breaking news
Komaram Bheem
-
ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
బెజ్జూర్(సిర్పూర్): 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్, సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రద్ధా శుక్లా అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి నూతన ఓటర్లను నమోదు చేయాలని, చనిపోయినవారి జాబితా రూపొందించాలని ఆదేశించారు. తప్పొప్పులు సవరించాలని అన్నారు. గ్రామాల నుంచి వలస వెళ్లినవారిని గుర్తించడంతోపాటు నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లానాయక్, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల తనిఖీకాగజ్నగర్రూరల్: మండలంలోని గన్నారం ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడేడ్ రెసిడెన్షియల్ కళాశాలను గురువారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తని ఖీ చేశారు. రెసిడెన్షియల్లోని వంటశాలను పరిశీ లించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. కోడిగుడ్లు, పాలు ఇస్తున్నారా.. అని ఆరా తీశారు. డైనింగ్ హాల్లో విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. మోనూ ప్రకా రం భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకు లు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించి నిబంధనలు పాటించాలని సూచించారు. -
బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ తొలగింపు
ఆసిఫాబాద్: విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ జి ల్లా నోడల్ అధికారి కళాధర్రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గృహజ్యోతియేతర విద్యుత్ కనెక్షన్ల బకాయిలు వందశాతం వసూలు చేయాలన్నారు. సక్రమంగా చెల్లించని వారి కనెక్షన్లు తొలగించాలని సూచించారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు, ఏఏవో తుకారాం, ఏఈలు లక్ష్మీరాజం, ఊర్మిళ, సిబ్బంది పాల్గొన్నారు. -
నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దు
కెరమెరి(ఆసిఫాబాద్): ఫర్టిలైజర్ దుకాణాల్లో నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. గోదాంలు, తూకం యంత్రాలు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల ఎదుట స్టాక్, నిల్వ, ధరల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ భూమేశ్వర్, ఏడీఏ వెంకట్, ఏవో యుగేందర్ ఉన్నారు. -
మానవత్వం మరిచి..
మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలే జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవపడి దాడి చేసి చంపాడు. కాగజ్నగర్ మండలం వంజిరీ గ్రామానికి చెందిన డోకే జయరాం మొదటి భార్య భీంబాయికి ఓ కూతురు పుట్టగా.. మగ సంతానం కోసం జగన్నాథ్పూర్కు చెందిన పోషక్క(40)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 24న పోషక్కతో గొడవపడి తలపై పలుగుతో బలంగా కొట్టి హత్య చేశాడు.కౌటాల(సిర్పూర్): పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, వ్యవసాయ భూముల పంచాయితీలు, ప్రేమ వ్యవహారాలు.. కారణాలు ఏవైనా జిల్లాలో నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హత్య కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో 2023లో 32 హత్యలు జరగగా, 21 హత్యాయత్నాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాగే 2024లో 12 హత్యలు, 32 హత్యాయత్నాలు జరిగాయి. పచ్చనికాపురాల్లో చిచ్చుముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి మరొకరు రావడంతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు జరుగుతున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామంలోనూ ఓ యువకుడు వివాహేతర సంబంధం వివాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. భూతగాదాలు.. ప్రేమ వ్యవహారాలుగ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అలాగే ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో భూములకు విలువ పెరిగింది. పోడు భూములకు సైతం రైతులు పట్టాలు పొందారు. ఫలితంగా భూపంచాయతీలు పెరిగిపోయాయి. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాల విషయంలోనూ దాడులకు పాల్పడుతున్నారు. గత నెల 19న చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామంలో భూవివాదంలో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారాలు కూడా అగ్గిరాజేస్తున్నాయి. గత నెల 3న కౌటాల మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యహహారంలో అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు యువకుడిని కర్రలతో చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో స్నేహితుల మధ్య విభేదాలు తలెత్తినా చివరకు హత్యకు దారితీస్తున్నాయి. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయినవారే కడతేరుస్తున్నారు.. వివాహేతర బంధాలు.. భూ తగాదాలే ప్రధాన కారణాలు ఏటా పెరుగుతున్న హత్య కేసులుసామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య, భూ వివాదాల్లో సమస్యలు వస్తే క్షణాకావేశంతో వ్యవహరించొద్దు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆత్మహత్యలకు పాల్పడడం లేదా మరొకరిని హత్య చేయడం సరికాదు. నేరాలకు పాల్పడితే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. బాధిత కుటుంబాలు రోడ్డున పడతాయి. నేరాల నియంత్రణకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలు ఉంటే డయల్ 100 లేదా పోలీసులను సంప్రదించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీకష్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలవాల్సిన భార్యే అతడి పాలిట మృత్యువైంది. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సతీశ్(30) నంబాలకు చెందిన రజితను వివాహం చేసుకున్నాడు. కాయకష్టం చేసి అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వస్తున్నాడనే కారణంతో జనవరి 16న గుర్తుతెలియని పురుగుల మందు తాగించి సతీశ్ను అతడి భార్య చంపింది. -
కలెక్టర్కు వినతి
ఆసిఫాబాద్రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డీఐఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు గురువారం వినతిపత్రం అందించా రు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్తీక్, దినకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా వేలాది మంది చదువుకుంటున్నారని తెలిపారు. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో స్కూళ్లు మూతబడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికై నా పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా తిప్పలు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కుమ్మరి రాజయ్య. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో పదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం ఎనిమిది ఆకుల దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు ఎరువులు వేయాలి. రెబ్బెన పీఏసీఎస్లో యూరియా పంపిణీ జరుగుతోందని తెలుసుకుని బుధవారం వెళ్లగా అధికారులు పాస్పుస్తకానికి రెండు బస్తాల చొప్పున చీటీ రాసి ఇచ్చారు. రెండురోజులుగా యూరియా బస్తాల కోసం పీఏసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తే.. గురువారం సాయంత్రం వరకు ఒక్క బస్తా అందలేదు. వారంలో పదెకరాలకు మందు వేయాల్సి ఉండగా.. అధికారులు ఇచ్చే రెండు యూరియా బస్తాలను ఎన్ని ఎకరాలకు సరిపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. జిట్టవేణి హన్మంతుది రెబ్బెన మండలంలోని కై రిగూడ. 12 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడు దఫాల్లో వేయాల్సిన యూరియా తప్పా మిగిలిన ఎరువులను ఫర్టిలైజర్ షాపులో కొన్నాడు. ఇక 60 యూరియా బస్తాల కోసం అడిగితే గంట మందు బస్తాలు కొంటేనే యూరియా అందిస్తామని షాపు యజమాని చెప్పడంతో కంగుతిన్నాడు. గంట మందు, యూరియా బస్తాలకు రూ.750 అవుతుందని చెప్పడంతో.. బుధవారం పీఏసీఎస్కు వచ్చాడు. అధికారులు కేవలం రెండు బస్తాలకే చీటీ రాసి ఇచ్చారు. బయట యూరియాతో ఇతర ఎరువులు ముడిపెడుతుండగా.. పీఏసీఎస్లో కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఏమీ పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. అన్ని మండలాల్లో రైతులు దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుచేస్తున్న రైతులు యూరియా బస్తాల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపడడం లేదు. పత్తి పంటకు మొదటి దఫా ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఒకటి, రెండు బస్తాలు అందించి అధికారులు చేతులెత్తుతున్నారు. అరకొర అందిన యూరియా ఏ మూలకు వేయాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలు ఉండటంతో వారిపై అదనపు ఆర్థికభారం పడుతోంది. ముందస్తు అవసరాల కోసం ఇప్పుడే..జిల్లాలోలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్లో సుమారు 4.5లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 3.35లక్షల ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి, 30,430 ఎకరాల్లో కంది, మరో 22,395 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తారు. ఈ సీజన్లో 60,081 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి ఇండెంట్ పంపించారు. ఇప్పటివరకు జిల్లాకు సుమారు 25వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరాఫరా చేసింది. గతంతో పోల్చితే జిల్లాకు పంపించాల్సిన యూరియాలో కోత విధించింది. దీంతో రైతులు ఆశించినస్థాయిలో బస్తాలు లభ్యం కావడంలేదు. జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తికి మాత్రమే వినియోగిస్తుండగా, మరో 20 రోజులు గడిస్తే వరినాట్ల ప్రక్రియ మొదలుకానుంది. పంటల కాలం పూర్తయ్యే వరకు వేయాల్సిన యూరియా మొత్తం ఒకేసారి కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పొలాలకు దారి లేకపోవడం, భవిష్యత్తులో యూరియా బస్తాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో మూడు దఫాలకు సరిపడా ఇప్పుడే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీంతో పీఏసీఎస్లకు, హాకా సెంటర్ల నుంచి బస్తాలు పంపిణీ చేస్తున్నా సరిపోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 7,500 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వేరే బస్తాలు కొంటేనే..ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో వేరే బస్తాలు కొనుగో లు చేస్తేనే.. యూరియా ఇస్తామని యజమానులు మెలిక పెడుతున్నారు. గంటమందు బస్తాలు, ఇతర సేంద్రియ ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం రూ.266 నిర్ణయించగా.. ప్రస్తుతం కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తూ స్టాక్ లేదని చెబుతున్నారు. రైతుల అవసరాలకు సరిపడా అందని ఎరువు కేంద్రాల వద్ద బారులుదీరుతున్న అన్నదాతలు ఫర్టిలైజర్ వ్యాపారుల తీరుతోనూ ఇబ్బందులు బారులుదీరుతున్న అన్నదాతలుసరిపడా యూరియా బస్తాలు లభ్యం కాకపోవడంతో రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. కొన్ని మండలాల్లో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎకరానికి రెండు బస్తాల చొప్పున అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు పీఏసీఎస్లు, హాకా కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రెండు, మూడు రోజులు వేచిచూసినా కొంతమందికి ఒక్క బస్తా అందడం లేదు. రెబ్బెన మండలంలోని పీఏసీఎస్కు ఇప్పటివరకు కేవలం మూడు లారీ లోడ్ల యూరియా సరఫరా కాగా.. ప్రతీ రైతుకు కేవలం రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. పదుల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నవారికి కూడా రెండేసి మాత్రమే అందించారు. మొదటి రోజు బస్తాల పంపిణీ కోసం చీటీలు రాసి ఇవ్వగా.. రెండోరోజు గురువారం ఆలస్యంగా పీఏసీఎస్ కార్యాలయాన్ని తెరిచారు. అధికారుల తీరును తప్పుపడుతూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆసిఫాబాద్, కెరమెరి, కౌటాల తదితర మండలాల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆందోళన చెందొద్దు జిల్లాలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దు. ప్రస్తుతం పంటలకు వేయాల్సిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెలా ఎరువులు సరాఫరా అవుతూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దారి సౌకర్యం, ఇతరాత్ర కారణాలతో బస్తాలన్నీ ఒకేసారి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలో 7500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత ఆసిఫాబాద్: అధికారులు, సిబ్బంది సమష్టి కృషి తో తిర్యాణి ఆస్పిరేషనల్ బ్లాక్ జాతీయ స్థాయిలో ఐదు, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపా రు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా అధికా రులు, తిర్యాణి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిర్యా ణి ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకు సాధించడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు, ఆయాల కృషి ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంఘాలు, మహిళల రివాల్వింగ్ ఫండ్, గర్భిణులకు పోషకాహారం అందించడం, శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడం, విద్యా రంగ అభివృద్ధి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, భూ ఆధార్ కార్డుల జారీ వంటి అంశాల్లో వందశాతం అభివృద్ధి సాధించాలని ఆదేశించారు. అనంతరం జాతీయస్థాయి ర్యాంకు సా ధించడంలో కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్వో సీతా రాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, ఎంపీడీవో మల్లేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలతోనే పర్యావరణ సంరక్షణ
ఆసిఫాబాద్రూరల్: మొక్కల పెంపకంతోనే పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని గోవింద్పూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలుష్యం నియంత్రించేందుకు పర్యావరణ రక్షణకు పాటుపడాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వంటలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, ఎంఈవో సుభా ష్, ఏపీవో బుచ్చయ్య, ఎంపీవో మౌనిక, ఏఈ సంజయ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్రూరల్: వర్షాకాలం నేపథ్యంలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల వివరాలు, వంట గదిలో సరుకులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం, విద్యనందించాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి నదీమ్ అహ్మద్, ప్రిన్సిపాల్ రత్నబాయి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల తిప్పలు.. వరదలో బస్తాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలోని రైతులకు ఎరువుల కోసం తిప్పలు తప్పడంలేదు. వానాకాలం పంటలకు కావాల్సిన యూరియా దొరకడం లేదు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా.. అధిక రేట్లకు విక్రయిస్తుండటంతో అన్నదాతలపై ఆర్థికభారం పడుతోంది. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్కు మంగళవారం ఓ లారీ లోడ్ యూరియా వచ్చింది. బుధవారం మరో లారీ లోడ్ రావడంతో వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ ప్రారంభించారు. వందలాది మంది తరలిరావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేసేందుకు టోకెన్లు జారీ చేశారు. కొంతమందికి అధికారులు దొడ్డిదారిలో ఎక్కువ బస్తాలు ఇవ్వడంతో రైతులు ఆగ్రహించారు. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సముదాయించారు. తడిసిన బస్తాలు.. బుధవారం వచ్చిన లారీ గోడౌన్ వరకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపి అన్లోడ్ చేశారు. వర్షం కురవడంతో బస్తాలపై సిబ్బంది కవర్ కప్పించారు. అయితే రోడ్డు వెంబడి వచ్చిన వరద నీటితో బస్తాలు తడిసిపోయాయి. కనీసం వాటిని అక్కడ నుంచి తీసి పక్కన పెట్టకుండా నిర్లక్ష్యంగా వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తడిసిన బస్తాలనే వారికి అంటగట్టారు. ఓ జిల్లాలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతుండగా, రెబ్బెన మండలంలో బస్తాలను వరద ప్రవాహంలో తడుస్తున్నా పట్టించుకోకుండా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
సామర్థ్యాల ఆధారంగా బోధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు వారి వి ద్యాసామర్థ్యాల ఆధారంగా బోధించాలని అ దనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని ఝరి ప్రాథకోన్నత పాఠశాల, హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్ పరీక్ష ప్రశ్నపత్రాలను పరిశీలించారు. వి ద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించి ప్రశ్నలు అడిగారు. పుస్తకాలు, నోట్బుక్స్, యూని ఫాం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు కొఠారి, రింగన్ఘాట్లో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లతోపాటు మండల కేంద్రంలోని మోడల్ గృహాన్ని పరిశీలించారు. ఎంఈవో ఆడే ప్రకాశ్, ఎస్వో శ్రీనివా స్, ఎంపీడీవో అంజద్పాషా, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య తదితరులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం
సిర్పూర్(టి): సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయొద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించని క్లినిక్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో సిద్దార్థ, అధి కారులు సఫీద్దున్, రవిదాస్, శ్రీకాంత్, సందీప్, ఆర్ఎంపీ సంఘం నాయకులు రాజేశ్వర్, సత్యనారా యణ, నాందేవ్, సుకృజీ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
చింతలమానెపల్లి/కౌటాల/బెజ్జూర్ : పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ పోలీస్ స్టేషన్లను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల రక్షణ పోలీసుల బాధ్యతని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, బ్లూకోల్ట్ సిబ్బంది డయ ల్ 100 కాల్స్కు స్పందించి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. సరిహద్దు నుంచి అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి, నివారణ కోసం కృషి చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు ఇస్లావత్ నరేశ్, విజయ్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
లైటింగ్ లేదు.. నేరుగా హైవే పైకి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండల పరిధిలోని ఎడవెల్లి, ఇందిరానగర్ల వద్ద జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద సరైన లైటింగ్ సిస్టం లేదు. వాహనదారులు నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా.. ప్రత్యామ్నాయంగా సర్వీసు రోడ్లు అందుబాటులో లేవు. రాత్రిపూట రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారు వాహనదారులకు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ఇదే తరహాలో రోడ్డు దాటే క్రమంలో వాహనాలు ఢీకొని మృతిచెందారు. అదే సర్వీసు రోడ్డు సౌకర్యం కల్పించి ఉంటే ప్రజలు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించేవారు. గ్రామం నుంచి బయటకు వచ్చే వాహనదారులు సైతం నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా సర్వీసు రోడ్డు గుండా ప్రయాణించి.. ఆపై హైవే పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎడవెల్లి వద్ద ఒక వైపు నుంచి పర్సనంబాల, మరో వైపు కొండపల్లి గ్రామాలు ఉంటాయి. అక్కడ తప్పనిసరిగా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడవెల్లి, ఇందిరానగర్ల వద్ద రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్ట్యా పోలీసులు సమస్యాత్మక ప్రదేశాలుగా గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు కల్పించారు. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ జాగ్రత్త చర్యలు తాత్కాలిక ఉపశమనమే తప్పా శాశ్వత పరిష్కారం కాదు. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
మంచిర్యాలక్రైం: కాళేశ్వరం జోన్స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సి బ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదా వరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ర మేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
కాగజ్నగర్రూరల్: జిల్లాలోని రైతులకు ఇ బ్బందులు రానీయకుండా, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో పంపిణీ చేస్తున్న డీఏపీ, యూరియాను బుధవారం పరిశీలించారు. పలువురు రైతులు యూరియా, డీఏపీ సరిపడా ఇవ్వడంలేద ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. వెంట నే సంబంధిత ఏవో రామకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉ న్నాయని, యూరియా తగ్గించి నానో యూరి యా వాడాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఏవో వివరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ అధిక ధరలకు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేవాంకిడి(ఆసిఫాబాద్): రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే డీలర్లను హెచ్చరించారు. మండల కేంద్రంలోని రాయల్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దుకాణంలో ధరలు, నిల్వల స్టాక్ పట్టికలు ప్రదర్శించాలన్నారు. యూరియా, డీఏపీ, ఇతర మందులు అధిక ధరలకు విక్రయించడం, ఇతర మార్గాల ద్వారా తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ స్టాకు వివరాలు సమర్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, వ్యవసాయ అధికారి గోపికాంత్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
దర్జాగా కబ్జా!?
● జిల్లా కేంద్రంలో అక్రమంగా వెలుస్తున్న టేలాలు ● మున్సిపాలిటీగా మారినా మారని తీరు ● అధికారులపై నేతల ఒత్తిళ్లు!సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా కేంద్రం అక్రమ టేలాలకు అడ్డాగా మారింది. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే చాలు రాత్రికి రాత్రి అక్రమంగా టేలాలు వెలుస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో ప్రధాన రహదారుల్లో యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది ఏడాదికి పైగా గడిచినా అక్రమంగా టేలాలు నేటీకీ వెలుస్తుండం గమనార్హం. రహదారుల విస్తరణకు రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదాయానికి గండి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి వివేకా నంద చౌక్ మీదుగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని బాలికల పాఠశాల వరకు ఇరువైపులా... ఇటు వైపు డీఎస్పీ కార్యాలయం వరకు టేలాల సంస్కృతి కొనసాగుతోంది. సర్కారు స్థలంలో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి రూ.లక్షల ఆదాయం సమకూరుతుంది. కానీ అక్రమంగా ఏర్పాటు చేసిన టేలాల నుంచి మున్సిపాలిటీ అధికారులు నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తద్వారా భారీగా ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. పైగా ఇష్టానుసారం రహదారిపై ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. అయితే సంబంధిత యజమానులు మాత్రం వాటిని అద్దెకు ఇచ్చి రూ.వేలల్లో అర్జిస్తున్నారు. ఇక శనివారం సంత సమయంలో అయితే ఆ ప్రాంతంలో ప్రజలకు నరకమే. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట టేలాలు ఏర్పాటు చేయడంతో అక్కడ టెండరు ద్వారా దుకాణాలు పొందిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబాపూర్ వెళ్లే మార్గంలోని మర్రిచెట్టు చౌరస్తా వద్ద కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా టేలాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మొదట పదుల సంఖ్యలో ఉండగా, అవి ప్రస్తుతం వందల సంఖ్యకు చేరడం గమనార్హం. రహదారులకు ఇరువైపులా ఎక్కడైనా ఖాళీ జాగా కనబడితే తొలుత చిన్నగా ఆక్రమించడం.. తర్వాత శాశ్వత షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పంచాయతీ అధికారులు ఈ టేలాలను తొలగించే ప్రయత్నం చేశారు. కొందరు రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో అప్పట్లో ఆ ప్రయత్నం అధికారులు విరమించుకున్నారు. ఇదే విషయంపై ‘సాక్షి’ ఓ జిల్లా ఉన్నతాధికారి వివరణ కోరగా పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాక ఈ అక్రమ టేలాలు అన్నింటినీ తొలగిస్తామని స్పష్టం చేశారు. స్థానిక నేతల్లో కుదరని ఏకాభిప్రాయం అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరికివారే యుమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో టేలాల తొలగింపు కార్యక్రమం అప్పట్లో అటకెక్కింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కలిసి రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అసిఫాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలుచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. కలెక్టర్ కన్నెర్ర..! జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్కు వెళ్లే మార్గంలో పీటీజీ ఆశ్రమ పాఠశాలకు ఆనుకుని కొన్ని అక్రమ నివాసాలు వెలిశాయి. వాటితో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాఠశాలకు చెందిన ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని తొలగించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ నివసిస్తున్న వారు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. వారు స్వచ్ఛందగా ఖాళీ చేయకపోతే బలవంతంగానైనా ఖాళీ చేయించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే మంగళవారం పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలోనూ జిల్లా కేంద్రంలోని అక్రమ టేలాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ జరిగితే ట్రాఫిక్ ఇక్కట్లు తొలుగుతాయని అధికా రులు అభిప్రాయపడినట్లు సమాచారం. -
పరిమళించిన మానవత్వం
తూర్పు గోదావరి: ఏం చేస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఎండైనా.. వానొచ్చినా మురుగు కాలువలోకి దిగి గంటల తరబడి ఉండిపోతోంది. ఎట్టకేలకు కొందరు చొరవ చూపడంతో.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని ఓ యువతి దయనీయ స్థితిలో మురికి కాలువలోనే రెండు రోజుల పాటు గడిపిన హృదయ విదారక సంఘటన కోరుకొండ బస్టాండ్ సెంటర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడి నుంచి వచ్చిందో, కోరుకొండలో ఆమె సంచరిస్తోంది. మతి స్థిమితం లేకపోవడంతో ఎవరైనా పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది. రెండు రోజుల నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ను ఆనుకుని ఉన్న మురుగు కాలువలోకి దిగి, మళ్లీ బయటకు వస్తోంది. దుర్వాసన వస్తున్నా.. వ్యర్థాల మధ్యే రెండు రోజులుగా ఇలా చేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు ఈ కాలువ నుంచే గోదావరి నదిలోకి వెళ్తుంది. కొన్ని రోజులుగా కాలువకు వర్షపు నీరు రాకపోవడంతో ఆమెకు ఎటువంటి అపాయం కలగలేదు. కొందరు స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుధ్య కార్మికులు మంగళవారం ఆమెను కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. సైగలు చేస్తూ, పొడిపొడిగా మాట్లాడుతూ ఆమె భయంగా ఉంటోంది. పారిశుధ్య కార్మికులు జలడుగుల చిన్నపార్వతి, సోమాజుల బంగారమ్మ, రాజమహేంద్రవరానికి చెందిన డివైన్హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. -
ఓపీఎస్లకు వేతన వెతలు!
● ఆరు నెలలుగా ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు అందని జీతాలు ● ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం ● పంచాయతీ పాలనపైనా ప్రభావం..రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పరిపాలన, పారిశు ద్ధ్యం, తాగునీటి సరఫరా, మొక్కల సంరక్షణ.. ఇలా ప్రతీ పని సాఫీగా సాగేలా ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించింది. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేని ప్రాంతాల్లో పాలనపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఔట్సో ర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వేతనాల్లో భారీ తేడా ఉన్నా.. సమాన విధులు నిర్వహిస్తున్నా సకాలంలో జీతాలు అందించడం లేదు. కుటుంబాల పోషణ, పంచాయతీ పాలనకు అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి..గ్రామ పంచాయతీల్లో సర్పంచులు పదవీలో ఉన్నంతవరకు పరిపాలన బాధ్యతలు వారు చూసుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యాక ప్రభుత్వం ప్రతీ జీపీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రత్యేకాధికారులు కేవలం సంతకాలకే పరిమితమై.. పాలనపై పూర్తి చేతులెత్తారు. ఆ బాధ్యతంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో ఏ సమస్య ఉన్నా కార్యదర్శులే పరిష్కరించాల్సి వస్తోంది. రెగ్యులర్ సిబ్బందికి ప్రతినెలా క్రమంతప్పకుండా రూ.వేలల్లో జీతాలు వస్తుండటంతో.. అందులో కొంత మొత్తాన్ని పంచాయతీ అవసరాలకు వెచ్చిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లవుతోంది. జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి పంచాయతీ భారం తలనొప్పిగా మారుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి పంచాయతీ అవసరాలను తీరుస్తున్నారు. రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, స్టేషనరీ, పైపులైన్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా నిర్వహించే ఇతర కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ వంటి ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేకపోవడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. పాలనపై ప్రభావంఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆ ప్రభావం పంచాయతీ పాలనపై పడుతోంది. ప్రత్యేకాధికారి ఉన్నా పంచాయతీ నిర్వహణలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సాధారణ సమస్యలను సైతం పరిష్కరించేందుకు ఖజానాలో చిల్లీగవ్వ లేదు. ట్రాక్టర్ల మెయింటనెన్స్, డీజిల్, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీ, డంపింగ్యార్డు నిర్వహణ, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా, ట్యాంకుల క్లోరినేషన్ పనులు కార్యదర్శులే చేపడుతున్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీ జనరల్ ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. ప్రభుత్వం ఆ నిధులను సైతం వినియోగించుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దోమల నివారణకు కోసం ఫాగింగ్ పనులు, మురుగు నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చడం, వర్షాలతో రోడ్లపై పడిన గుంతలకు మరమ్మతులు వంటి పనులు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు కాకపోయిన వేతనాలైనా సక్రమంగా అందితే.. అందులో నుంచి పంచాయతీ అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని ఓపీఎస్లు చెబుతున్నారు.మూడు నెలల జీతాలు విడుదల జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు మూడు నెలల వేతనాలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరో రెండు, మూడురోజుల్లో వారికి అందిస్తాం. ఇంకా మూడు నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని సైతం ప్రభుత్వం నుంచి విడుదల కాగానే అందజేస్తాం. గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారిఆరు నెలలుగా అందట్లే..జిల్లాలో 15 మండలాల పరిధిలో ప్రస్తుతం 52 మంది ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.19వేలు చెల్లిస్తుండగా.. అందులో కాంట్రాక్టర్ కమీషన్, జీఎస్టీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి పోగా రూ.10,500 వరకు చేతికందుతున్నాయి. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి అందిస్తున్న వేతనం అరకొరే. అయినా గ్రామాల్లో ఏ చిన్న సమస్య రాకుండా చక్కబెడుతున్నారు. రెగ్యులర్ కార్యదర్శులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు మాత్రం మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఉన్నతాధికారుల వద్ద ఎంత మొరపెట్టుకుంటున్నా.. రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా స్పందించడం లేదని వాపోతున్నారు. చేతిలో చిల్లీగవ్వ లేక కుటుంబాల పోషణ నానా తంటాలు పడుతున్నారు. -
రావి శ్రీనివాస్ సస్పెన్షన్ సరైన నిర్ణయమే..
● డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావుఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009, 2014, 2023లో పార్టీలు మారినా.. శ్రీనివాస్కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీచేసి కనీసం జెడ్పీటీసీకి రావాల్సిన ఓట్లు కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. చిన్నారెడ్డి ఇచ్చిన నోటీసుకు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ జైనూర్లో గతంలో జరిగిన గొడవలకు మంత్రిని బాధ్యురాలిగా చేస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. వంజిరీ, అంకుసాపూర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతుల కోసం మంత్రిని రావి శ్రీనివాస్ అడిగారని, సీతక్క తిరస్కరించడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నార ని మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రమేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు మునీర్, మల్లేశ్యాదవ్, గుండా శ్యాం, చరణ్ పాల్గొన్నారు. -
యూరియా కోసం అగచాట్లు!
కౌటాల/కాగజ్నగర్టౌన్: కౌటాల సహకార సంఘం కార్యాలయంలో యూరియా బస్తాలు తీసుకునేందుకు కౌటాల, చింతలమానెపల్లి మండలాలకు చెందిన రైతులు మంగళవారం పెద్దఎత్తున తరలివచ్చారు. కౌటాల రైతు వేదికలో రైతుల వద్ద నుంచి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు తీసుకొని ఎకరానికి రెండు బస్తాలుగా చిట్టీలు రాసిచ్చారు. భారీగా రైతులు తరలిరావడంతో సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసి రైతుల పేర్లు పిలిచి పో లీసుల పహారాలో ఏఈవోలు రైతులకు బస్తాల కే టాయింపు చిట్టీలు అందజేశారు. అనంతరం రైతులు సహకార సంఘంలో బస్తాలు తీసుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు. కౌటాల మండలానికి 800 బస్తాలు, చింతలమానెపల్లి మండలానికి 800 యూరియా బస్తాలు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలంలో.. సిర్పూర్(టి) మండలంలోని రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట మంగళవారం నిరీక్షించారు. రైతులు యూరియా తీసుకునేందుకు ఉదయం కార్యాలయానికి వచ్చి సరిపడా ఎరువులు లేకపోవడంతో వేచిచూశారు. ఈ విషయమై ఏవో గిరీశ్ను ఫోన్లో సంప్రదించగా పీఏసీఎస్లో ట్యాబ్ సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైందని, ప్రతీ రైతుకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేయనున్నట్లు తెలిపారు. -
● పదేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు బాధ్యతలు ● ప్రభుత్వ నిర్ణయంపై సంఘాల నుంచి వ్యతిరేకత ● ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని వినతి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనే భావనలో చాలా మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో ఉంది. ఫలితంగా రూ.లక్షలు ఖర్చు చేసినా సరే వారి పిల్ల లను ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి స్కూళ్లలో వసతుల కల్పనతోపాటు మరింత ప ర్యవేక్షణ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయులను నియమించనుంది. వారు ని త్యం తనిఖీలు చేపట్టి పరిశీలించిన అంశాలను ఎ ప్పటికప్పుడు జిల్లా శాఖ అధికారికి నివేదించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో పర్యవేక్షకులను ఎంపిక చేయాలని ఎస్పీ డీ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తనిఖీ..పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా స్కూల్ గ్రేడ్ టీచర్లను తనిఖీ అధికారులుగా నియమించి ప్రాథమిక పాఠశాలలు తనిఖీ చేయించనున్నారు. రోజుకు కనీసం రెండు పాఠశాలుల వీరు పరిశీలించాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను నియమించుకోవాలి. వారు రోజుకు రెండు బడులను పరిశీలించారు. మూడు నెలల్లో కనీసం 50 ఉన్నత పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించారు. అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేయనున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహంజిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలల తనిఖీలతోపాటు పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించే విధానంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండలస్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. ఉన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లు పర్యవేక్షించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. తనిఖీ సమయంలో ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగా మారింది. మండలానికి ఇద్దరిని నియమించడం వల్ల జిల్లాలో 15 మండలాల్లో 30 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతున్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతుందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో సీఆర్పీలే చేశారు.. గతంలో ప్రాథమిక పాఠశాలు, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత సీఆర్పీలే చూసుకున్నారు. వివరాలు ప్రత్యేక ప్రోఫార్మాలో ఉన్నతాధికారులకు అందించేవాళ్లం. ఇతర పనులు పెరగడంతో పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేకపోతున్నాం. పర్యవేక్షణ అధికారుల బాధ్యత సీఆర్పీలకే ఇవ్వాలి. – డి.పవన్కుమార్, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడునిర్ణయం సరికాదు ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించాలనే నిర్ణయం సరికాదు. ఇప్పటికే డీఈవో, ఎస్వోలు, ఎంఈవో, సీఆర్పీలు తనిఖీలు చేపడుతున్నారు. బడుల బలోపేతం చేయాలంటే మరికొంత మంది సీఆర్పీలను నియమించాలి, బాధ్యతలు పెంచాలి. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. – ఆడే ప్రకాశ్, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు -
లక్ష్యానికి మించి ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో జూన్లో నెలవారీ లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జూన్లో బెల్లంపల్లి ఏరియాకు రెండు లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, 2.62 లక్షల టన్నులతో 131 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. కొత్త గనుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోలేటి ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోందన్నారు. ఈ ఏడాదిలోనే స్టేజ్వన్ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహరా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు, సీనియర్ పీవో ప్రశాంత్ పాల్గొన్నారు. -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో పనిచేస్తు న్న ఉద్యోగులకు జాప్యం లేకుండా సీఎంపీఎ ఫ్ సేవలు అందిస్తామని సీఎంపీఎఫ్ రీజియ న్ కమిషనర్లు హరి పచౌరీ, గోవర్ధన్ తెలిపా రు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ప్రయాస్ సమావేశం నిర్వహించా రు. సీఎంపీఎఫ్ లావాదేవీలన్నీ సీకేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని తెలిపా రు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీఎంపీఎఫ్ సేవలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా బెనిఫిట్స్కు అర్హులు, పెన్షన్, రివైజ్డ్ పెన్షన్పై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేశారు. జీఎం విజయ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ సీఎంపీఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించే క్లర్కులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్లో లే కుండా చూడాలన్నారు. ఎస్వోటూజీఎం రాజ మల్లు, డీవైపీఎం రాజేశ్వర్రావు, సీనియర్ పీవో ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాల, జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలి సి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందు కు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కాలుష్య నియంత్రణకు చెట్లు కాపాడుకోవడమే ఏకై క మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించి న లక్ష్యాన్ని పూర్తిచేయడం కోసం స్థలాలు గుర్తించా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామ్చందర్, డీఆర్డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
యువకుడి హత్య
పెంచికల్పేట్:పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన దీకొండ శ్రీధర్చారీ(25) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఎస్సై కొమురయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించే శ్రీధర్చారీ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన పొట్టె రాజన్న ఇంటి వెనుక పెరట్లో దారుణ హత్యకు గురయ్యాడు. మారణాయుధంతో నరికి చంపినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో శ్రీధర్చారీని తానే హత్యచేశానని పొట్టె రాజన్న పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకాడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఏఏసీ ఫైల్ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్)పీహెచ్డీ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్ మహేష్, డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, అన్ని విభాగాల హెచ్ఓడీలు, పీఆర్వో విజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
జీవితం పేదల కోసమే..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నా. పేదలకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశా. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నా. నిత్యం 300 నుంచి 400 మంది ఆయా సేవల నిమిత్తం వస్తుంటారు. చివరి పేషెంట్ వరకు ఏరోజుకు ఆరోజు స్కానింగ్ చేయడంతో పాటు రిపోర్టులు తయారు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. సేవలకు గుర్తింపుగా కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా. – నూతుల కళ్యాణ్రెడ్డి, ప్రొఫెసర్, రిమ్స్ ప్రజలకు సేవ చేయాలని.. ఆదిలాబాద్టౌన్: వరంగల్లోని కేఎంసీలో వైద్య విద్య అభ్యసించా. ఢిల్లీలో పీజీ పూర్తి చేశా. అక్కడే అంబేడ్కర్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించా. జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించాలని తండ్రి శ్రీరాములు కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యునిగా చేరారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నా. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. – డాక్టర్ ఆడె విఠల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్ -
25 ఏళ్ల అనుభవం..
1995లో గాంధీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, 1998లో ఎండీ, పిడియాట్రీషన్ పూర్తిచేశా. మూడేళ్లపాటు నిజామాబాద్లో పిల్లల వైద్యునిగా పనిచేశా. 2012లో నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైనప్పటి నుంచి వివిధ హోదాలలో సేవలు అందించా. గతేడాది నుంచి నిర్మల్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టా. ఈ 25 ఏళ్ల అనుభవంలో ఎంతో మందికి సేవలు అందించా. పేదలకు సేవ చేయడం గొప్పగా భావిస్తున్నా. – డాక్టర్ గోపాల్సింగ్, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆసుపత్రి, నిర్మల్ వైద్యసేవలు అందించాలనే.. పేదలకు వైద్యసేవలు అందించాలనే వైద్యవృత్తిని ఎంచుకున్నా. 25 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే వసతులు, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. వైద్యవృత్తి సేవా దృక్పధంతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసమే కాకుండా స్వచ్ఛందంగా వైద్య సేవలందించాలి. – డాక్టర్ కాశీనాథ్, సూపరింటెండెంట్, భైంసా ఏరియా ఆసుపత్రి -
సఫారీకి సెలవు
● జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేత ● అక్టోబర్ నుంచి పునఃప్రారంభం మూణ్నెళ్లు బంద్చేస్తాం ఎన్టీసీఏ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలలపాటు సఫారీ ప్రయాణం బంద్ చేయడం జరుగుతోంది. వర్షాల కారణంగా అడవిలో బురదలో వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్లో తిరిగి అనుమతులు ఇస్తాం. పర్యాటకులు గమనించాలి. – రామ్మోహన్, ఎఫ్డీవో జన్నారం: కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్లో జంగల్ సఫారీకి అటవీశాఖ మూడు నెలలపాటు సెలవు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చదనం పంచుతున్న అడవి అందాలను తిలకించేందుకు పర్యాటకశాఖ జన్నారంలో హరిత రిసార్ట్లు ఏర్పాటు చేయగా పర్యాటకశాఖ రెండు సఫారీలు, అటవీశాఖ ఐదు సఫారీలు ఏర్పాటు చేశారు. జన్నారం వచ్చిన పర్యాటకులు సఫారీ ద్వారా దట్టమైన అడవిలోనికి వెళ్లి పచ్చని చెట్ల నడుమ పర్యటించడం వల్ల ఆహ్లాదం పొందుతున్నారు. అడవుల అందాలను, వన్యప్రాణుల పరుగులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మూడు నెలలపాటు నిలిపివేత అడవుల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మూడు నెలల పాటు సఫారీ ప్రయాణానికి అనుమతి లేదు. ఎందుకంటే వర్షాకాలంలో వన్యప్రాణులు ఎదకు వచ్చి బయట విచ్చలవిడిగా తిరుగుతాయి. సఫారీ ప్రయాణంతో వాటికి ఆటంకం కలుగుతుంది. వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దనే ఉద్దేశంతో మూడు నెలలు (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) అనుమతులు నిరాకరిస్తూ అటవీశాఖ అధికారులు పర్యాటకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. -
మీ తమ్మునిపై కేసు అయ్యింది..
● ఉపాధ్యాయుడికి సైబర్ నేరస్తుడి ఫోన్.. ● అప్రమత్తతతో తప్పించుకున్న బాధితుడు జన్నారం: హలో.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్మునిపై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్ రండి.. లేకుంటే చాలా ప్రమాదంలో పడుతారని ఉపాధ్యాయుడికి ఫోన్రావడంతో మొదట బిత్తరపోయిన ఉపాధ్యాయుడు తేరుకుని సైబర్ నేరస్తుడని గ్రహించి తప్పించుకున్న సంఘటన జన్నారంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రకాశ్నాయక్కు ఓ వ్యక్తి ఫోన్చేసి నేను సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్ముదు ప్రమోద్పై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్కు రండి అని చెప్పాడు. మొదటగా భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు వెంటనే ఆదిలాబాద్లో ఉంటున్న ప్రమోద్కు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడుగగా గుడిలో పూజ చేస్తున్నట్లు చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడు అదే నంబర్కు ఫోన్ చేసి బెదిరించడంతో సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేశాడు. విషయాన్ని ఎస్సై అనూషకు చెప్పడంతో అలాంటి ఫేక్ కాల్లను నమ్మవద్దని సూచించారు. సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడిగా నాగరాజుమందమర్రి రూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం సాంస్కృతిక విభాగం వ్యవస్థాపకుడు అంతడ్పుల నాగరాజును తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సాంస్కృతిక మండలి సలహాదారుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు కళాకారులు నాగరాజును అభినందించారు. ‘9న సమ్మె విజయవంతం చేయాలి’శ్రీరాంపూర్: జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తోందన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముస్కే సమ్మయ్య, బాజీ సైదా, కిషన్ రావు, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేశ్, చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, కిషన్ రెడ్డి, కాంతయ్య, సత్యం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ సమ్మె నోటీసు జూలై 9న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును హెచ్ఎంఎస్ నాయకులు శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్కు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, అశోక్, గొల్ల్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
మేమున్నామని..
వృత్తిలో తృప్తి రోగులకు వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో విజయాలు సాధించినప్పుడు కలిగే ఆనందం గొప్పది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా విధులు నిర్వహిస్తున్నా. వైద్య వృత్తిలో తృప్తి లభిస్తోంది. – శివకుమార్, కడెం పీహెచ్సీ నమ్మకమైన సేవలు అందించాలి అమ్మానాన్నల ప్రోత్సాహంతో వైద్య కోర్సు పూర్తిచేశా. వైద్యోనారాయణోహరి అనే నానుడిని నేడు కార్పొరేట్ ఆస్పత్రులు పూర్తిగా డబ్బులకు ఆశపడి మరిచిపోతున్నాయి. వైద్యులు రోగులకు నమ్మకమైన సేవలందించాలి. వైద్యరంగంలో రాణించాలనుకునే యువత ముందుగా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. వైద్యులు ముఖ్యంగా మాతాశిశు మరణాలు జరగకుండా ఆపగలిగితే మనదేశం అభివృద్ధిలో మరింత ముందుంటుంది. – డాక్టర్ ప్రత్యూష, లక్ష్మణచాంద పీహెచ్సీ -
సమాజ సేవలో చంద్రదత్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన వైద్యుడు జీవీఎంఎస్ చంద్రదత్ ఐబీ సమీపంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. తరచూ ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు సైతం అందిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితినిబట్టి ఫీజులు తీసుకుంటున్నారు. అనవసరమైన టెస్టులు చేయకపోవడం, అవసరానికి మించి మందులు రాయడం వంటివి లేకపోవడంతో ప్రజలు నమ్మకంగా వస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ, వృద్ధాశ్రమంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఆశ్రమాలకు అవసరమైన సరుకులు, నగదు అందజేస్తున్నారు. – డాక్టర్ చంద్రదత్, జనరల్ మెడిసిన్ -
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
కాగజ్నగర్టౌన్: మండలంలోని బురదగూ డ, వంజిరి, సీఆర్నగర్, అంకుసాపూర్, నార్లపూర్ గ్రామాలకు మూడు నెలలుగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారని సోమవారం పట్టణంలోని ఎన్పీడీసీఎల్ డివిజన్ కార్యాల యం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. వర్షాకాలంలో విషపురుగులు తిరిగే అవకాశం ఉందని, కరెంట్ లేకపోవడంతో చీకట్లో ప్రమాదా లకు ఆస్కారం ఉందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఏఈ, లైన్మెన్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, సమస్య పరిష్కరించని పక్షంలో మళ్లీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగూరె శ్యాంరావు, కొట్రగే నాందేవ్, గౌత్రే గోపాల్, మురళీ, తిరుపతి, పొశెట్టి తదితరులు పాల్గొన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకాగజ్నగర్రూరల్: అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఎస్ఈ శేషాగిరి రావు అన్నారు. పట్టణంలోని డివిజన్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. సమస్యలు ఎదురైతే టోల్ఫ్రీ నం.1912కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం బురదగూడ, వంజిరి, సీఆర్నగర్, అంకుసాపూర్, నార్లపూర్ గ్రామాల రైతులు ఆయనకు వినతిపత్రం అందించారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్కాగజ్నగర్టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలతోపాటు మండలంలోని చింతగూడ, బలగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠ శాల, గన్నారం జెడ్పీఎస్ఎస్లో సోమవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్, వంటి మత్తు పదా ర్థాలకు బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని, వాటి సాకారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల గురించి తెలిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 70551 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవిచంద్ర, టౌన్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాలు, ఫలితాలపై దృష్టి
● డీఐఈవో కళ్యాణిఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడం, మెరుగైన ఫలితాలు సా ధించడంపై దృష్టి సారించామని జిల్లా మాధ్యమిక విద్యాధికారి(డీఐఈవో) కళ్యాణి అన్నా రు. కొన్నేళ్లుగా ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని, గతేడాది ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలవడం గర్వకారణమని పే ర్కొన్నారు. ఇటీవల పదో తరగతి సప్లింమెంటరీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నామని, ప్రవేశాల పెంపు కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళాశాలల్లో వసతులు, ప్రవేశాల వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల తీరు ఎలా ఉంది. ఇప్పటివరకు ఎన్ని అడ్మిష న్లు వచ్చాయి? డీఐఈవో: జిల్లాలో జూనియర్ కళాశాలలు 48 ఉండగా, ఇందులో ప్రభుత్వ కాలేజీలు 11, ప్రైవే ట్ 4, కేజీబీవీలు 13, బీసీ, ఎస్సీ, మైనార్టీ గు రుకుల కళాశాల మరో 20 వరకు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో గతేడాది 2,535 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మూడు వేల సంఖ్యను చేరుకోవడమే లక్ష్యంగా అధ్యాపకులతో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఫస్టియర్లో 1,198 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుంది. సాక్షి: గత విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించిన కళాశాలల్లోనూ ప్రవేశాల సంఖ్య తగ్గింది. దీనికి కారణాలేంటి? డీఐఈవో: గతేడాది చాలా వరకు ప్రభుత్వ కాలేజీ మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే ప్ర భుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీ వీలు అప్గ్రేడ్ అయ్యాయి. దీంతో విద్యార్థులు ఎక్కువ మంది అక్కడే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ కారణంతోనే గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. సాక్షి: 2025– 26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలి తాల సాధనకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయనున్నారు? డీఐఈవో: గతేడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండోస్థానంలో నిలవగా, ఫస్టియర్ ఫలితాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. 2025– 26 విద్యా సంవత్సరంలో కూడా ఫలితాలు తగ్గకుండా ప్రత్యేక ప్రణా ళిక అమలు చేస్తాం. సకాలంలో సిలబస్ పూర్తి చేయడంపై దృష్టి సారిస్తాం. అధ్యాపకుల కొర త ఉన్న ఉర్దూ మీడియం కళాశాలల్లో ఒప్పంద పద్ధతిన లెక్చరర్లను నియమిస్తాం. సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈవో: కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. రెబ్బెన కళాశాలలో 18 గదులకు 9 గదులు మాత్రమే ఉన్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేచోట బోధిస్తున్నారు. ప్రహరీలు నిర్మాణం, మరమ్మతులు, అదనపు తరగతి గదులు నిర్మించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ ఏడాది అ ధ్యాపకుల కొరత లేదు. కళాశాలలకు తాజాగా ప్రభుత్వం రూ.10వేలు చొప్పున జమ చేసింది. మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. -
కళాశాలల్లో వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం డీఐఈవో కళ్యాణితో కలిసి ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ఫర్నీచర్తోపాటు ఇతర మరమ్మతుల కోసం జాబితా సిద్ధం చేయాలని సూచించారు. -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): వైద్యసిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని సోమవారం డీఎంహెచ్వో సీతా రాంతో కలిసి సందర్శించారు. ఆస్పత్రి వార్డులు, ల్యాబ్తోపాటు పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంత రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి పనులను పీడీ వేణుగోపాల్తో కలిసి పరిశీలించారు. యూరియా కొరత లేకుండా చూడాలిరైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో ఫర్టిలైజర్ షాపు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, విద్యాబోధన అంశాల గురించి తెలుసుకున్నారు. వంటకు నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సూర్యప్రకాష్, ఏవో దిలీప్కుమార్, ప్రిన్సిపాల్ రజనీ తదితరులు ఉన్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్(రెవెన్యూ), కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సోమవారం తనిఖీలు నిర్వహించారు. యూరియా అక్రమ అమ్మకాలపై ‘సాక్షి’లో సోమవారం ‘యూరియా దందా’ అనే కథనం ప్రచురితం కావడంతో దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలు పరిశీలించారు. రైతు ఆగ్రోస్ కేంద్రంలోని యూరియా విక్రయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విక్రయానికి సంబంధించిన రశీదులు ఉండాలని సూచించారు. అనంతరం గోదాముల్లో ఎరువుల నిల్వ పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, తహసీల్దార్ పుష్పలత, ఏవో మనీషా, సిబ్బంది పాల్గొన్నారు. ఎఫెక్ట్ -
జూన్.. సాధారణం
దహెగాం(సిర్పూర్): వర్షాకాలం ప్రారంభమైనప్ప టి నుంచి ఇప్పటికీ భారీ వర్షాలు కురవలేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో జూన్లో సాధారణ సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వానాకా లం సీజన్ ప్రారంభానికి కంటే ముందుగానే వర్షాలు పలకరించాయి. దీంతో జిల్లాలోని రైతులు మృగశిర కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించారు. ఆ సమయంలో వారం రోజులపాటు వరుణుడి జాడ లేకపోవడంతో కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత చినుకులకు మొలకలు వచ్చాయి. మొలకెత్తని చేలలో కొందరు మళ్లీ కూలీలతో విత్తనాలు వేసుకున్నారు. 214.1 సగటు వర్షపాతంజిల్లావ్యాప్తంగా జూన్లో 188.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. నెలాఖరు నాటికి 214.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, సుమారు 15 రోజుల్లో వర్షం పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జైనూర్, సిర్పూర్(యూ), చింతలమానెపల్లి మండలాల్లో మాత్రం లోటు కనిపిస్తోంది. మరోవైపు ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, లింగాపూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(టి)లో అధిక వర్షపాతం, వాంకిడి, కాగజ్నగర్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరిసాగు అంతంతే..భారీ వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువుల్లో వరద నీరు చేరలేదు. దీంతో వరిసాగు పనులు ముందుకు సాగడం లేదు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాలతోపాటు సిర్పూర్ నియోజకవర్గంలో వరి సాగు అధికంగా ఉంటుంది. ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా పనులు సాగడం లేదు. భారీ వర్షాలు లేక ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల ఆయకట్టు కింద రైతులు పనులు ప్రారంభించలేదు. పొలాలు బీళ్లుగా ఉన్నాయి. బోర్లు, బావుల నీటి సౌకర్యం ఉన్నవారు మాత్రం నారుమడులు సిద్ధం చేస్తున్నారు. పొలాల్లో మొలక అలుకుతున్నారు. పత్తికి అనుకూలం ఈ వానాకాలం సీజన్లో ఐదెకరాల్లో పత్తి సాగు చేసిన. ప్రస్తుతం మొక్క నాలుగు ఆకుల దశలో ఉంది. వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. మొదట్లో వానలకు పత్తి మొలకెత్తని చోట మరోసారి విత్తనాలు పెట్టినం. అవి కూడా ఇప్పుడు మొలకెత్తాయి. డౌర కొట్టే సమయం వచ్చింది. – నికాడి నారాయణ, రైతు, దహెగాం 15 వరకు పత్తి విత్తుకోవచ్చు ఇప్పటికే జిల్లాలో 98 శాతం పత్తి వి త్తుకోవడం పూర్తయింది. జూలై 15 వరకు కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం లోగా వరి నాట్లు పూర్తి చేసుకోవాలి. ఖర్చు తగ్గడానికి వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకుంటే మంచిది. 10 కిలోల వరి విత్తనాలు ఎకరానికి వేసుకోవచ్చు. డ్రమ్ సీడర్తో వేసుకుంటే పంట త్వరగా చేతికొస్తుంది. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారిదహెగాం పెద్దచెరువు కింద బీళ్లుగా పొలాలుజూన్ వర్షపాతం వివరాలు(మి.మీ.లలో)మండలం కురువాల్సింది కురిసింది స్థితి జైనూర్ 210.1 128.2 –39 లోటు సిర్పూర్(యు) 193.4 162.7 –16 సాధారణం లింగాపూర్ 187.7 259.9 39 అధికం తిర్యాణి 167.1 133.4 –20 లోటు రెబ్బెన 151.1 217.9 44 అధికం ఆసిఫాబాద్ 173.4 251 45 అధికం కెరమెరి 168.3 225 34 అధికం వాంకిడి 198.1 342.7 73 అత్యధికం కాగజ్నగర్ 169.6 294.8 74 అత్యధికం సిర్పూర్(టి) 190.1 248.8 31 అధికం కౌటాల 201 228.1 13 సాధారణం చింతలమానెపల్లి 205.9 164.9 –20 లోటు బెజ్జూర్ 216.5 198.4 –8 సాధారణం పెంచికల్పేట్ 192.4 167.8 –13 సాధారణం దహెగాం 204.4 186.4 –9 సాధారణం ఏడు మండలాల్లో అధికం.. మూడు మండలాల్లో లోటు వర్షపాతం ఇప్పటికీ భారీ వర్షాల జాడే లేదు.. చెరువులు, ప్రాజెక్టులోకి చేరని వరద నెమ్మదిగా వరిసాగుమొలక దశకు పత్తి..వానాకాలం సీజన్ ప్రారంభ సమయంలో వర్షాలు ముఖం చాటేసినా.. ఆ తర్వాత పడిన వానతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగాయి. జిల్లాలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా.. అందులో ప్రధానంగా 3.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పత్తి విత్తుకోవడం పూర్తయింది. పత్తి విత్తనాలు కూడా మొలకెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉండటంతో విత్తనాలు మొలకెత్తకపోవడంతో మరోసారి వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పడుతున్న ముసురు వానలు పత్తి, సోయా వంటి పంటలకు మేలు చేస్తాయని రైతులు ఆశాభావం చేస్తున్నారు. -
తరలివచ్చి.. వినతులిచ్చి
● ప్రజావాణికి క్యూ కట్టిన ప్రజలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి వినతులు సమర్పించారు. బాధితుల సమస్యలు విన్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం పర్షనంబాలకు చెందిన ఆదే మాధవ్ దరఖాస్తు చేసుకున్నాడు. తాను సాగు చేసుకుంటున్న భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీకి చెందిన గౌరోజు శోభ కలెక్టర్ను కోరింది. ఆసిఫాబాద్ మండలం సామెల శివారులోని తన పట్టా భూమికి కొత్త పట్టా పాస్ పుస్తకం జారీ చేయాలని జిల్లా కేంద్రంలోని సందీప్నగర్కు చెందిన సోమ శంకర్ విన్నవించాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని బజార్వాడికి చెందిన కాంబ్లె నీలాబాయి దరఖాస్తు చేసుకుంది. తన కుమారుడికి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు ఇప్పించాలని కాగజ్నగర్ మండలం ఈజ్గాం గ్రామానికి చెందిన గోలేటి శ్రీనివాస్ కోరాడు. తన పేరుతో ఉన్న పట్టా భూమికి కొత్త పట్టా పాస్బుక్ జారీ చేయాలని కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన బర్ల శంకరక్క అర్జీ సమర్పించింది. బీఎస్సీ, బీఈడీ చదివిన తనకు అర్హత గల ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని జైనూర్ మండలం కొండిబగూడకు చెందిన సోన్ కాంబ్లే దరఖాస్తు చేసుకుంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉపాధి కల్పించాలని కెరమెరి మండలం గౌరి గ్రామానికి చెందిన తాగ్రే కవిత వేడుకుంది. వాంకిడి మండలం సరండి గ్రామ శివారులోని తమ పట్టా భూమిలో 2 గుంటలు ఫోర్లైన్లో పోగా.. రికార్డులో తప్పుగా నమోదు చేశారని, వివరాలు సరిచేయాలని జిల్లా కేంద్రానికి చెందిన ఎకిరాల సంతోష్, గణపతి కోరారు. కెరమెరి మండలం దేవుడిపల్లి గ్రామ శివారులోని సర్వే నం.7లోని ఐదెకరాల పట్టా భూమిని నలుగురు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని తక్సండే శేఖర్ వేడుకున్నాడు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.పొలాలకు దారిలేదు ‘బూర్గుడ శివారులోని సర్వే నం.15, 14తో పాటు పలు సర్వే నంబర్లలో పంట పొలాలకు వెళ్లేందుకు గతంలో ఉన్న దారిని ఇద్దరు వ్యక్తులు మూసివేశారు. వెనుకవైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సుమారు 200 ఎకరాలకు దారి లేదు. విచారణ చేపట్టి రహదారి సౌకర్యం కల్పించాలి..’ అని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన రైతులు గెడెకర్ గణేశ్, సత్తె లింగు, శెండె విఠు, గణపతి తదితరులు కోరారు. -
యూరియా దందా!
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కుకిడే శేఖర్. ఆరు ఎకరాల్లో వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. పదిరోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఒక్కో బస్తాకు రూ.450 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏఆర్ఎస్కే, పీఏసీఎస్ల ద్వారా గ్రామాల్లో యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాడు. పెంచికల్పేట్(సిర్పూర్): వానాకాలం సీజన్లో పంటలు సాగుచేస్తున్న రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థి తి భిన్నంగా ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చే సుకున్న కొందరు వ్యాపారులు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి యూరియా దందాకు తెరలేపా రు. పెంచికల్పేట్ మండలంలో సుమారు 15వేల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి పంటలు సాగువున్నా యి. అన్నదాతలకు హాకా(హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేన్), ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, డీసీఎంఎస్ల ద్వారా సబ్సిడీ కింద యూరి యా అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి తన హాకా సెంటర్ ద్వారా పెద్ద ఎత్తున యూరియా దిగుమతి చేసుకుని బ్లాక్ మార్కెట్కు తరలించినట్లుగా తెలు స్తోంది. స్థానిక రైతులకు సుమారు 1300 టన్నులు యూరియా అవసరం ఉండగా.. ఇప్పటికే 620 ట న్నులు మండలానికి చేరినా నేటికీ రైతులకు మాత్రం అందలేదు. అధికారుల ప్రేక్షక పాత్ర..రైతులకు కేంద్రాల ద్వారా అందిస్తున్న యూరియా వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువు ల వివరాలను సంబంధిత ప్రోఫార్మా ప్రకారం ఆ ధార్ నంబరుతో సహా నమోదు చేయాలి. అమ్మకా ల్లో నిబంధనల ఉల్లంఘన బహిరంగంగానే జరుగుతున్నా వ్యవసాయశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు వ్యాపారులతో కుమ్మకై ్క యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రై తులు ఆరోపిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పా ల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్ చేస్తున్నారు.పెంచికల్పేట్ మండలానికి చేరిన యూరియా స్టాక్(టన్నుల్లో)ఎల్కపల్లి హాకా కేంద్రం 160చేడ్వాయి హాకా కేంద్రం 40ఏఆర్ఎస్కే కేంద్రం 120డీసీఎంఎస్ ఎల్కపల్లి కేంద్రం 160డీసీఎంఎస్ కొండపల్లి కేంద్రం 80డీసీఎంఎస్ చేడ్వాయి కేంద్రం 60 ఏఆర్ఎస్కే, పీఏసీఎస్లలో స్టాక్ నిల్ ‘హాకా’ల ద్వారా అమ్మకాలు అక్రమ విక్రయాలకు తెరలేపిన ఓ వ్యాపారి! అధికారుల పర్యవేక్షణ లేక నష్టపోతున్న రైతులు హాకాతో దందా..పెంచికల్పేట్ మండలంలోని రైతులకు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా రూ.270కి బస్తా యూరియా సరఫరా చేస్తున్నారు. ఒకే ఏఆర్ఎస్కే సెంటర్ ద్వారా రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో వ్యాపారి తన పలుకుబడితో దందాకు తెరలేపాడు. వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో తన హాకా సెంటర్ ద్వారా 160 టన్నుల యూరియా దిగుమతి చేసుకున్నాడు. ఇతర కేంద్రాలకు ఎరువులు దిగుమతి కాకుండా ఒత్తిడి చేసి కృత్రిమ కొరత సృష్టించాడు. బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా సుమారు రూ.380 నుంచి రూ.450 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల ఇదే ఘటనపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హకా కేంద్రాల ద్వారా జరుగుతున్న అక్రమ దందాపై విమర్శలు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. స్టాక్, విక్రయాల రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా విక్రయించాలి. కొంతమంది వ్యాపారులు తమ విక్రయాలకు సంబంధించిన డాటా ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తాం. – మనీషా, ఏవో, పెంచికల్పేట్ -
ఆదర్శనీయుడు కుమురం భీం
కౌటాల(సిర్పూర్): పోరాటయోధుడు కుమురం భీం అందరికీ ఆదర్శవంతుడని ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి అన్నారు. కౌటాల మండలం జనగాం గ్రామంలో ఆదివారం కుమురం భీం నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధనకు భీం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్లు సిడాం గణపతి, కోనేరు కృష్ణారావు, సహకార సంఘం చైర్మన్ కె.మాంతయ్య, నాయకులు మధుకర్, శ్రీవర్థన్, బండు, సంతోష్, హన్మంతు, పోశం, నాహీం తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే అరెస్టు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ మనోజ్కుమార్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాక ర్ మాట్లాడుతూ చిల్లర విషయంలో కండక్టర్ మనోజ్పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్ర మంలో కార్మికులు అబ్దుల్, ఉమేశ్, ముతా ల్, అనంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
రావి శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు
కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ సిర్పూర్ ని యోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్పై ఆ పార్టీ అధిష్టానం చ ర్యలు తీసుకుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆరేళ్లపాటు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు గతంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కపై విమర్శలు చేశారని, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు ఫిర్యాదు చేశారు. స్పందించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి రావి శ్రీనివాస్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. గడువు ముగిసినా రావి శ్రీనివాస్ నుంచి వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గ్రూపు రాజకీయాలను ప్రశ్నించడంతోనే..’సస్పెన్షన్పై రావి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీతక్కను తానెప్పుడూ దూషించలేదన్నారు. ఈ ప్రాంత సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. గ్రూపు రాజకీయాలను ప్రశ్నించడంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. దీనిపై తనకు ఎలాంటి బాధ లేదని, ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
సమ్మె విజయవంతం చేయాలి
కాగజనగర్టౌన్: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ రోడ్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 8 గంటల పని గంటల విధానాన్ని కార్మికులు పోరాటం చేసి తెచ్చుకుంటే.. కేంద్ర ప్రభుత్వం 12 గంటలుగా మార్చేందుకు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉపాధిహామీ కూలీలకు 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షురాలు త్రివేణి, టీఎస్ యూటీఎఫ్ నాయకులు రాజ్కమలాకర్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్, నాయకులు కృష్ణమాచారి, రూప, అరుణ, మల్లేశ్వరి, పద్మ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మండలాల వారీగా అర్హుల వివరాలు
రెబ్బెన మండలం గోలేటికి చెందిన మహదేవుని విజయకు ఎలాంటి భూమి లేదు. ఏటా ఉపాధిహామీ పనులకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి జిల్లా అధికారులు అర్హురాలిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ పంటల సాగు ప్రారంభం కావడంతో కూలీ పనులకు వెళ్తుంది. ఆత్మీయ భరోసా జాబితాలో పేరున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో నిరాశ చెందుతోంది. ఇలా జిల్లాలో వేలాది మంది అర్హులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుకు సంబంధించి భూమి కలిగిన ప్రతీ రైతుకు రాష్ట్ర రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.6 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. జిల్లాలో ఈ పథకం కింద 1.21 లక్షల మందికి పైగా లబ్ధి పొందారు. దీంతో అన్నదాతలు పంటల సాగులో బిజీగా మారారు. మరోవైపు భూమి లేని పేదలకు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అర్హుల జాబితా రూపొందించినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఇలా..ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం రేషన్కార్డును యూనిట్గా సెంటు భూమి లేని నిరుపేదలను అర్హులుగా గుర్తించారు. అలాగే 2023– 24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 పనిదినాలు పూర్తి చేసి ఉండాలి. అయితే కుటుంబంలోని యజమానిగా ఎవరు ఉన్నా సదరు కుటుంబంలోని మహిళను లబ్ధిదారుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ లెక్కన జిల్లాలో 19,082 మంది అర్హులకు సాయం అందించాలని అధికారులు జాబితా రూపొందించారు. మొదటి విడత నగదు సాయం రూ.6 వేల నగదున ఈ ఏడాది జనవరి 26 తేదీనే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పథకాల అమలు కోసం మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. జిల్లాలో 15 గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే నగదు జమ చేశారు. మిగిలిన అర్హులకు మార్చి 31 వరకు జమ చేస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. రెండో విడత సాయం అందించాల్సిన సమయం వచ్చినా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అయితే ఇటీవలే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భూమిలేని కూలీలను ఆదుకోవాలి ఏజెన్సీలో నివసిస్తున్నాం. మా కుటుంబం పేరుపై ఎకరం పట్టా భూమి కూడా లేదు. భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నగదు అందింది. మమ్మల్ని ప్రభుత్వం కనీసం ఆత్మీయ భరోసా కింద ఆదుకుంటుందని ఆశపడ్డాం. ఇప్పటికీ సాయం అందించకపోవడం సరికాదు. భూమి లేని కూలీలను ఆదుకోవాలి. – కాంబ్లే యోగిత, లింగాపూర్ జిల్లాలో 19,082 మంది అర్హుల గుర్తింపు ప్రభుత్వ సాయం కోసం తప్పని ఎదురుచూపులు రైతు భరోసా నిధుల విడుదలతో చిగురిస్తున్న ఆశలుఏటా రూ.12వేలు..రాష్ట్రంలోని భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ.12 వేలు సాయం అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా హామీ నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఆత్మీయ భరోసా పథకం కోసం ఇప్పటికే అర్హుల గుర్తింపును అధికారులు పూర్తి చేశారు. ఏడాదికి రెండు విడతలగా రూ.12 వేల ఆర్థికసాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో కింద అందిచాల్సిన రూ.6 వేలు నేటికీ విడుదల చేయలేదు. భూమి ఉన్న వారికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి.. భూమి లేని పేదలను పట్టించుకోకపోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం అర్హుల సంఖ్య ఆసిఫాబాద్ 2,245 బెజ్జూర్ 1,347 చింతలమానెపల్లి 647 దహెగాం 1072 జైనూర్ 1398 కాగజ్నగర్ 1482 కెరమెరి 2714 కౌటాల 1916 లింగాపూర్ 695 పెంచికల్పేట్ 358 రెబ్బెన 976 సిర్పూర్(టి) 1023 సిర్పూర్(యూ) 286 తిర్యాణి 1353 వాంకిడి 1570 -
సీతక్కకు గిరిజనశాఖ కేటాయించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన ఎమ్మెల్యే సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించాలని ఆది వాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోవ ఇందిర అన్నారు. మండలంలోని మోడి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక మౌలిక వసతులు, రోడ్డు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. గిరిజనుల జీవన స్థితిగతులపై అనుభవం ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి పదవి ఇస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. -
కార్మికుల డిమాండ్లకు సింగరేణి అంగీకారం
● క్లర్క్ పోస్టుల భర్తీపై స్పష్టత ● గుర్తింపు సంఘం అధ్యక్షుడు వి.సీతారామయ్యశ్రీరాంపూర్: కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య తెలిపారు. నస్పూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం మాట్లాడారు. ఈ నెల 27న సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) స్థాయిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలి పారు. గతేడాది 360 క్లర్క్ పోస్టుల కోసం ఇంటర్న ల్ అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, యాక్టింగ్ క్లర్క్లు వేసిన కోర్టు కేసు కారణంగా పరీక్షలు నిర్వహించలేదని యాజమాన్యం తెలిపిందన్నారు. ముందుగా ఈ పోస్టులను భర్తీ చేసి, మిగిలిన ఖాళీలను యాక్టింగ్ క్లర్క్లతో భర్తీ చేయాలని యూనియన్ కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. కంపెనీ ఉద్యోగులు ఉన్నత విద్య కోసం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఎన్వోసీ జారీకి యాజమాన్యం అంగీకరించిందన్నారు. గని ప్రమాదంలో మృతిచెందిన వారి డిపెండెంట్లకు డిప్లొమా, బీటెక్ వంటి టెక్నికల్ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ, డిగ్రీ పూర్తిచేసిన వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు. సెక్యూరిటీ గార్డు ఖాళీల భర్తీపై చర్చ..సెక్యూరిటీ గార్డు ఖాళీల భర్తీతోపాటు ఇతర డిమాండ్లను కూడా సమావేశంలో చర్చించినట్లు సీతారామ య్య తెలిపారు. మొదటి స్ట్రక్షరల్ సమావేశంలో అంగీకరించిన కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. మారు పేర్ల సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తూ, కంపెనీ ప్రభు త్వ అడ్వొకేట్ జనరల్కు లేఖ రాసినట్లు వెల్లడించా రు. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఉపాధ్యక్షుడు కొట్టె కి షన్రావు, నాయకులు ప్రసాద్రెడ్డి, నాగభూషణం, మురళిచౌదరి, నర్సింగరావు, ఎం.సారయ్య, ఆకుల లక్ష్మణ్, నవీన్రెడ్డి పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి పెద్దపీట
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో క్రీడల అభివృద్ధికి యాజమాన్యం పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో శనివారం రాత్రి డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 91వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏటా డబ్ల్యూపీఎస్ అండ్ జేఏ ఆధ్వర్యంలో వార్షిక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగరేణి క్రీడాకారులు కోలిండియా పోటీల్లో సత్తా చాటుతున్నారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలినవారు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజమల్లు, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం హమాలీ సంఘం నాయకులతో కలిసి సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆరోపించారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హమాలీ సంఘం మండల అధ్యక్షుడు సునీల్, నాయకులు ధర్మేందర్, సుధాకర్, లాలు, దలవత్, దిలీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
జైనూర్(ఆసిఫాబాద్): గిరిజనులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అ మలు చేస్తోందని గిరిజన శాఖ డీడీ రమాదేవి అన్నారు. మండలంలోని భూసిమెట్ట గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. పీఎం జుగా కింద ఎంపికై న గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఆధార్, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు అందించాలన్నారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, ఎస్ఈఆర్పీలు శంకర్, రాథోడ్, విజేందర్, పంచాయతీ కార్యదర్శి కుర్సెంగ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. -
కవ్వాల్కు కొత్త పులులు!
● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాక సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్కు కొత్త పులు లు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ కోర్ ప్రాంతంలో నేటి కీ ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించిన మేరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పులులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు దాకా..కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో కొన్ని పులులు శాశ్వత నివాసం ఏర్పర్చుకోగా, ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్కు కొత్తపులులు వచ్చే అవకాశాలున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది. చివరికి తరలింపునకే మొగ్గుమహారాష్ట్ర పులులు భవిష్యత్లో ఉమ్మడి జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో 13ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2వేల చ.కి.మీటర్లకు పైగా అటవీ భూభాగా న్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కోర్ ఏరియాలోనే పులులు నివాసం ఏర్పర్చుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహారాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరుకు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్కు పులులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. సంరక్షణ సవాలే..!కవ్వాల్లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్ గ్రామాలైన కడెం మండలం రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులు లు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేట కారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. తాజాగా అధి కారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్గా మారనుంది. సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనుంది. మరోవైపు పునరావాస గ్రామాల వాసులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్ కోర్ ప్రాంతాల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ జంతువు రక్షణకు ఇక్కడి అధికారులు మరింత శ్రమించాల్సి ఉంది. -
వైద్య కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు
● రాష్ట్ర ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానమ్ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌ లిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానమ్ అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అంకుసాపూర్లో గల ప్రభుత్వ వైద్య కళాశాల ను శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి సందర్శించారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థుల ను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించా రు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు. త్వరలోనే బోధన సమస్యలు తీర్చేందుకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామన్నారు. ఒప్పంద పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రి, వైద్య కళాశాల భవ న నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. త్వరలోనే వసతిగృహాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల భవనం పూర్తిచేస్తామన్నారు. ఒకే ప్రాంతంలో వసతిగృహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిని సందర్శించారు. డయాలిసిస్ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గదులను పరిశీలించారు. ప్రజలను నాణ్యమైన వైద్యం అందించాలని, డాక్టర్లు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఆస్పత్రి పర్యవేక్షకులు, వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళన
బెజ్జూర్(సిర్పూర్): మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల భవనం పైనుంచి పడి చికిత్స పొందుతూ మృతి చెందిన బెజ్జూర్ మండలం మర్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు హర్షద్ హుస్సేన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.50లక్షలు పరిహారంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారితో తహసీల్దార్ రాంమోహన్రావు, కౌటాల సీఐ ముత్యం రమేశ్ మాట్లాడారు. కుటుంబంలో ఒకరికి ఔట్సో ర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, మృతికి బాధ్యులైన వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థిని అంత్యక్రియలు నిర్వహించారు. కాగజ్నగర్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ప్రవీణ్కుమార్, విక్రమ్, విజయ్, విజయ్, నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
అనుమానితుల సమాచారం అందించాలి
కాగజ్నగర్టౌన్: అనుమానిత వ్యక్తులు కని పిస్తే సమాచారం అందించాలని కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ అన్నారు. పట్టణంలోని సంఘం బస్తీ, సుభాష్కాలనీ, తైబానగర్, అశోక్ నగర్ కాలనీల్లో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడొద్దని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లో 1.2 లీటర్ల దేశీదారు, 2.8 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 58 బైక్లు, 10 ఆటోలు గుర్తించామన్నారు. -
ఓపెన్ పది, ఇంటర్ ప్రవేశాలు పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ప్రవేశాలు పెంచాలని వయోజన విద్య రాష్ట్ర సంచాలకుడు శివకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీవో కార్యాలయంలో శనివారం అదనపు డీఆర్డీవో రామకృష్ణతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దిగువ శాఖలతోపాటు గ్రామాల్లో చదువు మధ్యలో ఆపిన వారికి అవగాహన కల్పించి ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన వీఏవోలు ఓపెన్ ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ విధానంలో పదో తరగతికి రూ.500, ఇంటర్కు రూ.1000 రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 11లోగా ప్రవేశాలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, అశోక్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఓపెన్ స్కూల్ రిసోర్స్పర్సన్లు రాజేశ్, ప్రకాష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పుట్టగొడుగుల్లా వెంచర్లు!
● జిల్లాలో ప్లాట్లుగా మారుతున్న వ్యవసాయ భూములు ● నాలా ధ్రువీకరణ లేకుండానే రిజిస్ట్రేషన్లు ● నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం ● మోసపోతున్న అమాయక ప్రజలు సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలోని వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. నాలాకు మార్చుకోకుండానే ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. డీటీసీపీ నుంచి అనుమతులు లేకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం వ్యవసాయ భూములను లేఅవుట్లు వేసి అమ్ముతున్నారు. సాధారణంగా వ్యవసాయేతర భూములకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలి. నాలా ధ్రువపత్రం లేకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదు. కానీ కొందరు ఈ భూములకు రెవెన్యూ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా.. మరికొందరు డీటీసీపీ అనుమతుల కోసం దరఖాస్తు చేసి నాలా ధ్రువపత్రంపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. సాకేంతికంగా ఇబ్బందులు తలెత్తకుండా గంటల్లో వీటికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత..కొత్తగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణ కేంద్రం సమీపంలో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారాయి. మంచిర్యాల– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న రెబ్బెన, కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఆసిఫాబాద్, వాంకిడి.. కాగజ్నగర్ పట్టణ పరిసరాల్లోని పలుచోట్ల వ్యవసాయ భూములు వెంచర్లుగా మారాయి. చాలాచోట్ల వీటిని వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడం లేదు. గుంటల విస్తీర్ణంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ, మున్సిపాలిటీల అనుమతులు తీసుకున్న వెంచర్లు 39 ఉండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ వెంచర్లు ఉన్నట్లు అనాధికారిక సమాచారం. ఇందులో ఆసిఫాబాద్ పంచాయతీగా ఉన్నప్పుడు 19 వెంచర్లకు అనుమతులు మంజూరు కాగా.. మున్సిపాలిటీగా మారక నాలుగు వెంచర్లు టీఎస్–బీపాస్లో దరఖాస్తు చేసుకున్నాయి. మరో రెండు దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీలో 3 దరఖాస్తులు టీఎస్–బీపాస్లో దరఖాస్తు చేసుకున్నారు. మూడు వెంచర్లకు పంచాయతీ నుంచి అనుమతులు మంజూరు చేశారు. అలాగే రెబ్బెనలో 8, వాంకిడి, సిర్పూర్(టి), తిర్యాణిలో ఒక్కో వెంచరుకు అనుమతులు ఉన్నాయి. 18 రకాల సదుపాయాలు ఉండాలి... నిబంధనల ప్రకారం లేఅవుట్ ఒక వెంచర్ను అభివృద్ధి చేయడానికి మొదటగా డీటీసీపీ ఆమోదం కోసం టీజీ–బీపాస్కు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించి సంబంధిత ధ్రువపత్రాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే తాత్కాలిక ఆమోదం(టెంటేటీవ్ అప్రూవల్) జారీ చేస్తుంది. రెండేళ్లలో లేఅవుట్ యజమాని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలి. విద్యుత్ సదుపాయం, తాగునీటి వసతి కల్పించాలి. పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలి. ఇలా 18 రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అధికారులు మళ్లీ లేవుట్ను పరిశీలించి తుది ఆమోదానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. లేకపోతే రిమార్కులు రాసి వాటిని పూర్తి చేయాలని ఆదేశిస్తారు. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయిన వెంచర్లలో భవన నిర్మాణ అనుమతులను అధికారులు జారీ చేస్తారు.నిబంధనలు ఇలా...వ్యవసాయ భూములకు గుంట నుంచి 10 గుంటల మధ్య స్లాటు బుక్ చేసి రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ కార్యాలయాలకు వస్తే దీనిపై విచారణ జరిపించాలి. తండ్రి లేదా తల్లికి ఎకరం స్థలం ఉండి వారికి ఎక్కువ మంది సంతానం ఉంటే(కుటుంబ సభ్యులకు) మాత్రం రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. సంబంధం లేని వ్యక్తులు నిత్యం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు స్లాటు బుక్ చేస్తే తహసీల్దారుకు అనుమానం రావాలి. ఈ సర్వే నంబరులో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా లేదా అని విచారించాలి. అయితే చాలాచోట్ల ఇవేమీ చేయడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారమని తెలిసీకూడా వ్యవసాయ భూములకు గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ పేరిట విక్రయాలు... ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న మాయాజాలానికి అమాయక ప్రజ లు బలవుతున్నారు. వెంచర్ అనుమతి కోసం డీటీసీపీకి దరఖాస్తు చేశామని లేనిది ఉన్నట్లుగా తప్పుడు సమాచారంతో ప్లాట్ల ను అంటగడుతున్నారు. చాలాచోట్ల కేవలం నాలా అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు మోసపోతుండగా.. వ్యాపారులు మాత్రం లాభపడుతుండటం గమనార్హం. అనుమతుల్లేని వాటికి నోటీసులు జిల్లాలో చాలాచోట్ల డీటీసీపీ కోసం దరఖాస్తు చేశామంటూ కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణ పరిసరాల్లో ఇలాంటి వెంచర్లు వెలిసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. డీటీసీపీ అనుమతి కోసం దరఖాస్తు చేసి.. నిబంధనల మేరకు వెంచర్ను అభివృద్ధి చేయకుండానే నాలా అనుమతుల పేరిట రిజిస్ట్రేషన్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. – యశ్వంత్, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి -
సమ్మె నోటీస్ అందజేత
ఆసిఫాబాద్అర్బన్: దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొంటున్నారని శనివారం జిల్లా కేంద్రంలో డీపీవో భిక్షపతిగౌడ్కు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ సమ్మె నోటీస్ అందించారు. వారు మాట్లాడుతూ కార్మికులు త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్తంగా సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
రాజ్యాంగానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్
● బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ధర్మారావుకాగజ్నగర్టౌన్: దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధిస్తూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన వేలాది మంది మేధావులు, జర్నలిస్టులు, యువకులను అరెస్టు చేసి జైల్లో వేసి అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లు ప్రజలు అరిగోస పడ్డారని ఆరోపించారు. సమావేశంలో బీజేీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, విజయ్, రాణి, కొప్పుల శంకర్, మనోహర్గౌడ్, మల్లికార్జున్, సుధాకర్రావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటాం’
రెబ్బెన(ఆసిఫాబాద్): కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సమయంలో ప్రభుత్వంతో మాట్లాడి రూ.400 కోట్లు ఇప్పించిన ఘనత ఐఎన్టీయూసీదని అన్నారు. కార్మికుడికి సొంతింటి పథకం తప్పకుండా ఇప్పిస్తామని, పెర్క్స్పై ఐటీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేటర్ల పదోన్నతి అంశాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్బాబు దృష్టికి జనక్ప్రసాద్ తీసుకెళ్లారని తెలిపారు. టీబీజీకేఎస్ నాయకులు గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీలో ఉండకుండా, ఏఐటీయూసీ గెలిచేలా పనిచేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సంగెం ప్రకాష్రావు, రామారావు, వీరస్వామి, ఏరియా కార్యదర్శులు మాధవకృష్ణ, నారాయణ, శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గట్టయ్య, ఫిట్ కార్యదర్శులు తిరుపతి, భీమేశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
కాగజ్నగర్రూరల్: తాగునీటి కోసం కాగజ్నగర్ మండలం భట్టుపల్లికి చెందిన మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. 15 రోజులుగా భగీరథ నీరు సరఫరా కావడం లేదని, పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. విసుగుచెంది రోడెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశా రు. భగీరథ సిబ్బందితోపాటు వాటర్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాటర్మెన్ను నీటి కోసం సంప్రదిస్తే మహిళలు అని చూడకుండా దుర్భాషలాడుతున్నాడని ఆరోపించారు. పంచాయతీ సిబ్బందిని అడిగితే వాల్వ్ చెడిపోయిందని, హైదరాబాద్ నుంచి తీసుకురా వాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించమని స్పష్టం చేశారు. దీంతో కాగజ్నగర్, దహెగాం ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనా లు నిలిచిపోయాయి. ఎంపీడీవో ప్రసాద్, పంచా యతీ కార్యదర్శి మహేశ్ స్పందించి సమస్య పరి ష్కరించడంతో మహిళలు ధర్నా విరమించారు. -
‘అకాడి’ పూజలు
జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామంలో శుక్రవారం ప్రజలు అకాడి పండుగ సందర్భంగా వనదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాకాలంలో మేతకు వెళ్లే పశువులకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం వనదేవతలకు పూజలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. అకాడి పూజల అనంతరం ఏత్మాసూర్ దేవతకు పూజలు చేయనున్నారు. ఆ తర్వాత దండారీ ఉత్సవాలకు శ్రీకారం చుడతామని వావుదాం పటేల్ సీలిక్రావు తెలిపారు. కార్యక్రమంలో భగవంత్రావు, ధర్మరావు, లింబారావు తదితరులు పాల్గొన్నారు. – ఆసిఫాబాద్రూరల్ -
● ‘రైతు భరోసా’ నేపథ్యంలో బ్యాంకుల్లో మనీ కొరత ● రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● సాగు సమయంలో పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందులు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లా వ్యాప్తంగా కాగజ్నగర్, ఆసిఫాబాద్లో ఎస్బీఐతోపాటు ఇతర ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. అలాగే అన్ని మండల కేంద్రాలు, వాణిజ్య కేంద్రాల్లోనూ బ్యాంకుల సదుపాయం ఉంది. జిల్లా ప్రజలు ఎక్కువగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాథమిక రైతు సహకార సంఘాలకు చెందిన బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఈ నెల 23 నాటికి జిల్లాలో 1,21,287 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.240.60 కోట్ల నగదును జమ చేసింది. ప్రతీ మండలానికి ఆయా మండలం పరిధిలో వ్యవసాయ భూములు, రైతులను అనుసరించి రూ.5 నుంచి రూ.12 కోట్ల వరకు నగదు మంజూరైంది. పెట్టుబడి సాయం అందుకున్న రైతులు నగదు డ్రా కోసం బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. నిత్యం వందలాది మంది బ్యాంకుల వద్ద వస్తుండటంతో రద్దీ నెలకొంటోంది. నగదు పరిమితి.. బ్యాంకు నిబంధనలను అనుసరించి ఖాతాదారుల కు అందించే నగదు విషయంలో పరిమితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ బ్యాంకులకు రెండురోజులకు ఒకసారి రూ.60 నుంచి రూ. 70లక్షల నగదు తీసుకొస్తున్నారు. అంటే ప్రతిరోజూ రూ.30లక్షల వరకు మాత్రమే రైతులు, ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు డిమాండ్ ఎక్కువగా ఉండగా సరిపడా అందడం లేదు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో రైతులతోపాటు వ్యాపారులకు సైతం అవసరాలు ఉండటంతో అక్కడ డిమాండ్ మరింత ఉంది. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకులు అధికంగా ఉన్న నగదు సరఫరా సరిపడా లేదు. సాగు సమయంలో అవస్థలు విత్తనాల కొనుగోలు, ఎరువులు, పురుగుమందులకు రైతులకు నగదు అవసరం అధికంగా ఉంటోంది. బ్యాంకుల వద్ద వారు వేచి ఉండాల్సి వస్తోంది. దహెగాం, చింతలమానెపల్లి, బెజ్జూర్, కెరమెరి, జైనూర్ వంటి మండలాల్లోని బ్యాంకులకు చేరుకోవడానికి ఆయా గ్రామాల రైతులు 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. చింతలమానెపల్లి మండలంలోని కోయపెల్లి నుంచి రవీంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చేరుకోవడానికి సుమారు 30కిలోమీటర్ల దూరం ఉంది. నగదు కోసం పలుమార్లు తిరగడం రైతులకు ప్రయాసగా మారింది. వ్యవసాయ పనులు చేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో కనీసం ఏటీఎంలు కూడా లేవు. పట్టణాల్లోని ఏటీఎంల్లో నగదు అందుబాటులో లేకపోవడం రైతులు, సాధారణ విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. డిజిటల్ చెల్లింపులు సదుపాయం ఉన్నా రైతులు, కూలీలకు చాలామందికి అవగాహన లేదు. ఫలితంగా చెల్లింపులు నగదు రూపంలో చేయాల్సి రావడంతో తిప్పలు తప్పడం లేదు. రైతు భరోసా పథకం డబ్బులు ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించి బ్యాంకుల్లో నిబంధనలు సడలించి సరిపడా నగదు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ బ్యాంకులో రైతుల రద్దీఈ ఫొటోలోని రైతు పేరు డోకె రాకేశ్. చింతలమానెపల్లి మండలం దిందా నుంచి బ్యాంకు ఖాతా నుంచి నగదు డ్రా చేసేందుకు ఇటీవల రవీంద్రనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్లాడు. తీరా బ్యాంకులో నగదు లేదని చెప్పడంతో గ్రామానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకు వచ్చాడు. పంట పెట్టుబడికి రూ.లక్ష అవసరం ఉందని, బ్యాంకులో నగదు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రాకేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క రాకేశ్ మాత్రమే కాదు.. జిల్లాలో చాలామంది రైతులు వ్యవసాయ పనులు, పంట పెట్టుబడికి సరిపడా బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.చర్యలు తీసుకోవాలి బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి. పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి రావడం ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం బ్యాంకు అధికారులకు సూచనలు ఇవ్వాలి. – కుకుడ్కార్ రమేశ్, బాలాజీ అనుకోడ, మం.చింతలమానెపల్లి గ్రామీణ ప్రాంతాల్లో పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో నగదు తరలించడానికి పరిమితి ఉంటుంది. సెక్యూరిటీ సమస్యలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి రవీంద్రనగర్ బ్యాంకుకు రెండురోజులకు ఒకసారి రూ.70లక్షల వరకు నగదు తీసుకొస్తున్నాం. వానాకాలంలో నగదు డిమాండ్ పెరిగింది. కొద్దిరోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కాకుండా పరిమితిగా అందిస్తున్నాం. – కిరణ్కుమార్, టీజీబీ మేనేజర్ -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
బెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులోని కూనారం ఆర్ఓబీ వద్ద క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో శుక్రవారం కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తుగా ఈ మార్గంలో రైళ్లను ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో నిలిపివేయడంతో గంటలకొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను కాజీపేట నుంచి అటువైపే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, రేచినీరోడ్ రైల్వేస్టేషన్, ఆసిఫాబాద్ ఎక్స్రోడ్, కాగజ్నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్–బీదర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు పొత్కపల్లి రైల్వేస్టేషన్ వరకు నడపనున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పాక్షికంగా కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మధ్యలో రద్దు చేశారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వైపు వెళ్లే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య పాక్షికంగా రద్దు చేసి వరంగల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడపనున్నారు. కాజిపేట–సిర్పూర్ వైపు వెళ్లే మెము ఎక్స్ప్రెస్ రైలు పొత్కపల్లి వరకే నడస్తుంది. బోధన్–సిర్పూర్ టౌన్–బోధన్ పుష్పుల్ రైలు రద్దు చేశారు. కాజీపేట–బల్లార్షా ఎక్స్ప్రెస్ రైలు రద్దయింది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు కాజిపేట–సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
● సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ● గ్రామాల్లో మొదలైన స్థానిక ఎన్నికల హడావుడి ● రిజర్వేషన్లు తేలితే మరింత స్పష్టత ● పోటీకి సన్నద్ధమవుతున్న ఆశావహులు
కౌటాల మండలంలోని శీర్షా గ్రామంఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో హడావుడి మొదలైంది. రానున్న 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి, 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించడంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరి కానుంది. గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగియగా కొంతమంది మాజీ సర్పంచులు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆశావహులు సైతం పోటీకి సై అంటున్నారు. అయితే పట్టున్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. 335 గ్రామ పంచాయతీలు.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డులు ఉండగా, 127 ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ 15 స్థానాలు, జెడ్పీటీసీ 15 స్థానాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 34,8368 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 17,4297 పురుషులు, 17,4055 సీ్త్రలు, 16 మంది ఇతరులు ఉన్నారు. ఆరేళ్లక్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి ఒకటిన ము గిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు నిధుల కొరతతో పాటు పాలకవర్గం లేకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. నెలల తరబడి ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. అలాగే ఎంపీటీసీ స్థానాలకు 2019లో ఎన్నికలు నిర్వహించగా, పదవీ కాలం పూర్తయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతో గ్రామాల్లో చర్చ మొదలైంది. తొలుత పంచాయతీ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసే అభ్యర్థుల్లో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది. అధికారుల సన్నద్ధత జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పల్లె ఓటరు జాబితా సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పోలింగ్ నిర్వహించేలా సన్నద్ధతతో ఉన్నారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్లకు మరమ్మతులు చేపట్టారు. అవసరమైన సిబ్బంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్రూంలో భద్రపరిచారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. ఓటర్ జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఇతర పనులన్నీ పూర్తిచేశామని జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో పంచాయతీలు, ఓటర్ల వివరాలు మండలం జీపీలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆసిఫాబాద్ 27 14,762 14,779 0 29,741 బెజ్జూర్ 22 11,608 11,878 2 23,488 చింతలమానెపల్లి 19 12,016 11,684 0 23,700 దహెగాం 24 10,858 10,892 0 21,750 జైనూర్ 26 11,779 12,235 0 24,014 కాగజ్నగర్ 28 22,387 21,720 2 44,109 కెరమెరి 31 11,984 11,665 1 23,650 కౌటాల 20 13,597 13,298 1 26,896 లింగాపూర్ 14 5,018 5,359 0 10,377 పెంచికల్పేట్ 12 6,231 6,044 0 12,275 రెబ్బెన 24 14,381 13,950 0 28,331 సిర్పూర్– టి 16 10,892 10,964 1 21,857 సిర్పూర్– యు 15 5,748 6,326 2 12,076 తిర్యాణి 29 8,738 9,122 4 17,864 వాంకిడి 28 14,298 13,939 3 28,240 నెలరోజుల్లో రిజర్వేషన్లు ఖరారు! హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల్లో సర్పంచులు, వార్డు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు అలాగే ఉంటాయా, మార్పు ఉంటుందా.. అనే చర్చ జరుగుతోంది. ఈమేరకు అనుకూలంగా ఉన్న స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన నెలకొంది. పంచాయతీ పోరు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో విజయానికి పార్టీల మద్దతు కీలకం కానుంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
బెల్టుషాపులు తొలగించాలని ధర్నా
కాగజ్నగర్టౌన్: బెల్టు షాపులు తొలగించాలని కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, కోయవాగుకు చెందిన మహిళలు శుక్రవారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలుస్తున్నాయని, పురుషులు, యువ కులు మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారన్నారు. ఇంట్లోని సామగ్రిని కూడా అమ్మి జల్సాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులతోపాటు గుడుంబా కూడా దొరకడంతో వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి బెల్టుషాపులు, గుడుంబా స్థావరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. -
కమిట్మెంట్తో పనిచేయాలి
భౌగోళికంగా విస్తీర్ణం కలిగిన జిల్లాలో సమస్యలు అధికంగానే ఉంటాయి. వాటి పరి ష్కారానికి చొరవ చూపాలి. ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో పనిచేయాలి. గృహజ్యోతి సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో కౌంటర్ను ఏర్పాటు చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూ.200 కోట్లతో 100 ఇంటిగ్రేటేడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం. పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు చొరవ చూపాలి. గ్యాస్ సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలి. సమస్యలు తెలిపితే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖల మంత్రి -
పథకాల అమలుకు చర్యలు
ఆసిఫాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 73,475 లబ్ధి పొందారు. ఇంకా దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. భూ భార తి రెవెన్యూ సదస్సుల్లో నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి. పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. సీఎంఆర్ సమస్యలతో జిల్లా నుంచి 10 వేల టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లికి పంపించాం. కొన్ని ఇందిరమ్మ ఇళ్లు కోర్ ఏరియాలో ఉండడంతో అటవీశాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ.4.99 కోట్లతో పనులు చేపడుతున్నాం. జలపాతాల అభివృద్ధికి డీపీఆర్ తయారు చేస్తున్నాం. – వెంకటేశ్ దోత్రే, కుమురంభీం జిల్లా కలెక్టర్ -
ఇందిరమ్మ ఇళ్లపై నివేదిక అందజేత
ఆసిఫాబాద్అర్బన్: దహెగాం మండలం కొత్మీర్ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మండల పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల పూర్తి వివరాల నివేదికను గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో కిరణ్కు అందించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో తమ పాత్ర లేకున్నా.. రెండో జాబితాలో ఇళ్లు వస్తాయో.. రావో అనే అనుమానంతో కొందరు మహిళలు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎవరి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని, ఆరోపణలకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో నివేదిక రూపొందించామని పేర్కొన్నారు. -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఆసిఫాబాద్రూరల్: యువత చెడు అలవాట్లకు దూ రంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమాజంలో తప్పుడు మార్గాలు అనుసరించేవారి సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, హెరాయిన్, మద్యం, సిగరేట్లు, గుట్కాకు బానిసలుగా మారొద్దన్నారు. న్యాయ సహాయం కోసం వెంటనే 15100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాదగిరి, లీగల్ అండ్ డిఫెన్స్ కన్వీనర్ అంజనిదేవి, అధ్యాపకులు సంతోష్, మహేశ్, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సహాయక సంఘాల అభివృద్ధే లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని స్వయం సహా యక సంఘాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ర్యాంప్ డైరెక్టర్ ఎండీ ఖాసిం తెలిపారు. ఎస్హెచ్జీ మహిళా సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ర్యాంప్(రైసింగ్ అండ్ యాక్సలెరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్)లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు అనంతరం 15రోజులపాటు పరిశ్ర మ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సాయం ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఏ రామకృష్ణ, డీపీఎం అన్నాజీ, ఏపీఎం సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రభుత్వంలోనే ప్రగతి
● అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి ● దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ● మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ ● ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ● నాలుగు గంటలు కొనసాగిన సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే గైర్హాజరుఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే గైర్హాజరుపై పలువురు చర్చించుకోవడం కనిపించింది. సాక్షి, ఆదిలాబాద్/కైలాస్నగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించే బాధ్యత అధికారులేదనని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం ఆదిలాబాద్లోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ ప్ర భుత్వ పనితీరును స్పష్టం చేస్తూ అధికారులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మొదట వ్యవసాయ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారికి జైలు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇక నుంచి జిల్లాల వారీగానే సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మృతి చెందిన స్వయం సహాయక సంఘాల కుటుంబీకులకు మంజూరైన రూ.10లక్షల ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశా రు. పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జాదవ్ అనిల్కుమార్, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావు పటేల్తోపాటు కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకీ షర్మిల, కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. మంత్రులకు ఘన సన్మానం ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుతోపాటు ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి జిల్లాకు చెందిన వివేక్ను ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్జాదవ్, కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. సీఆర్ఆర్ ఇంటికి వెళ్లిన ‘జూపల్లి’ తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని శాంతినగర్లోగల మాజీ మంత్రి, దివంగత చిల్కూరి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మేనల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అలకసమావేశం ప్రారంభమయ్యాక కాసేపటికి వేదికపైకి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుర్చీ లేకపోవడంతో కొద్దిసేపు నిల్చూనే ఉన్నారు. జెడ్పీ సిబ్బంది వెంటనే కుర్చీ తీసుకువచ్చి వేయగా ఆసీనులయ్యారు. ఈ తర్వాత ఏమనుకున్నారో తెలియదు గాని ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి వేదిక దిగి అధికారుల కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాలని కోరారు. మంత్రి కూడా ఆహ్వానించడంతో తిరిగి వేదికపైకి వచ్చి అనిల్ జాదవ్ సీట్లో కూర్చున్నారు. -
ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన
● ఏఎస్పీ చిత్తరంజన్ రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు మండలంలోని తక్కళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గ్రామాల్లోని ప్రజలకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉన్నతస్థాయికి చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసిఫాబాద్–ఆదిలాబాద్ రోడ్డు పూర్తి చేయాలి
రూ.26 కోట్లతో చేపట్టిన ఆసిఫాబాద్–ఆదిలాబాద్ బీటీ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తికాగా కాంట్రాక్టర్ రూ.4.5 కోట్ల పనులు చేపట్టాడు. బిల్లులు రాక పనులు ఆపేశాడు. రోడ్డు గుంతలు పడింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం జారీ చేసిన టైగర్ జోన్ జీవో 49ని వెంటనే రద్దు చేయాలి. – కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే -
చిత్తశుద్ధితో పథకాలు అమలు
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి -
నిధులు పెండింగ్లో పెట్టొద్దు
కోలాం, తోటి వంటి పీవీటీజీల ఇళ్ల నిర్మాణాలకు ఈజీఎస్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.742 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 9,10వ తరగతుల విద్యార్థులకు ఎండీఎం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు. అర్హులైన గిరిజనులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు వెంటనే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలి. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ -
సింగరేణి లాభాల వాటా ప్రకటించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణికి గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలను వెంటనే ప్రకటించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో గురువారం టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి లాభాలు ఎన్ని కోట్లు వచ్చాయో వెంటనే ప్రకటించి, లాభాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది సుమారు రూ.2300 కోట్లు సింగరేణి అభివృద్ధి కోసం అని పక్కన పెట్టారని గుర్తు చేశారు. యాజమాన్యం విజిలెన్స్ పేరిట కార్మికులను వేధించడాన్ని మానుకోవాలని అన్నారు. బదిలీలను నియంత్రిస్తూ సర్క్యులర్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలన్నారు. జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, ఫిట్ కార్యదర్శి వెంకటేశ్, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్, అలవేణి సంపత్, సెంట్రల్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, వెంకన్న, సీహెచ్పీ ఫిట్ కార్యదర్శి రమేశ్, నాయకులు తిరుపతి, రవి, అజీమ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో శంకరమ్మకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 4 నుంచి 6 నెలలుగా కార్మికులకు వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2023 జూలై, ఆగస్టులో 34 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మినిమమ్ బేసిక్ ప్రకారం రూ.19వేల వేతనం చెల్లించాలని అప్పటివరకు జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేస్, దేవాజీ, వెంకటేష్, సుధాకర్,శంకర్, సునీల్, అన్నాజీ, ప్రవీణ్, రాజేశ్వరీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ కోచ్గా సాయి
ఆసిఫాబాద్రూరల్: జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కోచ్గా గోగర్ల సాయి ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వాసవి స్కూల్ పీఈటీగా ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి గుజరాత్లోని భుజ్ పట్టణంలో జరిగే హెచ్ఎఫ్ఐ 54వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు సాయి కోచ్గా వ్యవహరిస్తారని వెల్లడించారు. గతలో కూడా ఆయన జిల్లా, రాష్ట్ర జట్టుకు కోచ్గా వ్యవహరించారని తెలిపారు. -
సమన్వయం.. సవాలే!
సాక్షి,ఆదిలాబాద్: ‘పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశపర్చొద్దు.. సమన్వయంతో ముందుకు సాగా లి.. ప్రభుత్వ పదవులను శ్రేణులకు ఇప్పించడంలో జాప్యం అయితే ప్రయోజనమేంటి.. ఆలయ, మార్కెట్ కమిటీలు వంటి పదవులు నేరుగా నేను ఇవ్వలేను.. ఇన్చార్జి మంత్రులు, షార్ట్లిస్ట్ చేసి పంపితే ఫైనల్ మాత్రమే చేయగలుగుతాను.. నామినేటెడ్తో పాటు పార్టీ కమిటీలు ఇవ్వడంలో ఇక ఆలస్యం వద్దు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలి.. అది జరిగితే త్వరగా ఫైనల్ చేయవచ్చు..’ ఇది సీఎం రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన టీపీసీసీ పీఏసీ భేటిలో అన్న మాటలు. ప్రస్తుతం ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ఇన్చార్జి మంత్రులకు ప్రస్తుతం పార్టీ పరంగా వీటన్నింటిని సరిదిద్ది, గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎకై ్స జ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారు. నేడు, రేపు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. అలాగే ఇన్చార్జి మంత్రికి తొలుత పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేట్ పదవుల పందెరం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం ముందున్న బాధ్యత. సీఎం ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు దృష్టి సారించాలని ఆదేశించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన తక్షణం దృష్టి సారించాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో గ్రూపు విభేదాలతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో మంత్రి వీటన్నింటిని ఎలా గాడిలో పెడతారనేది ఆసక్తికరం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కార్యకర్తల్లో తాము అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కనిపించడం లేదు. అధికారుల వద్ద తమ పనులు కాకపోవడం కూడా ఈ నిరాశకు కారణం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం తీసుకురావడం ప్రస్తుతం ఇన్చార్జి మంత్రికి కీలకం కానుంది. సమన్వయం సాధించేనా.. ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది. గతంలో ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్క వీరందరినీ సమన్వయ పర్చడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా ఆమె అసలు పట్టించుకోలేదని నేరుగా జిల్లా నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముందు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఆ సమయంలోనే తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించలేనని, తప్పుకుంటానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అప్పట్లోనే ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత పరిణామ క్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లిని ఆదిలాబాద్కు, సీతక్కను నిజామాబాద్కు మార్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రి జూపల్లి తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ఆయన ఎలా ముందుకెళ్తారనేది ప్రస్తుతం కీలకం. ఇక చెన్నూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంత్రి హోదాలో ఆయన కూడా గురువారం నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి రానున్నారు. ‘హస్తం’లో గ్రూపు విభేదాలు నామినేటెడ్, పార్టీ కమిటీల ఏర్పాటులో జాప్యం ముంచుకొస్తున్న ‘స్థానిక’ సమరం నేడు ఆదిలాబాద్కు జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ రెండు రోజుల పాటు ఇక్కడే ఆయన వెంట మంత్రి వివేక్ సైతం..ఇదీ పరిస్థితి..ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. జిల్లాలో పార్టీకి దిక్సూచి లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేతలు కంది శ్రీనివాస్రెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్నాయక్లు ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు ప్రస్తుతం ఆది లాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏకైక కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా శ్రీహరిరావు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, శ్రీహరిరావు మధ్య పార్టీ పరంగా సరై న సంబంధాలు లేవు. ముధోల్ నియోజకవర్గంలో సీనియర్ నేతలు బోస్లే నారాయణరావు పటే ల్, విఠల్రెడ్డి మధ్య కూడా సఖ్యత కరువైంది. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మధ్య కూడా ఇదే పరిస్థితి. కుమురంభీం జిల్లాలోనూ పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయి. సిర్పూర్ కాగజ్నగర్లో ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్కు తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఆయనకు ఎమ్మెల్సీ విఠల్తో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రావి శ్రీనివాస్కు, దండే విఠల్కు మధ్య కూడా సఖ్యత లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్నాయక్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలు దుమారం లేపాయి. ప్రధానంగా ‘నా నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రినని’ ఆయన పేర్కొనడం పార్టీలో విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సిందే. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితులను జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి ఎలా సరిదిద్దుతారనే విషయంలో పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
పెద్దపులి కదలికలు
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలం చోపిడి బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం పెద్దపులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం చోపిడి బీట్ పరిధిలోని గోవర్గూడ, చోపిడి, సోనాపూర్ గ్రామాల్లో పులి కదలికలపై అవగాహన కల్పించారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులి రెబ్బెన రేంజ్ పరిధిలోని ఆసిఫాబాద్ మండలం రౌట సంకెపల్లి వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా పులి కదలికలు గుర్తిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
● పర్యావరణ పరిరక్షణకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యం ● బెల్లంపల్లి ఏరియాలో ఏటా విరివిగా మొక్కల పెంపకం ● ఈ ఏడాది 40 హెక్టార్లలో నాటేందుకు రంగం సిద్ధం ● గతంలో నాటిన వాటితో అడవిని తలపిస్తున్న డంపింగ్ యార్డులు
వచ్చే నెలలో నాటుతాంఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించి కార్పొరేట్ తేదీ ఖరారు చేయలేదు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో తేదీని ఖరారు చేస్తారని అనుకుంటున్నా. ఏరియాలో సుమారు 2లక్షల వరకు నాటాలని అనుకుంటున్నాం. నాటిన ప్రతీ మొక్క బతికేలా చూస్తాం. అవి చెట్లుగా మారినప్పుడే వాటి నుంచి ప్రయోజనం పొందగలుతాం. – విజయ భాస్కర్రెడ్డి, జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా సింగరేణి పెంచుతున్న చెట్లతో కళకళలాడుతున్న డోర్లి– 1 ఓబీ డంప్యార్డురెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థ పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. బొగ్గు ను ఉత్పత్తి చేసే నల్లనేలలపై పచ్చదనం పరుస్తోంది. ఏటా ఏరియాల వారీగా ఖాళీ స్థలాలు, గనులు, డిపార్టుమెంట్లు, కాలనీల్లో మొక్కలు నాటుతోంది. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు, విస్తరణ పనులతో చాలా ప్రాంతాల్లో పెద్ద వృక్షాలు, చెట్లతోపాటు కొంతమేర అటవీప్రాంతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా ఖాళీ స్థలాన్ని వదలకుండా పచ్చదనం పెంపొందిస్తోంది. డీ గ్రేడ్ ఫారెస్టు భూములను తీసుకుని అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. మూసివేతకు గురైన ఓసీపీ ప్రదేశాలు, ఓబీ డంపింగ్ యార్డులపై మొక్కలు నాటి పర్యావరణ సమతౌల్యానికి దోహదపడుతోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో మూసివేతకు గురైన గనుల ప్రదేశాలు, డంపింగ్ యార్డులు ప్రస్తుతం అడవులను తలపిస్తున్నాయి. లక్ష్యం : మూడు లక్షలు ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియాలో సుమారు మూడు లక్షల మొక్కలు సింగరేణి ప్రాంతాల్లో నాటడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, అటవీ, ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కైరిగూడ ఓసీపీతోపాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 40 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సింగరేణి ఉద్యోగులు నివాసం ఉండే కాలనీలు, రోడ్ల వెంట నాటనున్నారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటడంతోపాటు ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్, ఓబీ డంప్లో మొక్కలు నాటనున్నారు. కొన్నేళ్లుగా ఏరియాలో సుమారు 5 నుంచి 7లక్షల వరకు మొక్కలు నాటుతున్నారు. వాటిలో ఓబీ డంపింగ్ యార్డుపై నాటుతున్నవే అధికంగా ఉన్నాయి. సంరక్షణకు ప్రత్యేక చర్యలు ఏటా రూ.కోట్లు వెచ్చించి నాటుతున్న మొక్కల సంరక్షణపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా రహదారుల వెంట నాటే వాటిని రెండేళ్లుగా సంరక్షిస్తోంది. పశువులకు ఆహారం కాకుండా ట్రీగా ర్డులు ఏర్పాటు చేయడం, రోజు నీళ్లు అందించడం వంటి చర్యలు చేపడుతున్నారు. డంపింగ్ యార్డులపై నాటే వాటి కోసం నల్లతుమ్మ, కంది, జనుము, హమాట గ్రాస్ సీడ్స్, అగీల్ సకారం, సకారం ముంజ, ఎలిఫెంట్, టైగర్ గ్రాస్ విత్తనాలు చల్లుతూ పోషకాలు అందేలా చూస్తున్నారు. తద్వారా భూమి కోతకు గురికాకుండా ఉండటంతోపాటు కావాల్సిన నత్రజని అందుతోంది. డంపింగ్ యార్డులపై నాటిన వాటిల్లో దాదాపు 80శాతం చెట్లుగా మారుతున్నాయి. మిగిలిన 20 శాతం మొక్కల స్థానంలో కొత్తవి నాటుతున్నారు. గతంలో మూతపడిన డోర్లి– 1, డోర్లి– 2 ఓబీ డంపింగ్యార్డులు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అడవిజాతి మొక్కలే అధికం సింగరేణి నాటే మొక్కల్లో అడవిజాతివే అధికంగా ఉంటున్నాయి. గోలేటిలో సుమారు 5లక్షల మొక్క ల సామర్థ్యంతో నర్సరీ అందుబాటులో ఉంది. రా వి, మర్రి, వెదురు, తాని, జువ్వి, వేప, సీమచింత, మద్ది, కానుగ, ఎగిస, బహునియా, ఆరె, నారేప, సి సూ, సండ్ర, బిల్వ, ఫీల్ట్ఫాం వంటి అడవి జాతి వా టితోపాటు పండ్ల జాతిలో ఉసిరి, చింత, సీమచింత, మామిడి, అల్లనేరేడు, సపోట తదితరవి పెంచుతున్నారు. పండ్ల జాతి వాటిని ఎక్కువగా కాలనీలు, పరిసర గ్రామాల ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. -
గిరిజనుల సమగ్రాభివృద్ధికి ‘పీఎం జుగా’
● అదనపు కలెక్టర్ దీపక్ తివారితిర్యాణి(ఆసిఫాబాద్): గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా అమలు చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని పంగిడిమాదర రైతువేదిక వద్ద బుధవారం పీఎం జుగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులందరూ ఆధార్, కుల, జనన, బ్యాంకు ఖాతా తదితర ధ్రువపత్రాలు కలిగి ఉండే అధికారులు కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే మండలంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరం శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం వివిధ బ్యాంకు అధికారుల సహకారంతో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. మహిళలకు గౌరవం పీఎం జుగా అవగాహన కార్యక్రమానికి వచ్చి న గిరిజనులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో మహిళలు నేలపై, పురుషులు కుర్చీల్లో కూర్చున్నారు. గమనించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారి మహిళలకు కుర్చీలు తెప్పించాలని ఆదేశించారు. అనంతరం అధికారులు మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారి మండలంలోని పంగిడిమాదర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఐటీడీఏ ఏఈ బద్రోద్దీన్ను ఆదేశించారు. సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు తెలపగా, త్వరలోనే బోర్వెల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని పల్లె దవఖానా భవనాన్ని పరిశీలించి, వారంలోగా పనులు పూర్తి చేయాలని పీఆర్ ఏఈ సువాస్ను ఆదేశించారు. ఆయన వెంట డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్, ఏటీడీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వినయ్, ఎస్సీఆర్పీ యశ్వంత్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణతేజ, వెటర్నటీ వైద్యుడు సాగర్ తదితరులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
ఆసిఫాబాద్రూరల్: పర్యావరణ పరిరక్షణతో నే మానవ మనుగడ అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటేషన్ పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ హరిత్– ది వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా చూడాలన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ తదితర అంశాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హరిత దళం కోఆర్డినేటర్ కుటుకం మధుకర్, డీఆర్డీవో దత్తారావు, వయోజన విద్యాశాఖ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో నిరక్షరాసులైన మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళ చదువుకునేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో 22,494 మంది అక్షరాస్యత లేని మహిళలను గుర్తించామని తెలిపారు. వీరిని అక్షరాస్యులుగా మార్చడంలో భాగంగా సెర్ప్ సిబ్బంది, ఆపరేటర్లు ప్రతీ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 10,227 మంది అభ్యాసకులు, 1,037 మంది వలంటీర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఉల్లాస్ యాప్ ద్వారా వివరాల నమోదు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, రిసోర్స్ పర్సన్లు మోహన్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ముగిశాయని డీఎస్వో మీనారెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలో 35 మంది విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ చూపిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని పేర్కొన్నారు. వీరికి జూలై 1న హైదరాబాద్లోని హకీంపేట్ క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. హకీంపేట్ అథ్లెటిక్స్ శిక్షకుడు గోపాల్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. కోచ్లు విద్యాసాగర్, అరవింద్, పీడీ, పీఈటీలు మధుసూదన్, జయశ్రీ, ఇందిర, వెంకటేశ్ పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్: రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉచిత ఇసుక సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, విత్తనాలు, ఎరువుల నిర్వహణ, వన మహోత్సవం– 2025 లక్ష్య సాధన, ఆయిల్పామ్ సాగుపై అవగాహన, సీజనల్ వ్యాధుల నివారణ, టీబీ నిర్మూలన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.30 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భారీ వర్షాలకు ముందే గ్రౌండ్ లెవల్ పనులు పూర్తయ్యేలా చూ డాలన్నారు. ఆగస్టు 15 నాటికి భూభారతి దరఖా స్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్ట ర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివా రి, ఎం.డేవిడ్, డీఎఫ్వో నీరజ్కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు మొదటి విడతగా 5,598 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 1500 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉచితంగా ఇసుక అందిస్తున్నామన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు 14 మండలాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 4,111 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. జిల్లాలో 1000 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఎంహెచ్వో సీతారాం, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, గృహనిర్మాణశాఖ పీడీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాస్త ఉపశమనం
● కొన్నిరోజులుగా వానల్లేక మొలకెత్తని పత్తి విత్తనాలు ● వేల ఎకరాల్లో రెండోసారి వేయాల్సిన పరిస్థితి ● రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు ● పంటలకు కొంత మేలు చేస్తుందంటున్న రైతులు కౌటాల(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి, సోయా, కంది పంటలకు కొంత మేలు చేయనున్నాయి. తొలకరి వానతో మురిపించిన వరుణుడు.. కొద్ది రోజులుగా ముఖం చాటేయడంతో జిల్లావ్యాప్తంగా పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు కూడా మాడిపోతున్నాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గత సీజన్లో ప్రధాన పంటలైన పత్తి, కంది, సోయా 3.40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ సీజన్లో 3.35 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. తొలకరితోనే పనులు.. మొలకెత్తని విత్తుజిల్లాలో మూడేళ్లుగా జూన్ మొదటి వారంలోనే తొలకరి వానలు పలకరిస్తున్నాయి. ఈ ఏడాది ఇంకాస్త ముందుగానే మేలో వర్షాలు పడడంతో జిల్లా రైతాంగం సాగు పనులు ప్రారంభించింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో రెండు వారాలుగా వాన జాడ కరువైంది. సీజన్ ప్రారంభమై 20 రోజులైనా ఓ మోస్తరు వర్షాలు లేకపోవడంతో చెరువుల్లోకి చుక్కనీరు చేరలేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో రైతులు జూన్ మూడో వారంలోగా పత్తి విత్తనాలు వేశారు. మొదటి వారం నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా చిరుజల్లులు పలకరిస్తూ ఉన్నాయి. దీంతో వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దుక్కిదున్నడం మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.10 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది. కొందరు రైతులకు బావులు ఉన్నా నీటితడులు అందించడం సాధ్యం కాలేదు. మొదటి దఫా వేసిన విత్తనాలు మొలకెత్తని చోట రైతులు మళ్లీ రెండో దఫా వేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా వానలు..జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 141.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 24 రోజుల్లో 122.3 మి.మీ.లు నమోదైంది. ఈ నెలలో 13 మి.మీ. లోటు ఉందని అధికారులు వెల్లడించారు. చింతలమానెపల్లి మండలంలో లోటు వర్షపాతం ఉండగా.. కౌటాల, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. ఈ వర్షాలకు విత్తనాలు కొంతశాతం మొలకెత్తుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మొలవలేదు ఈ వానాకాలం రెండెకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. అప్పటి నుంచి చిరుజల్లులే తప్పా మోస్తరు వాన కూడా పడలేదు. విత్తనాలు వేసి రెండు వారాలవుతున్నా ఇంకా మొలవలేదు. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్లీ పెట్టుబడికి డబ్బులు కావాలి. – శివరాం, గురుడుపేట, మం.కౌటాలమంగళవారం కురిసిన వర్షంప్రాంతం వర్షపాతం(మిల్లీమీటర్లు) కాగజ్నగర్ 49.0 పెంచికల్పేట్ 43.2 దహెగాం 56.1 బెజ్జూర్ 61.3 సిర్పూర్(టి) 52.3 కౌటాల 41.6 చింతలమానెపల్లి 21.6 వాంకిడి 45.4 రెబ్బెన 27.8 లింగాపూర్ 2.4 తిర్యాణి 14.5 జైనూర్ 10.4 ఆసిఫాబాద్ 32.2 కెరమెరి 18.3 సిర్పూర్(యు) 9.6 -
ఎన్ఐపీ చట్టాన్ని రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే ఎన్ఐపీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాల ని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివేణి డిమాండ్ చేశారు. జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొననున్నట్లు మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్కు సమ్మె నోటీస్ అందించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తుందన్నారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, నాయకులు సువర్ణ, వనిత, అంజలి పాల్గొన్నారు. -
గుడుంబా కిక్కు..!
కౌటాల(సిర్పూర్): జిల్లాలో బెల్టు దుకాణాలకు తోడు.. గుడుంబా గుప్పుమంటోంది. పోలీస్, ఎక్సైజ్ శాఖల అలసత్వంతో యథేచ్ఛగా తయారీ చేస్తున్నారు. మత్తుకు బానిసలుగా మారినవారు తక్కువ ధరకు లభించే దేశీదారుతోపాటు నాటుసారా తాగేస్తున్నారు. జిల్లాలో వందశాతం గుడుంబా అమ్మకాలు నిర్మూలించామని అధికారులు చెబు తున్నా.. గ్రామాల్లో గుట్టుగా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నాయి. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం సాగుతుండటంతో మహారాష్ట్రకు సరిహద్దు గ్రామాల శివారులో కొత్తగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆడపాదడపా కేంద్రాలపై దాడులు చేస్తున్నా పూర్తిస్థాయిలో నిర్మూలనకు అడుగులు పడటం లేదు. బైకులపైనే తరలింపు..మారుమూల గ్రామాల్లో అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా అక్రమార్కులు కాసుల కోసం ప్రాణహి త, వార్దా, పెద్దవాగు, పెన్గంగ నదులతోపాటు పంట పొలాల్లోని వ్యవసాయ బావులు, వాగులు, అటవీ ప్రాంతాలకు సమీపంలో చేలలో గుడుంబా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఇళ్లనే స్థావరాలుగా మార్చుకుంటున్నారు. నాటుసారాను ప్యాకెట్లుగా మార్చి పోలీసుల కళ్లుగప్పి ఇతర గ్రామాలకు బైక్లపైనే తరలిస్తున్నారు. కిరాణ దుకాణాల వద్ద కూడా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో గత ఐదు నెలల్లో ఏడు మండలాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి పోలీసులు 206 కేసులు నమోదు చేశారు. 223 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. 1,163 లీటర్ల గుడుంబా, 2060 కిలోల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా రవాణా చేస్తున్న 20 వాహనాలను పట్టుకున్నామని ఆబ్కారీశాఖ అధికారులు వెల్లడించారు. అమలు కాని నిషేధంరాష్ట్రంలో గుడుంబాను ప్రభుత్వం నిషేధించింది. అయితే తయారీదారులు, బెల్లం విక్రయదారులపై కఠిన చర్యలు లేకపోవడం, కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. నాటుసారాకు వినియోగించే బెల్లంపై కూడా రాష్ట్రంలో నిషేధం ఉంది. అయితే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ నల్ల బెల్లంపై నిషేధం లేదు. అక్రమార్కులు ఆ జిల్లా నుంచి కాగజ్నగర్, కౌటాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. అలాగే బల్లార్షాలో కిలో బెల్లాన్ని రూ.50కి కొనుగోలు చేసి వాంకిడి, సిర్పూర్(టి) మండలాల మీదుగా కౌటాల ప్రాంతానికి అక్రమంగా చేరవేస్తున్నారు. ఇక్కడ కిలో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖల అధికారులు స్పందించి గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం జిల్లాలో నదుల సమీపంతో పాటు వ్యవసాయ చేలు, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు ఏ ర్పాటు చేసినట్లు సమాచా రం రాగానే ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. నిత్యం తనిఖీలు చేసి స్థావరాలపై ఉక్కుపాదం మోపుతాం. అక్రమంగా మద్యం అమ్ముతున్న వారి వివరాలు పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులకు తెలియజేయాలి. – వి.రవి, ఎకై ్సజ్ శాఖ సీఐ, కాగజ్నగర్ ఇటీవలి ఘటనలు బెజ్జూర్ మండలం లంబాడిగూడ సమీపంలో గుడుంబా స్థావరంపై ఏప్రిల్ 25న ఎకై ్సజ్ శాఖ పోలీసులు దాడులు చేశారు. లంబాడిగూడకు చెందిన బానోత్ హరిప్రసాద్, నాగుత్ విజయ్ నాటుసారా తయారు చేస్తుండగా పట్టుకుని వంద లీటర్ల బెల్లం పానకం పారబోశారు. బెజ్జూర్ మండలం సులుగుపల్లి గ్రామానికి చెందిన అవధూత సత్యనారాయణ కిరాణాషాపులో ఏప్రిల్ 25న దాడులు నిర్వహించగా, 75 కిలోల బెల్లం, 20 కిలోల పటిక లభ్యమైంది. ఈ నెల 1న దహెగాం మండలం మర్రిపల్లి శివారులో గుడుంబా స్థావరాలపై పోలీ సులు దాడులు చేశారు. తయారీకి విని యోగించే వంద లీటర్ల బెల్లం పానకం పారబోశారు. కౌటాల మండలం ముత్తంపేటలో ఈ నెల 23న నాటుసారా తయారీకి వినియోగించే 1.60 క్వింటాళ్ల బెల్లం, 80 కిలోల పటికను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గుప్పుమంటున్న వైనం ప్యాకెట్లుగా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా స్థానిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు!మారుమూల ప్రాంతాల్లో కేంద్రాలు..జిల్లాలో ఏటా మద్యం వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు పెంచడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనుండడంతో గుడుంబా విక్రయా లూ పెరుగుతున్నాయి. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం, సిర్పూర్(టి), పెంచికల్పేట్ తదితర మండలాలకు సులు వుగా బెల్లం సరఫరా అవుతోంది. మహారాష్ట్రతోపాటు మంచిర్యాల, కాగజ్నగర్ పట్టణా ల నుంచి నల్ల, తెల్ల బెల్లం, పటిక తరలించి గుడుంబా తయారు చేస్తున్నారు. కౌటాల మండలం కన్నెపల్లిలో మద్యం ఏరులై పారుతుండడంతో గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్లు ఇటీవల మహిళలు తీర్మానం చేశారు. -
మిషన్ భగీరథ నీటిని అందిస్తాం
కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని నిరంతరంగా అందిస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నారు. మండలంలోని బాబేఝరి గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనులు తాగునీటి కోసం కెరమెరి ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జోడేఘాట్, కొలాంగూడ, శివగూడ, చిన్న, పెద్ద పాట్నాపూర్, బాబేఝరి, మహరాజ్గూడ, గోండ్గూడ, పాటా గూడ గ్రామాలను సందర్శించారు. బావులు, మోటార్లు, భగీరథ పైపులు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. కొన్నిచోట్ల చేతిపంపులకు మరమ్మ తు చేయించారు. మహరాజ్గూడకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అనంతరం మాట్లాడుతూ కొన్ని కారణాలతో నీటి సరఫరా ఆగిన విష యం వాస్తవమేనని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం రాత్రి వరకు శివగూడ గ్రామానికి, బుధవారం జోడేఘాట్కు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. తాగునీటి కోసం ఆందోళనలు చేపట్టొద్దని సూచించారు. ఆయన వెంట ఆసిఫాబాద్ ఈఈ సిద్దిఖి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ విశ్వేశ్వరావు, సాయికిరణ్, జోడేఘాట్ కార్యదర్శి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘రైతు భరోసా’
ఆసిఫాబాద్: రాష్ట్రంలో అర్హులందరికీ రైతు భరో సా నగదు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం ఆవరణలోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,031 రైతు వేదికల్లో ఏర్పా టు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామన్నారు. గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ ద్వారా 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. ఏడాది కా లంలో సుమారు 60 వేల మంది నిరుద్యోగ యు వతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 18 నెలల కాలంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణమాఫీ, పంట కొనుగోలు, సన్నరకం వడ్లకు బోనస్తో మొత్తంగా రూ.1.04 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మహిళల ఆధ్వర్యంలో 1000 నూత న బస్సులు ప్రారంభించామని, 8 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో ని జన్కాపూర్ రైతు కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 44 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, ఏవో మిలింద్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం
కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేదలకు అన్యాయం జరి గితే ఊరుకోమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పట్టణంలోని వార్డు నం.1, గుంటూరు కాలనీ, ఎఫ్ కాలనీలో మంగళవారం పర్యటించారు. అధికారులు సర్వే చేయకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేశామని చెప్పడం దారుణమన్నారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలు అనే కారణంతో అనర్హులుగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తాజ్మహ్మద్ బాబా, మినాజ్, రాజు, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్తోనే అభివృద్ధికౌటాల: కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండలంలోని కన్నెపల్లి, బోదంపల్లి గ్రామాల్లో మంగళవారం పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగపూరే బండు, యూత్ కన్వీనర్ కె.రాజు, నాయకులు వరలక్ష్మి, కమల, నాందేవ్, శివరాం, కార్తీక్, లహంచు, సాయి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చట్టాల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు’
కాగజ్నగర్రూరల్: అటవీ చట్టాల పేరుతో రైతుల ను ఇబ్బందులు పెట్టొద్దని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో సోమవారం ఎఫ్డీవో సుశాంత్ను కలిసి సమస్యల పై చర్చించారు. మండలంలోని అంకుసాపూర్ గ్రా మస్తులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని, వారు కేవలం తిండికోసమే పంట సాగు చేసుకుంటున్నారని వివరించారు. పేద రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎఫ్డీవో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ వసతులు పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు నక్క మనోహర్, రాజు, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఆసిఫాబాద్రూరల్: క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ను యువజన క్రీడల అధికారి రమాదేవితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్, కుమురంభీం చౌక్, అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా ఈ రన్ సాగింది. కలెక్టర్ మాట్లాడుతూ వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నా రు. క్రీడాకారులు జిల్లాకు పేరు తేవాలని సూచించారు. డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, అథ్లెటిక్ కోచ్ విద్యాసాగర్, పీడీలు, పీఈటీలు రాకేశ్, తిరుపతి, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలికెరమెరి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. మండలంలోని కొఠారి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలకు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందన్నారు. అనంతరం సావర్ఖేడా గ్రా మంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు రంగయ్యతోపా టు ఇతర ఉపాధ్యాయుల అంకిత భావాన్ని అభినందించారు. బాగా చదివిన ఒకటో తరగతి విద్యార్థిని మధుప్రియను మెచ్చుకున్నారు. పాఠ్యపుస్తకాలు, వంటకు ఉపయోగించే కూరగాయలను పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ వేణుగోపాల్, ఇన్చార్జి డీఈవో ఉదయ్బాబు, ఎంఈవో ఆడే ప్రకాశ్, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో అంజద్పాషా తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె జయప్రదం చేయాలి
కాగజ్నగర్టౌన్: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సీఐటీ యూ కార్యాలయంలో సోమవారం ఆశ కార్యకర్తల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించా రు. కేంద్రంలోని బీజేపీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులను బానిసలు గా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తె చ్చిందన్నారు. ఆశ కార్యకర్తలకు స్థిరవేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఉ ద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో ఆశ కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆశ వర్క్ర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగరం పద్మ, నాయకులు భారతి, పంచశీల, అనిత, దేవి, నవీన, కేసరి, శోభ, అనసూర్య, బద్రుబాయి తదితరులు పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం
ప్రజావాణి దరఖాస్తులకుఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా తనకు పింఛన్ రావడం లేదని వెంటనే పునరుద్ధరించాలని కాగజ్నగర్కు చెందిన అభింబి కోరారు. నెల క్రితం భూమిని కుమారుడు, మనుమడికి పట్టా చేసి ఇవ్వగా.. తన పోషణ గురించి పట్టించుకోవడం లేదని పెంచికల్పేట్ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన బావాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. వారి నుంచి తిరిగి భూమిని ఇప్పించాలని కలెక్టర్ను వేడుకున్నాడు. తన రెండెకరాల వ్యవసాయ భూమికి రైతుభరోసా ఇప్పించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని శివకేశవ మందిరం ప్రాంతానికి చెందిన వైరాగడే లక్ష్మి అర్జీ సమర్పించింది. మీసేవ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చి ఉపాధి చూపాలని పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొప్పుల రోహిత్ వేడుకున్నాడు. పులికుంట గ్రామ శివారులోని పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన అంగాల సాంబయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను దేవాదాయశాఖ అడ్డుకుంటుందని, తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు విన్నవించారు. తన భర్త పేరిట గల భూమిని కుమారుడు పట్టా చేసుకున్నాడని, ఇప్పుడు పోషణను పట్టించుకోవడం లేదని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రుకుంబాయి తెలిపింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలు వందశాతం పూర్తిచేయాలన్నారు. మొత్తం 51లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనువైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. భూమి కబ్జాకు యత్నం కాగజ్నగర్ మండలం గన్నారం శివారులో 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిని పాలివాళ్లు కబ్జాకు యత్నిస్తున్నారు. భూమి కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం తనకు 80 ఏళ్లు ఉన్నాయి. ఎవరూ లేని తనకు న్యాయం చేయాలి. – బడికెల దుర్గయ్య, గన్నారం, మం.కాగజ్నగర్● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
నీటి కోసం రోడ్డెక్కిన గిరిజనులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఓ వైపు వర్షాలు పడుతున్నా జిల్లాలో తాగునీటి సమస్యలు తీరడం లేదు. కెరమె రి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీకి చెంది న గిరిజనులు నీటి కోసం సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బిందెలతో రాస్తారో కో నిర్వహించారు. నెల రోజులుగా మిషన్ భగీరీథ నీరు సరఫరా కావడం లేదని, అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేతిపంపులు కూడా లేవని, ఉన్నవి కూడా నిరుపయోగంగా మారాయన్నారు. మట్టి, బురద వస్తుందనే కారణంతో నెల రోజులుగా నీరు అందించకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మధుకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. రేపటి నుంచి నీటిని అందిస్తామని, సాధ్యం కాని పక్షంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. సుభాష్, గోపా ల్, మూట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే’
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రెబ్బెనలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు, నూతన రేషన్కార్డులు, 200యూనిట్ల లోపు ఉ చిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్ర యాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీ లను ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అఖండ వి జయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చా రు. అనంతరం మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్ను సన్మానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవాజీ, నాయకులు సుదర్శన్గౌడ్, చిరంజీవిగౌడ్, మాజీ సర్పంచులు ప్రేందాస్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు. -
శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ప్రతిఒక్కరూ కొనసాగించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేష న్– వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పార్టీ కార్యాలయంలో సోమవారం శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వా రు మాట్లాడుతూ శ్యామప్రసాద్ ఆశయాలు, ఆలోచనలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని మతాలు, కులాల వారు అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రసాద్గౌడ్, శ్రీకాంత్, మాటూరి జయరాజ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు. -
చట్ట పరిధిలో బాధితులకు న్యాయం
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. -
సంగీత కచేరీలో ఉత్తమ ప్రతిభ
ఆసిఫాబాద్ అర్బన్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ, సిరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివా రం రాత్రి నిర్వహించిన సంగీత కచేరీలో జిల్లాకు చెందిన వాసుదేవన సమక్ష నందన్కు అవార్డు దక్కింది. సంగీత కచేరీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమక్ష నందన్ బాసర సరస్వతి అమ్మవారికి సంగీత, నృత్య నీరాజనం 2025 అనే అవార్డును ముఖ్య అతిథులు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్యయాదవ్, న్యూరాలజిస్ట్ యాక్టర్ దైవజ్ఞశర్మ, సింగర్ అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ సింగర్ మంజుల చేతులమీదుగా అందుకున్నారు. -
రైళ్ల రద్దుతో ప్రయాణికుల తిప్పలు
సిర్పూర్(టి): సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ మీదుగా ప్రతీరోజు రాకపోకలు సాగించే రైళ్లబంద్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి ఖాజీపేట్, కరీంనగర్, బల్లార్షా తదితర పట్టణాలకు ప్రయాణించే రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్, పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల ప్రజలతో పాటు సమీపంలోని మహారాష్ట్ర గ్రామాల ప్రజలు ప్రతీరోజు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ పట్టణాలతో పాటు మహా రాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్, నాగ్పూర్ తదితర పట్టణాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈనెల 21 నుంచి 26 వరకు సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి కొనసాగించే రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధి కారులు ప్రకటించడంతో ప్రయాణికులు సమీపంలోని కాగజ్నగర్ పట్టణం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకుని ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. రైల్వే మూడవ లైన్ మరమ్మతులు, ఇతర మరమ్మతుల కారణంగా ఖాజీపేట్ –బల్లార్షా మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తరుచూ రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నెలకోసారి రైళ్లు రద్దు చేస్తుండటంతో అసలు రైళ్లు కొనసాగుతున్నాయా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ గ్రామాల్లోని ప్రజలకు రైళ్ల రద్దు సమాచారం లేకపోవడంతో రైల్వేస్టేషన్ వరకు వచ్చి వారు వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి రైళ్లు యథావిధిగా క్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నా రు. -
వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
బెజ్జూర్: మండలంలోని నాగులవాయి గ్రా మంలో ఆదివారం పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెబ్బెన మండలానికి చెందిన ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్ర మం వైభవంగా జరిగింది. పోచమ్మ తల్లి ప్రతి ష్టాపనను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం చండీ హోమం నిర్వహించి గ్రామ ప్రజల భద్రత, శాంతి, సమృద్ధి కోసం ప్రత్యేక పూజ లు జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాల ను తల్లికి సమర్పించారు. మాజీ ఉపసర్పంచ్ నికాడి బాపూరావు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
పక్కాగా నో బ్యాగ్ డే
కెరమెరి: పుస్తకాల బరువుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక ప్రతినెలా మూడో శనివారం పుస్తకాలు లేకుండానే విద్యార్థులు బడికి వెళ్లనున్నారు. బడి అంటేనే పుస్తకాలు, కాపీలు, పెన్నులు, రాతలు, చదువులు ఉండేవి. ఇక నెలలో ఒక్కరోజు ప్రభుత్వం వాటన్నింటికి సెలవు ప్రకటించింది. తాజాగా మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పుస్తకాల మోతతో బేజారు..పాఠశాల విద్యార్థులు పుస్తకాల మోతతో బేజారెత్తిపోతున్నారు. వయసుకు మించి బరువును భుజాలకు తగిలించుకుని నానాఅవస్థలు పడుతూ బడులకు వెళ్తున్నారు. బరువుల మోతతో అలసిపోయి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఇల్లు చేరాక మళ్లీ హోంవర్క్ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం బండెడు మోతతోనే సరిపోతుంది. విద్యా విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా ఒత్తిడితో కూడిన చదువులు మాత్రం పిల్లల మానసికస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాఠ్య, నోటు పుస్తకాలతో కూడిన సంచుల బరువు పిల్లల శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం జాతీయ విద్యాప్రణాళిక విధానంలో పుస్తకాల సంచి విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నెలలో ఒకరోజు విద్యార్థులు పుస్తకాలు లేకుండా బడికి వెళ్లి ఆటపాటలతో గడపాలని చూచించింది. దీన్ని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ ఏడాది నుంచి అమలు చేయనుంది. ఈమేరకు నెలలో మూడో శనివారం ‘నోబ్యాగ్ డే’ గా నిర్ణయించింది. గత ప్రభుత్వం హయాంలోనే ఈ నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా ఆదేశాలు పాటించలేదు. ఈ సంవత్సరం దీన్ని పక్కాగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు 1268 ఉన్నాయి. ఇందులో సుమారు 85వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2020లోనే..2020 సంవత్సరంలోనే కేంద్రం ‘నో బ్యాగ్ డే’ పాలసీ తీసుకొచ్చింది. కానీ అమలు దిశగా అడుగులు పడలేదు. 2017లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలలో ఒకరోజు పుస్తకాల సంచి లేకుండానే విద్యార్థులు బడికి రావాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్తో పాటు హరియాణా, కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే నో బ్యాగ్ డే మూడో శనివారం అమలు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను సైతం ఆదేశించింది. ఈమేరకు అప్పట్లోనే రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాసింది. దీంతో 2022 –23 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతినెలా మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలని విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్లో స్పష్టం చేసింది. పుస్తకాల బరువుతో సుర్దాపూర్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులుఉండాల్సిన పుస్తకాల బరువు.. ప్రతినెలా మూడో శనివారం అమలు పుస్తకాల మోత నుంచి చిన్నారులకు విముక్తి ఆటపాటలతో సృజనాత్మకతకు కృషి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖఅమలయ్యేనా..?అనేక పాఠశాలల్లో ప్రతీరోజు సాయంత్రం ఒక పీరియడ్ ఆటపాటలకు కేటాయిస్తున్నా రు. కానీ నెలలో ఒకరోజు ‘నో బ్యాగ్ డే’ నిర్వహించనుండడంతో ప్రతీనెల మూడో శనివారం పుస్తకాల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించనున్నారు. మూడో శని వారం విద్యార్థులు బ్యాగులు లేకుండా బడి కి రావాల్సి ఉంటుంది. ఆ రోజు పిల్లలతో చిత్ర లేఖనం, నృత్యం, బాలసభ, మిమిక్రి, హాస్యకవితా సమ్మేళనం, నాటికలు, నాట్య ప్రదర్శన వంటివి చేయించనున్నారు. ఈ విధానం అమలుపై సందేహాలు లేకపోయినా ప్రైవేట్ పాఠశాలల్లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులను ఆటలకు దూరంగా ఉంచుతున్నారనే భావన ఉంది. సెలవు రోజుల్లో బడి కొనసాగించడం.. ప్రత్యేక తరగతుల పేరిట గంటల తరబడి చదువులకు విద్యార్థులను అంకితం చేస్తుండడంతో ‘నో బ్యాగ్ డే’ ఆయా పాఠశాలల్లో ఏమేరకు అమలు చేస్తారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి
కాగజ్నగర్రూరల్: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 210 పాఠశాలల్లో మాత్రమే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిందని, అందులోనూ నర్సరీ, ఎల్కేజీ లేకుండా కేవలం యూకేజీ ప్రారంభిస్తామని పేర్కొనడం సరికాదన్నారు. అలాగే ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఏఈవో, ప్రధానోపాధ్యాయ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యాభివృద్ధికి 15 శాతం నిధులు కేటాయించాలని, నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నా రు. గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్టైం, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలను అందించాలని, గురుకుల ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించడంతో పాటు హెల్త్కార్డులు అందజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంపల్లి ఉషన్న, జిల్లా ఉపాధ్యక్షుడు హిందురావు, కోశాధికారి రమేశ్, జిల్లా కార్యదర్శులు హేమంత్ షిండే, రాజ్ కమలాకర్ రెడ్డి, మహిపాల్, మోహపత్రావు, సమ్మయ్య, తులసీరాం తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ సమస్యలు తీరేనా..?
● జూన్ 2న ప్రారంభమైన ‘పట్టణ ప్రణాళిక’ ● 100 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు ● ఫొటోలకే పరిమితమవుతున్న అధికారులు ● ప్రశ్నార్థకంగా లక్ష్య సాధన కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, ప్రజాసమస్యల పరిష్కారానికి జూన్ 2న 100 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు 50 రకాల అంశాలపై వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. కానీ మున్సిపల్ అధికారులు ఫొటోలకే పరిమితమవుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 100 రోజుల్లో 50 అంశాలను విజయవంతం చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలే ముందు..జూన్ 2 నుంచి 100 రోజుల్లో 50 అంశాలను మున్సిపాలిటీల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘ప్రతీరోజు ఒక చర్య –ఒక మార్పు’ పేరిట ప్రజలను భాగస్వాములు చేస్తూ ‘ప్రజలే ముందు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. కానీ పట్టణంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ పనులు సాగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 100 రోజుల్లో చేపట్టాల్సిన పనులు..● పరిశుభ్రత వ్యర్థాలను వేరు చేయడం వంటి అంశాలపై మైక్ద్వారా ప్రచారం చేయాలి. సోషల్ మీడియా ద్వారా, ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలి. కాలర్ ట్యూన్లు, పెయింటింగ్ల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాలి. ● పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు మా ర్కెట్ విక్రేతలు, దుకాణదారులు, పాఠశాలల సిబ్బంది నుంచి అభిప్రాయాలు సేకరించి అందరిని భాగస్వాములు చేయాలి. ● తడి, పొడి చెత్తలను ఇంటి వద్దనే వేరు చేసి కంపోస్టు తయారు చేయడం నేర్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. ● వీధి కుక్కల సంతాన నియంత్రణ, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. ● వనమహోత్సవం, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్ ప్రారంభం వంటి గ్రీనరీ ఏర్పాటు చేయాలి. ప్రజల భాగస్వామం శూన్యం..పట్టణ ప్రణాళికలో భాగంగా పట్టణంలోని ప్రజల ను చైతన్యం చేస్తూ కార్యక్రమంలో భాగస్వాముల ను చేస్తూ ముందుకెళ్లాలి. కానీ అధికారులు ప్రజల ను భాగస్వాములను చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి. మున్సిపల్ అధి కారులు, మహిళా మండలి సంఘాల సభ్యులతో ఆయా కాలనీల్లో నామమాత్రంగా కార్యక్రమాలను చేపట్టి మమ అనిపిస్తున్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌష్టికాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా రు. ఎలాంటి ప్రకటన, ప్రజల భాగస్వామ్యం లే కుండానే మున్సిపల్ అధికారులు, కార్యాలయ సి బ్బంది, సమాఖ్య సంఘాల అధికారులు, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని ముగించడం గమనార్హం.ఎన్నో సమస్యలు..పట్టణంలోని 30 వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడే రోడ్లపైనే చెత్తాచెదారం దర్శనమి స్తోంది. పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుళ్లిన కూరగాయలు, పండ్లు పడేస్తుండడంతో దుర్గంధం వ్యాపించి ప్రజలు ముక్కుమూసుకొని రోడ్డు వెంట వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపంలోని రోడ్డుపై వారం రోజులుగా చెత్తాచెదా రం తొలగించకపోవడంతో దోమలు, ఈగలతో వ్యాప్తి చెందుతున్నాయి. సీతాపతిరోడ్ సమీపంలోని ఖాళీ స్థలంలో చెత్తాచెదారం వేయడంతో డంపింగ్ యార్డులా తయారైంది. పట్టణంలోని కాపువాడ, సంజీవయ్య కా లనీ, ద్వారకానగర్, కౌసర్గనర్, బాలాజీనగర్ కాలనీల్లోని మురుగు కాలువల్లో పూడిక తీయక నీరు నిలిచి దోమలు విజృంభించి కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ప్రతీరోజు తాగునీరు కలుషితమై వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రణాళికలు ఏమేరకు అమలు చేస్తారో వేచి చూడాలి. ప్రణాళిక అమలు చేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక పట్టణంలో అమలు చేస్తాం. పట్టణంలోని అన్ని కాలనీల్లో అధికారులు పనులు, సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నారు. పట్టణంలో తడి, పొడి చెత్తను వేరు చేసే విధంగా చూస్తున్నాం. ఆయా వార్డుల్లోని డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేయిస్తున్నాం. – అంజయ్య, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
కన్నెపల్లిలో మద్యపాన నిషేధం
కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామంలో శని వారం రాత్రి మహిళలు తమ గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో విచ్ఛలవిడిగా మద్యం విక్రయిస్తుండడంతో యు వత, పురుషులు మద్యానికి బానిసై ఆత్మహత్యల కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మద్యానికి బానిసైన వారు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు. మందుబాబులు మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలిపా రు. గ్రామంలో మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో మద్యం విక్రయించినా, మద్యం సేవించినా చర్యలు తీసుకుంటామని మహిళలు తీర్మానం చేశారు. కార్యక్రమంలో మహిళలు పద్మ, జ్యోతి, విమల, భాగ్యలక్ష్మి, ఇందిరా, వనిత, శారద, తారాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీకి 20,258 దరఖాస్తులు
● జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల ● 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన భైంసా: 2025–26 విద్యాసంవత్సరానికి బాసర ట్రి పుల్ఐటీలో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,258 దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారి నుంచి ఈ నెల 21వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 1,500 సీట్లుండగా ఒక్కో సీటుకు 14 మందికిపైగా పోటీపడుతున్నారు. క్రమంగా తగ్గుతున్న పోటీట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి క్రమంగా విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం 32వేల మంది, 2021 –22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635, 2024–25లో 15వేలు, 2025–26 విద్యాసంవత్సరంలో 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామ ని ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 7నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా విధానం ఇలా..ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ బోధిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు వివిధ బ్రాంచ్లలో సీట్లు కేటాయిస్తారు. బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్టాన్రిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు బోధిస్తారు. క్యాంపస్లో వసతులు ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, యూనిఫాంలు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారు. హాస్ట ల్, భోజన వసతి యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆ టలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు తరగతులు నిర్వహిస్తారు. క్యాంపస్లోనే ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. -
పోలీస్స్టేషన్ తనిఖీ
లింగాపూర్: వార్షిక తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆసిఫాబా ద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ దాస్ శని వారం తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, పోలీస్స్టేషన్ ఆవరణ, పరిసరాలు పరిశీలించారు. ఎస్సై గంగన్నతోపాటు సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మండల వ్యాప్తంగా సీసీ కెమెరాలు అ మర్చుకునేలా ప్రజలను చైతన్యప ర్చాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన వెంట జైనూర్ సీఐ రమేశ్, పోలీస్ ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పీఎం జుగా’తో మౌలిక వసతులు
కెరమెరి(ఆసిఫాబాద్): ‘పీఎం జుగా’ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్న ట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ పీ రమాదేవి తెలిపా రు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొఠారి గ్రా మంలో ‘పీఎం జుగా’ అమలు తీరుపై ఆదివాసీలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా రోడ్డు రవాణా, పాఠశాల, అంగన్వాడీ, కమ్యూనిటీ భవనాలు, పక్కా గృహాలు తదితర మౌలిక సదుపాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయని చెప్పారు. అత్యంత వెనుకబడిన గిరిజనులు అభివృద్ధి చెందాలనే ఆ కాంక్షతోనే ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దగ్గరలోనే క్యాంపులు ప్రారంభించి ఆధార్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతాలు తదితర సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ అమ్జద్పాషా, కార్యదర్శి సతీశ్కుమార్ తదితరులున్నారు. పథకంతో గ్రామాలాభివృద్ధి వాంకిడి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం జుగా పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని సోనాపూర్ రైతు వేదికలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, పీఎం జుగా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏటీడబ్ల్యూవో చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు. లింగాపూర్ మండల కేంద్రంలో.. లింగాపూర్: ఏజెన్సీ ప్రాంతాల గిరిజన గ్రామాల అ భివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జుగా కార్యక్రమంపై శనివారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఎంపీడీవో రామచందర్, ఎంపీవో రజనీకాంత్ మా ట్లాడుతూ ఈ పథకం ద్వారా గిరిజనులకు దాదాపు 90శాతం సబ్సిడీతో జీవనోపాధికి యూనిట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజర్ ముఖేశ్కుమార్, వైద్యులు పాల్గొన్నారు. -
కఠినచర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఆదివాసీ మహిళలను మోసగించి అక్రమ రవాణా చేసినవారిపై కఠి నచర్యలు తీసుకోవాలని తుడం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు. ఆదివాసీ మహిళలను మోసగించ డం బాధాకరమని తెలిపారు. నిందితులను క ఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పు నరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చే శారు. నిందితులపై పీడీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాట్లాడుతున్న తుడుం దెబ్బ నాయకులు -
పక్కాగా పౌష్టికాహారం
● అమలులోకి ఫేషియల్ రికగ్నిషన్ ● సరుకులు పక్కదారి పట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు ● వచ్చేనెల 1నుంచి అమలులోకి.. ● మొదటగా చిన్నారుల తల్లులకే.. కెరమెరి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తల్లుల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయాలని భావిస్తోంది. ఆరునెలలుగా మూడేళ్ల చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్రమే దీనిని వినియోగిస్తోంది. ఇందుకు ఫోన్ ట్రాకర్ యాప్లో తల్లుల ముఖ గుర్తింపు నమోదు చేస్తోంది. ప్రస్తుతం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జూలై 1నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పకడ్బందీగా..అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ నమోదు తప్పనిసరి చే సింది. సరుకులు పక్కదారి పట్టకుండా ఈ ప్రక్రియ అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలోని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. కొందరికి ఫోన్ ట్రాకర్ పనిచేయక పోగా.. దీన్ని వచ్చే నెల నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. వచ్చే నెల నుంచి అంగన్వాడీ టీచర్లకు గతంలో అందజేసిన ఫోన్లో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఫేషి యల్ రికగ్నిషన్ విధానం అమలు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా యాప్ను అప్డేట్ చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేపట్టనుండడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులుండవు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహా రం పంపిణీ ఏ మేరకు జరుగుతుందో దీని ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. ఇప్పటివరకు చిన్నారులకే.. ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఆరు మాసాల వారి నుంచి మూడేళ్ల చిన్నారులకు పంపిణీ చేసే అదన పు ఆహారమైన బాలామృతం, గుడ్ల పంపిణీకి మా త్రమే ఇప్పటివరకు వర్తించేది. మూడేళ్లలోపు చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని రిజిస్ట్రేషన్ అయిన తల్లి లేదా తండ్రి ఫొటోను ఫోన్లో నమో దు చేసి పంపిణీ చేస్తారు. ప్రస్తుతానికి నమోదు ఇదొక్కటే అయినప్పటికీ రానురాను అన్ని సరుకులను ఫేషియల్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఈ విధానం ద్వారానే అందించనున్నారు. అమలయ్యేలా చూస్తాం ఫేషియల్ రికగ్నిషన్ విధానా న్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యేలా చూస్తాం. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ ప్ర క్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 1నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెస్తాం. ప్రస్తుతం చిన్నారుల సరుకుల పంపిణీకి మాత్రమే ఉపయోగిస్తున్నాం. రిజిస్టేషన్ అయిన వారి ఫొటో మాత్రమే రికగ్నైజ్ అవుతుంది. – రెబిక, ఐసీడీఎస్ సీడీపీవో, వాంకిడి -
యోగా జీవితంలో భాగం కావాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో ని ర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా చేస్తే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మ నస్సును ఏకం చేసి ఒత్తిడి, ఆందోళన తొలగిస్తుందని పేర్కొన్నారు. అనంతరం యోగాపై అందరి తో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవాలియోగాతో ఒత్తిడి తగ్గించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో మానసి క ఒత్తిడికి గురైతే యోగా ద్వారా తగ్గించుకోవచ్చ ని సూచించారు. ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జూనియర్ సివిల్ కోర్టులో.. సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో మెజిస్ట్రేట్ అజయ్ ఉల్లం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అ నంతరం సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశా రు. అలాగే యోగా గురువు అశోక్ ఆర్య ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పలువురు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో ర్యాలీ నిర్వహించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం యువకులకు యోగాపై ప్ర త్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో యోగా ఆ యుష్ నోడల్ అధికారి డాక్టర్ నాగరాజు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఘనంగా యోగా దినోత్సవం సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాగజ్నగర్ టౌన్: యోగాతో సంపూర్ణ ఆ రోగ్యం సిద్ధిస్తుందని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పేర్కొన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్లో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి ఆ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. యోగాతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని, ఆరోగ్యవంతమైన జీవితానికి ఇది చక్కటి మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యో గా ప్రచారక్ దాసరి వినోద్గౌడ్, రవీందర్గౌడ్, వినోద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, యోగా శిక్షకుడు సత్యనారాయణ, ఆయూష్ మెడికల్ ఆఫీసర్ ఫిర్దోజ్, శిక్షకులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
వాంకిడి: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్య క్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలా ల్ పాటిల్ సూచించారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతగా మెలగాలని, సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాల ని ఆదేశించారు. అనంతరం పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పి స్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు. -
గం‘జాయ్’..!
● జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న అమ్మకాలు, వినియోగం ● యువకులు, విద్యార్థులే లక్ష్యంగా జోరుగా విక్రయాలుకౌటాల: మత్తు పదార్థాల వ్యసనం పట్టణం నుంచి పల్లెకు పాకింది. జిల్లాలో గంజాయి వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంటర్, డిగ్రీ చదువుతు న్న వారితో పాటు పాఠశాలల విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారు. వీరి అలవాటును అవకాశంగా మలుచుకుని కొందరు గంజాయి రవాణా, అమ్మకాలతో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలోని సరిహ ద్దు మండలాలైన కౌటాల, వాంకిడి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్ మీదుగా మత్తు పదార్థాలను సరిహద్దు దాటించి స్థానికంగా విక్రయాలు జరుపుతున్నారు. అలాగే జిల్లాలోని కొందరు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. వానాకాలం సాగు సమయంలో పత్తి, ఇతర పంటల్లో ఈ మొక్కలు పెంచుతున్నారు. కౌటాలలో చా క్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నారని, తమ పిల్లలు ఎక్కడ మత్తు బారిన పడతారోనని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2022లో 22 కేసులు నమోదు కా గా, 8.5 కిలోల గంజాయి పట్టుకుని 203 మొక్కలు ధ్వంసం చేశారు. అలాగే 2023లో 32 కేసులు నమో దయ్యాయి. 2024లో 39కేసులు నమోదు చేశారు. గతేడాది జిల్లాలో 298.8 కిలోల గంజాయి, 121 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. కట్టడి అయ్యేనా..?‘జిల్లాలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం, ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటాం’ అని.. ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చ రించారు. గంజాయి సాగును గుర్తించి సంక్షేమ పథకాలు నిలిపివేయాలని, పాఠశాలలు, వసతిగృహా లు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహ న కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 26న అంతర్జాతీయ డ్రగ్స్డే సందర్భంగా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే గంజా యి విక్రేతలపై నిఘా అంతంతే ఉండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆడపాదడపా కేసులు మాత్రమే నమోదు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో ఆరికట్టలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధా నంగా జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్, మండల కేంద్రాల్లో రాత్రివేళల్లో కొంతమంది యువత మత్తులో వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. కాగజ్నగర్ పట్టణంలోని సీబాపు కాలనీ పెద్దవాగు సమీపానికి గంజాయి సేవించడానికే యువత వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇది జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం జిల్లాలో గంజాయి విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. తల్లిదండ్రులు పిల్ల లకు అవసరాలకు మించి డబ్బు ఇవ్వొదు. గంజాయి విక్రేతలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుంటున్నాం. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పోలీస్శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – రామానుజం, డీఎస్పీ, కాగజ్నగర్ ఇటీవలి ఘటనలుచాక్లెట్ల రూపంలో అమ్మకాలు..? వాంకిడి మండలం అర్లీ గ్రామానికి చెందిన లెండుగురె రాజును మే 18న మండల కేంద్రంలో పోలీసులు తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి రూ.6,250 విలువైన మూడు ప్యాకెట్లలో 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెజ్జూర్ మండలం కుశ్నపల్లి సమీపంలో మే 24న గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సు లుగుపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సిడాం సంతోష్ బైక్పై తరలిస్తున్న రూ. 3,86,970 విలువైన 3.47 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం దాంపూర్కు చెందిన అన్నాజీ ఇంట్లో ఈనెల 13న పోలీ సులు సోదా చేశారు. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచి విక్రయిస్తున్న ట్లు గుర్తించారు. 295 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.గంజాయిని విక్రయదారుల నిత్యావసర వ స్తువుల పేరుతో సరఫరా చేస్తున్నారని తె లుస్తోంది. ప్రత్యేక ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారు. వేకువజామున వాహనాల్లో చాక్లెట్ల రూపంలో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(టి) ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. చాక్లెట్ల రూపంలోని ఈ పదార్థానికి విద్యార్థులు సులువుగా ఆకర్షితులవుతున్నారు. తక్కు వ ధరలో లభించడం.. మత్తు ఎక్కువసేపు ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలు స్తోంది. ఇంకొన్ని చోట్ల సిగరెట్లలోని పొగాకు తొలగించి, దాని స్థానంలో గంజాయిని నింపుతున్నారు. 10 గ్రాముల గంజాయి ప్యాకె ట్ రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. గంజాయి నింపిన ఒక్కో సిగరెట్ను రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువగా యువతే ఉండడం గమనార్హం. అందులోనూ 30 ఏళ్లలోపు వారే అధికం. వారు బానిసలుగా మా రి కుటుంబ సభ్యులపై గొడవలకు దిగుతున్నారు. మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అ వుతున్నారు. జిల్లాలోని యువత మత్తుకు బానిస కాకుండా కఠినచర్యలు తీసుకోవా లని జిల్లావాసులు కోరుతున్నారు. -
ప్రతిపాదన పునఃపరిశీలించాలి
కాగజ్నగర్ టౌన్: జిల్లాకు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని పీసీసీఎఫ్ ప్రొటెక్షన్, విజిలెన్స్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డన్ ఏలుసింగ్ మేరును ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబ కోరారు. శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్తో కలిసి వినతిపత్రం అందజేశారు. కుమురభీం ఆసిఫాబాద్ జిల్లా కు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జీవో 49 కారణంగా ఆదివాసీలు, గిరిజనేతరులు ప్రజల్లో అనే క అనుమానాలు రేకెత్తాయని తెలిపారు. దీంతో జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. వెంటనే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. -
ప్రవేశాల్లో వెనుక‘బడి’..
● జిల్లాలో ఫలితమివ్వని ‘బడిబాట’ ● లక్ష్యం 7,093.. అడ్మిషన్లు 2,079 ● తెరుచుకున్న ఏడు ‘మూత’బడులు ఆసిఫాబాద్రూరల్: విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం అధికారులు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. సరైన సౌకర్యాలు లేక, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల లేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతుండడమే కారణం. కొత్త అడ్మిషన్లు 2,079 మాత్రమే..2025–26 విద్యాసంవత్సరంలో ఈ నెల 6నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలు, ఆవాస ప్రాంతాల నుంచి ఐదేళ్లు నిండిన 2,079 మంది బాలలు సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందారు. గతేడాది ఒకటో తరగతిలో 4,009 మంది ప్రవేశాలు తీసుకోగా ఈసారి ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి 324 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. రెండోతరగతి నుంచి 10వ తరగతి వరకు 849 మంది ప్రవేశాలు పొందారు. జిల్లాలో నిర్వహించిన సర్వే ప్రకారం 7,093 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్న బాలలు ఒకటో తరగతిలో చేరాల్సి ఉండగా 2,079 మంది మాత్రమే ప్రవేశాలు తీసుకున్నారు. లక్ష్యం పూర్తి చేయాలంటే ఇంకా 5,014 మందిని చేర్చాల్సి ఉంది. అలాగే గతంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా జిల్లా వ్యాప్తంగా 36 పాఠశాలలు మూతబడ్డాయి. బడిబాట సందర్భంగా జిల్లాలో ఏడు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ, రింగన్గూడ, గొల్లగూడ, బాబాపూర్ తండా, కాగజ్నగర్ మండలంలోని వల్లకొండ, సిర్పూర్(టి) మండలంలోని రావణ్పల్లి, వాంకిడిలోని దేవాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను తెరిపించారు. మిగతా 29 పాఠశాలలు తెరిపించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. -
ప్రతిరోజూ సాధన..
రెబ్బెన: సింగరేణి యాజమాన్యం 2015లో యోగా శిక్షణపై అవగాహన కల్పించడంతోపాటు ఉచితంగా శిక్షణ సైతం ప్రారంభించడంతో నేను శిక్షణ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు గురువు రాజలింగు, రాజ్యలక్ష్మి వద్ద సాధన చేశా. 2019 నుంచి సింగరేణి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు, అధికారులకు యోగాసనాలు నేర్పిస్తున్నాను. 2015 నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ గంటకు పైగా సాధన చేస్తా. నిరంతర యోగా సాధనతో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఏకాగ్రత, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. కరోనా సమయంలో మా బంధువులను చాలా మందికి పాజిటివ్ వస్తే ఆస్పత్రులకు తీసుకెళ్లాను. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటంతో మహమ్మారి నుంచి తప్పించుకున్నా. – కనుకుంట్ల సుధ, శిక్షకురాలు -
బరిలోకి దిగితే పతకమే..
రెబ్బెన: మండలంలోని గోలేటికి చెందిన పత్తెం నిహారిక యోగాలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 3వ తరగతి చదువుతుండగానే యోగా సాధన ప్రారంభించి అతి చిన్న వయస్సులోనే పట్టు సాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి.. ఏ పోటీ అయినా బరిలోకి దిగిందంటే పతకం సాధించాల్సిందే. తల్లి వద్ద నుంచి యోగా సాధనలో ఓనమాలు నేర్చుకుని ఇప్పటివరకు మూడు జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. తల్లిదండ్రులు రాజు, అలేఖ్య తమ ఇద్దరు పిల్లలకు యోగా శిక్షణ అందించారు. చిన్న కుమార్తె నిహారిక ప్రధానంగా చక్రాసన, టిట్టిబాసన, కౌడింగ్య ఆసన, మిడిల్ స్పిట్ వంటి ఆసనాలు వేయడంలో దిట్ట. 2022లో మొదటిసారి గోలేటిలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో అండర్– 10 విభాగంలో నిహారిక బంగారు పతకం సాధించింది. ఔరంగబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా చాంపియన్షిప్, బెల్లంపల్లిలో నిర్వహించిన 34వ ఇండియా న్యూ ట్రెడిషనల్ యోగా నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లోనూ బంగారు పతకం సాధించింది. -
ఆరోగ్య యోగా
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు మానసిక ప్రశాంతత కరువైంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో యువతను సైతం రోగాలు సైతం చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా సాధన కీలకంగా మారింది. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా యోగాసనాలు సాధన చేస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..కౌటాలలో యోగసనాలు వేస్తున్న విద్యార్థులుకెరమెరి(ఆసిఫాబాద్): ఆయన తన పన్నెండో ఏటా నుంచి యోగాసనాలపై మక్కువ పెంచుకున్నారు. కఠిన సాధన చేస్తూ కష్టమైన ఆసనాలు సులువుగా చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అంతేకాక అనేక యోగా పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలు, పతకాలు కై వసం చేసుకున్నారు మండల కేంద్రానికి చెందిన యోగా శిక్షకుడు దినేశ్ పురి. కెరమెరి మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ పురి, సునంద దంపతుల్లో చిన్నకుమారుడు దినేష్ పురికి ఆటలపై ఆసక్తి ఉండేది. కెరమెరిలోనే 1 నుంచి 8 తరగతి వరకు చదువుకోగా, ఆదిలాబాద్లో 9, 10, హైదరాబాద్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగుళూరులోని ఎస్ వ్యాస యూనివర్సిటీలో యోగాపై శిక్షణ పొందారు. వివిధ ఆసనాలు సులువుగా వేయడం సాధన చేశారు. 2019లో సిద్దిపేటలో జరిగిన ఆరో తెలంగాణ స్టేట్ లెవల్ యోగా చాంపియన్షిప్ పోటీలు, బెంగళూరులో జరిగిన జాతీయ, అంతర్జాతీయ హిమాలయ యోగా ఒలంపియాడ్ పోటీల్లో పాల్గొని ప్రశంపత్రాలు అందుకున్నారు. అదే ఏడాది పలు దేశాలకు చెందిన యోగా నిపుణులతో బెంగుళూరులో జరిగిన ప్రపంచస్థాయిలో పోటీలకు హాజరయ్యారు. మొత్తం 90 మందితోపాటు పాల్గొని ప్రతిభ చూపారు. హైదరాబాద్లో అనేకమంది విద్యార్థులకు యోగా పాఠాలు నేర్పారు. 2024 డిసెంబర్ నుంచి ఆయుష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆయుష్మాన్ యోగా మందిర్లో విద్యార్థులు, స్థానికులకు యోగాపై శిక్షణ కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు సాధన చేయిస్తున్నారు. గత నెల 27 నుంచి ఈ నెల 20 వరకు కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశ వర్కర్ల, ఏఎన్ఎంలు, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, పోలీసులు, విభిన్న వర్గాలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.ఆసనాల్లో అద్భుత ప్రతిభ శిక్షకుడిగా రాణిస్తున్న దినేశ్ పురి -
అనాథ చిన్నారులకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో కోవిడ్– 19 సమయంలో అనాథలుగా మారిన చిన్నారులకు అండగా ఉంటామని జిల్లా సంక్షేమశాఖ అధికారి భాస్కర్, డీసీపీవో మహేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలల రక్షణ భవనంలో శుక్రవారం అనాథ పిల్లల పోషకులతో సమావేశం నిర్వహించారు. వారు మా ట్లాడుతూ కోవిడ్ కారణంగా అనాథలైన ఏడుగురు చిన్నారుల చదువు, సంక్షేమం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. స్పాన్సర్షిప్ పథకం కింద నెలకు రూ.4వేల నగదుతోపాటు పుస్తకాలు, యూనిఫాం, షూలు అందజేస్తామని తెలిపారు. పీఎంకే పథకం కింద నమోదైన వీరికి 23 ఏళ్ల నిండిన తర్వాత రూ.10లక్షల ఆర్థికసాయం అందుతుందన్నారు. బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో వారి సంరక్షణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ విభాగం సిబ్బంది శ్రావణ్కుమార్, చంద్రశేఖర్, నవీన్ తదితరలు పాల్గొన్నారు. -
సీహెచ్పీలో సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి సీహెచ్పీలో నెలకొన్న సమస్యలు యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సంగెం ప్రకాశ్రావు అన్నారు. గోలేటి సీహెచ్పీలో ఐఎన్టీయూసీ నాయకులు శుక్రవారం పర్యటించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీహెచ్పీలో ఆర్వో ప్లాంటు చెడిపోవడంతో కార్మికులకు శుద్ధం జలం అందడం లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. మోటర్ వెహికల్ డ్రైవర్లు సరిపడా లేకపోవడంతో ఫస్ట్ షిఫ్ట్లో ఒకే డ్రైవర్తో లోడర్, క్రేన్ నడిపిస్తున్నారని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు విధులకు గైర్హాజరు అయితే.. పెనాల్టీ విధించే పద్ధతిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మ్యాన్ పవర్కు తగినట్లుగా ప్లేడేలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు సదాశివ్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గట్టయ్య, నాయకులు కొవ్వూరి శ్రీకాంత్, శ్యాంబాబు, రాజయ్య, అర్జయ్య పాల్గొన్నారు. -
ఆరోగ్య రక్షణకు యోగా శిబిరాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు యోగా శిబిరాలు నిర్వహిస్తున్నామని జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. ఏరియాలో అన్ని గనుల డిపార్టుమెంట్లలో శుక్రవారం యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులతో కలిసి జీఎం యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులు యోగా సాధన చేస్తూ ఆరోగ్యమైన జీవన విధానానికి బాటలు వేసుకోవాలని సూచించారు. నేడు మెగా యోగా క్యాంప్గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెగా యోగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎస్వోటూజీఎం రాజమల్లు, అధికారులతో కలిసి యోగా క్యాంపు నిర్వహించే మైదానాన్ని పరిశీలించారు. ఏర్పాట్లతోపాటు మొక్కలు నాటే ప్రదేశాన్ని పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమాల్లో అధికారుల సంఘం నాయకులు ఉజ్వల్కుమార్ బెహరా, ఏరియా ఇంజినీర్ రామనాథం, సివిల్ డీజీఎం ఎస్కే మదీనా బాషా, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, పర్చేస్ అధికారి రవికుమార్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి రుణ సదుపాయం
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి రుణ సదుపాయం కల్పిస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసి, వారి ఆర్థికాభిృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నా రు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ 170 లక్ష్యం కాగా, ఇప్పటివరకు 12 వారు లింకేజీ పూర్తిగా చేశారని తెలిపారు. మిగిలిన 158 సంఘాలకు సంబంధించిన ప్రక్రియ కూడా త్వరగా చేపట్టాలన్నారు. కొత్తగా వివాహమైన వారిని గ్రూ పుల్లో సభ్యులుగా చేర్పించి, నూతన సంఘాలు ఏ ర్పాటు చేయాలన్నారు. ప్రధాన మంత్రి స్వనిధి, స మృద్ధి నిధి, విశ్వకర్మ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీరాం, డీటీడీవో రమాదేవి, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, డీపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నుంచే నీళ్లు..
లింగాపూర్: మండలంలోని పిక్లాతండా గ్రామంలో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో 80 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు ఒకేతాటిపై ఉండి పిల్లలను ప్రైవేట్కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. అయితే నలుగురు టీచర్లు ఉండాల్సిన చోట.. కేవలం ఇద్దరు సీఆర్టీలు మాత్రమే పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రూ.5.45లక్షలు మంజూరు చేసినా మరమ్మతులు సక్రమంగా చేపట్టలేదు. తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లలు ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. మండలంలోని తుంపెల్లి ప్రభుత్వ పాఠశాలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజ నం, బడిబాటలో కార్యక్రమంలో విద్యార్థుల అడ్మిష న్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్య, భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలిరైతులు, గ్రామస్తులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని తుంపెల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పర్యవేక్షించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, డీటీ పోచయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
ఆక్రమణలు ఆగేనా..?
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణానికి అత్యంత కీలకమైన ప్రధాన నాలాను ఇష్టారీతిన ఆక్రమించుకుని నిర్మాణాలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ అధికారులు నాలా స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో దృష్టి సారించి కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కాలనీలకు వరద ముప్పు..పట్టణంలోని ప్రధాన కాలువ కబ్జాకు గురికావడంతో లోతట్టు ప్రాంతాలైన సంజీవయ్య కాలనీ, ద్వారకానగర్, కౌసర్నగర్, కృష్ణకాలనీ, కన్యకాపరమేశ్వరి దేవాలయం ఏరియాల్లోని ప్రజలకు వరద ముప్పు పొంచి ఉంది. ఏటా వర్షాలకు బురద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఆక్రమణలు పెరిగి ప్రధాన కాలువ కుచించుకుపోయింది. ప్రధాన నాలాపై అక్రమ కట్టడాలను గురువారం అధికారులు ఓవైపు కూల్చివేస్తుండగానే.. అదే నాలాపై మరోప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. తిరందాస్ టాకీస్ సమీపంలో ఓ ఇంటి యజమాని ప్రధాన నాలాను కబ్జా చేసి కట్టడాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమైన మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ‘సాక్షి’ సంప్రదించగా పట్టణంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల భవనం కూల్చివేతకాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన నాలాపై అక్రమంగా నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని గురువారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారి యశ్వంత్ కుమార్, సిబ్బంది పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకపోవడంతో గతంలో నోటీసులు జారీ చేశామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో తామే కూల్చివేశామని స్పష్టం చేశారు. పట్టణ సీఐ ప్రేమ్కుమార్, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగజ్నగర్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు ప్రధాన నాలాను కబ్జా చేస్తున్న వైనం గురువారం ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు -
సమస్యల్లో సర్కారు బడి
● తరగతి గదుల కొరతతో ఒకేచోట పాఠాలు ● పక్కా భవనాలు లేక విద్యార్థుల అవస్థలు ● అధ్వానంగా మారిన ఆశ్రమ పాఠశాలలు ● తాత్కాలిక షెడ్లలోనే కొనసాగుతున్న తరగతులుఆసిఫాబాద్రూరల్: సర్కారు బడులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ చాలాచోట్ల మరమ్మతులు పూర్తికా లేదు. సరిపడా గదులు లేకపోవడంతో కొన్నిచోట్ల వివిధ తరగతుల విద్యార్థులకు ఒకేచోట బోధిస్తున్నారు. జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలకు ఇప్పటికీ పక్కా భవనాలు లేక షెడ్లు, తాత్కాలిక భవనాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేయగా, అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ఇలా..జిల్లాలో లోకల్బాడీ పాఠశాలలు 739 ఉండగా, మోడల్ స్కూళ్లు 2, కేజీబీవీలు 15, ఒక అర్బన్ స్కూ ల్ ఉంది. వీటిల్లో సుమారు 36 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 374 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, ఆయా స్కూళ్లలో 14,739 మంది విద్యనభ్యసిస్తున్నారు. తడకలు, రేకులతో వేసిన షెడ్డులో చదువుకుంటున్న బెల్గాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులుజిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలులోకల్బాడీ స్కూళ్లు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మొత్తం 561 101 77 739 ఆశ్రమ స్కూళ్లు 333 3 38 374 -
2న అధికారులకు శిక్షణ
ఆసిఫాబాద్అర్బన్: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసం జూలై 2న నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా రూపకల్పన, బూత్ స్థాయి అధికారుల శిక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు. ఎక్కువగా ఉంటే సహాయ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, తహసీల్దార్ రియాజ్ అలీ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. -
ఏళ్లుగా మూతబడి..
చింతలమానెపల్లి: మండలంలోని బాలాజీ అనుకోడ పాఠశాల మూతబడింది. స్థానికులు ఆటోపార్కింగ్, పశువుల కోసం వినియోగిస్తున్నారు. ఆవరణలో ఏకంగా ఒక నర్సరీ నిర్వహిస్తున్నారు. రవీంద్రనగర్ 2 పాఠశాలకు గతేడాది నుంచి విద్యార్థులు హాజరు కావడం లేదు. గదుల్లో పలువురు ఆటవిడుపుగా పేకాట ప్రారంభించారు. మండల కేంద్రంలోని దుబ్బగూడ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. తరగతి గదుల్లో ఒకటి ఎంఈవో కార్యాలయంగా, మరొకటి ఈఆర్పీ నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఐదు తరగతులను రెండు గదుల్లో నిర్వహిస్తున్నారు. బాబాసాగర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. -
తలసేమియా, సికిల్సెల్ నివారణే లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: తలసేమి యా, సికిల్సెల్ను 2047 వరకు పూర్తిగా నివారించడమే లక్ష్యమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి గణేశ్ నాగరాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్వో సీతారాం, డీటీడీవో రమాదేవి, తలసేమియా, సికిల్సెల్ నోడల్ అధికారి వినోద్, ఆరో గ్య, ఆశ కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. అలాగే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులతో కలిసి గిరిజనులకు అందుతున్న సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఆ యన మాట్లాడుతూ తలసేమియా, సికిల్సెల్ నివారణే లక్ష్యంగా ఈ నెల 30 వరకు గిరిజన గ్రా మాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 102 గిరిజన గ్రామాల్లో పీఎం జుగా కింద శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సికిల్సెల్, రక్తహీనత బారిన పడిన పిల్లల జీవితాలను రక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ పీఎం జన్మన్, జుగా కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గిరిజన గ్రామాల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు అధిగమించేందుకు ఇప్పపువ్వు లడ్డూ, ఇతర పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 మొబైల్ మెడికల్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి జిల్లాలోని అన్ని పీవీటీజీ గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీలు నిర్వహించామన్నారు. జిల్లాలోని 16 మంది తలసేమియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. -
విచారణ వేగంగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా హాట్స్పాట్ల ను గుర్తించి గంజాయి రవాణా, సేవించే వ్యక్తులను గుర్తించాలన్నారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణూమూర్తి పాల్గొన్నారు. చెక్కు అందజేతకాగజ్నగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ గతేడాది ఏప్రిల్ 11న గుండెపోటుతో మృతి సిర్పూర్(యూ)కు చెందిన మడావి ఆనంద్కుమార్ కుటుంబ సభ్యులకు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో చెక్కు అందించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8లక్షల విలువైన చెక్కును కానిస్టేబుల్ సతీమణి గంగామణికి అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, సిబ్బంది విజయ శంకర్రెడ్డి, పెద్దన్న, శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
తాత్కాలిక షెడ్డులో గిరిజన పాఠశాల
తిర్యాణి(ఆసిఫాబాద్): మంగీ పంచాయతీ పరిధిలోని కుంటగూడ గ్రామంలో గల గిరిజన ప్రాథమిక పాఠశాలల తాత్కాలిక షెడ్డులో కొనసాగుతోంది. పక్కా భవనం కోసం పదేళ్ల క్రితం నిధులు మంజూరు చేయగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయులు కొన్నేళ్లపాటు గ్రామ పటేళ్ల ఇంటి వద్ద తరగతులు నిర్వహించారు. మూడేళ్ల క్రితం స్వచ్ఛంద సంస్థ సహకారంతో తాత్కాలిక షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం తడకలు కట్టిన ఆ షెడ్డులోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలో 1 నుంచి 3వ తరగతి వరకు 13 మంది పిల్లలు ఉన్నారు. -
బస్సు ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) అనే వ్యక్తి దేగాం గ్రామంలో బస్సు ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ –సుశీల దంపతులు బుధవారం బాసరకు వెళ్తున్నారు. దేగాం బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న క్రమంలో చంద్రశేఖర్ను భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేగాం చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
బౌలర్లదే జోరు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు. ఎస్టీపీపీలో అధికారులను బదిలీ చేయాలి జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గత పదేళ్లుగా పాతుకుపోయిన సింగరేణి అధికారులను వెంటనే బదిలీ చేయాలని హెచ్ఎంఎస్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఇంజినీర్గా వచ్చి డీజీఎం స్థాయి దాక ఎదిగినా ప్లాంట్లోనే కొందరు అధికారులు ఉన్నారని ఆరోపించారు. ప్రతీ ఏరియాలో బదిలీలు ఉంటాయని కానీ ఇక్కడ మాత్రం బదిలీ చేయకపోవడానికి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పీఎఫ్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలినస్పూర్: ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ నిధి సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ సూచించారు. బుధవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలకు చెందిన సీఎంపీఎఫ్ జాయింట్ వర్క్షాప్ నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏజీఎం ఫైనాన్స్ బీభత్స, డీవైజీఎం పర్సనల్ అనిల్కుమార్, మందమర్రి డీవైపీఎం అసిఫ్, బెల్లంపల్లి సీనియర్ పీవో ప్రశాంత్, అధికారులు దేవేందర్రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు వ్యక్తుల బైండోవర్
లక్సెట్టిపేట: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి కారణం లేకుండానే 100 నంబర్కు డయల్ చేస్తున్నారు. పలుమార్లు ఈవిధంగా డయల్ చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకున్నా ఫోన్ చేస్తున్నందున బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
లారీ ఢీకొని ఒకరు..
భైంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బెలతరోడకు చెందిన చెంచుల సాయినాథ్(37) బుధవారం బెల్తరోడ వెళ్లి బైక్పై భైంసా తిరిగి వస్తున్నాడు. సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగా, నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ గౌసుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు. సాయినాథ్కు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ
● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ● పెరిగిన మెస్చార్జీలతో విద్యార్థినుల హర్షంలక్ష్మణచాంద: నిరుపేద బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కేజీబీవీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025 –26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6 –10, ఇంటర్ విద్యార్ధులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1225లు ప్రభుత్వం అందించేది. కానీ నేడు నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2100లు అందించనున్నారు. నూతన మెనూ ఇదే.. ఉదయం..టమాట కిచిడి, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి పండు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం..టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం..ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ..వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి. ఉమ్మడి జిల్లా కేజీబీవీల సమాచారం.. జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఇంటర్ కాలేజీలు విద్యార్థుల సంఖ్య మొత్తం నిర్మల్ 18 3600 14 2240 5840 మంచిర్యాల 18 3786 15 1080 4866 ఆదిలాబాద్ 18 4800 13 680 5480 కుమురంభీం 15 3027 13 1069 4096 -
కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో గల పురాతన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించారు. భవనం శిథిలావస్థకు చేరిందని కూలితే విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇంజినీర్ అఖిలేష్తో కలిసి బుధవారం కూల్చివేత అనుమతుల కోసం కొలతలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న భవనం కూల్చివేస్తున్న విషయం తెలియగా పలువురు కలత చెందుతున్నారు. ఈ భవనాన్ని 1969లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఖానాపూర్ పోలీస్స్టేషన్కు కొణతం దిలీప్ఖానాపూర్: గతంలో సోషల్మీడియాలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్మీడియా రాష్ట్ర ఇన్చార్జి కొణతం దిలీప్పై నమోదైన కేసులో భాగంగా బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇది వరకే బెయిల్ మంజూరైనప్పటికీ ప్రతీ బుధవారం పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. ఈక్రమంలో పోలీసులు గంటల తరబడి ఆయన పోలీస్స్టేషన్లో నిరీక్షించేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్స్టేషన్ బయట పెద్దఎత్తున గుమిగూడారు. బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంకుభీర్: మండలంలోని బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంతో సమీప ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం బెల్గాం గ్రామ శివారులోని చేనులో పని చేసే వారికి ఎలుగుబంటి కన్పించడంతో వారు భయంతో కేకలు వేయగా సమీప అడవిలోకి పారిపోయింది. మండలంలోని బ్రహేశ్వర్, మార్లగొండ అడవుల్లో ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం ఉంది. ఎలుగుబంటి కనిపించిందన్న వార్త వ్యాపించడంతో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజలు అడవివైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారి లక్ష్మణ్ను బుధవారం వివరణ కోరగా ఐదు నుంచి ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని, అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. -
తల్లి మెడలో గొలుసు అపహరించిన కుమారుడు
మందమర్రిరూరల్: తల్లి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు దొంగిలించిన కుమారుడిని మందమర్రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వైపు నివాసం ఉండే విజయపురి పుల్లమ్మ అనే వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ మెడలో గొలుసు దొంగిలించినట్లు మనుమడు శివ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనలు, సాంకేతికత ఆధారంగా ఇంటి వారే దొంగతనం చేసి ఉంటారనే కోణంలో పుల్లమ్మ కుమారుడు శంకరయ్యపై నిఘా ఉంచారు. ఆయన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తానే దొంగిలించినట్లు నేరం అంగీకరించాడు. ఈ మేరకు శంకరయ్య వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజశేఖర్, క్రైంటీం కానిస్టేబుళ్లు మహేశ్, రాకేశ్లను ప్రత్యేకంగా అభినందించారు. -
మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం జరగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి సాగు చేయకుండా పర్యవేక్షించాలని, గంజాయి సాగు చేసేవా రిని గుర్తించి పథకాల లబ్ధిని నిలిపివేయాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థల సమీపంలోని కిరాణాలు, పా న్ షాపులపై నిఘా ఉంచాలన్నారు. సరిహద్దు రా ష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నా రు. ఈ నెల 26న అంతర్జాతీయ డ్రగ్స్డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వి ద్యార్థులు, మహిళా సంఘాలతో ర్యాలీలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు ఎస్పీ మాట్లాడుతూ వచ్చే రెండు నెలల్లో పోలీసు కళాజాత బృందాలతో జిల్లావ్యాప్తంగా ప్రతీ సోమ, గురువారాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, డీఐఈవో కళ్యాణి, రవాణా అధికారి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల వేట!
● ప్రవేశాల కోసం అధ్యాపకుల విస్తృత ప్రచారం ● జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుఈ ఏడాది ప్రవేశాల తీరు..కళాశాల అడ్మిషన్లుఆసిఫాబాద్ 107 రెబ్బెన 105 కాగజ్నగర్ 90 వాంకిడి 71 జైనూర్ 62 సిర్పూరు(టి) 39 తిర్యాణి 34 కెరమెరి 29 బెజ్జూర్ 21 కౌటాల 15 దహెగాం 3 కాగజ్నగర్టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా అధ్యాపకులు విస్తృత ప్ర చార కార్యక్రమాలు చేపడుతున్నారు. కాలేజీల్లో అ త్యుత్తమ బోధన, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 11 ప్ర భుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జనరల్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, ఒకేషనల్లో ఎంఎల్టీ తదితర గ్రూపులు అందుబాటులో ఉన్నా యి. తెలుగు, ఇంగ్లిష్ మీడియలో కోర్సులు బోధిస్తుండగా, కాగజ్నగర్ పట్టణంలో ఉర్దూ మీడియం కూడా బోధిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 2,816, వొకేషన్ విభాగంలో 630 మొత్తం 3,446 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 30తో మొదటి విడత అడ్మిషన్ల గడువు ముగి యనుండగా ఆశించిన మేర ప్రవేశాలు కాలేదు. నెమ్మదిగా ప్రవేశాలు జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జూనియర్ కళాశాలల్లో 576 అడ్మిషన్లు వచ్చాయి. ఇందులో జనరల్ విభాగంలో 470, ఒకేషనల్ విభాగంలో 106 మందికి ప్రవేశాలు కల్పించారు. జిల్లాకేంద్రంలోని జూనియర్ కాలేజీతో పాటు రెబ్బెన, కాగజ్నగర్ పట్టణంలోని కాలేజీల్లో మాత్రమే మోస్తరు ప్రవేశాలు నమోదయ్యాయి. ఇక సిర్పూర్(టి), తిర్యాణి, కెరమెరి, బెజ్జూర్, కౌటాల, దహెగాంలో కనీసం 50 అడ్మిషన్లు దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన బోధనతోపాటు ప్రోత్సాహకాలు, అన్ని వసతులు కల్పిస్తున్నా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. సకల సదుపాయాలు.. జిల్లాలో ఇంటర్ కాలేజీలు కొన్నేళ్లుగా మెరుగైన ఉ త్తీర్ణత సాధిస్తున్నాయి. ప్రవేశాల కోసం కళాశాల ప్రారంభానికి దాదాపు 50 రోజుల ముందు నుంచే అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థుల త ల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లు పెంచేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతన సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. జిల్లాలో బస్సు సౌకర్యం లేని రూ ట్లను గుర్తించి ఆర్టీసీ ద్వారా బస్సులు కూడా నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ క ళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ఫీజుల మాఫీతోపాటు గ్రంథాలయా లు, క్రీడలు, ఎన్సీసీ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.మెరుగైన విద్యాబోధనజిల్లాలోని 11 ప్రభు త్వ జూనియర్ కళా శాలల్లో నిపుణులైన అధ్యాపకులతో మె రుగైన బోధన అంది స్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం. ఎలాంటి ఫీజులు ఉండవు.. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారు ఎంచుకున్న లక్ష్యాలు చేరుకునేలా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని కాలేజీలకు సొంత భవనాలు, విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ కళాశాలల్లోనే చదివించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. – సీహెచ్ కళ్యాణి, డీఐఈవో -
శిఖం భూములు స్వాహా..!
పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం దరోగపల్లి వద్ద ఉచ్చమల్ల వాగుపై రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ఉచ్చమల్ల వాగు ప్రా జెక్టు నిర్మించింది. అయితే కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టు శిఖం భూములను కొందరు వ్యక్తులు య థేచ్ఛగా చదును చేస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఏటా అక్రమార్కులు సాగు విస్తీర్ణం పెంచుతుండటంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 129 ఎకరాలు సేకరణ ప్రభుత్వం ఉచ్చమల్లవాగుపై ప్రాజెక్టు నిర్మించడానికి 2007లో రైతుల నుంచి 129 ఎకరాలు సేకరించింది. 2012లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పెంచికల్పేట్ మండలంలోని దరోగపల్లి, కొత్తగూ డ, చేడ్వాయి గ్రామాలకు చెందిన రైతులు తూము ద్వారా పంట పొలాలకు నీటిని మళ్లించుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తూములు కొందరు ధ్వంసం చేయడంతో పంట పొలాలకు సాగు నీరందడం లేదు. శిఖం భూముల్లో సాగు.. ప్రాజెక్టు శిఖం భూముల్లో కొంతమంది వ్యక్తులు అ క్రమంగా ప్రవేశించి పంటలు సాగు చేస్తున్నారు. అధికారుల నిఘా కొరవడడంతో ఇదే అదునుగా పెద్ద మొత్తంలో భూములు ఆక్రమిస్తున్నారు. ప్రా జెక్టు తూములు ధ్వంసం చేయడంతో ప్రాజెక్టు నుంచి నీరు నిరంతరం వృథాగా పోతోంది. ఈ కారణంగా శిఖం భూముల్లో సాగు సులువైంది. ఇదే విషయంపై గతంలో చేడ్వాయి గ్రామానికి చెందిన మ త్స్యకారులు శిఖం భూముల్లో ఆక్రమణలు అడ్డుకున్నారు. ప్రాజెక్టును రక్షించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికై నా ప్రాజెక్టును కాపాడాలని వారు కోరుతున్నారు. ఉచ్చమల్ల వాగు ప్రాజెక్టులో ఆక్రమణలు శిఖం భూమిలో వ్యవసాయ పనులు ఆందోళనలో ఆయకట్టు రైతులు -
అర్జీల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజ లు సమర్పించి అర్జీలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన రాథోడ్ డబ్లీ, దివ్యాంగుడినైన తనకు ట్రైసైకిల్ అందించాలని పెంచికల్పేట్ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన నందిపేట రాజయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్ రెండో క్యాంపునకు చెందిన మల్లిక అర్జీ అందించింది. తాము సాగు చేసిన భూములు ఇతరులు ఆక్రమించారని, అధికారులు న్యాయం చేయాలని దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన షెడ్యూల్ తెగ పర్దాన్ వర్గానికి చెందిన రైతులు వేడుకున్నారు. బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన నిట్లూరి పార్వతి తాటిపల్లి శివారులో తనకు దళితబస్తీలో ఇచ్చిన భూమికి హద్దులు నిర్ణయించాలని విన్నవించింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామానికి చెందిన కూలీలు దరఖాస్తు అందించారు. వితంతు పింఛన్ అందించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్కు చెందిన అమీనా బేగం వేడుకుంది. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చెట్లు ఇళ్లపై విరిగిపడే ప్రమాదం ఉందని, వెంటనే వాటిని తొలగించాలని జన్కాపూర్కు చెందిన పరవీన్ తబస్సుం విన్నవించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చినా.. జాబితాలో తన పేరు లేదని, అధికారులు న్యాయం చేయాలని వాంకిడి మండలానికి చెందిన వెంకట్రావ్ అర్జీ అందించాడు. దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దుఅనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. పంచాయతీ, అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పింఛన్ ఆగింది సదరం సర్టిఫికెట్ రెన్యువల్ చేయకపోవడంతో దివ్యాంగ పింఛన్ మూడు నెలలుగా ఆగింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలి. – వివేక్, నజ్రూల్నగర్, మం.కాగజ్నగర్ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం రెబ్బెన మండలం కై రిగాంలోని రైతువేదిక వాడలో రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. రాత్రిపూట రోడ్లపై నడవలేని పరిస్థితి. డ్రెయినేజీలు లేక మురుగునీరు రోడ్లుపై నిలిచి ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది. కాలనీలో సమస్యలు పరిష్కరించాలి. – కై రిగాం మహిళలు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ డైలీవేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం డీటీడీవో రమాదేవికి వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని సొంత మండలాల పరిధిలోకి బదిలీ చేయాలన్నారు. స మాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్ర త, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పించా లని డిమాండ్ చేశారు. నాయకులు వసంత్, శ్యాంరావు, రాంబాయి, సంతోష్, కమల, కోటయ్య, మాన్కు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి అడ్డంకిగా జీవో 49
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన జీవో 49 జిల్లా అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. జీవో నం.49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో కలిసి జీవో ప్రతులు దహనం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించి గిరిజనులు, గిరిజనేతరులు, రైతులకు తీవ్ర అన్యా యం చేశారన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు కనీస మరమ్మతులు కరువయ్యాయని, కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఆదివాసీలు ఆందోళన చేస్తున్నా గిరిజన మంత్రి సీతక్క స్పందించకపోవడం అన్యాయమన్నారు. జీవో 49 రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్, సెర్ల మురళీధర్, దీపక్ పంచదార, ప్రహ్లాద్, జయరాజ్, శ్రావణ్, ప్రసాద్గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సాగు సందడి
ఆసిఫాబాద్అర్బన్: ఈ ఏడాది నైరుతి ముందుగానే పలకరించింది. వేసవిలోనే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు.. మోస్తరు వర్షాలు పడుతుండటంతో పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారు. మిగిలిన వారు కూడా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా సాగు సందడి కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాల రాకతో పత్తి విత్తనాలు విత్తుకోవడం జోరందుకుంది. ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోయినా.. రైతులు కోటి ఆశలతో సాగు పనులు చేస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో..జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో 4.45 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది 3.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు ఉండగా, ఈ ఏడాది మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల నుంచే అంటే.. మే మూడోవారంలోనే పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించారు. ఇంకా విస్తారంగా వర్షాలు పడని నేపథ్యంలో కొందరు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు. మరిన్ని వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని చూస్తున్నారు. నల్లరేగడి భూములు తేమను నిలుపుకునే అవకాశం ఉండటంతో పత్తి విత్తనాలు విత్తుకునే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈసారి పత్తికి మద్దతు ధర రూ.8,11గా ప్రకటించింది. ఇందులో సాధారణ రకం పింజాకు రూ.7,710, పొడవాటి పత్తి పింజాకు రూ.8,110 చెల్లించనున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.580 వరకు పెరిగిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. విత్తడం ప్రారంభించాం వర్షాలు పడుతుండటంతో పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించాం. ఇదివరకే కురిసిన వర్షాలకు భూమిలో తేమ ఉంది. వర్షాలు కురిసిన సమయంలో విత్తనాలు వేస్తే మొలకశాతం బాగుంటుంది. లేకుంటే భూమిలోనే మాడిపోయే అవకాశం ఉంది. – నాందేవ్, దస్నాపూర్ అధికారుల సలహాలు తీసుకోవాలి రుతుపవనాలు రావడంతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఈ విధంగా అనుకూలంగా ఉంటే పత్తి విత్తనాలు వేసుకోవచ్చు. రైతులకు అవసరమయ్యే యూరియా అందుబాటులో ఉంచుతాం. ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పత్తి విత్తనాలు విత్తుకుంటున్న రైతులు ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం -
ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాల ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఇటీవల ఆసియా కప్లో బంగారు పతకం సాధించిన గెడెం సుహాసినిని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శాలువాతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 30 నుంచి జూన్ 1 వరకు వెస్ట్ బెంగాల్లో జరిగిన సౌత్ ఆసియా కప్ అత్యాపత్యా పోటీల్లో దేశానికి ప్రాతిని ధ్యం వహించి బంగారు పతకం గెలవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పీడీ రాకేశ్ ఉన్నారు.