమేణ పరిస్థితులు మారాయి. చీడపీడల ఉధృతి పెరగడం, వరదలు ముంచెత్తడం, ఇతర కారణా లతో ప్రస్తుతం ఎకరానికి 2 నుంచి 5 క్వింటాళ్లు మించడం లేదు. ఏళ్లుగా సేంద్రియ ఎరువులు విని యోగించకపోవడం, రసాయనిక ఎరువులపైనే ఆ ధారపడుతుండటంతో నేలలో కార్బన్, సూక్ష్మపోషకాలు లోపిస్తున్నాయి. మరోవైపు నకిలీ పత్తి విత్తనా లు జిల్లా రైతులను నిండా ముంచుతున్నాయి. నష్టాలు ఉన్నా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించకపోవడంతో కోలుకోలేకపోతున్నారు. తగ్గిన సోయా, కంది సాగుజిల్లా రైతులు పత్తి, వరి పంటల సాగుపైనే అధికంగా ఆధారపడుతున్నారు. వర్షాధార పంటల్లో పత్తి సాగుదే ప్రథమ స్థానం. పదేళ్ల క్రితం లక్ష ఎకరాల్లో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం జిల్లాలో కేవలం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కంది సైతం 40 వేల ఎకరాల నుంచి సగానికి పడిపోయి 20వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. మరోసారి ఎల్నినో ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తే మేలు. స్వల్పకాలిక పంటల సాగుతో నష్టాలు కూడా తక్కువగా ఉంటాయి. పత్తి సాగుతో నష్టాలు ఏళ్ల తరబడిగా పత్తి సాగు చేస్తున్నా. ఒక ఏడాది దిగుబడి వస్తే మరోసారి రాదు. ఆరేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు. నష్టాలే తప్ప మిగులు ఉండటం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం కూడా అందడం లేదు. రైతులు నష్టపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా.. – దామోదర్, యాపలగూడ, మం.కౌటాల అవగాహన కల్పిస్తున్నాం రైతులు ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తే క్రమేనా దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడితో నేలసా రం పెరగడంతోపాటు తెగు ళ్లు తగ్గుతాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడులు అదుపులో ఉంచుకోవచ్చు. పంట మార్పిడి, పంట సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పి స్తున్నాం. – వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి తొందరపడి విత్తుకోవద్దు ఎల్నినో ప్రభావంతో ఈసా రి వర్షపాతం తక్కువగా న మోదయ్యే అవకాశం ఉంటుంది. అన్నదాతలు దీర్ఘకా లిక పంటలు కాకుండా స్వ ల్పకాలికల సాగుకు సిద్ధం కావాలి. వర్షం పడిన వెంటనే రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకో వద్ద. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలపై దృష్టి సారించాలి. – డా.శ్రీనివాస్, ప్రొఫెసర్, కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన శాఖ యూనివర్సీటీ జిల్లాలో సాగు వివరాలు ఇలా చేస్తే మేలువ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొల్లాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరుప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకు ముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సొయచిక్కుడు వేయకూడదు. యాసంగిలో వేరుశనగ వేసుకున్న రైతులు ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభి స్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. కంది, శనగ పైర్లను వరసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సొయ చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలువ, మెట్ట వరితో పంట మార్పిడి చేసుకోవాలి. వరి వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనెగింజలు పండించాలి. పంటను మారిస్తే చీడపీడల ఉధృతి తగ్గుతుంది. -
న్యూస్రీల్
రేపు మినీ జాబ్మేళా ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న(శనివారం) ఉదయం 10 గంటలకు మినీ జాబ్మేళా నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91605 08476, 79897 73351 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పాలిటెక్నిక్లో ప్రవేశాలు షురూ రెబ్బెన: మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ మొదలైందని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ తెలిపారు. సింగరేణి ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా 150 సీట్లు కేటాయించారన్నారు. సివిల్ ఇంజినీరింగ్లో 30, కంప్యూటర్ సైన్స్ 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 30, మెకానికల్ ఇంజినీరింగ్ 30, మైనింగ్లో 30 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వెబ్సైట్ లేదా 87901 12515, 99081 51618, 90102 22161 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ
కాగజ్నగర్టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్12 వరకు కొనసాగే పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు హాల్టికెట్తో గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏర్పాట్లు పూర్తిపదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్(బాలికలు), కాగజ్నగర్(సర్సిల్క్) జెడ్పీహెచ్ఎస్(బాలికలు), సిర్పూర్(టి) జెడ్పీహెచ్ఎస్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 18 మంది ఇన్విజిలేటర్లు, ఒక అబ్జర్వర్, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితరులు విధులు నిర్వహించనున్నారు. ప్రతీ కేంద్రం వద్ద నిఘా టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్నిఏర్పాట్లు చేశాం. మూడు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసు నిఘా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నాం. – సచ్చిదానంద చారి, జిల్లా విద్యాశాఖ అధికారి -
ప్రీప్రైమరీ.. మరింత బలోపేతం
కాగజ్నగర్టౌన్: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు నిండగానే ఆ స్కూళ్లలో నే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని విద్యాశాఖ గుర్తించింది. ఈ క్రమంలో సర్కా రు బడుల్లోనూ విడతల వారీగా ప్రీప్రైమరీ తరగతులు అమలు చేస్తోంది. 2020 జాతీయ విద్యావిధానా న్ని అనుసరించి జిల్లాలో ఇప్పటికే 41 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగుతోంది. 2026– 27 విద్యాసంవత్సరంలో మరో 77 పాఠశాలల్లో అమలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఇన్స్ట్రక్టర్ల నియామకానికి జిల్లా విద్యాధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలు, 101 ప్రాథమికో న్నత, 561 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2026– 27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాల్లో ప్రీప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో కొత్తగా 77 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించేందు కు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జి ల్లాలో ఇప్పటికే 41 ప్రీప్రైమరీ పాఠశాలు కొనసాగుతుండగా కొత్తవాటితో కలుపుకొని ఆ సంఖ్య 118కి చేరింది. జూన్ 12 నుంచి జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్ఫ్రాస్టక్చర్, ఫర్నీచర్, ఇండోర్, ఔట్డోర్ ఆట వస్తువులు, పెయింటిగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతీ స్కూల్కు రూ.1.70 లక్షల చొప్పున కేటాయించనున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు, అక్షరమాలలు, జంతువులు, పక్షులు బొమ్మలు వేయించనున్నారు.దరఖాస్తుల ఆహ్వానంఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో 2026– 27 విద్యా సంత్సరానికి మంజూరైన 77 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఒక్కొక్క పాఠశాలకు ఒక్కరి చొప్పున ఇన్స్ట్రక్టర్, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చే సుకోవాలని సూచించారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు ఏడో తరగ తి పాసై ఉండాలని తెలిపారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయా పోస్టులకు రూ.6 వేల చొప్పున పది నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన ప్రీప్రైమరీ స్కూళ్లు ఇలా.. మండలం ప్రీప్రైమరీ పాఠశాలలు ఆసిఫాబాద్ 9 కెరమెరి 4 జైనూర్ 7 రెబ్బెన 3 కాగజ్నగర్ 22 దహెగాం 15 చింతలమానెపల్లి 5 బెజ్జూర్ 3 కౌటాల 5 పెంచికల్పేట్ 3 సిర్పూరు(టి) 1 154 మందికి ఉద్యోగావకాశంజిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు 154 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. తాత్కాలిక పద్ధతిలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించనున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.8 వేలు, రూ.6 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి త్రీ మెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
హెల్మెట్తో ద్విచక్ర వాహనదారులకు రక్షణ
● ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లతో రక్షణ ఉంటుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. కంచుకోట, గాంధీచౌక్, ప్రభుత్వ ఆస్పత్రి, పైకాజీనగర్ మీదుగా మెయిన్ రోడ్ వరకు రోడ్డు భద్రతా పరిస్థితులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించాలని సూచించారు. మ ద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణపాయం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా హెల్మె ట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ‘బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్’గా కొని యాడారు. మెరుగైన సేవలందించేందుకు సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపా రు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు, సమస్యలను అధి కారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, వేణుగోపాల్, ఎస్సైలు మధుకర్, రవికుమార్, విక్రమ్, మహేందర్, ఉల్లాస్, శ్యా మ్రావు, మోహన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలిఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
కీలక అంశాలపై చర్చించాలి
● కలెక్టర్ కె.హరిత ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పైప్లైన్ లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని ఆదేశించారు. డ్రెయినేజీలు, వీధులు నిత్యం శుభ్రం చేయాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో బూత్లెవల్ అధికారులు ఓటరు నమోదు, సవరణల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ ఆదా, సమస్యల పరిష్కారాలపై ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి
రెబ్బెన: కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్ అయిన సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్ డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్పీలో బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి డీవైజీఎం కోటయ్యకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఏడాదిగా మెడికల్ బోర్డు నిలిపివేసి మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. స్పందించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు శ్రీనివాస్, ఏరియా నాయకులు విద్యాసాగర్, మురళీ, అజాబ్, శ్రీని వాస్, చిరంజీవి, జ్యోతి పాల్గొన్నారు. -
కార్పొరేట్లో ఇంటర్
ఆసిఫాబాద్అర్బన్: ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇంటర్మీడియట్ కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదివించేందుకు కార్పొరేట్ విద్యాపథ కం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్యూషన్ ఫీజు, పాకెట్ మనీ అందిస్తూ విద్యార్థుల చదువుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ విద్యార్థులు అర్హులుజిల్లాలో పదో తరగతి విద్యార్థులు మొత్తం 6,932 మంది వార్షిక పరీక్షలు రాయగా, ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యను అభ్యసించేందుకు జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోద య, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారు అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలు జతపరచాలి. పదో తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. ఈ నెల 5 వరకు గడువుజిల్లాలో స్థానికంగా మెరుగైన విద్యా అవకాశాలు లేవు. ఎక్కువ మంది సమీపంలోని మంచిర్యాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరా లకు వెళ్తుంటారు. పేద విద్యార్థులు కొంతమంది ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి ట్యూషన్ ఫీజు కింద ప్రభుత్వం రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3 వేలు చెల్లించనుంది. మీసేవ కేంద్రాల ద్వారా https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీ వరకు గడువు ఉంది. జిల్లాలోని అర్హులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యాపథకం ద్వారా అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం జూన్ 5లోగా అర్హులైన విద్యార్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – అశోక్ మదిరె, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి -
20న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఈ నెల 20న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్రతో కలిసి బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడే క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు, ఎలక్ట్రిసిటి, భూతగాదాలు, వివా హ, కుటుంబ తగాదాలు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ఫండ్, చెక్బౌన్స్ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘గిరి’ బడిలో చేరుదాం రండి..!
కెరమెరి: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. తొలిరోజు హాస్టళ్లలో పాడైన వస్తువులు తొలగించి ఆవరణ, తాగునీటి ప్రాంతం, ఓహెచ్ఆర్ ట్యాంకులు శుభ్రపరిచారు. గ్రామ సభలు నిర్వహించి బడిబాట ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఇందులో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే కార్యక్రమాలు ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆశ్రమాల షెడ్యూల్.. ఈ నెల 4న వంటశాలలు, డార్మెటరీలు, 5న తరగతి గదులు, కార్యాలయ గదులు, 6న సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు శుభ్రం చేస్తారు. 8 నుంచి 10 వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల స్వీకరణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తారు. 11, 12 తేదీల్లో సిబ్బందితో సమావేశం, రికార్డుల నవీకరణ, విధుల కేటాయింపు, 17న సమగ్ర విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న డిజిటల్ తరగతి గదులపై అవగాహణ, 19న క్రీడాదినోత్సవం నిర్వహిస్తారు. ప్రతిరోజూ సమీక్షించాలిగతేడాది ఉన్న విద్యార్థులను వందశాతం నిలుపుదల చేయడంతోపాటు కొత్త వారిని బడిలో చేర్పించాలి. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఎస్సీఆర్పీలు ప్రతిరోజూ కార్యక్రమాలను సమీక్షించాలి. – పి.రమాదేవి, గిరిజనశాఖ సంక్షేమ అధికారి -
బాధ్యతలు స్వీకరించిన జీఎం
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్గా బదిలీపై వచ్చిన శ్రీరమేశ్ బుధవారం గోలేటిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జీఎంగా పనిచేసిన విజయ భా స్కర్రెడ్డి పదవీ విరమణ పొందగా.. ఆయన స్థానంలో మణుగూరు ఏరియా నుంచి బది లీపై వచ్చిన శ్రీరమేశ్కు అధికారులు స్వాగ తం పలికారు. జీఎం మాట్లాడుతూ గతంలో ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందన్నా రు. ఉత్పత్తిలో ఏరియాను మొదటిస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
నిరాశపర్చిన ముఖ్యమంత్రి పర్యటన
రెబ్బెన: జిల్లాకు వస్తే న్యాయం జరుగుతుంది.. అభివృద్దికి నిధులు మంజూరవుతాయని ఎదురుచూసిన జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన నిరాశపర్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. గోలేటిలోని ఆఫీసర్స్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి సభకు అధ్యక్షతన వహించాల్సి ఉన్నా.. కనీసం మాట్లాడే అవకాశం కల్పించకుండా పక్కన పెట్టి అవమానపర్చడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నియాజకవర్గాలకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆసిఫాబాద్– ఆదిలాబాద్ రోడ్డు అధ్వానంగా మారిందని, అలాగే కాగజ్నగర్– సిర్పూర్, సిర్పూర్ –బెజ్జూర్, కాగజ్నగర్ –పెంచికల్పేట్ రోడ్లు దారుణంగా ఉన్నా నిధులు కేటాయించలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారని, ముందుగా డీపీఆర్ను సిద్ధం చేయాలని హితవు పలికారు. వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. -
హామీలు అమలు చేయాలి
రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగి న మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హా మీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అజ్మీర బా బురావు అన్నారు. ఉద్యమకారులు అజ్మీర బాబురావు, బోగే ఉపేందర్, కోట రాజయ్య, దుర్గం రవీందర్, సోగాల వామన్లను బుధవారం గోలేటిలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిందన్నారు. హామీ మేరకు పెన్షన్, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అరుణ్, సాంబగౌడ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, కారోబార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం
ఆసిఫాబాద్రూరల్: హరితదళం(ఎన్జీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వర్థ్యాల నిర్వహణ, మొక్కల పెంపకంపై సమ్మర్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన బాబాసాగర్ హెచ్ఎం సత్యనారాయణ, పెంచికల్పేట్ హెచ్ఎం నిర్మల, వాంకిడి హెచ్ఎం నటరాజుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యతభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జాతీయ హరిత జిల్లాకోఆర్టినేటర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుంచి మాస్టర్ మైండ్స్ గూగుల్ మీట్ ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని కలెక్టర్ కె.హరిత తెలిపారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ తరగతుల ప్రచార పోస్టర్ను జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం జిల్లా సైన్స్ అధికారి మధుకర్తో కలిసి ఆవిష్కరించారు. -
అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేం
ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగా లను ఎప్పటికీ మరువలేమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రజల శాంతిభద్రతల రక్షణకు జిల్లా పోలీసుశాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రభుత్వ గుర్తింపు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్ పాల్గొన్నారు. -
గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
ఆసిఫాబాద్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ సభల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించాలని, పర్యావరణం, అటవీ శాఖలపై చర్చించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత గురించి ప్రజలకు వివరించాలన్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం, మురుగు కాల్వల శుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన బృందాలు, రెస్క్యూ బృందాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులపాటు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేపై వివక్ష
ఆసిఫాబాద్: కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట సీఎం సభలో ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపించారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చారని, ఎన్నికల హామీలు ప్రశ్నిస్తానని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేను విస్మరించి.. పక్క జిల్లా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుండి, లక్మాపూర్ వంతెనలు, కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు, మెడికల్ కళాశాలలో బోధనా సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, రోడ్ల దుస్థితి గురించి సీఎంకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రజాధనంతో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని, వీటికి మళ్లీ సీఎం శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నిచారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మ ద్, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయి, పట్టణ అధ్యక్షుడు అహ్మద్, నాయకులు అన్సార్, సాయిశ్రావణ్, నిసార్, అశోక్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం
కాగజ్నగర్టౌన్: ఉద్యమంలో అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి గుర్తిసామని ప్రకటించిందన్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. -
అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదం
కాగజ్నగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీఎం సభలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెరమెరి మండలం కోఠారిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిపా రు. ఉనికిని కోల్పోతున్నామని, పబ్బం గడుపుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను సీఎంకు విన్నవించామని, త్వరలోనే ఆమోదం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు శారద, జ్యోతి, విజయ్కుమార్, నాయకులు దస్తగిర్, శ్యాంరావు, మెహరాజ్ హుస్సేన్, శ్రీను, సంతోష్ పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకం
రెబ్బెన: రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లో మంగళవారం సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, ప్రొ.జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేశా రు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారి, కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్ నిర్వహించారు. ఇన్చార్జి జీఎం మాట్లాడుతూ రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు అందిస్తోందని తెలిపా రు. ఉద్యోగులంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి భీమన్న స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికా రులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్కట్ చేశారు. ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువా లతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధిలో రాణిస్తున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అధికా రుల సంఘం ప్రతినిధి వీరన్న, ఇన్చార్జి సేవా అధ్యక్షురాలు నళిని నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతాం
కెరమెరి: ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్వగ్రామంలో దసరా పండుగ చేసుకున్నంత సంబురం కొత్తగూడలో కనిపిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వేంనరేందర్రెడ్డి, కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, స్థానిక సర్పంచ్ మడావి శాంతాబాయితో కలిసి లబ్ధిదారులు సిడా కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామ పటేల్ సిడాం భీంరావ్ కుటుంబానికి సీఎం నూతన దుస్తులు అందించారు. ఆత్రం పోసుబాయి ఇంట్లో ఇప్పపువ్వు లడ్డూ ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనేక దశల్లో కొనసాగుతున్నాయని, ఇప్పటికీ వాటికి బిల్లులు అందడం లేదన్నారు. త్వరగా బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ నితిక పంత్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ సంరక్షణకు నిరంతర కృషి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో అటవీ సంరక్షణ కు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమ ని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అ న్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రో జుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎఫ్వో మాట్లాడుతూ అడవుల ప్రాధాన్యతను ప్రజలు స్వచ్ఛందంగా తెలుసుకుంటేనే సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో గోవింద్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్, సరోజారాణి, ఝాన్సీరాణి, ఎఫ్ఎస్వోలు, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
గుడిసెలు లేని జిల్లాగా మారుస్తాం
రెబ్బెన/ఆసిఫాబాద్: పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ గిరిజన గూడెం, తండాలో గిరిజనులందరికీ నూరుశాతం ఇళ్లు మంజూరు చేసి, అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన అని ముఖ్యమంతి రేవంత్రెడ్డి అన్నా రు. ఏ అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా ఈ గడ్డ నుంచే ప్రారంభిస్తున్నామని, సంవత్సరంలోగా గుడిసెలు లేని జిల్లాగా ఉమ్మడి ఆదిలాబా ద్ను మారుస్తామని అన్నారు. రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, వేంనరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్ రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్తో కలిసి హాజరయ్యారు. జిల్లాలో రూ.112 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మావోయిస్టు నగేశ్ దంపతులతోపాటు పలువురు లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత కార్యక్రమాన్ని ఈ వేదిక మీద నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తుమ్మిడిహెట్టితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎలాంటి ఎత్తిపోతలు, విద్యుత్ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే సాగునీరందిస్తామని అన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రైతాంగం ఉప్పైనె కదులుతుందని హెచ్చరించారు. ఆద్యంతం.. ఉత్సాహభరితంముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్ నుంచి నేరుగా కెరమెరి మండలం కొత్తగూడకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. రాత్రి 7.45 గంటల నుంచి గంటన్నరకు పైగా కొనసాగింది. మంత్రులు మాట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు వరిధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో మంచిర్యాలకు వెళ్లారు. అయితే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రత్యేక వరాలేవీ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్ భద్రతను పర్యవేక్షించారు. రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు హాజరైన జనంప్రేంసాగర్రావుకు పెద్దపీటసభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు ప్రత్యేక స్థానం దక్కింది. సభాస్థలికి చేరుకోగానే సీఎం ప్రేంసాగర్రావును వెంటబెట్టుకుని సభావేదికపైకి వచ్చారు. స్టేజీపై పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ప్రేంసాగర్రావు జిల్లాలోని సమస్యలతోపాటు పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, మంచిర్యాలలో ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలని విన్నవించారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిబహిరంగ సభ మధ్య నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ అధికారికంగా నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఐదుగురు మంత్రుల ప్రసంగం అనంతరం తనకు అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అవకాశం దక్కలేదన్నారు. అర్హులందరికీ ఇళ్లు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు, తండా ప్రజల కష్టాలు కనిపించలేదు. పేదోడి కష్టాన్ని ప్ర త్యక్షంగా చూసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని 4.5లక్షల ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేశారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా మంజూరు చేశాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, 2.5 ఏళ్ల ప్రజాపాలన ప్రభుత్వానికి తేడా ఇదే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మరో 2.5లక్షల ఇళ్లను అందిస్తాం. – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది. స్థిరప్రస్తుత13,470 26,37511,857 24,07811,565 23,0518,247 16,465ఆసిఫాబాద్నిర్మల్మంచిర్యాల -
బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్
ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్కు కిషన్రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్లు అవసరం లేదు.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు.. కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. -
బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తి రిమాండ్
ఉట్నూర్రూరల్: బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన భూక్యా దేవానాయక్ జీసీసీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. దేవానాయక్కు బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నిందితుడు కడుకుంట్ల పరుశురాం నమ్మించి ఖాళీ చెక్కులు తీసుకుని దుర్వినియోగం చేస్తూ రూ.1.87 లక్షలు కాజేశాడు. బాధితుడు దేవానాయక్ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. ఎస్సై విజయ్ తదితరులు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసగిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటు్ల్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నీలిశెట్టి సాయిరాం విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఉట్నూర్ బోయవాడకు చెందిన పెందుర్ కృష్ణవేణు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
చరిత్రలో నిలిచేలా ముఖ్యమంత్రి సభ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాకు తొలిసారి వస్తు న్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద బహిరంగ సభ, కెరమెరి మండలం కొత్తగూడలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించా రు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అతిథి గృహంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభను తలపించేలా జిల్లాలో సభ నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలోని ప్రతీ హామీ అమలు చేస్తున్నామని, ప్ర తిపక్ష బీఆర్ఎస్ నాయకులు అనవసర ఆరో పణలు చేస్తున్నారన్నారు. వర్షాకాలం తర్వా త కుమురంభీం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. వట్టివాగు ప్రాజక్టుకు రూ.13కోట్లు కేటాయించా మని గుర్తు చేశారు. ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు నుంచి ఉట్నూర్ వరకు నాలుగు వరుసల రహదారి, గుండి, అనార్పల్లి వంతెనల నిర్మాణం నిధులకు సీఎంను ఒప్పిస్తామని తెలిపారు. 2029లో 100 సీట్లు గెలవడం లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రేషన్కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ భరోసా కింద ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, సీఎం సభలో ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, ఏఎంసీ చైర్మన్ ఇరులకు మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, నాయకులు తారీఖ్, మల్లేశ్, బాలేశ్గౌడ్, మహేశ్గౌడ్, శంకర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబంలోనే తొలి కొలువు..
సాత్నాల మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన ఎస్.గోపి–అనిత దంపతుల కుమారుడు సాయి శివప్రసాద్ది సామాన్య కుటుంబం. తండ్రి ఓ జనరల్ స్టోర్లో పనిచేస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్గా విధులు నిర్వహిస్తోంది. తల్లిదండ్రుల శ్రమే ఆయన్ను లక్ష్యం వైపు సాగించింది. పాలిటెక్నీక్ పూర్తి చేసి శిక్షకుడు వీజీఎస్ రాకేష్ పర్యవేక్షణలో నిత్యం సాధన చేసి అగ్నివీర్గా ఎంపికయ్యాడు. కుటుంబంలో తొలి కొలువు దక్కింది. ప్రణాళికతో సాధన చేస్తే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చని సాయిశివప్రసాద్ చెబుతున్నాడు. -
బెల్లంపల్లి ఏరియా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
ప్రజ్వల శ్రీరెబ్బెన: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి సాధన, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ ఉద్యోగులను ఏరియా యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్ స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా క్లోజ్డ్ మైన్స్ ఇన్చార్జి మేనేజర్ పి.మహేష్కుమార్ ఎంపికయ్యారు. ఏరియా స్థాయిలో ఖైరిగూర ఓసీపీలో ఈపీ ఫిట్టర్ ఆకుల రవి, ప్రత్యేక ఉత్తమ ఉద్యోగులుగా ఖైరిగూర ఓసీపీ అడిషనల్ మేనేజర్ గౌతం రాజేష్రెడ్డి, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ ఎంపికయ్యారు. సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతూ చదువులో ప్రతిభ కనబర్చిన తుపాకుల ప్రజ్వల శ్రీ, సింగటి సాయి శ్రీ వర్షిణిలు ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. కోలిండియా స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ఏరియా ఉద్యోగులు గోలేటి సీహెచ్పీలో సీనియర్ అసిస్టెంట్ జి.మురళీకృష్ణను సన్మానానికి ఎంపిక చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్ స్థాయిలో ఎంపికై న ఉత్తమ అధికారిని జూన్ 2న కొత్తగూడెంలో జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎండీ సన్మానిస్తారు. ఏరియా స్థాయిలో ఎంపికై న ఉద్యోగులు, విద్యార్థులను గోలేటిలోని భీమన్న స్టేడియంలో నిర్వహించే వేడుకల్లో జీఎం సన్మానించనున్నారు. -
సంగీత వాయిద్యంలో గిన్నీస్ రికార్డు
చెన్నూర్రూరల్: వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించి వివాహం చేశారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే సంగీత వాయిద్యకారుల కార్యక్రమంలో పాల్గొని ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డులో సాధించింది. చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాగిరి వనజ. ఈమె తల్లిదండ్రులు పాగిరి లక్ష్మి– లింగయ్యలది నిరుపేద వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలకు వివాహం జరిపించారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమార్తె వనజకు 2024లో వివాహం జరిగింది. ఈమె భర్త మహేశ్కుమార్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏడీపీఎంగా పని చేస్తున్నాడు. ఆమె హైదరాబాద్లోని ఇన్మార్ ఇంటలిజెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పని చేస్తోంది. భర్త ప్రోత్సాహంతోనే.. ఉద్యోగం చేస్తూనే వనజ భర్త మహేశ్కుమార్ ప్రోత్సాహంతో 2026 జనవరిలో ఆన్లైన్లో కీబోర్డుపై సంగీత వాయిద్యం నేర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్ జొరాస్ట్రియన్ క్లబ్లో గిన్నీస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పాస్టర్ ఆగస్టిన్ దండంగి స్థాపించిన మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో పాల్గొంది. జనగణమణ, పలు పాటలకు సంగీతం వాయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ నుంచి గుర్తింపు లభించింది. సంస్థ ప్రతినిధులు మే 29న ఆమెకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తోపాటు గోల్డ్ మెడల్ అందజేశారు. -
కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి
కెరమెరి: రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఆదివా సీ భవన్లో ఆదివారం ఉట్నూర్ జీసీసీ డీఎం సందీప్కుమార్తో కలిసి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులకు అ మ్మకుండా, కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం పంట విక్రయించి రైతులను శా లువాతో సత్కరించారు. కార్యక్రమంలో జీసీ సీ మేనేజర్ తారాచంద్, సర్పంచులు ఆనంద్రావు, నాగ్నాథ్, రాధాబాయి, నాయకులు పెందోర్ మోతీరాం, దుర్పతబాయి, అబ్దుల్ కలాం, యూనూస్, బాలాజీ, అంబాజీ పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జొన్నలు తూకం వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
అన్నదమ్ముళ్ల అరుదైన ఘనత
సాత్నాల: భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన రాజులవార్ యోగేశ్వర్–స్వప్న దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మణికంఠ స్వామి, చిన్న కుమారుడు దత్తాత్రి అగ్నివీరులుగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మణికంఠస్వామి ఆరు నెలల క్రితం ఎంపికై ప్రస్తుతం అస్సాంలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు దత్తాత్రి ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్మీ ఉద్యోగం సాధించాడు. చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలని లక్ష్యంతో అన్నదమ్మళ్లు నిరంతర సాధనతో తమ కలలను సాకారం చేసుకున్నారు. దేశరక్షణలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నదమ్ముళ్లు తెలిపారు. దేశసేవలో కుమారులు పాల్గొనడం తమకు గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు. వారిని గ్రామప్రజలు అభినందించారు. -
స్విమ్మింగ్పూల్లో సందడి
నిర్మల్టౌన్: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతుండగా, బయటకు వెళ్లేవారు ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. వేసవితాపం నుంచి కాస్త చల్లదనాన్ని అందించే స్విమ్మింగ్ పూల్స్ విద్యార్థులు, యువతకు హాట్ ఫేవరెట్గా మారాయి. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఈతకొడుతున్నారు. కోచ్లు వారికి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల స్విమ్మింగ్ క్రీడకు గుర్తింపుతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకోవచ్చని ఉద్దేశంతో పలువురు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. చిన్న వయసులోనే ఈత నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని కోచ్లు చెబుతున్నారు.ఫిట్గా ఉండేందుకు.. వేసవి వేడి తట్టుకోవడానికి స్విమ్మింగ్ ఉపయోగపడుతుంది. గత నెల రోజులుగా ప్ర తీరోజు స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నా. తక్కువ ధ రకు స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంది. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఫిట్గా ఉండేందుకు స్విమ్మింగ్ చేస్తున్నా. – సూర్యతేజ ఆనందంగా ఉంది వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తున్నా. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడంతోపాటు శరీరానికి వ్యాయామం లభిస్తుంది. స్నేహితులతో కలిసి వచ్చి చేయడం ఆనందంగా ఉంది. – త్రినయన్ -
పోరుగడ్డకు సీఎం
రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. పర్యటన ఇలా..సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్కు చేరుకుంటారు. విశ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. భారీగా జనసమీకరణ..సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు భారీగా జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. 1,825 మందితో బందోబస్తుసీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ఆర్ఐలు, 157 మంది ఏఎస్సైలు, ఆర్ఎస్సైలు, డబ్ల్యూఎస్సైలు, 200 మంది ఏఎస్సైలు, 829 మంది కానిస్టేబు ళ్లు, 43 మంది మహిళా పోలీస్ సిబ్బంది, 328 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారు. వీరితోపాటు తొమ్మిది ప్రత్యేక పార్టీలు, రెండు రోప్ పార్టీలు, 28 యాక్సెస్ కంట్రోల్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలను మోహరించనున్నారు. మొత్తం 1,825 మంది విధులు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనఆసిఫాబాద్: సీఎం పర్యటనలో భాగంగా జిల్లాలో రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టు, మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రవీంద్రనగర్ క్యాంపు నం.2 గ్రామంలో రూ.56.55 కోట్లతో 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, రెబ్బెన మండలం నంబాలలో రూ.6 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే చింతలమానెపల్లిలో రూ.4.22 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్, రూ.2.98 కోట్లతో కౌటాల మండలం గుడ్లబోరి, రూ.3.08 కోట్లతో కాగజ్నగర్లో, రూ.2.89 కోట్లతో సిర్పూర్– టి మండలం చింతకుంటలో, రూ.2.72 కోట్లతో కాగజ్నగర్ మండలం అంకుసాపూర్లో ఏర్పాటు చేసే 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్, రూ.18.7 కోట్లతో కాగజ్నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లు పరిశీలనఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొత్తగూడతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ హరిత, ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
దేశసేవ చేయాలని..
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన చెండే కమల– బాపు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి అంజన్న, రాజు సంతానం. పెద్ద కుమారుడు అంజన్న స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, బెల్లంపల్లిలో ఇంటర్ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన అంజన్న సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో జగిత్యాలలో నెలరోజుల శిక్షణ పొందాడు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రయత్నించాడు. ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వ్యవసాయం చేస్తూ..చదివించి పెంబి: మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన నారకట్ల మమత–రమేశ్ యాదవ్ దంపతుల కుమారుడు రఘవీర యాదవ్, బొజ్జ శంకరమ్మ– భీమన్న దంపతుల కుమారుడు మణికంఠ అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారులను చదివించారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ జనరల్ డ్యూటీ కేటగిరీ ఫలితాల్లో తమ కల సాకారం చేసుకున్నారు. -
శ్రమించి.. కొలువులు సాధించి
సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత అసామాన్య ప్రతిభతో సత్తాచాటారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మైదానంలో చెమటోడ్చారు. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశసేవ చేయడమే ధ్యేయంగా భారత సైనికదళంలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి విజయం దాసోహమంది. వారి పట్టుదలకు అగ్నివీర్ కొలువులు దక్కాయి. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్ ఎంపిక ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి జిల్లా యువకులపై కథనం. – ఆదిలాబాద్ -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు, చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందారు.స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు.. ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) శివారులో ఆదివారం విద్యుత్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి కిందపడి వలస కార్మికుడు మృతిచెందాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా బావాపూర్ (కే) పరిసరాల్లో పలుచోట్ల స్తంభాలు కూలిపోగా, సరఫరా నిలిచిపోయింది. ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన కార్మికులతో మరమ్మతు చేపట్టారు. యవత్మాల్ జిల్లా ఉమర్ఖేడ్ తాలూకా దేవరంగా గ్రామానికి చెందిన పెదేవర్ ప్రకాశ్ (33) కార్మికుడు, స్తంభం ఎక్కి కొత్త వైరింగ్ అమర్చే పనులు చేస్తున్నాడు. వైర్లు కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి స్తంభం పైనుంచి కిందపడిపోయాడు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు అతడిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి.. లక్ష్మణచాంద: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాళ్లకు వల చుట్టుకుని మృతి చెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన తోకల చిన్న లింగన్న(40) శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పులి చెరువులో చేపల వేటకు వెళ్లాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం చెరువులో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై.. మృతదేహాన్ని బయటకు తీయించగా కాళ్లకు వల చుట్టుకుని మృతిచెందినట్లు గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. లక్సెట్టిపేట: మండలంలోని శాంతాపూర్ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ కాలనీకి చెందిన గుర్రాల ప్రశాంత్(22) బైక్పై శనివారం పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లాడు. తిరిగి లక్సెట్టిపేటకు రాత్రి వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అంబులెన్సులో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రోన్ సాయంతో పరిశీలన
రెబ్బెన: కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద జూన్ 1న నిర్వహించే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహా జన్ సంయుక్తంగా పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు చేస్తున్న ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల ను డ్రోన్ సాయంతో పరిశీలించి పోలీస్ అధి కారులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సైలు వెంకటకృష్ణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దుకెరమెరి: సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దని ఎస్పీ నితిక పంత్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి మండలంలోని కొత్తగూడ గ్రామంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. బందోబస్తుపై స్థానిక అధికా రులు, సిబ్బందికి సూచనలు చేశారు. -
అభివృద్ధే లక్ష్యంగా సీఎం జిల్లా పర్యటన
ఆసిఫాబాద్అర్బన్: అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 1న జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, పీవీటీజీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కెరమెరి మండలం కొలాంకొఠారి పంచాయతీలో 28 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, సాయంత్రం 4 గంటలకు కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల ఆసరా పింఛన్లు మంజూరు చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు తారీఖ్, భీంరావు, ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేశ్, కార్యదర్శి శంకర్, నాయకులు దీపక్ ముండే, గాజుల జక్కయ్య, వాసుదేవ్, తిరుపతి, జావీద్ తదితరులు పాల్గొన్నారు. -
తీపి కబురు..!
రెబ్బెన: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత గృహాల నిర్మాణాలు కొనసాగుతుండగా, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లాలోని రెబ్బెన మండలం కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద జూన్ 1న నిర్వహించే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ వేదికగా మారనుంది. ఈ వేదిక మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొదటి విడతలో ఇలా..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రజల నుంచి పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అర్హులకు ఇళ్లు మంజూరు చేశారు. మొదటి విడతలో అనర్హులకు సైతం ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. కానీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. మొదటి విడతలో జిల్లాలో 8,419 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 386 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 243 గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేశారు. 2,204 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు.. లెంటల్ వరకు 1,575, బేస్మెంట్ లెవల్ వరకు 3,233 ఇళ్లు పూర్తయ్యాయి. మిగితా ఇళ్లు ప్రారంభించలేదు. చాలామంది నిరుపేదలు కావడం, ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిర్మాణాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు చేపడుతున్నారు. సిద్ధం కాని అర్హుల జాబితాజూన్ 1న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే జిల్లాలో రెండోవిడత ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల జాబితా ఇంకా సిద్ధం కాలేదు. ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసి జూన్ 1న సీఎం చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందించనున్నారు. ఆపై ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎల్ 1 లిస్టులో నుంచి రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే మొదటి విడతలో అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లను మంజూరు చేశారనే ఆరోపణలు రావడంతో.. రెండో విడత జాబితాపై ఆసక్తి నెలకొంది.నిబంధనలకు అనుగుణంగా ఎంపిక జూన్ 1న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమవుతుంది. నాలుగు మండలాల నుంచి నలుగురు చొప్పున ఎంపిక చేసి ముందుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ పత్రాలు అందిస్తాం. ఆపై ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేస్తాం. ఎల్ 1 లిస్టులో నుంచే నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటాం. – ప్రకాశ్రావు, హౌసింగ్ శాఖ పీడీ -
ఇందిరమ్మ ఇళ్లను ముస్తాబు చేయాలి
కెరమెరి: ప్రారంభోత్సవాల కోసం ఇందిరమ్మ గృహాలను ముస్తాబు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జూన్ 1న మండలంలోని కొత్తగూడకు సీఎం రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో శనివారం గ్రామంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నుంచి గ్రామంలోకి వచ్చేదారి వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్, డీపీవో భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం లేకుండా పనిచేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, మహిళలను తరలించే ప్రతీ బస్సుకు ఇద్దరు ఇన్చార్జీలను నియమించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతకు వేళాయె..
కాగజ్నగర్టౌన్: డిగ్రీ అంటే ప్రైవేటు కాలేజీలే అనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆధునిక కోర్సులు, డిజిటల్ క్లాస్రూంలు, ఉచిత లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అందిస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్లలో భాగంగా ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ఇంకా సీటు రాని వారు, మొదటి రెండు విడతల్లో దరఖాస్తు చేసుకోని వారి కోసం ఈ నెల 31 నుంచి జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం బీఎస్సీ(కంప్యూటర్స్), బీకాం(కంప్యూటర్స్) కోర్సులకు డిమాండ్ ఉంది. ఈ కోర్సులతో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే బీబీఏ/బీకాం కోర్సులతో బ్యాంకింగ్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. సివిల్స్, గ్రూప్– 1, గ్రూప్– 2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కోర్సులు బాటలు వేస్తున్నాయి. పరిమితం కాకుండా కాలానికి అనుగుణంగా సరైన కోర్సును ఎంచుకుంటే డిగ్రీ పూర్తయ్యే సరికే మంచి జీతంతో ఉద్యోగం సాధించవచ్చని అధ్యాపకులు పేర్కొన్నారు. ప్రైవేటును మించిన వసతులుజిల్లాలో ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగజ్నగర్, ఆసిఫాబాద్లోని గురుకుల డిగ్రీ కళాశాల, వాంకిడి డిగ్రీ కాలేజీలో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు సాధించిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. డిజిటల్ క్లాస్ రూములు, అధునాతన ల్యాబ్లు, ఉచిత గ్రంథాలయ సౌకర్యం కల్పిస్తున్నారు. చదువుతోపాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మే 31 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మూడో విడత మొదలవుతుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ కాలేజీలు భరోసా కల్పిస్తున్నాయి. అనుమానాల నివృత్తికి కాగజ్నగర్లోని కాలేజీలో సంప్రదించాలి. – శ్రీదేవి, ప్రిన్సిపాల్, కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
రూ.వంద కోట్లు కేటాయించాలి
కెరమెరి: ఆదిమ గిరిజనులైన కొలాం తెగల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నుగూడ గ్రామాన్ని సందర్శించడంతోపాటు లక్మాపూర్, అనార్పల్లి వంతెనలను పరిశీలించారు. గిరిజనుల కోసం రూ.3 లక్షల కోట్లు వెచ్చించినట్లు సీఎం చెబుతున్నా అవి వారి దరికి చేరడం లేదన్నారు. ఇప్పటికీ ఆదివాసీ గూడేలకు రోడ్డు, తాగునీరు, పక్కా గృహాల సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. లక్మాపూర్, అనార్పల్లి వంతెనల నిర్మాణ పనులు ఏళ్లుగా అసంపూర్తిగా ఉందని, సుమారు 30 గ్రామాల ప్రజలు వానాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయన వెంట పీవీటీజీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వసంత్రావు, నాయకులు రాథోడ్ రమేశ్, ఉత్తం నాయక్, బలిరాం తదితరులు ఉన్నారు. -
ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి
రెబ్బెన: కాగజ్నగర్ ఎక్స్రోడ్ ప్రాంతంలో జూన్ 1న నిర్వహించే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్పీ నితిక పంత్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, ప్రముఖులు వచ్చే రూట్లు, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దన్నారు. అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగ, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
3న జాతీయ లోక్అదాలత్ సమన్వయ సమావేశం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో జూన్ 3న ఉదయం 11 గంటలకు లోక్ అదాలత్ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య తెలి పారు. జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కరిస్తున్నట్లు వివరించారు. సివిల్, క్రిమిన ల్, ప్రీ లిటిగేషన్, బ్యాంకింగ్, విద్యుత్, భూసమస్యల కేసులు, వివాహం, కుటుంబ కలహాల కేసులు, మోటార్ వెహికిల్ ప్రమాద కేసులు, చిట్ఫండ్ చెక్బౌన్స్ కేసులతో పాటు కాంపౌండబుల్ కేసులు సమన్వయంతో పరిష్కరించేందకు కృషి చేయాలని సూచించారు. పరీక్షించి..అవగాహన కల్పించి..వాంకిడి: మండలంలోని ఇందాని గ్రామంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ –2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించారు. హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. లక్షణాలు ఉన్న వారిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు పీహెచ్సీలో లభించే మందులు క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు వాడితే నయం అవుతుందన్నారు. నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రభుత్వం నుంచి క్షయ వ్యాధిగ్రస్తులకు రూ.1000 ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పెందుర్ రవిదాస్, సర్పంచ్ కోట్నాక నిర్మల, ఉప సర్పంచ్ రమేశ్, పీఎం జన్మన్ వైద్యురాలు శ్రీజ తదితరులు పాల్గొన్నారు. -
వార్డుల్లో పెన్షనర్ల గుర్తింపు
కాగజ్నగర్టౌన్: సుదీర్ఘ ఎదురుచూపుల అనంతరం కొత్త పెన్షన్లను జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పక్రియ ఊపందుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు వార్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని అన్ని వార్డుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులను గుర్తించి వారి ఫొటోలు, ఆధార్ వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్తో కలిసి జిల్లా అధికారులతో పౌష్టికాహారం, ప్రజారోగ్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గవర్నర్ మాట్లాడు తూ జిల్లాలో 464 మంది క్షయ వ్యాధిగ్రస్తులు న్నారని, జిల్లా అధికారులు ఒక్కొక్కరిని దత్తత తీసుకుని నెలకు సరిపడా మందులు, పౌష్టికాహా రం అందించాలన్నారు. చికిత్సతో క్షయ వ్యాధి నయమవుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, మత్తుకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, నషా ముక్త్ భారత్వైపు అడుగులు వేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కెహరిత జిల్లాలో శాఖల వారీగా చేపడుతున్న సేవలు, సంక్షేమ అభివృద్ధి పనులపై గవర్నర్కు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్పీ నితిక పంత్ జిల్లాలో శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల గురించి వివరించారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న కలెక్టర్ హరితకు గవర్నర్ ధ్రువపత్రం అందించారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి కలెక్టర్, అధికారులు జ్ఞాపికలు అందించారు. గవర్నర్కు ఘన స్వాగతం ప్రత్యేక హెలిక్యాప్టర్లో హైదరాబాద్ నుంచి జి ల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్ శివప్రసాద్ శు క్లాకు ఉదయం కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్ద క లెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హ రీశ్బాబు, జిల్లా అధికారులు ఘన స్వాగతం ప లికారు. అనంతరం గవర్నర్ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీ వో మంద మకరందు, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, అదనపు ఎస్పీ చిత్తరంజ న్, కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు పాల్గొన్నారు. -
‘హామీలు అమలు చేశాకే.. పోరుగడ్డకు రావాలి’
రెబ్బెన: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాకే కుమురంభీం పోరుగడ్డకు సీఎం రేవంత్రెడ్డి రావాలని బీజేపీ ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. గోలేటిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500, యువతకు రూ.4వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల పెంపు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ వంటి అనేక హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీలు అమలు చేసి రెబ్బెన గడ్డపై అడుగు పెట్టాలని హితవు పలికారు. జిల్లా కార్యదర్శి నవీన్గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఇస్తారీ తదితరులు పాల్గొన్నారు. -
వీరులను కన్నఊరు రౌటసంకెపల్లి
ఆసిఫాబాద్: ఆదివాసీ యోధుడు కుమురం భీం జన్మించిన రౌటసంకెపల్లి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని.. వీరులు కుమురంభీం, ఎడ్ల కొండను కన్న ఊరని, ఆదివాసీ సమాజ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమురంభీం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ కుమురంభీం ఇచ్చిన జల్ జంగల్ జమీన్ నినాదం కేవలం మూడు పదాలు కాదని, ప్రకృతి, మనిషి, సహజీవనానికి ప్రతీక అని పేర్కొన్నారు. హక్కులు, ఆత్మగౌరవం కోసం గొప్ప సైన్యం లేకపోయినా ధైర్య సాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం దేశ ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు, ఆదర్శాలను యువతకు చేరవేడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు, సామాజిక సేవకులను అభినందించారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, సంస్కృతిని కాపాడుతూ సమానాభివృద్ధి కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కుమురంభీం స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా రావడం సంతోషకరమన్నారు. ఆదివాసీలు హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై భీం పోరాడారని గుర్తు చేశారు. అంతకు ముందు గవర్నర్ కుమురంభీం, ఎడ్ల కొండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు చేశారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి సోలార్ పలకలు, ఆరోగ్య, సంక్షేమ కార్డులు, దుస్తులు పంపిణీ చేశారు. భీం, ఎడ్ల కొండు నూతన కాంస్య విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు సామూహిక మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీలు గుస్సాడీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, నిర్వాహకుడు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కొత్త విద్యుత్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలి
శ్రీరాంపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో నూతనంగా చేపట్టిన 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్జ్యోతి ఆదేశించారు. ప్లాంట్ను శుక్రవారం సాయంత్రం సందర్శించారు. యూనిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. సేఫ్టీ కంట్రోల్ రూంను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణంలో భాగస్వాములైన బీహెచ్ఈఎల్, కేపీసీ, పవర్మెక్ కంపెనీల అధికారులకు నిర్మాణ పనులపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. మెయిన్ కంట్రోల్ రూంలో రెండు యూనిట్ల ద్వారా జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ ప్రొడక్షన్ పనితీరు వివరాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో నిర్మాణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కంపెనీ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పీపీ), ఎం.తిరుమలరావు (ఈఅండ్ఎం), ఈడీ కోల్మూవ్మెంట్ వెంకన్న జాదవ్, ఎస్టీపీపీ సీహెచ్ చిరంజీవులు, జీఎం నరసింహారావు, జీఎం (పీసీఎస్) మదన్మోహన్రెడ్డి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ, డీజీఎంలు వీరబ్రహ్మం, సంతోష్కుమార్, కిరణ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యం క్రీడలు సాధన చేయాలి
రెబ్బెన: సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడామెలకువలు నేర్చుకున్న విద్యార్థులు నిత్యం సాధన చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటిలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేశారు. జీఎం మాట్లాడుతూ చిన్నారులు మొబైళ్లకు ఎంత దూరంగా ఉంటే.. క్రీడలు, చదువులో అంతగా రాణిస్తారని తెలిపారు. క్రీడానైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్కుమార్ బెహరా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫెక్ట్..
కదిలిన ధాన్యం బస్తాలుదహెగాం: కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తూకం వేయకపోవడం, బస్తాలకు మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లారీలు రాక.. ధాన్యం కదలక’ అనే కథనానికి అధికారులు స్పందించారు. దహెగాం మండలం కర్జి కొనుగోలు కేంద్రానికి అధికారులు లారీలు పంపించారు. గురు, శుక్రవారాల్లో నాలుగు లారీల ధాన్యం మిల్లులకు తరలించారని రైతులు తెలిపారు. అలాగే ఒడ్డుగూడ, లగ్గాం గ్రామాల్లోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సమీపంలోని పెంచికల్పేట్ గ్రామంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. -
నత్త నడకే..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉత్తర, దక్షిణ భారత దేశానికి కీలక రైలు మార్గమైన కాజిపేట–బల్షార్షా సెక్షన్ పరిధిలో పెండింగ్ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. దక్షక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ లైన్కు ఏటా రూ.కోట్లలో ప్రతిపాదిస్తున్నారు. అయితే, నిధుల మంజూరు నుంచి ఖర్చు వరకు ఏళ్లు పడుతోంది. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అనేక పనులను ప్రతిపాదించింది. అయితే, ఈ పెండింగ్ పనులు ఎన్ని ఏళ్లకు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో మూడో లైన్ పనులు పూర్తయ్యేందుకు ఏళ్లు పట్టింది. మరోవైపు తాజాగా నాలుగో లైన్ ప్రతిపాదనలో ఉంది. ఈ ఏడాది 2026–27లో ప్రతిపాదిత రైల్వే నిధుల సమగ్ర నివేదికను పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా ప్రతిపాదించినవే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గత రెండు బడ్జెట్లలోనూ కాజిపేట–బల్లార్షా సెక్షన్లో 234 కిలోమీటర్లు నాలుగో లైన్ సర్వే కోసం నిధులు మంజూరు చేశారు. అయితే, ఇప్పటికీ మూడో లైన్ పనులే అక్కడక్కడా పూర్తి కాలేదు. ఇంకా 4.37 కిలోమీటర్ల నిడివి గల మంచిర్యాల–పెద్దంపేట మూడోలైన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నాలుగో లైన్ పనులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, ఢిల్లీ, కశ్మీర్ వరకు, ఇటు చైన్నె వరకు రాకపోకలు సాగిస్తుంటారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రేచ్నీ రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్నగర్, సిర్పూర్ (టీ) వరకు అటు మహారాష్ట్రలోని బల్షార్షా సెక్షన్ వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో రద్దీకి తగినట్లు నూతనంగా రైళ్లు నడపాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏళ్లుగా వంతెనలు లేక.. పెరుగుతున్న రద్దీకి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజువారీగా రైల్వేస్టేషన్ల నుంచి రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. అంతకుమించి గూడ్స్తో బొగ్గు, సిమెంట్ ఇతర సరుకుల రవాణాతో రూ.కోట్లలోనే ఆదాయం సమకూరుతోంది. అయితే, తగిన సౌకర్యాల కల్పనలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్యూబీ), ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్వోబీ) నిర్మించాల్సి ఉంది. ఆర్యూబీలు చూస్తే రాళ్లపేట–బెల్లంపల్లి, రేపల్లెవాడ, ఆసిఫాబాద్ స్టేషన్లు, మందమర్రి.. మంచిర్యాల మధ్య రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఇక రాళ్లపేట–కాగజ్నగర్ మధ్య ఆర్యూబీ, కాగజ్నగర్–రాళ్లపేట మధ్య ఉన్న వంతెనపై రెండు అదనపు గడ్డర్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. కాగజ్నగర్ స్టేషన్లో ఫుట్ ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంచిర్యాల రైల్వేస్టేషన్ అమృత్ పథకం కింద ఎంపికై నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ లైన్కు ఎన్నేళ్లో? తూర్పు, పశ్చిమ జిల్లాలకు ఇప్పటికీ రైల్వే మార్గం అందుబాటులో లేదు. కోల్బెల్ట్ను ఉమ్మడి జిల్లా పరిధి ఏజెన్సీ గూడేల మీదుగా రైల్వే మార్గం కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. అయితే, ఈ మార్గం ఆచరణకు ఎదురుచూడాల్సి వస్తోంది. మంచిర్యాల వయా ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్ వరకు 186 కిలో మీటర్లతో కొత్త మార్గం ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు కనీసం సర్వే కూడా మొదలు కాలేదు. గత రెండేళ్లుగా బడ్జెట్లో రూ.100.28కోట్లు ప్రతిపాదించినా ముందుకు కదలడం లేదు. దీంతో మంచిర్యాల–ఆదిలాబాద్ లైన్ ఎన్నేళ్లకు అందుబాటులోకి వస్తుందోననే అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆ శ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన సిద్దార్థ, సీహెచ్ రోహన్ జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్లో ఈ నెల 29 నుంచి 31 వరకు జరిగే 44వ జూనియర్ పురుషుల జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని హెచ్ఎం చంద్రశేఖర్, పీడీ మధుసూదన్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర షూటింగ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి, కార్యదర్శి సోమశేఖర్, ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి హరిచరణ్, డీవైఎస్వో అశ్వక్ అహ్మద్, డీడీ రమాదేవి, ఏటీడీవో చిరంజీవి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల తదితరులు అభినందించారు. -
నకిలీ విత్తు..
కావొద్దు చిత్తుకౌటాల: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు దున్ని తొలకరి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమార్కులు వారికి అధిక దిగుబడి ఆశచూపి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. పల్లెల్లో దళారులను ఏర్పాటు చేసుకుని ప్యాకెట్లు, లూజు విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఏటా వానాకాలంలో అత్యధికంగా 3.50 లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని దళారులు కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందా మొదలుపెట్టారు. గడిచిన రెండు నెలల్లోనే రూ.లక్షల విలువైన క్వింటాళ్ల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సీజన్కు ముందే..ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దళారులు వానాకాలం సీజన్కు ముందే నకిలీ విత్తనాలను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. రెబ్బెన, సిర్పూర్(యు), వాంకిడి, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి) తదితర మండలాల్లో సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందును ప్రైవేట్ ట్రాన్స్పోర్టులు, లారీల్లో జిల్లాకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గోదాంలను ఏర్పాటు చేసుకుని నేరుగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాలకు వార్దా, ప్రాణహిత, పెన్గంగ నదుల మీదుగా గోనె సంచుల్లోనూ సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సబ్ ఏజెంట్లకు అందిస్తున్నారు. భారీగా దందా సాగుతున్నా చిన్నమొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్న వారిని మినహా అసలు సూత్రధారులను అధికారులు పట్టుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల నమోదైన కేసులుబీజీ– 1, 2 హైబ్రీడ్ విత్తనాలకు అనుమతులు ఉండగా, భూసారం తీవ్రంగా దెబ్బతినడం, వాతావరణ కాలుష్యం నేపథ్యంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు బీజీ– 3 రకాలపై నిషేధం విధించారు. వీటినే దళారులు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, అధిక దిగుబడి వస్తుందని రైతులను నమ్మిస్తూ అంటగడుతున్నారు. ఇలా సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో పలుచోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. -
భీం జన్మభూమికి నేడు గవర్నర్ రాక
ఆసిఫాబాద్: గోండు బెబ్బులి, ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం జన్మస్థలమైన ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గ్రామాన్ని హైదరా బాద్కు చెందిన నాగేంద్ర దత్తత తీసుకున్న విష యం తెలిసిందే.. కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కుమురంభీంతోపాటు ఎడ్లకొండు 20 అడుగుల కాంస్య విగ్రహాల ఏర్పాటుకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పర్యటన ఇలా..రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఉద యం హెలిక్యాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్ర యం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆసిఫా బాద్లోని కలెక్టరేట్కు చేరుకుంటారు. 11 గంట ల నుంచి 12.30 గంటల వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రౌటసంకెపల్లికి బయలుదేరుతారు. అక్కడ కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.25 గంటలకు హైదరాబాద్కు తిరిగి వెళ్తారని కలెక్టర్ కె.హరిత తెలిపారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు సీఐలు, 19 మంది ఎస్సైలు, 27 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, 34 మంది టీజీఎస్పీ సిబ్బంది, 40 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 47 మంది హోంగార్డులు.. మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలుఆసిఫాబాద్: మండలంలోని రౌటసంకెపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో గురువారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివాసీల ఆత్మగౌరవం, జీవన విధానం, హక్కుల పరిరక్షణకు ప్రతీకగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట క్రికెటర్ నాగేంద్ర, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
బల్దియాలకు నిధులొచ్చేశాయ్..!
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీలకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. నూతన పాలకవర్గాలు కొలువు దీరడంతో పట్టణాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ మేరకు పురపాలక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేసింది. 2025 జనవరి 27 నుంచి 2026 ఫిబ్రవరి వరకు బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. 15వ ఆర్థిక సంఘం బకాయిలు, నూతన ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆగిపోయింది. టీయూఎఫ్ఐడీసీ, యూఐడీఎఫ్ నిధులు మంజూరైనా కార్యాలయాల నిర్వహణ, పౌర సేవలకు వినియోగించే అవకాశం లేకపోవడంతో కేవలం ఆస్తిపన్ను, తదితర ఆదాయాలే దిక్కయ్యాయి. నిధుల మంజూరు ఇలా..జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీ కు రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ) ద్వారా మే, జూ న్ రెండు నెలల మ్యాచింగ్ గ్రాంటు రూపేణ ఇవ్వాల్సిన నిధులను ఆయా సంబంధిత బ్యాంకు ఖాతా ల్లో జమ చేశారు. కాగజ్నగర్కు రూ.82,52,705, ఆసిఫాబాద్కు రూ.36,00,950 విడుదలయ్యాయి. ప్రత్యేక ప్రతిపాదనలను సమర్పించి నిధులు అవసరాలకు వినియోగించుకోవాలని ఆర్థిక సంఘం సూచించింది. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను రిజర్వు ఉంచాలి. వేతనాల ఖర్చులు మినహాయించి నిధులు అందుబాటులో ఉంటే ప్రజామరుగుదొడ్ల నిర్వహణ, నీటి శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి, మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు, డంపింగ్ యార్డులు, ప్రహరీలు, సిబ్బంది క్వార్టర్లు, కమ్యూనిటీ వేదికలు, విద్యుత్, నీటి సదుపాయాలు, పరికరాల కొనుగోలు ప్రక్రియలో మున్సిపల్ వాటా చెల్లింపులకు సైతం వాడుకోవచ్చు. వీటి కంటే అత్యవసరమైన పనులు చేపట్టాల్సి ఉంటే మాత్రం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రతిపాదనలను సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది. మార్గదర్శకాల మేరకు ఖర్చు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. నిధులను పారదర్శకంగా, ప్రభుత్వ మార్గాదర్శకాల మేరకు ఖర్చు చేస్తాం. మున్సిపాలిటీల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
విత్తన ఎంపికే కీలకం..!
తిర్యాణి: మరో వారం, పది రోజుల్లో జిల్లాలో వా నాకాలం పంటల సీజన్ ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో రైతులు పత్తి, ఇతర పంట చేలు శుభ్రం చేసి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మెజార్టీ రైతులు తమ భూములు దుక్కి దున్నించి విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేశారు. సీజన్ ప్రారంభానికి సమయం సమీపిస్తుండటంతో పలు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లో రైతులను సంప్రదిస్తున్నారు. తమ కంపెనీ విత్తనాలనే కొనుగోలు చేయాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధ్రువీకరించిన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే ఊరు, పేరు లేని వాటిని సైతం అంటగట్టే అవకాశం ఉంది. ఏటా నష్టాలపాలుజిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి 3,70,919 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉండగా, ఆ తర్వాత వరి 42,228 ఎకరాలు, కంది 20,187 ఎకరాలు, ఇతర పంటలు 13,256 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. విత్తనాల స్థితిగతులు పరిశీలించకుండా కొనుగోలు చేస్తుండటంతో ఏటా నష్టాలపాలవుతున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే గ్రామాల్లో హడావుడి మొదలువుతుంది. సమీప ఫర్టిలైజర్ షాపులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వివి ధ కంపెనీల ప్రతినిధులు విత్తనాల విక్రయాలకు ప్రయత్నిస్తుంటారు. ఇదే అదనుగా కొందరు వ్యా పారులు తక్కువ ధరకు నాణ్యతలేని విత్తనాలను అంటగడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రై తులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందు కు ఆస్కారం ఉంటుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఎంపికపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా తరచూ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నారు. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలుపంట సాగు విస్తీర్ణం అవసరమైన విత్తనాలు పత్తి 3,70,919 7,40,726 ప్యాకెట్లు వరి 42,228 11,750 క్వింటాళ్లు కంది 20,187 800 క్వింటాళ్లు -
తొమ్మిదో రోజుకు రిలే దీక్షలు
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ ఆ ధ్వర్యంలో పట్టణంలోని మిల్లు గేటు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొ మ్మిదో రోజుకు చేరాయి. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వా రు మాట్లాడుతూ 2018 నుంచి యూనియన్ లేకపోవడంతో వేతన ఒప్పందాలు, ఇతర సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తూ ఎన్నికలు నిర్వహణకు సహకరించకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగు ల సంఘం జిల్లా అసోసియేటెడ్ మూలకల సుభాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మురళీధర్రా వు, సంయుక్త కార్యదర్శి పురుషోత్తం, నాయకులు జయదేవ్ అబ్రహం, శివప్రసాద్, చంద్రమౌళి, అంకయ్య, నరసయ్య, వినోద్కుమార్, అశోక్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతినెలా వేతనాలు చెల్లించాలి
వాంకిడి: గతంలో పలుమార్లు ప్రభుత్వం హా మీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదని, ఇకనైనా ప్రతినెలా 1న పంచాయతీ కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం యూనియన్ నాయకులు, కార్మికులతో సమావేశం నిర్వహించి పలు సమస్యలపై సమీక్షించారు. మూ డు నుంచి ఐదు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
వంటింటికి ధరల సెగ!
వాంకిడి: మండుతున్న ఎండలు, ఇంధన ధరల పెంపు ప్రభావం వంటింటిని తాకింది. జిల్లాలో జనాభాకు సరిపడా సాగు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో ఓ వైపు ఎండవేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు వంటింట్లో ధరలు హీటెక్కిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం పావుకిలో, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. వంటింట్లో తప్పనిసరైన టమాట, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి కూడా సరిపడా కొనేందుకు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రూ.20 కంటే ఎక్కువే పెరిగాయి. సాగు విస్తీర్ణం తక్కువ..జిల్లాలో 4.48 లక్షల ఎకరాల్లో సాగుభూమి ఉండగా.. వానాకాలం, యాసంగి సీజన్లు కలుపుకొని 8,400 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వాణిజ్య పంటలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మూడు లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా తర్వాతి స్థానంలో కంది, వరి పంటలు ఉన్నాయి. కూరగాయలు సాగయ్యే 8,400 ఎకరాల్లో 50 శాతం సాగు కాగజ్నగర్ ప్రాంతంలోనే ఉంది. తర్వాత అత్యధికంగా రెబ్బెన, వాంకిడి మండలాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాబే జీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు మాత్రమే సాగులో ఉన్నాయి. అదికూడా చాలా తక్కువ సాగు విస్తీర్ణంలో ఉండటంతో తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. స్థానికంగా కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం..రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందిస్తుంది. సాగుకు అయ్యే ఖర్చులను సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అయినా రైతులు మాత్రం వాణిజ్య పంటలకే ప్రాధాన్యతనిస్తున్నారు. కూరగాయల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సాగును ప్రోత్సహించాలని గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక హెక్టారు సాగయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని రూ.9600 రాయితీ అందిస్తామని ప్రకటించింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిద్దిపేటలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ నుంచి కూరగాయల మొక్కలు కొంటే కొనుగోలు ఖర్చు, సాగుకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని అక్కడే సబ్సిడీ వర్తింపజేస్తారు. ఒకవేళ అక్కడి నుంచి కాకుండా ఇతర రిజిస్ట్రేషన్ కలిగిన నర్సరీ నుంచి మొక్కలు తీసుకుంటే బిల్ ఆధారంగా అధికారులు సబ్సిడీ నగదును నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఏటా ఇదే పరిస్థితి..జిల్లాలో ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. కూరగాయల సాగు అంతంత మాత్రంగా ఉండటంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దిగుబడికి అనుకూలంగా ఉండే చలికాలంలో మినహాయించి ఏప్రిల్ నుంచి దిగుబడి తగ్గడం.. ధరలు పెరగడం సర్వసాధారణంగా మారింది. ఫిబ్రవరిలో టమా టా, మిర్చి, కొత్తిమీర ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. అలాగే తర్వాత వాతావరణం అనుకూలించక దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేస్తే ధరలు పెరుగుతున్నాయి. అన్ని కాలాల్లో సాగుచేసుకునే పద్దతులపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పిస్తే పరిస్థితులు బాగుపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రైతులు ముందుకు రావాలి.. కూగాయల సాగుకు రైతులు ముందుకు రావాలి. సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హెక్టారు సాగుపై రూ.9600 సబ్సిడీ అందిస్తుంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన మొక్కలు అందిస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ మల్చింగ్, బిందు సేద్యం అందిస్తాం. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలి. – నదీమ్, జిల్లా ఉద్యాన అధికారిజిల్లా కేంద్రంలో ధరలుకూరగాయలు కేజీ(రూ.లలో) టమాటా 50 క్యాలీఫ్లవర్ 80 పచ్చిమిర్చి 80 బెండకాయ 60 క్యాప్సికం 80 కాకర 70 మునగ 100 చిక్కుడు 100 వంకాయ 40 బీరకాయ 80 క్యారెట్ 80 కొత్తిమీర 150 దొండకాయ 70 -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఎస్పీ అశోక్తో కలిసి సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1న కెరమెరి మండలం కొఠారిలో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో కలిసి భోజనం, ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. హెలిప్యాడ్ వద్ద ప్రముఖులకు స్వాగతం, గ్రామస్తులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. షామియానాలు, పైలాన్ ప్రారంభం, వాహనాల పార్కింగ్, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. రహదారిపై గుంతలను పూడ్చాలని సూచించారు. సాయంత్రం కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో బహిరంగ సభ ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యబృందాలు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రముఖులు, అధికారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొఠారి నుంచి కాగజ్నగర్ ఎక్స్రోడ్ వరకు సీఎం రోడ్డు మార్గాన వస్తున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లిలో తెలంగాణ గవర్నర్ పర్యటన ఉన్నందున అధికారులతో సమీక్షించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డోర్లి– 1 ఓసీపీ సందర్శన
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూతపడిన డోర్లి– 1 ఓసీపీని ఓఎస్డీ(కోల్ కంట్రోల్ ఆఫీస్ కొత్తగూడెం) ఏ.కృష్ణమోహన్, ఓఎస్డీ(కోల్ కంట్రోల్ ఆఫీస్ నాగ్పూర్) సతీశ్ గజ్భియే బుధవారం సందర్శించారు. నీటి నిర్వహణ, మృత్తిక సంరక్షణ చర్యల వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు జీఎం కా ర్యాలయంలో ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ కోల్ కంట్రోల్ అధికారులకు ఏరియా వివరాలను వివరించారు. డోర్లి ప్రాజెక్టు అధికారి ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, కార్పొరేట్ అదనపు మేనేజర్లు సీహెచ్.శ్రీనివాస్, రవికిరణ్, తిరుపతి, బాబ్జీ, డీవైఎస్ఎస్వో రమేశ్, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, డోర్లి– 1 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్ పాల్గొన్నారు. -
కుమురం భీం
7మూతపడిన ‘గురుకులం’ సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఏడాదిగా మూతపడి ఉంది. ఇప్పటివరకు భవనాలకు మరమ్మతులు చేపట్టలేదు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. వేడి గాలులు వీస్తాయి. ఉదయం నుంచే వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. వేసవికాలం.. చర్మం పైలం తీవ్రమైన ఎండలతో ఎంతోమంది చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. వేడి, ఉక్కపోత పరిస్థితులు సన్ బర్న్, ర్యాష్ వంటి సమస్యలకు దారి తీస్తున్నాయి. 8లోu -
నేడు బక్రీద్
ఉట్నూర్రూరల్/కెరమెరి/నెన్నెల: ఇస్లాం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ రెండోది. ఇబ్రహీం చేసిన నిరుపమాన త్యాగానికి ప్రతీకగా ఏటా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మసీదులు, ఈద్గాలు ముస్తాబు చేశారు. గురువారం బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 10వ రోజున బక్రీద్ పండుగను ఇబ్రహీం త్యాగాన్ని త లుచుకుంటారు. ఇదే రోజు మక్కా నగరంలో హజ్ ఆరాధనోత్సవం జరుగుతుంది. మక్కా వెళ్లే స్థోమత లేని వారు ఉన్న చోటే ప్రత్యేక నమాజ్ చేసి ఖుర్బానీ ఇస్తారు. కాగా, బుధవారం జిల్లా కేంద్రాలతోపాటు మున్సిపాల్టీలు, మండలాల్లో ఈద్గా వద్ద ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. -
లారీలు రాక.. ధాన్యం కదలక
దహెగాం: చెమట చిందించి పంట పండించడం కంటే దానిని అమ్ముకోవడం అన్నదాతకు తలకు మించిన భారంగా మారింది. కొనుగోలు కేంద్రాలతో వారి కష్టాలు తీరకపోగా, ధాన్యం కుప్పల వద్ద బ తుకులు రోడ్డున పడ్డాయి. యాసంగి వరికోతలు పూర్తయి నెలరోజులు దాటుతున్నా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు వేగం పుంజుకోవడం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారా పట్టి అమ్మకానికి సిద్ధం చేసినా కాంటాలు వేయడంలో అధికారులు తాత్సారం చే స్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తిచేసి బస్తాల్లో నింపినా వాటిని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తగినన్ని లారీలు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలు సైతం పది, ఇరవై రోజులు గా కేంద్రాల్లో మూలుగుతున్నాయి. వానాకాలం సాగుకు సమయం ఆసన్నమవుతుండగా, అకాల వర్షాల భయం అన్నదాతలను వెంటాడుతోంది. అన్లోడింగ్లో జాప్యంజిల్లా వ్యాప్తంగా సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, రెబ్బెన, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్నగర్ మండలాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం అన్లోడింగ్కు జిల్లాలో నాలుగు మిల్లులు మాత్రమే కేటాయించారు. మిల్లులకు తరలించిన ధాన్యం అన్లోడింగ్లో జాప్యంతో కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోతుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 6,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో దొడ్డురకం ధాన్యం 5,435 మెట్రిక్ టన్నులు, సన్నరకం 622 టన్నులు సేకరించారు. కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం లేదు. తూకమైనా బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. మిల్లుకు వెళ్లిన లారీ అన్లోడ్ కావడానికి రెండు రోజులు పడుతుందని తెలుస్తోంది. -
భీం స్ఫూర్తి.. అభివృద్ధి ఆకాంక్ష
ఆసిఫాబాద్: జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు కుమురంభీం, ఎడ్ల కొండు పురిటిగడ్డ ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్కు చెందిన రాయపూడి ఆశాలత కుమారుడు ప్రముఖ క్రికెటర్ నాగేంద్ర గతేడాది ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం భీం పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఈ నెల 29న గ్రామానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లురౌటసంకెపల్లిలో 25 ఇళ్లు ఉండగా 120 వరకు జనాభా ఉంది. అప్పటి గవర్నర్ చేతుల మీదుగా దత్తత కార్యక్రమానికి నాగేంద్ర శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామ క మిటీ ఏర్పాటు చేసి, ప్రతిరోజూ సాయంత్రం పలక, బలపంతో గంట పాటు అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ సంతకం చేస్తున్నారు. మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని ఈ నెల 29 న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా హాజరయ్యే గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. తారురోడ్డు పనులు చేపడుతున్నారు. సభకు షామియానాలు ఏర్పాటు చేశారు. ఆదివాసీ నాయకులు గుణవంత్రావు, సలహాదారు సిడాం అర్జు, కోఆర్డినేటర్ వెంకటేశ్, నిర్వహణ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు రౌట సంకెపల్లిలో గ్రామోత్సవం పోస్టర్లు ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలివే..కుమురంభీం, ఎడ్ల కొండు జన్మస్థలమైన రౌటసంకెపల్లిలో పోరాటయోధుల గుర్తింపు కోసం వారి 20 అడుగుల కాంస్య విగ్రహాలకు గవర్నర్ శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆదివాసీ గిరిజనులకు ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డులు పంపిణీ చేస్తారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా సోలార్ ప్యానళ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్తులకు దుస్తుల పంపిణీ చేసి అనంతరం మద్యపాన నిషేధంపై గ్రామస్తులతో సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ కె.హరిత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు.29న జిల్లాలో గవర్నర్ పర్యటన ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటిస్తున్నట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఉదయం 10.35 గంటలకు కలెక్టరేట్కు చేరుకుని 11 గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామానికి చేరుకుని కుమురంభీం స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి
కాగజ్నగర్టౌన్: మహిళలను ఆర్థిక అభివృద్ధి, సామాజికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని వార్డు నం.6లోని కాపువాడలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా సంఘం సభ్యులకు ఇందిరమ్మ చీరలు మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానాతో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శారద, ఐకేసీ సీఏ అరుణ, రేణుక, మహిళలు పాల్గొన్నారు. -
సీఎం సభకు లోటుపాట్లు రానీయొద్దు
రెబ్బెన: జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 1న ఏర్పాటు చేసే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దని ఎస్పీ నితిక పంత్ అన్నారు. రెబ్బెన మండలం కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సభాస్థలిని మంగళవారం పరిశీలించారు. వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించి పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పార్కింగ్, సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రూట్మ్యాప్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐలు సంజయ్, సత్యనారాయణ, ఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హెడ్కానిస్టేబుల్కు నివాళివాంకిడి: రెబ్బెన మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్కానిస్టేబుల్ జాడి బాపురావుకు మంగళవారం ఎస్పీ నితిక పంత్ నివాళులర్పించారు. స్వగ్రామమైన వాంకిడి మండలం బంబార గ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకురాగా, ఎస్పీ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయం కింద రూ.30 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ్ శంకర్రెడ్డి, సీఐలు వేణుగోపాల్, శ్రీనివాస్, వామన మూర్తి, సంజయ్, ఎస్సైలు వెంకటకృష్ణ, మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీట్ అధికారుల బదిలీలు పూర్తి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించడంతో జిల్లా అటవీశాఖలో బీట్ అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయంలో మంగళవారం డీఎఫ్వో బాలామణి, ఎఫ్డీవో అప్పయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్టీవో వేణుబాబు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. డీఎఫ్వో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం జిల్లాలోని రెండు డివిజన్లలో మొత్తం 45 మంది బీట్ అధికారులు బదిలీలకు అర్హత సాధించారని తెలిపారు. వీరికి 11 రేంజ్లలో 45 బీట్లను కేటాయించామన్నారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న బీట్ సర్వీస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి బదిలీలు చేపట్టామని తెలిపారు. అంతకు ముందు యూనియన్ నాయకులతో సమావేశమై.. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వోలు, జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సభ్యులు సాయిచరణ్, సద్దాం, స్వప్న, అనిల్, మోహన్, శ్రావణ్ పాల్గొన్నారు. -
హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం
వాంకిడి: బాలల హక్కులు, చట్టాలపై ప్రజల కు అవగాహన అవసరమని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ అన్నారు. మండలంలోని పాటగూడలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్ర ణాళికలో భాగంగా ‘బాల్య వివాహం– బ తుకు ఆగం’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 1098 లేదా 112, మహిళల సమస్యలపై 181 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ శ్రీదేవి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ దుర్గం పితాంబర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చేనేతపై ‘ఈ– టెండర్’ దెబ్బ
కాగజ్నగర్టౌన్: నూలు దారంతో వస్త్రాలునేసి జీవనాన్ని కొనసాగిస్తున్న నేతన్నలపై ప్రభుత్వ ఈ– టెండర్ఽ విధానం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆర్డర్లు లేక చేనేత కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్, మంచిర్యాల జిల్లా చెన్నూర్లో చేనేత పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వ రంగ సంస్థ అయిన టెస్కో(టీజీఎస్సీవో) ద్వారా వివిధ వస్త్రాలకు ఈ సంఘాలు ఆర్డర్ పొందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన టవళ్లు, కార్పెట్లు, బెడ్షీట్లు వంటివి ఇక్కడే తయారు చేసి అందిస్తారు. కానీ ప్రభుత్వం ఈ– టెండర్ విధానంతో టీజీఎస్సీవో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానం అమలు చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. మార్చిలోనే నోటిఫికేషన్2025– 27 సంవత్సరానికి టెస్కో నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు. తీరా ప్రభుత్వం గ్రూప్నకు ముగింపు పలుకుతూ మార్చిలో ఈ– టెండర్ విధానాని కి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఆర్డర్ దక్కించుకుంటే నేతన్నలు రోడ్డున పడే దుస్థితి నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలు పవర్లూమ్ వస్త్రాలకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. చేనేత వస్త్రాలకు సరైన ధర దక్కదు. వాటిని మార్కెట్లో కూడా విక్రయించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా కార్మికులు మగ్గాలకు దూరమై ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముంది. పాత పద్ధతిని పునరుద్ధరించాలి వివిధ శాఖలకు అవసరమైన వస్త్రాలను అందించే బాధ్యతను ఈ– టెండర్ విధానంతో కాకుండా పాత పద్ధతిని పునరుద్ధరించాలి. ఆర్డర్ రద్దు చేయడంతో నేత కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టినట్లుయింది. ప్రభుత్వం పునరాలోచన చేసి చేనేత రంగానికి అండగా నిలవాలి. – నల్ల కనకయ్య, మేనేజర్, బెజ్జూర్ చేనేత పారిశ్రామిక సహకార సంస్థ కలవరపెడుతున్న ప్రభుత్వ నిర్ణయంకాగజ్నగర్ చేనేత పారిశ్రామిక సంఘంలో 40 మగ్గాలపై 30 మంది కార్మికులు, చెన్నూర్లో 80 మగ్గాలపై 60 మంది కార్మికులు వస్త్రాలను నేస్తుంటారు. వారికి టీఎస్కో ఆర్డర్లు అందజేస్తుంది. ఈ రెండు సంఘాల పరిధిలో ఏటా రూ.80 లక్షల మేర వస్త్రాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నేతన్నలను కలవరపెడుతోంది. ఇక నుంచి టీఎస్కోకు కాకుండా ఓపెన్ టెండర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆర్డర్లు లేక నేత మగ్గాలు వెలవెలబోయే పరిస్థితులు ఏర్పడతాయని కార్మికులు చెబుతున్నారు. -
భాగస్వామ్యమే అభివృద్ధికి బాట
కెరమెరి: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఆదిమ గిరిజనులు, ఇతర గిరిజనుల భాగస్వామ్యం పెంచి, వారిని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన జన్భాగీదారి అభియాన్ విజయవంతంగా ముగిసింది. గిరిజన శాఖ సిబ్బంది, గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంపిక చేసిన గ్రామాల్లో తిరుగుతూ విస్తృతంగా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి వసతుల కల్పనపై వివరాలు సేకరించి నివేదికలు రూపొందించారు. ర్యాలీలు, గ్రామసభలు..ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. 341 గ్రామ సభలు, 241 ర్యాలీలు నిర్వహించి గూడెలను చైతన్యపర్చారు. 168 ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. రక్తనమూనాలు సేకరించి మందులు అందించారు. సికిల్ సెల్, క్షయ, డయాబెటీస్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 1,080 మందికి ఉపాధి హామీ జాబ్కార్డులు, ఆధార్ కార్డులు అందించారు. జనసన్వాయి(గ్రామ సభలు) కార్యక్రమాలు విజ యంతంగా నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకా లు, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సమీక్షించా రు. ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, పటేళ్లు, గ్రామస్తులను భాగస్వాములను చేశారు. గిరిజన పిల్లలకు చాలామందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేనట్లుగా గుర్తించి సంబంధిత అధికారులతో చ ర్చించి సమస్యలు పరిష్కరించారు. సదుపాయాల కల్పనపై రూపొందించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సమగ్ర నివేదిక సిద్ధం జిల్లాలోని 241 ఆవాసాల్లో జన్భాగీదారి కార్యక్రమం ముగిసింది. ఆయా గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేశాం. త్వరలో ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ప్రజలకు అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించాం. – పి.రమాదేవి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి241 గ్రామాల్లో..జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం జన్మన్, పీఎంజుగా వంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ ఏడాది జన్ భా గీదారి అభియాన్ అనే కార్యక్రమం కింద జి ల్లాలోని 241 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపట్టారు. జన్భాగీదారి కార్యక్ర మం ఉద్దేశం, తీరుతెన్నులను గ్రామీణులకు వివరించారు. కలెక్టర్ హరిత, ఐటీడీఏ ప్రాజె క్టు అధికారి మంద మకరందు ఆధ్వర్యంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పి.రమాదేవి, పీఏఆర్సీ ఏఎంవో ఉద్దవ్ పర్యవేక్షించారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కెరమెరి: మండలంలోని కొత్తగూడ గ్రామంలో జూన్ 1న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మంగళవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు త్వరగా పూర్తిచేయాలని, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న పాత నిర్మాణాలు, చెత్తాచెదారం తొలగించాలన్నారు. ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల ఎదుట పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉన్నందున ప్రత్యేక వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, పీడీ ప్రకాశ్రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట
ఆసిఫాబాద్అర్బన్: సమష్టి కృషితోనే బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడుతుందని జిల్లా బాల ల పరిరక్షణ అధికారి బూర్ల మహేశ్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ మండలం కౌటగూడ పంచాయతీలో నిర్వహించిన ‘బాల్య వివాహా ముక్త్ భారత్’ కార్యక్రమంలో మాట్లాడారు. యువతులకు 18, యువకులకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు జరిపించాలని సూచించారు. పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్య వస్థ, పిల్లలపై హింస నివారణలో గ్రామస్థా యి బాల సంరక్షణ కమిటీలు కీలకంగా పని చేయాలని ఆదేశించారు. సూపర్వైజర్ లైలా, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగికి క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం
రెబ్బెన: ప్రతీ ఉద్యోగికి క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్న ఆయనను మంగళవారం గోలేటిలో పర్సనల్ డిపార్టుమెంట్ అధికారులు, ఉద్యోగులు సన్మానించారు. జీఎం మాట్లాడుతూ తన 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, సమయపాలనకే అధిక ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తాను సాధించిన విజయాలు, ఎదుర్కొ న్న సంఘటనలను ఉద్యోగులకు వివరించారు. నిబద్ధత, వృత్తిలో బాధ్యత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ హెచ్వోడీ ఎస్వీ రాజేశ్వర్రావు, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, సీనియర్ అసిస్టెంట్ బాబా, అన్ని విభాగాల సంక్షేమ క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎరువు.. ధరవు!
రెబ్బెన: కష్టాలతో సాగుతున్న రైతులపై ఎరువుల భారం పడింది. కొన్నేళ్లుగా అన్నదాతలు దిగుబడి లేక చితికిపోతుండగా.. ఈసారి సీజన్కు ముందే కంపెనీలు ధరలు అమాంతం పెంచాయి. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు ఇప్పుడిప్పుడే సమాయత్తం అవుతున్నారు. ఈసారి పెట్టుబడి వ్యయం మరింత పెరగనుంది. ఒక్కో రకం రసాయన ఎరువుల బస్తాపై గరిష్టంగా రూ.400 వరకు పెరిగింది. 91,543 మెట్రిక్ టన్నుల వినియోగంజిల్లాలో వానాకాలం సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో సాగు చేసే పంటలకు సుమారు 91,543 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను వినియోగిస్తుంటారు. ఈసారి ధరల పెరుగుదలతో పెట్టుబడిలో సగం ఎరువులకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ముడిసరుకు ధరలు, గల్ఫ్ దేశాల నుంచి నుంచి సహజ వాయువు సరఫరా లేకపోవడం, ఇరాన్– ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం, రవాణా చార్జీల పెరుగుదల వంటి అనేక కారణాలతో ఎరువుల ధరలు ఆకాశన్నంటాయి. ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు కంపెనీలు రేట్లు పెంచాయి. ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ వంటి ధరలే అధికంగా పెరగ్గా, డీఏపీ, యూరియా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం రైతులకు కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ వానాకాలం సీజన్లో 22,608 మెట్రిక్ టన్నుల డీఏపీ, 48,935 మెట్రిక్ టన్నుల మేర యూరియా వినియోగించునున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలకు మించి జిల్లా రైతులు వినియోగించే అవకాశం ఉంది. 15 రోజుల్లో సాగు పనులుజిల్లాలోని 15 మండలాల పరిధిలో 4,52,175 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా రైతులు సాగు చేసే పంటల్లో పత్తి మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరి, కంది పంటలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో సారవంతమైన నేలలు అందుబాటులో లేకపోవడంతో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తిసాగు కోసం జిల్లాలోని రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. దుక్కిదున్ని తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల అంచనా ప్రకారం మరో 15 రోజుల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోనున్నారు.పెరిగిన ఎరువుల ధరలు (రూ.లలో)ఎరువులు పాత ప్రస్తుత 28–28–0 1,350 1,350 డీఏపీ 1,350 1,350 పొటాష్ 1,800 1,975 20–20–0–13 1,400 1,800 14–35–14 2,150 2,350 10–26–26 1,200 1,700 12–32–16 2,025 2,250 సింగిల్ సూపర్ పాస్పెట్ 600 775 16–16–16 1,675 2,050 24–24–0 2,000 2,350 అకాశాన్నంటిన ‘కాంప్లెక్స్’పంటల సాగులో డీఏపీ, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను సైతం సమపాళ్లలో వాడాల్సి ఉంటుంది. భూమి లోపల మొక్కలకు కావాల్సిన పోషకాలు అందని సమయంలో రసాయన ఎరువుల రూపంలో అందిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. కానీ కాంప్లెక్స్, పొటాష్ ధరలు ఆకాశన్నంటాయి. కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో రైతులపై ఆర్థికభారం తప్పడం లేదు. రకాలను బట్టి బస్తాపై రూ.150 నుంచి రూ.400 పెరిగింది. అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యల కారణంగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. -
ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకల కోసం భీమన్న స్టేడియం, జీఎం కార్యాలయాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో ఖైరిగూర పీవో నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, డీవైసీఎంవో పాండురంగాచారి, డీజీఎం ఉజ్వల్కుమార్, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7వీవోఏల సమస్యలు పరిష్కరించాలి వీవోఏల సమ్మె కొనసాగుతోంది. కౌటాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కెరమెరిలో మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం వారికి మద్దతు తెలిపారు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి తీవ్రత కాస్త తగ్గుతుంది.మొక్కలకు ముప్పు ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు రక్షణ లేకుండా పోతోంది. రైతులు పొలంగట్టుపై ఉన్న చెత్తను కాల్చే క్రమంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు కాలిపోతున్నాయి. మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026 -
వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణుతో కలిసి అర్జీదారుల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన భూమిని భూ భారతి పోర్టల్లో ఆన్లైన్ చేసి పాస్పుస్తకంలో న మోదు చేయాలని ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన నగేశ్ విన్నవించాడు. ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా ఇటీవల విధుల నుంచి తొలగించారని, తిరిగి నాకు ఉపాధి చూపాలని సిర్పూర్(యు) మండలం మహగాం గ్రామానికి చెందిన కొడప హీరామన్ వినతిపత్రం అందించాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిర్పూర్(యు) మండలం కోహినూరు గ్రామానికి చెందిన మండాడి రంభ దరఖా స్తు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనకు ఆర్థికసాయం అందించాలని పెంచికల్పేట్ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన రాజయ్య కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సాహస్తి, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్లోని బ్రాహ్మణవాడకు చెందిన ఢిల్లీ విజయ్కుమార్ వేర్వురుగా దరఖాస్తు చేసుకున్నా రు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్తాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్ మంజూరు చేయాలి నేను దివ్యాంగురాలిని. ప్ర స్తుతం ఒకరి సహాయం లే కుండా నడవలేని పరిస్థితి. 75శాతంతో సదరం సర్టిఫికె ట్ ఉన్నా దివ్యాంగ పింఛన్ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందవుతుంది. అధికారులు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలి. – ఎం.భారతి, గోలేటి, మం.రెబ్బెన -
ముగిసిన సమ్మర్ క్యాంపులు
ఆసిఫాబాద్అర్బన్: ప్రజాపాలన– ప్రగతి పా లన కార్యక్రమంలో భాగంగా 15 రోజులుగా జిల్లాలోని పీఎంశ్రీ, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు సోమవా రం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని తెలంగా ణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి డీఈవో లలిత హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కు బహుమతులు ప్రదానం చేశారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు కళలు కూడా అవసరమన్నారు. అవసరమైన నైపుణ్యాలు సాధించాలని, అప్పుడే జీవితంలో నిలబడతారని పేర్కొన్నారు. అనంతరం యోగా, నృత్యాలు, ఇతర ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మరోసారి ‘పెట్రో’ బాదుడు..
కాగజ్నగర్టౌన్: ప్రజలపై మరోసారి పెట్రో పిడు గు పడింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఒకే నెలలో నాలుగు సార్లు ఇంధన ధరల పెంచడంతో వాహనదారులు, రైతులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభ సమయం కావడంతో అన్నదాతలపై ఈ ప్రభా వం నేరుగా పడనుంది. మరో పది రోజుల్లో సాగు పనులు ప్రారంభం కానున్నాయి. పత్తి చేలల్లో దుక్కి దున్నేందుకు జిల్లావ్యాప్తంగా ట్రాక్టర్ల విని యోగం అధికంగా ఉంది. ఈ సమయంలో పెట్రో ధరల పెంపు వారికి భారం కానుంది. జిల్లాలో పెంపు ఇలా..ఈ నెల 15, 19, 23, 25 తేదీల్లో ఇంధన ధరలను పెంచారు. పెట్రోల్ లీటర్పై రూ.3.39, రూ.0.99, రూ.0.97, రూ.2.84 చొప్పున పెరిగింది. ఈ నెల 15కు ముందు జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.108.86 ఉండగా, ప్రస్తుతం రూ.117.05కు చేరింది. డీజిల్ ధరలు రూ.3.28, రూ.0.99, రూ.0.99, రూ.2.86 పెంచుకుంటూ రాగా, ఈ నెల 15కు ముందుకు రూ.100.70 ఉన్న డీజిల్ లీటర్ ధర ప్రస్తుతం రూ.108.82కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 85 డాలర్లు దాటడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. డీజిల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలపైనా ప్రభావం పడుతోంది. లారీ అద్దెలు 15 శాతం పెరగడంతో హోల్సెల్ మార్కెట్ నుంచి చిల్లర దుకాణాలకు వచ్చేసరికి అన్ని వస్తువుల రేట్లు అధికమవుతున్నాయి. -
మహిళా వారోత్సవాలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ నెల 30 వరకు జిల్లా మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నిర్వహించే మహిళా వారోత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం డీఆర్వో దాసరి వేణు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, డీఆర్డీవో దత్తారావుతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. తొలిరోజు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ నెల 26న ‘బాల్య వివాహం– బతుకు ఆగం’ నినాదంతో బాల్యవివాహాలతో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, 27న మహిళల భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించడం, మండల సమాఖ్యలో ప్రత్యేక సాధారణ సమావేశాలు నిర్వహించాలన్నారు. 29న రుణ మేళాలు, స్వయం సహాయక సంఘాల జీవనోపాధిపై, యూనిట్ల రౌండింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. 30న అమ్మ మాట– అంగన్వాడీ బాట నినాదంతో పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ, విద్య ఆరంభ ధ్రువపత్రాల జారీ, కిశోర బాలికల కోసం స్నేహ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంమహిళల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం వివిధ వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్ల నిర్వహణతో తోడ్పాటునందించామని పేర్కొన్నా రు. స్వయం సహాయక సంఘాలకు భవిష్యత్తులో రైస్ మిల్లుల స్థాపన, నిర్వహణ అప్పగిస్తామని తెలి పారు. మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు ప్ర భుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించా రు. కలెక్టర్ కె.హరిత, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
రోహిణి కార్తె షురూ
కౌటాల: సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో రోళ్లు పగిలేలా ఎండ దంచి కొండుతుందనే నానుడి ఉంది. ఈ క్రమంలోనే కార్తె ప్రారంభం రోజు వడగాలులు బెంబేలెత్తించాయి. దహెగాం మండలం కుంచవెల్లి, కాగజ్నగర్లో 46.4 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జంబుగ, సిర్పూర్(టి) 46.3, గోలేటి, చింతలమానెపల్లి 46.0, దహెగాం 45.9, పెంచికల్పేట్, లోనవెల్లి, కౌటాల 45. 8, తిర్మాణి 45.5, బెజ్జూర్ 45.4, రెబ్బెన 45.3, వెంకట్రావ్పేట 45.1, వంకులంలో 45.0 డిగ్రీలుగా నమోదైంది. -
అంగన్వాడీ.. ఖాళీల భర్తీ!
దహెగాం మండలం ఇట్యాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం–1 అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కేంద్రంలోని ఆయా ఉద్యోగ విరమణ పొందడంతో రెండేళ్లుగా పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అంగన్వాడీ టీచరే పిల్లలను బడికి తీసుకువస్తూ.. వారికి వంట చేసి పెడుతున్నారు. ఆయా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ టీచర్ రమాదేవి తెలిపారు.కౌటాల మండలం యాపల్గూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సైతం పక్కా భవనం లేక అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లుగా అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. మరో అంగన్వాడీ కార్యకర్త ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో చిన్నారులకు ఆటపాటలు, చదువు అందడం లేదు. కేంద్రాన్ని తెరిచి పిల్లలకు భోజనం పెట్టి పంపిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీపై ఇటీవల ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడంతో ఆయా కేంద్రాల పరిధిలోని లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దహెగాం: అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏళ్లుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటిస్తూ ఖాళీల వివరాలను వెల్ల డించింది. దీంతో కేంద్రాలకు మహర్దశ పట్టడంతో పాటు సేవలు మెరుగుపడనున్నాయి. జిల్లాలోని మ హిళా నిరుద్యోగుల్లోనూ ఖాళీల భర్తీపై ఆసక్తి నెలకొంది. జూన్ 1 నుంచి అంగన్వాడీ బడులు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ నెలాఖరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. 1,006 కేంద్రాలు..జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, వాంకిడి, జైనూర్, సిర్పూర్(టి) ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 1,006 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 283 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా, 347 కేంద్రాలకు పక్కా భవనాలు ఉన్నాయి. 353 కేంద్రాలు ఫ్రీరెంట్ పద్ధతిలో పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారుగా 37,353 మంది, గర్భిణులు 2,902 మంది, బాలింతలు 1,576 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు 174, ఆయాలు పోస్టులు 445 ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు మరోచోట ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి నెట్టుకువస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లు, బ్రేక్ఫాస్ట్ అందించేందుకు చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగనుంది. ఖాళీలు భర్తీ చేస్తేనే సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.నిబంధనల ప్రకారం.. జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు మొత్తం 619 ఖాళీలను గుర్తించాం. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. అయితే ఖాళీల భర్తీ ప్రక్రియపై ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు అందిన వెంటనే నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపరుస్తాం. – స్వరూపారాణి, ఐసీడీఎస్ పీడీస్పష్టత వస్తేనే..1,006 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 174 టీచర్, 445 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఆయా ఖాళీల వివరాలను ప్రతినెలా ప్ర భుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినా ఇంకా తమకు భర్తీ ప్రక్రియపై సరైన ఆదేశాలు రాలేదని వారు చెబుతున్నారు. జిల్లాలోని ఖాళీల ను మొదటి విడతలోనే భర్తీ చేస్తారా..? లేదా రెండో విడతలో భర్తీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. -
ఏరియర్స్ చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్: 2017 పేస్కేల్ ఏరియర్స్, ఇతర ఏరి యర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా వివిధ హోదా ల్లో ఉద్యోగాలు చేసి, రిటైరైన తాము తొమ్మిదేళ్లుగా రూ.3, 4 వేల పెన్షన్తో కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి ఉన్న 2017 పేస్కేలు 2024 ఏప్రిల్లో సర్వీసులో ఉన్న వారందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశా రు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి నెలకు రూ. 400 కోట్లు వస్తున్నందున బకాయిలు చెల్లించడం సంస్థకు ఇబ్బంది కాదని స్పష్టం చేశారు. పిల్లల చ దువులు, వివాహాలు, అనారోగ్య సమస్యలకు చేసి న అప్పులు తీర్చలేకపోతున్నామన్నారు. యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్య క్రమంలో విశ్రాంత ఉద్యోగులు మోతె రాజన్న, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిరసన
ఆసిఫాబాద్అర్బన్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రో ధరలు పెంచి సామాన్యుడిపై అదనపు భారం మోపడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ సాధారణ ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. -
సీఎం పర్యటనలో స్వల్ప మార్పు!
కెరమెరి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంది. జూన్ 2న హైదరాబాద్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరుకానుండగా, జూన్ 1వ తేదీనే జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కెరమెరి మండలం కొత్తగూడ గ్రామాన్ని సందర్శించారు.హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. కొలాం గిరిజనుల కోసం నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు మునీర్ అహ్మద్, కుసుంబ్రావు, ఆత్రం లక్ష్మణ్, బాపూరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించా రు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రా ష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా భ ట్టివిక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా వా యు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జిల్లాలో నిబంధనల ప్రకా రం కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తించి న గోదాములకు కేటాయించిన ప్రకారం రైస్ మిల్ల ర్లకు ధాన్యం తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగో లు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించి సీఎంఆర్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. -
సాగుకు సమాయత్తం
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చే సుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో మృగశిర కార్తె ప్రవేశించనున్నందున ఉదయం నుంచే పను ల్లో నిమగ్నమవుతున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నా రు. గతంలో ఎరువుల దుకాణాల్లో నేరుగా యూరి యా లభించేది. దీంతో షాపుల ఎదుట వందల సంఖ్యలో రైతులు బారులు తీరేవారు. కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చే యకపోవడం, రాష్ట్రంలో నిల్వలు లేకపోవడంతో రై తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారికంగా యూరియా నిల్వలు సరిపోతాయని భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వా నాకాలం సాగుకు రాష్ట్రానికి 11.50 లక్షల టన్నుల యూరియా అవసరమున్నట్లు ప్రభుత్వం కోరగా, వివిధ కారణాలతో ప్రభుత్వం 10 లక్షల టన్నులకే అనుమతిచ్చింది. ఏప్రిల్, మే మాసాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి డిమాండ్కు తగిన యూరియా సరఫరా కాకపోవడంతో దీని ప్రభావం జిల్లాపై పడే అవకాశాలున్నాయి. జిల్లాలో 4.52 లక్షల ఎకరాల్లో సాగుజిల్లాలో 2026–27 సంవత్సరానికి ఖరీఫ్లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47వేల ఎకరాల్లో వరి, 21వేల ఎకరా ల్లో కంది, 7.5వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరా ల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. 7.41లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 11వేల క్వింటాళ్ల వరి, 613 క్వింటాళ్ల మొక్కజొన్న, 842 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమున్నాయి. 60వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ప్రస్తుతం జిల్లాలో 11వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. 22వేల క్వింటాళ్ల డీఏపీ అవసరముండగా 400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. కొరవడిన అవగాహన సేంద్రియ సాగును పెంచాలని అధికారులు సూచి స్తున్నా రైతులు రసాయన ఎరువులతోనే పత్తి సాగు కు మొగ్గు చూపుతున్నారు. చీడపురుగుల నివారణ కు రసాయన ఎరువులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గుతోంది. ఇంటికి అవసరమైన మేరకే ఆహార పంట లు సాగు చేస్తూ మిగతా భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రై తులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు లేదు. రైతులు ఆందోళన చెందొద్దు దశలవారీగా నెలనెలా జిల్లాకు యూరియా, డీఏపీ సరఫరా అవుతోంది. మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎకరాకు మూడు బస్తాల యూరియా మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో వేస్తే దిగుబడి తగ్గుతుంది. జిల్లాలో ఎరువుల కొరత ఉండదు. రైతులు ఆందోళన చెందొద్దు. – వెంకటి, జిల్లా వ్యవసాయాధికారిప్రారంభం కాని మొబైల్ యాప్యూరియా పంపిణీలో పారదర్శకత ఉండేలా గతేడాది డిసెంబర్ 20నుంచి ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా పంపిణీని అమల్లోకి తెచ్చింది. తా జాగా వానాకాలం పంటలకూ ఇలాగే పంపిణీ జరగనుంది. ఖరీఫ్ సమీపిస్తుండగా మొబైల్ యాప్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వేసవిలో యూరియా, డీఏపీ లభిస్తే రైతులు తమ పంట చేల వద్ద భద్రపరుచుకుంటారు. వర్షాలు వస్తే పంట పొలాల్లోకి ఎరువులను తరలించడం ఇబ్బందవుతుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే రైతులు ఎరువుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా రైతులకు ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా రెండింటికే పరిమితం చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఫర్టిలైజర్స్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో యాప్ తొలగించాలని కోరుతూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. ఎరువుల కేటాయింపులు మూడు దశల్లో ఇస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
అనుమతి లేనిదే అడవికి వద్దు
చింతలమానెపల్లి: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడికి పాల్పడిన ఘటనలో నలు గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాగజ్నగర్ అటవీ డివిజన్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కాగజ్నగర్ అటవీ డివిజన్ అధికారి అప్పయ్య తెలిపారు. సాధ్యమైనంత వరకు ఎవరూ అడవుల్లోకి వెళ్లొద్దని, అడవులు మన భవిష్యత్ అని, వాటిని మనమే కాపాడుకోవాలని సూచించారు. పులి గ్రామాల సమీపంలోకి వచ్చినా.. సమస్యాత్మక పరిస్థితులున్నా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే.. చంద్రపూర్ ఘటన నేపథ్యంలో అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు, ఆయా వర్గాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు. సాక్షి: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి ఘటన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్పయ్య: అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. సమస్యాత్మ క ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలు వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో తునికాకు సేకరణ నిలిపేశాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాక్షి: మహారాష్ట్ర అటవీశాఖ అధికారులతో మీకు సమన్వయం ఎలా ఉంది? అప్పయ్య: చంద్రపూర్ ఘటన అనంతరం పు లుల సంచారంపై మహారాష్ట్ర అటవీ అధి కారులతో మాట్లాడాం. వారి ద్వారా జిల్లాలోకి వలస వచ్చే పులుల సమాచారం నిత్యం తెలుసుకుంటున్నాం. సాక్షి: పులి దాడి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? అప్పయ్య: అటవీ సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సమీప ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అటవీశాఖ సూచనలు పాటించాలి. తునికాకు సేకరించే వారు, రైతులు గుంపులుగుంపులుగా వెళ్లాలి. ఇందులో ఒకరు పరిసరాలను గమనించాలి. అటవీ మార్గాల గుండా ప్రయాణించేవారు అడవుల్లో వాహనాలను నిలుపడం, అక్కడే భోజనాలు చేయడం లాంటివి చేయవద్దని సూచిస్తున్నాం. వివిధ పనులపై అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లేవారు సాయంత్రం 4గంటల్లోపే ఇంటికి చేరుకోవాలి. సాక్షి: అటవీ ప్రాంతాల్లో చాలామంది ఫొటో షూట్కు వస్తుంటారు కదా? అప్పయ్య: జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతా ల్లో పులుల సంచారం ఉంది. ఫొటో షూట్ ల కోసం అక్కడికి వెళ్లడం ఆపదను కొని తెచ్చుకోవడమే. అటవీశాఖ అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లొద్దు. అనుమతి లే కుండా అడవుల్లో ఫొటోషూట్ నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. -
మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మె డికల్ కళాశాలకు తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని పద్మశాలీ సంఘం నాయకులు ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆ త్రం సుగుణను కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ మాట్లాడారు. మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించిన ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకొని వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అసంపూర్తిగా నిలిచిన పట్టణంలోని పద్మశాలీ సంఘ భవ న నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన డీసీసీ అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘం పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి శ్రీకాంత్ తదితరులున్నారు. -
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్
కెరమెరి: యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని తుడుదెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూ రియా యాప్ సామాన్య రైతుల పాలిట శా పంగా మారిందని ఆరోపించారు. 80శాతం మంది రైతుల వద్ద మొబైల్ ఫోన్లు లేవని తెలిపారు. మొబైల్ఫోన్లు ఉన్నవారికి కూడా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే వి ధానం తెలియదని పేర్కొన్నారు. యాప్లో యూరియా బుక్ చేసుకునే విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలో యూరియా విక్రయించాలని డిమాండ్ చేశారు. నాయకులు సెడ్మికి తుకారాం, మడావి భరత్ భూషణ్, ఆత్రం భీంరావు, కినక సకారాం, గిత్తే కిరణ్, వాడ్గూ రే నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘సన్’డే భగభగలు
కౌటాల/ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. జిల్లాలోని దహెగాం మండలం కుంచవెల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. దీంతో ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వర కు వడగాలులు వీస్తుండగా జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలిలో తేమ తగ్గిపోవడంతో పాటు అధిక వేడికి తోడు వడ గాలులు వీస్తున్నందున జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులు, ముఖ్య కూ డళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలోని 11 మండలాలు రెడ్ జోన్లో, మిగతా మండలాలు అలర్ట్ జోన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇళ్లకే పరిమితమవుతున్న జనంవారం రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోయి ఉపశమనం పొందుతున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్తున్నారు. ఎండ తీవ్రతకు దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ప్రజలు లేక బోసిపోతున్నాయి. ఆదివారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు ప్రాంతం గరిష్టం (సెల్సియస్లో) కుంచవెల్లి 46.5 కాగజ్నగర్, సిర్పూర్(టి) 46.3 లోనవెల్లి 46.2 తిర్యాణి 46.1 రెబ్బెన, జంబుగా 45.9 ఆసిఫాబాద్ 45.8 ఎల్కపల్లి 45.7 గోలేటి, దహెగాం 45.6 చింతలమానెపల్లి 45.5 కౌటాల 45.2 వెంకట్రావ్పేట 45.1 బెజ్జూర్, రెబ్బెన 45.0 -
ఆలయాల్లో ఆడిట్ అధికారుల తనిఖీలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో శనివారం ఆడిట్ అధికారులు పాండురంగ, ఏకనాథ్ తనిఖీలు నిర్వహించారు. ఆలయాలకు దూపదీప నైవేద్యాల ఖర్చులు, అర్చకులకు వేతనాలు సక్రమంగా అందుతున్నాయా? అర్చకులు రోజూ ఆలయాల్లో పూ జలు చేస్తున్నారా? అని ఆరా తీశారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతుండడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 18నుంచి 26వరకు ఆడిట్ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గణపతి, కేస్లాపూర్ వీరాంజనేయస్వామి, కంచుకోట హనుమాన్, మహాలక్ష్మి, బాలేశ్వరస్వామి, సోమనాథ్, సందీప్నగర్ శివాలయం, అయ్యప్పస్వామి ఆలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. -
మోసగించే ముఠాలపై అప్రమత్తంగా ఉండాలి
వాంకిడి: ఉపాధి పేరిట మోసగించే ముఠాల విషయంలో మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని లీగల్ సర్వీసెల్ అథారిటీ సెక్రటరీ సంకేత్ మిశ్రా సూచించారు. శనివా రం మండలంలోని బంబార గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణా, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడమే పోక్సో చట్టం ఉద్దేశమని తెలి పారు. ఈ చట్టం కింద బాధితుల పేర్లు గో ప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు భయపడకుండా ముందుకురావాలని సూ చించారు. జూనియర్ సివిల్ జడ్జ్ అనంతలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లలు సెల్ఫోన్లో అపరిచి తులతో చాటింగ్ చేయడం, ఫొటోలు, వీడియోలు పంపడం లాంటివి చేయకూడదని తె లిపారు. పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు కనిపెట్టాలని సూ చించారు. అసిస్టెంట్ లీగల్ కౌన్సిల్ అంజనీదేవి, డీడబ్ల్యూవో శారద, జెండర్ స్పెషలిస్ట్ రాణి, రాజేశ్వరి, సర్పంచ్ బెండారె కృష్ణాజీ, ఉప సర్పంచ్ సంతోష్ తదితరులున్నారు. -
సీఎం సభ సక్సెస్ చేయాలి
రెబ్బెన: జూన్ 2న మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ప్రజ లు అధికసంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శనివా రం మండల కేంద్రంలోని కేకే గార్డెన్స్లో పార్టీ మండల ముఖ్య కార్యకర్తలతో బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అధికసంఖ్యలో సభకు తరలివచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్రావు, అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కా ర్యదర్శి దుర్గం దేవాజీ, చిరంజీవిగౌడ్, నాయకులు సోమశేఖర్, ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల్లేక సుస్తీ..!
కెరమెరి: ఏటా రావాల్సిన ఆస్పత్రి అభివృద్ధి నిధులు (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నాలుగేళ్లుగా నిలిచాయి. దీంతో 2023 నుంచి ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వ దవాఖానా ల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చీపుర్లు, బకె ట్లు, ఇంటర్నెట్, కంప్యూటర్ల మరమ్మతుకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆస్పత్రి అ భివృద్ధి నిధులు విడుదల చేయకపోవడంతో పీహెచ్సీలు, సీహెచ్సీల నిర్వహణ గాడి తప్పింది. వీటిలో సమస్యలు పేరుకుపోతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా ప్రతీ పీహెచ్సీ, ఇతర వైద్యశాలలకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు నాలుగేళ్లుగా నిలిచి ఏ చిన్న అవసరమున్నా.. ఏదైనా వస్తువు కొనాల న్నా వైద్యులు జేబులోంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 20 పీహెచ్సీలు, ఐదు సీహెచ్సీలుండగా వీటిలో వసతులు మెరుగుపరుచుకోవడానికి ఇబ్బందులకు గురి కావాల్సిన దుస్థితి ఉంది. అభివృద్ధి గురించి అడిగే నాథులేరి?మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ఏడాది కిందట ముగియడంతో పీహెచ్సీల అభివృద్ధి కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. కమిటీలున్నా కనీసం నిధుల గురించి అడిగే పరిస్థితి ఉండేది. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి ప్రతీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి నిత్యం 80నుంచి 120మంది రో గులు వస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఉదయం పూట రోగుల సంఖ్య అధికంగా ఉంటోంది. రోగులకు సరైన వైద్యం అందుతుందా? లే దా అస్పత్రులకు ఏవైనా అవసరాలున్నాయా? అని అడిగే నాథులే లేరు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహణ లేక సమస్యల్లో కూరుకుపోయాయి. ఫలితంగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఏడాదికి రూ.1.75 లక్షలు ఎటుపాయే..జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సివిల్ ఆస్పత్రులకు ఏటా ప్రభుత్వం నిర్వహణ నిధుల కోసం రూ.1.75 లక్షల చొప్పన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ మంజూరు చేసేది. 2023 తర్వాత ఈ నిధులు నిలిచిపోయాయి. గతంలో ఈ నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు మౌలిక సదుపాయాలు కల్పించేవారు. దీంతో పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా సదుపాయాలు, కనీస సౌకర్యాలు కల్పించడానికి వై ద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వి ద్యుత్ బల్బులు, చీపుళ్లు, శానిటరీ వస్తువులు కొనా లన్నా, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పాడైన కంప్యూటర్లకు మరమ్మతు చేయించాలన్నా, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నా, స్టేషనరీ ఖర్చులు చెల్లించాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నంటికీ కనీసం నెలకు ఒక్కో ఆస్పత్రికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అవసరముంటుంది. కానీ, నిధులు విడుదల కాపోవడంతో ఖర్చు పెట్టేవారు లేక ఆస్పత్రులు నిరాదరణకు గురవుతున్నాయి. అయితే, జిల్లాలోని కొన్ని పీహెచ్సీలకు రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో పీఎం జన్మన్ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. పీఎం జన్మన్ వైద్యులకే సరిగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు నిర్వహణ ఖర్చులు భరించే పరిస్థితి ఉండదు. రెగ్యులర్ వైద్యులు ఎలాగైనా ఎంతో కొంత ఖర్చు చేస్తున్నప్పటికీ ఇతరులు ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.


