Komaram Bheem
-
కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు
రెబ్బెన: సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబయ్యాయి. మండలంలోని గంగాపూర్, నేర్పల్లి, పుంజుమేరగూడ, పులికుంట కాలనీల్లోని బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. శుద్ధజలం కోసం ఆర్వో ప్లాంట్లను సైతం సమకూర్చారు. మన ఊరు– మన బడి పథకంలో భాగంగా గంగాపూర్, పుంజుమేరగూడ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, బ్యాక్బోర్డుల స్థానంలో గ్రీన్బోర్డులు, తరగతి గదుల్లో పూర్తి స్థాయి లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గంగాపూర్ పాఠశాలలో సుమారు 153 మంది విద్యార్థులు ఉండగా, నేర్పల్లిలో 30 మంది, పుంజుమేరగూడలో 41 మంది చదువుతున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదులు, పరిసరాలు శుభ్రం చేస్తున్నారు. -
చదువుల గుడి.. సావర్ఖేడా
కెరమెరి(ఆసిఫాబాద్): జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన కెరమెరి మండలంలోని సావర్ఖేడా ప్రాథమిక పాఠశాల చదువుల గుడిగా నిలుస్తోంది. గతేడాది పీఎంశ్రీ పథకానికి ఎంపిక కావడంతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ 120 మంది చదువుతున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కడేర్ల రంగయ్య ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తూ డిజిటల్ తరగుతుల, ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. 2010లో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండగా క్రమంగా ప్రవేశాలు పెరుగుతున్నాయి. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, దాతలు, ఉపాధ్యాయులు సుమారు రూ.10 లక్షల విరాళాలు అందించి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. 15 ఏళ్లలో 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో సీట్లు సాధించగా, 15 మంది హైదరాబాద్లోని చుక్కా రామయ్య విద్యా సంస్థ, పలువురు సీవోఈ, నవోదయ స్కూళ్లలో సీట్లు కై వసం చేసుకున్నారు. ఉపాధ్యాయుల కృషి మరువలేనిది రంగయ్య సార్తోపాటు పాఠశాలల అభివృద్ధికి పాటుపడిన ఉపాధ్యాయులు కృషి మరువలేనిది. కా ర్పొరేట్ స్థాయిలో బడిని తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్య అందిస్తున్నారు. వారికి రుణపడి ఉంటాం. – కావుడే రమేశ్, గ్రామ పటేల్, సావర్ఖేడా -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమష్టిగా నిర్మూలిద్దామని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో షూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కరపత్రాలు ఆవిష్కరించారు. అనుబంధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు వారంపాటు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డీసీపీవో మహేశ్ మాట్లాడుతూ ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చైల్డ్ హెల్ప్లైన్, షూర్ ఎన్జీవోల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్కుమార్, షూర్ సంస్థ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సంతోష్కుమార్, డీహెచ్ఈ డబ్ల్యూ మిషన్ కోఆర్డినేటర్ శారద పాల్గొన్నారు. -
గవర్నమెంట్లో క్వాలిఫైడ్ టీచర్లు
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలుర)లో ఇంగ్లిష్ సబ్జెక్టు బోధిస్తున్నా. ఇదే పాఠశాలలో నేను 1976– 1982 వరకు చదువుకున్నా. చదువు చెప్పే సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గవర్నమెంట్ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. అప్పటి గురువులు నేర్పిన విద్యతోనే ఈ స్థాయికి ఎదిగాను. – మంథెన మహేశ్, ఆసిఫాబాద్ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య ఆసిఫాబాద్అర్బన్: పిల్లలను భావిపౌరులుగా తీర్చిదిద్దే బోధన వృత్తిలో ఉండటం సంతృప్తినిస్తుంది. నేను చదువుకున్న పాఠశాలలోనే జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుంది. క్రమశిక్షణ, జీవిత పాఠాలు ఇక్కడే నేర్పుతారు. – పెండ్యాల సురేశ్కుమార్, ఆసిఫాబాద్ నేలపై కూర్చుని పాఠాలు విన్నా.. కాగజ్నగర్రూరల్: మా సొంత గ్రామం రెబ్బెన మండలం కిష్టాపూర్లో ఒకటో తరగతి నుంచి ఐదు వరకు గూనపెంకుల గదిలో విద్యాభ్యాసం పూర్తిచేశా. అప్పట్లో నేలపైనే కూర్చుని పాఠాలు విన్నాం. అప్పటి బోధన పటిష్టంగా ఉండేది. మధ్యాహ్నం గోధమ ఉప్మా, పల్లీపట్టి ఇచ్చేవారు. ఇంద్రసేన్, విజయ్, కృష్ణభాస్కర్ అనే టీచర్లు ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన తాండూర్ మండలం రేచినీ పాఠశాలకు వెళ్లి పదోతరగతి పూర్తిచేశా. అప్పట్లోనే పదో తరగతిలో పాఠశాల ఫస్ట్ వచ్చా. కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాలల్లోనే ఇంటర్, డిగ్రీ చదివా. చదువుకున్న డిగ్రీ కాలేజీలోనే ఇన్చార్జి ప్రిన్సిపాల్గా పనిచేయడం గర్వంగా ఉంది. 2010లో అధ్యాపకుల పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించా. – లక్ష్మీనరసింహ, వైస్ప్రిన్సిపాల్, కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
చెట్ల కిందనే చదువు
కాగజ్నగర్టౌన్: చిన్ననాటి చదువంతా చెట్ల కిందనే కొనసాగింది. మా స్వగ్రామం కాగజ్నగర్ మండలంలోని భట్టుపల్లి. ఆ కాలంలో పాఠశాలకు సరైన వసతులు ఉండేవి కావు. ఒకటి నుంచి రెండో తరగతి వరకు రావి చెట్టు కింద, 3, 4 తరగతులు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో, 5, 6 తరగతులు పీరీల బంగ్లా, ఏడో తరగతి పంచాయతీ కార్యాలయంలో కొనసాగింది. ఉన్నత చదువుల కోసం కాగజ్నగర్కు వచ్చా. గురువులు సామల సత్యనారాయణ, బుచ్చిరాములు, చక్రపాణి సార్లు ఎంతో ప్రోత్సహించారు. చదువంటే ఉత్సాహం, పట్టుదల ఉండడంతోనే ప్రతిరోజూ హాజరయ్యే వాళ్లం. మా నాన్న భీమయ్య వృత్తిరీత్య టీచర్ కావడంతో బడికి వెళ్లడం ఆనందంగా ఉండేది. – కటుకం మధుకర్, జిల్లా సైన్స్ అధికారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివా.. కాగజ్నగర్టౌన్: పెంచికల్పేట్ మండలం చేడ్వాయి ప్రాథమిక పాఠశాలలో ఒకటి తరగతి నుంచి నాలుగో తరగతి వరకు, ఐదు నుంచి పదో తరగతి వరకు జెడ్పీఎస్ఎస్(సర్సిల్క్) కాగజ్నగర్లో చదివా. ఆ తర్వాత కాగజ్నగర్లోని త్రిశూల్ పహాడ్పై ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఎస్కేఈలో డిగ్రీ పూర్తిచేశా. ఇంటి నుంచి నడుచుకుంటూ దోస్తులందరం గంట ముందే స్కూలుకు వెళ్లేవాళ్లం. సరదాగా ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్లం. రాయడం, చదవడం, లెక్కలు చేయడం ఇష్టం. – వాసాల ప్రభాకర్, మండల విద్యాధికారి, కాగజ్నగర్ ప్రతిభకు కొదువ లేదు పెంచికల్పేట్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభకు కొదువలేదు. అక్కడ అందించిన నాణ్యమైన విద్యతోనే ఉన్నత చదువుల్లో రాణించా. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014లో పదో తరగతి పూర్తిచేశాను. ఇంటర్ హైదరాబాద్లో చదివి, ఎంసెట్ ద్వారా ఆదిలాబాద్ రిమ్స్లో సీటు తెచ్చుకున్నా. ఎంబీబీఎస్ పూర్తిచేశాను. కిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం పీజీ అనస్థీషియా చేస్తున్నా. – డా.సుప్రియ, పెంచికల్పేట్ -
సౌకర్యాలతో ఆధునిక బోధన
సాక్షి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతుంది? జిల్లాలో ఇప్పటికే 34 బడులు మూతబడ్డాయి. ప్రవేశాలు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: జిల్లాలో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిపించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నాలుగు మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభించాం. బడిబాట కా ర్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, యూ నిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు నాణ్య మైన విద్య గురించి వివరిస్తున్నాం. ప్రతీ పా ఠశాలలో పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం టీచింగ్ పై అవగాహన కల్పిస్తున్నాం. ఈసారి అడ్మిష న్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. -
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఎంహెచ్వో సీతారాంతో కలిసి బుధవారం వైద్యాధికారులతో మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, గర్భిణుల సంక్షేమంపై ముందస్తు ప్రణాళిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత నీటితో వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన మందులు పీహెచ్సీలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రసవాల కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గురువారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న దృష్ట్యా వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద విధులు నిర్వహించే వైద్యసిబ్బంది పీవీటీజీ గ్రామాన్ని సందర్శించాలని సూచించారు. భూసమస్యల పరిష్కారానికి సదస్సులు వాంకిడి: భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అర్లీలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీని తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి మీనాకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.కవిత, మండల సర్వేయర్ రామకృష్ణ, గిర్దావార్ మాజిత్, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
34.1 /27.9
గరిష్టం/కనిష్టంమంత్రి వివేక్కు కార్మిక, మైనింగ్ శాఖలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు శాఖలు కేటాయించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలతోపాటు గ నులు, జియాలజి శాఖలు కేటాయించారు. కాగా, గతంలో చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పు డు ఆయన సోదరుడు వినోద్ కూడా కార్మిక శాఖ మంత్రిగా పని చేయడం గమనార్హం. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. 9లోu -
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
కాగజ్నగర్రూరల్: భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ తెలిపారు. కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల స్వీకరణ పక్రియను పరి శీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుల ను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణ అనంత రం శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపా రు. అలాగే దుర్గానగర్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ మధుకర్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు అవగాహన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు హెచ్ఆర్డీ భవనంలో మంగళవా రం భారతీయ యువశక్తి ట్రస్టు ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువకులకు బిజినెస్పై అవగాహన కల్పించారు. ఎస్పీఎం జనరల్ మేనేజర్ ఎంఎస్ గిరి మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, మార్కెట్లో ప్రొడక్టును ఎలా పరిచయం చేయాలో వివరించారు. కార్యక్రమంలో బీవైఎస్టీ క్లస్ట ర్ మేనేజర్ ప్రబీర్, అశోక్ కునల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు లక్ష్మీనరసింహ, ఐకేపీ డీఎంవో మోతీరాం తదితరులు పాల్గొన్నారు. -
స్తంభం వాడితే ట్యాక్స్!
● కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు ● ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా పన్నులు చెల్లించాల్సిందే.. ● విద్యుత్ శాఖ నిర్ణయం ● ఆర్థిక భారమవుతుందని ఆపరేటర్లు, ప్రొవైడర్ల ఆవేదనసాక్షి, ఆసిఫాబాద్: కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఉచితంగా విద్యుత్ స్తంభాలను వినియోగించుకోవడం ఇకపై వీలుపడదు. గతంలో మాదిరిగా పన్నులు చెల్లించకుండా పోల్స్పై కేబుళ్లు ఏర్పాటు చేస్తామంటే కుదరదని విద్యుత్శాఖ స్పష్టం చేసింది. స్తంభాలు ఎవరూ వాడినా ప్రతినెలా పన్నులు చెల్లించాలంటూ సర్క్యూలర్ జారీ చేసింది. గతం నుంచే ఈ పన్నుల విధానం ఉన్నా కేవలం కొంతమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని, క్షేత్రస్థాయిలో విద్యుత్ స్తంభాలను వాడుకుంటున్న కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్ల వివరాలు మరోసారి సేకరించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. 15 రోజుల్లో సరిచేయాలిగ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ స్తంభాలపై చిక్కుముళ్లతో కనిపించే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ తీగలను 15 రోజుల్లోగా సరిచేయాలని విద్యుత్ అధికారులు ఆదేశించారు. లేకుంటే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కనెక్షన్లు లేకపోయినా విద్యుత్ తీగలతోపాటు కలిసిపోయిన కేబుల్, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలని ఆ శాఖ నిర్ణయించింది. చాలామంది ఆపరేటర్లు తమ కనెక్షన్లను ఇతరులకు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన కొత్త ఆపరేటర్లు మాత్రం విద్యుత్ శాఖకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా స్తంభాలను వినియోగించుకుంటున్నారు. ఎన్ని స్తంభాలు వాడుతున్నారు..?విద్యుత్ శాఖ జారీ చేసిన పోల్ట్యాక్స్ సర్క్యూలర్ లో ప్రైవేటు వ్యక్తులు గ్రామాల్లో కరెంట్ స్తంభాలను వినియోగిస్తే నెలకు రూ.15, పట్టణాల్లో అయితే రూ.20 చెల్లించాలని ఆదేశించారు. ఈ విధానం చాలా రోజుల నుంచే అమల్లో ఉంది. కానీ కొందరు ఆపరేటర్లు మాత్రమే అరకొరగా పన్నులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పదిరోజుల్లోగా జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఎన్ని కరెంట్ స్తంభాలను వాడుతున్నారో సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు.కలెక్టరేట్ ఎదుట ధర్నా ఆసిఫాబాద్అర్బన్: పోల్టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం ముఖ్య సలహాదారుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు లోకేశ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్లు అప్పుల పాలవుతున్నారని, నూతన పాలసీలతో ఆర్థికంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కేబుల్ టీవి, ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం సలహాదారుడు మనోహర్, కన్వీనర్ సాజిద్, కోకన్వీనర్ అశోక్గౌడ్, సభ్యులు సత్యనారాయణ, దిలీప్, కిరణ్, స్వప్న, జమీల్, సంపత్, సాయికృష్ణ, నగేశ్చారి, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
బడీడు పిల్లలు స్కూళ్లలో ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): బడీడు పిల్లలు స్కూళ్లలో ఉండాలని, ఆ దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పి.రమాదేవి అన్నారు. మండలంలోని అంబరావుగూడ గ్రామంలో మంగళవారం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. చదువుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల బాగో గుల కోసం చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపించొద్దని సూచించారు. చదివే వయస్సులో చిన్నారులను వ్యవసాయ పనులకు పంపించొద్దన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం దాము తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తుకు బాట
● ప్రారంభమైన ‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ ● అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు చర్యలు ● ఈ నెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలురెబ్బెన(ఆసిఫాబాద్): చిన్నారులకు ఉజ్వల భవి ష్యత్తు అందించేలా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి ఆరోగ్యం, ఆటపాటలతో కూడిన సృజనాత్మక విద్యనందించడమే లక్ష్యంగా ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామపెద్దలను భాగస్వాములను చేస్తూ ఈ నెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బడీడు పిల్లల కోసం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుండగా, గతేడాది నుంచి 2.5 నుంచి ఆరేళ్ల లోపు చిన్నారుల కోసం అంగన్వాడీ బాట కార్యక్రమం చేపడుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది సైతం ఐసీడీఎస్ సిబ్బంది ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆటపాటలతో విద్యాబోధనజిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 973 అంగన్వాడీ సెంటర్లు ఉండగా, ఆరేళ్లలోపు చిన్నారులు 44,702 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి వాటి ద్వారా చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా గోడలకు రంగు రంగులతో బొమ్మలు వేయించి పిల్లలను ఆకర్షించేలా కేంద్రాలను తీర్చిదిద్దారు. ఇక అమ్మ మాట– అంగన్వాడీ బాట కార్యక్రమాల ద్వారా గ్రామాల్లోని రెండున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. చిన్నారులకు బయటి ప్రపంచం గుర్తుకు రాకుండా ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయనున్నారు. సృజనాత్మకతను పెంచే రీతిలో కేంద్రాలకు గత సంవత్సరమే ప్లే మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఊయల, జారుడుబల్ల వంటి ఆట వస్తువులతోపాటు అక్షరాలు, అంకెలు, బొమ్మలతో కూడిన సామగ్రితో విద్యనందించేలా టీచర్లకు సైతం తర్ఫీదు ఇచ్చారు. పసి వయస్సులో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతోపాటు వారి ఆరోగ్య రక్షణకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులను ప్రైవేటు ప్లేస్కూల్స్కు కాకుండా తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాల్లోనే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలుజిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం నుంచి అమ్మ మాట– అంగన్వాడీ బాట కార్యక్రమాలు మొదలయ్యాయి. కేంద్రాలను అలంకరించడం మొదలు, చిన్నారుల గుర్తించడం, కేంద్రాల్లో చేర్పించడం, సేవల గురించి తల్లిదండ్రులకు వివరించడం తదితర కార్యక్రమాలు ఈ నెల 17 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నారు. మొదటిరోజు అంగన్వాడీ కేంద్రాలను అలంకరించి తల్లిదండ్రులు, చి న్నారులను కేంద్రాలకు ఆహ్వానించి వారు సెల్ఫీలు తీసుకునేలా ప్రోత్సహించారు. ● బుధవారం గ్రామంలో మూడేళ్లలోపు చిన్నారుల ను గుర్తించి వారి ఇళ్లను సందర్శించడం, తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు, ప్రీ స్కూల్, పాఠ్యపుస్తకాలు, టైం టేబుల్, కఽథల పు స్తకాలు, ప్రీస్కూల్ కిట్, స్కూల్ రెడినెస్ యాక్టివి టీస్, అభివృద్ధి కార్డులు, ప్రగతిపై సమాచారం అందించడం ఒక వైపు అయితే గుర్తించిన పిల్లల ను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం, ప్రీస్కూ ల్ పూర్తి చేసిన పిల్లలకు సర్టిఫికెట్లు అందించడం(గ్యాడ్యుయేషన్ డే), 5 సంవత్సరాలు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, ● 12, 13, 16వ తేదీల్లో పోషణ్ వంటశాల తోటలు అభివృద్ధి చేయడం, టీహెచ్ఆర్, హెచ్సీఎం ద్వారా అందిస్తున్న పోషకాహార పద్ధతులను హైలెట్ చేయడం, పిల్లలందరికీ అనుకూల వాతావరణాన్ని కల్పించడం, ● 17న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాల నిర్వహణ, ప్రీస్కూల్ టైం టేబుల్, పాఠ్యాంశాలు, మంచి అలవాట్లు, ప్రీస్కూల్ విద్య ప్రాముఖ్యతను సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శన, ప్రీస్కూల్ పుస్తకాలు, అసెస్మెంట్ కార్డుల ప్రదర్శన, తల్లిదండ్రులు, సమాజ సభ్యులు, గ్రామస్తులను అతిథులుగా ఆహ్వానించడం, తల్లిదండ్రులకు బాల్య దిశలో సంరక్షణ, విద్య గురించి అవగాహన కల్పించడం, ప్రీస్కూల్ పిల్లలు తయారుచేసిన బోధన సామగ్రి, అంగన్వాడీ టీచర్, ఐసీడీఎస్ అందించిన మెటీరియల్స్ ప్రదర్శించడం, ఆరోగ్యంగా ఉన్న పిల్లలను నిత్యం ప్రీస్కూల్కు పంపుతున్న తల్లిదండ్రులకు బహుమతులు అందించడం, సామూహిక అక్షరభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆటపాటలతో కూడిన విద్య అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ఓ వైపు ఆరోగ్యం, మరోవైపు ఆటపాటలతో కూడిన విద్య అందుతోంది. ప్రీస్కూల్ కార్యక్రమాల ద్వారా చిన్నారులకు చదువుపై ఇష్టం పెరిగి పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అందుకు అనుగుణంగా గ్రామాల్లోని చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం, ప్రీస్కూల్పై చిన్నారులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, సామూహిక అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను అంగన్వాడీ బాట ద్వారా చేపడుతున్నాం. – భాస్కర్, జిల్లా శిశుసంక్షేమాధికారి -
తాగు, సాగునీటి వనరులు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని తాగు, సాగునీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సాగునీటి వనరుల రక్షణ, నీటి వినియోగం, తాగునీటి వనరుల ద్వారా ఇంటింటికీ నీరు అందించడం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు శుద్ధమైన జలం సరఫరా చేయడం అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సాగు భూములకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సాగునీటి వనరుల్లో మత్స్య సంపదను పెంపొందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు శుద్ధమైన జలం అందించాలన్నారు. ప్రతీ వర్షపు నీటిబొట్టును నిల్వ చేయాలని సూచించారు. జగన్నాథపూర్ ప్రాజక్టు పెండింగ్ పనులపై నీటిపారుదల శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నివేదిక రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు, మూడు మధ్య తరహా ప్రాజెక్టులు, 574 చెరువులు, కుంటలు, 13 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నీటి సంరక్షణకు ట్యాంకులు, ఫారంపాండ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అంతకుముందు కేంద్ర బృంద సభ్యులు గుండి గ్రామాన్ని సందర్శించారు. సమావేశంలో కేంద్ర బృందం సభ్యులు, నీటిపారుదల శాఖ అధికారులు గుణవంత్రావు, ప్రభాకర్, మిషన్ భగీరథ అధికారి సిద్దిఖీ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు, కాలువలు పరిశీలన
దహెగాం/కాగజ్నగర్రూరల్: దహెగాం మండలం కల్వాడ సమీపంలోని పీపీరావు ప్రాజెక్టు, కాగజ్నగర్ మండలంలోని జగన్నాథ్పూర్ ప్రా జెక్టుతోపాటు కాలువలను సోమవారం కేంద్ర పెట్రోలియం సహాజ వనరుల గ్యాస్ జాయింట్ సెక్రెటరీ వినోద్ శేషన్, కేంద్ర భూగర్భ జలవనరుల ఈఈ వెంకటేశ్వర్లు, బృందం సభ్యులు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను అడిగి ప్రాజెక్టు, కాలువల పరిస్థితిపై వివరాలు సేకరించారు. ప్రాజెక్టు స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ట్రాక్టర్, బైక్పై వెళ్లి పలు కాలువలను పరిశీలించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలిజగన్నాథ్పూర్ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి రైతులకు సాగు నీరందించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న కోరారు. సోమవారం జగన్నాథ్పూర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర బృందాన్ని కలిసి వినతిపత్రం అందించారు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రుచిగా.. నాణ్యతగా
● నేడు మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ ● వివిధ అంశాలపై తర్ఫీదుఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఆ లోగా పాఠశాలలకు ససంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఉపాధ్యాయులకు మండలస్థాయిలో ఐదు రోజులు శిక్షణ అందించారు. నూతన విద్యా విధానంపై అవగాహన కల్పించారు. ఇక విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించింది. వంటలు రుచిగా, శుభ్రతతో ఉండేలా మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లావ్యాప్తంగా మంగళవారం శిక్షణ అందించనున్నారు. కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. చాలాచోట్ల భోజనం నాణ్యత, రుచిగా ఉండడం లేదని తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భోజనం విషయంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా విద్యాశాఖ మరో అడుగు ముందుకేసింది. వంట, శుభ్రత, వడ్డింపు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పోషకాహారం అందించే తీరుపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తు న్న ప్రభుత్వ పాఠశాలలు 980 ఉన్నాయి. ఇందులో 1,521 మంది మధ్యాహ్న భోజన కార్మికులు, స్కావెంజర్లు 798 మంది పనిచేస్తున్నారు. విద్యార్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో..వంట చేసేందుకు సరైన వసతిలేని పాఠశాలల ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులకు శిక్షణ ముందుగా అందించారు. ఈ కార్యక్రమం రాష్ట్రస్థాయిలో ఈ నెల 4, 5 తేదీల్లో కొనసాగింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మంగళవారం ఉదయం 10:30 గంటలకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఆయా మండలాల్లో అవగాహన కల్పిస్తారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం భోజనం నాణ్యత, పోషక విలువలు ఉండేలా వడ్డించడం, వంట చేసే ప్రదేశంలో శుభ్రత, వడ్డించే విధానం తదితర అంశాల గురించి క్షుణ్నంగా వివరిస్తారు. బడులకు వంటపాత్రలువంట తయారీకి నాణ్యమైన పాత్రలు వినియోగించాలనే ఉద్దేశంతో గతేడాది ప్రభుత్వం కొనుగోలుకు నిధులు విడుదల చేసింది. సెలవుల కంటే ముందుగా ఆయా పాఠశాలలకు వంట పాత్రలు పంపిణీ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోగా మధ్యాహ్న భోజన బిల్లులు సమర్పించేలా దిశానిర్దేశం చేయనున్నారు. అసంపూర్తిగా ఉన్న వంట గదులను పూర్తి చేయాల్సి ఉంది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి స్టీరింగ్, మానిటరింగ్, మండలస్థాయిలో తహసీల్దార్ చైర్మన్ మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.నిసాని పాఠశాలలో వంట చేస్తున్న ఎండీఎం కార్మికులు(ఫైల్)శిక్షణ వినియోగించుకోవాలి మధ్యాహ్న భోజన కార్మికులతోపాటు ప్రధానోపాధాయ్యులకు మంగళవారం అందించే శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. పలు అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల వంట కార్మికులు వచ్చేలా చూడాలి. – ఆడే ప్రకాశ్, ఎంఈవో, కెరమెరి -
నియామకాలపై విచారణ చేపట్టాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్య కళాశాలలో ఇటీవల చేపట్టిన నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సోమవారం రోడ్డుపై నిరసన తెలిపారు. అనంత రం అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భుక్యరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవల 52 ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పో స్టులను అర్హులతో కాకుండా డబ్బులు ఎక్కు వ ఇచ్చిన వారితో భర్తీ చేశారని ఆరోపించా రు. అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చే యకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తుకారాం, వినోద్, శ్యాంరావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
గోడు చెప్పుకుని.. వినతులిచ్చి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. అధికారులకు గోడు చెప్పుకుని.. పరిష్కారం చూపాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తగా ఉపాధి కల్పించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్వాడీకి చెందిన సంగీత దరఖాస్తు చేసుకుంది. సాగు చేస్తున్న భూమికి పట్టాపాస్ పుస్తకం మంజూరు చేయించాలని దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన పూజారి బాయక్క అర్జీ సమర్పించింది. తన తాత పేరిట గల భూమిని ఇతరులు అక్రమంగా పట్టా మార్చుకుంటున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని బెజ్జూర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన భీమ్రావ్ దరఖాస్తు చేసుకున్నాడు. గత సంవత్సరం అగ్ని ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయిందని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామానికి చెందిన ఎడం లక్ష్మణ్ వేడుకున్నాడు. ఒంటరి మహిళ అయి న తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కాగజ్నగ ర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన జోత్స్న కోరింది. తమ గ్రామంలో డీటీసీపీ అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సోనులే సంతోష్బాబు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ రికార్డుల్లో తన తండ్రి పేరు తప్పుగా నమోదైందని, దానిని సవరించాలని ఆసిఫాబాద్ పట్టణం రాజీవ్నగర్కు చెందిన బండారి సత్యనారాయణ దరఖాస్తు సమర్పించాడు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావ్, అధికారులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి మా కుటుంబాలకు సొంతిల్లు లేదు. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. జీవనోపాధి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాల్లో ఎక్కడైనా ఉపాధి కల్పించాలి. – రాజేశ్వరీ, గౌతమి, కాగజ్నగర్ అనాథను.. ఆదుకోండి రెబ్బెన మండలం గోలేటిలో ఉంటున్న నాకు ప్రస్తుతం ఎవరూ లేరు. అనాథగా కూలీ పనిచేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నా. ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం దయతలచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – కళావతి, గోలేటి, మం.రెబ్బెన ● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ -
‘పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సువర్ణను సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ప్లాంటేషన్ డ్రైవ్ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పీసీసీఎఫ్(హెచ్ఎఫ్ఎఫ్) సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలి పారు. కార్యక్రమంలో నాయకులు ఎల్మూలే మల్లయ్య, డేగ అంకులు ఉన్నారు. -
జీవో 49 రద్దు చేయాలి
వాంకిడి: టైగర్జోన్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజ య్కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని మోకాసిగూడ(ఇందాని)లో సోమవారం టైగ ర్ జోన్ ఏర్పాటుకు నిరసనగా గ్రామస్తులతో కలిసి నల్ల జెండా ఎగురవేశారు. ఆయన మా ట్లాడుతూ అటవీశాఖ అధికారుల విధానాలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటవీ అనుమతుల కారణంగా గిరిజన గ్రామాలు అభివృద్ధి దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆపకపోతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నా రు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, విద్యాశాఖ కమిషనర్ యోగితారాణి, పంచాయతీరాజ్ కమిషనర్ లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. మంత్రి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు స్థలాలు ఎంపిక చేసి ప నులు నవంబర్ 30లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడు తూ జిల్లాలో 45,293 యూనిఫాంలకు 36వేలు సిద్ధం చేశామని తెలిపారు. మిగిలిన 9వేల యూని ఫాంలు మూడు రోజుల్లో పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు విద్యార్థులకు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా శక్తి భవనం కోసం స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించామని వివరించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో స్థలాన్ని ఎంపిక చేసి భారత్ పెట్రోలియం కంపెనీతో త్వరలో ఒప్పందం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, విద్యాశాఖ అధికారులు, డీపీఎంలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తిచేయాలిపోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను ఈ నెల 25లోగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, రిట ర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఓటరు జాబితా సవరణ, బూత్స్థాయి అధికారు ల నియామకం, గుర్తింపు కార్డుల జారీ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలో 1,200 మంది ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 30 వరకు ఉన్నాయని, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో 678 మంది బూత్స్థాయి అధికారులు పనిచేస్తున్నారని, 68 మంది బూత్స్థాయి అధికారుల సూపర్వైజర్లు ఉన్నారని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీలు త్వరగా భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం
ఆసిఫాబాద్రూరల్: ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరా డుతామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుకారాం, మాణిక్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవా రం ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ని జాం ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కో సం ముగ్దు మొహినుద్దీన్ 1947లో ఎస్టీయూ ను ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు పూర్తికాక ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం సరికాదన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ సంజయ్ కుమార్, నాయకులు జంగు, నగేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరి గ్రామాల్లో అక్షర చైతన్యయాత్రలు
● ఆదివాసీలతో అక్షరాలు దిద్దించిన ఉపాధ్యాయుడు ● సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్న సుందిళ్ల రమేశ్ కెరమెరి(ఆసిఫాబాద్): చిన్నారులతో పాటు అత్యంత వెనుకబడి అక్షరజ్ఞానం లేని పేదలు, ఆదివాసీల జీవితాల్లో అక్షర కాంతులు వెలిగించేందుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. వేసవి సెలవుల్లో విహార యాత్రలు, దైవదర్శనాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకుండా పేదల గుడిసెలకు వెళ్లి అక్షరాలు దిద్దించారు. కాగజ్నగర్ మండలంలోని చారీగాం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 14 మండలాల్లో ఒక్కో గ్రామం..తనకు వచ్చిన ఆలోచనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు తెలిపి ఆయన సహాయం తీసుకున్నారు. తాను చేపట్టే కార్యక్రమాలను పూర్తిగా విశదీకరించి అధికారుల అనుమతి పొందారు. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షణలో జిల్లాలోని ప్రతీ మండలంలో ఉన్న అత్యంత వెనుకబడిన గ్రామాన్ని ఎన్నుకుని ‘అక్షర చైతన్య యాత్ర’ పేరిటా అక్కడి ప్రజలకు అక్షరం విలువ తెలియజేశారు. అనంతరం వారితో అక్షరాలు దిద్దించారు. బాల్యవివాహాలు నిరోధించడం, బాలకార్మికుల నిర్మూలన, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, ఆరోగ్య నియమాలు పాటించడం, ఓటుహక్కు వినియోగం, వన్యప్రాణులను రక్షించడం, మూఢనమ్మకాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ పాటించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగం ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలోని కాగజ్నగర్ మండలంలోని మానిక్పటార్, తిర్యాణి మండలం గుండాల, దహెగాం మండలం మోట్లగూడ, పెంచికల్పేట్ మండలం మురళిగూడ, బెజ్జూర్ మండలం తలాయి, చింతలమానెపల్లి మండలం ఆడేపల్లి, కౌటాల మండలం గిన్నెలహెట్టి, సిర్పూర్(టి) మండలం పూసుగూడ, ఆసిఫాబాద్ మండలం పాడిబండ, వాంకిడి మండలం నవేగాం, జైనూర్ మండలం కిషన్నాయక్తండా, సిర్పూర్(యూ) మండలం పవార్గూడ, లింగాపూర్ మండలం కంచెన్పల్లి గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. నేడు జోడేఘాట్కు వెంకట్రెడ్డి రాకగత నెల 6న ప్రారంభమైన అక్షర చైతన్యయాత్ర సోమవారం ముగియనుంది. కెరమెరి మండలంలోని జోడేఘాట్లోని కుమురంభీం మ్యూజియంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ సలహాదారుడు వెంకట్రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా, డీఈవో యాదయ్య, డీడీ రమాదేవి, డీఎంహెచ్వో సీతారాం హాజరుకానున్నారు. గిరిజనుల్లో మార్పు కోసం ప్రతీ వ్యక్తికి అక్షరజ్ఞానం అవసరం. కానీ చాలా గ్రామాల్లో ఆదివాసీలు నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అలాంటి వారికి ఎంతో కొంత అవగాహన కల్పించాలని అక్షర చైతన్యయాత్రలు ప్రారంభించాం. 15 మండలాల్లో 90శాతం కనీస సౌకర్యాలు లేని, అధికారులు పర్యటించని గ్రామాలను గుర్తించి వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. మనిషి వెనుకబాటుతనానికి అక్షరజ్ఞానం లేకపోవడమే కారణం అని గ్రహించి ఆ దిశగా కార్యచరణ చేపట్టాను. ఈ యాత్రలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. – సుందిళ్ల రమేశ్, ఉపాధ్యాయుడు -
విద్యా సంక్షేమం కోసం కృషి
● ఎమ్మెల్యే కోవ లక్ష్మిఆసిఫాబాద్రూరల్: విద్యా సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో పీఎం జన్మన్ పథకంలో భాగంగా మంజూరైన వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం హాస్టల్ వసతి కోసం పీఎం జనమన్ పథకంలో రూ.2.30 కోట్లతో వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వసతిగృహాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని, జిల్లాలో విద్యా సంక్షేమ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇన్చార్జి డీఈవో కాకుండా రెగ్యూలర్ డీఈవోను కేటాయించాలని గతంలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా రెగ్యూలర్ డీఈవోను నియమించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎంఈవో సుభాష్, ఇంజనీరింగ్ సిబ్బంది కిరణ్ పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
కాగజ్నగర్టౌన్: దేశ వ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పా ల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ, ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ శతాబ్దికాలం నుంచి కార్మిక నాయకులు పోరాడి సాధించుకున్న 29 కార్మి క చట్టాలను సవరించి ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపడుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముంజం శ్రీనివాస్, రాజేందర్, ఆర్.త్రివేణి, ఎన్.పద్మ, కృష్ణమాచారి, శంకర్, చంద్రన్న, మాయ, రూప, శారద తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో సర్దుబాట్లు
● పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లకు డిప్యూటేషన్లు ● జూన్12లోపు ప్రక్రియ పూర్తి ఆసిఫాబాద్రూరల్: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 12లోపు పాఠశాలల్లో అవసరమయ్యే సర్దుబాటు, దిద్దుబాటు చర్యలు పూర్తి చేయనున్నారు. తద్వారా జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సమీపంలో అవసరమైన పాఠశాలకు డిప్యూటేషన్ ద్వారా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు అధికారాలు కలెక్టర్లకు కట్టబెట్టారు. సర్దుబాటు ఇలా..జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు టీచర్లు, 151 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. హైస్కూల్లో 200 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రతీ సబ్జెక్టుకు ఒక టీచర్, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం సబ్జెక్టుకు ఇద్దరు టీచర్లను కేటాయిస్తారు. గతేడాది డీఎస్సీ నియామకాలు, పదోన్నతులు జరిగినప్పటికీ జిల్లాలో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఈసారి అంతకుమించి సర్దుబాటు అవకాశాలున్నాయి. దీంతోపాటు అప్గ్రేడ్ అయిన బడుల్లో పోస్టులు లేకపోయినప్పటికీ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాశాఖాధికారి ప్రతిపాదిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదంతో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న టీచర్లను మైదాన ప్రాంతాలకు సర్దుబాటు చేయడానికి వీలులేదు. మైదాన ప్రాంతాల్లో పని చేసే వారిని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఇదీ పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థానిక సంస్థల యాజ మాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 729 ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు కలిపి 2,447 మంది టీచర్లు పని చేయాల్సి ఉండగా ప్రస్తు తం 2072 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నా రు. ఇంకా 375 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడా ది జిల్లా నుంచి 65 మంది స్పౌజ్ కేటగిరీలో ఇతర జిల్లాలకు వెళ్లారు. -
● మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ● చెన్నూర్ నుంచి అన్నయ్య తరువాత తమ్ముడికి అవకాశం ● ప్రేమ్సాగర్ రావు, వినోద్కు ఆశాభంగం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచే వివేక్కు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఊహాగా నాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మరో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, వినోద్ సైతం పోటీలో ఉండగా చివరకు అధిష్టానం వివేక్కే మంత్రి పదవి కట్టబెట్టింది. వివేక్ వర్గీయులు శనివారం నుంచే సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రిని కలిసిన నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు నీల య్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచ్లు కుమ్మరిసంతోష్, గట్టు లక్ష్మణ్గౌడ్, జేక శేఖర్, ప్రభాకర్, నాయకులు గుర్రం రాజన్న తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలకు చెందిన 1993 –94 బ్యా చ్కు చెందిన విద్యార్థులు ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవనంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసుకుని 31ఏళ్లు పూర్తి కాగా అందరూ ఒకే వేదికపై కలుసుకుని ఆనా టి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు రా జేంద్రప్రసాద్, బిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2005 –06 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మూతపడిన పాఠశాలను తెరిపించాలి
కాగజ్నగర్రూరల్: మండలంలోని వల్లకొండ గ్రా మంలో మూతపడిన మండల పరిషత్ పాఠశాలను వెంటనే తెరిపించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ప్రచారజాత కార్యక్రమంలో భా గంగా వల్లకొండ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో గతేడాది నుంచి పాఠశాల మూతపడి ఉండడంతో విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపించండం ఇబ్బందిగా మారిందన్నారు. టీఎస్ యూటీఎఫ్ నాయకులు కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయుడు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రచార జాతలో జిల్లా కార్యదర్శి రాజ్కమలాకర్ రెడ్డి, సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఫోన్ పోగొట్టుకున్నా.. పట్టేస్తారు!
● సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసుల ముందంజ ● ఉపయోగకరంగా సీఈఐఆర్ పోర్టల్ ● ఏడాదిలో 513 ఫోన్లు బాధితులకు అందజేతసాక్షి, ఆసిఫాబాద్: మీ ఫోన్ పోగొట్టుకున్నారా?.. అయితే భయపడాల్సిన పనేం లేదు. వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయండి. సాధ్యమైనంత త్వరగా ఫోను మీ చేతికందేలా జిల్లా పోలీసులు చర్యలు చేపడతారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు గుర్తించి రికవరీ చేస్తున్నారు. ఇలా కుమురంభీం జిల్లా పరిధిలో ఏడాది కాలంలో సుమారు 513 ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించారు. ఇవన్నీ రూ.10 వేల నుంచి రూ.40 వేల ఖరీదు చేసేవే. పోర్టల్ ఇలా పనిచేస్తుంది..మొదటగా సీఈఐఆర్ పోర్టల్ను ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్క్రైమ్ వింగ్ వీటన్నింటికీ నోడల్ కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పోర్టల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా(సీఐడీ) ఆధ్వర్యంలో నడుస్తోంది. పోగొట్టుకున్న బాధితులు.. తమ ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరు, ఆధార్ కార్డు వివరాలతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగానే.. ఈ వివరాలన్నీ సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తారు. కొత్త కార్డు వేయగానే.. ఆ వివరాలు పోర్టల్లో ప్రత్యక్షమవుతాయి. అవతలి వ్యక్తి ఎన్ని సిమ్లు మార్చితే, అన్ని వివరాలు కనిపిస్తాయి. సదరు ఫోన్ ఎవరి చేతిలో ఉంది.. ఏ రాష్ట్రంలో ఉందనే వివరాలన్నీ తెలిసిపోతాయి. పోలీసులు వాటిని రికవరీ చేసి కేసు నమోదైన స్టేషన్కు రప్పిస్తారు. 24 గంటల్లోనే ...సీఈఐఆర్ పోర్టల్ను వినియోగించి ఫోన్లను రికవరీ చేయడంలో ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఎవరైనా ఫోన్ పోగొట్టుకోగానే..ఆన్లైన్లోనూ ఎవరికివారే పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. కానీ తదనంతరం ఆ ఫోన్ వినియోగించే వారి వివరాలు తెలుసుకోవాలంటే నోడల్ కార్యాలయానికి వెళ్లక తప్పదు. అందుకే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. గతంలో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు నెల రోజులకు పైగా పట్టేది. పోర్టల్తో 24 గంటల్లోనే అవతలి వ్యక్తుల వివరాలన్నీ తెలుస్తున్నాయి. ఫోన్ పోతే బాధపడాల్సిన అవసరం లేదని, స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి అందజేస్తామని ఆసిఫాబాద్ ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ పేర్కొన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ఏర్పాటయ్యాక రికవరీ శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఏడాదిగా సీఈఐఆర్ పోర్టల్లో నమోదైన ఫోన్లు 1,382రికవరీ చేసి బాధితులకు అప్పగించినవి 513జిల్లా వివరాలు -
పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్
మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివా సంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారిద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందనే అంతా భావించారు. తీరా రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. -
విత్తనంపై దళారీ పెత్తనం!
కౌటాల: నకిలీ విత్తనాల దందా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు అక్కడక్కడా పట్టుకుంటున్నా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ఏటా వానాకాలంలో అత్యధికంగా 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి పంటలు సాగు చేస్తుంటారు. దీనిని ఆసరా చేసుకున్న దళారులు జిల్లాలో కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందాను మొదలుపెట్టారు. ఈ దందా జిల్లాలోని సరిహద్దు మండలాల్లో ‘మూడు విత్తనాలు.. ఆరు కాయలు’గా సాగుతోంది. దందా విషయం స్థానిక పోలీసులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏటా క్వింటాళ్ల కొద్ది నకిలీ విత్తనాల అమ్మకాలు సాగినా.. పోలీసులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో సుమారు రూ.కోటి విలువైన దాదాపుగా 3 వేల కిలోలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. దీంతో జిల్లాలో ఏస్థాయిలో నకిలీ విత్తనాల దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏటా దందా..!జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం రైతులను కలవర పెడుతోంది. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలు పొలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలో బీజీ–1, బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలనే ఆంక్షలు ఉన్నాయి. భూసారం దెబ్బతినడంతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో బీజీ–3 రకాలను నిషేధించారు. అయితే వీటిని దళారులు బీజీ–3 అయితే పంట దిగుబడి పూర్తయ్యేంత వరకు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, దిగుబడిసైతం బీజీ–2 కంటే 30 శాతం ఎక్కువగా వస్తుందని రైతులను నమ్మిస్తూ అంటగడుతున్నారు. జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్(టి), సరిహద్దు మండలాలు కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతుందని ఆరోపణలున్నాయి. నాణ్యమైన బీజీ–2 విత్తనాలే నాటాలని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై వ్యవసాయ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. రైతులను నమ్మిస్తూ.. నకిలీవి అంటగడుతూ.. యథేచ్ఛగా సాగుతున్న దందా మహారాష్ట్ర నుంచి జలమార్గంలో జిల్లాకు రవాణా పలుచోట్ల పట్టుబడుతున్న వైనం నాణ్యమైన విత్తనం ఎంచుకోవాలని అధికారుల సూచనజిల్లాలో ఇటీవల పట్టుబడిన కేసులు ఏప్రిల్ 2న చింతలమానెపల్లి మండలంలో ఎల్,బిక్షపతి వద్ద రూ.10.50 లక్షల విలువైన మూడు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు. బెజ్జూర్కు చెందిన కె.చంద్రశేఖర్ విజయవాడ నుంచి కాగజ్నగర్కు పార్శిల్గా నకిలీ విత్తనాలు తరలించారు. ఏప్రిల్ 4న కాగజ్నగర్ పట్టణంలో నవతా ట్రాన్స్ఫోర్ట్లో రూ.1.57 లక్షల విలువైన 45 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఏప్రిల్ 18న కాగజ్నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాల్లో రూ.3.50 లక్షల విలువైన 100 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మే7న పెంచికల్పేట్ మండలంలో రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిని అరెస్టు చేశారు. మే 24న కాగజ్నగర్ మండలం పెద్దవాగు సమీపంలో ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మే 25న బెజ్జూర్ మండలం సుశ్మీర్లో రూ.6 లక్షల విలువైన 170 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో ఈసారి రూ.90 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి నకలీ విత్తనాలు తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి నుంచి నది, రోడ్డు మార్గాల్లో జిల్లాకు తరలిస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. – రాణా ప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ నది మార్గాల్లో నకిలీ దందా..!ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దళారులు ఖరీఫ్ సీజన్కు ముందే నకిలీ విత్తనాలను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), తదితర మండలాల్లో సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందును పలు ప్రైవేట్ ట్రాన్స్ఫోర్టులు, లారీల్లో జిల్లాకు చేరవేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పలువురు దళారులు గోదాంలను ఏర్పాటు చేసుకుని నకిలీ విత్తనాలు నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి కౌటాల మండల సరిహద్దులోని వార్ధా, ప్రాణహిత నదుల మార్గాన నాటు పడవల్లో మండలాల్లోని సబ్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా ఏటా జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ కేవలం చిన్న మొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్న వారిని మినహా అసలు సూత్రధారులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఆయా శాఖల అధికారులకు దందా చేసే అసలు వ్యక్తులు తెలిసినప్పటికీ ‘మామూలు’గానే వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
చివరకు వివేక్కే..?
● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు ● ప్రేమ్సాగర్రావు, వినోద్ను పక్కన బెట్టిన అధిష్టానం ● ఆదివారం ప్రమాణ స్వీకారం.. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దా టింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీటముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గతేడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖరారు అయినట్లు తెలిసింది. ముగ్గురి మధ్య పోటీ..జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చె న్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పో టీ పడ్డారు. గాంఽధీభవన్ నుంచి ఢిల్లీ వరకు పీసీ సీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ము గ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. చివరకు అధిష్టానం వివేక్నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్సాగర్, వినోద్ కంగుతి న్నారు. అనుచరులు సైతం ఊహించని షాక్కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నా రు. వివేక్కు పదవీ రావడం వారికి మింగుడు ప డటం లేదు. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వ ర్గీ యులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతు న్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయన కు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానా లు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పద వి ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా స మీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణ లు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమో దం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో వ్యక్తి..చెన్నూర్ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జ నార్దన్ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. దీంతో చెన్నూర్ను మూడోసారి మంత్రి పదవి వరించనుంది. -
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అందరి బాధ్యత
రెబ్బెన: వినియోగదారులకు నాణ్యమైన బొ గ్గును అందించడం సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. శనివారం ఏరియా లోని కై రిగూడ ఓసీపీలో బొగ్గు నాణ్యతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించినప్పుడే సంస్థకు గుర్తింపు వస్తుందన్నారు. గనుల్లో నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లది కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి శంకర్, ప్రాజె క్టు ఇంజనీరు వీరన్న, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, సేఫ్టీ అధికారి రజనీ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోస్టర్ విధానం అమలు చేయాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో పని చేస్తున్న ఎస్టీ ఉద్యోగులకు ఖాళీల భర్తీ, పదోన్నతుల కోసం రోస్టర్ విధానం అమలు చేయాలని సింగరేణి ఎస్టీ చీఫ్ లైజన్ అధికారి కృష్ణయ్య తెలిపారు. రోస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ శ్రీరాంపూర్ ఏరియాలో శనివారం పర్యటించింది. జీ ఎం కార్యాలయంలో జీఎం ఎం శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రోస్టర్ రిజి స్టర్ను పగడ్బందీగా నమోదు చే యాలని సూ చించారు. కొన్ని పాయింట్స్కి సంబంధించి స లహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీ జీఎం(పర్సనల్) అరవిందరావు, కమిటీ అధ్యక్షుడు భాస్కర్రావు, జనరల్ సెక్రెటరీ నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పంతుల, ఏరియా ఎస్టీ లైజన్ అధికారి గుండేరావు, ఉపాధ్యక్షుడు మోహన్, నాయకులు హుస్సేన్నాయక్, రాజు నాయక్, డీవైపీఎం రాజేశ్వర్రావుపాల్గొన్నారు. -
మా ప్రాణాలకు దిక్కెవరు?
● టైగర్ జోన్ పేరిట అడవులనుంచి వెళ్లగొట్టే కుట్ర ● కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటన వెనక్కి తీసుకోవాలి ● జీవో 49 రద్దుకు కదం తొక్కిన ఆదివాసీలుఆసిఫాబాద్అర్బన్: టైగర్ కన్జర్వేషన్ రిజర్వు రద్దు కోసం ఆదివాసీలు కదం తొక్కారు. గత నెల 30న కుమురంభీం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించి జారీ చేసిన జీవో 49 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ‘పులులు వద్దు.. ప్రాణాలే ముద్దు’ అనే నినాదంతో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షకు జిల్లాలోని ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివచ్చారు. పులులు వద్దు–ప్రాణాలే ముద్దు..ఆదివాసీ సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్కుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ సిర్పూర్ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొని పులులు వద్దని ఆదివాసీల ప్రాణాలే ముద్దని నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ ఆదివాసీల గొంతు కోసేలా ఉన్న జీవోను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి శ్రీనివాస్, అర్జుమాస్టర్, పెఽందూర్ ధర్ము, జిల్లాలోని ఆదివాసీలు పాల్గొన్నారు. ఎస్పీ కాంతిలాల్ సుభాష్ ఆదేశాలతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జీవో 49 ఏమిటి.?పులుల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమురంభీం పులుల కన్జర్వేషన్ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ జీవో విడుదల చేశారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యా ణి, కాగజ్నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్లలో లక్ష 49వేల హెక్టార్ల ను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించినట్లు పేర్కొన్నారు. -
టైగర్జోన్ పేరుతో ఖాళీ చేయించే కుట్ర
ఆసిఫాబాద్రూరల్: టైగర్జోన్ పేరుతో గ్రా మాలను ఖాళీ చేయించే కుట్రలను ప్రజ లు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ గ్రామాలను ఫారెస్టు భూములుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కాగజ్నగర్ ప్రాంతాన్ని టైగర్జోన్గా ప్రకటించడం అన్యాయమన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్, టీకానంద్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ పాటించరా?
సాక్షి, ఆసిఫాబాద్: ‘ఆసిపాబాద్ నియోజకవర్గానికి ప్రథమ పౌరురాలిని. నా పట్ల జిల్లా కనీస గౌరవ మర్యాదలు పాటించడం లేదు. నన్ను పిలవకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నాయకులను ప్రభుత్వ కార్యక్రమాల కు ఆహ్వానిస్తున్నారు. గురువారం నాకు కనీస స మాచారం ఇవ్వకుండా రెబ్బెన మండలం ఇంద్రానగర్ పుంజిమరిగూడ హేబిటేషన్లో డీసీసీ అధ్యక్షు డు కొక్కిరాల విశ్వప్రసాద్ ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు పత్రాలు లబ్ధిదారులకు అందించారు. రెబ్బెన ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారు? అలాగే తిర్యాణి మండలంలోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనకు అధికారులు పాల్పడ్డారు. అనిల్గౌడ్ అనే వ్యక్తితో భూమిపూజ చేయించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ రెబ్బెన, తిర్యాణి ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్ చేయాలి.’ అంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. కంగుతిన్న పోలీసులుశుక్రవారం ఉదయం 11.45 గంటలకు తన బీఆర్స్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకుపోయి బైఠాయించారు. ఊహించని పరిణామంతో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీ సులు కంగుతిన్నారు. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు రావడంతో అడ్డుకోవడం వారి వల్ల కా లేదు. చివరకు కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఎమ్మెల్యే బైఠాయించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణమే సస్పెండ్ చేయాలిప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులను త క్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి నిరసనకు దిగడంతో కలెక్టరేట్లో కొ ద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. దాదాపు 4.25 గంటలపాటు కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం నాయకుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎమ్మెల్యే నిరసనకు దిగారన్న సమాచారంతో జైనూర్ మండల పర్యటనలో ఉన్న ఆర్డీ వో లోకేశ్వరరావు తొలుత కలెక్టరేట్కు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఆమె డిమాండ్లను సావధానంగా విని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఉన్నతాధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే అందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేయించారు. అ నంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ వచ్చేదాకా కదిలేది లేదని భీష్మించడంతో మధ్యాహ్నం తరువాత అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ వచ్చి ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందిర మ్మ ఇళ్ల అర్హుల జాబితా ఇప్పిస్తే వెళ్తానని మొండికేయడంతో అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలతో హౌసింగ్ డీఈ అర్హుల జాబితా ఎమ్మెల్యేకు అందించడంతో ఆమె శాంతించారు. ఆఫీసర్లపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్ పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ ముట్టడి ఉల్లంఘనుల సస్పెన్షన్కు డిమాండ్ లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక ప్రతిచర్యలుంటాయ్.. అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం ఇచ్చా క ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోతే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ప్రతిచర్యలుంటాయని హెచ్చరించారు. ప్రొటోకాల్ లేని అధికారపార్టీ నాయకులను ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించరాదని సూచించారు. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల ముగ్గులు, భూమిపూజ కార్యక్రమాలు తామే చేపడతామని, అధికారపార్టీ నాయకులు అ డ్డుకునే ప్రయత్నం చేస్తే వారి బొక్కలు విరగ్గొడతామని హెచ్చరించారు. అధికారులంతా ప్రొటోకాల్ పాటించేలా ఉత్తర్వులు ఇ వ్వాలని ఎమ్మెల్యే అదనపు కలెక్టర్కు సూచించారు. వారంలోపు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై కచ్చితంగా చర్యలుంటాయని అదన పు కలెక్టర్ డేవిడ్ ఎమ్మెల్యేకు హామీ ఇవ్వడంతో ఆమె నిరసన కార్యక్రమాన్ని విరమించారు. బీఆర్ఎస్కు చెంది న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగునీరు అందేలా చర్యలు
కాగజ్నగర్ రూరల్: జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ నీరు రైతులకు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపా రు. శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జి ల్లా కాగజ్నగర్ మండలంలోని జగన్నాథ్పూ ర్ ప్రాజెక్ట్ను కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిపై దృష్టిలో ఉంచుకుని భవిష్యత్లో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రాజెక్ట్ భౌతిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈనెల 9న కేంద్ర బృందం రానున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను పరిశీలించి నివేదిక రూపొందిస్తా రని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్ట్ పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. నీటి పారుదల శాఖ ఈఈ ప్రభాకర్, డీఈలు, ఏఈలు, కాగజ్నగర్ మండల నీటి సరఫరా శాఖ డీఈలు, ఏఈలు అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
● ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆసిఫాబాద్అర్బన్: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ హెచ్చరించారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, నేరా ల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ‘డయల్ 100’ ద్వారా వచ్చిన ఫోన్కాల్స్కు వేగంగా స్పందించి నేరాల ను నియంత్రించాలని సూచించారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. శనివారం నిర్వహించనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతీ పోలీ స్స్టేషన్ పరిధిలో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, సీఐ లు, ఎస్సైలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జోడేఘాట్ను సందర్శించిన ఎస్పీకెరమెరి: ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ శుక్రవారం జోడేఘాట్ను ఆదివాసీ నాయకులతో కలిసి సందర్శించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంను సందర్శించారు. ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ఆదివాసీ జిల్లా ప్రజల కోసం పని చేస్తానని, మారుమూల గిరిజన గ్రామాల్లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సాయం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు సత్యనారాయణ, రాణా ప్రతాప్, ఎస్సై మధుకర్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. -
మానవత్వంతో వ్యవహరించాలి●
బెజ్జూర్: అటవీశాఖ అధికారులు ప్రజలతో మానవత్వంతో వ్యవహరించాలని, కేసులు పెడతామని బెదిరిస్తూ అణిచివేయొద్దని బీఆ ర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీ ణ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెంటనే స్పందించి అటవీ అధికారులు రైతులను వేధించకుండా ఆదేశించాలని డిమాండ్ చేశా రు. సిర్పూర్ నియోజకవర్గంలో గంజాయి స రఫరా పెరిగిందని, యువత అప్రమత్తంగా ఉండి మహమ్మారిని ఇంట్లోకి రాకుండా జాగ్ర త్త వహించాలని కోరారు. ఇటీవల బెజ్జూర్ ఎస్సైపై దాడికి యత్నించిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప అనుచరులను చట్ట ప్రకారం శిక్షించా లని డిమాండ్ చేశారు. మర్తిడికి శివారులో చి న్నక్కకు చెందిన భూమిని అక్రమంగా పట్టా చేసుకుని మాజీ ఎమ్మెల్యే అండతో విక్రయించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. బెజ్జూర్ మండల కన్వీనర్ సారయ్య, యూత్ అధ్యక్షుడు కాశి పాక రాజు, నాయకులు హరి, వరలక్ష్మి, కమల, శంకర్ తదితరులున్నారు. -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
రెబ్బెన: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ ఆదేశించారు. మండలంలోని ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తేమశాతం తక్కువున్నా ధా న్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కొండపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పా టు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హా జరై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ప్రతీ సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ స దస్సుల ద్వారా భూసమస్యలు త్వరగా పరి ష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఆయన వెంట తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఏవో దిలీప్కుమార్, ఆర్ఐ సౌమ్య, ఏఈవో రాకేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అడెల్లు.. అమర్రహే!
● ముగిసిన ఉద్యమ ప్రస్థానం ● బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి ● మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే.. ● విషాదంలో పొచ్చెర గ్రామం ● మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులు బోథ్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రా ష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి మైలారపు అడెల్లు అ లియాస్ భాస్కర్ (53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీ స్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అ టవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు మృతి చెందాడు. ఉదయం నుంచి మావో యిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో తుదిశ్వాస విడిచాడు. బాల్యం నుంచి అభ్యుద య భావాలున్న అడెల్లు మరణవార్త ఆదిలాబాద్ జి ల్లాలోని పొచ్చెర గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది. అడెల్లు ప్రస్థానం ఇదీ.. అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతా రాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినా దం, పేదరికం అడెల్లును నక్సలిజం వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడె ల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలీ పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారీతనాన్ని తరచూ ప్రశ్నించేవాడు. విద్యాభ్యాసం.. బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నిర్మల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. రాడికల్ నుంచి దళంలోకి.. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో తిరుగు తూ ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనే 1995 ప్రాంతంలో నక్సలైటుగా మారాడు. దళంలో కి ప్రవేశించాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్ స్థా యికి ఎదిగాడు. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూ ర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజ న్ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్మెంట్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ఉమ్మడి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్, పెంబి, ఖానాపూర్, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. కంతి లింగవ్వతో వివాహం.. అడెల్లు దళంలో చేరిన సందర్భంలోనే అప్పటికే అందులో కొనసాగుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహమైంది. ఈ క్రమంలో ఇద్దరు కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలి గా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2022 డి సెంబర్లో లింగవ్వ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్లో మృతిచెందారు. అప్పటి నుంచి అడెల్లు చత్తీస్గఢ్ డీకే వెళ్లారని తెలుస్తోంది. ఎట్లున్నడో అనుకునేలోపే చేదు వార్త కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలని వారికి పట్టున్న అడవుల్లో కూంబింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్ రిజర్వు కన్జర్వేషన్తో ప్రతిబంధకాలు
అనుమతుల కోసం..బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించడానికి సింగరేణి యాజమాన్యం ఎంతోదూర దృష్టితో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా గోలేటి, మహావీర్ఖని ఓపెన్కాస్ట్ గనులను ప్రతిపాదించి పావులు కదుపుతున్నా ఇంకా అనుమతుల రాకకు కాలయాపన జరుగుతోంది. వాస్తవానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో గోలేటి ఓపెన్కాస్ట్గనిని ప్రారంభించాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ తీరుతో సింగరేణి యాజమాన్యం ఒకింత నిరాశతో ఉండగా, అనుమతులు వచ్చే ప్రస్తుత కీలక సమయంలో కుమురంభీమ్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ఏర్పడడంతో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రా యం కార్మిక వర్గం నుంచి వినిపిస్తోంది.బెల్లంపల్లి/తాండూర్: కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా ఆసిఫాబాద్, కాగజ్నగర్ అటవీ డివిజన్లు ‘టైగ ర్ కన్జర్వేషన్ రిజర్వు’గా రూపాంతరం చెందాయి. దీంతో బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్ఖని(ఎంవీకే) ఓపెన్కాస్టు ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతికి ప్రతి బంధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ హారాష్ట్ర ప్రాంతం నుంచి పులుల రాకకు ఆయా డివి జన్లు ప్రధాన కారిడార్గా ఉండగా ప్రస్తుతం ‘కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు’గా మార్చారు. ఈ మేరకు గత శుక్రవారం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఉత్తర్వులు జారీ చేశారు. 1492.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వులో 78 రిజర్వు బ్లాక్లు గుర్తించి నిర్ధారించా రు. మహారాష్ట్రలోని తడోబా–అంధేరి టైగర్ రిజర్వు నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వుకు కొంతకాలంగా పు లులు వలస రావడం తెలిసిందే. ఈ క్రమంలో తడోబా–కవ్వాల్ టైగర్ రిజర్వులకు వారధిగా ఉన్న ఆసిఫాబాద్–కాగజ్నగర్ అటవీ డివిజన్ల పరిధిలో పు లులు సంచారం చేస్తూ ఆవాసం ఏర్పాటు చేసుకో వడం ప్రాధాన్యతను సంతరించుకోగా.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి టైగర్ రిజర్వుతో అనుసంధానమయ్యే కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రి జర్వు ఎంతో ముఖ్యమైన కారిడార్గా అవతరించనుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉండడంతో గోలేటి, మహావీర్ ఖని ఓపెన్కాస్టు ప్రాజెక్టులకు సింగరేణి యాజమాన్యం కొన్నాళ్ల క్రితం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమై న అటవీ, పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తోంది. వాస్తవానికి గత ఏడాదిలోనే అనుమతి రావాల్సి ఉండగా కాలయాపన జరుగుతోంది. కనీసం ఈ ఏడాదైనా అనుమతి వ స్తుందనే ఆశతో ఉండగా ఆకస్మికంగా అటవీ శాఖ కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళనకు గురి చే స్తోంది. బొగ్గు గనులు అంతరించి మనుగడ కోల్పోయిన బెల్లంపల్లి ఏరియాలో గోలేటి, మహావీర్ ఖని ఓపెన్కాస్టు ప్రాజెక్టుల విస్తరణతో పూర్వ వైభవం వస్తుందనే భరోసాతో ఉండగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆసిఫాబాద్ అటవీ డివిజన్ పరిధిలో.. కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పరిధిలో ఆ సిఫాబాద్ అటవీ ప్రాంతం 57,564 హెకార్లలో విస్తరించి ఉంది. ఈ డివిజన్ పరిధిలో ఉన్న రెబ్బెన రేంజ్ పరిధి 14574.39 హెక్టార్లుగా గుర్తించారు. రెబ్బె న రేంజ్ పరిధిలో ఉన్న గోలేటి, మహావీర్ ఖని ఓపె న్కాస్ట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే తలంపులో సింగరేణి యాజమాన్యం ఉంది. గోలేటి ఓపెన్కాస్ట్ గని ఏర్పాటుకు 1358.26 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 673.26 హె క్టార్ల వరకు అటవీ భూమి ఉండగా మిగతా 685 హె క్టార్లు ప్రైవేట్, ప్రభుత్వ భూమిని సేకరించాలని ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మహావీర్ ఖని ఓపెన్కాస్ట్ కోసం సుమారు 811 హెక్టార్ల భూమిని సేకరించనుండగా ఇందులో 600 హెక్టార్ల వరకు అ టవీ, మరో 211 హెక్టార్ల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. రెబ్బెన అటవీ రేంజ్ పరిధి లోని ఆయా ప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గనుల ప్రాంతంలో కొంతకాలంగా పులులు సంచరిస్తుండడంతోపాటు జంతువులను వధించడం జ రుగుతోంది. పులుల ఆవాసానికి ఈ ప్రాంతం ఎంతో కీలకమైనదిగా అటవీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇబ్బందులు ఉండకపోవచ్చుకొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్ ఓపెన్కాస్ట్ గనుల ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు రావాల్సి ఉంది. వీటి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా గోలేటి ఓపెన్కాస్ట్ గనికి అనుమతి సత్వరంగా వస్తుందనే ఆశతో ఉన్నాం. ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాం. కొత్తగా ఏర్పాటైన కుమురంభీమ్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వుతో ప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గనుల అనుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. – విజయభాస్కరరెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎంప్రతిపాదిత ఓపెన్కాస్ట్ గనుల ప్రొఫైల్ ఓసీపీ గని పేరు విస్తరణకు ప్రతిపాదించిన గనులు బొగ్గు నిక్షేపాలు బొగ్గు గ్రేడ్ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం గని జీవిత కాలం గోలేటి గోలేటి–1, 1ఏ, బీపీఏ ఓసీపీ 62 మి.టన్నులు జీ–10, జీ–11 3.5 మి.టన్నులు 18ఏళ్లు సుమారు మహావీర్ ఖని ఎంవీకే –1, 2, 3, 4, 5, 6 40 మి.టన్నులు జీ–10 2.8 మి.టన్నులు 12 ఏళ్లు సుమారు -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
కౌటాల: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. గురువారం మండలంలోని పార్డీ గ్రామంలో నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సును ఆయన సందర్శించి దరఖాస్తుల ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకునే అ వకాశం ఉందన్నారు. రైతులు రెవెన్యూ సదస్సుల్లో తమ భూ సమస్యలపై వివరంగా దరఖాస్తులు స మర్పించాలని, రికార్డులను సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను కేటగిరీల వారీగా రిజిస్టర్లలో నమోదు చేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన..కౌటాల మండలం సాండ్గాంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పిస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు. జాప్యం లేకుండా వరి ధాన్యం తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ప్రమోద్, సహకార శాఖ జిల్లా అధికారి బిక్కు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సును పరిశీలించిన సబ్కలెక్టర్సిర్పూర్(టి): తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా మండలంలోని చింతకుంట గ్రామంలో తహసీల్దార్ రహీముద్దిన్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. గురువారం కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధాశుక్లా రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్ -
ఆదివాసీలు ఇబ్బందులు పడకుండా చూడాలి
ఆసిఫాబాద్అర్బన్: అటవీశాఖ నిబంధనలతో ఆది వాసీలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపి, కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం దీక్షా శిబిరంలో మాట్లాడుతూ అటవీ ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కిందిస్థాయి సిబ్బంది పెట్టే ఇబ్బందులతో జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పాపన్నపేట, గంగాపూర్ గ్రామాల్లో బోర్వెల్ వేసే పరిస్థితి లేదని, జిల్లా ఇన్చార్జి మంత్రి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వం జీఓ నం.49 తీసుకొచ్చి టైగర్ రిజర్వుగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది అమల్లోకి వస్తే నిర్భందం మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్రిజర్వు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు పట్టించుకోకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క దృష్టి సారించాలి ఆదివాసీల రిలేదీక్షలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప -
కరాటే శిక్షణలో ప్రతిభ
కాగజ్నగర్టౌన్: డ్రాగన్ కుంఫు ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కాగజ్నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్, జిల్లా డ్రాగన్ కుంఫు క్లబ్ ప్రధాన కార్యదర్శి చాపిడి కుమార్ తెలిపారు. పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మైదానంలో గురువారం నిర్వహించిన పోటీల్లో రఘువర్షన్, సువర్ణలత, అద్విత, సాయిసంకీర్తనలు ఆరెంజ్ బెల్టు సాధించారని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు కర్ణాటకలో జరుగనున్న గిన్నీస్ రికార్డు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
కొందరికే భరోసా!
రెబ్బెన: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుభరోసా పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులు పంటల సాగు పెట్టుబడుల కోసం నానాపాట్లు పడుతున్నారు. సాగుకు యోగ్యమైన భూములకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అందజేయాలని భావించింది. అయితే యాసంగి పంటల సీజన్ పూర్తయ్యి వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందలేదు. కేవలం కొంతమంది రైతులకు మాత్రమే సాయం అందగా వేలాది మంది రైతులు రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఆశల్లో రైతులు..గత యాసంగి సీజన్లో రైతులపై ప్రకృతి కన్నెర్ర చే సింది. అకాల వర్షాలతో అన్నదాతలకు రావాల్సి న దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పంటలకు తెగుళ్లు, చీడపీడలు ఆశించి పంటలను దె బ్బతీశాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు అధికాసార్లు మందులు పిచికారీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడిసాయాన్ని అందించి ఉంటే పంటల పెట్టుబడులకు ఎంతో కొంత ఉపశమనం లభించేదని రైతులు పేర్కొంటున్నారు. ఎట్టకేలకు యాసంగి సీజన్ ముగియగా ఆ శించిన స్థాయిలో పంట దిగుబడులు రాక చాలా మంది రైతులు నష్టపోయారు. ప్రస్తుతం రైతులు వానాకాలం పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తిదే అగ్రస్థానం. ఇప్పటికే రైతులు భూముల్లో దు క్కి పనులు పూర్తిచేసి విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలకరి వర్షాలు పడగానే విత్తనాలు విత్తాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అయినా ప్రభుత్వం రైతుభరోసా అందిస్తే విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడిసాయం డబ్బులు ఆసరాగా ఉంటాయని రైతులు ఆశపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కౌలురైతులుకౌలురైతులకు కూడా పంటల సాగుకు పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా నేటికీ కౌలురైతులకు అందజేసే పెట్టుబడిసాయంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు పెరుగుతున్న భూముల కౌలుధరలు, మరోవైపు పెరిగిన విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలతో కౌలురైతులు కుదేలవుతున్నారు. పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలురైతులకు సైతం పెట్టుబడిసాయం, బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.పత్తి చేనులో నాగలి దున్నుతున్న రైతు (ఫైల్) యాసంగిలో 87,062 మంది రైతులకే సాయం ఇంకా అందించాల్సిన పెట్టుబడి సాయం రూ.131.97 కోట్లు ఇప్పటికే మొదలైన వానాకాలం సాగు పనులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అన్నదాత తిప్పలు43,373 మంది రైతులకు అందని సాయంజిల్లాలోని రైతులు సుమారు 4.35లక్షల ఎకరాల్లో ఏటా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సాగుకు యోగ్యంగా ఉన్న భూములు, రైతుల వివరాలను సేకరించిన అధికారులు రైతుభరోసా పథకం కింద జిల్లాలో 1,30,435 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు చెల్లించగా ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా ద్వారా ఎకరానికి రూ.6వేలు చొప్పున రెండు సీజన్లు కలిపి రూ. 12వేలు యాసంగి సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతులకు ముందుగా ఆపై ఎక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతులకు పెట్టుబడిసాయాన్ని అందించాలని, ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు గల రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో ఇప్పటివరకు 87,062 మంది రైతులకు గానూ రూ.93,95,12,916లు డబ్బులు జమ చేసింది. నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు నేటికీ పెట్టుబడిసాయం అందలేదు. జిల్లాలో ఇంకా 43,373 మంది రైతులకు పెట్టుబడిసాయం కింద రూ.131.97 కోట్లు జమ కావాల్సి ఉంది. ఆందోళన అవసరం లేదు ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడిసాయం కింద నాలుగు ఎకరాల వరకు ఎకరానికి రూ. 6వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసింది. మిగిలిన రైతులకు ఇంకా జమకావాల్సి ఉన్న మాట వాస్తవమే. ఎందుకు జమ చేయలేదో సమాచారం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులందరికీ పెట్టుబడిసాయం అందుతుంది. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
● ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ఆసిఫాబాద్అర్బన్: జిల్లావాసులకు నిరంతరం అందుబాటులో ఉండి, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని నూతన ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. ఇదివరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన డీవీ శ్రీనివాస్రావు మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో పాటిల్ కాంతిలాల్ సుభాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ క ట్టుబడి ఉంటుందని, పౌరుల రక్షణ పోలీసుల ప్ర ధాన లక్ష్యమన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా మతపర దూషణలకు పాల్పడినా, సామాజిక మాధ్యమాల్లో చెడు ప్రచారం చేసినా, ఇతరుల మనోభావాలకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2020 ఐపీఎస్ బ్యాచ్..పాటిల్ కాంతిలాల్ సుభాష్ 2020 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. 2022లో పాటిల్ కాంతిలాల్ భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీగా పని చేశారు. 2023 జనవరి నుంచి 2024 జూలై వరకు నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీగా, 2024 జూలై నుంచి హైదరాబాద్ సౌ త్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. ప్ర స్తుతం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. -
సాంకేతిక విద్య మిథ్య..!
● జిల్లాలో కానరాని పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ● ఉద్యోగావకాశాలు కోల్పోతున్న విద్యార్థులు ● విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ తిర్యాణి: జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి సాంకేతిక విద్య ఒక ఆయుధంలా పని చేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి విపరీతమైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విద్య అందించే ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో ఉన్న ఏకై క ప్రైవేట్ ఐటీఐ కళాశాల మినహా మరెక్కడా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు లేకపోవడం విద్యారంగంలో జిల్లా వెనుకబడిన తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉద్యోగ అవకాశాలు..ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ), పా లిటెక్నిక్ కోర్సుల ద్వారా విద్యార్థులు తక్కువ స మయంలోనే ఉద్యోగావకాశాలు పొందే అవకా శం ఉంది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం ఒకేఒక్క ప్రైవేట్ ఐటీఐ కళాశాల మాత్రమే ఉంది. ప్రభుత్వానికి చెందిన సాంకేతిక కళాశాలలు లేకపోవడంతో ఉన్నత చదువులు చదివే స్థోమత లేక జీవి తంలో తొందరగా స్థిరపడాలనుకునే విద్యార్థుల కు అందుకు అనువైన అవకాశాలు లేకుండా పో తున్నాయి. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదవా లంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానికంగా ఉన్న సింగరేణి సంస్థ వేతనంతో కూడిన శిక్షణ (అప్రెంటిషిప్) ఇవ్వడానికి ముందుకు వస్తోంది. ఆర్టీసీ వంటి అనేక సంస్థలు కూడా ఐటీఐ విద్యార్థులకు తమ సంస్థల్లో అవకాశాలు కల్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అంతే కాకుండా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంతంగా పరిశ్రమ పెట్టుకుని స్వయం ఉపాధితో స్థిరపడే అవకాశం ఉన్నందున ఐటీఐ వంటి కోర్సులు చేసేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా విద్యార్థులకు ప్రయోజనం..వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. స్థానికంగా కళాశాలలు లేకపోవడంతో ఇతర జి ల్లాలకు వెళ్లి ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసిస్తున్నారు. కాగా జిల్లాలో 2024 –25 విద్యా సంవత్సరానికి గాను 6వేలకు పైగా మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ సాంకేతిక కోర్సుల్లో చేరడానికి అర్హత ఉంటుంది. వీరితో పాటు ఇంటర్ చదివిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. కాగా ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, ఉట్నూర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నప్పటికీ దూరభారంతో పాటు సీట్లు కూడా సరిపోక జిల్లా విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. విద్యారంగం అభివృద్ధి చెందాలి విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించాలి. జిల్లాలో సాంకేతిక కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల సాధనకు విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యమై దశలవారీగా ఉద్యమాలు చేపడుతాం. – జగజంపుల తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
విద్యారంగంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫీజుల దోపిడీ అరికట్టాలని గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పరిస్థి తి అధ్వానంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు వెలిశాయని, వాటిల్లో ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో టై, బెల్ట్, పుస్తకాలు విక్రయిస్తూ విద్యాసంస్థల్లో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సమీర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
● సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణరావుజైపూర్: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, లేనిపక్షంలో మానవ మనుగడ సాధ్యం కాదని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరా వు తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మ ల్ పవర్ ప్లాంటులో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వీస్ భ వనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడానికి బాధ్యతగా మొక్కలు నాటాలని, కర్బన ఉద్గారాలను తగ్గించాలని కోరారు. ఎస్టీపీపీలో ఏటా మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు. ప్లాంటు ఆవరణలో భూగర్భ జలమట్టం పెంచడానికి నీటి బిందువు–జల సిందువు కార్యక్రమం ద్వారా ఐదు మినీ చెరువులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్టీపీపీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ సెక్రెటరీ సంతోష్కుమార్, ఏజీఎంలు మురళీధర్, మదన్మోహన్, పవర్మేక్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎంలు అజాజుల్లాఖాన్, తుకారాం, వాసుదేవమూర్తి, ఫారెస్టు మేనేజర్ చంద్రమణి పాల్గొన్నారు. మొక్కలు నాటిన న్యాయమూర్తిబెల్లంపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కన్నాల శివారులోని నూతన కోర్టు ఆవరణలో బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యా యమూర్తి జే.ముఖేష్ గురువారం న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్, పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
● ఏఎస్పీ చిత్తరంజన్ఆసిఫాబాద్అర్బన్: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 300 మొక్కలు నాటామన్నారు. కేవలం చెట్లు మాత్రమే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మానవాళికి మేలు చేస్తాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కౌమార బాలికలకు శక్తినిచ్చేలా..
● ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం ● పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా గుర్తింపు ● అంగన్వాడీల ద్వారా పోషకాలతో కూడిన ‘చిక్కీ’ల పంపిణీ ● జిల్లాలో 18,230 మంది గుర్తింపు వాంకిడి: కౌమార దశలోని బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఆడ పిల్లలకు శక్తినిద్దాం..ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో బాలికలకు పోషకాహారం అందించేలా ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని 14 నుంచి 18 ఏళ్ల వయస్సు గల కౌమార దశ బాలికలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురవుతున్నారని గుర్తించి పోషకాలతో కూడిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయనుంది. బాలికల్లో అత్యధికంగా రక్తహీనత కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని పథకాన్ని ప్రయోగాత్మకంగా మే 29న ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి విధి విధానాలను అప్పగించింది. అంగన్వాడీల ద్వారా పంపిణీ.. జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 18,230 మంది కౌమార దశ బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పథకం ద్వారా వీరందరికి పోషకాలతో కూడిన చిక్కీలు అందించనుంది. పథకంలో భాగంగా బాలికలకు ఆరోగ్యం, స్వయం ఉపాధి వంటి పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అంశాలు.. ● పోషకాహారం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ● రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 చిక్కీలు ఇస్తారు. నెలలో రెండుసార్లు (15 రోజులకు ఒకసారి) పంపిణీ చేస్తారు. ● ఒక్కో చిక్కీలో సుమారు 600 కెలరీలు, 18–20 గ్రాముల ప్రొటీన్లు, అవసరమైన సూక్ష్మపోషకాలు ఉంటాయి.జిల్లా వివరాలు మండలం అంగన్వాడీ కౌమార కేంద్రాలు బాలికలు ఆసిఫాబాద్ 126 2,127 రెబ్బెన 69 1,125 తిర్యాణి 65 869 జైనూర్ 76 1,301 లింగాపూర్ 45 647 సిర్పూర్(యూ) 54 688 కాగజ్నగర్ 130 3,086 దహేగాం 43 833 బెజ్జుర్ 41 998 చింతలమానెపల్లి 43 1,080 పెంచికల్పేట్ 52 555 కౌటాల 52 1,240 సిర్పూర్(టి) 45 909 కెరమెరి 84 1,287 వాంకిడి 79 1,485 మొత్తం 973 18,23018,230 మంది బాలికలకు అమలు జిల్లాలో 18,230 మంది కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని జిల్లాలో ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ వారంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తాం. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
నర్సరీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
రెబ్బెన: రెబ్బెన ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నర్సరీలో పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. పలుమార్లు అధికారులు, డీఎఫ్వో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వేతనాలు అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఏడాదికాలంగా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నారన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డీఎఫ్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు దశరథ్, చిన్నక్క, సరిత, సుమలత, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సహాయ నిధి పేదలకు వరం
బెజ్జూర్: సీఎం సహాయ నిధి పేదలకు వరంలాంటిదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బెజ్జూర్ మండలానికి చెందిన కమెరా నిమ్మబాయి, అంకుబాయి, కొరేత శ్రీశైలంకు మంజూరైన సుమారు రూ.60వేల చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆస్పత్రుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్థన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విశ్వేశ్వర్రావు, మాజీ సర్పంచ్ కొండ్ర జగ్గాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లా వ్యాప్తంగా 81 వాహనాలు ● ‘ఫిట్నెస్’ పొందినవి 31 మాత్రమే ● ఆసక్తి చూపని యాజమాన్యాలు ● సీజ్ చేస్తామంటున్న అధికారులు ● ఈ నెల 12 నుంచి స్కూళ్లు షురూ..
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించడంలేదన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరం పునఃప్రారంభానికి గడువు సమీపిస్తోంది. మరో వారంరోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల సామర్థ్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మే 15తోనే గడువు ముగిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 81 బస్సులు.. జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు చేరవేసేందుకు 81 బస్సులను వినియోగిస్తున్నాయి. ఫిట్నెస్ ఉంటేనే ఆ బస్సు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ సంవత్సరం మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణాశాఖ అధికారుల వద్ద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాహన సామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది కొన్ని బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించారు. ఫిట్నెస్ చేయించని బస్సులు జూన్ 12 నుంచి రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 81 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉండగా కేవలం 31 బస్సులకు మాత్రమే చేయించుకున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 50 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. ఫిట్లెస్ బస్సులు రోడ్లపైకి వస్తే అనుకోని ప్రమాదాలు సంభవించి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు సైతం.. తమ పిల్లలను బస్సుల్లో పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు నెలకోసారి వాహనంలో ప్రయాణించాలి. బస్సు కండీషన్, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా? లేదా? అనే విషయం గమనించాలి. పరిశీలించిన వివరాలను అధికారులకు తెలియజేయాలి. బస్సులో సమర్థవంతమైన డ్రైవర్, క్లీనర్, అటెండర్ ఉన్నారా? లేదా పరీక్షించుకోవాలి. ఫిట్నెస్ పత్రాలు లేకుండా ఫిర్యాదు చేయాలి. ఇంటి నుంచి బస్టాప్ వరకు పిల్లలతో వచ్చి బస్సు ఎక్కించాకే తిరిగి ఇంటికి వెళ్లాలి. బస్సులు, ఆటోలు ఇతర వాహనాల్లో పిల్లలను పంపించినప్పుడు ఎక్కువ మందిని కూర్చోబెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న విషయాన్ని మర్చిపోరారు. జిల్లా వివరాలు ప్రైవేటు పాఠశాలలు 107 విద్యార్థుల సంఖ్య 30,662 బస్సులు 81 ఫిట్నెస్ చేయించిన బస్సులు 31 చేయించాల్సిన బస్సులు 50 ఫిట్నెస్ లేకుంటే సీజ్చేస్తాం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని ఇదివరకే యాజమాన్యాలకు తెలియపరిచాం. ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను తరలించే బస్సులను సీజ్ చేస్తాం. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఇతర వాహనాలనూ సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్ రద్దు చేస్తాం. జూన్ 12లోపు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. – గద్దె మోహన్, ఎంవీఐ నిబంధనలు ఇవే.. స్కూల్ బస్సుకు తప్పనిసరిగా పసుపు కలర్ వేయించడంతో పాటు నాలుగువైపులా పాఠశాల పేరు రాయించాలి. డ్రైవర్కు నాలుగు సంవత్సరాల సీనియార్టీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ వివరాలను జిల్లా రవాణశాఖ అధికారులకు తెలియజేయాలి. డ్రైవర్ కచ్చితంగా యూనిఫాం కలిగి ఉండాలి. బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు. మూడు నెలలకోసారి డ్రైవర్కు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. విండ్ స్క్రీన్, వైపర్, లైటింగ్స్, మెకానికల్ కండీషన్ పనితీరును రిజిస్టర్లో రాయాలి. బడి బస్సుల పార్కింగ్ కోసం విద్యాలయాల ప్రాంగణంలో ప్రత్యేక స్థలం కేటాయించాలి. పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సుకు ఒక అటెండర్ను నియమించాలి. సీటింగ్ కన్నా ఎక్కువ మంది విద్యార్థులను తరలించడం నిషేధం. -
పర్యావరణ దినోత్సవంపై సమీక్ష
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో గురువారం ని ర్వహించనున్న ప్రపంచ పర్యావరణ వేడుకల నిర్వహణపై బుధవారం ఏరియా ఎస్వోటూ జీఎం రాజమల్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అఽధిపతులకు వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏరియా ఇంజినీరు రామనాథం, డీజీఎం కృష్ణమూర్తి, ఎస్కే మదీనా బాషా, సీహెచ్పీ ఇన్చార్జి కోటయ్య, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణరెబ్బెన: సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సింగరేణి పరిసర ప్రాంత యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి చదివి 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. గ్యాస్ చార్జింగ్(ఏసీఅండ్ ఫ్రిజ్)కు 15 రోజులు, ఏసీ ఇన్స్టాలేషన్, వాటర్ ప్యూరిఫయర్ రిపేర్కు 30 రోజులు, ఫ్రిజ్, వాషింగ్ మిషిన్, డిష్ వాషర్, ఏసీ రిపేర్, ఇన్స్టాలేషన్ అండ్ గ్యాస్ చార్జింగ్ కోసం 90 రోజులు, ఎల్టీవీ, ఎల్ఈడీ మానిటర్, మైక్రో ఓవెన్, వాటర్ ప్యూరిఫయర్ అండ్ బేసిక్ హెచ్ఏ రిపేర్, ఇన్స్టాలేషన్ కోసం 90 రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల యువతీ, యువకులు ఈనెల 20 సాయంత్రం 5 గంటల్లోగా గోలేటిలోని జీఎం కార్యాలయంలో గల పర్సనల్ డిపార్టుమెంట్లో లిఖిత పూర్వక దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలకు 9951214116 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆసిఫాబాద్అర్బన్: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయుష్ జిల్లా డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మహేష్, శిల్ప, నరేందర్రెడ్డి, వనిత, సిబ్బంది శంకర్, గౌతమి, శ్రీలత, సరిత, యోగా టీచర్ వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు రోహన్, దీపిక జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. బుధవారం పాఠశాల అవరణలో పీడీ తిరుపతితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 30న మధ్యప్రదేశ్లో జరిగిన నెట్బాల్ సబ్ జూనియర్ జాతీయస్థాయి పోటీల్లో సదరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించారన్నారు. పునరావాస కేంద్రానికి తరలించాలి ఆసిఫాబాద్అర్బన్: కెరమెరి మండలంలోని దేవుడుపల్లి గ్రామాన్ని పునరావాస కేంద్రానికి తరలించాలని జాతీయ మానవ హక్కుల కమిటి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ 14 ఏళ్లక్రితం కుమురం భీం ప్రాజెక్టు(ఆడ) ముంపు ప్రాంతంగా గుర్తించి వారికి పరిహారం అందజేయడంతో పాటు మరోచోట 14 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. కానీ నేటికీ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయలేదన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు కూలిపో యే పరిస్థితి ఉందని, పునరావాస కేంద్రంలో పనులు పూర్తిచేసి అందులోకి తరలించాలన్నారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జైనూర్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం మండలంలోని లేండిగూడ ఏటవాలు వంతెనను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మిషన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణుల వివరాలు సేకరించి ప్రసూతి సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉపాధి హమీ పనుల్లో భూగర్భ జలాలు పెంచే విధంగా రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఎంపీవో మోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనులు పారదర్శకంగా చేపట్టాలి
కౌటాల: ఉపాధి హామి పనులు పారదర్శకంగా చేపట్టాలని డీఆర్డీవో బి.దత్తారావు అన్నారు. బుధవారం కౌటాల రైతు వేదికలో 14వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు కౌటాల మండలంలో ఉపాధి హామి పథకంలో 2024–25లో చేపట్టిన పనుల వివరాలు చదివి వినిపించారు. కౌటాల మండల వ్యాప్తంగా రూ. 7,50,12,778 నిధులతో ఉపాధి హామి పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో అధికారులు రూ.1.50 లక్షల నిధుల రికవరీ చేయగా సిబ్బందికి రూ.30 వేల పెనాల్టీ వేశారు. ఉపాధి హామి సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఎంపీడీవో బి.రమేశ్, ఎంపీవో మహేందర్రెడ్డి, ఏపీఎం ముక్తేశ్వర్, ఏపీవో పూర్ణిమ, ఈసీ సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు వైద్యసౌకర్యం మెరుగుపర్చాలి
రెబ్బెన: సింగరేణి కార్మికులకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని, మెడికల్ బోర్డు నిర్వహించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఫ్రధాన కార్యాలయం ఎదుట బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు ఏరియాకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రావు మాట్లాడుతూ సింగరేణి ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బందిని, స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ డైరెక్టర్ (పా) వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ దారావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ కమిటీ నాయకులు సమ్మయ్య, కై రిగూడ పిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
టైగర్జోన్ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఆదివాసీల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకువస్తున్న కాగజ్నగర్ టైగర్ జోన్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకో వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆదిమ గిరిజన భూరక్షణ పోరాట కమిటీ, రాజ్గోండ్ సేవా సమితి, గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆరోరోజుకు చేరింది. దీక్ష శిబిరా న్ని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించి సంఘీభా వం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. టైగర్జోన్ పేరుతో ప్రభుత్వం భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించా రు. టైగర్ జోన్ ఏర్పడితే ఆదివాసీల జీవితాలు ఛి ద్రమవుతాయని తెలిపారు. పోడు సాగు చేస్తున్న రై తులపై కాంగ్రెస్ ప్రభుత్వల అటవీశాఖ అధికారులతో అక్రమ కేసులు పెట్టిస్తోందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు తాను అండగా ఉంటానని, ఇప్పటికై నా అధికారులు గిరిజనుల హక్కులకు అడ్డుకునే ప్ర యత్నం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించా రు. కుమురంభీం పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యంగా దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘం నాయకులు సిడాం అర్జు, బుర్స పోచయ్య, మడావి శ్రీనివాస్, పెందూర్ సుధాకర్, బీఆర్ఎస్ నాయకుడు రవీందర్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
పెంచికల్పేట్: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి సూచించారు. మంగళవారం పెంచికల్పేట్ జెడ్పీఎస్ఎస్ ఆవరణలో ఎంపీడీవో అధ్యక్షతన సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీ టి సరఫరా, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై చర్చించారు. ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ పౌడ ర్ వాడకం, నీటి లీకేజీల నివారణకు మార్గదర్శకాలు జారీ చేశారు. డ్రెయినేజీల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ‘డ్రై డే’ పాటించాలని, బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్, తహసీల్దార్ పుష్పలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ హసీనా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్షీన్ పాల్గొన్నారు. -
పేదోళ్లకు ‘బెస్ట్’ స్కూళ్లు
● జిల్లాలో రెండు పాఠశాలల ఎంపిక ● నిరుపేద ఎస్సీ విద్యార్థులకు వరం ● ఈ నెల 16వరకు దరఖాస్తు గడువు ● లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల కేటాయింపు కౌటాల: నిరుపేద ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో రెసిడెన్షియల్, నాన్రెసిడెన్షియల్ సౌకర్యాలతో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత విద్యతోపాటు వసతులు కల్పిస్తోంది. జిల్లాకు రెండు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఇవ్వడంతో ఇవి జిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశాల కోసం అధికారులు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా..జిల్లా కేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఈ నెల 16లోపు జిల్లా ఎస్సీ కార్యాలయంలో అందజేయా లి. ప్రవేశాల కోసం ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్ కార్యాలయంలో లక్కీ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా ఎస్సీ కార్యాలయం లేదా బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎన్నికైన ఆయా పాఠశాలలను సంప్రదించాలని సూచించారు. ప్రవేశాల కోసం అర్హతలివే..బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉంటుంది. జిల్లాకు చెందిన వి ద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు 01.06.2019 నుంచి 31.05. 2020 మధ్య జన్మించి ఉండాలి. 01.06.2025 నాటికి 5–6 ఏళ్లలోపు ఉండాలి. 2024–25 విద్యాసంవత్సరంలో నాలుగోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాలవారికి వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.2లక్షల వరకు) మీ సేవ ద్వారా 01.04.2025 తర్వాత పొంది ఉండాలి. జత చేయాల్సిన పత్రాలివే..విద్యార్థులు దరఖాస్తు ఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. జనన ధ్రువీకరణ పత్రం (మీ సేవా ద్వారా పొందింది), ఆధార్కార్డు, మూడు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు (మీ సేవ ద్వారా పొందినవి), తెల్ల రేషన్కార్డు, నాలుగో తరగతి మార్కుల జాబితా, బోనఫైడ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలి. స్వదినియోగం చేసుకోవాలి జిల్లాలోని నిరుపేద ఎస్సీ వి ద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప థకం కింద ఎంపికై నవారికి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తాం. అర్హులు ఈ పథకాన్ని స్వదినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయం లేదా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను సంప్రదించాలి. – యాదగిరి, మయూరి విద్యాలయ కరస్పాండెంట్, కౌటాల లక్కీ డ్రా ద్వారా ఎంపిక జిల్లాలోని ఎస్సీ సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 16లోపు దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యాలయంలో ఇ వ్వాలి. 20న కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తాం. వివరాలకు 63096 74769 నంబర్లో సంప్రదించాలి. – సజీవన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారిపేద ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనంజిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని కాగజ్నగర్లోని విశ్వశాంతి హైస్కూల్, కౌటాలలో ని మయూరి విద్యాలయాన్ని బెస్ట్ అవైలబు ల్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ప్రవేశాల కోసం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో (రెసిడెన్షియల్) 40 సీట్లు, ఒకటో తరగతిలో (నాన్ రెసిడెన్షియల్) 38 సీట్లు కేటాయించారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.పేద ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనంజిల్లాలోని నిరుపేద ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని కాగజ్నగర్లోని విశ్వశాంతి హైస్కూల్, కౌటాలలోని మయూరి విద్యాలయాన్ని బెస్ట్ అవైలబుల్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ప్రవేశానికి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో (రెసిడెన్షియల్) 40 సీట్లు, ఒకటో తరగతిలో (నాన్ రెసిడెన్షియల్) 38 సీట్లు కేటాయించారు. నాలుగో తరగతి పాసైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
వైద్యకళాశాల విద్యార్థులకు శుద్ధజలం
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలల వి ద్యార్థులకు శుద్ధజలం అందిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మంగళవారం అంకుసాపూర్లో వైద్యకళాశాలను అదనపు కలెక్టర్ దిపక్ తివారీ, డీఎంహెచ్వో సీతారాంతో కలిసి సందర్శించారు. శుద్ధజల ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం ఇ టీవల పొరుగు సేవల్లో ఎంపికై న 52 మంది ధృవపత్రాలు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆ హారం, బోధన అందించాలని సూచించారు. కళాశాలలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరి ష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఆస్పత్రి పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లాలో ఈ నెల 6నుంచి 19వరకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో డీఈవో యాదయ్యతో కలిసి సంబంధిత అధికా రులతో సమావేశమై మాట్లాడారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని తెలిపారు. ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మాస్టర్ మైండ్స్ ద్వారా నిర్వహించనున్న ఆన్లైన్ తరగతుల పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్వోలు శ్రీనివాస్, మధుకర్, అబిద్ అలీ, డివిజన్ పంచా యతీ అధికారి ఉమర్ హుస్సేన్ తదితరులున్నారు. -
విత్తన ఎంపికే కీలకం
● అధికారుల సూచనలు పాటించాలి ● విత్తనాలు అధిక ధరకు అమ్మొద్దు ● ‘నకిలీ’వి విక్రయిస్తే కఠనచర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఏడీఏ మిలింద్ఆసిఫాబాద్రూరల్: పంటల సాగులో విత్తనాల ఎంపికే కీలకమని ఏడీఏ మిలింద్ సూచించారు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానా లు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని పేర్కొన్నారు. రైతులు చిన్న వానలకే తొందరపడి పత్తి విత్తనాలు వేయొద్దని తెలిపారు. సరైన వర్షపాతం నమోదయ్యాకే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారు ల సలహాలు, సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశముంటుందని వివరించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వానాకాలం సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో ఈ ఖరీఫ్లో ఏయే పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి? ఏడీఏ: జిల్లాలో 4,45,049 ఎకరాల సాగుభూమి ఉంది. 1.48 లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో పత్తి 3,35,363 ఎకరాలు, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, పెసర, మినుములు, జొన్న, కూరగాయలు తదితర పంటలు 22,395 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాక్షి: విత్తనాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు మీరిచ్చే సూచనలు? ఏడీఏ: రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. పంటకాలం పూర్తయ్యేదాకా దా నిని భద్రంగా దాచి ఉంచాలి. గ్రామంలోనే తక్కువ డబ్బులకు లూజ్ విత్తనాలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. లూజ్ విత్తనాలు ఎవరైనా అమ్మితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి. సాక్షి: జిల్లాలోని కొన్ని దుకాణాల్లో పత్తి విత్తనాలు, యూరియా, ఇతర ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి? ఏడీఏ: ప్రభుత్వం పత్తి ప్యాకెట్ ధర రూ.901 గా నిర్ణయించింది. ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే మా దృష్టికి తీసుకువస్తే కఠినచర్యలు తీసుకుంటాం. యూరియాను రూ.266 విక్రయించాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టు ఖర్చులు ఇవ్వడం లేదు. దీంతో ట్రాన్స్పోర్టు చార్జీ కింద అదనంగా రూ.20 వరకు మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా ఇంతకంటే కంటే ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయాలి. సాక్షి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు మీరిచ్చే సలహాలు ఏమిటి?ఏడీఏ: రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ఎకరా పత్తి పంటకు రెండు యూరియా, ఒక డీఏపీ, ఒక పొటాష్ బస్తాలు సరిపోతాయి. పంటకాలంలో నాలు గుసార్లు వేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మోతాదులో వాడితే పెట్టుబడి ఖర్చు పెరగడమే గాని అదనపు ప్రయోజనం ఉండదు. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే, పంట మార్పిడి విధానం పాటిస్తే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సాక్షి: వరి నార్లు ఎప్పడు పోసుకోవాలి? ఏడీఏ: నీటి వసతి ఉన్నవారు వరి నారు పోసుకో వచ్చు. ఆసిఫాబాద్ మండలంలో ప్రతీసారి వరిని ఆలస్యంగా సాగు చేస్తున్నారు. జూన్ చి వరి వారం లేదా జూలై మొదటి వారంలో వరి నాట్లు పూర్తయ్యేలా చూసుకోవాలి. సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేసి పూత దశలో కలియ దున్ని వరి నాటు వేసుకుంటే భూ మిలో సారం పెరుగుతుంది. పంటల దిగుబడి కూడా అధికంగా వస్తుంది. -
ఇక కన్జర్వేషన్!
కారిడార్ ● ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో చర్యలు ● పులుల సంరక్షణ ప్రాంతంగా మార్పు ● భవిష్యత్లో కొత్త టైగర్జోన్కు అవకాశం ● పులుల పేరుతో ఆంక్షలపై స్థానికుల వ్యతిరేకతసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పులులకు ప్రధాన కారిడార్గా ఉన్న ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లు ‘టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్’గా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోనే పులుల రాకపోకలకు కీలకంగా ఉంది. దీంతో పులు ల సంరక్షణకు వీలు కలగనుంది. ఉమ్మడి జిల్లా పరిధి ఆసిఫాబాద్లో అధికంగా పులుల సంచారం పెరుగుతోంది. అయితే వీటి సంరక్షణ చర్యలు చేపట్టినా, పరిమిత అధికారులు మాత్రమే ఉండేది. తా జాగా టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేయడంతో పులు ల సంరక్షణకు మరిన్ని ప్రత్యేక కార్యకలాపాలు చే యాల్సి ఉంది. ఏదైనా ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్గా గుర్తించాలంటే ముందుగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, కన్జర్వేషన్ రిజర్వ్గా కొనసాగుతున్న వాటికే అనుమతి ఇస్తుంది. భవిష్యత్లో కేంద్రం నుంచి కొత్తగా టైగర్ రిజర్వ్గా ఏర్పాటుకు అవకాశం కలగనుంది. నివాసాలుకాగజ్నగర్ డివిజన్ నుంచి బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, జన్నారం వరకు పులుల సంచారం ఉంటోంది. మొదట అధికారులు జన్నారం కోర్ ప్రాంతంగా టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులు పులుల ఆవాసానికి అనుకూలంగా లేకపోవడంతో చుట్టపు చూపులా వచ్చి వెళ్తూ.. నివా సం ఏర్పాటు చేసుకోవడం లేదు. మరోవైపు ప్రాణ హిత, పెద్దవాగు, గోదావరి తీరాల్లో కాగజ్నగర్ నుంచి చెన్నూరు, బెల్లంపల్లి డివిజన్ల వరకు పులుల సంచారం పెరుగుతోంది. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్లో కాగజ్నగర్, పెంచికల్పేట్, బెజ్జూరు, దహెగాం, పరిధిలో పులుల నివాసాలు ఉన్నాయి. ఇక వేమనపల్లి, చెన్నూరు, కోటపల్లి పరిసరాల్లోనూ వాటి సంచారం ఉంది. కోర్ ప్రాంతంగా ఉన్న క వ్వాల్ వరకు వెళ్లకపోగా ఇక్కడే స్థిర నివాసం ఎక్కువగా ఏర్పర్చుకుంటున్నాయి. పాల్గుణ అనే ఆడపులి సంతతితోపాటు కే, ఎస్, పీ, ఏ సిరీస్ పేర్లతో ఉన్న పులులన్నీ ఇక్కడి పరిధిలోనివే. పులులు జతకట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. కాగా, వేట, మానవ కార్యకలాపాలతో జాతీయ జంతువులకు ముప్పు పొంచి ఉంది. రక్షణకు పకడ్బందీ చర్యలుఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ అభయారణ్యంలో బఫర్ ఏరియాలో కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లా ఉంది. 1.40లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణంతో ఉన్న రెండు డివిజన్లలో ఈ టైగర్ కన్జర్వేషన్గా మార్చడంతో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పులులు సంచరించే ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు పూర్తిగా తగ్గించడంతోపాటు పలు నిషేధిత ఆజ్ఞలు అమలులో ఉండనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వేటా డడం, విద్యుత్ కంచెలు అమర్చడం, వన్యప్రాణులకు హాని తలపెట్టే వీలు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.స్థానికుల వ్యతిరేకతఉమ్మడి జిల్లా పరిధిలో కవ్వాల్ కోర్ గ్రామాలతోపాటు సంచారం అధికంగా ఉన్న కారిడార్ ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలతోపాటు గిరిజన, ఆది వాసీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించినప్పటికీ నిరసనలు ప్రారంభమయ్యాయి. పోడు రైతులతోపా టు రెవెన్యూ పరిధిలో ఉన్న చోట్ల కూడా పులుల సంచారంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు తమ రోజువారీ కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తుందనే కన్జర్వేషన్ ఉత్తర్వులు ఎత్తివేయాలని డిమాండ్లు చేస్తున్నారు. కన్జర్వేషన్గా మార్పుపై కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్(ప్రాజెక్టు టైగర్) శాంతారామ్ను సంప్రదించగా, స్థానికంగా తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిపారు. పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలి
కౌటాల: వరి ధాన్యాన్ని పకడ్బందీగా కొనుగోలు చే యాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా సూచించారు. మండలంలోని సాండ్గాం గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చే సిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ ప్రమోద్, నిర్వాహకులున్నారు. యోగా శిక్షణ కేంద్రం ప్రారంభంకౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా, ధ్యాన శిక్షణ కేంద్రాన్ని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ప్రారంభించారు. కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఐ రమేశ్, ఎంపీడీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, ట్రస్ట్ చైర్మన్ వరలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు సురేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండలాధ్యక్షుడు కుంచాల విజయ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దుర్గం మోతీరాం, పతంజలి జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, యోగా శిక్షకుడు వినోద్గౌడ్, నాయకులు నాందేవ్, భూమయ్య, అశోక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా చే పట్టనున్న గోలేటి ఓసీపీలో ముంపునకు గుర య్యే భూముల రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సోనాపూర్ గ్రామస్తులు బుధవా రం హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాంకు వినతిపత్రాలు ఇ చ్చారు. ఎకరాకు రూ.60లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీ సుకోవాలని కోరారు. సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లింపుల విషయంలో అ న్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించా రు. ముంపునకు గురయ్యే భూముల మార్కె ట్ విలువ రూ.60లక్షలు ఉండగా, రిజిస్ట్రేషన్ విలువ రూ.2.25లక్షలుగా చూపిస్తూ రూ.7.5 లక్షలు చెల్లించి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ డిమాండ్లను అంగీకరించకుంటే సింగరేణికి భూములు ఇవ్వమని చెప్పారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేస రి ఆంజనేయులుగౌడ్, గ్రామపటేల్ దొందేరావు, సిడాం తిరుపతి, మధూకర్గౌడ్, రైతులు భగవంత్రావు, సదయ్య, అనంతరావు, నవీన్, లక్ష్మణ్, భుజంగరావు, తిరుపతి, సాగర్, శంకర్, రమేశ్, శ్రీనివాస్ ఉన్నారు. -
పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
పెంచికల్పేట్(సిర్పూర్): పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని జైహింద్పూర్ గ్రామంలో అటవీ అధికారుల తీరుకు నిరసనగా పంట చేలలో నిరసన చేస్తున్న రైతులతో సోమవారం మాట్లాడారు. ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ప్లాంటేషన్ పేరుతో అటవీ అధికారులు సాగు భూములను లాక్కుంటున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు దీక్ష చేస్తున్న సమీపంలో అక్కడే ఉన్న బెజ్జూర్ ఇన్చార్జి రేంజ్ అధికారి శ్రావణ్కుమార్తో ఆయన మాట్లాడారు. అటవీ అధికారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రైతులతో పాటు అటవీశాఖ అధికారులు పోడు భూముల నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ సర్పంచులు సుధాకర్, చంద్రమౌళి, నాయకులు రాజన్న, కృష్ణ, సదాశివ్, లస్మయ్య, శంకర్గౌడ్, ఉమామహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరిలోనే విత్తనోత్పత్తి
నాణ్యమైన విత్తనాలతో రైతులకు మేలు కాగజ్నగర్రూరల్: నాణ్యమైన విత్తనాలతో రైతులకు మేలు జరుగుతుందని, లాభసాటి వ్యవసాయం చేసుకోవచ్చని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు అన్నారు. మండలంలో ని వంజీరి రైతువేదికలో తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన రైతులకు నాణ్యమైన వరి, కంది, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రైతులు విత్తనాలు సంప్రదాయ పద్ధతిలో సేకరించుకునేవారన్నారు. విత్తనోత్పత్తి కోసం రైతులకు ప్రభుత్వం విత్తనాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏవో శ్రీనివాస్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డి నేటర్ శివకృష్ణ, శాస్త్రవేత్తలు తిరుపతి, వ్యవసాయాధికారులు రామకృష్ణ, మనోహర్, ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.దహెగాం(సిర్పూర్): సాగుకు అత్యంత కీలకమైన నాణ్యమైన విత్తనం కోసం అన్నదాతలు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఏటా విత్తన ధరలు పెరుగుతుండటంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు నకిలీ విత్తనాల బెడదతో దిగుబడి రాక ఏటా వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నాణ్యమైన విత్తనం– రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పథకాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్ లాంఛనంగా ప్రారంభించి పదిమంది రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించారు. మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో, ఎంపిక చేసిన రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్నారు. ఈ వానాకాలం సీజన్లో వారు విత్తనోత్పత్తి చేసి మరో ఏడాది ఇతర రైతులకు అందించనున్నారు. సొంతంగా విత్తనోత్పత్తి అన్నదాతలు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీలర్లు చెప్పిన కంపెనీల విత్తనాలను విత్తుకోవడంతో ఆశించిన దిగుబడి రావడం లేదు. దిగుబడి రాని సమయంలో ప్రైవేట్ కంపెనీలు స్పందించి పరిహారం అందించడంలేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. రైతులు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ఉత్తమ మార్గమని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ‘నాణ్యమైన విత్తనం– రైతునేస్తం’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది గ్రామాల్లో కొందరు రైతులను ఎంపిక చేసి విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించనున్నారు. 1,203 మంది ఎంపిక.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నాణ్యమైన విత్తనం– రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామం నుంచి ముగ్గురు రైతులను ఎంపిక చేశారు. విత్తనోత్పత్తి కి నాణ్యమైన విత్తనాల పంపిణీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,203 మంది రైతులను విత్తనోత్పత్తికి ఎంపిక చేశారు. వీరికి మంగళవారం నుంచి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలు 401 కిట్లు, పెసర 402 కిట్లు, కంది విత్తనాలు 400 కిట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు పంటలకు సంబంధించిన విత్తనాలు ఇవ్వనున్నారు. ‘నాణ్యమైన విత్తనం– రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం జిల్లాలో 1,203 మంది రైతులు ఎంపిక నేటి నుంచి గ్రామాల్లో పంపిణీరైతులకు లాభసాటిమూల విత్తనం ద్వారా సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఈ సీజన్లో ప్రభుత్వం అందించే విత్తనాలను సాగు చేసి వచ్చే ఏడాది సహచర రైతులకు అందిస్తారు. ఈ విత్తనాలను ఐదు సీజన్ల వరకు సాగుకు వాడుకోవచ్చు. రైతులకు నకిలీ విత్తనాల బెడద ఉండదు. విత్తనాలు సొంత గ్రామంలోనే లభించడంతో విత్తన కంపెనీలపై ఆధారపడడం ఉండదు. వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. – మనోహర్, ఏడీఏ -
రెగ్యులర్ అధికారులను నియమించాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో రెగ్యులర్ అధికా రులను నియమించాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. జిల్లాలో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్చార్జీల పాలన కొనసాగుతుందన్నా రు. డీఈవో, డీఎండబ్ల్యూవో, డీబీసీడబ్ల్యూవో, డీఎస్వో, డీఐఈవో ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు అందరూ ఇన్చార్జీలే ఉన్నారన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జి ల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు శ్రావణి, నిఖిల్, మంజూల పాల్గొన్నారు. -
రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదాం
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సింగరేణిలో పనిచేసే ప్రతిఒక్కరూ పునరంకితమవ్వాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారితోపాటు కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్ నిర్వహించారు. బెలూన్లు పైకి ఎగురవేశారు. జీఎం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ పాత్ర ఎంతో కీలకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, కై రిగూడ పీవో నరేందర్, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి గోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికారులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్కట్ చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు జీఎం బహుమతులు అందించారు.ఉత్తమ ఉద్యోగిని సన్మానిస్తున్న జీఎం, తదితరులు -
మత్తు వదలరా..!
మంచిర్యాలక్రైం: జిల్లాలో గంజాయి దందాపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, ఈ చీకటి వ్యాపారం తగ్గడం లేదు. గంజాయి మత్తులో యువత దాడులకు తెగబడటం, బెదిరింపులతో డబ్బులు లాక్కోవడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జిల్లాను గంజాయి రహితంగా మార్చడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అయినా క్షేత్రస్థాయిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్న ప్యాకెట్లలో గంజాయి రవాణా, విక్రయాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.యువతే లక్ష్యంగా వ్యాపారం..పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను గంజాయి స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివే యువత నుంచి రోడ్లపై తిరిగే యువకుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి సేవనంతో కలిగే ఆరోగ్య సమస్యలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక బాధ్యతగా, మత్తులో ఉన్న యువతను సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు వివిధ చర్యలు చేపడుతున్నారు.సోషల్ మీడియా వేదిక..సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారింది. గంజాయి సేవించే వారు వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని, కోడ్ భాషలో సమాచారం పంపుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 100 గ్రాముల ప్యాకెట్లను రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తూ, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య నిర్దిష్ట ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నారు. శ్రీరాంపూర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, కాలేజీ రోడ్, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్, జాఫర్ నగర్, అండలమ్మ కాలనీ, తిలక్నగర్, బైపాస్ రోడ్ వంటి ప్రాంతాలు గంజాయి అమ్మకాలకు అడ్డాలుగా మారాయి. గతంలో గంజాయి వాడకం మాస్ ఏరియాలకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు క్లాస్ ఏరియాల్లోనూ జోరుగా సాగుతోంది.సిగరెట్లలో గంజాయి..పట్టణ కేంద్రాల్లోని పాన్ షాపులు, టీ స్టాల్స్ వద్ద గంజాయిని సిగరెట్లలో దాచి రహస్యంగా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్ గంజాయి సిగరెట్ల విక్రయ కేంద్రంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. రోజూ వందల మంది యువత ఇక్కడికి వచ్చి, కోడ్ భాషలో గంజాయి సిగరెట్లను కొనుగోలు చేస్తున్నారు.పెరుగుతున్న బానిసలు..పోలీసు లెక్కల ప్రకారం, జిల్లాలో గంజాయి వా డకం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణ ప్రా ంతాలకే పరిమితమైన గంజాయి వాడకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి వ్యసనం యువతను సామాజిక, ఆరోగ్య సమస్యల వైపు నడిపిస్తోంది. పోలీసులు ఈ వ్యసనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలతో పాటు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి దందా పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు.ట్రాకింగ్ డాగ్స్తో తనిఖీలుగంజాయి వాసన పసిగట్టే ట్రాకింగ్ డాగ్స్ సాయంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్థుల ఇళ్లు, పాన్ షాపుల్లో రాత్రిపగలు తేడా లేకుండా తనిఖీలు చేస్తున్నారు. అయినా, కచ్చితమైన సమాచారం లే నప్పుడు గంజాయి విక్రయాలను నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే 20 వరకు 30 కేసులు నమోదు కావడం, 95 మంది నిందితులను అరెస్ట్ చేయడం జిల్లాలో దందా ఏరీతిని సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి దందా నడిపిన 22 మంది ముఠాను పట్టుకుని, 23.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా, రూ.10.37 లక్షల విలువై న 34 కిలోల గంజాయిని ఈ ఏడాది స్వా ధీనం చేసుకున్నారు.రంగంలోకి ట్రాకింగ్ డాగ్స్..గంజాయి విక్రయాలు, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖ గంజాయి నియంత్రణకు నార్కోటిక్ టీమ్లను ఏర్పాటు చేసింది. స్పెషల్గా గంజాయి నియంత్రణకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ట్రాకింగ్ డాగ్స్ను వినియోగిస్తున్నాం. జిల్లాకు అధికంగా మహారాష్ట్ర నుంచి వస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పోలీసులకు గంజాయి సమాచారం అందించి నియంత్రణకు కృషి చేయాలి. యువతను పేడదోవ పట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని అడెపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. బాబాసాగర్ గ్రామం నుంచి ట్రాలీ వాహనం కాగజ్నగర్ వైపు వెళ్తుండగా, కాగజ్నగర్ నుంచి ముంజంపల్లి వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో బోల్తా పడగా, ట్రాలీ వాహనం రోడ్డు కిందకు పడిపోయింది. ఆటో డ్రైవర్ డుబ్బుల అంజన్న తలకు గాయాలు కాగా, ట్రాలీ డ్రైవర్ దీపక్కు స్వల్ప గాయాలయ్యాయి. అంజన్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఇస్లావత్ నరేశ్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు నిజాయతీ చాటుకున్నారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్కు వెళ్లే బస్సులో శనివారం ప్రయాణించిన అక్రమ్ బేగం అందులోనే తన బ్యాగు మర్చిపోయింది. గుర్తించిన కండక్టర్ వి.రమణ, డ్రైవర్ ఎం. గులాబ్ ఆ బ్యాగును డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్కు అప్పగించారు. వివరాలు తెలుసుకున్న డిపో అధికారులు సదరు మహిళకు ఆదివారం బ్యాగు అందించారు. అందులో 12 గ్రాముల బంగారం ఒక సెల్ఫోన్, రూ. వెయ్యి నగదు ఉన్నట్లు ప్రయాణికురాలు పేర్కొన్నారు. సిబ్బంది, యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
వర్షాకాలం.. పశువులు పైలం
చెన్నూర్రూరల్/ లక్ష్మణచాంద: వర్షాకాలం ఆరంభమైంది. ఈసారి ముందస్తుగానే వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు కూడా మొ దలయ్యాయి. మరోవైపు అకాల వర్షాలకు నేల కూడా పచ్చబడింది. లేదగడ్డి పశువులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో, పశువులకు అంటు వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉందని కత్తెరసాల, లక్ష్మణచాంద పశువైద్యాధికారి సతీశ్, ఓంప్రకాశ్ సూచించారు. పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు సంబంధించిన సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స విధానాలు వెల్లడించారు. గాలిపుండు (ఫుట్రాట్) వ్యాధి లక్షణాలు: వర్షాకాలంలో చిత్తడి నేలలపై తిరిగే మేకలు, గొర్రెలకు గాలిపుండు వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వల్ల గొర్రెలు కుంటుతూ, మూడు కాళ్లపై గెంటుతాయి. గిట్టల మధ్య ఎర్రగా కందిపోయి, చీము పట్టి నల్లగా మారుతుంది. తీవ్రమైతే గిట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది. నివారణ చర్యలు వ్యాధి సోకిన పశువులను వెంటనే గుర్తించి, ఆరోగ్యవంతమైన వాటికి దూరంగా ఉంచాలి. చిత్తడి నేలలు, నీరు నిలిచే ప్రాంతాల నుంచి పశువులను దూరంగా ఉంచాలి. వర్షం నుంచి రక్షణ కల్పించే ఆరు ప్రాంతాల్లో పశువులను ఉంచాలి. చికిత్స తర్వాత నయమైన పశువులను మాత్రమే ఆరోగ్యవంతమైన వాటితో కలపాలి. చికిత్స విధానం వైద్యుని సలహాతో పెన్సిలిన్, నొప్పి నివారణ మందులు వాడాలి. వ్యాధి సోకిన గిట్టలను 10% ఫార్మలిన్ లేదా కాపర్సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి. నీలి నాలుక వ్యాధి (బ్లూ టంగ్ డిసీజ్) వ్యాధి లక్షణాలు: నీలి నాలుక వ్యాధి, వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఈవ్యాధి విస్తరణ అవకాశం ఎక్కువ. లక్షణాలు: అధిక జ్వరం, చొంగ కారడం, పెదవులు, చిగుళ్లు వాచడం, ఎర్రటి గుల్లలు ఏర్పడడం. తీవ్ర సందర్భాల్లో గిట్టలు వాచి, నాలుక నీలం రంగులోకి మారుతుంది. పశువులు నడవలేక, మేత మేయక, అచేతన స్థితికి చేరి కిందపడిపోతాయి. నివారణ చర్యలు: ఈగలు, దోమల నివారణకు రోజుకు రెండుసార్లు వేప ఆకులతో పొగ వేయాలి. బురద, నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రం చేయాలి. చికిత్స విధానం పశువైద్యుడిని సంప్రదించి, యాంటీబయోటిక్, నొప్పి నివారణ మందులు వాడాలి. నోటి పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, జింక్ పౌడర్ రాయాలి. గిట్టల పుండ్లకు హామాక్స్, లేమనెంట్ వంటి ఆయింట్మెంట్లు వాడాలి. చిటుకు వ్యాధి.. తొలకరి గడ్డిలో క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డి అనే రకం సూక్ష్మజీవులు ఉంటాయి.ఈ సూక్ష్మ జీవులు గాలి లేని వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. తొలకరి పిచ్చి గడ్డిని జీవాలు తిన్నప్పుడు జీవాల పేగుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడి అక్కడ సూక్ష్మజీవుల వల్ల ఏర్పడిన విష పదార్థాల వల్ల ఈ చిటుకు వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన గొర్రెలు కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆకస్మికంగా మరణిస్తాయి. కొన్ని ఎగిరి కిందపడి కాళ్లు కిందకు కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ చనిపోతాయి. వ్యాధి సోకిన గొర్రెలు చొంగ కారుస్తాయి. శ్వాస అధికంగా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... చికిత్స కంటే నివారణ ముఖ్యం. మే నుంచి జూలై వరకు వ్యాధినిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశు వైధ్యాధికారికి తెలియ చేసి చికిత్స చేయించాలి. తొలకరి చినుకులకు మొలిచిన గడ్డి మేయకుండా చూసుకోవాలి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేయాలి. -
విద్యార్థినికి సన్మానం
ఆసిఫాబాద్అర్బన్: జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన దీపికను గాండ్ల తేలికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జాతీయస్థాయిలో పోటీల్లో దీపిక తెలంగాణ తరుఫున పాల్గొన డం గర్వకారణమన్నారు. ఆడపిల్లలను క్రీడల్లో ప్రో త్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నాందేవ్, పోచ న్న, దిలీప్, రాజశేఖర్, రవీందర్, ప్రవీణ్, ఆనంద్రావ్, శ్రీకాంత్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
ఆసిఫాబాద్రూరల్: తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమా రి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎంఈవో సుభాశ్, సంఘం నాయకులతో కలిసి యూ టీఎఫ్ బడిబాట ప్రచార జాతను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బడి బాధ్యత మనదే అనే సంకల్పంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బడిబాట జాత నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 36 పాఠశాలలు మూతబడినట్లు సమాచారం ఉందని, వి ద్యార్థులు ఉన్నచోట వాటిని తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ పరిధిలోని బాబాపూర్ తండాలో పదేళ్ల క్రితం పాఠశాల మూతపడిన విషయం తె లుసుకుని, గ్రామంలో ఇంటింటికీ తిరిగి 15 మంది విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించామని తెలిపారు. డీఈవో యాదయ్య దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి, పాఠశాలను పునఃప్రారంభిస్తామని తెలిపా రు. కార్యక్రమంలో ఎస్వో మధుకర్, యూటీఎఫ్ నాయకులు ఇందురావు, రమేశ్, హేమంత్, రాజకమలాకర్ రెడ్డి, తిరుపతి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్నగర్లో నీటి కటకట
● 20 రోజులుగా నిలిచిన భగీరథ నీటి సరఫరాఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్ కాలనీలో 20 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీవాసులు కిలోమీటర్ దూరంలోని పెద్దవాగు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలుషిత నీటితో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. టీఆర్నగర్ కాలనీలో 120 కుటుంబాలకు కేవలం ఒకే చేతిపంపు ఉంది. గంటల తరబడి నీటికోసం చేతిపంపు వద్ద నీటి కోసం వేచిచూడాల్సి రావడంతో కూలీ పనులకు వెళ్లలేకపోతున్నారు. కాలనీలో మరో బోర్ ఉండగా, మోటార్ చెడిపోయింది. ప్రతీ సారి తామే డబ్బులు జమ చేసి మరమ్మతులు చేయించుకుంటున్నామని, ప్రస్తుతం చెడిపోయిన మోటార్ను ఇప్పటికీ అధికారులు బాగు చేయించలేదని కాలనీవాసులు తెలిపారు. భగీరథ నీటిని సరఫరా చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు. -
విత్తనంపై అప్రమత్తం!
● ‘నకిలీ’తో జాగ్రత్త ● తక్కువ ధరను చూసి మోసపోవద్దు ● రైతులకు సూచిస్తున్న అధికారులు జిల్లాలో వానాకాలం సాగు అంచనాతిర్యాణి: సాధారణంగా రోహిణి కార్తె ఆరంభంతోనే వానాకాలం సాగుకు సంబంధించిన సీజన్ ప్రారంభమైనట్లుగా భావిస్తాం.. అలాంటి రోహిణి కార్తె ప్రారంభమై దాదాపు వారం రోజులు కావస్తోంది. దీంతో రైతులు వానాకాలం పంటల సాగుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే మెజార్టీ రైతులు తమ వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసి ఉంచారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండడంతో పలు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లో తిరుగుతూ తమ విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. జాగ్రత్తలు పాటించాలివానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మో సం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ మండలాల్లో వందల సంఖ్యలో నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు అధికారులకు పట్టుబడ్డాయి. ఈ నేపధ్యంలో విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి సరైన విత్తనాలు ఎంపిక చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే నాణ్యత లేని విత్తనాలు, పేరు, ఊరు లేని వాటిని సైతం మంచివేనని అంటగట్టే కొందరూ వ్యాపారులు ఉంటారు. కాగా విత్తనాల స్థితిగతులను గమనించని రైతులు వాటిని కొనుగోలు చేసి ఏటా నష్టాలబారిన పడుతున్నారు. అంతేకాకుండా వర్షాలు కురియడం మొదలైందంటే చాలు అన్నదాతల్లో ఒకరకమైన హడావుడి మొదలవుతుంది. సమీపంలోని ఫర్టిలైజ ర్ షాపులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుంటా రు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తక్కువ ధరకు నాణ్యతలేని విత్తనాలను అమ్ముతుంటారు. అయితే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు అస్కారం ఏ ర్పడుతుంది. కాగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఎంపికపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటుగా వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా ఉండేందుకు తరచూ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల ఎంపికపై క్షేత్రస్థాయిలో ఏఈ, ఏఈవోలు రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. – జాడి మిలింద్ కుమార్, ఏడీఏ, వ్యవసాయశాఖ పంటరకం ఎకరాలు పత్తి 3,35,363 వరి 56,861 కంది 30,430 ఇతర పంటలు 22,395ఎంపిక ఇలా.. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తున్నాయని ప్రైవేటు వ్య క్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దు.. విత్తనాల ప్యాకెట్పై లాట్ నంబర్, కంపెనీ పేరు, డేట్ ఆఫ్ ప్యాకింగ్, లేబుల్, విత్తన మొలక శాతం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత షాపు నుంచి రశీదును పొందాలి. గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయవద్దు. లూజ్ విత్తనాలకు దూరంగా ఉండాలి. రశీదుతో పాటు విత్తన ప్యాకెట్ కవర్ను ఇంట్లో భద్రపర్చుకోవాలి. తద్వారా పంట నష్టపోయిన సమయంలో పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. దుకాణాల్లో లేదా ప్రైవేటుగా నకిలీ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలి. -
సైక్లింగ్తో ఆరోగ్యం
ఆసిఫాబాద్అర్బన్: నిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆర్ఎస్ఐ రాజేశ్, గిరిజన క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు అన్నారు. ఈ నెల 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లు పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం సాధించడం, పర్యావరణ పరీరక్షణకు తోడ్ప డటం లక్ష్యంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా– సండేస్ ఆన్ సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అత్యాపత్యా ఇండియా కోచ్ కడ్తల రాకేశ్, శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ‘ఉపాధి’ కూలీల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉపాధిహామీ కూలీలు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలకు పని ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, కూలీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. వేసవి భత్యం చెల్లించాలని, పనిముట్లు అందించాలని, ఖాళీలు ఉన్నచోట సీనియర్ మేట్లను ఎఫ్ఏలుగా నియమించాలన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న డీఆర్డీవో దత్తారావు కూలీలకు వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిందిస్థాయి అధికారులకు ఇప్పటికే మెమోలు జారీ చేశామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కూలీలు అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు దినకర్, టీకానంద్, అశోక్, శ్రీనివాస్, బక్కన్న, తిరుపతి, శ్రీకాంత్, స్రవంతి, రాజ్కుమార్, సందీప్, శంకర్, లక్ష్మి, గంగుబాయి, వసంతరావ్ పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రులను కలిసిన ‘పాల్వాయి’
బెజ్జూర్(సిర్పూర్): సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను వారి అధికారిక నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర నిధుల విడుదల, మౌలిక వసతుల విస్తరణ, రోడ్డు, రైల్వే, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి, అధికార ప్రతినిధులు రాణి రుద్రమ, సోలంకి శ్రీనివాస్ ఉన్నారు. -
ఎస్పీఎం ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో కార్మిక కమిషనర్ చంద్రశేఖరన్కు ఎస్పీఎం మజ్దూర్ యూనియన్(సీఐటీయూ ఈ2510) నాయకులు వినతిపత్రం అందించారు. యూ నియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ మాట్లాడుతూ ఎస్పీఎంలో నిలిపివేసిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పక్రియను తిరిగి ప్రా రంభించాలన్నారు. కార్మిక సంఘం లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయన్నా రు. కనీసం క్యాంటీన్ కూడా లేదని, ఉద్యోగ భద్రత లేక కార్మికులు భయంగా విధులు ని ర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ కూశన రాజ న్న, వైస్ ప్రెసిడెంట్ ముంజం శ్రీనివాస్, సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ కృష్ణమాచారి పాల్గొన్నారు. -
సలహాలు కరువు
సాగు మొదలు.. ● జిల్లాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ లేనట్లే..! ● కేవీకే లేకపోవడంతో ప్రారంభం కాని కార్యక్రమం ● వర్షాలతో విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధం ● అవగాహన సదస్సులు నిర్వహించాలని విన్నపంపత్తి సాగుకు దహెగాం శివారులో సిద్ధం చేసిన దుక్కి దహెగాం(సిర్పూర్): వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్పిడి, భూసారానికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలి.. తదితర విషయాలను శాస్త్రవేత్తల ద్వారా రైతులకు వివరించడం ఈ కార్యక్రమం ము ఖ్య ఉద్దేశం. అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ప్రారంభించలేదు. ఓ వైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండగా, వర్షాలతో రైతులు సాగు పనులు చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో అన్నదాతలు ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు..జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. 1.48 లక్షల మంది రైతులు ఉన్నారు. సాగునీటి సౌకర్యం లేక అన్నదాతలు అధికంగా వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా పంటలు నష్టపోతున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వంగడాలను ఎంచుకోకపోవడంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. జిల్లా రైతులు ప్రధానంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. వరి 58 వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీటి వనరులు లేకపోవడంతో పత్తి, జొన్న, కంది, సోయా తదితర పంటలు పండిస్తున్నారు. ముందుకు సాగని కేవీకే పనులుజిల్లాలోని రైతులకు శాసీ్త్రయ పద్ధతుల గురించి వివరించడం, నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఏడాది జనవరిలో జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరైంది. కౌటాల మండలం కనికి గ్రామం వద్ద అధికారులు భూమిని సైతం పరిశీలించారు. అయినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్, బెల్లంపల్లిలో కేవీకేలు ఉండగా, శాస్త్రవేత్తలు ఆయా జిల్లాలకే పరిమితమవుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం లేకపోవడంతోనే జిల్లాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం చేపట్టలేదని తెలుస్తోంది. దీంతో చాలామంది రైతులు పాత పద్ధతులతోనే పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు కోరుతున్నారు. రైతులకు అవగాహనరాష్ట్ర ప్రభుత్వం రైతులకు సలహాలు, సూచనలు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఈ నెల 5 నుంచి జూన్ 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి సాగులో తీసుకోవాల్సి న జాగ్రత్తలు వివరిస్తున్నారు. యూరియా ఏ మోతాదులో వాడాలి.. పంట మార్పిడి, మందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర విషయాలపై అవగాహ 1న కల్పిస్తున్నారు. ప్రధానంగా ఆరు అంశాల గురించి వివరిస్తున్నారు. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలు వినియోగించి నేల తల్లిని ఆరోగ్యంగా ఉంచడం, రశీదులు భద్రపరచి పరిహారం పొందడం, సాగు నీటిని ఆదా చేసి భావితరాలకు అందించడం, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడడం.. వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. -
పిల్లలను బడిలో చేర్పించాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాలలో శుక్రవారం హెచ్ఎం, పీఎంఆర్పీలు, ఏటీడీవోలతో సమావేశం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. డ్రాపౌట్లను మళ్లీ స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. సమావేశంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంత ల, ఏటీడీవోలు చిరంజీవి, డీఎస్వో మీనా రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ముగిసిన విత్తన పూజలు
మర్రిచెట్టు వద్ద పూజలు చేస్తున్న భక్తులుభేటింగ్ అవుతున్న మహిళలుఆదివాసీల దైవక్షేత్రం జంగుబాయి అమ్మవారి చెంత విత్తన పూజలు ముగిశాయి. కెరమెరి మండలంలోని అటవీ ప్రాంతంలో గల జంగుబాయి అమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 1న ప్రారంభమైన పూజోత్సవం శుక్రవారం వరకు కనుల పండువగా కొనసాగింది. మర్రిచెట్టు, పోచమ్మ, రావుడ్, మైసమ్మ వద్ద జిల్లాతోపాటు తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 150 మేళంలు అమ్మవారిని దర్శించుకున్నాయని కటోడాలు, ఆలయ కమిటీ సభ్యులు శ్యాంరావు, బాపూరావు తెలిపారు. కప్లై, సిద్దికస, దారికస, విజ్జకస, టొప్లకస ప్రాంతాల్లోని పవిత్ర నదుల నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి శుక్రవారం ఉదయం దేవతల విగ్రహాలను శుద్ధి చేశారు. శుద్ధి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. కాగా, ఈ ఏడాది నీటి ఎద్దడి కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – కెరమెరి -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఆసిఫాబాద్రూరల్: బాలికల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయంలో ప్రజ్వల స్వచ్ఛంద హైదరాబాద్ ఆధ్వర్యంలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతోపాటు మానవతా విలువలు కూడా నేర్పించాలన్నారు. మైనర్లకు వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక పెరుగుదల మార్పులు, పర్యవసనాలు, బాల్యవివాహాల నిరో ధం, లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వం అందించే సదుపాయాల గురించి వివరించాలని సూచించారు. సైబర్ నేరాలపై లఘు చిత్రాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీసీడీవో భాగ్యలక్ష్మి, ప్రజ్వల స్టేట్ కోఆర్డి నేటర్ మహ్మద్ సిరాజ్, అనిల్ పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకౌటాల(సిర్పూర్): రైతులు పండించిన వరి పంట చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేపడతా మని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కౌటాల మండలం సాండ్గాం, వీరవెల్లి, సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిల్లుల కు వచ్చిన వాహనాల నుంచి ధాన్యాన్ని తక్షణమే ది గుమతి చేసుకుని వాహనాలను తిరిగి పంపించాలన్నారు. కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఆర్డీవో దత్తారావు, జిల్లా సహకార సంఘం అధికారి బిక్కు, తహసీల్దార్ ప్రమోద్, ఏపీఎం ముక్తేశ్వర్, నిర్వాహకులు ఉన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ‘బడిబాట’కు విద్యాశాఖ సన్నద్ధం ● జూన్ 6 నుంచి 19 వరకు కార్యక్రమాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో 2025– 26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయులు జూన్ 6 నుంచి బడి బయట ఉన్న బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. సర్కారు స్కూళ్లు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్యాబోధన అంశాలను ప్రచార అస్త్రాలుగా వినియోగించనున్నారు. ఉపాధ్యాయులు సన్నద్ధంగతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ‘బడిబాట’ పేరిట జూన్ 3 నుంచి 11 వరకు, పాఠశాలల పునఃప్రారంభం నుంచి జూన్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈసారి మాత్రం జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయులను సైతం సన్నద్ధం చేశారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు ఇటీవల ఆయా మండలాల్లో ఉపాధ్యాయులకు నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. మండల విద్యాధికారులకు హైదరాబాద్లో సోమవారం నుంచి శిక్షణ కొనసాగుతోంది. సర్కారు స్కూళ్లపై నమ్మకం పెంచేలా..జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,263 ఉన్నాయి. ఇందులో స్థానిక సంస్థల కింద నడిచే ప్రభుత్వ పాఠశాలలు 720 ఉన్నాయి. జిల్లాలో మొత్తం విద్యార్థులు 84,855 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కంటే 20 శాతం పెంచాలన్నదే లక్ష్యం. దీనికోసం సర్కారు పాఠశాలలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంది. నాణ్యమైన విద్య అందిస్తున్న తీరును వివరించడంతోపాటు బోధన సదుపాయాలు, సాధించిన ఫలితాల గురించి తెలియజేయనున్నారు. జిల్లాలోని ఎనిమిది పాఠశాల్లో ఏఐ క్లాసులు కొనసాగుతుండగా.. జూన్ నుంచి మరిన్ని పాఠశాలల్లో విస్తరించనున్నారు.విజయవంతం చేద్దాం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కా ర్యక్రమాన్ని అందరి సమన్వయంతో విజ యవంతం చేద్దాం. ఇటీవల శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. షెడ్యూల్ వారీగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. – యాదయ్య, డీఈవో రోజువారీ కార్యక్రమాలు ఇలా.. 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్యామ్యం చేస్తూ గ్రామసభ నిర్వహించాలి. 7న ఉపాధ్యాయులు ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో ఇంటింటికీ కరపత్రాలతో ప్ర చారం చేయాలి. అంగన్వాడీ కేంద్రాల సందర్శన, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చే ర్పించడంతో పాటు ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11న కార్యక్రమాలపై సమీక్షించుకోవాలి. 12న పాఠశాలలను అలంకరించి పండుగ వా తావరణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. అమ్మ ఆద ర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు ప్రారంభించాలి. విద్యార్థులకు పాఠ్య పుస్తకా లు, నోట్బుక్లు, యూనిఫాం అందించాలి. 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి. 16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్), లర్నింగ్, ఇంప్రూమెంట్ ప్రోగ్రాం దినోత్సవాన్ని జరుపుకోవాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించారు. పిల్లలు రూపొందించిన చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17న సమీకృత విద్యా బాలికా దినోత్సవం ని ర్వహించాలి. మైనర్వివాహాలు, చిన్నారుల పై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18న తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇతర ఆధుని క సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంప కం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించాలి. -
ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. అదిమగిరిజన భూరక్షణ పోరాట సమితి, రాజ్గోండ్ సేవా సమితి, గోండ్వానా పంచాయతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూయజమానుల వివరాలు భూభారతి పోర్టల్ నమోదు చేసి బ్యాంకుల నుంచి రుణాలందించాలన్నారు. విద్యు త్ సౌకర్యం కల్పించి గిరి వికాస్ పథకం కింద బో ర్లు, బావులు వేయించాలని కోరారు. పోడు రైతుల మరణం తర్వాత వారసులకు ఇబ్బందులు లేకుండా వారసత్వ పట్టాలు చేయించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూముల్లో చెట్లు, కందకాల తవ్వకం నిలిచివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతా యని స్పష్టం చేశారు. నాయకులు మడావి శ్రీని వాస్, నర్సింగ్రావ్, చందన్షా, పెందూర్ సుధాకర్, సిడాం అర్జుమాస్టర్, ఆదివాసీలు పాల్గొన్నారు. -
‘భూభారతి’లో సమస్యల వెల్లువ!
సాక్షి, ఆసిఫాబాద్: ధరణి స్థానంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తె చ్చింది. ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆ మండలంలో సదస్సులు నిర్వహించిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్పేట్ మండలాన్ని ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఈ 15 గ్రామాల నుంచి 399 దరఖాస్తులు రాగా.. అందులో 227 దరఖాస్తులను పరిష్కరించిన అధికారులు.. మరో 172 దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. ఈ నెల 19 వరకు సదస్సులు నిర్వహణపెంచికల్పేట్ మండలంలో ఈ నెల 5 నుంచి 19 వరకు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరి ష్కారం కోసం సదస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులకు వందల సంఖ్యలో అర్జీలు వచ్చా యి. చేడ్వాయి, కొండపల్లి, లోడ్పల్లి, ఎల్కపల్లి, బొంబాయిగూడ, గుంట్లపేట, జన్కాపూర్, పోతేపల్లి, ఎల్లూర్, ఆగర్గూడ, కమ్మార్గాం, కోయచిచ్చాల, మురళీగూడ, పెంచికల్పేట్, తేలపల్లి గ్రామాల నుంచి మొత్తం 399 దరఖాస్తులు స్వీకరించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు అసైన్డ్(పీవోటీ), సాదాబైనామా, వారసత్వ మార్పిడి గురించి ఎక్కువగా అడిగారు. అదేవిధంగా భూ హద్దుల సమస్యలు, పేర్లు సరిచేయడం, భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, సర్వే నంబర్ల మిస్సింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించారు. మూడు ప్రత్యేక బృందాలు...పెంచికల్పేట్ మండంలోని 15 గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను మొదట అధికారులు భూభా రతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 383 దరఖాస్తులను భూభారతి పోర్టల్లో డిజిటలైజేషన్ చేయగా.. మిగిలిన 16 దరఖాస్తుల ను డిజిటలైజేషన్ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించేందు కు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు తహసీల్దార్ల నేతృత్వంలోని సిబ్బంది దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సమస్య పరిష్కరిస్తున్నారు. మొత్తం 399 అర్జీల్లో అసైన్డ్ 92, సాదాబైనామా 37, మిస్సింగ్ సర్వే నంబర్లు 76, డీఎస్ పెండింగ్ 102, వారసత్వ మార్పిడి కోసం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులను పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచారు.అర్జీల వివరాలుఅంశాలు అర్జీలు అసైన్డ్(పీఓటీ) 92 సాదాబైనామా 37 డీఎస్ పెండింగ్ 102 మిస్సింగ్ సర్వేనంబర్లు 76 వారసత్వ మార్పిడి 11 ఇతర దరఖాస్తులు 81 పైలట్ మండలం ‘పెంచికల్పేట్’లో 399 అర్జీలు తొమ్మిది అంశాలపై అత్యధిక దరఖాస్తులు 227 దరఖాస్తులకు పరిష్కారం.. పెండింగ్లో 172 -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రెబ్బెన(ఆసిఫాబాద్): అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని ఎడవెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సందర్శించారు. కేంద్రానికి రైతులు తీసుకు వచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని స్వయంగా పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా రైతుల అవసరం మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, కేటాయించిన ప్రకారం రైస్మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని సూచించారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ధాన్యంలో తప్ప, తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఏపీఎం వెంకటరమణ శర్మ, రైతులు పాల్గొన్నారు. యువ వికాసం ద్వారా ఉపాధి అవకాశాలుఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50వేల నుంచి రూ.లక్షల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంజూరు పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. -
ఉద్యాన పంటలకు ఊతం
● జిల్లాలో 31 హెక్టార్లలో పండ్ల తోటల సాగు లక్ష్యం ● రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పరికరాలు ● అవగాహన కల్పిస్తున్న అధికారులురెబ్బెన(ఆసిఫాబాద్): రైతులు పంటల సాగుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వర్షాలు, సారవంతమైన భూములు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో సస్యరక్షణ చర్యలు.. ఇలా భూమిలో విత్తనం పడిన నాటి నుంచి పంట చేతికందే వరకు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయినా అన్నదాతలకు వ్యవసాయంలో లాభాలు కంటే నష్టాలే అధికంగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లాలోని తేలికపాటి భూముల్లో పండ్ల తోటల సాగుతో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా రైతులకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ జిల్లావ్యాప్తంగా ఉద్యానవన పంటల సాగుకు ఊతం ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక రాయితీలు, పరికరాలుపండ్ల తోటల సాగులో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. కొన్నిరకాల తోటలు వర్షాధారంగానే దిగుబడిని అందిస్తాయి. మిగిలిన తోటల్లోనూ తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకతను సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బిందు, తుంపర సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తోంది. తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం( టీజీఎంఐపీ) పథకం ద్వారా ప్రభుత్వం పండ్ల తోటలు సాగుచేసే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు వందశాతం సబ్సిడీ, బీసీ చిన్న సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ, ఓసీ, ఇతర వర్గాలకు చెందినవారికి 80శాతం సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలు అందిస్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం 170 తుంపర సేద్యం పరికరాలను అందించాలని లక్ష్యం నిర్దేశించింది. అయితే తుంపర సేంద్యం పరికరాలను అన్నివర్గాల రైతులకు 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో తోటలకు నీటికి అందించేందుకు రైతులకు ఇవి ఉపయోగకరంగా మారనున్నాయి. అలాగే వారిపై ఆర్థికభారం సైతం తగ్గనుంది. తీగజాతి కూరగాయల సాగుకు..పండ్ల తోటలపాటు కూరగాయల సాగులోనూ రైతులకు మంచి లాభాలు ఉంటాయి. కూరగాయల సాగుకు నీటి వనరులు ఎంతో ముఖ్యం. అందుబాటులో నీటి సౌకర్యం ఉన్న రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించేందుకు శాశ్వత పందిర్లను ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 20 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్ణయించింది. అరెకరంలో శాశ్వత పందిరి నిర్మాణాన్ని ఒక యూనిట్గా అధికారులు నిర్ధారిస్తారు. తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సోర, పొట్ల వంటి వాటిని శాశ్వత పందిర్ల సహాయంతో సాగు చేస్తే.. సాధారణ పద్ధతి కంటే ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే జాతీయ వెదురు మిషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 80 ఎకరాల్లో వెదురు తోటలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 31 హెక్టార్లలో పండ్ల తోటలుఈ ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం, నేషనల్ మిషన్ ఆన్ ఎడెబుల్ ఆయిల్ పామ్ పథకాల ద్వారా జిల్లాలో 31 హెక్టార్లలో వివిధ రకాల తోటల పెంపకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. కొత్త తోటల ఏర్పాటు ద్వారా జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తోటల పెంపకంతో కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. తోట ఏర్పాటు చేసుకున్న సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు రాయితీని తోటల సంరక్షణ కోసం ప్రోత్సహకాన్ని ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమచేస్తోంది. ఇక ఆయిల్పామ్ తోటలు సాగు చేసే రైతుకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల వరకు అందిస్తుంది. అందులో రూ.2,100 పంట సంరక్షణకు, మిగిలిన రూ.2,100 అంతర పంటల సాగు కోసం వినియోగించాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, రాయితీలను రైతులు సద్వి నియోగం చేసుకోవాలి. తేలికపాటి భూముల్లోనూ పండ్ల తోటలు ఏర్పాటు చేసుకుని లాభాలు సాధించవచ్చు. ఒక్కసారి తోట ఏర్పాటు చేస్తే దీర్ఘకాలికంగా ఫలాలు పొందే అవకాశం ఉంది. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తోంది. – ఎంఏ నదీం, ఉద్యానవన శాఖ అధికారి 2025– 26లో సాగు లక్ష్యం (హెక్టార్లలో)డ్రాగన్ ఫ్రూట్ 2 బొప్పాయి 5 పనస 6 మామిడి 10 జామ 5 బత్తాయి 3 ప్లాస్టిక్ మల్చింగ్ 40యాంత్రీకరణ ఇలా..పరికరం మంజూరైన యూనిట్లు పవర్ టిల్లర్ 6 పవర్ వీడర్ 6 బ్రష్ కట్టర్ 16 క్నప్సాక్ స్పేయర్ 6జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు (ఎకరాల్లో)వివిధ రకాల పండ్ల తోటలు 1311.84కూరగాయలు 8,097.58సుగంధ ద్రవ్యాలు 180.18ఆయిల్పామ్ 1,334.68ప్లాంటేషన్ పంటలు 246పూల తోటలు 6.07ఆగ్రో ఫారెస్ట్రీ 360.21బార్డర్ ప్లాంటేషన్ 11 -
ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని కేజీబీవీలు, ఎస్ఎస్ఏ యూఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం డీఈవో యాదయ్యకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ జిల్లాలో భార్యాభర్తలుగా ఉన్న ఉపాధ్యాయులు వివిధ మండలాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఒకే మండల పరిధిలో డిప్యూటేషన్ అవకాశం కల్పించాలన్నారు. సమగ్ర శిక్షాలో పనిచేసిన వారిని ఏప్రిల్ 24న తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి రాజ్ కమలాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నూతన షావెల్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో నూతన షావెల్కు సింగరేణి అధికారులు ‘ఆపరేషన్ సిందూర్’గా నామకరణం చేశారు. ఈ యంత్రాన్ని గురువారం ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో మెరుగైన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు యంత్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. యంత్రాల పనితీరును ఎప్పటిప్పుడూ పర్యవేక్షించాల న్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, కైరిగూడ ఓసీపీ ప్రాజెక్టు అధికారి నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ రామనాథం, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి గుంతలు.. గుండెకోతలు
కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ లక్ష్మి(13), మహారాష్ట్రలోని ఎటపల్లికి చెందిన సిండే హన్సిక(11) ఈ నెల 23న వ్యవసాయ చేనుల్లోకి బహిర్భూమికి వెళ్లారు. అక్కడి నుంచి ఆడుకుంటూ చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు. నీళ్లలో కనిపించిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు లక్ష్మి గుంతలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు హన్సిక చెయ్యి పట్టుకోగా.. ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్(16) ఈ నెల 24న సమీపంలోని పెద్దవాగులో స్నానం చేసేందుకు వెళ్లాడు. వాగులో మునిగి మృతి చెందగా, ఆ తర్వాతి రోజు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గతేడాది ఫిబ్రవరి 11న చింతలమానెపల్లి మండల కేంద్రం సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు తుమిడే హరీశ్, కంబాల మహేశ్ ప్రాణా లు కోల్పోయారు. యువకులిద్దరూ బైక్పై శుభకార్యానికి వెళ్లి మార్గమధ్యలో సేదతీరేందుకు చేను వద్ద ఆగారు. వ్యవసాయ బావికి రక్షణ గోడ లేకపోవడంతో రాత్రిపూట బావిని గుర్తించక అందులోపడి మృతి చెందారు. కౌటాల(సిర్పూర్): ఊరికి ఉపకారం చేసే చెరువులు, జలాశయాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరదాగా నీటి వనరుల వద్దకు వెళ్లిన వారు వివిధ కారణాలతో వాటిల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు, చెరువులు, కుంటల వద్ద మట్టి కోసం తవ్వడంతో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడుతున్నాయి. నీటి లోతు తెలియక అందులో దిగినవారు ప్రమాదాల బారినపడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు గుండె కోత మిగులుస్తున్నారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో నిండుగా ఉండే చెరువులు, బావులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. నీటికుంట చుట్టూ రక్షణ లేకపోవడంతో బాలికలు జారి పడినట్లు తెలుస్తోంది. కనిపించని హెచ్చరిక బోర్డులుజిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలో వ్యవసాయ బావులతోపాటు లోతైన నీటి కుంటలు ఉన్నాయి. అక్కడ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జనసంచారం ఎక్కువగా ఉండే చాలాప్రాంతాల్లో రోడ్డు పక్కన వ్యవసాయ బావులున్నా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న బావులు, మూలమలుపులు, కల్వర్టులు కూలిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇష్టారీతిన తవ్వకాలు..చెరువులు, కుంటల్లో మొరం, మట్టి కోసం ఇష్టారీ తిన తవ్వకాలు చేపడుతున్నారు. ఈ గుంతలు చే పల వేటకు వెళ్లిన వారిని, సరదాగా ఈత కోసం వెళ్లే చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. చెరువులు, కుంటలను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. మొరం తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఫీజు చెల్లిస్తే పర్మిషన్ ఇస్తారు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న చెరువులు, జలాశయాలు ప్రమాదకరంగా వ్యవసాయ బావులు రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు ఇటీవల కౌటాలలో ఇద్దరు చిన్నారులు మృతిరక్షణ చర్యలు చేపడతాం వేసవిలో పిల్లలు గంటల తరబడి నీళ్ల చెంతనే ఆడుతుంటా రు. తోటి వారిని అనుకరిస్తూ ఈత రాకున్నా నీళ్లలోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. వారిపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ ఉంచాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పకుండా సమాచారం తెలుసుకోవాలి. పంచాయతీ అధికారులతో కలిసి ప్రమాదకరంగా ఉన్న గుంతలను గుర్తించి రక్షణ చర్యలు చేపడతాం. – రామానుజం, డీఎస్పీ, కాగజ్నగర్ -
రోస్టర్ ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ రోస్టర్ ప్రకారమే చేపడుతున్నామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. ఎస్సీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు గురువారం బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. ఏరియా జీఎం కమిటీ సభ్యులకు గోలేటిలోని జీఎం కార్యాలయంలో స్వాగతం పలికి మొక్క అందించారు. అనంతరం ఏరియాలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగు ల రోస్టర్ను కార్పొరేట్ చీఫ్ లైసెన్ అధికారి దుర్గం రాంచందర్ తనిఖీ చేశారు. ఖాళీల భర్తీ, పదో న్నతులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, కమిటీ సభ్యులు రాజేశ్వర్, వెంకటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, కె.తిరుపతి, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమం సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేష న్ పరిధిలో జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సీఐ స్వామి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన దాడి ఆకాష్ (21), అల్లకొండ కళ్యాణ్ (23) శుభకార్యాలకు డెకరేషన్ చేస్తుంటారు. బుధవారంరాత్రి ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆకాష్ అదేరోజు రాత్రి, కళ్యాణ్ గురువారం మృతి చెందారు. ఆకాష్ తండ్రి రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..భైంసారూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ నైలు తెలిపిన వివరాల మేరకు మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ (20) బుధవారం రాత్రి చాక్పెల్లి వెళ్లేందుకు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై నిలబడి ఉన్నాడు. ఈక్రమంలో భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్నెపల్లిలో ఒకరు.. దండేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన బోరె మహేశ్ (40) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై కన్నెపల్లి నుంచి లక్సెట్టిపేటకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలులోంచి కిందపడి వ్యక్తి..బెల్లంపల్లి: రైలులోంచి కిందపడి ఒకరు మృతి చెందినట్లు బెల్లంపల్లి జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కె.సురేష్గౌడ్ తెలిపారు. నాగపూర్కు చెందిన నిషాంత్ (42) బుధవారం రాత్రి హుబ్లీలో ఉన్న తన బంధువుల ఇంటికి వారణాసి ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకోగానే నిషాంత్ రైలులో నుంచి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహానికి గురువారం పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి భార్య పూర్వీకి అప్పగించామని రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మోసగించిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన హైదరాబాద్లోని మణికొండకు చెందిన జెలిగం విజయ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన తుర్పటి గంగాధర్కు ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిందితుడు రూ.7లక్షల 5వేలు తీసుకున్నాడు. నకిలీ ప్రొసిడింగ్ ఇచ్చి జాబ్ వచ్చిందని నమ్మబలికాడు. ఆ తర్వాత అతను అక్కడికి వెళ్లగా నకిలీ ప్రొసిడింగ్ అని తెలుసుకున్నాడు. మోసపోయానని గ్రహించి గురువారం వన్టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాజీవ్వ్నగర్కు చెందిన కొండేటి సతీశ్ (38) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై సత్తయ్య తెలిపారు. మేసీ్త్రపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సతీశ్ ఇటీవల రెండు ప్లాట్లు కొనుగోలు చేసి ఇంటినిర్మాణం చేపట్టాడు. ఈక్రమంలో అప్పులు చేశాడు. అంతేకాకుండా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. ఒకవైపు అప్పులబాధ, మరోవైపు కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే వరండాలో ఒంటరిగానే పడుకున్నాడు. తెల్లవారేసరికి రేకుల షెడ్డుకు ఉరేసుకుని కనిపించాడు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అతని తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. కొత్తూర్లో యువకుడు..ఆదిలాబాద్టౌన్: తలమడుగు మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఉల్లెంగుల రవి (36) బుధవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఖుర్షీద్నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న రవి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. రావి శ్రీనివాస్పై కేసు నమోదుకాగజ్నగర్రూరల్: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును అసభ్య పదజాలంతో ధూషించిన కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై సురేశ్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టు చేసినట్లు తెలిపారు. రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బెజ్జూర్: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని గురువారం బీజేపీ కార్యకర్తలు బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాడి తిరుపతి, మండల మాజీ అధ్యక్షుడు జాడి దిగంబర్, నాయకులు వసీఉల్లాఖాన్, తాళ్ల ఇందిరా, రాజారామ్, ప్రవీణ్, కిష్టయ్య, కృష్ణ, శ్యాంసుందర్, రుషి, గోపాల్, మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
‘పొట్టేల్’ సినిమాకు గద్దర్ అవార్డు
నిర్మల్రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన పొట్టేల్ సినిమాకు గద్దర్ అవార్డు లభించింది. గురువారం హైదరాబాద్లో ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించగా పొట్టేల్ సినిమాకు ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు దక్కింది. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినగర్లో నివాసం ఉండే జానకి, ధర్మగౌడ్ కుమారుడు సాహిత్ దర్శకత్వం వహించగా గత అక్టోబర్ 25న చిత్రం విడుదలై విజయం సాధించింది. సాహిత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘సవారి’కి కూడా 2020లో ఐఐఎఫ్ఏ ఉత్తమ క్రిటిక్స్ అవార్డు లభించింది. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
సాత్నాల: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన భోరజ్ మండలంలోని రాంపూర్(టి)లో గురువారం చోటు చేసుకుంది. జైనథ్ ఎస్సై గౌతమ్ పవార్ తెలిపిన వివరాల మేరకు జైనథ్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన శంకర్కు భోరజ్ మండలంలోని రాంపూర్(టి) గ్రామానికి చెందిన సురేఖ (35)తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చి భార్యను వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి మద్యం మత్తులో అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవకు దిగడంతో కుటుంబ సభ్యులు 100కు సమాచారం అందించారు. పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. గురువారం ఉదయం మరోసారి అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన సురేఖ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, ఆమె భర్త ఉరివేసి హత్యచేశాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
భవితకు భరోసా..!
● మౌలిక వసతులకు నిధులు ● ఉమ్మడి జిల్లాకు రూ.1.59 కోట్లు మంజూరు మంచిర్యాలఅర్బన్: భవిత కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ర్యాంపులు, రైలింగ్తో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న భవనాలకు మరమ్మతులు, కార్యకలాపాల గది నిర్మాణం, పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం అవసరాలకు అనుగుణంగా ఆధారిత పెయింటింగ్కు నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో భవిత కేంద్రాలుండగా ఐదు చోట్ల మాత్రమే పక్కా భవనాలున్నాయి. మిగిలిన భవిత కేంద్రాలు పాఠశాల ఆవరణలో కొనసాగుతున్నాయి. 196 మంది ప్రత్యేక అవసరాలుగల పిల్లలుండగా ఒక్కో కేంద్రానికి ఇద్దరు ఐఈఆర్పీల చొప్పున 36 మందికిగానూ 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. 12 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. భవిత కేంద్రాల్లో చేపట్టే పనుల అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అదనపు నిధులు అవసరమైతే జస్టిఫికేషన్ నివేదికతో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలొచ్చాయి. కేంద్రాల బలోపేతానికి.. భవిత కేంద్రాల్లో 196 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులున్నారు. ఇందులో 92 మంది ఇంటివద్దే ఉంటూ తగిన సేవలు అందుకుంటున్న వా రున్నారు. మానసిక దివ్యాంగులు, చెవిటి, మూగ, అంధత్వం ఇలా 21 రకాలుగా పాఠశాలలకు వచ్చి న విద్యార్థులను గుర్తించి సేవలు అందిస్తున్నారు. వచ్చే ఎడాది నుంచి భవిత కేంద్రాల బలోపేతంపై కన్వర్జెన్స్లో దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. నమోదును పెంచటం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్చటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం నిర్ధారించడం, పిల్లలకు వ్యక్తిగత అవసరాల ఆధారంగా అవసరమైన చికిత్స జోక్యాలు, మద్దతు అందించటానికి ఫిజియోథెరపిస్టులు, స్పిచ్ థెరపిస్టులు క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. గతేడా ది భవిత కేంద్రాలకు అవసరమైన పరికరాలు కొ నుగోలు చేసేందుకు నిధులు కేటాయించగా, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని పొందుపర్చారు. ప్రతీ చిన్నారి విద్యాపరంగా, అభివృద్ధిలో పురోగతి సాధించటంపై దృష్టి కేంద్రీకరించా ల్సి ఉంటుంది. స్వయం సహాయక సంఘాల సహయంతో సీఎస్డబ్ల్యూయన్ గుర్తింపు వందశాతం కవ రేజీకి చేరుకోవాలని ఉత్తర్వుల్లో పొందుపర్చారు. పక్కా భవనాలు ఎప్పుడో..? ఉమ్మడి జిల్లాలో భవిత కేంద్రాలకు 17 చోట్ల పక్కా భవనాలున్నాయి. మిగిలిన 53 చోట్ల భవనాలులేక పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. భవిత కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులకు నిధులు కేటాయించినా పక్కా భవనాల నిర్మాణం విస్మరించారు. తాండూర్, బెల్లంపల్లి, దండేపల్లి, మందమర్రి, కోటపల్లిలో మాత్రమే భవిత కేంద్రాలున్నాయి. మిగిలిన కేంద్రాల్లో సమస్యలు తిష్టవేశాయి. భవిత భవనాల నిర్మాణానికి స్థలగుర్తింపునకు ఎంఈవో లకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా స్థల కేటాయింపు, నిధులు మంజూరు చేస్తేనే ప్ర త్యేక అవసరాల పిల్లలకు సౌకర్యంగా మారనుంది. నిధుల ఖర్చు ఇలా.. ఉమ్మడి జిల్లా భవిత కేంద్రాల్లో చేపట్టే పనులకు నిధులు ఖర్చు చేయడంపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు రూ.1,59,57,764 నిధులు మంజూరయ్యాయి. ప్రాధాన్యత ప్రాతిపదికన అవసరాలను గుర్తించాలని కలెక్టర్కు సూచించారు. కార్యకలాపాల గది నిర్మాణానికి యూనిట్కు రూ.7 లక్షల వరకు, ర్యాంపు, రైలింగ్తో కూడిన యాక్సెస్ చేయగల టాయిలెట్ నిర్మాణానికి యూనిట్కు రూ.లక్ష, భవనాల మరమ్మతులకు రూ.లక్ష (అవసరం ప్రకారం), ఇప్పటికే ఉన్న టాయిలెట్ల మరమ్మతులకు రూ.50వేలు, పిల్లల అభ్యాస, అవసరాలకు అనుగుణంగా పెయింటింగ్కు రూ. 1.50 లక్షలు ఖర్చు చేయాలని నిబంధనలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పక్కా భవనాలు, పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవనాలు, మంజూరైన నిధులు ఇలా ఉన్నాయి.జిల్లా పక్కా భవనాలు పాఠశాల ఆవరణలో మంజూరైన నిధులు ఆదిలాబాద్ 4 14 రూ.42,24,114 కుమురంభీం 4 11 రూ.35,20,095 నిర్మల్ 4 15 రూ.44,58,787 మంచిర్యాల 5 13 రూ.37,54,768 మొత్తం 17 53 రూ.1,59,57,764 -
‘గురుకుల సొసైటీ కార్యదర్శిని తొలగించాలి’
బెల్లంపల్లి: గురుకుల విద్యాలయ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణిని ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు మరుగుదొడ్లు కడిగితే తప్పేంటని, గదులు శుభ్రం చేసుకోవడంతో పాటు కూరగాయలు తరగాలని, ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎస్సీలకు చెందిన ఉన్నతాధికారిని గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు రమేశ్, నారాయణ, రాజ్కుమార్, ప్రసాద్, శేఖర్, శివాజీ, సంపత్, తదితరులు పాల్గొన్నారు. నేడు వైద్యారోగ్య శాఖలో ఖాళీలకు ఇంటర్వ్యూలుమంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎన్హెచ్ఎం విభాగంలో ఖాళీగా ఉన్న రెండు నర్సింగ్ ఆఫీసర్, 1 డీడీఎం పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు నస్పూరులోని కలెక్టరేట్లో ఉన్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జిల్లా అధికారిక వెబ్సైట్ https:// mancherial. telangana. gov. in లో సంప్రదించాలని తెలిపారు. తర్లపాడ్లో అగ్నిప్రమాదంఖానాపూర్: మండలంలోని తర్లపాడ్లో గురువారం రాత్రి పల్లపు లక్ష్మి ఇంట్లో కట్టెలపొయ్యి వద్ద వంట చేస్తుండగా ప్ర మాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫైరింజన్కు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది మంటలు ఆర్పివేశారు. -
వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్చల్
నస్పూర్: తనకు న్యాయం చేయాలని ఓ యువకుడు గురువారం పట్టణ పరిధిలోని వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేశాడు. ఎస్సై ఉపేందర్రావు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. ఈ సందర్భంగా బాధితుడు జాబ్రీ జమీల్ మాట్లాడుతూ తనది విలేజ్ నస్పూర్ గ్రామమని, నస్పూర్ శివారు సర్వే నంబర్ 22లోని 6 ఎకరాల భూమిని మహ్మద్ ఫిరోజ్ఖాన్, మరి కొందరితో కలిసి 2015 లో కొనుగోలు చేశామన్నాడు. అందులో తనకు పది శాతం వాటా ఉందన్నాడు. కొంతకాలం తర్వాత ఫిరోజ్ఖాన్ తన పదిశాతం వాటా కింద రూ.30 లక్షలు ఇస్తానని 2016లో అగ్రిమెంట్ చేసుకుని రూ.2.50 లక్షలు చెల్లించాడన్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వకుండా భూమిని ఇతరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. రెండు రోజుల్లో న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అనంతరం యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
హోరాహోరీగా క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలు మూడోరోజు గురువారం హోరాహోరిగా సాగాయి. మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ స్కూల్లో గ్రీన్, బ్లూ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బ్లూ జట్టు 268 పరుగులు చేసి విజయం సాధించింది. హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలియన్లో నిర్వహించిన పోటీల్లో యెల్లో జట్టు 165 పరుగులు చేసి విజయం సాధించింది. మందమర్రిలోని సింగరేణి మైదానంలో జరుగుతున్న పోటీల్లో వైట్ జట్టు 229 పరుగులు చేసి విజయం సాధించిందని హెచ్సీఏ కోచ్ ప్రదీప్ తెలిపారు. -
మొక్కజొన్నల చోరీ నిందితుల అరెస్ట్
నర్సాపూర్(జి): ఏప్రిల్ 23న 325 క్వింటాళ్ల మొక్కజొన్నలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితుడు కల్లూరుకు చెందిన బొద్దుల శ్రీనివాస్ మే13న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ జానకీ షర్మి ల ఆదేశాలతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచా రణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండకు చెందిన బాదావత్ సంతోశ్, కంటేశ్వర్కు చెందిన అబ్దుల్ రజాక్ లారీ డ్రైవర్లు 325 క్వింటాళ్ల మొక్కజొన్నలను కామారెడ్డి సమీపంలో ఉన్న స్నేహా చికెన్ ఫార్మ్ గోదాంకు పీవీ ఏజెన్సీ ద్వారా విక్రయించి రూ.7,48,000 సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్దనుంచి 2 లారీలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
శ్రీరాంపూర్: కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కంపెనీ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. గురువారం ఆ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ 1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యజమాన్యంతో చర్చించామన్నారు. త్వరలోనే ఆస్పత్రి పనులు ప్రారంభమవుతాయన్నారు. అంతే కాకుండా భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం సెక్టార్3లలో కార్మికుల పిల్లల కోసం సింగరేణి పాఠశాలలో సీబీఎస్ సిలబస్ను ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ఈ సందర్భంగా 30 మంది కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారికి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రాంచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. -
● బిల్లులు రాక నిలిచిన పథకం ● నెమ్మదిగా సాగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు ● అనేకచోట్ల పూర్తికాని మరమ్మతులు ● జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం ● విద్యార్థులకు సమస్యల స్వాగతం
పూర్తికాని మరుగుదొడ్లుఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు రూ.1.20 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు విద్యుత్ పనులు పూర్తికాగా, తాగునీరు, టాయిలెట్ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. పూర్తయిన పనులకు రూ.95 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు తీసుకున్నారు. నిరుపయోగంగా టాయిలెట్స్దహెగాం: మండలంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 3,450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐనంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8 తరగతుల్లో సుమారు 220 మంది విద్యార్థులున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన వరదతో టాయి లెట్లలో బురద చేరడంతో నిరుపయోగంగా మా రాయి. ప్రహరీ సైతం కూలిపోయింది. అప్పటినుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరో భవనం నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరయ్యాయని ఉపాధ్యాయులు తెలిపారు. పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొనసాగుతున్న పనులు పెంచికల్పేట్: పెంచికల్పేట్ జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రభుత్వం పీఎం శ్రీ పథకంలో భాగంగా సైన్స్ ల్యాబ్ మంజూరు చేసింది. విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయడానికి సామగ్రి సైతం కేటాయించారు. కొ న్ని నెలల క్రితం కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్లాస్టింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో పది రోజుల్లో పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరానికి భవనం అందుబాటులో తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దహెగాం మండలం ఐనంలోని ప్రాథమికోన్నత పాఠశాలఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,263 ఉండగా, 84,855 విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పా ఠశాలల పథకం కింద జిల్లాలోని అన్ని యాజ మాన్యాల కింద ఉన్న 727 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, టైల్స్ వంటి పనులు చేపట్టేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్యుత్, తాగునీటి పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. ఇక మరుగుదొడ్లు, ఇతర మేజర్ పనులు మాత్రం 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే పూర్తయ్యాయి. 727 పాఠశాలలకు రూ.25.60 కో ట్లు మంజూరయ్యాయి. 623 పాఠశాలలో తాగునీటి వసతులు, 202 పాఠశాలల్లో చిన్న తరహా మరమ్మతులు, 15 అర్బన్ పాఠశాలల్లో కొత్త మరుగుదొడ్లు, 140 గ్రామీణ పా ఠశాలల్లో టాయిలెట్లు మరమ్మతు, 607 పాఠశాలలో విద్యుత్ పనుల కో సం ఇప్పటివరకు రూ.18.28 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.6.52 కోట్లుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది. 78 స్కూళ్లలోనే ‘మన ఊరు– మన బడి’ గత ప్రభుత్వం మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.75 కోట్లతో జిల్లాలోని 251 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే 78 సూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో 173 పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పనులకు సంబంధించిన నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే ఆపేశారు. ఈ 251 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ఎంపిక చేయలేదు. దీంతో ఆయా చోట్ల పనులు ముందుకు సాగడం లేదు.చివరి పనులు పెండింగ్ కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని 51 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు చేపట్టారు. శంకర్గూడ, కర్పెతగూడ, ఆగర్వాడ, లేండిగూడ పాఠశాలల్లో చివరి పనులు పెండింగ్ ఉన్నాయి. పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తికాలేదు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఈ నజీమోద్దీన్ తెలిపారు.దెబ్బతిన్న పైకప్పు చింతలమానెపల్లి: మండలంలోని బాబాసాగర్, డబ్బా పాఠశాలల్లో మన ఊరు– మన బడి పథకం కింద మంజూరైన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణాలు పూర్తి కాలేదు. డబ్బా ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు– మన బడి పథకం కింద చేపట్టిన పనులు బిల్లులు రాక నిలిచిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ సర్కారు అమ్మ ఆదర్శ పాఠశాలలు కార్యక్రమం కింద చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. జూన్ 12న ప్రభుత్వ బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ఈ ఏడాది ముందే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బడుల్లో మరమ్మతులు సకాలంలో పూర్తికావడం అనుమానంగా మారింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ‘సాక్షి’ విజిట్.. -
అర్హులను ఎంపిక చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రూ.50వేల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంజూరు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. రాజీవ్ యువ వికాసం పథకంలో రూ.50వేల లోపు విలువైన యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా రూపొందిస్తున్నామన్నారు. జూన్ 2న సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ కేంద్రాల్లో మంజూరు పత్రాలు అందిస్తామని వివరించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, మైనార్టీశాఖ జిల్లా అధికారి నదీమ్, డీటీడీవో రమాదేవి, అదనపు డీఆర్డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌటాలలో ఉద్రిక్తతకౌటాల(సిర్పూర్): ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, మా జీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో బుధవారం కౌటాలలో ఉద్రిక్తత నెలకొంది. తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నది వద్ద బహిరంగ చర్చ కో సం జెడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అ నుచరులతో కలిసి వెళ్తుండగా కౌటాలలో పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ఎమ్మె ల్యే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ మండల నాయకులు ప్రాణహిత నదిని సందర్శించారు. 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న కోనేరు కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు తరలివెళ్తున్నా ప ట్టించుకోలేదని మండిపడ్డారు. కోనప్ప అనుచరులు సైతం ప్రాణహిత నదిని సందర్శించారు. పంటలకు సాగునీరు అందించేందుకు కోనప్ప ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలితెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో వేడుకల నిర్వహణపై బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, చిల్డ్ర న్స్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని ముస్తాబు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుధ్యం, ప్రముఖుల ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు పనులు చేపట్టాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని అడవితోపాటు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్తో కలిసి అటవీ రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా భూభాగంలో 56శాతం అటవీ ప్రాంతం ఉందని, అందులోని భూమి ఆక్రమణకు గురికాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలతో వన్యప్రాణులను హతమారుస్తున్నారని, అడవుల గుండా వెళ్లే విద్యుత్ తీగలను రోడ్డు పక్క నుంచి వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరా సౌర గిరిజల శక్తి పథకం ద్వారా పోడు భూముల్లో బోర్లు వేసి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదాలకు పరిష్కారం చూపేందుకు సంయుక్త సర్వేలు నిర్వహించి, హద్దులు గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్శాఖ అధికారి శేషారావు, సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, ఎఫ్ఆర్వోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వనమహోత్సవం పకడ్బందీగా చేపట్టాలి జిల్లాలో వనమహోత్సవం– 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వనమహోత్సవం అమలుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రుతుపవనాలు ముందే రావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, అధికారులు అనువైన స్థలాల్లో ఉపాధిహామీ కూలీల ద్వారా గుంతలు తవ్వించి మొక్కలు నాటించాలని సూచించారు. అధిక భాగం గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలకు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
2 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని సబ్ రిజిస్ట్రార్ అప్పారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ప్రతిరోజూ 48 స్లాట్ బుకింగ్లకు అవకాశం ఉందని తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 24 స్లాట్లు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు 24 స్లాట్లు ఉంటాయని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి.. త్వ రలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం చేస్తామన్నారు. వేలిముద్రతోపాటు ఈ– సిగ్నేచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలి పారు. స్లాట్ బుకింగ్ లేనివారికి సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల మధ్య రోజుకు 5 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తామని వివరించారు. https://registration.telanga na.gov.in ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. -
రైతులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని డబ్బా గ్రామంలో మంగళవారం అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పోడు భూములు స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు వస్తున్నారనే సమాచారంతో రైతులు భూముల వద్దకు చేరుకుని అధి కారులను అడ్డుకున్నారు. పోడు భూములు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని వారికి వివరించారు. ఎఫ్ఆర్వో ఇక్బాల్ మాట్లాడు తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అటవీ భూమి స్వాధీనం చేసుకుంటున్నామని తెలి పారు. పోడు పట్టాలు ఉన్న ఆదివాసీల భూ ములను ముట్టుకోమని స్పష్టం చేశారు. ఒక దశలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అనంతరం ఫారెస్టు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
బదిలీలతో ఇక్కట్లు!?
● రిలీవ్ కాకుండా విధులకు తహసీల్దార్లు డుమ్మా ● నాలుగు మండలాల్లో నిలిచిన ధ్రువపత్రాల జారీ ● ఎఫ్ఏసీగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వని రెవెన్యూ అధికారులు ● సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద ప్రజల పడిగాపులు ● సోమవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేసిన కలెక్టర్ సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు సామాన్య ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బదిలీ అయిన తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ సోమవా రం రాత్రి వరకు రిలీవ్ చేయలేదు. అయితే వారు తమ కార్యాలయాలకు వెళ్లకపోవడంతో పాలనపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, క ళాశాలలు తెరిచే సమయంలో విద్యార్థులకు కులం, నివాసం, ఈబీసీ, ఓబీసీ ధ్రువపత్రాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఎల్టీఆర్, ఇతర పరిశీలన సంబంధిత అంశాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 13 రోజులుగా ప్రజలు, విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సుముఖత చూపని వైనం..గత ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి పలువురు తహసీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో కొందరు తిరిగి జిల్లాకు రాగా.. మిగిలిన వారు మళ్లీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపలేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించడంతో ఈ నెల 15 అందరినీ బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిర్పూర్(యూ), కెరమెరి, ఆసిఫాబాద్ మండల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో పనిచేసే ఒకరు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో మరో నలుగురిని ఇక్కడికి కేటాయించారు. ఒకరు మరుసటి రోజే బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించుకోగా.. మరో అధికారి సరస్వతీ నది పుష్కర విధుల్లో ఉన్నారు. ఒక అధికారి ఇక్కడ వచ్చి రిపోర్టు చేయకుండా వేచిచూసే ధోరణిలో ఉండగా.. మరొకరు మాత్రం కలెక్టర్ వద్ద రిపోర్ట్ చేశారు. భారీస్థాయిలో పైరవీలు.. జిల్లాలో ఖాళీ ఏర్పడిన స్థానాల్లో నూతనంగా తహసీల్దార్లను నియమించకపోవడం వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లే కారణమన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు వెళ్లడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన అధికారులు సైతం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందువల్లే ఇక్కడికి వచ్చి రిపోర్టు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం, ఆదాయ వనరుగా పేరున్న ఆసిఫాబాద్ మండల తహసీల్దారుగా పనిచేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో 15 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని కోరుతూ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సైతం బదిలీల అంశంపై కసరత్తు చేసినట్లు తెలిసింది. జిల్లాలో పనిచేయని తహసీల్దార్లను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగు మండలాలతోపాటు మరికొన్ని మండలాల్లోనూ తహసీల్దార్లు బదిలీ కావచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తలచిందొకటి.. జరిగిందొకటి!కలెక్టర్ బదిలీ అయిన తహసీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే.. పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వారిని ఆపి ఉంచారు. సదరు అధికారులు మాత్రం 13 రోజులపాటు విధులకు హాజరు కాకుండా పాలన కుంటుపడేలా చేసి జిల్లా సర్వోన్నతాధికారి ఉద్దేశానికి తూట్లు పొడిచారు. బదిలీ అయిన తహసీల్దార్లు ఎవరూ కార్యాలయాలకు వెళ్లడం లేదని ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. వారి స్థానంలో డీటీలకు ఎఫ్ఏసీ ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి, ఆసిఫాబాద్ మండల కార్యాలయాల్లో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బదిలీల అంశంపై ఉన్నతస్థాయి, రాజకీయ ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో సోమవారం రాత్రి హడావుడిగా నలుగురు తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ఎఫ్ఏసీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం ఆసిఫాబాద్ మండలానికి మాత్రం డీటీ పోచయ్యకు తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఆయా స్థానాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లను నియమించనున్నారని సమాచారం. -
‘సిర్పూర్’ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకాగజ్నగర్టౌన్: అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనెత్తి, సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే హరీశ్బాబు అన్నారు. ప ట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో తన పై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యలు చేశారని అన్నారు. పదేళ్లపాటు 10 నుంచి 20 కిలోల ధాన్యం కటింగ్ చేయించి అక్రమంగా సంపాదించారని, సిర్పూర్ పేపరు మిల్లును వాడుకుని కార్మికులను నట్టేట ముంచారని, గుర్తింపు సంఘం ఎన్నికల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. కొండపల్లిలో రెండు వేల ఎకరాలు, డబ్బా గ్రామంలో రెండు వేల ఎకరాల చొప్పున వేల ఎకరాల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటారని, దీనికి బాధ్యత ఆనాడు అధికారంలో ఉన్న కోనేరు కోనప్ప ది కాదా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజె క్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కోనప్ప అసలు ఏ పార్టీలో ఉన్నాడో... ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలే ని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని సహించలేక ఆయన అసహనానికి గురవుతున్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శివ, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, అసెంబ్లీ కన్వీ నర్ గొల్లపల్లి వీరభద్రచారి, మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్, తిరుపతి, కుమారస్వామి, తిరుపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా ‘అప్పపల్లి’
పునాది దశలోనే అప్పపల్లి వంతెన ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి వాగుపై 2024 ఏప్రిల్లో రూ.1.86 కోట్లతో వంతెన పనులు ప్రారంభించారు. పునాది దశలోనే నిలిచి ఏడాది గడుస్తున్నా మళ్లీ ప్రారంభించలేదు. వర్షాలకు అప్పపల్లి, ఆర్ఆర్ కాలనీవాసుల ఇబ్బందులు పడుతున్నారు. అంకుసాపూర్కు వెళ్లే దారిలోని వాగుపై వంతెన ఎత్తు తక్కువ ఉండటంతో వరద వంతెన పైనుంచి పారుతోంది. సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతేడాది వంతెన తెగిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 2023లో అదే గ్రామానికి చెందిన బాలుడు వాగులో పడిపోవడంతో అతడిని రక్షించే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందాడు. -
పట్టణ పేదలకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): పట్టణ ప్రాంత పేదల కు ఉపాధిహామీ పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీ నర్ ముంజం ఆనంద్కుమార్ అన్నారు. మండలంలోని రాంపూర్లో మంగళవారం ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూ లీల వేతన బకాయిలు వెంటనే విడుదల చే యాలని, కూలీలకు రోజుకు రూ.600, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 30న కలెక్టరేట్ ముట్టడి కార్య క్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం, శ్రావణి, కూలీలు పాల్గొన్నారు. -
అనార్పల్లి వాగులో వరద
కెరమెరి(ఆసిఫాబాద్): గత వారంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు మండలంలోని అనార్పల్లి వాగులో వరద మొదలైంది. మళ్లీ మంగళవారం సైతం వర్షం పడటంతో అవతలి వైపు ఉన్న కరంజివాడ, పెద్ద కరంజివాడ, జన్కాపూర్, బోరిలాల్గూడ, శంకర్గూడ తదితర పది గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో బైక్లు కూడా వెళ్లడం కష్టంగా మారింది. ప్రతీ అవసరానికి కెరమెరి మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, మే నెలలోనే వరద రావడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజల సంక్షేమం కోసం అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయాలని, కలెక్టర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ గతంతో పోల్చితే ఈ ఏడాది వరి ధాన్యం సేకరణ అధికంగా జరిగిందన్నారు. భూభారతి చట్టంలో భాగంగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలి పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ను లక్ష్యాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్డీవో దత్తారావు, గృహనిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
తొలకరికే దారి తిప్పలు
గుండివాసుల గోస● వర్షాలకు వాగుల్లో మొదలైన వరద ● తెగిన తాత్కాలిక వంతెనలు ● రాకపోకలకు ఇబ్బందులుజిల్లాలోని వాగుల్లో తొలకరి వానలకే వరద మొదలైంది. వేసవిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మట్టిదారులు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని పలు గ్రామాలకు రహదారి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా వంతెనల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన నిర్మాణం దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికావడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తాత్కాలిక వంతెన తెగిపోయింది. గ్రామస్తులకు రవాణా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మొదట గుండి వంతెన నిర్మాణానికి 2006లో రూ.3.60 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేశారు. పిల్లర్ దశ వరకు పనులు చేపట్టారు. ఆ తర్వాత పిల్లర్ల ఎత్తు పెంచాలని 2024లో రూ.3.25 కోట్లతో టెండర్లు మళ్లీ పిలిచారు. టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వంతెన కోసం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన సైతం తెలిపారు. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గుండి గ్రామం ఉంది. వాగు ఉప్పొంగితే దుబ్బగూడ, కోమటిగూడ నుంచి 30 కిలోమీటర్లు తిరిగి ఆసిఫాబాద్ పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా వర్షాకాలంలో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల వర్షానికి గుండి వాగులో తెగిన తాత్కాలిక వంతెనవాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం ఖమాన, కనర్గాం మీదుగా కాగజ్నగర్ వెళ్లే రహదారిలోని వాగుపై 2006లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి పలుమార్లు కాంట్రాక్టర్లు మారుతున్నా పనులు మాత్రం పూర్తికావడం లేదు. పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. 2023లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెన కోసం నిర్మించిన పిల్లర్ల పైనుంచి ప్రవాహం వెళ్లింది. వంతెన నిర్మాణంలో మార్పు కోసం ఇంజినీరింగ్ అధికారులు కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా మళ్లీ పనులు చేపట్టేందుకు టెండర్ వేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు అప్పట్లో వెల్లడించారు. కానీ ఇప్పటికీ కదలిక కనిపించడం లేదు. ఏటా వర్షాకాలం ముగిసిన తర్వాత నందూప, చోర్పల్లి గ్రామస్తులు సొంతంగా రూ.వేలు ఖర్చు చేసి తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వంతెన తెగిపోయింది. వాంకిడి మండల కేంద్రంలోని ప్రజలు ఖమాన, కనర్గాం, చోర్పల్లి, నందూప, అంకుసాపూర్ మీదుగా కాగజ్నగర్ పట్టణానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అదే ఆసిఫాబాద్ మీదుగా వెళ్లాలంటే దాదాపుగా 40 కి.మీ.లు ప్రయాణించాలి.చొరవ చూపాలి వంతెన నిర్మాణ పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్ పిల్లర్ ఎత్తు వరకు పనులు చేసి అసంపూర్తిగా వదిలేశాడు. ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. వంతెన పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – రవీందర్, మాజీ ఎంపీటీసీ వంతెన నిర్మించాలి అనార్పల్లి వాగుపై వంతెన నిర్మించాలని ఏళ్లుగా అధికారులను వేడుకుంటున్నాం. గతంలో నిధులు మంజూరు కాగా, పనులు సైతం ప్రారంభించారు. కానీ అర్ధంతరంగా ఆగిపోయాయి. జూన్ ప్రారంభం కాకముందే వర్షాలు పడుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. – కుమురం బొజ్జు పటేల్, కరంజివాడ, మం.కెరమెరి కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. మా ఊరికి వెళ్లాలంటే వాగుపై వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలంలో చిన్నవానకే వాగు ఉప్పొంగుతుంది. ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. వంతెన పనులు ప్రారంభించి 19 సంవత్సరాలు అవుతున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. – రవి, గుండి, మం.ఆసిఫాబాద్ 40 కి.మీ.లు తిరిగి వెళ్లాలి మా గ్రామం నుంచి నందూప మీదుగా కాగజ్నగర్ 20 కి.మీ.లు మాత్రమే ఉంటుంది. పని నిమిత్తం కాగజ్నగర్ పట్టణానికి వెళ్లాలంటే వాంకిడి, ఆసిఫాబాద్ మీదుగా 40 కి.మీ.లు తిరిగి వెళ్లాలి. వర్షాకాలం అనంతరం తాత్కాలిక వంతెన ఉండటంతో ప్రయాణం సులువవుతుంది. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి శాశ్వత వంతెన నిర్మాణం పూర్తిచేయాలి. – నగోషె కేశవ్రావు, దుబ్బగూడ, మం.వాంకిడి●ఏళ్లుగా పిల్లర్ల దశలోనే.. -
కొనుగోళ్లలో అక్రమాలు!
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న రెండు గ్రామాల రైతుల నుంచి రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి కొనుగో ళ్లు చేసినట్లు విజిలెన్స్ అధికారుల అంతర్గతంగా ని ర్వహించిన విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట జిల్లాలో పని చేసిన, చేస్తున్న కార్యదర్శులు, ఏఈవోలు, కంప్యూటర్ ఆపరేటర్లను పిలిపించి విచారించారు. అలాగే పలువురు ప్రైవేటు పత్తి వ్యాపారులను సైతం పిలిచి వారి రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది. సీసీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తి..గత వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేసినట్లు అంచనా. పత్తి మద్దతు ధర రూ.7,521గా సీసీఐ నిర్ణయించింది. జిల్లాలో 68,267 మంది రైతులు నేరుగా సీ సీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు సీసీఐ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు జిన్నింగ్ మిల్లు వ్యాపారులు 1,33,800 క్వింటాళ్ల ప త్తిని కొనుగోలు చేశారు. అయితే ఇక్కడే బడా జి న్నింగ్ వ్యాపారులు సీసీఐ అధికారులతో చేతులు క లిపి అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రై వేటులో తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకునే తిరిగి రూ.7,521 ధర చొప్పున సీసీఐకి విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. విచారణ చేపట్టిన విజిలెన్స్..భారీస్థాయిలో అక్రమ కొనుగోళ్లు జరిగాయన్న ఫిరా దులు అందడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లాలో పత్తి కొనుగోళ్ల సమయంలో పనిచేసిన సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేట ర్లను వారం రోజుల కిందట కరీంనగర్ కార్యాలయానికి పిలిచి విచారించారు. పలు రికార్డులు పరిశీలించి.. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయించారు. అదే సమయంలో రూ.18 కోట్లకు పైగా విలువైన పత్తిని అక్రమంగా కొనుగోలు చేసిన ఇద్దరు ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పక్కాగా అక్రమాలు జరినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయానికి వచ్చిన పత్తి వాహనాలు(ఫైల్) వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కు! రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి అక్రమంగా కొనుగోలు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసిన బాగోతం వివరాలు సేకరిస్తున్న అధికారులుబాగోతం జరిగిందిలా...జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసినా.. అసలు పంట ఎన్ని ఎకరాల్లో వేశారనేది నిర్ధారణ జరగకపోవడంతో అక్రమాలకు తావిచ్చినట్లు సమాచారం. ఆన్లైన్లో కచ్చితమైన పంట వివరాలు నమోదు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యాపారులు ఈ అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. ఏటా పత్తి కొనుగోళ్ల సమయంలో సీసీఐ, వ్యవసాయ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీ మొత్తంలో మామూళ్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ ఇద్దరు వ్యాపారులే తాజాగా జరిగిన కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు తమ జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులు జారీ చేసే పంట నిర్ధారణ పత్రాలు, టీఆర్ల ఆధారంగా దోపిడీకి తెరతీసినట్లు సమాచారం. కొందరు రైతుల పేరిట రూ.18 కోట్లకుపైగా విలువచేసే పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్నారు పత్తి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సీసీఐ, కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేటర్ల నుంచి విజిలెన్స్ అధికారులు అడిగి తెలుసుకున్న మాట వాస్తవమే. అయితే కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. వారి తుది నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. – అష్పాక్ అహ్మద్, ఏడీ, మార్కెటింగ్ శాఖ -
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో సోమవారం లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంలో సర్వేయర్ల పాత్ర కీలకమైందన్నారు. చట్టంతోపాటు భూమి కొలతల్లో ప్రతీ అంశంపై అవగాహన ఉండాలని సూచించారు. వారసత్వ పాలు పంపకాలు, కొనుగోలు పట్టాల మార్పిడిలో సర్వేయర్లు మోకాపైకి వెళ్లి కొలతలు తీసి నక్ష సమర్పించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు ఉండవన్నారు. 50 రోజులపాటు శిక్షకులు నేర్పించే అంశాలపై పట్టుసాధించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా భూమి కొలతల అధికారి సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారిణికి ఆర్థికసాయం
ఆసిఫాబాద్అర్బన్: ఆసియా కప్ అత్యాపత్యా పోటీలకు ఎంపికై న క్రీడాకారిణి గెడం సుహాసినిని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శాలువాతో సన్మానించారు. రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల పాఠశాలలో సెకండియర్ చదువుతున్న సుహాసిని ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు కేరళలో జాతీయస్థాయి సీనియర్ ఫెడరేషన్ అత్యాపత్యా పోటీల్లో ప్రతిభ చూపింది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు వెస్ట్ బెంగాల్లో జరిగే ఆసియా కప్ పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమంలో నాయకులు కలాం, రవీందర్, ఖోఖో ఇండియా కోచ్ రాకేష్ పాల్గొన్నారు. -
పోడు సాగు అడ్డుకోవడం అన్యాయం
● సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుపెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం జైహింద్పూర్ గ్రామ శివారులో సోమవారం అటవీశాఖ అధికారులు పోడు భూములను దున్ని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నారనే విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోడు రైతులతో మాట్లాడారు. కొత్తగా అటవీ భూమిని ఆక్రమించవద్దని పేర్కొన్నారు. పోడు రైతులను ఇబ్బంది పెట్టి వారి జీవనోపాధికి అంతరాయం కలిగించవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంవత్సరం ఫారెస్ట్ ల్యాండ్ రిట్రీవల్ పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటేది లేదని ఫారెస్ట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని పోడు రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, అండగా నిలిచి పంటల సాగుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
సరిహద్దులో ఏనుగుల సంచారం
చింతలమానెపల్లి(సిర్పూర్): సరిహద్దుల్లో ఏనుగుల సంచారంతో జిల్లా అటవీశాఖ అప్రమత్తమైంది. గతేడాది ఏప్రిల్లో చింతలమానెపల్లి మండలం బూరెపల్లి, పెంచికల్పేట్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు చంపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. జిల్లా నుంచి ఏనుగు సరిహద్దు దాటేవరకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని మురుంగావ్ అటవీ ప్రాంతంలో సుమారుగా 25కు పైగా ఏనుగులు ఉన్న గుంపు తిరుగుతూ ఉంటుంది. ఈ ఏనుగుల గుంపు నుంచే జిల్లాకు గతేడాది ఏనుగు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. తాజాగా అదే గుంపునకు చెందిన ఏనుగులు గడ్చిరోలి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించాయి. మూడు నెలల నుంచి గడ్చిరోలి జిల్లా కేంద్రం సమీపంలోని కాఠాని, వైన్గంగ నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల సమీపంలో తిరుగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి ఏకంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి రావడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం కోసం సంప్రదింపులుగడ్చిరోలి నుంచి చాముర్షి వరకు ఉన్న అటవీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉంది. గడ్చిరోలి జిల్లాలోని ఆష్టి సమీపంలోని అటవీ ప్రాంతం చింతలమానెపల్లి మండలానికి ప్రాణహిత నది మాత్రమే హద్దుగా ఉంది. గతేడాది ఇదే ప్రాంతం నుంచి ఏనుగు మన జిల్లాలోకి ప్రవేశించింది. చాముర్షి తాలూకా కేంద్రం సమీపంలోని వ్యాడ్ గ్రామంలో ఒక యువకుడిపై నెల రోజుల క్రితం ఏనుగు దాడి చేయడంతో మృతి చెందాడు. గడ్చిరోలి పట్టణానికి మన సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల రోడ్డుమార్గం ఉండగా.. అటవీ ప్రాంతం గుండా 50 లేదా 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర అటవీ అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నారు. ఏనుగులు సంచరిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండగా.. వాస్తవాలు తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఖర్జెల్లి ఎఫ్ఆర్వో ఇక్బాల్ మాట్లాడుతూ.. సమాచారం కోసం గడ్చిరోలి జిల్లా అటవీ అధికారులతో సంప్రదించామని తెలిపారు. స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏనుగులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు తక్కువని తెలిపారు. అప్రమత్తమైన జిల్లా అటవీశాఖ -
కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం
దహెగాం(సిర్పూర్): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అలీ, ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని ఇట్యాల గ్రామంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, నాయకులు గజ్జెల సురేశ్, బ్రహ్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
● ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్న అర్జీదారులు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్నంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మురుగు కాలువను ఆక్రమించడంతో మురుగు నీరంతా ఇంట్లోకి చేరుతుందని, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ పట్టణం ఇర్ఫాన్నగర్కు చెందిన పర్రె శ్రీకాంత్ కోరాడు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఇతరులు ఆక్రమించారని, న్యాయం చేయాలని కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన మడే లక్ష్మయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామ శివారులోని భూమిని ఆక్రమించారని మిట్ట మల్లన్న ఫిర్యాదు చేశాడు. సింగరేణి ఉపరితల గనిలో తిర్యాణి మండలం దేవాయిగూడ గ్రామంలోని ఇళ్లను కోల్పోయామని నష్టపరిహారం ఇచ్చి ఉపాధి చూపాలని రెబ్బెన మండలం గోలేటిలోని గౌతమ్నగర్కు చెందిన బోయిని సురేందర్ దరఖాస్తు చేసుకున్నాడు. పోస్టాఫీస్లో డిపాజిట్ చేసిన రూ.లక్ష ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణంలోని నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ అర్జీ సమర్పించింది. తమ గ్రామానికి తాగునీటిని అందించాలని సిర్పూర్(యూ) మండలం రాఘవాపూర్ పంచాయతీ పరిధిలోని మారుగూడ గ్రామస్తులు కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని వాంకిడి మండల కేంద్రంలోని కేబీ నగర్ కాలనీవాసులు విన్నవించారు. తన కుమార్తె పిడుగుపాటుతో మరణించిందని, ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందించాలని బెజ్జూర్ మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కోరాడు. అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, పక్కన అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆలయ స్థలానికి హద్దులు నిర్ణయించాలిజిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఆలయ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. స్థలం ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి తూర్పు వైపు నుంచి వెళ్తున్న రహదారికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండా వెంకన్న, కోశాధికారి పిన్నా వివేక్, డాక్టర్ మధు, రాధాకృష్ణచారి, కృపాల్, ప్రకాశ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పాత స్టేషన్.. నయా కిడ్స్జోన్
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి పోలీస్ స్టేషన్ నూతన భవనంలోకి మారిన తర్వాత పాత భవనం సీఐ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. అక్కడ ఖాళీగా ఉన్న గదులు, హాల్ పిల్లలకు ఉపయోపడాలనే ఉద్దేశంతో ఏఎస్పీ చిత్తరంజన్ సరికొత్త ఆలోచన చేశారు. చిన్నారులను ఆకర్శించేలా హాల్లో ఆట వస్తువులు, బొమ్మలు, బెలూన్స్ ఏర్పాటు చేసి కిడ్స్ జోన్గా రూపొందించారు. చెస్, క్యారమ్, కిక్ బాక్సింగ్ కిట్, బాల్స్ టబ్, జారుడు బల్ల, తదితరాలు అందుబాటులో ఉంచిన ఈ కిడ్స్జోన్ ను సీఐ సత్యనారాయణతో కలిసి ఏఎస్పీ సోమవా రం ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ క్వార్టర్లలో నివాసం ఉంటున్న పిల్లలకు ఆటలాడుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పాత పోలీస్స్టేషన్ భవనంలో కిడ్స్ జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 15 మంది చిన్నారులకు ఉపయోగపడేలా ఆట వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు. పిల్లలు ఒకేచోట ఆడుకోవడం, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వారిలో స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. తిర్యాణి మండలంలోని పాత పోలీస్ స్టేషన్ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు వినియోగించుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రశాంత్, మధుకర్, ఏఎస్సై పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీ స్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్(16) పెద్దవాగులో ఈతకు వెళ్లి మృతి చెందినట్లు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్ ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుని, ఆ తర్వాత పెద్దవాగుకు స్నానం చేసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కు టుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. పెద్దవాగులో ఆదివారం మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి పిప్పిరే చరణ్దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
విచారణ వేగవంతం
● పులిని హతమార్చిన కేసులో 30 మంది అరెస్టు ● మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ● ఇకనైనా వేటగాళ్ల తీరు మారేనా..?పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో ఈ నెల 15న పెద్దపులిని హతమార్చిన కేసు విచారణలో అటవీశాఖ అధికారులు వేగం పెంచారు. పెద్దపులి చర్మం, అవశేషాలు స్వాధీనం చేసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు అగర్గూడ, ఎల్లూర్, కోయచిచ్చాల, దహెగాం మండలం చిన్నరాస్పెల్లి, అమరగొండ, గెర్రె, ఖర్జీ గ్రామాలకు చెందిన 30 మంది ఆసిఫాబాద్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఆరు నుంచి ఎనిమిది మందిని అనుమానితులను రిమాండ్కు తరలించే యోచనలో అటవీశాఖ ఉన్నట్లు సమాచారం. పెంచికల్పేట్ రేంజ్లో కే8 అడ్డా..ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెద్దపులిని చారలు, ఇతర ఫొటోల ఆధారంగా కే 8గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. కాగజ్నగర్ మండలంలోని కడంబా అటవీ ప్రాంతాన్ని 2014 సంవత్సరంలో ఫాల్గుణ పెద్దపులి ఆవాసంగా మార్చుకుంది. రెండు విడతల్లో ఫాల్గుణ ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. దీనికి పుట్టిన కే8 పెద్దపులి ఆరు నెలల వయస్సు నుంచి పెంచికల్పేట్ రేంజ్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. బెజ్జూర్ మండలంలోని మత్తడి, ఏటిగూడ, పాపన్పేట్, పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, ఎల్లూర్, మెరెగూడ, కమ్మర్గాం, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, కుశ్నపల్లి రేంజ్ వరకు సంచరించింది. పెంచికల్పేట్ మండలం మురళీగూడ వద్ద ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు సైతం రాకపోకలు సాగించింది. కే8 పెద్దపులి 2021 సంవత్సరంలో పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. గత మూడేళ్లుగా ఈ పెద్దపులికి సరైన ఆవాసం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. అప్పటి నుంచి ఒంటరిగానే తిరుగుతోంది. దాని సంచారాన్ని అటవీశాఖ సరిగ్గా అంచనా వేయకపోవడంతోనే వేటగాళ్ల విద్యుత్ తీగలకు బలై పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. తీరు మారేనా.. కవ్వాల్ అభయారణ్యానికి మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యానికి మధ్య కారిడార్గా ఉన్న కాగజ్నగర్ డివిజన్లో అటవీశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దపులులతో పాటు పెద్దఎత్తున వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. ఘటనలు జరిగినప్పుడు హ డావుడి చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా వన్యప్రాణుల సంచారం ఎక్కువగా కాగజ్నగర్ డివిజన్లో వేటగాళ్లు రెచ్చి పోతున్నారు. సిర్పూర్(టి), బెజ్జూర్, పెంచికల్పే ట్, కౌటాలా, ఖర్జెల్లి రేంజ్ల్లో కొంతమంది వేటను వృత్తిగా మార్చుకున్నారు. విద్యుత్ తీగలు, ఉచ్చులు, విష ప్రయోగం చేసి వేటాడుతున్నారు. జిల్లాలోని పలు అనుకూల ప్రాంతాలను వెతుక్కుంటూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని తడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పెద్దపులులు సంతానోత్పత్తికి కోసం తరలివస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, గడ్డిమైదానాలు, నిరంతరం నీటి లభ్యతతో ఈ ప్రాంతాలను ఆవాసంగా మార్చుకున్నాయి. గడిచిన పదేళ్లలో వాటి సంఖ్య గణనీయం పెరిగింది. పులుల సంరక్షణకు నిధులు కేటాయిస్తున్నా అధికారులు వాటి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. కాగజ్నగర్ డివిజన్లోని దరి గాం ప్రాంతంలో రెండు పెద్దపులులు, తాజాగా ఎ ల్లూర్ అటవీ ప్రాంతంలో మరో పులి వేటగాళ్ల వి ద్యుత్ తీగలకు బలికావడంతో ఆందోళన కలిగిస్తుంది. కే 8 పెద్దపులిని హతమార్చిన ఘటనలో అట వీశాఖ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎ న్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వేటను వృత్తిగా మార్చుకున్న వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు అటవీప్రాంత సమీప ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’ నిర్మాణం
బెజ్జూర్(సిర్పూర్): బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. సుశ్మీర్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు రియాజ్, అన్నయ్య గౌడ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యంకౌటాల: కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమ ని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీలు శారద జగ్గాగౌడ్, పుష్పలత, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మండల అధ్యక్షులు విశ్వేశ్వరరావు, గంగారాం పాల్గొన్నారు. -
గుట్టలుగా డంప్!
● జిల్లాకు భారీగా నకిలీ విత్తనాలు సరఫరా ● పోలీసుల తనిఖీల్లో క్వింటాళ్ల కొద్దీ పట్టివేత సమాచారం అందించాలి గతేడాది రూ.30లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. జిల్లా అధికారి ఆదేశానుసారం అప్రమత్తతతో ఉంటూ తనిఖీలు చేపడుతున్నాం. అమాయక రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. నకిలీ పత్తి విత్తనాల క్రయవిక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలి. – రాణా ప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ బెజ్జూర్(సిర్పూర్): ఈ ఏడాది సాగు పనులు ముందే మొదలయ్యాయి. జోరుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు గుట్టలుగా నకిలీ విత్తనాలను జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు నకిలీ విత్తనాలు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. రెండు నెలలో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.82 లక్షల విలువైన 27 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాజాగా బెజ్జూర్ మండలం సుశ్మీర్ కృష్ణపల్లి గ్రామాల్లో రెండు క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ ఆదివారం తెలిపారు. కుక్కుడ గ్రామానికి చెందిన ప్రశాంత్, అనిల్, సుశ్మీర్ గ్రామానికి చెందిన సురేశ్, సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన అశోక్పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. దళారులదే రాజ్యం..రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతమంది దళారులుగా ఏర్పడి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంట గడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో తయారైన ఈ వి త్తనాల విక్రయాల్లో అధికశాతం మంది ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పట్టు సాధించిన వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముఠాలు ఈ ప్రాంత రైతులతో సాన్నిహిత్యం పెంచుకుని న మ్మకాన్ని చూరగొంటున్నాయి. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండటంతో ప్రాణహిత నది పరీవా హక ప్రాంతాల వెంట అధికారులకు చిక్కకుండా న కిలీ విత్తనాలను తరలిస్తున్నారు. ఆయా మార్గాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా అడ్డుకట్ట పడటం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలోకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా డంప్ చేసి ఉంచుతున్నారు. అడ్రస్ లేని కంపెనీల్లో తయారైన విత్తన ప్యాకెట్లపై తయారీ తేదీ, వ్యాలిడిటీ, ఇతర వివరా లు ఉండటం లేదు. గోనె సంచుల్లో గ్రామాల్లోకి తరలిస్తున్నారు. కొందరు ఒరిజినల్ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. లైసెన్స్ పొందిన కొందరు డీలర్ల అండదండలతోనే దళారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఘటనలుపోలీసుల అప్రమత్తత, టాస్క్ఫోర్స్ తనిఖీలతో ఇ టీవల రూ.లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్తోపాటు, మండల పోలీసు స్టేషన్లకు కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. ● రెండు నెలల క్రితం చింతలమానెపల్లిలో రూ. 10.50 లక్షల విలువైన 3 క్వింటాళ్ల నకిలీ విత్తనా లను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ● 15 రోజుల క్రితం రూ.12 లక్షల విలువైన నా లుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ● తాజాగా శనివారం రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల బీటీ– 3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నుంచి కాగజ్నగర్కు 20 క్వింటాళ్ల విత్తనాలను తరలిస్తున్న ఐచర్ వాహనంలో తనిఖీ చేసి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. -
వీడేనా..?
అటవీ చిక్కులు లింగాపూర్ మండలం జాములధార గ్రామం నుంచి పంగిడిమాదార గ్రామం వరకు 10 కి.మీ.ల రోడ్డు ఉంది. గతంలో ఈ రోడ్డు బీటీతో వేశారు. కానీ ఇసుక వాహనాల రాకపోకలతో మట్టిరోడ్డులా మారింది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు లేక నిర్మాణానికి నోచుకోలేదు. ఆ రోడ్డు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మధ్యలో ఉన్న సుమారు 20 అనుబంధ గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయి. ఇది తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, కౌటాగాం, గీసిగూడ, కేరిగూడ, తాటిగూడ గ్రామాలకు వెళ్లే రహదారి. ఐదళ్ల క్రితం బీటీరోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు అడ్డుగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. నిధులు మంజూరు కావడంతో అధికారులు సర్వే సైతం నిర్వహించారు. అనుమతులు లేక ప్రారంభానికి నోచుకోలేదు. వర్షాకాలంలో వాహనాల రాకపోకలు అటుంచితే కనీసం కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారుతుంది. వాంకిడి(ఆసిఫాబాద్): ‘పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారుల పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలి. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అనుమతులు జారీ చేయాలి. అవసరమైతే అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగేలా చూడాలి..’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అనుమతులపై ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలివి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రగతికి అటవీ అనుమతులు అడ్డంకిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల సమావేశంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అనుమతులు లేక అర్ధంతరంగా నిలిచిన రోడ్ల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా తొలగని అడ్డంకులు ప్రగతికి దూరంగా మారుమూల గ్రామాలు మంత్రుల సమీక్షతో చిగురిస్తున్న ఆశలు వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రూ.7కోట్లు మంజూరు చేసింది. ఖమాన గ్రామం నుంచి సర్కేపల్లి వరకు 9 కిలోమీటర్ల దారి నిర్మించాల్సి ఉండగా అటవీ అనుమతులు అడ్డురావడంతో 6 కి.మీ.లు మాత్రమే పనులు పూర్తి చేశారు. ఖమాన నుంచి మారెపల్లి వరకు పూర్తి కాగా.. అక్కడి నుంచి సర్కేపల్లి వరకు పనులు నిలిచిపోయాయి. మూడు కిలోమీటర్ల మేర మూడు ఒర్రెలు ఉండగా ఏటా భారీ వర్షాల సమయంలో అటు వైపు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. రోడ్డంతా బురదమయంగా మారి అత్యవసర సమయంలో గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. -
తెగిన గుండి వాగు తాత్కాలిక వంతెన
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని గుండి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ప్రతీ సంవత్సరం ఎండాకాలం వాగులో పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తుంటారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో నీటి ప్రవాహం ఎక్కువై వంతెన పైనుంచి నీరు ప్రహిస్తోంది. అదే గ్రామానికి చెందిన జాడి సంతోష్ ఉదయం 6 గంటలకు తన ఆటోలో ఆసిఫాబాద్ వెళ్లేందుకు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వంతెన కుంగిపోయింది. నీటి ప్రవాహంలో ఆటో కొంతమేర కొట్టుకుపోగా ట్రాక్టర్ సాయంతో గ్రామస్తులు ఆటోను బయటకు తీశారు. కాగా ప్రస్తుతం గుండి గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. -
బాలల సంరక్షణకు పాటుపడాలి
ఆసిఫాబాద్రూరల్: బాలల సంరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీసీపీవో మహేశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా టీ చర్లకు పోక్సో చట్టం 2012పై అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ లైంగిక దా డులకు గురైన బాలలను గుర్తించడానికి అనుసరించే విధానాలపై సూచనలు చేశారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు 1098 హె ల్ప్లైన్ను వినియోగించేలా వారికి మెలుకువలు నేర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, టీచర్లు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: మండలంలోని బురదగూడ గ్రామానికి గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని శనివారం కాగజ్నగర్ –ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా తమకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీడీవో కోట ప్రసాద్ స్పందించి గ్రామానికి చేరుకుని పరిశీలించారు. బురదగూడ గ్రామానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేశారు. అదేవిధంగా పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో రెండోదశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగి సింది. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలన్నారు. బోధన, అభ్యసన సామగ్రి ఉపయోగించి విద్యా బోధన చేయాలని, వచ్చే సంవత్సరం నుంచి అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్యా బోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ అమరేందర్, అనురాధ భాయ్, రమేశ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు ● మెరిట్లిస్ట్ విడుదల చేసిన మెడికల్ కాలేజీ ● అభ్యర్థులకు వల వేస్తున్న దళారులు ● ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూళ్లు
దళారుల ఎంట్రీ..వాస్తవంగా ఎంపిక ప్రక్రియ ఎలా జరిగినా.. చివరకు అభ్యర్థులకు వేతనాలు ఇచ్చేది ఏజెన్సీలే. దీంతో అర్హుల జాబితా విడుదల తరువాత కొన్ని ఏజెన్సీలకు ఈ పోస్టులను అప్పగిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం మూడు ఏజెన్సీలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్కు చెందిన ఓ ఏజెన్సీ ఇద్దరు రాష్ట్రమంత్రుల ద్వారా సిఫార్సు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడా ఏజెన్సీలు దళారులను రంగంలోకి దింపి ఒక్కో పోస్టును రూ. లక్షల్లో బేరం పెట్టినట్లు సమాచారం ఉంది.ఎవరినీ నమ్మొద్దు..ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుంది. వైద్య కళాశాల ఉద్యోగుల పేరు చెప్పి ఎవరైనా దళారులు పోస్టులు ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దు. మా పేర్లు చెప్పి డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫిర్యాదు చేయండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాలసాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కళాశాల మెరిట్లిస్ట్ విడుదల చేసింది. మెరిట్లిస్ట్లోని అభ్యర్థులతో కొందరు దళారులు పోస్టులు ఇప్పిస్తామంటూ బేరసారాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పోస్టును బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు అభ్యర్థుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మెరిట్లిస్ట్ను ప్రకటించిన మెడికల్ కాలేజీ పోస్టులను నేటి వరకు భర్తీ చేయలేదు. రెండు, మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈలోపే దళారులు రంగంలోకి దిగి బేరసారాలు చేస్తుండటంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో మార్పులు.. ప్రభుత్వం వైద్య కళాశాలలో వివిధ రకాల 52 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఈసారి ఔట్సోర్సింట్ పోస్టుల ఎంపిక ప్రక్రియ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను ఏజెన్సీలే చేపట్టేవి. ఏజెన్సీల నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని పోస్టులు భర్తీ చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జనవరిలో 52 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే దరఖాస్తులను అభ్యర్థులు నేరుగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు అందజేయాలని సూచించగా, వేలాది దరఖాస్తులు వచ్చాయి. నాలుగు నెలలుగా నాన్చుడే.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ అర్హుల జాబితాను ప్రకటించకపోవడం జిల్లా ఉన్నతాధికారుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. వైద్య కళాశాల విడుదల చేసిన మెరిట్లిస్ట్లో అత్యధికంగా డేటా ఎంట్రీ పోస్టుకు 552 మంది పోటీ పడుతున్నారు. తరువాతి స్థానం ల్యాబ్ అటెండెంట్ పోస్టుది. దీనికి 223 మంది పోటీలో ఉన్నారు. ఎలక్ట్రీషియన్కు 100 మంది, వార్డ్బాయ్కు 69, అనస్థీషియా టెక్నీషియన్కు 48, థియేటర్ అసిస్టెంట్కు 43, రేడియోగ్రఫీ టెక్నీషియన్కు 27, సిటీస్కాన్కు 24, డ్రైవర్కు 14, ఈసీజీ టెక్నీషియన్కు 13, గ్యాస్ ఆపరేటర్కు 10 మంది చొప్పున మెరిట్లిస్ట్లో ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న జిల్లా సెలెక్షన్ కమిటీ మెరిట్లిస్ట్ నుంచి 52 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే మెరిట్లిస్ట్ విడుదలై రోజులు గడుస్తున్నా అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే జాప్యం జరుగుతోందన్న వాదన విన్పిస్తోంది. -
పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న గ్రామ పాలన అధికారి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నోడల్ అధికారి ఆధ్వర్యంలో పూ ర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలు, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలు తరలించాలని తెలిపారు. పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు తరలించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సాంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలి..
కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకోవడానికి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణమే పరిష్కారం. ప్రాణహిత నదిపై గతంలో ప్రతిపాదించిన మేరకు ప్రాజెక్టు నిర్మించాలి. జిల్లాలోని వ్యవసాయ భూములకు, ఇతర అవసరాలకు నీటిని అందించవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తాం. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్యే -
కష్టాల కడలిలో కౌలు రైతు
● పెరిగిన విత్తన, ఎరువుల ధరలు ● ఏటా పెరుగుతున్న కౌలు ● పంట విక్రయంలోనూ ఇబ్బందులు ● జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులుతిర్యాణి: జిల్లాలోని కౌలు రైతులకు ఏటా కష్టాల కడలి ఈదక తప్పడం లేదు. పెరుగుతున్న కౌలు ధ రలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కౌలు రైతులు ఇప్పటికే భూ యజమానులకు డబ్బులు చెల్లించి ఆయా భూముల్లో పనులు ప్రారంభించారు. కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే కావడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేస్తుండడంతో వారిపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ పథకానికి దూరం..! సాధారణంగా భూమిలేని వారితో పాటు అరఎక రం, ఎకరం భూమి ఉన్నవారు ఇతర రైతుల వద్ద నుంచి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతుల కోసం ఆత్మీయ భరోసా పేరిట రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. భూమి లేని నిరుపేద కుటుంబాలై, ఉపాధిహామీ పథకంలో 20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దీంతో జిల్లాలో సగానికి పైగా కౌలు రైతులకు ఈ పథకం ఉపయోగపడడం లేదని ఆరోపణలున్నాయి. కాగా జిల్లాలో దాదాపు 30వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రూ. 15వేల వరకు ధర.. మూడేళ్ల క్రితం వరకు కౌలు ధరలు అంతంత మా త్రంగానే ఉండేవి. కానీ క్రమంగా కౌలు ధరలు పె రుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ.15 వేల వరకు కౌలు ధర ఉంది. రా ష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా, కేంద్ర ప్ర భుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి భూ య జమానులకే దక్కుతోంది. దీంతో కౌలు రైతులకు ఆర్థికసాయం అందని ద్రాక్షగానే మిగులుతోంది. చివరిదాక కష్టాలే.. కౌలు రైతుకు సీజన్ ప్రారంభం నుంచి సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలే ఎదురవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలుతో పాటు పంటలను విక్రయించేందుకు సైతం పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరిగా మారాయి. ఈ క్రమంలో పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్లు ఇచ్చేందుకు భూ యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం, పండించిన పంటను అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించి కౌలు రైతులు మోసపోతున్నారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటు ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి సాగు చేసిన పంటలను నష్టపోతుండడంతో కౌలు రైతుకు ఆశించిన ఫలితం రావడం లేదు.ఐదెకరాల్లో కౌలు చేస్తున్నా..నాకు ఎకరం భూమి ఉంది. మా ఊళ్లోనే మరో ఐదెకరాలను రూ. 50 వేలకు కౌలుకు తీసుకొని పత్తి పంట వేసిన. కౌలు డబ్బులు కాకుండా పంట సాగుకు రూ.90 వేల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా ఐదెకరాల్లో పత్తి సాగుకు రూ.1.40 లక్షలు ఖర్చు వస్తుంది. అకాల వర్షాలతో వచ్చిన కాత సరిగా కాయకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. గత ఏడాది పంట దిగుబడి రాక రూ. 20 వేలు నష్టపోయాను. ప్రభుత్వం రైతుభరోసా ఇచ్చి ఆదుకోవాలి. – కోట సుభాష్, కౌలు రైతు, దుగ్గపూర్, మం. రెబ్బెన -
అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖఆసిఫాబాద్రూరల్: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నా రు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, అటవీ శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి నదీంతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో లోకేశ్వర్, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అటవీ శాఖ అనుమతుల జారీ, అటవీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారి నిర్మాణ పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారులతో సమీక్షించి చేపట్టిన చర్యలు, పనుల పురోగతిపై ఈ నెల 28వ తేదీలోగా నివేదిక అందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్దోత్రే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జిల్లాలో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులలో అవసరమైన అటవీ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘కార్మికులకు అన్యాయం చేస్తున్న గుర్తింపు సంఘం’
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో కార్మికులపై అధిక పనిభారం మోపుతున్నా.. కనీసం స్పందించకుండా గుర్తింపు సంఘం కార్మికులకు అన్యాయం చేస్తోందని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. కైరిగూడ ఓసీపీలో శుక్రవారం హెచ్ఎంఎస్ నాయకులు పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మేనేజర్ శంకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలో ఐఈడీ ప్రకారం కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని, విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదన్నారు. ఇచ్చిన హామీలు మర్చి పోయి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈపీ ఆపరేటర్లు ఏ గ్రేడ్ వాహనాలు నడుపుతున్నందున ఖాళీలతో సంబంధం లేకుండా ఏ గ్రేడ్ పదోన్నతులు కల్పించాలన్నారు. ఓసీపీలో టెక్నీషియన్ల కొరతను నివారించాలని, బదిలీపై వచ్చిన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లకు ఆర్థికనష్టం జరగకుండా బేసిక్, కేటగిరీ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూష్, ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, ఎస్అండ్పీసీ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కిష్టస్వామి, ఆర్గనైజర్ బొట్ల కిష్టస్వామి పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకాగజ్నగర్టౌన్: రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణల్లోని స్టాక్ రిజిస్టర్ వివరాలు, రసీదు పుస్తకాలు పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ దుకాణాల్లో ఎరువులు, విత్తనాల ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతిరోజూ దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖీ చేసి, నివేదికలు అందించాలని సూచించారు. ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్, ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లుల పేరిట ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, మాతృమూర్తులను గౌరవించుకుందామన్నారు. పట్టణాల్లో గుర్తించిన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అర్హులను ఎంపిక చేయాలి రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులను ఎంపిక చేసి, జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నాటికి అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం మున్సి పల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీరాం, అమృత మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. రెబ్బెన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో ఏమైనా జాప్యం జరుగుతుందా.. కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా సాగుతుందా.. తదితర వివరాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ 17శాతం కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రోజుల తరబడి కేంద్రాల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. అకాల వర్షాలతో కేంద్రాల్లో వడ్లు తడిసిపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, కొనుగోళ్ల ప్రక్రియ, ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఆర్ఐలు ఉదయ్కుమార్, సౌమ్య, ఏవో దిలీప్కుమార్, ఏఈవో రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: నెట్బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని తన నివా సంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ మాట్లాడుతూ నెట్బాల్ బాల్ ట్రెడిషన్లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు సాయిదీక్ష, రోహాన్, ఫాస్ట్ ఫైలో వంశీవర్ధన్ ప్రతిభ చూపారని తెలిపారు. జాతీయస్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెట్బాల్ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.