Komaram Bheem
-
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గమానియల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్రాక్టివ్ ప్లాట్ పానెల్ బోర్డు ఏ విధంగా వినియోగించాలి, ఆడియోలు, వీడియోలు విద్యార్థులకు ఎలా చూపించాలనే అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అనంతరం డీఈవో మా ట్లాడుతూ ఉపాధ్యాయులు చాక్పీస్ వాడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యా నల్తో గణితం, భౌతిక, జీవ శాస్త్రం సులువుగా అర్థమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ భరత్, రవికుమార్ లాలాజీ, రాజు, శాంతి కుమార్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
రెబ్బెన(ఆసిఫాబాద్): నిత్యం పాలన పరమైన విధులతో బిజీగా ఉండే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చాక్పీస్ పట్టి విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. శనివారం రెబ్బెన మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు గణితంలోని లాగరిఽథంపై పలు ప్రశ్నలు అడిగారు. సులువుగా అర్థమయ్యేలా చాక్పీస్ పట్టి బ్లాక్బోర్డుపై పాఠాలు భోదించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రిజిష్టర్లు, రికార్డులు, భూ భారతి దరఖాస్తులు పరిశీలించారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
కౌటాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు చేతిలో సిర్పూర్ ఆగమైపోతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్ఎస్పీ నాయకత్వంలో సిర్పూర్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిర్పూర్ నాయకులతో సమావేశం -
న్యూస్రీల్
అంబేడ్కర్ సమాజ్రత్న అవార్డుకు ఎంపిక వాంకిడి: మండల కేంద్రాకి చెందిన బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమతా సైనిక్ దళ్ ఆసిఫాబాద్ ఇన్చార్జి దుర్గం సందీ ప్ బీఆర్ అంబేడ్కర్ సమాజ్రత్న రాష్ట్రీయ అవార్డుకు ఎంపికై నట్లు అఖిల భారత గురు రవిదాస్ సమతా పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మధు బావల్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురు రవిదాస్ 648వ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఆదిలాబాద్లో అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆయన పే ర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజ ల్లో చైతన్యం నింపడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ముగిసిన ‘నవోదయ’ పరీక్ష ఆసిఫాబాద్రూరల్: జవహర్ నవోదయ పాఠశాల, కళాశాలల్లో తొమ్మిదో తరగతి, ఇంటర్లో ప్రవేశానికి జిల్లాలో శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ పార్వతి తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ఉదయం 11:15 గంటల నుంచి 1:45 వరకు నిర్వహించిన పరీక్షకు 1,579 మందికిగానూ 1,225 మంది హాజరు కాగా 354 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 1,007 మంది విద్యార్థులకుగానూ 730 మంది హాజరు కాగా 277 మంది గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రాంతంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నందువల్ల ఆది వారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ రూ రల్ ఏఈ ఊర్మిల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గండి, గుడిగుడి, గోవింద్పూర్ వినియోగదారులు సహకరించాలని కోరారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఆసిఫాబాద్రూరల్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో కళ్యాణి పరిశీలించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 291 మందికి గానూ 278 మంది హాజరు కాగా 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 164 మందికిగానూ 139 హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 241 మందికిగానూ 231 మంది హాజరుకాగా 10 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 241 మందికిగానూ 225 మంది హాజరుకాగా 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు. -
‘ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి’
రెబ్బెన: ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో శనివారం మండల కేంద్రంతో పాటు, గోలేటిలో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కోరుకున్నారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్కుమార్, బెల్లంపల్లి ప్రభారీ సుదర్శన్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, మండల అధ్యక్షుడు రాంబాబు, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల వేట!
● ప్రచారం మొదలు పెట్టిన పట్టభద్రులు, టీచర్ల అభ్యర్థులు ● ఉమ్మడి జిల్లా ఓటర్ల మద్దతుకు ప్రయత్నాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల నా మినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ పక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఈ నెల 27 పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్కు ముందు నుంచే..ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్కు ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మద్దతు కోరారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు పట్టభద్రులతో సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటామని సంకేతాలు ఇచ్చారు. ఇక నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నామినేషన్లు వేసి ఓట్ల వేటలో పడ్డారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. పోటాపోటీగా ప్రచారంఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉండడంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నా యకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తునారు. బీజేపీ నుంచి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న మల్క కొమురయ్య ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్ర చారం మొదలు పెట్టారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానానికి పోటీకి దిగిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత నరేందర్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నా యకుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి నియోజకవర్గ పరి ధిలో ప్రచారం చేస్తున్నారు. టీచర్స్ స్థానానికి పోటీ చేస్తున్న కూర రఘోత్తమ్రెడ్డితో పాటు పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తదితరులు ప్రచార స్పీడ్ను పెంచారు. ఓటర్లకు కాల్స్, మెసేజ్లుపట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు అభ్యర్థుల పేర్లతో కూడిన వాయిస్ కాల్స్ వస్తున్నాయి. అభ్యర్థి పేరు చెబుతూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లుగా కోరుతున్నారు. వీటితో పాటు ఓటర్లకు బల్క్ మెసేజ్లు, వాట్సాప్ సందేశాలు షేర్ చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు ప్రతిరోజూ కనీసం రెండు మూడు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు. ఖరీదవుతున్న ఎన్నికగత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరింత ఖరీదై న ఎన్నికలుగా మారాయి. గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి గెలిపొందారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్రెడ్డి విజయం సాధించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో విజయంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో అభ్యర్థులకు ఖర్చులు సైతం తడిసి మోపడవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈసారి పలువురు వ్యాపారులు, ఆర్థిక, రాజకీయ బలం ఉన్నవారు బరిలో ఉన్నారు. దీంతో ఆరేళ్ల క్రితం జరిగిన ఎన్నికలంటే ఈసారి ఖర్చు పెరుగుతోంది. ఎలాగైనా గెలవాలని ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. -
జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రెబ్బెన(ఆసిఫాబాద్): గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పడిన ట్రాఫిక్ సమస్య పునరావృత్తం కాకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం వద్ద మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేసి అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కలెక్టర్, ఎస్పీ పూజలుజాతర ఏర్పాట్ల పరిశీలన అనంతరం కలెక్టర్ వెంకటేష్దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ బాలాజీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, బీపీఏ జీఎం శ్రీనివాస్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, డీఈ రాజన్న, ఎస్సైలు చంద్రశేఖర్, ఎంబడి శ్రీకాంత్, ఈవో బాపిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జయరాం, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణతో నేతకానీలకు అన్యాయం
● నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామినస్పూర్: ఎస్సీ వర్గీకరణతో నేతకానీలకు అన్యా యం జరిగిందని నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, ప్రధాన కార్యదర్శి సిద్దార్థ రామ్మూర్తి అన్నారు. నస్పూర్, శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో శనివారం మాట్లాడారు. దామాషా ప్రకారం తమకు రావాల్సిన కోటాను తమకు కేటా యించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ వివాదాస్పందంగా ఉన్నదని, ఇది భవిష్యత్తులో అస్థిత్వ పోరాటా లకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతులను బీజేపీకి తాకట్టు పెట్టేలా మంద కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అణ గారిన వర్గాలకు అండగా ఉండాల్సిన మందకృష్ణ మాదిగ మనువాదులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నేతకాని జనాభా ఎంత ఉందో కూడా తెలియని మాజీ ఎంపీ వెంకటేశ్నేత తమకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తమ న్యాయమైన హక్కులు తమకు కల్పించకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతి నిధి జనగామ తిరుపతి, నాయకులు జాడి యేసయ్య, జాడి కళ, ప్రేంకుమార్, సెగ్గెం చంద్రమ్మ, లక్ష్మి, రాము, తులసిరాం, తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్లు సగమే..
● జీపీల్లో రూ.5.62 కోట్లకుగానూ రూ.2.81 కోట్లు వసూలు ● 71 శాతంతో ఆసిఫాబాద్ ముందంజ ● 24 శాతంతో చివరిస్థానంలో జైనూర్ఆసిఫాబాద్అర్బన్: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 52 రోజుల గడువు మాత్రమే ఉంది. జిల్లాలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇంటి, కుళాయి పన్నులు రూ.5.62 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.2.81 కోట్లు (55 శాతం)మాత్రమే వసూలయ్యాయి. మార్చి 31 వరకు వందశాతం లక్ష్యం పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు. గతేడాది 90 శాతానికి పైగా పన్నులు వసూలు కాగా ఈసారి ఇప్పటి వరకు 55 శాతం కూడా దాటలేదు. పెరిగిన పనిభారంరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తోంది. ప్రభుత్వ పథకాలను అర్హులకు వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లతో సర్వేలు చేయిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు జాబ్చార్ట్తో పాటు సర్వేలు, ఇతరత్రా పనులు చేపట్టాల్సిరావడంతో పనిఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల ఉద్యోగ ఫలితాలు రావడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఉన్న వారిపై పనిభారం పెరిగింది. మండలానికి రెండు మూడు కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండగా ఓపీఎస్లను నియమించుకున్నారు. 30 జీపీల్లో వందశాతం..జిల్లాలోని 30 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు వందశాతం పన్నులు వసూలయ్యాయి. పెంచికల్పేట్, లింగాపూర్ మండలాలు మినహా మిగతా మండలాల్లో 3 నుండి 5 వరకు పంచాయతీల్లో వందశాతం పూర్తయింది. గత ఆర్థిక సంవత్సరంలో 181 పంచాయతీల్లో వందశాతం వసూలైంది. ఆసిఫాబాద్ మండలం 71శాతంతో మొదటి స్థానంలో ఉండగా, జైనూర్ మండలం 24 శాతంతో చివరి స్థానంలో ఉంది. జిల్లాకు నిర్దేశించిన ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం చేరుకోవాలంటే మరో 52 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. లక్ష్యసాధనలో నిమగ్నం..ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండడంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో కోడ్ వస్తే ఎన్నికల విధుల్లో బిజీగా మారే అవకాశం ఉన్నందువల్ల సాధ్యమైనంత త్వరగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకెళ్తున్నారు. వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నుల వసూళ్లను మార్చి 31లోగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకోసం సర్వే పనుల్లో పంచాయతీ కార్యదర్శులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక కార్యాచరణతో పన్నులు వసూలు చేస్తాం. గడువులోగా వందశాతం పూర్తి చేయడమే లక్ష్యం. – భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి మండలాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలుమండలం జీపీలు టార్గెట్ వసూలు శాతం (రూ.ల్లో) (రూ.ల్లో) ఆసిఫాబాద్ 27 37,29,808 26,61,193 71 చింతలమానెపల్లి 19 24,41,310 16,97,007 68 లింగాపూర్ 14 9,89,435 06,47,566 64 కాగజ్నగర్ 28 59,26,212 37,01,778 63 సిర్పూర్(యూ) 15 10,44,210 06,78,319 61 సిర్పూర్(టి) 16 4,60,621 22,76,080 55 దహెగాం 24 27,58,994 15,15,640 54 కెరమెరి 31 35,92,334 17,61,234 49 రెబ్బెన 24 74,73,586 38,13,583 48 కౌటాల 20 47,72,487 21,35,607 44 తిర్యాణి 29 28,87,505 11,60,448 40 వాంకిడి 28 91,42,163 37,24,544 39 పెంచికల్పేట్ 12 13,39,835 04,90,018 36 బెజ్జూర్ 22 32,42,209 11,00,770 32 జైనూర్ 26 27,32,440 06,78,316 24 మొత్తం 335 5,62,32,150 2,81,22,103 55 -
ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీ ఎంల గోదాం వద్ద రక్షణ చర్యలు, ఈవీఎం కంట్రో ల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను భద్రపర్చిన తీరును సీసీకెమెరాల ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ దిశగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భద్రత సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు ఎల్లవేళలా పనిచేసేలా చూడాలన్నారు. సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకులు సునీల్, నాయబ్ తహసీల్దార్ శ్యాంలాల్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బోనస్ రాలే..!
● సన్నరకం వరిధాన్యానికి క్వింటాల్కు రూ.500 ప్రకటించిన ప్రభుత్వం ● కొనుగోళ్లు పూర్తయినా అందని నగదు ● ఆందోళన చెందుతున్న రైతులుదహెగాం(సిర్పూర్): సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వానాకాలం సీజన్లో చాలామంది రైతులు సన్నరకం వరి పండించారు. ప్రైవేట్ వ్యాపారుల వద్ద ధర ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి రోజులు గడుస్తున్నా అన్నదాతల ఖాతాల్లో మాత్రం బోనస్ నగదు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జనవరి 12న మూసివేశారు. నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు బ్యాంకులు, సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. 55 వేల ఎకరాల్లో సాగు..వర్షాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా చెరువులు, బోర్ల కింద 55 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశా రు. అత్యధికంగా 50 వేల ఎకరాల్లో సన్నాలే సాగైంది. ధాన్యం సేకరించడానికి జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 57 వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నా.. కేవలం 10,695 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. సన్నాలు 9,862 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 833 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. సొసైటీల ద్వారా ప్రభుత్వం క్వింటాల్కు రూ.2,320 ధర చెల్లించింది. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రైవేట్లోనే విక్రయాలు ఎక్కువగా జరిగాయి. వ్యాపారులు క్వింటాల్కు రూ.2,700 పైగా చెల్లించారు. బోనస్కు 1,460 మంది అర్హులుజిల్లాలో అధికంగా సిర్పూర్ నియోజకవర్గంలోనే వరి సాగు ఉంది. ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, తిర్యాణి మండలాల్లోనూ కొంతమంది ధాన్యం పండిస్తున్నారు. జిల్లాలో 1,460 మందికి రూ.4.93 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం 219 మందికి రూ.72.73 లక్షలు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 1,241 మంది రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను మూసి వేసి 25 రోజులైనా డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నగదు ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.బోనస్కు అర్హులు 1,460 మందిరావాల్సిన మొత్తం రూ.4.93 కోట్లుఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.72.73 లక్షలుబోనస్ వచ్చిన రైతులు 219 మందిజిల్లా వివరాలు -
బాలలకు భరోసా
● ముగిసిన ‘ఆపరేషన్ స్మైల్’ ● 57 మంది చిన్నారులకు విముక్తి పెంచికల్పేట్(సిర్పూర్): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నెల రోజులుగా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్– 11 కార్యక్రమం ముగిసింది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బృందాలు బాల కార్మికులకు స్థావరాలుగా ఉన్న వ్యాపార సముదాయాలు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పారిశ్రామిక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాయి. అధికారులు 57 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు బాలలను అప్పగించారు. 57 మంది చిన్నారుల గుర్తింపు..కలెక్టర్ వెంకటేశ్ దోత్రే నేతృత్వంలో పోలీసు అధికారులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కు ల పరిరక్షణ సమితి, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసిఫాబాద్ డివిజన్లోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తు న్న 21 మంది బాలకార్మికులను గుర్తించారు. అలా గే కాగజ్నగర్ డివిజన్లో 31 మంది బాలకార్మికులు, బడి మానేసిన వారు ఒకరు, బాల్యవివాహాలు ఒకరు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను ముగ్గురిని గుర్తించారు. తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి బందీలుగా ఉన్న చిన్నారులకు విముక్తి కల్పించారు. తనిఖీలతో సత్ఫలితాలు..జిల్లాలో ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారిన వారికి అధికారులు కొత్తదారి చూపుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ పదో విడత కార్యక్రమంలో మొత్తం 68 మంది చిన్నారులను గుర్తించారు. వీరిలో బాలకార్మికులు 59 మంది ఉండగా.. బాల్యవివాహం చేసుకున్న ముగ్గురు, బడిమానేసిన పిల్లలు ఆరుగురు ఉన్నారు.భరోసా కల్పిస్తున్నాం బాలలకు భరోసా కల్పించడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు బాలకార్మికులు, అనాథ పిల్లలకు విద్య, వైద్యం ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న బాలబాలికల కోసం పోలీసు, రెవెన్యూ, శిశుసంక్షేమ, కార్మిక విభాగం అధికారులతో పాటు 1098 నంబర్లో సంప్రదిస్తే సాయం అందిస్తాం. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని మా ర్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీఎస్వో బిక్కునాయక్, ఏడీ మిలింద్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు దళారులను న మ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కందులు క్వింటాల్కు రూ.7,550 మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో వచ్చి పట్టా పుస్తకంపై ఎన్ని క్వింటాళ్ల కందులు అమ్ముకునేందుకు అవకాశం ఉందో తెలుసుకోవాలని సూచించారు. -
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు
● 11రోజులంటూ అధికారుల ప్రకటన ● రైలు ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితులు బెల్లంపల్లి: దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయంతో రైలు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ చిన్న సమస్య తలెత్తినా, ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేస్తుండడం ఇటీవలి కాలంలో రైల్వే అధికారులకు పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. తాజాగా మరోసారి రైళ్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా రైళ్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్(రైలు నంబరు 17233, 17234)ను ఈ నెల 10నుంచి 20వరకు 11రోజులపాటు రద్దు చేస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలుకు గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలుతో లింక్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణం సాగించే రైలు ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయి. రైళ్ల పునరుద్ధరణ జరిగే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతం సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణ రైల్వేస్టేషన్లలోనూ ఆగుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రయాణికుల రైలుగా పేరుంది. సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్–కాజిపేట జంక్షన్ మధ్య అతి సాధారణ రైల్వేస్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, పెద్దపల్లి, హన్మకొండ జిల్లా పరిధిలోని ప్రజలు, వ్యాపారులు, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఈ రైలును రోజుల తరబడి రద్దు చేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన వస్తుంది. ఈ నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో దూర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలుతో లింక్ లేకుండా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు నడిపించడానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. సానుకూల నిర్ణయం తీసుకోవాలి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, ప్రత్యేకించి పేదలకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ పనులు లేకపోయినా గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలుతో ఉన్న లింక్ను దృష్టిలో పెట్టుకుని 11 రోజులపాటు రద్దు చేయడం సరికాదు. ఈ విషయంలో రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – ఎన్.నగేశ్, బెల్లంపల్లి 30రైళ్లు..కాజిపేట జంక్షన్–డోర్నకల్ జంక్షన్, డోర్నకల్ జంక్షన్–విజయవాడ, భద్రాచలం రోడ్–విజయవాడ మధ్య నడిచే దాదాపు 30 ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయి. రద్దయిన వాటిలో గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహనతోపాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఆయా మార్గాల్లో నడిచే రైళ్లన్నీ 11రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు. కాగా, మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. నాలుగు రైళ్లు 60 నుంచి 90 నిమిషాలు ఆలస్యంగా నిర్దేశించిన ప్రాంతాల నుంచి బయల్దేరనున్నట్లు వెల్లడించారు. -
సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వద్దు
● సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాదహెగాం/పెంచికల్పేట్/చింతలమానెపల్లి/కౌటాల/బెజ్జూర్: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. దహెగాం, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల, బెజ్జూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. ఓటర్ల సంఖ్య, వసతుల వివరాలను తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. నిర్వహణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతుల కల్పనలో లోటుపాట్లు ఉండొద్దని సూచించారు. నిబంధనల ప్రకారం రాజ కీయ పార్టీల హోర్డింగులు, గోడలపై రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు కవిత, భూమేశ్వర్, ఎంపీడీవో అల్బర్ట్, ఎంఈవో జయరాజ్, డీటీ దౌలత్, ఆర్ఐలు నాందేవ్, సురేశ్, విజయ్, సీనియర్ అసిస్టెంట్లు జుగాదిరావు, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
గంగాపూర్ జాతరకు ఏర్పాట్లు చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ప్రసిద్ధి చెందిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. శుక్రవారం గంగాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, క్యూలైన్ల కోసం బారికేడ్లు, తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ చర్యలు కల్పించాలని సూచించారు. వైద్యశిబిరాలు, నిరంతర విద్యుత్ సరాఫరా, ప్రత్యేక బస్సు సౌకర్యం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై చంద్రశేఖర్, ఎంపీవో వాసుదేవ్, ఆలయ ఈవో బాపిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళీధర్, నాయకులు రమేష్, సుదర్శన్గౌడ్, జయరాం తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్రీల్
దరఖాస్తు గడువు పెంపు ఆసిఫాబాద్రూరల్: 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు పెంచినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.i n వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. తునికాకు టెండర్లు పిలవాలని వినతి ఆసిఫాబాద్అర్బన్: తునికాకు సేకరణకు వెంటనే టెండర్లు పిలవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఫారెస్టు అధికారి కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, భారత ప్రజాతంత్ర యువత సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజలకు తునికాకు సేకరణ రెండో పంటగా అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. ఏటా డిసెంబర్, జనవరిలో టెండర్లు పూర్తిచేస్తే, ఫిబ్రవరిలో కొమ్మకొట్టే పనులు పూర్తిచేస్తారన్నారు. ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ ప్రా రంభం కాకపోవడంతో సేకరణదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అధికా రులు స్పందించి టెండర్లు పూర్తిచేసి, ఆకు సేకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఆత్రం బాపూరావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్ తదితరులు పాల్గొన్నారు. -
రమాబాయికి నివాళి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో బౌద్ధ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సతీమణి రమాబాయి జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బుద్ధ పూజ నిర్వహించి, రమాబాయి చిత్రపటానికి పూలమాలలకు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కటిక పేదరికంలోనూ అంబేడ్కర్ చదువుకు ఆటంకం కలగనీయకుండా సహకరించిన గొప్ప త్యాగమూర్తి రమాబా యి అని కొని యాడారు. నేటి మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని సూ చించారు. చిన్నారులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, మండల అధ్యక్షుడు జైరాం ఉప్రె, అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి దుర్గం సునీల్, నాయకులు విలాస్, రాజేంద్రప్రసాద్, దుర్గం తిరుపతి, గేడం హిరిషన్, దుర్గం సందీప్, రోషన్, అరుణ్, ప్రతాప్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వనం వీడి జనంలోకి రావాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావుపెంచికల్పేట్(సిర్పూర్): మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని అగర్గూడలో శుక్రవారం పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని నిరుపేదలకు దుప్పట్లు, సరుకులు పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చౌదరి అంకుబాయి అలియాస్ అనిత కుటుంబ సభ్యులను కలిసి నిత్యావసర సరుకులు, బట్టలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏదీ లేదన్నారు. అజ్ఞాతం వదిలి ప్రభుత్వానికి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మత్తు పదార్థాలు తయారీ చేసినా.. విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. స్థానిక యువకులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ కొలువులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కాగజ్నగర్రూరల్ సీఐ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, పెంచికల్పేట్ ఎస్సై కొమురయ్య, ఆర్ఎస్సై ఓదెలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అన్నిపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా అందిస్తామని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు సమకూరుస్తున్నామని అన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎన్నికల పర్యవేక్షకుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలందించాలిప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మా ట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపైనే ఉందన్నారు. అత్యవసరమైతేనే ఇతర ఆస్పత్రికి రోగులను రెఫర్ చేయొద్దన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
20,726 మందికి ‘రైతు భరోసా’
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా జిల్లాలోని 20,726 మంది రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం అందించింది. గత నెల 26న రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 27న మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసిన రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున అందించారు. జిల్లాలో మొదట 4,243 మంది రైతులకు ప్రభుత్వం రూ.8.6 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు. తాజాగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేశారు. జిల్లాలోని 16,483 మందికి ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.13,31,86,060 నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 20,726 పెట్టబడి సాయం అందించారు. ఎకరం నుంచి రెండెకరాల వరకు రైతుభరోసా నిధుల విడుదలపై త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనుంది. -
‘వీఏవోలకు మెమోలు ఇవ్వడం సరికాదు’
ఆసిఫాబాద్అర్బన్: సమావేశానికి రాలేదని ఆసిఫాబాద్ మండల సమైఖ్య ద్వారా వీవోఏలకు మెమోలు ఇవ్వడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో డీఆర్డీవో దత్తారావుకు గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ వీవోఏలు సీసీల అనుమతి తీసుకున్నా మెమోలు జారీ చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత లేకున్నా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారిని వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమంగా సీసీ విధులు నిర్వర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీధర్, స్వామి, మహేశ్, రమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉ త్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్ దీప క్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఎంఈవోలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తూ, వారి సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఎంఈవోలు ప్రతిరోజూ ఐదు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల బోధన సరళిని సమీక్షించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు, ఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలిఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్(టాస్క్) కేంద్రంలో అందించే శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్ను గురువారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సందర్శించారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఏకాగ్రతతో శిక్షణ అంశాలను నేర్చుకోవాలని సూచించారు. -
యాత్రతో ఆవిష్కరణలపై ఆసక్తి
వాంకిడి(ఆసిఫాబాద్): ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రారంభమైన కలాం బస్సు యాత్ర ద్వారా పాఠశాలల విద్యార్థుల్లో ఆవిష్కరణ లు, శాసీ్త్రయతపై ఆసక్తి పెరుగుతుందని జిల్లా విద్యాధికారి గమానియల్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థులకు గురువారం సైన్స్, సాంకేతికత, ఇతర అంశాల గురించి వివరించారు. ఎడోడ్వాజ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు మాట్లాడుతూ ఈ బస్సు యాత్ర ద్వారా విద్యార్థులు, యువతకు సాంకేతికతపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం నటరాజ్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, అధికారులు అబిదాలీ, దేవాది, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియె ట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగజ్నగర్లోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని గురువారం డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. ప్ర యోగాల తీరును పరిశీలించారు. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్కు జనరల్ విభాగంలో 482 మందికి 452 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 11 మందికి 9 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 352 మందికి 333 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 200 మంది 195 మంది హాజరయ్యారు.