breaking news
Komaram Bheem
-
ముమ్మాటికీ కక్ష పూరితమే..
ఏపీలో కూటమి సర్కారు చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యలే. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం. – ఆర్.ప్రకాశ్రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొంతు నొక్కడం సరికాదుమంచిర్యాలటౌన్: వార్తలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలే గానీ, ఆయా జర్నలిస్టులపై కేసులను పెట్టడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్తోపాటు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతునొక్కడంను మా సంఘం ఖండిస్తుంది. – మిట్టపల్లి మధు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎస్) జిల్లా అధ్యక్షుడు -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ఆసిఫాబాద్: జిల్లాలో అగ్నిప్రమాదాల్లో ఆస్తులు బూడిదవుతున్నాయని, అగ్నిమాపక సి బ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం లేదని గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఫైర్.. ఫెయిల్!’ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్డ్రిల్తో వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, శరత్, రాము, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాతవారికే కిసాన్ సమ్మాన్
రెబ్బెన(ఆసిఫాబాద్): వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాల పరిమితి లేకుండా రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థికసాయం అందిస్తోంది. 2019లో పథకాన్ని ప్రారంభించగా. ఆ సమయంలో నమోదైన రైతులకే పథకం వర్తిస్తోంది. ఆ తర్వాత పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరడం లేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా భూమిని పొందిన వారు, ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేసి కొత్త పట్టాలు పొందిన వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో కొత్త రైతులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పథకంలో చేర్చడం లేదు.తగ్గుతున్న అర్హుల సంఖ్య..2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు, విదేశాల్లో నివాసం ఉండే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ప్రారంభంలో భూపరిమితిని విధించి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా రూ.6వేల సాయాన్ని మూడు విడతల్లో అందించారు. ఏడాది గడిచాక భూ పరిమితిని తొలగించి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేసింది. పాత రైతులకే తప్ప కొత్తవారికి ఈ పథకంలో అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా వేలాదిమంది కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతున్నారు. కొత్తవారికి అవకాశం లేకపోవడంతో క్రమంగా అర్హుల సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర పరిశీలనలో మరణించిన రైతుల పేర్లు తొలగింపు, భూముల అమ్మకాలు, కుటుంబ సభ్యుల పేరిట భూములను విరాసిత్ చేయడంతో రైతుల సంఖ్య తగ్గింది. ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరడం, ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు.. ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వివరాలు బహిర్గతం కావడంతో వారికీ పథకం నిలిపివేసింది. పథకం ప్రారంభంలో దాదాపు 68వేల మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందగా, కొన్నినెలల క్రితం కేంద్రం విడుదల చేసిన 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో జిల్లాలో అర్హులైన రైతుల సంఖ్య 33,369కి తగ్గింది. ఆరేళ్లలో అర్హుల సంఖ్య సగానికి పడిపోయింది.చిన్న, సన్నకారు రైతులకు మేలుపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు కలుగుతోంది. అయితే ఈ పథకంలో కొత్తగా పట్టా పాసుపుస్తకాలు అందుకున్న వారికి చోటు కల్పించకపోవడంతో వేలాది మంది ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 1,42,155 మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 33,369 మందికే కిసాన్ సమ్మాన్ ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతోంది. అర్హులు కూడా పెట్టుబడి కోసం అప్పులపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా(రైతుబంధు) పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతుల వివరాల నమోదుకు నిర్దిష్టమైన తేదీని నిర్ణయించాయి. అప్పటివరకు పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త రైతును కూడా కిసాన్ సమ్మాన్లో చేర్చలేదు.ఉత్తర్వులు వస్తే నమోదు చేస్తాంకేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కొత్తగా పట్టా పాస్పుస్తకాలు పొందిన రైతుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. గతంలో నమోదైన వారికి మాత్రమే ఏడాదికి రూ.6వేల నగదును మూడు విడతల్లో అందిస్తోంది. కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వస్తే తప్పకుండా పేర్లు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి -
సందర్శించి.. పరిశీలించి
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం గిరి జనశాఖ డీడీ రమాదేవి సందర్శించారు. తరగతి గదులు, వంట గదులను పరిశీలించి వి ద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీఆర్టీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. అంతకు ముందు పాటగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. త్వరలో పాఠశాల భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎంపీడీవో అంజద్పాషా, హెచ్ఎం పంచఫుల పాల్గొన్నారు. -
విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
కాగజ్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని అదనపు కలెక్ట ర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. కాగజ్నగర్ మండలం అనుకోడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో ఫౌండేషనల్ లెటర్స్ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక పద్ధతులు అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పర్శ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో రైతులకు యూరియా పకడ్బందీగా పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో గురువారం వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన పంట నష్టంపై సర్వే సక్రమంగా చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు అందాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. త్వరలో జిల్లాకు వచ్చే యూరియా పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించాలన్నారు. సమావేశంలో డీఏవో శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకట్, మనోహర్, మిలింద్కుమార్ పాల్గొన్నారు. మెరుగైన సేవలకు వైద్యుల నియామకంజిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యుల నియామక ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. తెలంగాణ వైద్య వి ధాన పరిషత్ పరిధిలోని జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్), ఎంబీబీఎస్ పోస్టుల భర్తీ కోసం గురువారం కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు. 15 మంది హాజరు కాగా, ఇద్దరు స్పెషలిస్టులు, 11 మంది ఎంబీబీఎస్ వైద్యులను ఎంపిక చేశామన్నారు. -
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్అర్బన్: విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ ఉద్యోగుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ టిబ్రేవాల్ అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని అట వీశాఖ కార్యాలయంలో అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏటా అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో షేక్ హైదర్, గౌస్ మొహినొద్దీన్, కొండల్రావు, శ్రీహరి అనే అటవీ అధికారులు వివిధ ఘటనల్లో మృతి చెందారని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలో దాదాపు 32 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, రేంజ్ అధికారి ఝాన్సీ రాణి, ఏవో వెంకటకృష్ణ, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసులు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదు. కథనాలపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ కోరాలి. కానీ అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి సాక్షి ఎడిటర్పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేనిపక్షంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉద్యమిస్తాం. – అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు -
యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం
రెబ్బెన(ఆసిఫాబాద్): యూరియా కోసం రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. అధికారులు మాత్రం పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టోకెన్లు ఉన్నవారికి కాకుండా బస్తాలను దాచిఉంచి దొంగచాటున అధికార పార్టీ నాయకులకు అందించారని గురువారం రెబ్బెన పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఇన్చార్జి సీఈవో శేషారావును నిలదీశారు. 43 బస్తాలు తరలింపురెబ్బెన పీఏసీఎస్కు ఇటీవల లారీ లోడ్ యూరియా రాగా వ్యవసాయశాఖ అధి కారులు రైతులకు టోకెన్లు జారీ చేశారు. బస్తాలన్నింటినీ పంపిణీ చేయకుండా 43 బస్తాలు మిగిలించారు. రెండు రోజుల్లో మరో లోడ్ రానుందని, వాటితో కలిిపి ఈ 43 బస్తాలను అందిస్తామని అన్నదాతలకు చెప్పి పంపించారు. అయితే మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి గోడౌన్లోని 43 యూరియా బస్తాలను గురువారం ఉదయ మే గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. దానికి పీఏసీఎస్ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించిట్లు తెలుస్తోంది. నలుగురు నాయకులు పది బస్తాల చొప్పున, మరో పార్టీ నాయకుడు 3 బస్తాలు తీసుకెళ్లారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారిని పక్కనపెట్టి నాయకులకు అందించడంపై పీఏసీఎస్ వద్ద రైతులు సీఈవోను నిలదీశారు. బస్తాలను తిరిగి తెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పీఏసీ ఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ రైతులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. నాయకులపై పోలీసులకు ఫిర్యాదుపీఏసీఎస్ గోడౌన్లో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను బెదిరించి తీసుకెళ్లిన నాయకులపై సీఈవో శేషారావు ఎస్సై చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం కార్యాలయం తెరవక ముందే అటెండర్ తిరుపతితోపాటు తనను మండలానికి చెందిన నలుగురు నాయకులు బస్తాలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నాయకులు తీసుకెళ్లిన బస్తాల్లో 23 బస్తాలు పీవోఎస్లో ఎంట్రీ చేసినవి ఉండగా, మిగిలిన బస్తాలు ఎంట్రీ లేకుండానే బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిపారు. సక్రమంగా పంపిణీ చేయాలిరైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్ డిమాండ్ చేశారు. రెబ్బెన పీఏసీఎస్ ఎదుట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ సిబ్బందిని బెదిరించి 43 బస్తాలు తీసుకెళ్లడం సిగ్గు చేటన్నారు. కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, నాయకులు పందిర్ల మధునయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి సీఈవో శేషారావు సస్పెన్షన్రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్లో ఇన్చార్జి సీఈవోగా పనిచేస్తున్న శేషారావును సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్కు సరాఫరా అయిన యూరియా బస్తాల పంపిణీలో శేషారావు అలసత్వం ప్రదర్శించడంతోపాటు గోడౌన్లో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను పీవోఎస్ యంత్రంలో నమోదు చేయకుండానే గురువారం గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన ఫిర్యా దు మేరకు శేషారావును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో దహెగాం పీఏసీఎస్లో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.జీవన్కుమార్కు ఇన్చార్జి సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో ఈ నెల 8న ప్రచురితమైన ‘రెచ్చిపోతున్న ఇసుకాసురులు’ అనే కథనానికి అధికారులు స్పందించారు. రెబ్బెన మండలం పులికుంట వాగు నుంచి ఎలాంటి ప్రభు త్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ ఏడీ గంగాధర్, ఎంవీఐ మోహన్ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లతో పా టు సరైన ధ్రువపత్రాలు లేని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పదోన్నతితో ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ అన్నారు. జోడేఘాట్ రేంజ్ ఎఫ్బీవోగా విధులు నిర్వర్తించి ఎఫ్ఎస్వోగా పదోన్నతి పొందిన స్వప్నకు జిల్లా కేంద్రంలో బుధవారం పదోన్నతి చిహ్నం అందించారు. ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి ఒక డీఆర్వో, ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు జిల్లాకు వచ్చారని తెలిపా రు. అలాగే జిల్లాలో ఒక సెక్షన్ అధికారికి పదోన్నతి లభించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారులకు టీకా తప్పనిసరి
● డీఎంహెచ్వో సీతారాం కెరమెరి(ఆసిఫాబాద్): రెండేళ్లలోపు చిన్నారులకు టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. మండలంలో ని చౌపన్గూడ గ్రామంలో బుధవారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వ్యాధుల నివారణకు చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించారు. రూ.5వేల విలువైన రక్త పరీక్షలు ప్రాథమిక కేంద్రాల్లో ఉచితంగా చేస్తారని, రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందుతాయని, మురుగునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. బాలింతలు, గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంవో శ్యాంలాల్, సీహెచ్వో సంపత్, హెచ్ఈవో సోము, సూపర్వైజర్ సంపూర్ణ, ఏఎన్ఎం వందన, హెచ్ఏలు వసంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ స్ఫూర్తితో అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి గా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఐలమ్మ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్, ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కడతల మల్లయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి ఆసిఫాబాద్రూరల్: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు వలలు, టార్చ్ లైట్లు, బోట్లు, పెట్టేలు, ఇతర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ సీఈవో రాజేంద్రబాబు పాల్గొన్నారు. పాఠశాలలకు ప్రొజెక్టర్లు అందజేత జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో పది పాఠశాలలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రొజెక్టర్లు పంపిణీ చేశారు. గత సంవత్సరం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెట్ సంస్థ సైన్స్ ల్యాబ్ వాహనం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఫైర్.. ఫెయిల్..!
ఆసిఫాబాద్: అగ్నిప్రమాదాల్లో రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే సేవలందుతుండగా, మారుమూల గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ సకాలంలో చేరుకోకపోవడంతో ఆస్తులు కాలిబూడిదవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, సరిపడా సిబ్బంది లేకపోవడంతో సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో 15 మండలాలకు ఒకే అగ్నిమాపక కేంద్రం ఉండగా, కాగజ్నగర్లో మరొకటి ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రం పరిధిలో 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణితోపాటు ఏజెన్సీ మండలాలు ఉండగా, కాగజ్నగర్ కేంద్రం ద్వారా కాగజ్నగర్, బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, దహెగాం, సిర్పూర్(టి) మండలాలకు సేవలందిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి కావడంతో వివిధ ప్రాంతాల్లో సుమారు 30 వరకు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. గత ఐదేళ్లలో జిల్లాలో 164 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోగా.. రూ.2,10,28,800 ఆస్తి నష్టం వాటిల్లింది. ఒకరు మృతి చెందారు.శిథిలావస్థలో భవనాలుజిల్లా కేంద్రంలో 1984లో అగ్నిమాపక కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వివేకానంద చౌక్ సమీపంలోని పాత గ్రామ పంచాయతీలో కార్యాలయం కొనసాగగా, అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట స్థలం కేటాయించి కొత్త కార్యాలయం నిర్మించారు. దశాబ్దాలు గడుస్తుండటంతో ఈ భవనం ప్రసుత్తం శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. మరోవైపు కాగజ్నగర్ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయానికి సొంత భవనం లేదు. ఈజ్గాం రహదారిపై పాత నవోదయ భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం కొత్తగా ఆస్పత్రులు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, పరిశ్రమలతోపాటు అనేక ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ నిర్మాణ సమయంలో యజమానులు సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు సంబంధిత శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతజిల్లా కేంద్రంలోని అగ్ని మాపక కేంద్రంలో 16 మంది సిబ్బందికి ప్రస్తుతం 10 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఐదు ఫైర్మెన్లు, ఒక ఫైర్ ఫిట్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో రెండు అగ్నిమాపక వాహనాలతో పాటు ఒక రెస్క్యూ వాహనం ఉంది. కాగజ్నగర్లో ఒక అగ్నిమాపక వాహనం, బుల్లెట్ బైక్ ఉంది. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బు ల్లెట్ బైక్పై వెళ్లి మంటలార్పుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. శీతాకాలం, వేసవిలో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.సర్వం కోల్పోతున్నాంలింగాపూర్ మండలంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆసిఫాబాద్ లేదా ఉట్నూర్, ఆదిలాబాద్ నుంచి ఫైరింజన్ రావాలి. అగ్నిప్రమాదాల్లో సర్వం కోల్పోతున్నాం. గతేడాది మామిడిపల్లిలో షార్ట్ సర్క్యూట్తో రైతు తెలంగ్రావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పత్తితీత పనులు ప్రారంభమైతే ఇంట్లోనే నిల్వ చేసుకుంటారు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. – జాటోత్ రాహుల్, లింగాపూర్సిబ్బంది కొరత ఉందిజిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో సిబ్బంది కొరత ఉంది. భవనం శిథిలావస్థకు చేరింది. జిల్లాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే 87126 99190, 87126 99191 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్తున్నాం. – కార్తీక్, ఫైర్ అధికారి, ఆసిఫాబాద్ -
డిజిటల్ తరగతులతో నాణ్యమైన విద్య
కాగజ్నగర్టౌన్: విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్య అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నా రు. కాగజ్నగర్ పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ పెట్రోల్ పంప్ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించాలన్నారు. పఠనంపై ఆసక్తి కలిగేలా పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలను అరగంట పాటు గట్టిగా చదవడం అలవాటు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలోని మంచినీటి సదుపాయం, వంటగదులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, పెంచికల్పేట్ ఎంఈవో తోట రమేశ్బాబు, ప్రధానోపాధ్యాయుడు వెంకట రాజయ్య, ప్రమీలదేవి, పర్శ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్ స్టేషన్ పరిశీలించిన డీఆర్ఎం
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ డీఆర్ఎం ఆర్.గోపాలకృష్ణన్ పరిశీలించారు. వందేభారత్ రైలు హాల్టింగ్ కోసం స్టేషన్లోని సౌకర్యాలపై ఆరా తీశారు. ప్లాట్ఫాం నం.1లో ప్రయాణికుల కుర్చీల ఎత్తు పెంచాలని సూచించారు. అ డ్డంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. క్యాంటీన్ పక్క నుంచే వెళ్లే ఫ్లై ఓవర్ వంతెనకు పరదాలు ఏర్పాటు చేసి, దుమ్ము రాకుండా చూడాలన్నారు. అనంతరం డీఆర్ఎంను రైల్వే యాత్రి సేవా సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. రైల్వే యాత్రి సమితి అధ్యక్షుడు ప్రయాగ్ తివారి మాట్లాడుతూ వందేభారత్ రైలు హాల్టింగ్ ఇవ్వడం అభినందనీయమన్నారు. తమిళనాడు, కేరళ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సైతం హాల్టింగ్ ఇవ్వాలని డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని వినతి కాగజ్నగర్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగుల మహిళలు డీఆర్ఎంకు సమస్యలు విన్నవించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, వ ర్షాలకు వరద వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదన్నా రు. రాత్రిపూట పోలీసు సెక్యూరిటీ కల్పించాలని కో రారు. విడతలవారీగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్డీఎం హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్కుమార్, డీవోఎం సురేశ్, డీసీఎం సఫాలీ, పీఆర్వో పవన్ బల్దేవ్, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని డయాలసిస్ కేంద్రాన్ని విస్తరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో కలిశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన 90 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల డయాలసిస్ కేంద్రంలో ఐదు పడకలు మాత్రమే ఉన్నాయని, దీనిని 10 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సిర్పూర్ మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ ఉన్నారు. కూరగాయల సాగుతో లాభాలుకెరమెరి(ఆసిఫాబాద్): రైతులు తమకున్న సాగు భూమిలో కొంతస్థలంలో కూరగాయలు సాగుచేసిలాభాలు సాధించవచ్చని బెల్లంపల్లి ఉద్యానవన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి అన్నారు. మండలంలోని పెద్దసాకడ గ్రామంలో బుధవారం చిక్కుడు సాగులో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంట సాగు, అధిక వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఆత్రం బల్లార్ షా సాగు చేస్తున్న వంకాయ తోటను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, రైతులు కేంద్రె బాలాజీ, కుమురం న్యానేశ్వర్, ఆడ రాంచందర్ తదితరులు ఉన్నారు. -
లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్సు) కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డితో కలిసి బుధవారం ఖైరిగూర ఓసీపీని సందర్శించారు. ఓసీపీ వద్ద పనిస్థలాలు తనిఖీ చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖైరిగూర ఓసీపీ వెళ్లే మార్గమధ్యలోని పావురాల గుట్ట వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా చేపట్టే గోలేటి ఓసీపీ పనుల పురోగతిని సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పీవో మచ్చగిరి నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, డీజీఎం సివిల్ ఎస్కే మదీనాబాషా, మేనేజర్ శంకర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
‘ఉత్తమ’ టీచర్లకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: జిల్లా ఉత్తమ టీచర్లుగా ఎంపికై న 55 మంది ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బుధవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి సన్మానించారు. ముందుగా మాజీ ఉ ప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి శాలువాలతో సన్మానించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్, డీటీడీవో రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎస్వోలు శ్రీనివాస్, మధుకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
‘అడ’కు తాత్కాలిక మరమ్మతులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రధానమైన కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆనకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.43 లక్షలు మంజూరు చేసింది. ప్రమాదకరంగా ఉన్న 200 మీటర్ల మేర కట్టపై పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. బీటలువారి.. ప్రమాదకరంగా మారి రూ.882 కోట్ల అంచనాలతో ఆసిఫాబాద్ మండలంలో కుమురంభీం ప్రాజెక్టును నిర్మించారు. 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో 45,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రాజెక్టు 2011లో పూర్తికాగా, కొన్నేళ్లకే ఆనకట్టపై పగుళ్లు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోకుండా నాలుగు సంవత్సరాల నుంచి ఆనకట్టపై కవర్లు కప్పి ఉంచుతున్నారు. ఆనకట్ట ఎత్తు 45 మీటర్లు కాగా, ప్రస్తుతం పైభాగం నుంచి రెండు, మూడు మీటర్ల లోతు వరకు పగుళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43 లక్షల నిధులు కేటాయించింది. బీటలువారిన 200 మీటర్ల పొడవు మేర ఆనకట్టపై మూడు మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించి మళ్లీ గ్రావెల్తో నింపుతామని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మరిన్ని నిధులు కావాల్సిందే.. అడ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.688 టీఎంసీలు మాత్రం నిల్వ ఉంచుతున్నారు. డెడ్ స్టోరేజీ 1.423 టీఎంసీలు. మిగిలిన నీటినే సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బుధవారం ఇన్ఫ్లో 683 క్యూసెక్కులు ఉండగా ఒక గేటును 0.3 మీటర్లు పైకెత్తి 629 క్యూసెక్కులు కిందికి వదులు తున్నారు. 38 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ నీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.19 కోట్లు అవసరమని మూడేళ్ల క్రితం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నేటి వరకు నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం వ చ్చిన నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనుండగా, కాలువల పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. మరిన్ని నిధులు ఇస్తేనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందని రైతులు చెబుతున్నారు. మిగిలిన ప్రాజెక్టులూ అంతే.. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయి. ప్రధానమైన ప్రాజెక్టులు వట్టివాగు, జగన్నాథ్పూర్ తదితర ప్రాజెక్టులు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం లేదు. పుష్కలంగా నీరున్నా కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల ద్వారా కేవలం 10 శాతం మాత్రమే సాగు నీరందుతుంది. జిల్లాలో చాలా మంది రైతులు ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు.200 మీటర్ల మేర..కుమురంభీం ప్రాజెక్టు ఆనకట్ట తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43లక్షలు మంజూరు చేసింది. దెబ్బతిన్న 200 మీటర్ల మేర ఆనకట్టపై పనులు చేపడతాం. వర్షాకాలం పూర్తయిన తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తాం. – గుణవంతరావు, ఇరిగేషన్ ఈఈ -
తప్పనిసరిగా నిర్వహించాలి
ప్రతీ పాఠశాలలో తప్పని సరిగా అరగంట పఠన కార్యక్రమం నిర్వహించా లి. విద్యార్థుల్లో సృజనా త్మకత, భావవ్యక్తీకరణ, చదవడంపై మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. దీని ద్వారా చదవడం అలవాటుగా మా రుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలి. – శ్రీనివాస్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యార్థులతో చదివిస్తున్నాం... మా పాఠశాలలోని విద్యార్థులతో కథల పుస్తకాలు, న్యూస్ పేపర్లు 30 నుంచి 40 నిమిషాలపాటు చదివిస్తున్నాం. దీని ద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో కనీస అభ్యసన స్థాయి పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. – అడ్లూరి లావణ్య, ఉపాధ్యాయురాలు, రెబ్బెన -
పుస్తకం చదువుదాం రండి!
ఆసిఫాబాద్రూరల్: జైనూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకం చదవలేకపోవడంతో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదవడంలో వెనుకబడిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష రూం టు రీడ్ ఇండియా ట్రస్ట్ సహకారంతో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిరోజూ పుస్తక పఠనానికి అరగంట కేటాయిస్తున్నారు. చదవడంపై ఆసక్తి కలిగించేలా ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పాఠశాలల్లో గ్రంథాలయాలు..జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉండగా, 39,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో ఉపాధ్యాయులు రోజుకో అరగంట సమయం పఠనానికి సమయం కేటాయిస్తున్నారు. విద్యార్థులకు వార్త పత్రికలతోపాటు కథల పుస్తకాలు, ఇతర సాహిత్యం, జీవిత చరిత్ర వంటి పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. రూమ్ టు రీడ్ ఇండియా సహకారంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు గ్రంథాలయాల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తి పెంచాలి. పాఠశాల, గ్రామస్థాయిలో కథల రచన పోటీలు నిర్వహించాలి. సృజనాత్మకత పెంచేందుకు..పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకతతో చదవ డం, రాయడం వస్తే విద్యార్థులు చదువులో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. సాహిత్య, కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇది మేథో సామర్థ్యాన్ని పెంచడంలోనూ తోడ్పడుతుంది. విద్యార్థుల్లో విషయ అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలని, అరగంటపాటు విద్యార్థులతో నచ్చిన పుస్తకాలు చదివించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. -
35శాతం లాభాల వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో మాట్లాడారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు వెంటనే ప్రకటించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిలో తిరిగి తీసుకువచ్చిన మెడికల్ బోర్డును మార్చి నుంచి నిలి పివేసినా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభుత్వ సంఘంగా చెప్పుకునే ఐఎన్టీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. కాంట్రాక్టు కా ర్మికులకు లాభాల నుంచి వాటా రూ.20వేలకు పెంచాలన్నారు. ఇప్పటికై నా కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరి యా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రావు, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్, ఏరియా కార్యదర్శులు సంపత్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, శ్రీనివాస్, వెంకన్న, మురళీకృష్ణ, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
బురద రోడ్డు.. దిగబడిన బస్సు
టీఎస్ఎస్ కళాకారుల జిల్లా కార్యవర్గం ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం పౌర సంబంధాల అధికారి వై.సంపత్కుమార్ అధ్యక్షతన తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుడిసెల బాపురావు, గౌరవ అధ్యక్షుడిగా మోహన్నాయక్, ఉపాధ్యక్షురాలిగా వెన్నెల, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం, కోశాధికారిగా సోమశేఖర్, సహాయ కార్యదర్శిగా శిరీషను ఎన్నుకున్నారు. డీపీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: యూరియా బస్తాలు ఇవ్వడం లేదని కాగజ్నగర్లోని భట్టుపల్లి చౌరస్తా వద్ద రైతులు మంగళవారం రాస్తారోకో చేశారు. ప్రభుత్వం తగినంత పంపిణీ చేయడం లేదని, అలాగే అధికా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించా రు. టోకెన్లు పంపిణీ చేసి బస్తాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. వ్యవసాయ పనులను వదులు కుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఆందోళన చేసిన ప్రతీసారి రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. ఏవో రామకృష్ణ స్పందించి.. రెండు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. నాయకులు పొన్న రమేశ్, ముజామిలుద్దీన్ అహ్మద్ మద్దతు తెలిపారు. -
కాళోజీ జీవితం ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందిరికి ఆదర్శం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని, స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ సేవకుడు, సంఘ సంస్కర్త, తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ(ఎంటీ) అంజన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. 13న జాతీయ లోక్ అదాలత్ఆసిఫాబాద్, సిర్పూర్(టి) కోర్టుల్లో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలి పారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనం, డ్రంకెన్ డ్రైవ్, ఇతర కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారలు, నేరస్తులు సంబంధిత పోలీస్ స్టేషన్, కోర్టు కానిస్టేబుల్ను సంప్రదించాలని సూచించారు. -
కాళోజీ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి నిర్వహించారు. ఎస్పీ కాంతిలాల్పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఎదుర్కొన్న కష్టాలను కాళోజీ నవలల ద్వారా తెలియజేశారన్నారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మొదళ్లకు కదలిక తీసుకొస్తుందని చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీటీవో రాంచందర్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలిజిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి నదులు, వాగులు, చెక్డ్యాములు, ప్రాజెక్టులు, చెరువుల్లో ఇసుక లభ్యతపై రెవెన్యూ గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల శాఖ, అటవీశాఖ, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయికి వెళ్లి అంచనాలు రూపొందించి ఈ నెల 20లోగా నివేదికలు సమర్పించాలన్నారు. వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా సర్వే కమిటీ నివేదికను టీజీఎండీసీ పంపిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని తెలిపారు. జైనూర్లో సాండ్ బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గనుల శాఖ ఏడీ గంగాధర్, ఇరిగేషన్ ఈఈ గుణవంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. ఏరియాలోని ఖైరగూర ఓసీపీ వద్ద రక్షణ, ప్రథమ చికిత్సపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ఇటీవల బెల్లంపల్లి ఏరియాకు ప్రథమ చికిత్సలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి, రక్షణలో గ్రూప్ త్రీలో ప్రథమ బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో బహుమతులు ప్రదర్శించారు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రక్షణ పరికరాలు ధరించకుండా పనులు చేయడం ప్రమాదమని పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై ప్రతీ ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఖైరగూర ఓసీపీకి బహుమతులు రావడంపై అధికారులు, ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, పీవో మచ్చగిరి నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేశ్రెడ్డి, సంక్షేమ అధికారి రజినికుమార్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాలినడకన వెళ్లి.. సూచనలు చేసి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం డొంగర్గాం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో సీతారాం పరిశీలించారు. ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో దొడ్డిగూడ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు గుట్ట ప్రాంతం గుండా సిబ్బందితో నడుచుకుంటూ వెళ్లారు. గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలు వ్యాపించకుండా నిల్వ నీటిని తొలగించాలన్నారు. గర్భిణులు, బాలింతలు సకాలంలో టీకాలు తీసుకుంటే తల్లీబిడ్డకు అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీంచి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పైరవీలు లేకుండా పోలీసుల సేవలు వినియోగించుకుంటూ, సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దుఆన్లైన్ ఆఫర్లు, వివిధ ప్రకటనల పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్, లింక్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్ద ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఆన్లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్తో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి లింక్స్ ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని, మోసపూరిత లింక్స్ గుర్తిస్తే 1930కు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాల నియంత్రణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, ప్రజలు మోసాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: సమాజంలో ప్రతీఒక్కరికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లాస్థాయి వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఐక్యత, సామాజిక బాధ్యత, విద్య ప్రాముఖ్యతను అందరికీ వివరించాలన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో కాగజ్నగర్ మైనార్టీ గురుకులానికి చెందిన అద్నాన్, జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ చెందిన వైష్ణవి చిత్రలేఖన పోటీలు, సాహితి స్లోగన్లో ప్రథమ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాళ్లు మహేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రికి సమస్యను వివరించారు. లక్ష్మి మృతి చెందిన సమయంలో ఉన్నతాధికారులు కొంత నగదుతోపాటు ఐదెకరాల సాగుభూమి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోతుల శ్రీనివాస్, మృతురాలి కుటుంబ సభ్యులు వసంతరావు, విమల, వాసుదేవ్ ఉన్నారు. -
పీజీసెట్లో 63వ ర్యాంకు
కాగజ్నగర్రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన బొమ్మళ్ల రాజయ్య, ఇందిర దంపతుల కు మారుడు ప్రవీణ్ సో మవారం విడుదలైన పీజీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విభాగంలో 63వ ర్యాంక్ సాధించాడు. స్వగ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివి 10 జీపీఏ సాధించాడు. ఇచ్చోడలోని టీజీ డబ్ల్యూఆర్జేసీలో ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని సిటి కళాశాలలో బీఎస్పీ పూర్తి చేశాడు. అనంతరం ఉచిత కోచింగ్ తీసుకుని పీజీ ప్రవేశ పరీక్షల్లో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో చదువుకుని ర్యాంక్ సాధించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ మండలం జంబుగకు చెందిన డోంగ్రి రాంబాయి తన తండ్రి పేరుతో ఉన్న భూమిని వారసులమైన తమకు తెలియకుండా ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరింది. రెబ్బెన మండలం కొండపల్లికి చెందిన గుర్లె సత్తయ్య తమ గ్రామం నుంచి జాతీయ రహదారికి ఉన్న అప్రోచ్ రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరాడు. రేకుల ఇంటిలో నివాసం ఉంటున్న దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన రమేశ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ మంగ కోరింది. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన జాదవ్ రోహిణి విన్నవించింది. తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరిచేయాలని కాగజ్నగర్ మండలం భట్టుపల్లికి చెందిన చాపిడి మీరాబాయి అర్జీ సమర్పించింది. జైనూర్ మండలం బూసిమెట్ట క్యాంపునకు చెందిన వృద్ధులు తమకు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.బ్యాంకు రుణం ఇవ్వడం లేదు మేము జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెందిన లక్ష్మీ మహిళా సంఘం సభ్యులం. ఐదు నెలల క్రితం పాత రుణం బ్యాంకులో చెల్లించాం. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ ఏడాది మళ్లీ బ్యాంకు రుణం ఇవ్వలేదు. అధికారులు వెంటనే రుణం మంజూరు చేయాలి. – రాజంపేట మహిళలు, మం.ఆసిఫాబాద్ -
రేపు ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న ప్రాదేశిక ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 6న ముసాయిదా జాబితా ప్రదర్శించామని, అభ్యంతరాలు పరిశీలించి 10న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలిభూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, భూకొలతల అధికారి సోమేశ్వర్ రావుతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, పోర్టల్ ద్వారా ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పదిరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేసి, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారికి పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి థామస్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఒంటరి మహిళలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అలాగే క్యాన్సర్, ఎయిడ్స్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.15వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. హామీ అమలు చేయకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. అలాగే ఎమ్మెల్యేల ఇళ్లు కూడా ముట్టడిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో ఇన్చార్జి మల్లేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్రావు, నాయకులు మూర్తి, శ్రీశైలం, విఠల్, మహేశ్, రాజయ్య, మల్లమ్మ, పెంటుబాయి, గోపాల్, మనోహర్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోలేటిలోని కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన సింగరేణి సేవా సమితి సమన్వయకర్త డీఎస్ శివకుమార్ సందర్శించారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి ద్వారా గోలేటిలో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మాదారంలో మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించారు. శిక్షణ పొందిన మహిళలు పరీక్షలకు హాజరయ్యారు. కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, సింగరేణి సేవా సమితి ఏరియా కోఆర్డినేటర్ అంజయ్య, శిక్షకులు శ్రీదేవి, రూప, శైలజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
యూరియా వెతలు
రెబ్బెన/కాగజ్నగర్రూరల్: యూరియా కోసం జిల్లా రైతుల వెతలు తీరడం లేదు. ఎరువులు వేసే అదును దాటిపోతుండటంతో అన్నదాతలు వ్యవసాయ సహకార సంఘాల కార్యాయాల ఎదుట బారులుదీరుతున్నారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్కు వచ్చిన యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా సోమవారం అధికారులు కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 40 నిమిషాలపాటు రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలకు మూడో దఫా మందులు వేయాల్సి ఉండగా యూరియా కోసం పీఏసీఎస్కు వచ్చామన్నారు. టోకెన్లు ఉన్నప్పటికీ యూరియా అందించకుండా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను వదిలేసి.. బస్తాల కోసం రోజుల తరబడి పీఏసీఎస్ చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. విషయం తెలుసుకున్న సీఐ సంజయ్ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్దిచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగజ్నగర్లో ఆందోళనయూరియా కోసం టోకెన్లు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు సోమవారం కాగజ్నగర్లో ఆందోళనకు దిగారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టోకెన్లు జూలై, ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు బస్తాలు అందించలేదని ఆరోపించారు. సుమారు గంట వరకు ఆందోళన కొనసాగించారు. ‘ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు కష్టాలు’కాగజ్నగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు యూరియా కష్టాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కాగజ్నగర్ పట్టణంలో సోమవారం రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. జూలై, ఆగస్టులో టోకెన్లు ఇచ్చి ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు. పొలాల్లో పని చేసుకోవాల్సిన రైతులు రోడ్లు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతున్నారన్నారు. సరిపడా అందుబాటులో ఉంటే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు యూరియా బస్తా ఒకటి రూ.700 చొప్పున బ్లాక్లో అమ్ముకుంటూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. లారీలు వచ్చినా బయోమెట్రిక్ మిషన్లు లేవనే కారణంతో యూరియా ఇవ్వడంలేదని, ఈ విషయాన్ని ఆయన జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులతో మాట్లాడారు. దీంతో యూరియా బస్తాలను రైతులకు అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లెండుగురె శ్యామ్రావు, కొంగ సత్యనారాయణ, మండల కన్వీనర్ అంజన్న, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐ కాళ్లపై పడిన రైతు
పంటలకు కావాల్సిన యూరియా బస్తాలు అందించేలా చూడాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన ఓ రైతు సీఐ సంజయ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తుండగా అక్కడికి సీఐ సంజయ్ వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని, వెంటనే యూరియా ఇచ్చేలా చూడాలని రైతు సీఐ కాళ్లపై పడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది అతడిని పైకి లేపారు. పీఏసీఎస్కు వచ్చిన ఒక్క లారీ లోడు యూరియా టోకెన్లు ఉన్నవారిలో సగం మందికి కూడా సరిపోలేదు. -
లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు
ఆసిఫాబాద్: మహిళలపై లైంగిక వేధింపులు నిరో దించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పని ప్రదేశాలు, సమాజంలో మహిళలపై ఎదురయ్యే లైంగిక వేధిపుల నిరోధానికి పోష్ యాక్ట్ 2013 అమలు చేస్తూ గౌరవంగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బాధితులు కమిటీలో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సమన్వయకర్త శారద, డాక్టర్ అనూషరాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఎన్సీడీ ప్రోగ్రాంలో ఆన్లైన్ ప నుల నుంచి విముక్తి కల్పించాలని జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్ మాట్లాడుతూ పదేళ్లుగా ఏఎన్ఎంలు ఎన్సీడీ ఆన్లైన్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుకు 12 గంటల పాటు విధుల్లో ఉండటంతో వారిపై పనిభారం పడుతుందని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్సీడీ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎంలకు విముక్తి కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, ఏఎన్ఎంలు సునీత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకా లు సాధించారని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియ ర్ యోగాసన పోటీల్లో కాగజ్నగర్లోని ఫాతి మా కాన్వెంట్ హైస్కూల్కు చెందిన ఆరో తరగతి విద్యార్థి సీహెచ్ శ్రీయాన్ సుపైన్ ఫోజు విభాగంలో బంగారు పతకం సాధించగా, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో కౌటాల జెడ్పీ హై స్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థి అఖిల్సింగ్ వెండి పతకం సాధించారన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు. శ్రీయాన్, అఖిల్సింగ్ను తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కోచ్ ఏడుకొండ అభినందించారు. -
జీపీవోలు వచ్చేశారు..!
ఆసిఫాబాద్: గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసేందుకు 59 మంది గ్రామ పాలనాధికారులను నియమించింది. గ్రామస్థాయిలోని వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగులనే తాజాగా జీపీవోలుగా తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆసక్తి గల ఉద్యోగులకు అర్హత పరీక్షలు నిర్వహించగా, ఉత్తీర్ణులైన వారిని ఒక్కో క్లస్టర్కు ఒకరు చొప్పున నియమించనున్నారు. ఈ నెల 6న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి ఎంపికై న గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా, జిల్లా నుంచి 52 మంది, మంచిర్యాల నుంచి ఏడుగురిని కేటాయించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 16 మంది ఉద్యోగులు కూడా ఎంపికయ్యారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పర్యవేక్షణలో జిల్లా నుంచి 52 మంది హైదరాబాద్కు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లి హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్నారు. త్వరలో వీరికి పోస్టింగ్ ఇవ్వకున్నారు. ఇక నుంచి జీపీవోలు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా మారనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా ప్రతీ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లో వీరు సహాయకారిగా పని చేయనున్నారు. పల్లెల్లో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై విచారణ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూముతోపాటు పరిపాలన వ్యవహరాలన్నీ వీరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ కేడర్లో జీపీవో పోస్టులను సృష్టించగా, వీరు 11 రకాల జాబ్చార్ట్ అనుసరించనున్నారు. జిల్లాకు 59 మంది.. జిల్లాకు 59 మంది గ్రామ రెవెన్యూ అధికారులను కేటాయించారు. వీరిలో 52 మంది కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల నుంచి ఏడుగురు నియామకమయ్యారు. వీరికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్పకడ్బందీగా విధులు నిర్వహిస్తా ఏడాదిగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. జీపీవో నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాసి ఎంపికయ్యాను. గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంతో పాటు భూభారతి చట్టం అమలుకు కృషి చేస్తా. గ్రామ పాలనాధికారిగా పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తా. – రాజు, జీపీవో, భూపాల్పల్లివిధులు ఇవే..గ్రామస్థాయిలో భూ ఖాతా నిర్వహణ, పహా ణిల నమోదు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ తోపాటు అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పులు చేర్పులు గ్రామ పాలనాధికారులే చేపట్టనున్నారు. వక్ఫ్బోర్డు, అసైన్డ్, దేవాదా య, లావణి భూముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద భూ ముల పరిరక్షణ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే చర్యలకు సహకరిస్తారు. భూ ముల ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పు ల నమోదు. దరఖాస్తుదారులకు భూసర్వే సేవలు, ప్రకృతి విపత్తులు జరిగితే నష్టంపై అంచనా, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా వారికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది. -
ఘనంగా భాద్రపద పౌర్ణమి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారతోపాటు ఖమాన గ్రామంలోని నాగ్సేన్ బుద్ధ విహారలో ఆదివారం భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువు భరద్వాజ్ ఆధ్వర్యంలో విహారాల్లో పూజలు చేశా రు. మహిళలకు అష్ట శీల్ ఉపోసత్ దీక్ష ప్రసాదించారు. మూడు నెలలపాటు నిర్వహించే వర్షవాస్ కాలంలో వచ్చే పౌర్ణమిలను ఎంతో పవిత్రంగా భావించి మహిళలు అష్టాంగ మా ర్గాలు పాటిస్తూ ఉంటారని తెలిపారు. రమాబాయి మహిళా మండలిలోని 30 మంది మహిళలు అష్టశీల్ ఉపోసత్ దీక్ష తీసుకున్నారు. భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, నాయకులు దుర్గాజీ, జయరాం ఉప్రె, శ్యాంరావు దుర్గె, పాండూజీ జాడె, కిషన్ ఖోబ్రగడె ఉన్నారు. -
‘జీఎస్టీ స్లాబ్ మార్పులతో ఊరట’
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ స్లాబ్ మార్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగిస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ సామాన్యులకు బీజేపీ ప్రభుత్వం వస్తుసేవలపై పన్ను(జీఎస్టీ)లో మార్పులు తీసుకురావడంతో నూనెలు, టీవీలు, ఆరోగ్య ఉత్పత్తులు, హెల్త్ ఇన్సురెన్స్ల వంటి వాటిపై జీఎస్టీ పన్నుభారం తగ్గుతుందన్నారు. ప్రధానంగా విద్యా సామగ్రిపై జీఎస్టీ 12 శాతం ఉండగా పూర్తిగా తొలగించిందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు కిరణ్, బేబీ, చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, మనోహర్గౌడ్, రమేశ్, అరుణ్లోయ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ప్రసవం
ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం అర్ధరాత్రి క్లిష్టమైన ప్రస వం చేశారు. వైద్యులు తెలి పిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలానికి చెందిన భీంబాయి శనివారం రాత్రి వాంకిడి ఆస్పత్రి నుంచి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యుడు సందేశ్ ఆధ్వర్యంలో డెలివరీ కోసం యత్నించారు. అయితే బ్రీచ్ ప్రజెంటేషన్(ఎదురుకాళ్లు) సమస్య ఎదురుకావడంతో మంచిర్యాలకు పంపించేందుకు నిర్ణయించారు. కానీ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయారు. ఆపరేషన్ చేయాల్సి ఉండగా క్లిష్టమైనా తీవ్రంగా శ్రమించి భీంబాయికి సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తర్వాత పాపను పరీక్షల కోసం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి పంపించారు. కీలకంగా వ్యవహరించిన నర్సింగ్ అధికారి కవ్వాల రజితకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఆఫ్రిన్, ఆసియా పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న ఇసుకాసురులు!
రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే దారిలోని పులికుంట వాగు వద్ద ఆదివారం కనిపించిన దృశ్యమిది. సెలవురోజున కూడా ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అనుమతి ఉన్నా నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో తరలించేందుకు వీలుండదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలో కొద్దిరోజులుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా దొరికిందే అదనుగా ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ రవాణా బహిరంగ రహస్యమే అయినా.. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా ‘మాములు‘గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు నెలవైన జిల్లా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు ఇసుక తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వర్షాలకు మేటలురెబ్బెన మండలం పులికుంట, లక్ష్మిపూర్, రాంపూర్, గంగాపూర్ వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని పెద్దవాగు, చీలాటిగూడ, భీంపూర్, తుంపెల్లి, చిర్రకుంట, కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి, పెద్దవాగుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నాణ్యమైన ఇసుక మేటలు వేసింది. దీనిని వ్యాపారంగా మలుచుకున్న కొంతమంది దళారులు సంబంధింత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వందల ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల వాగులోని వంతెన పిల్లర్లను ఆనుకుని తవ్వకాలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచిఉంది. గతంలో అడ్డూఅదుపు లేని ఇసుక తవ్వకాలతోనే కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి వంతెన పిల్లర్లు కుంగి బ్రిడ్జి కూలిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. సెలవు రోజుల్లో సైతం..జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. 6,736 ఇళ్లు మంజూరు కాగా, 2,420 ఇల్లు బేస్మెంట్ దశ దాటాయి. దీంతో జిల్లాలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. అధికారులు అడపాదడపా దాడులు చేస్తుండగా పలు ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. అయినా దళారులు పట్టించుకోకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పేరుతో లాభాల మత్తులో ఈ దందా కొనసాగిస్తున్నారు. గత వారం రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న పులికుంట వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా ఐదు ట్రాక్టర్లను స్థానిక తహసీల్దార్ పట్టుకున్నారు. వాటికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. అయినా మరుసటి రోజు నుంచే అక్కడ ఇసుక రవాణా యథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం. దందా నడుస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. అనుమతులు తప్పనిసరిఇసుక రవాణా కోసం సాధారణంగా రెవెన్యూ శాఖ నుంచి డీడీ రూపంలో నగదు చెల్లించి అనుమతి తీసుకోవాలి. ఒక వేళ సంబంధింత శాఖ నుంచి అనుమతి ఉన్నా అది కార్యాలయాల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణా చేయాలి. కానీ అక్రమార్కులు అవేమీ పట్టించుకోవడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచే మొదలుకుని అర్ధరాత్రి దాటినా దందా సాగిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఓ పార్టీకి చెందిన పెద్దస్థాయి వ్యక్తి అండదండలు ఉండటంతో అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ ఏడీ గంగధర్ను సంప్రదించగా ఆయన స్పందించలేదు. దందా అరికట్టడంలో అధికారులు విఫలం జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాను అరికట్టడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రంగా దాడులు చేస్తూ ఒకటి, రెండు ట్రాక్టర్లు పట్టుకుని చేతులు దులుపుకొంటున్నారు. – దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు -
పకడ్బందీ చర్యలు.. ప్రశాంత నిమజ్జనం
కౌటాల(సిర్పూర్): జిల్లాలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. గతేడాది కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు వద్ద నిమజ్జనం సమయంలో ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృషి సారించింది. పక్కా ప్రణాళికతో పది రోజుల ముందు నుంచే శాంతికమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు యువకులకు మండపాల ఏర్పాటుకు అనుమతులు, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మండపాల వద్ద మద్యం తాగడం, పేకాటడం, అసభ్యకరమైన నృత్యాలను నిషేధించారు. అలాగే అమాయకులు మోసపోతున్నారని గుర్తించి ఈ ఏడాది లక్కీలాటరీలపైనా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేసి వేడుకలు పూర్తి చేశారు. శోభాయాత్రలను ఎస్పీ కాంతిలాల్ పాటిల్తోపాటు ఏఎస్పీ చిత్తరంజన్ బైక్పై తిరుగుతూ రాత్రిపూట సైతం పర్యవేక్షించారు. వెయ్యికిపైగా విగ్రహాలుఈ ఏడాది జిల్లాలో వెయ్యికి పైగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో అధికార యంత్రాంగం నిమజ్జనానికి వాగుల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలో మొత్తం 1,026 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయగా.. చివరి మూడు రోజుల్లోనే 900కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు ప్రణాళిక ప్రకారం బ్లూకోల్డ్ సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్లతో గణపయ్య మండపం ఫొటో తీసి ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేశారు. గణేశ్ శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి నిరాకరించారు. అలజడులు జరగకుండా రెండు రోజులపాటు వైన్స్లను మూసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారు. ఉత్సవాల్లో ఎస్పీతో పాటు అదనపు ఏస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలు, 8 మంది సీఐలు, ముగ్గురు ఆర్ఐలు, 19 మంది ఎస్సైలు, ఆరుగురు ఆర్ఎస్సైలు, 295 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. కీలకమైన కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో నిమజ్జన ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు సైతం చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నిమజ్జన ప్రక్రియను ఆదివారం వేకువజాము వరకు విజయవంతంగా పూర్తిచేశారు. అందరి సహకారంతోనే.. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేశాం. క్షేత్రస్ధాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశాం. ఇదే స్ఫూర్తితో జిల్లావాసులు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సహకరించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ -
ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులకు నష్టం
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలోని పత్తి రైతులకు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యదర్శి రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు రవి, మల్లేశ్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పత్తి పంటపై 11 శాతం టారిఫ్ను సున్నకు తగ్గించడంతో దేశంలోని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా వంటి దేశాల నుంచి దేశానికి పత్తి పోటెత్తితే స్థానిక పంటకు సరైన ధర దక్కదన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్దిష్ట విధానం లేకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ సిబ్బంది వ్యవహారంపై ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ జిల్లాకు ప్రాణాధారమైన అడ ప్రాజక్టుకు మరమ్మతులు లేకపోవడంతో 45వేల ఎకరాలకు కనీసం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, కార్తీక్, రాజేందర్, ఆనంద్, టీకానంద్ పాల్గొన్నారు. -
ఆదివాసీ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలి
ఆసిఫాబాద్: ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరా లు న్విహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజ న సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు జ్వరాలతో మంచా న పడ్డారని, హాస్టల్ విద్యార్థులు కూడా జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, మెడికల్ షాపుల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తనుషా, నాయకులు సక్కు, మడావి నాగోరావు, తొడసం శంభు, నెర్పెల్లి అశోక్, కోట శ్రీనివాస్, మడావి గణపతి, టీకానంద్ పాల్గొన్నారు. -
ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: దుకాణాదారులు, హోటల్ ని ర్వాహకులు ఆహార భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ సర్టిఫైడ్ శిక్షకురాలు భార్గవి కంచర్ల సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్స్లో దు కాణాదారులు, హోటళ్ల నిర్వాహకులకు ఎంసీఈడీ (మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఆంత్రపెన్యూర్ షిప్ డెవలప్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన ఆహార రంగులు, ఉప్పు వి నియోగించవద్దని, మంచినూనెను మూడుసార్ల కంటే ఎక్కువగా మరిగించి వాడొవద్దని సూచించారు. హోటల్ నిర్వాహకులు, వంటి సిబ్బంది ఆర్నెళ్లకో సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపా రు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం–2006ను తె లుసుకోవాలని, ఆరోగ్యకర నూనెలు, పదార్థాలు వినియోగిస్తే మార్కెట్లో బిజినెస్ పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మహేందర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అ చ్యుత్కుమార్, సభ్యులు శ్రీనివాస్, విజయ్, మహే శ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ జిల్లా కార్యవర్గం
ఆసిఫాబాద్రూరల్: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో రాష్ట్ర కార్యదర్శి సదానందంగౌడ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా పుర్క మానిక్రావు, ప్రధాన కార్యదర్శిగా తుకారాం, గౌవవాధ్యక్షుడిగా సంతో ష్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, అన్నపూర్ణ, అదనపు ప్రధాన కార్యదర్శిగా బాదిరావు, కార్యదర్శులుగా అహ్మద్, శారద, స్రవంతి, ఆర్థిక కార్యదర్శులుగా నగేశ్, లక్ష్మణ్ ఎన్నికయ్యా రు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
తీరనున్న పేదోడి సొంతింటి కల
ఆసిఫాబాద్అర్బన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించింది. ఇచ్చిన నమూనా ప్రకారం ఇంటిని లబ్ధి దారులే నిర్మించుకోవాలని నిర్ణయించింది. ఇందు కు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ప్రభుత్వ సాయం అందించనున్నట్లు ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. ఈలెక్కన జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 3,500 చొప్పున 7వేల ఇళ్లు మంజూరు కా వాల్సి ఉండగా ఇప్పటివరకు 6,736 మాత్రమే మంజూరయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూ రు పత్రాలు అందజేసింది. జిల్లాలో 4,918 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. గత నెలలో 925 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మొదట మంచి ముహూర్తాలు లేకపోవడం, నిబంధనలు కఠినంగా ఉండడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు లబ్ధి దారులకు అవగాహన కల్పించడంతో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి నిర్మాణాలు ప్రారంభించారు. ముందుగా పనులు కొంత నెమ్మదించినా వెంటవెంట బిల్లులు వస్తుండడంతో లబ్ధిదారులు పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు సుమారు రూ.24.16 కోట్ల బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. నిబంధనల ప్రకారమే నిర్మించాలి జిల్లాలోని అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తోంది. – వేణుగోపాల్, హౌసింగ్ పీడీ జిల్లాలో ‘ఇందిరమ్మ’ వివరాలు మంజూరైన ఇళ్లు 6,736 మార్కింగ్ చేసినవి 4,918 బేస్మెంట్ దశలో.. 2,420 స్లాబ్ దశలో.. 30 గోడల దశలో.. 116 -
చట్టాలపై అవగాహన అవసరం
వాంకిడి: మహిళలు, బాలికలు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజు సూచించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 10రోజుల పాటు జిల్లాలో ప్ర త్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసి న అవగాహన కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి భాస్కర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. అణిచివేతలకు గురవుతున్న ఆయా వర్గాల మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని వాటి ని అధిగమించాలని సూచించారు. వరకట్న వేధింపుల నిషేధ చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో, మహిళల అక్రమ రవాణా, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులతో పాటు నూతనంగా అమలులోకి వచ్చిన వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పా టు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 1098, 1811, 112, 14567, 1930, 100 హెల్ప్లైన్ నంబర్ల ద్వారా అందించే సే వలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవేందర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య పాల్గొన్నారు. -
‘పెట్టుబడిదారులకే కేంద్రం వత్తాసు’
కెరమెరి: పెట్టుబడిదారులకే కేంద్ర ప్రభుత్వం వత్తా సు పలుకుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాలకులు మారినా కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ధనవంతుల కోసం ప్రభుత్వాలు చేసే నిర్ణయాల మూ లంగా కార్మికవర్గం ఇబ్బందుల పాలవుతోందని పే ర్కొన్నారు. వారికి కనీస ఉద్యోగ భద్రత, వేతనా లు, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్, ఎండీఎం తదితర రంగాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకుడు కూటికల ఆనంద్రావు అంగనవాడీలు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ వీవోఏలు ఉన్నారు. -
మరింత చేరువలో సాంకేతిక పరిజ్ఞానం
తిర్యాణి: ఏఐ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరి జ్ఞానం మరింత చేరువైందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. శనివారం మండలంలో ని గంభీరావుపేటలోగల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, మ ధ్యాహ్న భోజనంలో నాణ్యత, తరగతుల నిర్వహణ ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి ఓపీ వి వరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. వసతుల కల్పనకు చర్యలుఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని తిర్యాణి బ్లాక్లో అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ దిపక్ తివారీ తెలిపారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడా రు. తాగునీరు, మూత్రశాలలు, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర అంశాలను ఇంజినీరింగ్, సంబంధిత అధికారులు పర్యవేక్షించి అవసరము న్న చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. అంగన్వాడీ భవన నిర్మాణానికి తహసీల్దార్తో సమన్వయం చేసుకుని స్థలాలు గుర్తించాలని తెలి పారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణ, డీఐఈవో కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేర్చుకోవాలి
దహెగాం: లబ్ధిదారులు ఇందిరమ్మ పథకాన్ని సద్వి నియోగం చేసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవా లని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సూచించా రు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో 500 ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. మండలంలో పైలట్ గ్రామమైన దిగిడకు 12 ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణాలు చివరి దశలో ఉ న్నాయని తెలిపారు. మండలానికి 244 ఇళ్లు మంజూరు కాగా, 207 నిర్మాణాలు ఇదివరకే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 37 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామని పేర్కొన్నారు. మండలానికి మరో 150 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తుందని, స ర్వే పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మండలంలోని పెసరికుంట, మొట్లగూడ పంచాయతీలకు పక్కా భవన నిర్మాణాల కోసం రూ.20 లక్షల చొప్పున ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరైందని, త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఒడ్డుగూడ నుంచి కర్జి వరకు రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కోత్మీర్ నుంచి దహెగాం వరకు నిలిచిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పెంచికల్పేట్ వెళ్లే దారిలోని చిన్న వంతెన వద్ద హైలెవల్ వంతెన నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సహకార సంఘం చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజ య్ తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో రా జేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు లగ్గామ దామోదర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రత్యేక రైలు వేస్తారా..!
గత ఏడాది సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చిన ఇంటర్సిటీ రైలులో కనిపించిన దృశ్యమిది. ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడంతో కాలు తీసి కాలు పెట్టే అవకాశం లేకపోయింది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా సెలవుల్లోనూ పండుగ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య ప్రత్యేక రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉత్తర తెలంగాణ ప్రాంత రైలు మార్గాల్లో పండుగలు, పర్వదినాల్లో రెట్టింపు ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా కు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వి ద్యాసంస్థలకు సెలవులతో విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామాలు, పట్టణాలకు వెళ్తుంటారు. రద్దీ పెరిగి సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ వరకు ఈ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆంధ్రా వైపేనా..ప్రత్యేక రైళ్లు వేస్తున్నప్పటికీ ఆంధ్రాలోని కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూ రు నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సంక్రాంతితోపాటు ఇతర పండుగ సమయాల్లో ఆంధ్రా వై పు స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కొత్త రైలు ఊసే లేకుండా పోతోంది. మరోవైపు బస్సుల్లో పండుగ స్పెషల్ పేరిట అ దనపు చార్జీ వసూలు చేస్తుంటారు. మహిళలకు ఎ క్స్ప్రెస్, ఆర్డినరీ ఉచిత ప్రయాణంతో బస్సులు రద్దీ గా ఉంటున్నాయి. తక్కువచార్జితో ఎక్కువ దూరం ప్రయాణించే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు రోజూ స్పెషల్ట్రైన్ నడపాల్సి ఉంది. రద్దీగా సికింద్రాబాద్ రైళ్లుప్రస్తుతం హైదరాబాద్కు ఉదయం వెళ్తున్న భాగ్యనగర్, మధ్యాహ్నం బీదర్ ఇంటర్సిటీ, కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి ఉదయం 9:25గంటలకు దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తర్వాత భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వరకు మధ్యలో కాగజ్నగర్ వైపు వెళ్లడానికి ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఈ నెల 21నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనుండగా వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. స్పెషల్ ట్రైన్ నడపాలి పండుగ సమయాల్లో రైళ్లలో విపరీత రద్దీ ఉంటోంది. మంచిర్యాల, సికింద్రాబాద్ మధ్య సెలవుల్లో ప్రయాణా లు అధికంగా ఉంటాయి. దీంతో రైళ్లలో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండుగ పూట ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ప్రత్యేక రైళ్లు నడపాలి. – పౌడల సుమన్, రైలు ప్రయాణికుడు, మందమర్రి కొత్త రైలు నడిపితే మేలుమూడో లైన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతీరోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 10.35గంటలకు బయలుదే రి, కాజీపేటకు 12.40గంటల వరకు జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్ మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్ 3.45వరకు చేరుకునేలా ఓ రైలు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు సిర్పూర్ కాగజ్నగ ర్ నుంచి బయలుదేరి బెల్లంపల్లి, మంచిర్యా ల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ వర కు రాత్రి 10గంటలకు చేరుకోవాలి. ఈ రైలు కు పలు స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే వేలాది గ్రామాల ప్రజలకు ఉపయోగపడనుంది. మొదట ప్రయోగాత్మకంగా రైలును ఆరంభించి, రద్దీకి అనుగుణంగా రెగ్యులర్గా నడిపితే వేలాదిమందికి ఉపయోగపడనుంది. -
సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: మండలంలోని మడావిగూడ, చిన్నుగూడ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కోరారు. శనివారం ఆయా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు రోడ్డు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. గర్భిణులు, ప్ర జలకు అనారోగ్య సమస్యలెదురైతే నరకయాతన అనుభవించక తప్పదని పేర్కొన్నారు. గ తంలో పలుసార్లు అధికారులకు వినతిపత్రాచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు. వర్షం వస్తే మట్టి రోడ్లపై మోకాళ్ల లోతు బురద ఉంటుందని, అధికారులు వెంటనే స్పందించి రహదారులు నిర్మించాలని, కనీస వసతులు కల్పించాలని కోరారు. -
సాగులో సలహాలు..
పెంచికల్పేట్(ఆసిఫాబాద్): వర్షాకాలం పంటలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీరితోపా టు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అఫైర్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్లో రిజిస్టర్ అయిన భా రతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్త, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి న అభ్యర్థులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ రైతులకు మట్టి పరీక్షలు, శాసీ్త్రయ పద్ధతుల్లో పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, పంటల ఉత్తత్తి, మార్కెటింగ్పై మెలకువలు వివరిస్తున్నారు. మూడు మండలాల్లో సేవలుకేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సేవలు ప్రారంభించింది. జిల్లాలోని పెంచికల్పేట్, సిర్పూర్(టి), కాగజ్నగర్ మండలాల్లో సంస్థ ఏప్రిల్ నుంచి సేవలు ప్రారంభించింది. ఈ మూడు మండలాల్లో ఫార్మరీ రిజిసీ్ట్రలో నమోదు చేసుకున్న రైతులు 1100 మంది ఉన్నారు. ప్రతీ మూడు మండలాలకు సదరు సంస్థ ఒక అగ్రిసైంటిస్టుతోపాటు పంట చేలను సందర్శించి రైతులకు సలహాలు అందించడానికి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన 11 మంది అభ్యర్థులను నియమించింది. వీరు ఎంపిక చేసిన రైతుల పంట పొలాలను నిత్యం సందర్శిస్తున్నారు. పొలాల్లో మట్టిని సేకరించి సాయిల్ టెస్టు నిర్వహించారు. దుక్కిలో ఎరువుల వాడకం, విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల పిచికారీ, చీడపీడల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో కలిసి చేలను సందర్శిస్తూ పత్తి, వరి, మిర్చి పంటలకు సోకుతున్న తెగుళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. సాగు యాజమాన్య పద్ధతులపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు ఉపయోగంజిల్లాలోని మూడు మండలాల్లో ప్రస్తుతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేలను సందర్శిస్తున్నారు. పంటలకు సోకిన చీడపీడలను గుర్తించి రైతులకు అక్కడిక్కడే అవగా హన కల్పిస్తున్నారు. ఎలాంటి తెగులు సోకింది.. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవా లి.. ఎలాంటి మందులు వాడాలి.. తదితర విషయాలు విరిస్తున్నారు. జిల్లాలో యూరి యా కొరత నేపథ్యంలో నానో యూరియా వాడకంలో శిక్షణ అందించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేయాల్సిన రసాయనిక మందుల మోతాదు గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు 2000 వరకు మట్టి పరీక్షల కార్డులు పంపిణీ చేశారు. -
ఎస్పీఎం నుంచి కలుషిత వాయువులు!
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గురువారం అర్ధరాత్రి కలుషిత వాయువులు వెలువడ్డాయని స్థానిక ప్రజలు ఆరోపించారు. సర్దార్బస్తి, నిజాముద్దీన్ కాలనీ, ఓల్డ్కాలనీ, ద్వారకానగర్, మార్కెట్ ఏరియా, లారీ చౌరస్తా, నౌగాం బస్తి, బాలాజీనగర్, పెట్రోల్పంప్ ఏరియాల్లో పొగ నిండిపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. దుర్వాసన రావడంతోపాటు తల తిప్పడం, విపరీతమైన దగ్గు వస్తుందని పట్టణ ప్రజలు వాపోయారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మిల్లు నుంచి వారానికి రెండుసార్లు రాత్రి లేదా ఉదయం 4 గంటల సమయంలో కలుషిత వాయువులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు యజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గేటు ఎదుట ధర్నా సిర్పూర్ పేపరు మిల్లుతో వస్తున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యాజమాన్యం స్పందించడంలేదని పట్టణంలోని ఓల్డ్కాలనీ, న్యూకాలనీ, పలు కాలనీల ప్రజలు శుక్రవారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ మిల్లు కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంటపాటు ధర్నా చేయగా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో డౌన్డౌన్ అంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. -
వినాయకా.. వెళ్లి రావయ్యా
ఆసిఫాబాద్అర్బన్: తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. లంబోదరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచిన ఆసిఫాబాద్ పట్టణవాసులు నిమజ్జనం కోసం పెద్దవాగుకు తరలించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తిగీతాలకు నృత్యాలు చేశారు. వివిధ కాలనీల్లో కొలువుదీరిన 60 విగ్రహాలను వివేకానందచౌక్, అంబేడ్కర్చౌక్, గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, రాజంపేట, కంచుకోట మీదుగా ప్రత్యేక వాహనాల్లో శోభాయాత్రగా పెద్దవాగుకు తరలించారు. ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా బజార్వాడీ సమర్థసాయి గణేశ్ మండలి వద్ద ఎస్పీ కాంతిలాల్ పాటిల్ స్వామివారికి పూజలు చేశారు. ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి బైక్పై తిరుగుతూ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో పెద్దవాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లడ్డూ వేలం.. అ‘ధర’హో..బ్రాహ్మణవాడ సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద నిర్వహించిన వేలంపాటలో స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని సింగాడె అశోక్ రూ.12,516కు దక్కించుకోగా, స్వామి వారి మెడలోని హారాన్ని నిమ్మకంటి సంతోష్ రూ.16,400కు దక్కించుకోన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కాచం గణేశ్ రూ.34,516కు, కరెన్సీ మాలను ముత్యాల ప్రదీప్ రూ.29,516కు దక్కించుకున్నారు. వేడుకలను ఆర్డీవో లోకేశ్వర్రావు, తహసీల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షించారు. ఆసిఫాబాద్రూరల్: మండలంలోని మోతుగూ డ, బూర్గుడతోపాటు పలు గ్రామల్లో శుక్రవా రం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శిశుమందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని వాగులో నిమజ్జనం చేశారు. -
నవోదయ విద్యాలయంలో ఘనంగా టీచర్స్ డే
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను నవోదయ విద్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను శ్రద్ధగా చదివి విద్యార్థులు ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు. అంతకుముందు వి శ్రాంత ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): వర్షాకాలంలో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉండటంతో ప్రజల ఆరోగ్య రక్షణకు గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్వో సీతారాం తెలిపారు. మండలంలోని కన్నెపల్లి, తలండి, చింతపల్లి గ్రామాల్లో వైద్యశిబిరాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విషజ్వరాలను అరికట్టేందుకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పోషకాహారం తీసుకుంటూ శుద్ధమైన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు పల్లవి, వెంకటేశ్, అక్షిత, సిబ్బంది ఉన్నారు. -
దసరాలోపు ఎనిమిది రైళ్లకు హాల్టింగ్
కాగజ్నగర్టౌన్: దసరాలోపు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఎనిమిది రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు కృషి చేశారన్నారు. సికింద్రాబాద్– ముజఫర్పూర్ వరకు వయా కాగజ్నగర్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, బెంగళూరు– ధానాపూర్ల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్– గోరక్పూర్ మధ్య నడిచే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు– పాటలీపుత్ర మధ్య నడిచే పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ రైళ్లు కాగజ్నగర్ స్టేషన్లో నిలపనున్నారని తెలిపారు. దీంతో ఉత్తరాన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు దక్షిణాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. అలాగే మన ప్రాంతంలోని బెంగాళీలకు ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను తగ్గించడంతో దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. స్మార్ట్కార్డులు, సిమెంట్, ఇనుము, వాహనాలకు జీఎస్టీ శాతం తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనగర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్, అరుణ్లోయ, తిరుపి, సంతోష్, సదానందం, కోట వేణు, సాయి, చిట్టంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో మేటి!
వాంకిడి(ఆసిఫాబాద్): అత్యవసర సమయంలో సేవలందించడంలో 108 వాహనాలు మేటిగా నిలుస్తున్నాయి. ఆపద వేళ ఒక్క ఫోన్ కాల్తో క్షణా ల్లో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు నిలుపుతున్నాయి. గర్భిణులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 108 అంబులెన్స్లు 15 ఉండగా, 102 వాహనాలు మరో 15 ఉన్నాయి. మండలాల వారీగా ఆయా ఆస్పత్రుల వద్ద అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంటూ పేదలకు సంజీవనిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు ఈ వాహనాలు వరంలా మారాయి. బాధితుల నుంచి ఫోన్కాల్ వచ్చిన 15 సెకన్ల వ్యవధిలోనే ప్రయాణం ప్రారంభించి నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుతున్నాయి. జిల్లాలో 108, 102 వాహనాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 36,805 మంది లబ్ధి పొందారు. 108 సేవలు కీలకం..రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడంలో 108 సేవలు అత్యంత కీలకం. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 వాహనాలు సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు వరకు 108 వాహనాల ద్వారా జిల్లాలో 11,083 మంది సేవలు పొందారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చడమే కాకుండా వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న జిల్లాలో ప్రసవాలు చేయడంలో కూడా సిబ్బంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పురిటినొప్పులు ఎక్కువైన సందర్భంలో మార్గమధ్యలో వైద్యుల సూచనలతో ప్రసవం చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలు కాడుతున్నారు. 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు 47 మంది గర్భిణులకు 108 వాహనంలో ఆస్పత్రులకు వెళ్లకముందే మార్గమధ్యలో ప్రసవం చేశారు. డెలీవరీ అనంతరం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. ‘అమ్మ’కు 102 సేవలు108 అంబులెన్స్లతోపాటు జిల్లాలో 102 వాహనా లు ఉత్తమ సేవలందిస్తున్నాయి. 102 వాహనాలు ప్రవేశపెట్టిన తర్వాత గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయని అనడంలో సందేహం లేదు. ఈ వాహనాల ద్వారానే గర్భిణులు ప్రతినెలా మంత్లీ చెకప్లకు సులభంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. మారుమూల గిరిజన మండలాల వారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రితోపాటు ఆదిలాబాద్లోని రిమ్స్ కు వెళ్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సురక్షితంగా ఇంటి వద్ద దించుతున్నారు. గర్భం దా ల్చిన మహిళల పేర్లను ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు నమోదు చేసుకుని నెలనెలా 102 వాహనాల ద్వారా సమయానుసారంగా సేవలందిస్తున్నారు. ప్రసవం అనంతరం కూడా తల్లీబిడ్డలను ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ ఏడాది 102 వాహనాలు 11,335 ట్రి ప్పులు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు.108లో ప్రసవంకౌటాల(సిర్పూర్): మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన గర్భిణి జంగంపల్లి రేణుకకు శుక్రవారం రాత్రి పురుటి నొప్పులు రాగా 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని గర్భిణిని కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ పిట్టల విజయ్, పైలట్ సురేశ్ వాహనంలో సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. క్షణాల్లో ఘటనాస్థలికి.. పకడ్బందీ ప్రణాళికతో 108 వాహనాలు ఫోన్ ద్వారా సమాచారం అందిన కొన్ని క్షణాల్లోనే ఘటనా స్థలికి చేరేలా 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నాం. గర్భం దాల్చిన మహిళలకు మొదటి నెల నుంచే 102 వాహనాల ద్వారా సేవలందిస్తాం. నెలవారీ చెకప్లు, ప్రసవం అనంతరం ఇంటికి చేర్చే వరకు సేవలు పొందవచ్చు. సరైన కండిషన్లో ఉన్న వాహనాల్లో పైలట్తో పాటు ఒక ఈఎమ్టీ ఉండి అత్యవసర సేవలు అందిస్తారు. ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు అత్యవసర సమయాల్లో గర్భిణులకు డెలీవరీ చేస్తారు. జిల్లాలోని ప్రజలు అత్యవసర వాహనాల సేవలు వినియోగించుకోవాలి. – సతీశ్కుమార్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. నిమజ్జన ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర డ్యూటీల కోసం 600 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించామన్నారు. సీసీ కెమెరాలు, బోట్లు, డీడీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. మద్యం తాగి వేడుకల్లో పాల్గొనవద్దన్నారు. మండపాల నిర్వాహకులు, భక్తులు విద్యుత్పై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను తక్షణమే సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై ఉదయ్కిరణ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, సిబ్బంది ఉన్నారు. -
తగ్గుముఖం పట్టిన పెన్గంగ వరద
సిర్పూర్(టి): పెన్గంగలో వరద ఉధృతి గు రువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. సిర్పూర్(టి) మండలం హుడ్కిలి సమీపంలోని వంతెన వద్ద వరద తగ్గడంతో హుడ్కిలి, జక్కాపూర్, మాకిడితోపాటు మ హారాష్ట్ర గ్రామాలకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. వెంకట్రావ్పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని పెన్గంగ నదిపై ఉన్న వంతెన వద్ద వరద తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ రహీముద్దిన్, ఎస్సై కమలాకర్ పెన్గంగ నది వరద ఉధృతిని పరిశీలించారు. దరఖాస్తుల ఆహ్వానం వాంకిడి: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025– 26 విద్యాసంవత్సరానికి అతిథి అధ్యాపకుడి నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.కనకయ్య తెలిపారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ బోధించేందుకు పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 9 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ము న్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభా లు, తీగలు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటూ ‘మేలుకోకుంటే కాటేస్తయ్’ అనే శీర్షికతో ఆగస్టు 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వంగి ఉన్న స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని పలు మార్లు ‘సాక్షి’లో వార్తలు ప్రచురితం కావడంతో నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే వినా యక నిమజ్జన శోభాయాత్ర రోజు విద్యుత్శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన 12 మంది సిబ్బందికి విధులు కేటాయించామని ఏఈ కమలాకర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎఫెక్ట్ -
వంట తంటాకు చెల్లు!
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం వండుతున్న నిర్వాహకుల తంటాలు ఇక తీరనున్నాయి. ప్రతినెలా బిల్లులను ప్రభుత్వం గ్రీన్ చానల్ ద్వారా చెల్లించనుంది. ప్రస్తుతం జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఐదు నెలల వంట బిల్లులు, ఆరు కోడిగుడ్డు బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నా యి. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. జిల్లాలో ఇలా..జిల్లాలోని 994 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో గిరిజన పాఠశాలలు 262, ప్రభుత్వ లోకల్బాడి పాఠశాలులు 732 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45 వేల మందికి ప్రతీరోజు మధ్యా హ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఒక్కొక్కరికి రూ.6.19, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వారికి రూ.9.29, తొమ్మి ది, పదో తరగతి వారికి రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అదనంగా కోడిగుడ్డుకు రూ.6, గౌరవ వేతనం కింద నిర్వాహకులకు రూ.మూడు వేలు చెల్లిస్తున్నారు. వంట బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్రం ప్రభుత్వం 60శాతం భరిస్తోంది. అయితే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి మధ్యాహ్న భోజనం బిల్లులు ప్రభుత్వం సక్రమంగానే జమ చేస్తోంది. 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంప్రస్తుతం ఉన్న బిల్లుల చెల్లింపుల విధానంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గౌరవ వేతనాలు, బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పులు చేసి వంట చేయాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రీన్ చానల్ విధానం అయితే..గ్రీన్ చానల్ విధానం అయితే మధ్యాహ్న భోజన బిల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెలా ఆన్లైన్ యాప్ ద్వారా నేరుగా ఖాతాలో జమ చేస్తారు. ఏడాది మొత్తానికి అవసరమైన బిల్లులకు నిధులు కేటాయిస్తారు. నిధులకు ఇబ్బందులు లేకుండా ఖాతాల్లో జమ చేస్తారు. విద్యాశాఖ ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాల నమోదు కోసం యాప్ రూపొందించింది. ప్రస్తుతం అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రీన్ చానల్ విధానం అమల్లోకి వస్తే ప్రతినెలా ఏ పాఠశాలలో.. ఎంత మంది కార్మికులకు ఎంత బిల్లు చెల్లించాలనే విషయం స్పష్టం తెలుస్తుంది. ప్రధానోపాధ్యాయుడు ఆమోదం తెలిపిన తర్వాత, ఎంఈవో సరిచూసుకుని ఆమోదిస్తే ట్రెజరీ శాఖ ప్రతినెలా నిర్వాహకుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. -
పెండింగ్ ఉంచొద్దు
కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లు రాలేదు. ప్రభుత్వం ఇకపై బిల్లులు, వేతనాలు పెండింగ్లో ఉంచొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలి. పాఠశాలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. – కమల, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, మోతుగూడ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యికులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నిర్ణయించడం హర్షణీయం. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. గత ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేసిన అల్పాహారానికి సంబంధించి బిల్లులు నేటివరకు రాలేదు. అవి త్వరగా చెల్లించాలి. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు సవరించాలి. – కృష్ణమాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ -
గురుభ్యోనమః
అక్షరాన్ని నేర్పే గురువు జీవితానికి మార్గాన్ని చూపిస్తారు. అలాంటి టీచర్ ప్రతిఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు. క్రమశిక్షణ నేర్పించి.. జ్ఞానజ్యోతులు వెలిగించి భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తారు. రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. నేడు మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసి, బోధనలో ఉత్తమంగా నిలుస్తున్న ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.ఇంటింటికీ తిరిగి.. ప్రవేశాలు పెంచికెరమెరి: మండలంలోని గోయగాం ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పెంచడంలో ఉపాధ్యాయుడు రవితేజ ఎనలేని కృషి చేశారు. కుటుంబ సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికీ తిరిగారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. సొంత ఖర్చుతో కరపత్రాలు ముద్రించి బడిబాట కార్య్రమంలో భాగంగా గ్రామంలో ప్రచారం చేశారు. గతేడాది 40 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 73కు చేరింది. ఎల్కేజీ, యూకేజీ తరగతులు సైతం ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకురావడంతో గోయగాం పాఠశాల ప్రైవేట్కు దీటుగా కొనసాగుతోంది. -
ఆకట్టుకున్న జిల్లాస్థాయి కళోత్సవ్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలిక ల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 మండలాల నుంచి 12 కళారూపాల్లో సుమారు 300 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నా రు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచి ఒక కళను అలవాటు చేసుకుని సాధన చేయాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే కళోత్సవ్ పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో రాథోడ్ సుభాశ్, హెచ్ఎం జనార్ధన్, న్యాయనిర్ణేతలు కిల్లి వెంకట్రావు, వెంకన్న, వెంకటేశ్వర్లు, రాజనర్సు బాబు, శ్రీనాథ్, పద్మ, శ్రీలత, సురేశ్, శేఖర్, శంకర్, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్మికుల ధర్నా
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ వాసుదేవ్కు వినతిపత్రం అందించారు. ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సుమారు 4 నుంచి 6 నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవితబీమా సౌకర్యం రూ.5 లక్షలు కల్పిస్తామని ప్రభుత్వం మెమో జారీ చేసి డీపీవోలకు పంపించినా నేటికి అనేక జిల్లాల్లో అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులకు రూ.19వేల వేతనం చెల్లించాలని, అప్పటిలోగా జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమే శ్, దేవాజీ, వెంకటేశ్, శ్రీనివాస్, శంకర్, సత్తయ్య, అన్నాజీ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైనవిద్యతోపాటు రుచికరమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు పరిశీలించారు. వంట మనుషులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న మెనూ వివరాలు తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యావసర వస్తువులు వినియోగించాలని సూచించారు. శుద్ధమైన తాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల స్థానంలో బోధించిన తీరును పరిశీలించారు. గణితం ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. పదో తరగతి ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. -
మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని జెండాగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అంకుసాపూర్ పాఠశాలను సందర్శించారు. హాజరుపై ప్రతిరోజూ సమీక్షించాలిఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ఎంఈవో లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ స మీక్షించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం దహెగాం, బెజ్జూర్, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోగా విద్యార్థుల హాజరుపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలన్నారు. 50 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారని, దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సైతం ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావొద్దన్నారు. సమావేశంలో పాఠశాలల సమన్వయకర్త అబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు కేరాఫ్
వాంకిడి: సృజనాత్మకతతో బోధిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంచుతున్నారు వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేశ్. ప్రస్తుతం ఆయన ఆసిఫా బాద్ మండలం జన్కాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంట సాగు విధానంపై మొక్కల ఎదుగుదల, చీడపీడల వృద్ధి తదితర వివరాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటున్నారు. సృజనాత్మకతతో విద్యనందిస్తున్న ఆయనకు హర్యానాలోని ఫరిదాబాద్ యూనివర్సిటీకి చెందిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అందించింది. రాష్ట్రస్థాయిలో టీచర్స్ బెస్ట్ ప్రాక్టిసెస్లో ఎంపికై ప్రతిభ చూపారు. జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలుమార్లు ఎంపికయ్యారు. 2024లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. 2024లో హైదరాబాద్లో నిర్వహించిన సైన్స్ డ్రామాలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. పిల్లలకు సృజనాత్మకతతో బోధిస్తే అంశాలపై పట్టు సాధించి, ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఉపాధ్యాయుడు రాజేశ్ చెబుతున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్మల్లోని దివ్యగార్డెన్స్లో నిర్వహించే 6వ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు గురువారం తరలివెళ్లారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏడు కొండలు గురువారం రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికై న క్రీడాకారుల జాబితా విడుదల చేసి, ఎంపికై న వారిని ఆసిఫాబాద్ నుంచి నిర్మల్కు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరో తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్, జూనియర్ చాంపియన్షిప్ శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు జరగనున్నాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు ప్ర తిభచూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులురాష్ట్రస్థాయి యోగా పోటీలకు బాలుర విభాగంలో ట్రెడిషనల్ యోగాలో మనవ్బార్, ఫార్మర్డ్ బెండ్ చిత్యాల శ్రీయాన్, ట్విస్టింగ్ యోగా శ్రీయాన్ గౌడ్, బ్యాక్వర్డ్ బెండ్ యోగా బొసెల్లి ప్రతిఖ్, లెగ్ బ్యాలె న్స్ బట్టి అకిల్సింగ్, హ్యాండ్ బ్యాలెన్స్ నాగ చైతన్య, సుపిన్ఫోజ్ చిట్యాల శ్రీయాన్, అర్టిస్టిక్ సింగల్ అశ్విత్ యాదవ్, ఆర్టిస్టిక్ డబుల్ ఆదర్శ్, సాయి రోహిత్, రిథమిక్ ఫేర్ అశ్విత్, త్రినాథ్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో ట్రెడిషనల్ యోగాలో సాయి ప్రణీత, ఫార్వర్డ్ బెండ్ రసకట్ల స్లోక, ట్విస్టింగ్ వనపర్తి అఖిల, ఆర్టిస్టిక్ సింగల్ కుమ్మరి శ్రీవల్లి ఎంపికయ్యారు. -
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
దహెగాం(సిర్పూర్): రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఫర్టిలైజర్ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాంలను బుధవారం తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ ఎరువుల కొరత సృష్టించొద్దన్నారు. రైతులకు కనిపించేలా స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నకిలీ ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలన్నారు. ఆయన వెంట ఏవో రామక్రిష్ణ తదితరులు ఉన్నారు. -
పాఠశాలల వివరాలు యాప్లో నమోదు చేయాలి
కాగజ్నగర్టౌన్: స్వచ్ఛహరిత విద్యాలయ యాప్ లో పాఠశాలల వివరాలు నమోదు చేయాలని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఎమార్సీ భవనంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హరిత విద్యాలయం శిక్షణ కా ర్యక్రమంలో మాట్లాడారు. యాప్లో తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తదితర వివరాలు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణ సృష్టి, విద్యార్థుల్లో శుభ్రత అలవాట్లు పెంపొందించే విధానాలను వివరించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలన అనంతరం ర్యాంకులు కేటాయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి జాడి దేవాజీ, ఎంఈవో వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్పర్సన్లు మామిడా ల తిరుపతయ్య, శాంతికుమార్ పాల్గొన్నారు. 104 ఉద్యోగుల నిరసన ఆసిఫాబాద్అర్బన్: 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగులు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ 104 ఉద్యోగులను పీహెచ్సీ, టీబీ ఆఫీస్, టీ హాబ్ వంటి విభాగాల్లో విధుల్లో ఉంచారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వేతనాలు విడుదల చేయలేదన్నారు. ఉద్యోగుల కొ నసాగింపుపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఇప్పటికై నా డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ యూనైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, ఉద్యోగులు రాజేశం, ప్రశాంత్, సత్యనారాయణ, తిరుపతి, రమేశ్, రమాదేవి, లలిత, లీలావతి, సూర్యకళ, రవి తదితరులు పాల్గొన్నారు. -
నడవని రైలు.. తీరని తంటాలు!
సిర్పూర్(టి): సికింద్రాబాద్, కాజిపేట, బల్లార్హా మధ్య ఎప్పుడు ఏ రైలు రద్దవుతుంతో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఏడాది కాలంగా థర్డ్ లైన్ పనులు, రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ అధికారులు రైళ్లు నిలిపివేస్తున్నారు. గత నెల 29న భారీ వర్షాలు, వాతావరణ మార్పులు అంటూ కరీంనగర్– సిర్పూర్(టి) పుష్పుల్ ప్యాసింజర్ రైలు, కాజిపేట్–బల్లార్షా రామగిరి ప్యాసింజరు, కాజిపేట్– సిర్పూర్(టి) సింగరేణి ప్యాసింజరు, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తోపాటు పలు రైళ్లు ఒకరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరిగి ఆగస్టు 30న పునఃప్రారంభించారు. మూడో లైన్ పేరుతో.. సికింద్రాబాద్– బల్లార్షాల మధ్య నూతనంగా చేపట్టిన మూడో రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ థర్డ్లైన్ పనులు, ఇతర మరమ్మతులు, స్టేషన్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నారు. అధికారుల అనాలో చిత నిర్ణయాలతో జిల్లా ప్రయాణికులతోపాటు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు సిర్పూర్(టి), కాగజ్నగర్ రైల్వేస్టేషన్ల నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. బల్లార్షా వరకు నడిచే రైళ్లలో వందలాది మంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ప్రయాణిస్తుంటారు.ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంరైళ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నాం. ఆర్థికంగా భారం పడుతుంది. రైల్వే అధికారులు స్పందించి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింజరు రైళ్లను పునరుద్ధరించాలి. – నులిగొండ మహేశ్, సిర్పూర్(టి) ఇబ్బంది పడుతున్నాంబల్లార్షా– సికింద్రాబాద్ మధ్య రైళ్లు తరుచూ రద్దు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ప్రతీ రోజు నడిచే రైళ్లు కూడా ఎప్పుడు రద్దవుతున్నాయో తెలియడం లేదు. తరచూ రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలి. – నగ్రాడె రాజు, సిర్పూర్(టి) హాల్టింగ్ మళ్లీ ఎప్పుడో..?భాగ్యనగర్ రైలు గతంలో సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ మీదుగా నడిచింది. ప్రస్తుతం సికింద్రాబాద్– కాగజ్నగర్ వరకు మాత్రమే కొనసాగుతోంది. కాజిపేట్– నాగ్పూర్ ప్యాసింజర్కు సిర్పూర్(టి)లో స్టాప్ లేదు. గతంలో నాగ్పూర్ ప్యాసింజర్గా ఉండగా ప్రస్తుతం కాజిపేట్– నాగ్పూర్ అజ్నీ ప్యాసింజర్ రైలుగా పిలుస్తున్నారు. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్లో గతంలో హాల్టింగ్ ఉన్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింజర్కు ప్రస్తుతం ఎందుకు హాల్టింగ్ కల్పించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో మరిన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అలాగే కోవిడ్ సమయంలో మార్చి 2020లో లాక్డౌన్ విధించగా అప్పుడు రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. లాక్డౌన్ అనంతరం పునఃప్రారంభించినా సిర్పూర్(టి)లో ఆపడం లేదు. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ తదితర మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
డెంగీ పంజా..!
కౌటాల: జిల్లా వాసులపై డెంగీ పంజా విసురుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. కౌటాల, చింతలమానెపల్లి, తిర్యాణి, లింగాపూర్, ఆసిఫాబాద్ మండలాల్లో బాధితులు పెరుగుతున్నారు. బుధవారం మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తిర్యాణి మండలం అమీన్గూడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతితోపాటు తిర్యాణి మండలం చింతపల్లికి చెందిన 21 యువకుడు, తిర్యాణి మండలం సోనాపూర్కు చెందిన 24 ఏళ్లు యువకుడు, లింగాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక, లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలుడు, తిర్యాణి మండలం గంభీరావ్పేటకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు డెంగీ బారిన పడ్డారు. అనధికారికంగా ఎక్కువే.. జిల్లాలో రోజురోజుకూ డెంగీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారికంగా ఈ సీజన్లో 41 కేసులు నిర్ధారణ కాగా.. అనధికారికంగా ఎక్కువే ఉంటాయి. పీహెచ్సీల్లో నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాలు లేకపోవడంతో తక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జ్వరాల సోకినవారు పరీక్షలకు సైతం ముందుకు రావడం లేదు. వసతి గృహాల్లో జ్వరంతో బాధపడే విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇళ్లకు పంపిస్తున్నారు. డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా వ్యాధులు దోమల కారణంగానే వ్యాప్తి చెందుతున్నా క్షేత్రస్థాయిలో సరైన చర్యలు కరువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఐదారు రోజుల్లో లక్షణాలు డెన్– 1, 2, 3, 4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగీ జ్వరం వస్తుంది. ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటుతో ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దోమలు కుట్టిన ఐదారు రోజుల్లో లక్షణాలు రోగికి కనిపిస్తాయి. మొదటి రకం సాధారణం కాగా, హెమరేజిక్ ఫీవర్ ప్రమాదకరమైనది. ప్లేట్లేట్ల సంఖ్య పడిపోవడం ఒక్కోసారి రక్తస్రావానికి దారి తీస్తుంది. మన రక్తంలో ప్లేట్లేట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది. వీటి సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోతే వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ విషయమై కౌటాల మెడికల్ ఆఫీసర్ నవతను సంప్రదించగా, జ్వరంతో బాధపడితే తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. -
స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ను ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ 18 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలకు పక్కా భవనాలు మంజూరు చేయాలన్నారు. వసతిగృహాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని, సరిప డా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సుంకరి సా యి, కార్తీక్, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, అనుమతి లేకుండా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయానికి వచ్చే ప్రజలను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. -
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు
ఆసిఫాబాద్అర్బన్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తోడ్పాటునందిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఆసిఫాబాద్ మండలం బూర్గుడకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కుందారపు రాణికి రూ.10లక్షలతో మంజూరైన మొబైల్ చేపల విక్రయ వాహనాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ప్రారంభించారు. రూ.4లక్షల సొంత నిధులు, రూ.6లక్షలు ప్ర భుత్వ రాయితీతో సంచార వాహ నం నిర్వహించేందుకు ముందుకురావడం సంతో షంగా ఉందన్నారు. డీఆర్డీవో దత్తారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, డిస్ట్రిక్ ప్రాజె క్టు మేనేజర్లు యశోద, యాదగిరి పాల్గొన్నారు. గ్రామ పాలనాధికారులను సకాలంలో తీసుకురావాలి ఈ నెల 5న హైదరాబాద్లో నిర్వహించే నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి గ్రామ పాలనాధికారులకు సకాలంలో తీసుకురావాలని రాష్ట్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ జిల్లాకు చెందిన 59 మంది గ్రామ పాలనాధికారులకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ నెల 5న ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు పాల్గొన్నారు. అభివృద్ధి దిశగా జిల్లాను నడిపించాలి నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను ఆ కాంక్షిత నుంచి అభివృద్ధి వైపు నడిపించాలని నీతి ఆయోగ్ సీఈవో మణివేలు అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ఆకాంక్షిత జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్పరెన్స్ నిర్వహించారు. నీతిఆయోగ్ ద్వారా చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ తిర్యాణి బ్లాక్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కాగజ్నగర్టౌన్: పండగలన్నీ ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తా, మార్కెట్ ఏరియా, అంబేడ్కర్ చౌరస్తా, లారీ చౌరస్తా మీదుగా పెట్రోల్ పంప్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు లాంగ్మార్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాన్ ఉన్ నబి పండుగలు సామరస్యంగా జరుపుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, అన్నిప్రాంతాల్లో నిఘా ఉంటుందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పచ్చదనం
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్ 2.0’ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో మొక్కలు నాటుతున్నారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పాఠశాలల్లో ఏకో క్లబ్ మిషన్ లైఫ్ పేరిట ప్రత్యేక క్లబ్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే జిల్లా విద్యార్థులు 5 వేలకు పైగా మొక్కల నాటిన ఫొటోలను పోర్టల్ నమోదు చేసి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. తల్లి పేరుతో మొక్కలు జిల్లాలో 561 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 100 ప్రాథమికోన్నత, 60 ఉన్నత, 15 కేజీబీవీలు ఉన్నాయి. 42 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థి తల్లి పేరిట మొక్కలు నాటేలా విద్యాశాఖ ప్రోత్సహిస్తోంది. సృష్టిలో తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిన నాటిన మొక్కను సంరక్షిస్తే అనుకున్న ప్రతిఫలం దక్కుతుంది. ప్రతీ విద్యార్థి పాఠశాలల ఆవరణలో తప్పనిసరిగా మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతోంది. వీటిని సక్రమంగా సంరక్షిస్తే స్కూళ్ల ఆవరణలు పచ్చనిహారంలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధిహామీ పథకం కింద అధికారులు బడులకు మొక్కలు పంపిణీ చేశారు. అవసరమైన చోట ఉపాధ్యాయులు మరిన్ని మొక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. స్కూళ్లలో మొక్క నాటిన తర్వాత మిషన్ లైఫ్ పోర్టల్లో విద్యార్థులు ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రశంసాపత్రం సైతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు పది వేల మొక్కలు నాటగా, ఐదు వేల మంది విద్యార్థులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. హరిత రక్షణకు చర్యలుఅడవుల జిల్లాగా పేరున్న కుమురంభీం ఆసిఫాబాద్లోనూ క్రమంగా పచ్చదనం తగ్గుతోంది. ఇష్టారీతిన చెట్లు నరుకుతుండటంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం భవిష్యత్తు తరాలపై పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం పేరిట జిల్లావ్యాప్తంగా ఖాళీ స్థలాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటుతోంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని సూచించడంతో విద్యాశాఖ అధికారులు సైతం హరిత రక్షణకు చర్యలు చేపట్టారు. విద్యార్థులను పచ్చదనం కాపాడటంలో భాగస్వాములను చేస్తున్నారు. బాధ్యతగా తీసుకోవాలి పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి. తల్లి పేరుతో దాని సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి. మొక్కతో ఫొటో తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేయాలి. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన వస్తుంది. – ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా సెక్టోరల్ అధికారి -
‘అటవీ అధికారుల తీరు సరికాదు’
పెంచికల్పేట్(సిర్పూర్): రిజర్వ్ ఫారెస్టు పేరుతో ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారుల తీరు సరికాదని మండలంలోని అగర్గూడ గ్రామస్తులు విమర్శించారు. గ్రామంలో మంగళవారం వారు మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణ సమయంలో అటవీశాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టు పేరుతో అడ్డుకుంటూ లబ్ధిదారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఫారెస్టు కార్యాలయానికి పిలిచి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
ఏకరూపం.. ఎప్పుడో..?
రెబ్బెన(ఆసిఫాబాద్): అంగన్వాడీ కేంద్రాల్లోని చి న్నారులకు పూర్తిస్థాయిలో యూనిఫాం అందలేదు. ప్రభుత్వం కేవలం ఒకవిడతలో కొందరికి పంపిణీ చేయగా, మిగిలిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో జిల్లాలోని చాలా మంది చిన్నారులు రంగుల దుస్తులతో కేంద్రాలకు హాజరవుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు క్రీడాసామగ్రి పంపిణీ చేసింది. అలాగే చిన్నారులకు సైతం యూనిఫాం అందించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు యూనిఫాం అందించగా మిగిలిన కేంద్రాల వారికి మాత్రం ఇప్పటివరకు అందించలేదు. వాస్తవానికి జూన్లోనే ఏకరూప దుస్తులు అందాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి క్లాత్ రావడంలో జాప్యం జరుగుతోంది. రంగుల దుస్తులతోనే కేంద్రాలకు..అంగన్వాడీ కేంద్రాల్లో ఓనమాలు నేర్చుకున్న విద్యార్థులు ప్రస్తుతం రంగు రంగుల దుస్తులను ధరించి కేంద్రాలకు వస్తున్నారు. దీంతో పసితనంలోనే ధనిక, పేద అనే తారతమ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని దూరం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంది స్తున్న మాదిరిగానే వీరికి సైతం ఉచితంగా యూనిఫాం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు కూడా యూనిఫాంలు అందించాలని, అందుకు కావాల్సిన క్లాత్ సరాఫరా చేసింది. మొదటి విడతలో జిల్లాలోని సుమారు 410 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు క్లాత్ అందించింది. జిల్లా అధికారులు యూనిఫాం కుట్టే బాధ్యతను సెర్ప్ సిబ్బందికి అప్పగించారు. స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో దుస్తులు కుట్టించి చిన్నారులకు అందించారు. ఇందులో చాలామందికి సైజులు సరిపోకపోవడంతో సూపర్వైజర్ల సహకారంతో సైజుల వారీగా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు యూనిఫాంలు తెప్పించారు. విద్యార్థులకు సైజులు సరిపోయేలా సర్దుబాటు చేశారు. మిగిలిన అంగన్వాడీకేంద్రాల్లో చదువుతున్నవారికి రెండో విడతలో క్లాత్ అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెలాఖరులోగా యూనిఫాం క్లాత్ రావొచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులందరికీ యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో జిల్లాలో 8,118 మంది కోసం బట్ట సరఫరా చేయగా.. సెర్ప్ ద్వారా యూనిఫాంలు కుట్టించి పంపిణీ చేశాం. రెండో విడతలో జిల్లాలోని మిగిలిన చిన్నారులకు క్లాత్ ఇంకా రాలేదు. ఈ నెలాఖరు లోగా క్లాత్ వస్తుందని భావిస్తున్నాం. బట్ట రాగానే స్టిచ్చింగ్ చేయించి విద్యార్థులకు అందిస్తాం. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ22,817 మందికి లబ్ధిప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు యూనిఫాం అందిస్తే జిల్లాలో 22,817 మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతోంది. 15 మండలాల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 3– 6 ఏళ్లలోపు చిన్నారులు 22,817 మంది ఉన్నారు. మొదటి విడతలో సుమారు 8,118 వేల మంది చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఇంకా సుమారు 14.7 వేల మందికి అందించాల్సి ఉంది. సెర్ప్ సిబ్బంది సకాలంలో యూనిఫాంలు అందించకపోవడంతో ఈ దఫా కుట్టు బాధ్యతలు స్వయం సహాయక సంఘాల్లోని నిరుద్యోగ మహిళలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. కుట్టుకూలి సెర్ప్ ద్వారా అందించడంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఈ కారణంగానే సకాలంలో యూనిఫాంలు అందడం లేదని గుర్తించారు. కలెక్టర్ ఆమోదంతో ఎస్హెచ్జీ మహిళలకు డబ్బులు చెల్లిస్తే సకాలంలో యూనిఫాంలు అందుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరు వరకు మిగిలిన అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు క్లాత్ వచ్చే అవకాశం ఉందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. -
పల్లె ఓటర్లు 3,53,895 మంది
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం మంగళవారం పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లోని 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్న ట్లు వెల్లడించింది. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉ న్నారని జిల్లా పంచాయతీ అధి కారి భిక్షపతిగౌడ్ తెలిపారు. ఆగ స్టు 31 వరకు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం మా ర్పులు, చేర్పులు చేసి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తుది జాబితాను అధికారులు ప్రదర్శించారు. ముసాయిదా జాబితా నుంచి ఆసిఫాబాద్ మండలంలో తొమ్మిది మంది పేర్లు తొలగించినట్లు డీపీవో పేర్కొన్నారు. గత పంచాయతీ ఎన్నికల ముందు జిల్లాలో 3,48,329 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 10న ఎంపీటీసీ స్థానాల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటించనున్న విషయం తెలిసిందే.మండలాల వారీగా పంచాయతీ ఓటర్లుమండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం ఆసిఫాబాద్ 15,039 15,276 0 30,315 బెజ్జూర్ 11,685 12,047 2 23,734 చింతలమానెపల్లి 12,118 11,837 0 23,955 దహెగాం 11,014 11,077 1 22,092 జైనూర్ 11,936 12,427 0 24,363 కాగజ్నగర్ 22,857 22,383 2 45,242 కెరమెరి 12,145 11,880 1 24,026 కౌటాల 13,796 13,560 1 27,357 లింగాపూర్ 5,103 5,479 1 10,583 పెంచికల్పేట్ 6,218 6,084 0 12,302 రెబ్బెన 14,523 14,201 0 28,724 సిర్పూర్(టి) 11,016 11,163 3 22,182 సిర్పూర్(యూ) 5,835 6,440 2 12,277 తిర్యాణి 8,863 9,281 4 18,148 వాంకిడి 14,458 14,134 3 28,595 -
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ పంచాయతీ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. రెండు నెలలుగా వారికి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 51 వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కూటికల ఆనంద్రావు, కార్మికులు సంతోష్, స్వామి, నగేశ్, మల్లేశ్, సాగర్, శ్రీకాంత్, జైవంత్ తదితరులు పాల్గొన్నారు. -
వంటకు తాజా కూరగాయలు వాడాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల వంట కోసం తాజా కూరగాయలు వాడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు. వంట గది, పరిసరాలు, సరుకులు, స్టాక్ రిజిస్టర్, మరుగుదొడ్లు, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యాప్రమాణాలను పరిశీలించారు. అనంతరం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. గైర్హాజరవుతున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్షిక పరీక్షలకు పదో తరగతి విద్యార్థులను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, పాఠశాల సిబ్బంది ఉన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలిఆసిఫాబాద్: వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖదీమజీద్, కసాబ్వాడి కాలనీల్లోని అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ గజానంద్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దోమల నివారణకు డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు పూడ్చివేయాలన్నారు. నష్టాలపై నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద నిమజ్జన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుద్దీపాలు, క్రేన్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
కాళేశ్వరంపై కుట్రలు సహించం
ఆసిఫాబాద్అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తూ.. మాజీ మంత్రి హరీశ్రావుపై నిందలు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలి టిక్స్ చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను రాజకీయాలకు వాడుకుని తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కు నిజాలు తెలియకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగాన్ని మంత్రులు పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కలాం, రవీందర్, నిసార్, సత్తన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం లభించే పెన్షన్ భిక్ష కాదని, అది వారి హక్కు అని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ అన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విస్మరించి కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించకుండా సీపీఎస్కు మొగ్గుచూపిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారుగా 1,40,000 మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు సామాజిక భద్రతపై ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటికీ పాతన పెన్షన్ విధానమే అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి డీఎంహెచ్వో సీతారాం మద్దతు ప్రకటించారు. నిరసనలో జేఏసీ నాయకులు శాంతికుమారి, పెండ్యాల సదాశివ్, హేమంత్ షిండే, ఊశన్న, ఉమర్ హుస్సేన్, శ్రీనివాస్రావు, తుకారాం, ఖమర్ హుస్సేన్, భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
68శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఆగస్టులో వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో 68 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించగలిగామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టులో ఏరియాకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 1.36 లక్షల టన్నులు మాత్రమే సాధించి 68 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. గత నెలలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని, వర్షాలతో ఓసీపీలో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయామని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కోల్పోయిన ఉత్పత్తిని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా 11.76 లక్షల ఉత్పాదకతతో 90శాతంతో ముందుకు సాగుతోందన్నారు. -
టోకెన్లు సరే.. యూరియా ఏది?
కాగజ్నగర్టౌన్: జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. నిత్యం ఏదో ప్రాంతంలో పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వ్యవసాయాధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో కుమ్మకై ్క కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్లో బ్యాగుకు రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. టోకెన్లకే పరిమితంఆగస్టు 12, 16వ తేదీల్లో పలు గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు వారికి యూరియా బస్తాలు మాత్రం పంపిణీ చేయలేదు. పీఏసీఎస్లో వారం రోజులుగా స్టాక్ లేదని, కార్యాలయానికి రావద్దని చెబుతున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం నిల్వలు ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, నాయకులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, పక్కదారి పడుతున్న ఎరువులపై నిఘా పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
పింఛన్ మంజూరు చేయాలి నేను పేదవాడిని. కళ్లు కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. భూమితో పాటు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – కంది బాపు, బారెగూడ, మం.బెజ్జూర్ ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతులు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ ఎస్సీ కాలనీకి చెందిన శిల్పారాణి దరఖాస్తు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో చదువుకున్న తన కుమార్తె ధ్రువపత్రాలు ఇప్పించాలని పైకాజీనగర్కు చెందిన నైతం మోహన్ కోరాడు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ శివారులోని భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని పెరుమాండ్ల వెంకటేశ్ అర్జీ అందించాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్కు చెందిన విలా స్, జన్కాపూర్కు చెందిన సమీనాబాగం దరఖాస్తు చేసుకున్నారు. కౌటాల మండలం కన్నెపల్లికి చెందిన మోర్ల పాండుమేర తన తండ్రి పేరుతో ఉన్న పట్టా భూమిని విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.వట్టివాగు కాలువకు మరమ్మతు చేయాలి వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ డీ 4కు పది రోజుల క్రితం గండి పడింది. కాలువ కింద రెబ్బెన మండలంలో 8 వేల మంది వరి సాగు చేసుకున్నారు. మరికొంత మంది వేయాల్సి ఉంది. కాలువకు వెంటనే మరమ్మతు చేయాలి. – కార్నాథం సంజీవ్కుమార్, సింగిల్విండో చైర్మన్, రెబ్బెన సొంతిల్లు లేదు నేను నిరుపేదరాలిని. సొంతిల్లు లేదు. వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతున్నాను. గ్రామంలో ఇంటిస్థలం ఉంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – సింగరి పుల్లక్క, నంబాల, మం.రెబ్బెనఅక్రమంగా పట్టా మార్చిండ్రు వంశపారపర్యంగా నాకు సంక్రమించిన రెండుకరాల వ్యవసాయ భూమి ఉంది. తండ్రి పేరు నుంచి నా పేరుతో విరాసత్ చేయిస్తానని ఓ వ్యక్తి తప్పుడు సంతకాలు చేయించుకుని అక్రమంగా పట్టా మార్చుకున్నాడు. నా భూమి నాకు ఇప్పించాలి. – నంది రజిత, తక్కళ్లపల్లి, మం.రెబ్బెనసూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి సమాచార హక్కు చట్టం కింద కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతభత్యాలు, ఈఎస్ఐ, పీఎఫ్పై తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలి. – కార్తీక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు వివిధ కారణాలతో వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఫోన్లో సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పదోన్నతితో మరింత బాధ్యతపదోన్నతుల ద్వారా ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ డీఎస్పీగా పనిచేస్తున్న బి.రామానుజం ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ బ్యాడ్జీ తొడిగి శుభాకాంక్షలు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ కొనసాగింపుజిల్లాలో శాంతిభద్రతలు, ప్రశాంతతను పెంపొందించేందుకు జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30 వరకు 30 పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజేలపై నిషేధం ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నష్టాలపై నివేదిక సమర్పించాలి
ఆసిఫాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఆగస్టులో భారీ వర్షాలతో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలపై పూర్తి నివేదికలతో స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ రంగం, విద్యుత్, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల పరిధిలో జరిగిన నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో 3 మరణాలు, 46 నివాస గృహాలు దెబ్బతిన్నాయని, 50 మేకలు మృతి చెందడంతోపాటు 15,003 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 20 పాఠశాలలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కల్వర్టులు, రహదారులకు నష్టం జరిగిందన్నారు. వరద నష్టాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పిస్తామన్నారు. జీవో 91 ప్రకారం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
సమృద్ధిగా వాన
దహెగాం(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వర్షాకాలం సీజన్ ఆరంభంలో వరుణుడు జాడ లేక సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూన్లో సరైన వర్షాలు కురువలేదు. ఇక జూలైలో మోస్తరు వానలే పడటంతో సాగు పనులకు ఆటంకం కలిగింది. ఆగస్టులో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు 1 వరకు జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 859.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,016.5 మిలీమీటర్లుగా నమోదైంది. సిర్పూర్(యూ), లింగాపూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, కాగజ్నగర్ మండలాల్లో కురువాల్సిన దానికంటే అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం దహెగాం మండలంలో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జలాశయాలు పూర్తిగా నిండటం, భూగర్భజలాలు పెరుగుతుండడంతో వానాకాలం, యాసంగి సాగుకు ఎలాంటి ఢోకా లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. నిండిన జలాశయాలుజిల్లావ్యాప్తంగా గడిచిన పదిహేను రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు నిండుకుండలా మారాయి. జూలై వరకు భారీ వర్షాలు లేక వెలవెలబోయిన నీటి వనరులు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. సాగు నీటితోపాటు తాగునీటికి కీలకమైన కుమురంభీం(అడ), వట్టివాగు, చెలిమెల, బొక్కివాగు, పీపీరావు ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నాయి. కుమురంభీం ప్రాజెక్టులో పూర్తిస్థాయి 10.393 టీఎంసీలు కాగా, ఆనకట్ట సక్రమంగా లేకపోవడంతో 5.688 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో నూ నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే జిల్లాలో 563 చెరువులు కూడా పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. పెద్దవాగు, ఎర్రవాగుతోపాటు ఇతర వాగులు, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరినాట్లు పూర్తి..సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరిసాగుకు రైతులు సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్నవారు మాత్రమే ఆగస్టు మొదటి వారంలోగానే నాట్లు పూర్తిచేశారు. జూలై చివరివారం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో గతవారం వరకు వరినాట్లు పూర్తయ్యాయి. సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వర్షాలతో పత్తికి తెగుళ్లు సోకకుండా రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. పూత, కాత దశలో పంట ఆశాజనకంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు. అయితే 15 రోజుల క్రితం భారీ వరదలతో పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగి పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే మొక్కలు వరద నుంచి కోలుకుంటున్నాయి.పీపీరావు ప్రాజెక్టు మత్తడి దూకుతున్న వరదజూన్ నుంచి సెప్టెంబర్ 1 వరకు వర్షపాతం(మి.మీ.లలో)మండలం కురువాల్సింది కురిసింది జైనూర్ 906.3 1012.8 సిర్పూర్(యూ) 892.9 868.6 లింగాపూర్ 855.7 1028.3 తిర్యాణి 747.6 939.3 రెబ్బెన 743.9 1218.7 ఆసిఫాబాద్ 764.5 1036.6 కెరమెరి 766.4 1079.6 వాంకిడి 820.4 1070.7 కాగజ్నగర్ 784.5 1121.2 సిర్పూర్(టి) 898.6 915.6 కౌటాల 939.2 1023.1 చింతలమానెపల్లి 937.6 1030.9 బెజ్జూర్ 993.9 1104.3 పెంచికల్పేట్ 915.0 915.0 దహెగాం 930.6 880.5 ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వప్రాజెక్టు మొత్తం సామర్థ్యం ప్రస్తుత నీటినిల్వ ఇన్ఫ్లో ఔట్ఫ్లో కుమురంభీం 10.393 5.688 6,600 5,900వట్టివాగు 2.890 2.442 1,300 1,113ఎన్టీఆర్ సాగర్ 0.37 0.376 150 160పీపీరావు 0.848 0.848 750 750జగన్నాథ్పూర్ 0.135 0.010 8,830 8,830 -
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిని కించపరిచేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆదివారం బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ బీజేపీని నేరుగా ఎదుర్కొనలేక రాహుల్గాంధీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానికి వెంటనే క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మల్లికార్జున్, పెంటు, విజయ్, ప్రహ్లాద్, మురళీగౌడ్, రేణుక, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ఆసిఫాబాద్రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి రద్దు చేసి కార్మికుల హక్కుల నాశనం చేసిందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు సురేశ్, చిరంజీవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుంటుపడుతున్న మున్సిపాలిటీల అభివృద్ధి
కాగజ్నగర్టౌన్: నిధులు మంజూరు కాకపోవడంతో మున్సిపాలిటీల అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ బిల్లుపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా కాగజ్నగర్ మున్సిపాలిటీకి రూ.22 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నిధులు లేమితో బల్దియాలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, కనీసం డ్రెయినేజీలు, సీసీ రోడ్లకు మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే శానిటేషన్ వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
పాన్ ఇండియా సంస్థగా సింగరేణి
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించకుంటే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సంస్థ సీఅండ్ఎండీ బలరాంనాయక్ అన్నారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సింగరేణి ప్రస్తుతం పాన్ ఇండియా సంస్థగా మారిందని తెలిపారు. సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బ హుమతి ప్రదానోత్సవం కార్యక్రమం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో ఆది వారం నిర్వహించారు. కార్యక్రమానికి డీజీఎంఎస్ ఉజ్వల్థాతో కలిసి సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణాతోపాటు ఒడిశా, రాజస్తాన్ తది తర రాష్ట్రాలకు సింగరేణి విస్తరించిందని తెలిపారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ స మగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మి కుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఉత్పత్తి కన్నా సంస్థకు కార్మికుల ప్రాణాలు ముఖ్యమని తెలిపారు. రక్షణ విషయంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు. కొన్ని కారణాలతో బొగ్గు గనుల వేలంలో ఇప్పటివరకు పాల్గొనలేకపోయామని, ఇకపై వేలంలో పాల్గొంటామని చెప్పారు. ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాలి..సింగరేణిని పూర్తిగా ప్రమాదరహిత సంస్థగా తీర్చి దిద్దాలని డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా అన్నారు. సేఫ్టీ విషయంలో నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నారు. మైనింగ్ రంగంలోకి మ హిళా ఉద్యోగులు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. ఎక్కువ శాతం ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేని కారణంగానే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రక్షణ త్రైపాక్షిక సమావేశం..సింగరేణిస్థాయి 49వ రక్షణ త్రైపాక్షిక సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఇందులో సింగరేణిలోని అన్ని ఏరియాల జీఎంలు, డైరెక్టర్లు, సేప్టీ అధికారులు పాల్గొన్నారు. రక్షణ విషయంలో రాజీ పడొద్దని డీజీఎంఎస్ సూచించారు. మరోవైపు మారుపేర్లు క్రమబద్ధీకరించాలని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద బాధితులు నిరసన తెలిపారు. సీఎండీ బలరాంనాయక్ స్పందిస్తూ ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేప్టీ కన్నణ్, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతం, గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారా మయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్, జీఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్, సీఎంవోఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాగజ్నగర్టౌన్: పీఆర్టీయూ జిల్లా కార్యవర్గాన్ని కాగజ్నగర్ పట్టణంలోని క్విన్స్ గార్డెన్లో రాష్ట్ర కార్యదర్శి మామిడాల తిరుపతయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్సుందర్, జి ల్లా ప్రధాన కార్యదర్శిగా మడిమడుగుల తిరుపతి, జిల్లా గౌరవ అధ్యక్షులుగా పార్వతి రాజేశ్వర్రావు, జిల్లా ఉపాధ్యక్షులుగా వేణు, షబ్బీ ర్, సత్యనారాయణ రాజు, రాజేశ్, పూర్ణిమ, రజియా సుల్తానా, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా చిలుకూరి రవీందర్, శ్రీనివాస్, శారద, చంద్రకళ, జిల్లా సెక్రెటరీలుగా సురేశ్, సుమిత్ర, ఉమారాణి, సుప్రియ అరుణకుమారిని ఎన్నుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కటకం మధుకర్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. -
కొట్లాడితేనే కొత్త గనులు
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికవర్గం కొట్లాడితేనే కొత్త గనులు వస్తాయని.. అప్పుడే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హెచ్ఎంఎస్ నేత, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. రెండు రోజులుగా నస్పూర్ పట్టణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ 26వ ద్వైపాక్షిక మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల పక్షాన పోరాడి సొంతింటి పథకం సాధించాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన వార్షిక లాభాలు నుంచి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈసారి 10 శాతం వాటా చెల్లించాలన్నారు. బొగ్గు గనుల వేలంతో సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిలిపివేసి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పెర్క్స్పై ఆదాయ పన్ను సింగరేణి యాజమాన్యమే చెల్లించాలన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని దీనిని రూపుమాపాలన్నారు. మారుపేర్ల సమస్య పరిష్కరించాలన్నారు. యూనియన్ పేరు మార్పు.. ఇప్పటివరకు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా ఉన్న పేరును ఇక నుంచి అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా మార్చుతున్నట్లు ఆ యూనియన్ మాతృ సంఘం హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. యూనియన్ను మరింత బలోపేతం చేయడానికి ఈ మార్పు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలుగా కవిత.. మహాసభల్లో భాగంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపై ఆమె యూనియన్ గౌరవ ప్రదమైన స్థానంలో కొనసాగుతారన్నారు. అంత కుముందు ఇందారం చౌరస్తా నుంచి మహాసభల వేదిక వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జెండా ఆవిష్కరించిన అనంతరం మహాసభలు కొనసాగించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నా యకులు జమీల్, యూనియన్ కేంద్ర అధ్యక్షుడు సారయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, మందమర్రి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు రాజబాబు, శ్రీరాంపూర్ డివిజన్ నాయకులు అశోక్, సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో అల్పాహారం
తిర్యాణి: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ పోషకాహారం అందిస్తోంది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తోంది. కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్రాల్లో మరో కొత్త పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఒకపూట (మధ్యాహ్నం) మాత్రమే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుండగా అదనంగా ఉదయం పూట అల్పాహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వా రం క్రితం మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో సంబంధిత శాఖ అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగ ర పరిధిలోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. అక్కడ మెరుగైన ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏజెన్సీల్లో ఎంతో ఉపయోగంజిల్లాలోని ఐదు ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3–6 ఏళ్ల లోపు 22,817 మంది చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, చిన్నారుల హాజ రు పూర్తి స్థాయిలో నమోదు కావడం లేదు. హాజరుశాతం సగటున 72 శాతం నమోదవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నూ తనంగా అందించనున్న అల్పాహారం ద్వారా చిన్నారులు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశముంది. తద్వారా హాజరు శాతం పెరగడంతో పా టుగా వారి శారీరక పెరుగుదల (ఆరోగ్యం) కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ పథకం జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో 973 కేంద్రాలుండగా 352 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. 296 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 325 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఒక్కోదానికి రూ.12లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇంకా ఉత్తర్వులు అందలేదు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించే విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని కొన్ని కేంద్రాల్లో ప్రభుత్వం ప్ర యోగాత్మకంగా పథకం నిర్వహిస్తోంది. జిల్లాలో నూ అమలైతే ఎంతో బాగుంటుంది. – భాస్కర్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి -
వందేభారత్కు హాల్టింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సికింద్రాబాద్–నాగ్పూ ర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లలో నిలుపుదలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఏడాదిగా మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్తోపాటు బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలోనూ హాల్టింగ్ ఇవ్వాలని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వాసులు వినతిపత్రాలు ఇస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి, ఆదిలాబా ద్ ఎంపీలు, సిర్పూర్ ఎమ్మెల్యేతో సహా బీజేపీ నా యకులు, స్థానిక నాయకులు, ఉత్తర తెలంగాణ రై ల్వే ఫోరం ప్రతినిధులు అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. ఇక్కడి ప్ర యాణికుల డిమాండ్లపై ‘సాక్షి’లోనూ పలుసార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో మంచిర్యాల, కాగజ్నగర్లో నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ప్రయోగాత్మకంగా హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండు స్టేషన్లలోని టికెట్ల ఆదాయం పరి గణనలోకి తీసుకుని పొడిగింపు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇంకా ఏ రోజు నుంచి రైలును ని లుపుదల చేస్తారనే తేదీని ప్రకటించలేదు. కొద్ది రో జుల్లోనే రైలును నిలిపే అవకాశాలున్నాయి. రైలు ఆగక, ఆదాయం లేక..భారత రైల్వేలో ఆధునిక వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న వందేభారత్ రైళ్లు ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. గతేడాది సె ప్టెంబర్ 16న సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్, కాజిపేట, రామగుండం స్టాప్లు ఇచ్చి తర్వాత నేరుగా మహా రాష్ట్రలో బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్కు చేరుకుంటుంది. మొదట ఆరెంజ్ రంగులో 20కోచ్లతో నడిచింది. ఈ మార్గంలో ప్రయాణికు ల ఆదరణ లేక ఆదాయం తగ్గిపోయింది. ఈ రైలు మొత్తం సీట్లలో 40శాతంలోపే ప్రయాణికులతో న డుస్తోంది. దీంతో 8కోచ్లకు కుదించి రైలును తెల్ల రంగులోకి మార్చారు. మరోవైపు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 8 స్టేషన్ల పరిధిలో ఎక్కడా స్టాప్లు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర నిరాశ కు గురయ్యారు. తాజా ఉత్తర్వులతో ఈ రెండు జి ల్లాల నుంచి ఉదయం పూట వెళ్లే మార్గంలో కాజి పేట, సికింద్రాబాద్ వరకు వెళ్లొచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాగ్పూర్ వైపు సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, కాగజ్నగర్తోపాటు బల్లార్షా, చంద్రాపూర్, నాగ్పూర్ వరకు ఈ రెండు జిల్లాల ప్రయాణికులకు వీలు కలుగుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు వేగంగా వెళ్లే అవకాశం ఉండడంతో వందేభారత్ రైలును ఈ రెండు స్టేషన్లలో ఆపాలనే డిమాండ్లు వచ్చాయి. ఫలించిన వినతులుసికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ మధ్య నడిచే గోరఖ్పూర్, తెలంగాణ, హజ్రత్ నిజాముద్దీన్, జమ్ముతావి, దానాపూర్, సూపర్ ఫాస్ట్తోపాటు పలు రైళ్లు అరగంట అటు ఇటుగా అన్నీ 7గంటల నుంచి 8గంటల మధ్య ప్రయాణ సమయం పడుతోంది. ఇదే త రహాలో వందేభారత్ ఏడున్నర గంటలు పడుతోంది. అయితే మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల స్టాప్లు లేకపోగా, ప్రయాణికులతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రెళ్లు కిక్కిరిసి ఉంటున్నా యి. రిజర్వేషన్లు కూడా దొరకని పరిస్థితి. వందేభారత్కు టికెట్ ధర అధికం కావడం, సౌకర్యాలు అధికంగా ఉండడం, స్టాప్లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు సుఖవంతంగా ప్రయాణం ఉంటుంది. దీంతో వందేభారత్ రైలు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ప్రయాణికుల వినతుల మేరకు రైల్వే శాఖ ఆమోదం లభించింది. సాక్షిలో ప్రచురించిన కథనం -
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్
కాగజ్నగర్ టౌన్: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని టీజీ ఈజేఏసీ జిల్లా చైర్మన్ జయదేవ్ అబ్రహం డిమాండ్ చేశారు. శనివా రం కాగజ్నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ వి ద్రోహ దినం, పాత పెన్షన్ సాధన పోరాట సభ పో స్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సెప్టెంబర్ 1న కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో పెన్షన్ సాధన పో రాట సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునఃరుద్ధరణ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రావు, శాంతికుమారి, శివప్రసాద్, న ర్సయ్య, లింగమ్మ, నర్సయ్య, మురళీధర్రావు, పు రుషోత్తం, రాజ్కమలాకర్రెడ్డి, మహిపాల్, మహే శ్, ఉదయ్కుమార్, విస్తారు పాల్గొన్నారు. ‘రద్దు చేసేదాకా పోరాడుతాం’రెబ్బెన: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుకు వి ఘాతంగా మారిన సీపీఎస్ను రద్దు చేసే వరకు పోరాడుతామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజ శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించాలని తెలిపా రు. కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు జి ల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్య లో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సంఘం నాయకులు మేడి చరణ్దాస్, దూడ రాజనర్సుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
పెంచికల్పేట్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శనివారం పెంచికల్పేట్ గ్రామంలో పర్యటించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తంజేశా రు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంత రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయించి లబ్ధిదారుల కు సకాలంలో బిల్లులు అందించేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ భవనం, పాఠశాలలో మూత్రశాలలు, కిచె న్ షెడ్, డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చే యాలని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ను ఈ సందర్భంగా కోరారు. త్వరగా కూలి చెల్లించేలా చూడాలని ఉపాధిహామీ కూలీలు ఆయనకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీడీవో అల్బర్ట్, ఏఈ సందీప్, హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయురాలు ప్రియాంక తదితరులున్నారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలిదహెగాం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజ రుశాతం పెంచాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. హాజరు రిజిష్టర్లు పరిశీలించి పలువురు పదో తరగతి విద్యార్థులు దీర్ఘకాలికంగా ఎందుకు గైర్హాజరవుతున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరో జూ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి డిజిటల్ తరగతులను వీక్షించారు. బోధన తీరును విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. వంట గదుల కోసం ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్, ఎంఈవో శ్రీనివాస్ ఉన్నారు. -
నిషేధిత గడ్డి మందు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డి మందును పోలీసులు శ నివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో మండలంలోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద వ్యవసాయాధికారులతో కలిసి వాహనాల త నిఖీ చేపట్టారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి న కారు తనిఖీ చేయగా హైజాక్, రౌండప్, క్లింటన్ పేర్లతోగల 243 లీటర్ల నిషేధిత ద్రావణపు గడ్డి మందు, టాపర్ పేరిట గల 120కి లోల పొడి గడ్డిమందు లభ్యం కాగా, విలువ రూ.1,48,390 ఉంటుంది. గడ్డిమందు తరలి స్తున్న ఇద్దరిరిని, కారును అదుపులోకి తీసుకు ని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
ఆసిఫాబాద్అర్బన్: వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్జైలులో న్యాయ విజ్ఞాన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. క్షణికావేశంలో అనాలోచితంగా చే సిన తప్పులకు జీవితాంతం బాధపడాల్సి వ స్తుందని, అందుకే ఆవేశపూరితంగా తప్పులు చేయకూడదని సూచించారు. అనంతరం జైలులోని వంట గదిని పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సబ్ జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు శనివారం ముగిసాయి. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ సైతం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి 513 అభ్యంతరాలు వచ్చాయి. ఓటరు పోలింగ్ కేంద్రాలు, వార్డు మార్పు, తప్పిపోయిన ఓటరుకు సంబంధించి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. జన్నారం మండలంలో 23, దండేపల్లిలో 104, లక్సెట్టిపేటలో 30, హాజీపూర్లో 12, జైపూర్లో 88, భీమారంలో 58, చెన్నూర్లో 2, కోటపల్లిలో 3, వేమనపల్లిలో 1, మందమర్రిలో 18, కాసిపేటలో 93, బెల్లంపల్లిలో 27, తాండూర్లో 42, భీమినిలో 5, నెన్నెలలో 7, కన్నెపల్లిలో 2 అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారం హాజీపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే సమావేశం అయ్యారు. -
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు. నీటమునిగిన శ్మశానవాటికఖానాపూర్: పట్టణంలోని గోదావరితీరంలో మున్సిపల్ నూతన కార్యవర్గం ఏర్పటయ్యాక రూ.50 లక్షలతో నిర్మించిన శ్మశనవాటిక ఏటా వర్షాకాలంలో నీట మునుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఏటా వరదలు తగ్గాక మరమ్మతు చేయడం పరిపాటిగా మారింది. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ద్యావతి గంగాధర్(55) అనారో గ్యంతో మృతి చెందాడు. గోదావరి తీరంలో గల శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి ఉండగా ఉండగా కుటుంబ సభ్యులు అత్యంత దూరభారమైనప్పటికీ గాంధీనగర్ శివారులోని తర్లపాడ్ వెళ్లే రహదారి వరకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు–తల్మాడ సెక్షన్, అక్కన్నపేట–మెదక్ సెక్షన్లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ను శనివారం చర్లపల్లి–ఆదిలాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పర్లి–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 రైల్ సర్వీసులు సెప్టెంబర్ 1న రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని సూచించారు. -
లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు
జైనూర్: సద్గురు పూలాజీబాబా తన హితబోధనలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం మండలంలోని పట్నాపూర్లోని సిద్ధేశ్వర సంస్థాన్లో పూలాజీబాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్మాత్మిక మార్గం వైపు నడిపించిన ఘనత బాబాకే దక్కుతుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాయన్నారు. అనంతరం మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రచించిన బాబా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిన్వట్ ఎమ్మెల్యే భీంరావ్ కేరామ్, మహారాష్ట్ర మాజీమంత్రి శివాజీరావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావు ఇంగ్లే, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, రెవెన్యూ జిల్లా అధికారి లోకేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆడే శేషేరావు పాల్గొన్నారు. -
జ్వరంతో బాలుడు మృతి
తిర్యాణి: జ్వరంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ రాము కుమారుడు సీతారాం(15) పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చికిత్స అందించినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే మండలంలోని ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. -
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్చైన్గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న ఐడీవోసీ కా ర్యాలయంలో ని ర్వహించే సభను విజయవంతం చేయాలని కో రారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఉ ద్యోగులు కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, గెజిటెడ్ ఉ ద్యోగుల సంఘం కార్యదర్శి రమేశ్, ఉ పాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు మురళీమనోహర్రెడ్డి, జుట్టు గజేందర్, రవికాంత్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, అశోక్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రవి, గణేశ్ పాల్గొన్నారు. -
ఆలోచన.. ఆవిష్కరణ
కాగజ్నగర్టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జ్ఞాన విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీ సరస్వతి శిశుమందిర్ మంచిర్యాల జిల్లా విభాగ్ కార్యదర్శి దహెగాం గోవింద్రావు అన్నారు. శనివారం కాగజ్నగర్లోని ఆదర్శనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త ప్ర యోగాలు, ఆవిష్కరణలకు ఊతమిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడంలో గణిత జ్ఞాన విజ్ఞాన మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం, విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించి పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయని ప్రశంసించారు. మేళాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గల నుంచి విద్యార్థులు 236 మంది హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వ తీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్రావు తెలిపా రు. శనివారం కాగజ్నగర్లో నిర్వహించిన జి ల్లా స్థాయి విజ్ఞాన మేళాలో శార్వాణి, వెంకట రత్న, చరణ్, సాకేత్, హరిచరణ్, దివ్య, జ శ్వంత్, నిహారిక, విక్రమ్, శ్రీనిధి ఉత్తమ ప్రతి భ కనబరిచి బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యా ర్థులు సెప్టెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొంటారని వివరించారు. -
‘నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలి’
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన పురాణాలపై ఆధారపడి నూతన జాతీయ విద్యావిధానాన్ని రాసినట్లు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వర్ణ వ్యవస్థ ఆధారిత విద్యను అమలు పరిచేందుకు ఉవ్విళ్లూరుతోందని ఆరోపించారు. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశ జీడీపీలో 2.5 శాతం మాత్రమే విద్యకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి మాటమార్చిందన్నారు. అంతకుముందు పీడీఎస్యూ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగరాజు, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్కుమార్, పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు, రాజేశ్వర్, కిరణ్, సహాయ కార్యదర్శులు గౌతమ్కుమార్, మస్తాన్, నవీన్, అజయ్, తిరుపతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి చరణ్, డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల హ్యాండ్బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. బాలికల జట్టులో గంగుబాయి, మౌనిక, వైష్ణవి, పార్వతి, జయశ్రీ, సహస్ర మోక్షిత, బాలుర జట్టులో సాత్విక్, రుత్విక్వర్మ, జాషువా, ప్రణయ్, వంశీ, పార్థు ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి, సీనియర్ క్రీడాకారులు ప్రణయ్, సంజయ్, రఘు, వర్మ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు. -
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజలను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21,000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికా రులు చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్రద్ధాశు క్లా ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. అయినప్పటికీ అనుమతి లేకుండా ట్రాక్టర్ల యజమానులు యథావిధిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులకు బడా నాయకుల అండదండలు ఉండడంతో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోందనే ఆరోపణలు న్నా యి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసు క అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా జిల్లాలో కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాలు అందించేందుకు 108 బాలబాలికలను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టిజిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కౌటాల, రెబ్బెన, కెరమెరి మండల్లోని కేంద్రాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలిఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, హౌజింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో పాఠశాలలు, పీహెచ్సీలు, ఉప కేంద్రాలు దెబ్బతిన్నాయని, వాటి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌజింగ్ పీడీ వేణుగోపాల్, డీటీడీవో రమాదేవి పాల్గొన్నారు. -
పనిభారం తగ్గించాలని వీవోఏల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: పనిభారం తగ్గించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవా రం ఐకేపీ వీవోఏలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ ఐకేపీ వెలుగులో క్షేత్రస్థాయిలో గ్రామ సమైఖ్య సంఘం అసిస్టెంట్లతో 67 రకాల పనులు చేయించుకుంటున్నారని తెలి పారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. విద్య భోదన, ట్రైనింగ్ పేరుతో ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరారు. అనంతరం డీఆర్డీఏ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు రోజా, కార్యదర్శి ధనరాజ్, నాయకులు అన్నపూర్ణ, అంకన్న, వనిత, సుమలత, వెంకటేశ్, సంతోష్, భరత్, హనుమంత్రావు, తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మాజీ మంత్రి భీంరావు వర్ధంతి
ఆసిఫాబాద్అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి దివంగత కోట్నాక భీంరావు 23వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. భీంరావు విగ్రహానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, అధికారులు, గిరిజన సంఘా ల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా భీంరావు అందించిన సే వలు చిరస్మరణీయమన్నారు. గిరిజన యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పడిగాపులకు స్వస్తి..!
కౌటాల(సిర్పూర్): పశువులపై వన్యప్రాణుల దాడులు పెరిగిన నేపథ్యంలో బాధిత రైతులకు సాయం వేగంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పరిహారం చెక్కుల రూపంలో అందించగా, ఇక నుంచి పశుపోషకుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. అక్కడి ప్రజలు వన్యప్రాణులతోనే సహవాసం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా–అంధారీ అభయారణ్యాల నుంచి పెన్గంగ, ప్రాణహిత నదులు దాటి పెద్దపులులు కాగజ్నగర్ డివిజన్ పరిధిలోకి ప్రవేశిస్తున్నాయి. పెద్దపులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు రైతులపై దాడులు చేస్తున్నాయి. వన్యప్రాణుల దాడుల్లో పశువులు, మేకలు కూడా మృత్యువాత పడుతున్నాయి.వన్యప్రాణులకు ఆవాసం..జిల్లాలో 1,78,939.73 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉండగా, 1100 గ్రామాలు అడవుల మధ్యే ఉన్నాయి. బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, కౌటాల, దహెగాం, కాగజ్నగర్, సిర్పూర్(టి), తిర్యాణి, కెరమెరి, సిర్పూర్(యూ), లింగాపూర్ ప్రాంతాల్లో అన్నిరకాల వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. ప్రాణహిత, వార్దా నదులతోపాటు పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను జింకలు, మెకాలు, దుప్పులు, కుందెలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, సాంబార్లతోపాటు అనేక రకాల పక్షులు ఆవాసంగా మార్చుకున్నాయి.పెరిగిన దాడులుమహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్గంగ, వార్దా, ప్రాణహిత నదుల తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. పదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడ పులి కాగజ్నగర్లోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. బఫర్ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న పులులు రైతులు, పశువులపై దాడులకు దిగుతున్నాయి. అటవీ ప్రాంతంలో నీటివనరులు తగ్గినప్పుడు ఇతర వన్యప్రాణులు కూడా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పశువులతో పాటు కాపరులపై కూడా అటవీ ప్రాంతంలో దాడి చేస్తున్నాయి. మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. దీంతో జిల్లాలో పెద్దపులులను కొందరు హతమార్చారు. పంటలు కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలు అమర్చడంతో విష ప్రయోగం చేస్తున్నారు. ఈ చర్యలను తగ్గించేందుకు ప్రభుత్వం వన్యప్రాణుల దాడుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బాధితులకు వేగంగా పరిహారం అందిస్తుంది.దరఖాస్తు చేస్తే వెంటనే..వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తప్పవు. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల దాడిలో పశువులు మృత్యువాత పడితే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పరిహారం పెంచింది. దీనిపై జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పశువులు మృతి చెందితే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే విచారణ చేసి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం. పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారికి జాప్యం లేకుండా నేరుగా పశుపోషకుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తాం.– సుశాంత్ బొగాడే, ఎఫ్డీవో, కాగజ్నగర్ఖాతాల్లోకి పరిహారం..వన్యప్రాణుల బారినపడి మృత్యువాత పడిన పశువుల యజమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను అటవీ శాఖ వేగవంతం చేసింది. ఇకపై నేరుగా పోషకుల బ్యాంకు ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తుంది. గతంలో బాధితులకు పరిహారాన్ని చెక్కుల రూపంలో ఇచ్చేవారు. దానికి రెండు వారాల సమయం పడుతుండగా ప్రస్తుత విధానంతో వారం రోజుల్లోనే నగదు అందుతుంది. రైతుల సమయం ఆదా కావడంతోపాటు అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ముందుగా వన్యప్రాణులు పశువును చంపిన విషయాన్ని బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వారు ఘటనాస్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి నివేదిక రూపొందిస్తారు. అలాగే రైతు వివరాలు, పశువైద్యుడి ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా, తదితర సమాచారాన్ని మీ సేవ కేంద్రం ద్వారా నమోదు చేయించాలి. జిల్లా అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే డబ్బులు యజమాని ఖాతాలో జమవుతాయి. జిల్లాలో గత రెండేళ్లలో 114 పశువులు వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందాయి. అటవీశాఖ బాధితులకు రూ.50,35,434 పరిహారం అందించింది. వన్యప్రాణుల దాడుల్లో రెండేళ్లలో ముగ్గురు మృతి చెందగా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేశారు. వన్యప్రాణుల దాడుల్లో ఎలాంటి నష్టం జరిగినా ఫిర్యాదు చేయాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.పరిహారం ఇలా..వ్యక్తి మృతి చెందితే రూ. 10 లక్షలుతీవ్ర గాయాలైతే రూ. లక్ష వరకు..పంటలకు నష్టం జరిగితే రూ.7,500 వరకు..పశువులు చనిపోతే రూ.50 వేల వరకు..పశువులు గాయపడితే పరిహారం ఉండదు. -
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మల్టీపర్పస్ విధానాన్ని తక్షణ మే రద్దు చేయాలని, కార్మికులకు గ్రీన్ చానల్ ద్వా రా వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కా ర్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు నిత్యం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇతర ప్ర భుత్వ పథకాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 2019 లో వచ్చిన మల్టీపర్పస్ విధానంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా వేతనాలు కూడా అందడం లేదన్నారు. సీఎం హామీ ఇచ్చినా కనీస వేతనాలు అమలు కావ డం లేదన్నారు. జీవో 51 సవరించాలని డిమాండ్ చేశారు. డీపీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నాయకులు, కార్మికులు అనిల్, వసంత్, నగేష్, విలాస్, సంతోష్, రాజు పాల్గొన్నారు. -
ధ్యాన్చంద్ సేవలు వెలకట్టలేనివి
ఆసిఫాబాద్రూరల్/ఆసిఫాబాద్అర్బన్: క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధ్యాన్చంద్ క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో గిరిజన క్రీడాపాఠశాల ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఇన్చార్జి అధికారి రమాదేవి, డీడబ్ల్యూవో భాస్కర్, ఏసీఎంవో ఉద్దవ్, జిల్లా క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, రవి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. నష్టాలపై నివేదికలు రూపొందించాలిఆసిఫాబాద్: జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూలై, ఆగస్టులో భారీ వర్షాలతో పంచాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖల పరిధిలోని రహదారులు కోతకు గురయ్యాయని, కల్వర్టులు తెగిపోయాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు గండ్లు పడ్డాయని, ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పశువులు, మేకలు, గొర్రెల ఫొటోలతో కూడిన వివరాల ను అందించాలని ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. -
బోనస్కు ఎదురుచూపులే!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు వడాయి శివరాం. రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన ఆయన గత యాసంగిలో 4.5 ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశాడు. అంతకు ముందు వానాకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ వచ్చింది. దీంతో యాసంగిలో పండిన 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాడు. అయితే ధాన్యానికి మాత్రమే మద్దతు ధర ప్రకారం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాగా, బోనస్ మాత్రం ఇప్పటికీ అందలేదు. జిల్లాలో ఇది ఒక్క శివరాం పరిస్థితే కాదు. యాసంగిలో సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన వారందరూ బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. రెబ్బెన(ఆసిఫాబాద్): సన్నరకం వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన జిల్లా రైతులు బోనస్ నగదు కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో వారిలో ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వానాకాలం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించింది. యాసంగిలో పండించిన ధాన్యానికి మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదు. ధాన్యం అమ్మి నెలలు గడుస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,800 మెట్రిక్ టన్నులు సేకరణజిల్లాలోలోని రైతులు యాసంగి సీజన్లో 24వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు 5,800 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. సర్కారుపై నమ్మకంతో చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. విక్రయ సమయంలో అకాల వర్షాలు పడ్డాయి. తూకం చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యా యి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులను మాత్రమే ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం బోనస్ను విస్మరించింది. ఒక్కో రైతుకు వేలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసి దాదాపు రెండున్నర నెలలు గడిచింది. చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. రూ.2.9 కోట్ల బకాయిలుయాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి బోనస్ రూపంలో రూ.2.9 కోట్లు రావాల్సి ఉంది. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలులో అధికారుల జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ప్రైవేటుకే అమ్ముకున్నారు. అయితే ప్రైవేటులో రోజురోజుకూ ధర తగ్గించడం, ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై మొగ్గు చూపారు. జిల్లావ్యాప్తంగా 12,090 మంది రైతులు సుమారు 5,800 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు యాసంగిలో బోనస్ చెల్లింపునకు 12,090 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. కేవలం కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే డబ్బులను జమ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయని రైతులు ఆశగా ఎదురుచూశారు. మరో రెండున్నర నెలల్లో వానాకాలం పంటల దిగుబడి సైతం చేతికి అందనుంది. ప్రభుత్వంపై ఆశతో వానాకాలంలోనూ అధికంగా సన్నరకాలనే సాగు చేశారు. ధాన్యం చేతికందేలోగా బోనస్ రాకపోతే రైతులు మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయించాలని భావిస్తున్నారు.ప్రైవేటుకు వద్దనుకుని.. గత యాసంగిలో ఐదెకరాల్లో మొత్తం సన్నరకం ధాన్యాన్నే పండించిన. తేమతో సంబంధం లేకుండా వడ్లు కొనేందుకు ప్రైవేటు వ్యక్తులు కల్లం వద్దకే రావడంతో 20 క్వింటాళ్ల వరకు ప్రైవేటుకే అమ్మిన. ప్రభుత్వం సన్నరకానికి బోనస్ కూడా ఇస్తుండటంతో ప్రైవేటుకు వద్దనుకుని మిగిలిన 50 క్వింటాళ్లను కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. ధాన్యం డబ్బులు పడ్డయి.. కానీ బోనస్ మాత్రం అందలేదు. – వడాయి కాంతారావు సాగుకు ఉపయోగపడేవి రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తామన్న బోనస్ డబ్బులు అందిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడేవి. ధాన్యం విక్రయించి దాదాపు మూడు నెలలు అయితంది. ఇప్పటివరకు డబ్బులు మాత్రం పడలేదు. పైసల కోసం వారానికి ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకోవాల్సి వస్తోంది. కనీసం ఎప్పుడు పడతాయో కూడా చెప్పడం లేదు. – కొట్రంగి హన్మంతు -
ఎమ్మెల్యే ఫోన్ చేసినా స్పందించరా..?
ఆసిఫాబాద్అర్బన్: ‘అత్యవసరంలో రోగులు ఆస్పత్రికి వస్తే అందుబాటులో ఉండరు. కనీసం ఎమ్మె ల్యే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరా’ అంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఓ గిరిజన గర్భిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు అదేరాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్వోకు ఫోన్ చేశారు. ఇద్దరూ స్పందించకపోవడంతో హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. మీ నంబర్ తనవద్ద లేదని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. అనంతరం బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అయితే 108 వాహనంలో డీజిల్ లేకపోవడంతో ఎమ్మెల్యే సొంత డబ్బులతో డీజిల్ పో యించి గర్భిణిని మంచిర్యాలకు తరలించారు. ప్ర స్తుతం గర్భిణి ఆరోగ్యం నిలకడగా ఉంది. రాష్ట్ర ప్ర భుత్వం అంబులెన్స్ల్లో ఇంధనం పోయించే స్థితిలో కూడా లేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. నాయకులు రవీందర్, కోవ సాయినాథ్ పాల్గొన్నారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారికి పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు సరిచేయాలని, కుటుంబ సర్వేలో పనిచేసిన వారికి రెమ్యూనరేషన్, సమ్మర్ క్యాంపులు నిర్వహించిన స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని, సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించిన వారికి ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, నాయకులు రాకేశ్, శ్రావణ్కుమార్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వరదలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): వరదలు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని మెట్టపిప్రి, సాంగ్వి గ్రామాలను గురువారం సందర్శించి వరద పరిస్థితులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణకు చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. వరదల నేపథ్యంలో కల్వర్టులను పరిశీలించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్పాషా తదితరులు పాల్గొన్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం ఓటరు ముసాయిదా తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,76,610 మంది పురుషులు, 1,77,274 మంది మహిళలు, ఇతరులు 20 మంది ఉన్నారు. గతేడాది జాబితాతో పోలిస్తే జిల్లాలో 5,575 మంది ఓటర్లు పెరిగారు. గత పంచాయతీ ఎన్నికల ముందు జిల్లాలో 3,48,329 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,74,179 మంది పురుషులు, 1,74,034 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. నేడు, రేపు రాజకీయ ప్రజాప్రతినిధులతో సమావేశం జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమావేశం కానున్నారు. శనివారం మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలిపే అవకాశం కల్పించారు. ఆదివారం ఈ అభ్యంతరాలపై డీపీవో ఆధ్వర్యంలో పరిష్కారం చూపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో తుది జాబితా ప్రచురిస్తామని డీపీవో భిక్షపతి గౌడ్ వెల్లడించారు. -
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో సీతారాంకు వినతిపత్రం అందించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాగజ్నగర్ పట్టణంలో రెండు ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారన్నారు. -
కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. లాభాల్లో వాటా, ఇతర హక్కుల సాధనలో భాగంగా గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆయన మా ట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభు త్వ సంఘం ఐఎన్టీయూసీ హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు. డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న కొత్తగూడెంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఫిట్ కార్యదర్శులు రమేశ్, వెంకటేశ్, శ్రీని వాస్, రవీందర్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సురేశ్, నాయకులు సాగర్, సమ్మయ్య, కరీముల్లాఖాన్, భిక్షపతి, సత్యనారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు. -
లంబోదరాయ నమః
జిల్లా కేంద్రంలోని వాసవీ గణేశ్ మండలి వద్ద భక్తులు మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మిద్వారకానగర్ కాలనీలో లడ్డూ వినాయకుడువినాయకుడిని దర్శించుకుంటున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్/రెబ్బెన/కాగజ్నగర్టౌన్: వినాయక చవితి సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వివిధ రకాల పూలు, పత్రితో భక్తులు వినాయకుడికి పూజలు నిర్వహించి, పాయసం నైవేద్యంగా సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయాలు, మండపాలను భారీ సెట్టింగులు, కలర్ఫుల్ లైటింగ్తో అలంకరించారు. వివిధ రకాల రూపాలతో లంబోదరుడు ఆకట్టుకున్నాడు. పలువురు భక్తులు మట్టితో చేసిన బొజ్జ గణపయ్యను ఇళ్లలోనే ప్రతిష్టించుకున్నారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మందిరంలో అర్చకులు ఇందారపు మధూకర శర్మ శమంతకమనోపాఖ్యాణం చేశారు. వివేకానందచౌక్లో వాసవీక్లబ్, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయకుడిని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, తహసీల్దార్ సూర్యప్రకాశ్ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. ‘లడ్డూ’ లంబోదరుడు కాగజ్నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో దశాబ్దాలుగా ఏకో ఫ్రెండ్లీ గణేశుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది యువజన గణేశ్ మండలి ఆధ్వర్యంలో 15 రోజుల కష్టపడి 14 అడుగుల లడ్డూ వినాయకుడిని ప్రతిష్టించారు. కాలనీలో 50 ఏళ్లుగా గణనాథుడికి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుండగా, 1999 నుంచి పర్యావరణ హితంగా ఏకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేస్తున్నారు. కొబ్బరికాయలతోపాటు స్టీల్ సామగ్రి, కూల్డ్రింక్స్ బాటిళ్లు, కూరగాయలు, వరి పేలాలు, పూలు, శివలింగాలు, రుద్రాక్ష, కొబ్బరి కుడుకలు, వెదురు గంపలు, మట్టి దీపం చిప్పలు, పత్తి, మోసంబి, రాగి వస్తువులు, పేపర్ గ్లాసులు, మక్కలు, కొబ్బరి మట్టలు తదితర వస్తువులను వినియోగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బుందీ లడ్డూతో ఏర్పాటు చేసిన పార్వతి తనయుడు చూపరులను ఆకట్టుకుంటోంది. మూడు వేల బూంది లడ్డూలు వినియోగించి గణనాథుడిని ఏర్పాటు చేశామని యువజన గణేష్ మండలి అధ్యక్షుడు ములుగూరి నరసింహ తెలిపారు. కాగజ్నగర్లోని ఇందిరా మార్కెట్ ఏరియాలో కొలువుదీరిన గణనాథుడు -
ముంపు సమస్య సత్వరమే పరిష్కరించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన ఎన్టీఆర్ కాలనీ ముంపు సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం పర్యటించారు. వరదనీరు వచ్చే ఏరియాను పరిశీలించారు. ఎగువన ఉన్న వట్టివాగు కాలువలో పూడిక కారణంగా వరద కాలనీలోకి వస్తుందని స్థానికులు తెలిపారు. వట్టివాగు ప్రాజెక్టు డీ10 వద్ద కాలువలో పూడిక తీయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన నిధులు సైతం మంజూరు చేస్తామన్నారు. డ్రెయినేజీల్లో పూడిక సైతం ఎప్పటికప్పుడు తొలగించాలని, తద్వారా వర్షపు నీరు సులువుగా బయటకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, సీఐ సంజయ్, ఎస్సై చంద్రశేఖర్, ఆర్ఐలు సౌమ్య, ఉదయ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, గోపి, రాజేశ్, చిరంజీవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంటల నష్టం వివరాలు నమోదు చేయాలి ఆసిఫాబాద్: భారీ వర్షాలతో జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి గురువారం అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులుగా భారీ వర్షం కురవడంతో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని, అర్హులైన ప్రతీ రైతు పేరు జాబితాలో ఉండాలని సూచించారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా నివేదిక రూపొందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో డీఏవో శ్రీనివాసరావు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
‘రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం’
కాగజ్నగర్టౌన్/బెజ్జూర్: రాష్ట్రంలో యూరియా కోసం అవస్థలు పడుతుంటే, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బుధవారం సిర్పూర్(టి) మండలంలోని ప లు గ్రామాల్లో పర్యటించారు. గురువారం బెజ్జూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎంకు రైతుల కంటే బిహార్ ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ల బ్లాక్ దందాలే యూరియా కొరతకు కారణమన్నారు. రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉండటంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫి కెట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించా రు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు, నాయకులు విశ్వనాథ్, అర్షద్ హుస్సేన్, సారయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. -
4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్!
కాసిపేట: సర్కారు కొలువు సాధించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఏఈ (ఆపరేషన్)గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటులో రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం పాతబస్తీ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చల్ల రమేశ్, రమాదేవి దంపతులు మంచిర్యాల వినూత్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు చల్ల ఆదర్శ్ 2018లో సింగరేణి (Singareni) సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఓవర్మెన్గా ఎంపికయ్యాడు.ఉన్నతోద్యోగం సాధించాలనే లక్ష్యంతో అందులో చేరలేదు. ఆ తర్వాత రైల్వేశాఖలో జూనియర్ ఇంజనీర్గా ఎంపికయ్యాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీపీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం (Junior Engineer Job) సాధించాడు. 2022లో రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి సిర్పూర్ ఏఈగా విధుల్లో చేరాడు. గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఏఎండీ ప్రాసెసర్ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో నియామకం అయ్యాడు. ఈ ఉద్యోగంలో చేరుతున్నానని, ఎప్పటికైనా గ్రూప్స్ సాధించడమే తన లక్ష్యమని ఆదర్శ్ తెలిపారు.చదవండి: అమెరికా నుంచి వచ్చి ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై -
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్బీఎస్కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ లావాదేవీలు అ న్ని సీకేర్స్ పోర్టర్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, సేవలన్నీ పారదర్శకంగా ఉంటాయని పే ర్కొన్నారు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీ ఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని సూచించారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్కు అర్హులు, పె న్షన్, రివైస్డ్ పెన్షన్పై ఎలాంటి పెండింగ్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చా రు. పెన్షన్, సీఎంపీఎఫ్ దరఖాస్తులు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందకు ప్రతీ ఉద్యోగి కృషి చే యాలని సూచించారు. ఎస్వోటూ జీఎం రాజమ ల్లు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, అన్ని విభాగాల సంక్షేమ శాఖ క్లరికల్ సిబ్బంది ఉన్నారు. -
‘సరిహద్దు’లో కర్ర గణేశులే..
భైంసా/తానూరు: గణేశ్ నవరాత్రోవాలను నిర్మల్ జిల్లాలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామా ల ప్రజలు వినూత్న రీతిలో జరుపుకొంటారు. పీవో పీ, మట్టి విగ్రహాలు ఇక్కడ మచ్చుకై నా కనిపించవు. రంగులు, రసాయనాల వినియోగం అస్సలే ఉండదు. హంగులు, ఆర్భాటాలు లేకుండా సమాజహితమే తమ అభిమతమని ఇక్కడి ప్రజలు పూర్వీకులు చూపిన బాటనే నేటికీ అనుసరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా దోహదం చేస్తున్నారు. కర్రతో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పాలజ్ గణేశ్ ఫేమస్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్. కుభీర్కు పక్కనే మహా రాష్ట్రలోని బోకర్ తాలూకాలో ఈ ఊరు ఉంది. స్వా తంత్య్రానికి పూర్వం ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి జనమంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఓ వైపు కలరా, ప్లేగు వ్యాధులు, మరోవైపు కరువు పరిస్థితులతో జనం సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను కలిశారు. నిష్టతో గుండాజీ వర్మ చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊ రంతా మొక్కితేనే వ్యాధులు దూరమయ్యాయని, కరువు కాటకాలు తొలగిపోయాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా 1948 నుంచి కర్ర గణేశుడిని వినా యక ఉత్సవాల్లో కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఊరి ఆడబిడ్డల ద్వారానే కర్రగణేశుడి గురించి ఇతర గ్రామాలకు తెలిసింది. పూజల అనంతరం నిమజ్జనం రోజున స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి కర్ర గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీనినే నిమజ్జ నోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహా న్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కలిసికట్టుగా.. లక్షలాదిగా.. తిరుపతి, షిర్డీలో ఉన్నట్లు పాలజ్లోనూ భక్తులకు క్యూలైన్లు ఉన్నాయంటే.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయొచ్చు. ప్రతీ ఏడాది వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. లక్షల్లో తరలివచ్చే భక్తులకు గ్రామస్తులే సేవలందిస్తున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా కర్రగణేశుషుడి సేవలో పాల్గొంటుండడం ఇక్కడి విశేషం. మరికొన్ని గ్రామాల్లోనూ.. తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్ మండలం కుభీర్, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఇలా ఈ ప్రాంతంలో ఊరంతా కలిసి కర్ర గణపతులను ప్రతిష్ఠించడం మొదలైంది. పాలజ్కు ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్ వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు. ఉదయం లేవగానే నీటితో కడిగి పూజించి వెళ్తారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలోనూ ప్రధాన ద్వారంలో ఉన్న గణపతికి నమస్కరిస్తారు. తిరిగి వస్తూ మళ్లీ గణపతికి నమస్కరించాకే ఇంటిలోకి వెళ్తారు. ఏ ఆలయం నిర్మించినా ముందుగా గణపతి పూజలు చేస్తారు. గణపతి హోమాలు నిర్వహిస్తారు. ఇలా అందరికీ గణాధిపతి అయిన స్వామివారికి ముద్గల పురాణంలో 32 స్వరూపాలను వర్ణించారు. ఈ 32 స్వరూపాల్లో 16 రూపాలు అత్యంత ప్రాశస్థ్యమైనవి. పురాణాల్లో పేర్కొన్న రూపాలు పురాణాల్లో వినాయకుడికి 32 స్వరూపాలుగా పేర్కొన్నారు. ఇందులో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనమని తెలిపారు. నేటి రోజుల్లో కళాకారులు గణపయ్యను అనేక రూపాల్లో మలుస్తున్నారు. ఈ 16 రూపాల్లో ఉన్న గణనాథులకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో పేర్కొన్నట్లు బాలగణపతి, తరుణగణపతి, ఉచ్చిష్టగణపతి, విఘ్నగణపతి, మహాగణపతి, క్షిప్రగణపతి, హేరంబగణప తి, లక్ష్మీగణపతి, భక్తిగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, ద్విజగణపతి, సిద్ధగణపతి, నృత్యగణపతి, ఊర్ధ్వగణపతి, విజయగణపతి.. ఇలా 16 ప్రధానమైన రూపాలున్నాయి. -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్లోని ఎస్ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.27వేల కోట్ల బకాయిలుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వే ల కోట్లకు పెరిగిందని తెలిపారు. సమయానికి బకా యిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీ య జోక్యంతో సంస్థ పాలన గాడి తప్పుతోందని తె లిపారు. గుర్తింపు సంఘంగా తాము గెలిచిన తర్వా త కార్మికుల ప్రధాన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరగని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మి కుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ వార్షిక లాభాలను ప్రకటించి అందులో నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డి మాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కా ర్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల కమిటీ ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, సంపత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజి యన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, పిట్ సెక్రటరీ మురళీచౌదరి, ఆకుల లచ్చన్న, జాడి రాజకుమార్, కారుకూరి నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్, స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్, అసోసియేట్ డీన్లు చంద్రశేఖర్, మహేశ్, విఠల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులు ఉపేందర్, భావ్సింగ్ వినయ్, కోఆర్డినేటర్ తేజస్వి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ సీఈవోల బదిలీకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలకు స్థానచలనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66మంది సీఈవోలు ఉండగా, 49 మందిని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 17 సొసైటీల్లో రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో వారికి ఎలాంటి బదిలీ జరగలేదు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేసినట్లు జిల్లా సహకారశాఖ అధికారి మోహన్ తెలిపారు. -
నవోదయకు 6,091 దరఖాస్తులు
కాగజ్నగర్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయం అన్ని వసతులతో పాటు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమై న విద్యకు మారుపేరుగా నిలుస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు www. navodaya. gov. in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 6,091 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,003 మంది బాలికలు, 3,088 మంది బాలుర దరఖాస్తులున్నాయి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుల వివరాలు చెన్నూరు నుంచి 274 దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి 287, మంచి ర్యాల నుంచి 510, కాగజ్నగర్ నుంచి 631, సిర్పూ ర్ నుంచి 378, ఆదిలాబాద్ నుంచి 571, బెల్లంపల్లి నుంచి 270, బోథ్ నుంచి 319, నిర్మల్ నుంచి 590, భైంసా నుంచి 664, లక్సెట్టిపేట్ నుంచి 350,మందమర్రి నుంచి 279, ఉట్నూర్ నుంచి 377, ఆసిఫాబాద్ నుంచి 591 వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిభాషా విధానం అమలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థులు ఐదో తరగతి చదివి ఉండాలి. వరుసగా 3, 4, 5 తరగతులు ఒకే పాఠశాలలో చదివినవారే అర్హులు. విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్యలో జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో త్రిభాషా విధానం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్కు క్వార్టర్లు వంటి వసతులున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపకులు, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్బాల్ తదితర మైదానా లు జిమ్, హెల్త్సెంటర్లతో నవోదయ ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. 6, 7 తరగతులకు మాతృబాషలో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి 2026–27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్లో ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, కాగజ్నగర్ నవోదయ విద్యాలయం -
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
కాగజ్నగర్టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం జూని యర్ అసిస్టెంట్ కార్తీక్కు సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సిర్పూర్(టి), తిర్యాణి, కాగజ్నగర్, వాంకిడి మండలాల్లోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి ఈపీఎఫ్ పూర్తి వివరాలను అందించాలని, ఈఎస్ఐ, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1 తర్వాత సమ్మెలోకి వెళ్తామని తెలిపారు. అనంతరం కాగజ్నగర్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కార్మికులు తుకారం, తిరుపతి, మారుతి, దేవిరావు, పరమేశ్వర్, సిబ్బంది ఉన్నారు. -
డెంగీ కలవరం!
కౌటాల(ఆసిఫాబాద్): జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె జనం మంచం పడుతున్నారు. జ్వరం, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు జ్వరాల బారినపడి ఇంటిబాట పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తిర్యాణి మండలం పంగిడిమాదర పంచాయతీ పరిధిలోని రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం– దివ్యజ దంపతుల కుమారుడు ఆత్రం అనురాగ్(12) డెంగీతో సోమవారం రాత్రి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ నెల 19న అతడికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సీజన్లో 11 కేసులుజిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఐదు సీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీలతోపాటు 15 పీహెచ్సీల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. లింగాపూర్, బాబాపూర్ పీహెచ్సీల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉన్నారు. పీహెచ్సీకి కనీసం ఇద్దరు, ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండడంతో మెరుగైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు ఉండగా, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న గ్రామ పంచాయతీలు 60కిపైగా ఉన్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో డెంగీ జ్వరం పేరు అంటేనే ఆందోళన మొదలైంది. ఆర్బో వైరస్తో ఈ జ్వరం సోకుతుంది. పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమతో వ్యాప్తి చెందుతుంది. పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెందుతాయి. అనుమానం ఉంటే రోగికి వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. తెల్ల రక్త కణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ తగ్గడం, ఎర్ర రక్తకణాల పరిమాణం పెరగడం తదితర వివరాలు ఎలిసా పరీక్షతో నిర్ధారించవచ్చు. పెరుగుతున్న వైరల్ జ్వరాలుకాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో రెండు నెలల్లో 600 మందికి పైగా వైరల్ జ్వరాల బారిన ప డ్డారు. అలాగే 30 మలేరియా కేసులు, 50కి పైగా డ యేరియా, 30కి పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అనాధికారికంగా జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సాధారణ ఫ్లూ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటితో బాధపడుతున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్సీల్లో సాధారణ రోజుల్లో 70– 80 వరకు ఓపీ ఉంటే ఆగస్టులో 160 వరకు పెరిగింది. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 500 ఓపీ ఉండగా ప్రస్తుతం 700లకు పైగా వస్తున్నారు. నిత్యం సుమారు 80 వరకు ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలో సరై న సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. డెంగీకి ప్రధాన ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తుండటంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలే జ్వరం నిర్ధారించి చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దోమల విజృంభణగ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. వై ద్యారోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్ శాఖల స మన్వయంతో చేపట్టాల్సి పనులు ఆగిపోయాయి. డ్రెయినేజీల్లో పూడిక తీయడం లేదు. మురుగునీరు నిలిచి ఉంటుంది. దోమలు వృద్ధి చెందాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జ్వరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పూలాజీబాబా జయంతి ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జైనూర్ మండలం పాట్నాపూర్లో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాట్నాపూర్లోని పూలాజీ బాబా సంస్థాన్లో జయంతి వేడుకల నిర్వహణపై అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంస్థాన్ వద్ద వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు రూట్మ్యాప్ తయారు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తాగునీటికోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. జాతరలో వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి అందుబాటులో ఉండాలన్నారు. భోజన వసతి వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రముఖుల కోసం బారికేడ్లు ఏర్పాటు చే యాలని సూచించారు. అనంతరం జయంతి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవరావు, ట్రాన్స్కో ఎస్ఈ రాథోడ్ శేషారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతా రాం, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి, సీఐ బాలాజీ వరప్రసాద్ పాల్గొన్నారు. పారదర్శకంగా పింఛన్లు పంపిణీపారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ దీపక్తివారితో కలిసి బ్రాంచ్పోస్టల్ ఆఫీసర్ల(బీపీఎం)లకు మొబై ల్స్ అందించారు. మొబైల్లో ప్రత్యేక యాప్లో పెన్షన్దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు. ప్రతినెలా ఐరిష్, వేలిముద్రల ద్వారా పెన్షన్ అందించనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రావయ్యా.. గణపయ్యా
ఆసిఫాబాద్/కౌటాల: మరికొన్ని గంటల్లో వాడవాడలా గణపయ్య కొలువుదీరనున్నాడు. పార్వతి తనయుడి ఆగమనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుధవారం వినాయక చవితి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అందమైన సెట్టింగ్లు, లైటింగ్తో మండపాలు ఆకర్షనీయంగా ముస్తాబవుతున్నాయి. నవరాత్రులకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించనున్నారు. 800 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1200లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుఈ ఏడాది సుమారు 1000లకు పైగా గణపతి విగ్రహాలు ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలు, కాలనీలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వా డవాడలా నవరాత్రోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. వారం రోజులుగా నిర్వాహకులు విగ్రహాల బుకింగ్, విద్యుత్ పనులు, లైటింగ్ ఏర్పాట్లు, పోలీ సుల నుంచి అనుమతులు పొందడం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోనూ విగ్రహాల తయారీదారులు దుకా ణాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారు ముందస్తుగానే ప్రత్యేక వాహనాల్లో విగ్రహాలను తరలిస్తున్నారు. మరికొందరు కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాల్లో వినాయకుడి ప్రతిమలు కొనుగోలు చేశారు. పీవోపీ విగ్రహ తయారీ ముడిసరుకు, కెమికల్, రంగుల ధరలు భారీగా పెరగడంతో ప్రతిమల ధరలు కూడా పెంచారు. ఆరు ఫీట్ల ఎత్తు విగ్రహానికి రూ.15 నుంచి 20 వేల వరకు విక్రయిస్తుండగా, 10 ఫీట్ల విగ్రహానికి రూ.30 నుంచి రూ. 40 వేల వరకు ధర ఉంది. మంటపాల వద్ద తొమ్మిది రోజులపాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్లోని ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. భక్తులు పూజా సామగ్రి కొనుగోలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ జిల్లా కేంద్రంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లోనూ పోలీసులు వేడుకల నిర్వహణపై పీస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ.. కమిటీ సభ్యులకు సూచనలు చేస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నిమజ్జనం వరకు నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. పత్రాలు, ఫలాలతో పూజలువినాయక చవితి పండగ రోజున విఘ్నేశ్వరుడికి 21 రకాల పువ్వులతో పూజిస్తారు. ఔషధ గుణాలు కలిగి ఉండే ఈ ఆకులతో పూజించడం, ఆ తర్వాత వాటిని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేయడం ద్వారా జలాలు శుభ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మాచి, పత్రి, గరిక, ఉత్తరేణి, ములక, ఉమ్మెత్త, తులసి, మారెడు, రేగు, మామిడి, గన్నేరు, ధవనం, జాజిమల్లె, తెల్లమద్ది, దేవదారు పత్రం, దానిమ్మతో పాటు పలురకాల పత్రాలతో వినాయకుడికి పూజలు చేస్తారు. ఉండ్రాళ్లు, లడ్డూలు, పాయసం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మట్టి విగ్రహాలకు పెరిగిన ప్రాధాన్యంప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతులతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. నిమజ్జనం తర్వాత కూడా నీటిలో కరగకుండా ఎక్కువ కాలం ఉండటంతో నీటి వనరుల్లో కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మట్టి గణపతులు ప్రతిష్టించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంలో 335 గ్రామ పంచాయతీలకు ప్రతీ పంచాయతీకి పది చొప్పున అధికారులే మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. సోమవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో వాసవీక్లబ్, పద్మశాలి సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.