Komaram Bheem
-
సాగులో సాంకేతికత
దహెగాం: రోజురోజుకూ సాగులో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అరకలు అదృశ్యమవుతుండగా ట్రాక్టర్లు, రోట్వేటర్లతో పొలాలు దున్నుతున్నారు. ప్రారంభంలో పంటలను క్రిమికీటకాల నుంచి కాపాడుకోవడానికి స్ప్రే పంపులు వినియోగించగా, తర్వాత తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మరింత టెక్నాలజీతో డ్రోన్లు వినియోగంలోకి వస్తున్నాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ప థకం కింద 40శాతం సబ్సిడీతో అందించనున్నారు. డ్రోన్ల సహాయంతో సుమారు 25 నిమిషాల్లోనే పది ఎకరాల్లో పంటలకు మందులు పిచికారీ చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలోని మూడు సహకార సంఘాలకు 40 శాతం సబ్సిడీతో అందించగా, వ్యక్తిగతంగా రైతులకు కూడా అందించనున్నారు. 4.50 లక్షల ఎకరాల్లో సాగు..జిల్లాలోని 15 మండలాల్లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో బోరు బావులపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. సాగులో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి తక్కువ ఖ ర్చుతో అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు సబ్సిడీపై మంజూరు చేస్తున్నా రు. ఈ క్రమంలోనే పంటలకు మందులు పిచికారీ చేయడానికి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎమ్ఏఎమ్) పథకం కింద స్ప్రే డ్రోన్లను 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. మూడు రోజు ల క్రితం సిర్పూర్ నియోజకవర్గంలోని దహెగాం, కౌటాల మండలం గురుడుపేట, కాగజ్నగర్ మండలం కొత్తపేట సొసైటీలకు సబ్సిడీపై మంజూరైన డ్రోన్లను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్ పంపిణీ చేశారు. సహకార సంఘాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా రైతులకు 40 శాతం సబ్సిడీపై అందిస్తామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 25 నిమిషాల్లో పదెకరాలు పిచికారీపంటలకు మందులు పిచికారీ చేయాలంటే తైవాన్ స్ప్రే, హ్యాండ్ పంపుతో సమయం ఎక్కువగా పడుతుంది. ఎకరం పొలం పిచికారీ చేయాలంటే అరగంట నుంచి గంట వెచ్చించాల్సి వస్తుంది. అయితే డ్రోన్ ద్వారా పదెకరాల పొలానికి పట్టే సమయం కేవలం 25 నిమిషాలేనని అధికారులు పేర్కొంటున్నారు. దీని ద్వారా రైతులకు సమయం ఆదా అవుతుంది. సొసైటీలకు ఇచ్చిన డ్రోన్లను ఆపరేట్ చేయడానికి పైలట్ను నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సొసైటీల వద్ద ఉన్న డ్రోన్లను రైతులు అద్దెకు తీసుకోవచ్చు. డ్రోన్లో 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంటుంది. స్ప్రే చేసే ముందు పొలం చుట్టూ తిరిగి హద్దులు పెట్టుకున్న తర్వాత ఆపరేటింగ్ చేస్తారు. రూ.6 నుంచి రూ.9 లక్షల విలువపంటలకు మందులు పిచికారీ చేసే ఒక్కో డ్రోన్ వి లువ రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అలాగే బ్యాటరీలు, ఒక జనరేటర్ సైతం అందిస్తారు. రైతులు సొంతంగా తీసుకుంటే అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. డ్రోన్ను అద్దెకు తీసుకుంటే గంటకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించా ల్సి ఉంటుంది. రోజుకు కనీసం 50 ఎకరాలకు పైగా నే మందులు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. -
రాంజీ గోండ్కు ఘన నివాళి
ఆసిఫాబాద్అర్బన్: తొలి స్వాతంత్య్ర యోధుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ రాంజీ గోండ్ 166వ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటంలో అనేక మంది ఆదివాసీలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు, స్థానిక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాయకులు రాజ్కుమార్, పవన్కుమార్, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో..జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అ ధ్యక్షురాలు ఆత్రం సుగుణ మర్సుకోల రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాంజీ గోండ్ చేసిన త్యాగాలు మరువలేనివని, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్కుమార్, తిరుపతి, గోపాల్, నాగోరావ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోఆప్షన్’కు పోటాపోటీ
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో పరిధిలో కోఆప్షన్ పదవుల సందడి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. నేటితో గడువు ముగియనుండగా, ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో తేలనుంది. ఎవరికివారు ప్రస్తుతం లాబీయింగ్ చేసుకుంటున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకున్నాయి. చైర్పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్గా డాక్టర్ కొత్తపల్లి అనిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికై న 60 రోజుల వ్యవధిలో కచ్చితంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. దీంతో అధికారులు ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం దరఖాస్తు గడువు ముగియనుంది. రెండో రోజులు దరఖాస్తుల పరిశీలన చేపట్టి తర్వాత ఎన్నిక తేదీని ప్రకటిస్తారు. పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి చెందిన వారికి పదవులు దక్కుతాయో వేచి చూడాల్సి ఉంది. మద్దతు కోసం లాబీయింగ్కోఆప్షన్ ఎన్నికలో సంఖ్యాబలం మాత్రమే కాకుండా అంతర్గత సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతీ ఓటు విలువైనదిగా మారనుంది. కౌన్సిలర్ల మధ్య గట్టి లాబీయింగ్ జరుగుతోంది. కౌన్సిలర్ల మద్దతు కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమి షం వరకు సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో స్పష్టత లేదు. చివరి క్షణంలో మారే సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. నిర్ణయాల్లో కీలకపాత్రమున్సిపాలిటీలో ఎన్నుకున్న కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తారు. పాలనలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కమిటీలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభివృద్ధి పనులపై సూచనలు ఇవ్వడం, స్థానిక సమస్యలను చర్చకు తీసుకురావడం. ప్రజల అవసరాలను అధికారులకు తెలియజేస్తారు. ప్రత్యక్ష్యంగా ఎన్నిక కాకపోయినా పాలనలో మాత్రం వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఆశావహుల్లో మాజీలుమున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్నారు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కోటాలో రెండు పదవుల కోసం మాజీ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల్లో కూడా మాజీలు అధికంగా ఉన్నారు. వీరంతా ఈ పదవులు దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటాలో ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్ట్లు పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా కొంతమంది కౌన్సిలర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకుని పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యతిరేకిస్తున్న ట్రాక్టర్ యజమానులు
ఇసుక రవాణాకు పాత విధానమే కొనసాగించా లని జిల్లాలోని ట్రాక్టర్ యజమానుల సంఘం కోరుతున్నారు. ఆన్లైన్ విధానం వద్దని ఈ నెల 7న ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం సైతం అందించారు. గతంలో రూ.1400 డీడీ చెల్లించి ఇసుక రవాణా చేసే విధానం ఉండగా, ఆన్లైన్ విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అమలు ఇబ్బందికరంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలతో ట్రాక్టర్ యజమానులు ఉపాధి కోల్పోతున్నారని చెబుతున్నారు. పాత విధానం కొనసాగించాలని, అప్పటివరకు ఇసుక రవాణా నిలిపి వేస్తామని ట్రాక్టర్ యజమానుల సంఘం స్పష్టం చేసింది. -
కుమురం భీం
7భానుడి భగభగ భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే సూర్యడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత , ఉక్కపోత అధికంగా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత కాస్త చల్లగా ఉంటుంది. మారనున్న బాసర రూపురేఖలు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర రూపురేఖలు మారనున్నాయి. సీఎం ఆలయ పునర్మిర్మాణ పనుల కు శంకుస్థాపన చేయగా, ఇటీవల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. 8లోu శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
దరఖాస్తు చేసుకుంటే అందిస్తాం
సాగులో సాంకేతికను పెంపొందించడానికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రోన్లు మంజూరు చేస్తుంది. మూడు రోజుల క్రితం దహెగాం, కొత్తపేట, గురుడుపేట సొసైటీలకు సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద మూడు స్ప్రే డ్రోన్లను అందించాం. రైతులకు కూడా 40 శాతం సబ్సిడీపై అందిస్తాం. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలి. పత్తి కట్టె, వరిగడ్డిని భూమిలో కలిపే మల్చర్ అనే యంత్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కట్టెను చిన్నగా కట్ చేసి ఎరువులా మార్చుకుంటే భూమికి పోషకాలు అందుతాయి. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి -
రుచికరమైన భోజనం అందించాలి
వాంకిడి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. వాంకిడి మండలం బెండార గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల తీరుపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులు గైర్హాజరు కావడాన్ని గమనించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గైర్హాజరవుతున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవీఎంల గోదాం పరిశీలనఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) భద్రపరిచే గోదాంను నెలవారీ తనిఖీల్లో గురువారం కలెక్టర్ హరిత పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు జమీల్, శ్యాంలాల్, ముసాఫిర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యానవనాన్ని పరిశీలించారు. -
గెలుపోటములు సహజం
రెబ్బెన: క్రీడల్లో గెలుపోటములు సహజమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. రెబ్బెన మండలం గోలేటిలోని భీమన్న స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 37వ వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జిల్లాకు చెందిన గంగాధర జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, అనంత రం మందమర్రి సింగరేణి ఫ్రెండ్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయడంలో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో మందమర్రి జట్టు 9 పరుగులు చేయగా, గంగాధర జట్టు 3 బంతుల్లో 12 పనులు చేసి విజేతగా నిలిచింది. గంగధర జట్టుకు రూ.35 వేల నగదు, కప్పు, మెడల్స్, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు, కప్పు, మెడల్స్ అందించారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్న, డీజీఎం సివిల్ మదీనా బాషా, పర్సనల్ హెవోడీ ఎస్వీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి
కాగజ్నగర్టౌన్: జిల్లాలో మే చివరి వారంలో నిర్వహించే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ జిల్లాలో రాష్ట్ర మహా సభలు నిర్వహించడం గొప్ప అవకాశమన్నా రు. రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాల గురించి చర్చించనున్నట్లు వివరించా రు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.త్రివేణి, రాజేందర్, దినకర్, కార్తీక్, రాజ్కుమార్, ఆనంద్కుమార్, కూశన రాజన్న, మాలశ్రీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారుడికి గుర్తింపు
కాగజ్నగర్టౌన్: ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, దివంగత ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకు గుర్తింపు దక్కిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని భట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయగా గురువారం బోర్డును ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే సమ్మయ్య సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కావేటి సాయిలీల మాట్లాడుతూ కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయడంలో చొరవ చూపిన ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కావేటి సమ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, వసీమున్నిసా, కావేటి విజయ్కుమార్, నాయకులు ఎమ్మాజీ సంతోష్, యూసుఫ్, కొండ్ర జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యాప్లో ఇసుక
ఆసిఫాబాద్: అక్రమ రవాణాను నియంత్రించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్, ఆన్లైన్ విధానంతో ఇసుక బుకింగ్ ప్రక్రియను ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చింది. కలెక్టర్ కె.హరిత జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ విధానం అమలు చేస్తున్నప్పటికీ కొత్త నిబంధనలు భారంగా మారాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా సామాన్యులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్లో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇంటి అనుమతి, ఇతర సర్టిఫికెట్లతోపాటు డ్రైవర్ లైసెన్సు, ట్రాక్టర్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో రవాణాకు నిర్దిష్ట సమయం లేకపోగా, కొత్త విధానంలో మాత్రం పగటిపూట మాత్రమే రవాణా చేయాలనే నిబంధన చేర్చారు. ధరల భారంమన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ చేయాలంటే యాప్లో ట్రాక్టర్కు రూ.775, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కింద రూ.115 చెల్లించాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత రవాణా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లాలో అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ.1400కు ట్రాక్టర్ ఇసుక లభించింది. తాజా నిబంధనలతో ప్రభుత్వానికి రూ.775 చెల్లించాల్సి ఉండగా, ఇతర ఖర్చులతో కలిపి ఒక్కో ట్రాక్టర్కు రూ.2500 వెచ్చించాల్సి వస్తోంది. నిర్మాణదారులపై దాదాపు రెట్టింపు భారం పడుతోంది. ట్రాక్టర్ యజమానులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగ ధరలు పెరుగుతుండగా తాజాగా ఇసుక ఆన్లైన్ బుకింగ్ పద్ధతితో మరింత భారంగా మారిందని ట్రాక్టర్ యజమానులు, నిర్మాణదారులు వాపోతున్నారు. కొత్త విధానంతో జిల్లాలోని నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పొరుగున్న ఉన్న మంచిర్యాల జిల్లాలో ఒక్కో ట్రాక్టర్కు రూ.445 చెల్లిస్తుండగా, మన జిల్లాలో ఒక్కో ట్రాక్టర్కు రూ.775 విధించడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 14 ఇసుక రీచ్లుఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, సిర్పూర్–టి, పెంచికల్పేట్, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం మండలాల్లో మొత్తం 14 ఇసుక రీచ్లను అధి కారులు గుర్తించారు. మన ఇసుక వాహనం బుకింగ్ ప్రక్రియ ఈ నెల 1న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 269 ట్రాక్టర్లు బుక్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 84 మందిపై 48 కేసులు నమోదు చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఫోన్ లేదా మీసేవలో ఇసుక బుకింగ్ చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల వరకు పొందవచ్చు. ఇతర నిర్మాణాలకు అనుమతి పత్రాలతోపాటు ట్రాక్టర్ డ్రైవర్ వివరాలతో యాప్లో బుక్ చేసుకోవాలి. – గంగాధర్, మైనింగ్ శాఖ ఏడీ -
విద్యార్థులకు ‘స్టార్’ అవార్డులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం అవార్డులు, స్టార్ ఆఫ్ ద మంత్ పేరుతో ప్రత్యేకంగా బ్యాడ్జీలు అందించినట్లు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్ఎం ఉమబాల మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత రాణించేలా స్టార్ అవార్డుల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. -
హామీలు నెరవేర్చాలి
రెబ్బెన: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తింపు సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్పీలో గురువారం టీబీజీకేస్ ఆధ్వర్యంలో ఫిట్ కార్యదర్శి రమేశ్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. శ్రీని వాసరావు మాట్లాడుతూ సింగరేణిలో రాజకీ య జోక్యం పెరిగిందని, కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అన్ఫిట్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడంతో వేలాది కుటుంబాలు అయోమయంలో ఉన్నాయని తెలిపా రు. ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో సింగరేణిలో ఉద్యోగులు ఎక్కువయ్యారని అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. నాయకులు మంగీలాల్, వెంకటేశ్, కిరణ్, శ్రీనివాస్, బొంగు వెంకటేశ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె’
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టిజన్లు, అన్మాన్, పీస్ రేట్, స్పాట్ బిల్లర్, ఇతర కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ అర్టిజన్లు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ మారుతి, కన్వీనర్ షేక్ నసీరొద్దీన్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. వారు మాట్లాడుతూ ఒకే సంస్థలో రెండు నిబంధనలు అమలు చేయడం సరికాదన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసి, విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలన్నారు. అన్మాన్ కార్మికులను ఆర్టిజన్గా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని కోరారు. 2026 పీఆర్సీ ప్రకారం వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్ కమిటీల నాయకులు బుచ్చి బాబు, లక్ష్మణ్, రాజేశ్, సతీశ్, మల్లేశ్, శిరీష, శ్రీకాంత్, రమేశ్, సలీం పాషా, సాగర్, ఏకాంబరం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి ఆధారం లేదు
నా భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేదు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలీ పనికి వెళ్తున్నాను. ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలి.– జాడి గున్నాబాయి, గంగాపూర్, మం.చింతలమానెపల్లి జాబితా సిద్ధం చేస్తున్నాంకొత్త పింఛన్ల కోసం నిత్యం దరఖాస్తులు వస్తున్నాయి. వాటి ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తాం. అర్హులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. – దత్తారావు, డీఆర్డీవో -
బీజేపీ కాగజ్నగర్ పట్టణ అధ్యక్షుడి రాజీనామా
కాగజ్నగర్టౌన్: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.శివకుమార్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంకు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తాను గతంలో దేశ సైనికుడిగా సరిహద్దుల్లో సేవ చేశానని, అనంతరం పంచాయతీ సెక్రెటరీగా పని చేశానన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా లాభం ఆశించకుండా సేవా భావంతో, హిందూ ధర్మంపై ఉన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష పదవిని ఇచ్చిందన్నారు. అనివార్య కారణాలు, సంస్థాగత లోపాలు తనను వెనక్కి నెట్టివేశాయని, దీంతో పట్టణ అధ్యక్షుడిగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో కొనసాగుతూ నా చివరి శ్వాసవరకు ధర్మం, దేశం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. -
జిల్లాలో దరఖాస్తుల వివరాలు
కౌటాల మండలం యాపలగూడ గ్రామానికి చెందిన బెడ్డల తుర్సబాయి భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇంటిపెద్ద లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్ర తినిధులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కొత్త పింఛన్ల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు కాలేదని స్పష్టం చేశారు. కుటుంబ పోషణకు ఆసరా లేక వితంతువులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, పింఛన్ల దరఖాస్తులు వేలాదిగా పెండింగ్లోనే ఉన్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు.కౌటాల: మలి వయస్సులో తోడెవరూ లేక వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో గోస పడుతుండగా.. వైకల్యంతో ఏ పని చేయలేక చేయూత కోసం దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం వీరంతా తిరగని ఆఫీసులు లేవు. అడగని అధికారి లేరు. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఏళ్లుగా కొత్త పింఛన్ల జాడ లేకపోవడంతో అర్హులకు చేయూత లేక అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి నుంచి మళ్లీ మంజూరు కాలేదని అర్హులు చెబుతున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నూతనంగా 2 లక్షల నూతన పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రజావాణికి వినతుల వెల్లువ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 52,635 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా నగదు సాయం అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పింఛన్ల కోసం అర్హులు ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో వినతులు సమర్పిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కరుణించేవారు కరువయ్యారు వృద్ధులు మృతి చెందితే వెంటనే వారికి వచ్చే వృద్ధాప్య పింఛన్ నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం కొత్తగా మంజూరు చేయడం లేదు. జిల్లాలో చేయూత పింఛన్ల కోసం నాలుగు వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య 982, వితంతు పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు 2,147 ఉన్నాయి. అందుబాటులో లేని పోర్టల్ వృద్ధాప్యంలో ఉన్నవారితోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పింఛన్ అందించి భరోసా కల్పిస్తోంది. కొత్త పింఛన్ల కోసం దరఖా స్తులు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేదు. నూతన ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి కాంగ్రెస్ 27 నెలలు గడిచిపోగా, నాలుగేళ్లకు పైగా కొత్తవాటి జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోసినా కనీసం మూడు వేలకు మందికి పైగానే కొత్త పింఛన్లు పొందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒంటరి మహిళలు 248దివ్యాంగులు 654వృద్ధులు 982వితంతువులు 2,147మొత్తం 4,031 -
డిగ్రీలో డుమ్మాలకు చెక్
ఆసిఫాబాద్రూరల్: ఆధునిక కాలంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యారంగంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యార్థులు, అధ్యాపకుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాత హాజరు పద్ధతులకు స్వస్తి పలకనుంది. డుమ్మాలకు చెక్ పెడుతూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థులకు, విధుల్లో అలసత్వం వహించే సిబ్బందికి చెక్ పెడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలను సరికొత్త శిఖరాలకు చేర్చే దిశగా ముఖ గుర్తింపు ప్రక్రియ మైలురాయిగా నిలవనుంది. బయోమెట్రిక్కు స్వస్తి ఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పని చేయకపోవడం, కృత్రిమంగా వేలిముద్రలు వాడటం వంటి కారణాలతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకువచ్చింది. రెయింట్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ సాగుతుంది. అధ్యాపకులు స్మార్ట్ఫోన్ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేయవచ్చు. అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి యాప్లో తమ పేరు, ముఖం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ద్వారా ప్రతిరోజూ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. కళాశాల లొకేషన్లో మాత్రమే యాప్ పని చేస్తుంది. ఫోన్లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్లో నమోదవుతుంది. దీంతో ఎంత మంది కళాశాలకు వచ్చారు.. ఎంత మంది గైర్హాజరయ్యారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. 4,583 మంది విద్యార్థులు జిల్లాలో 3 ప్రభుత్వ, 6 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా, 149 మంది అధ్యాపకులు, 4,583 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతోపాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారికి స్కాలర్షిప్ నిలిచిపోనుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.హాజరు శాతం పెరుగుతుందిఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్తో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. కళాశాలలో అధ్యాపకులు కూడా సక్రమంగా విధులకు హాజరవుతారు. ఎఫ్ఆర్ఎస్ సక్రమంగా అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీదేవి, కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి 330 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేశామని, జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుబోధ్కుమార్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చి సేవల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే నిధులను అత్యవసర మందులు, ఆక్సిజన్, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించాలని, ఇతర అవసరాలకు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్కు కేటాయించాలన్నారు. మార్చురీ వ్యాన్, అంబులెన్స్ కోసం, ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నందున అవసరమైన ఆపరేషన్ థియేటర్, పరికరాలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదించేందుకు కమిటీ సభ్యులు ఆమోదించినట్లు వెల్లడించారు. సమావేశంలో వైద్యులు, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బెజ్జూర్ ఆస్పత్రి తనిఖీ కౌటాల: బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ కె.హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులతోపాటు వార్డులు, పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సే వలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలని, గర్భిణులు ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలని, వడదెబ్బపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల, తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారం దిశగా ‘తొలిముద్ద’
రెబ్బెన: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనం అందిస్తుండగా, తాజాగా చిన్నారులకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకానికి ‘తొలిముద్ద’గా నామకరణం చేయగా, ఇటీవల సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ‘రెడీ టు కుక్’ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు అందించేలా పథకాన్ని రూపొందించారు. అయితే పథకం అమలుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. త్వరలో ఉత్తర్వులు రాగానే జిల్లాలోనూ ప్రారంభిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. 45,708 మంది చిన్నారులుజిల్లాలోని 15 మండలాలు పరిధిలో ఆసిఫాబాద్, జైనూర్, వాంకిడి, సిర్పూర్(టి), కాగజ్నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1,006 అంగన్వాడీ కేంద్రాల్లో 45,708 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. తాజాగా అమలు చేయనున్న ‘తొలిముద్ద’ పథకం ద్వారా వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అందడం లేదు. చాలామంది నేటికీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో 0– 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉండగా, వారిలో ఏ వయసు వారికి అల్పాహారం అందజేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.ఉత్తర్వులు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద అల్పాహారం పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. ఏ వయసు చిన్నారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారో ఇంకా తెలియలేదు. చిన్నారులకు అందించే అల్పాహారం రెడీ టు కుక్ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో సిద్ధం చేసి పిల్లలకు అందించాలా? లేక ప్యాకెట్లను నేరుగా పంపిణీ చేయాలా? అన్నది ప్రభుత్వం నుంచి అందే ఉత్తర్వుల్లో ఉంటుంది. ఆదేశాలు రాగానే పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతాం. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాజిపేట నుంచి బల్లార్షా వరకు రైల్వే మూడో లైన్ పనుల్లో భాగంగా కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగుపై చేపడుతున్న నూతన బ్రిడ్జి వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాక్స్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే క్రమంలో గాడర్లు జరిగి పశ్చిమబెంగాల్కు చెందిన రవితో పాటు రాజీవ్, అనుజ్, కన్నయ్య, ముస్తాఫా గాయపడ్డారు. రవి మాత్రం గాడర్ల మధ్యలో ఇరుక్కుని బయటకు రాలేకపోవడంతో తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు ధైర్యం చెబుతూ సిలిండర్తో ఆక్సిజన్ అందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి గాడర్లను కట్ చేసి క్షతగాత్రుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్ రోడ్– సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 208/23/13 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనులు చేపట్టే క్రమంలో కార్మికులకు హెల్మెట్, సెఫ్టీ బెల్ట్, జాకెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ పని ప్రదేశంలో కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సరైన రక్షణ పరికరాలు అందించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన రైల్వే వంతెన ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు ముంజం ఆనంద్కుమార్ డిమాండ్ చేశారు. గాయపడిన కా ర్మికులను బుధవారం పట్టణంలోని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఎలాంటి భద్ర త లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయించడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
కూలీల సంఖ్య పెంచాలి
ఆసిఫాబాద్: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో దత్తారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో బుధవారం ఎంపీడీవో శ్రీని వాస్, ఎంపీవో బుచ్చన్నతో కలిసి డివిజన్లోని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచుతూ, వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలన్నారు. ప్రతీ పంచాయతీలో కనీసం వందమంది కూలీలు పనిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా కూలీల హాజరు పక్కాగా నమో దు చేయాలన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. -
రైల్వే బ్రిడ్జిలో ఇరుకున్న కార్మికులు.. పరిస్థితి విషమం
కుమురం భీం ఆసిఫాబాద్ : కాగజ్నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. థర్డ్ లైన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ బ్రిడ్జ్ లో పనులు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఇద్దరు కార్మికులు బ్రిడ్జిలో ఇరుక్కపోయారు. దీంతో వారిలో ఒకరిని బయిటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరోకరు మాత్రం అందులోనే చిక్కుకోగా సహాయక చర్యలు అందిస్తున్నారు. వైద్యుల సమక్షంలో అక్కడే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతనిని తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం డీఈవో లలిత, డీఐఈవో రాందాస్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఓపెన్ పదో తరగతి పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 643 మంది విద్యార్థులు హా జరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 360 మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో కూల్చివేతలు
కాగజ్నగర్టౌన్: పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణలో కాగజ్నగర్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అక్రమ కట్టడాలను మంగళవారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రి గేటు సమీపం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ఎస్పీఎం క్వార్టర్స్ ప్రహరీ, ఖాళీగా ఉన్న ఎస్పీఎం క్వార్టర్లను కూల్చివేశారు. అగ్రసేన్ భవన్ సమీపంలోని మున్సిపల్ అద్దె భవనాలను సైతం కూ ల్చివేశారు. ఎస్పీఎం క్వార్టర్స్ తొలగింపుతో విస్తరణ పనులు వేగంగా జరుగుతాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
● విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా ● దాడులు ముమ్మరం చేసిన పోలీసుశాఖ ● ఇటీవల బెజ్జూర్లో రూ.90వేల విలువైన గంజాయి పట్టివేత
కౌటాల: మత్తు పదార్థాల రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో త క్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విక్రయాలు జరుపుతున్నారు. ము ఖ్యంగా మంచిర్యాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గతేడాది జిల్లాలో 73 గంజాయి రవాణా కేసులు నమోదు కాగా, 15.224 కిలోల గంజాయి, 1,118 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లుగా మార్చి విక్రయాలుజిల్లాలోని సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, వాంకిడి, సిర్పూర్(టి) మండలాల మీదుగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా మంచిర్యాల జిల్లాకు గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న మూడు కిలోల గంజాయిను బెజ్జూర్ పోలీసులు పట్టుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్లతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్ను రూ.300 నుంచి రూ.1000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బానిసలుగా మారుతున్న యువతజిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతికి అడ్డుకట్ట పడటం లేదు. చదువుకునే వయస్సులోనే యువత గ్యాంగ్లుగా మారి వ్యసనానికి బానిసవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సమాచారం పంచుకుంటున్నారు. మద్యంతో పోలిస్తే ఇతర మత్తు పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. వాటిని వదలలేకపోతున్నారు. గంజాయిలోని టెట్రా హైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. వ్యసనాన్ని మానకపోతే తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి సైతం దారి తీయొచ్చు. కేసులు నమోదు చేస్తాం గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలి. మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వినియోగం నేరం. అక్రమ దందాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తాం. మహారాష్ట్ర నుంచి రవాణా జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశాం. మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి. – బి.సంతోష్కుమార్, సీఐ, కౌటాల -
బడి పరీక్షలకు వేళాయె
ఆసిఫాబాద్రూరల్: పాఠశాల విద్యార్థులకు బుధవారం నుంచి ఈ నెల 1 వరకు సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ– 2) పరీక్షలు జరగనున్నాయి. దీని కోసం ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1వ నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:45 గంటలు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 9వ తరగతి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. వార్షిక పరీక్షలో 80 మార్కులు ఉండగా.. మిగతా 20 మార్కులు ప్రాక్టికల్స్లో ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. 75,218 మంది విద్యార్థులుజిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద మొత్తం 1,244 పాఠశాలలు ఉండగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు 75,218 మంది చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ నెల 18తో పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే ఎస్ఏ– 1తోపాటు పాఠ్యాంశాల మార్కులు, హాజరు వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారు. విద్యార్థుల వారీగా హాజరు, మార్కుల వివరాలను విద్యాశాఖ సంచాలకుల వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. 23న ప్రోగ్రెస్ కార్డులుఈ నెల 23తో 2025– 26 విద్యా సంవత్సరం ముగియనుంది. ఆ లోగా సంబంధిత ఉపాధ్యాయులు జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. 1వ నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు బేస్లైన్, మిడ్లైన్, ఎండ్లైన్ పరీక్షల ప్రగతిని ప్రధానోపాధ్యాయులు విధిగా ఆన్లైన్లో ఎంటర్ చేసే ప్రక్రియను ఈ నెల 22 వరకు పూర్తి చేయాలి. ఈ నెల 23న చివరి రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు వారి సమక్షంలోనే ప్రోగ్రెస్ కార్డులు అందించాలి. టైం టేబుల్ ప్రకారం నిర్వహించాలి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టైం టేబుల్ ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించాలి. మార్కుల వివరాలు ఆన్లైన్ నమోదు చేయాలి. ఈ నెల 23న తల్లిదండ్రుల సమక్షంలో ప్రోగ్రెస్ కార్డులు అందించాలి. – జనార్దన్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి -
పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
కాగజ్నగర్టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కాగజ్నగర్ పో లీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో సైకిల్ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్పీఎం గేటు నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా లారీ చౌరస్తా గుండా ర్యాలీ కొనసాగింది. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన సేవలను గుర్తు చేశారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మరింత స్మార్ట్..!
కెరమెరి: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి నూతన స్మార్ట్ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్లు అందించారు. 871 స్మార్ట్ఫోన్లు పంపిణీజిల్లాలోని 40 సెక్టార్ల పరిధిలో మొత్తం 1006 అంగ న్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 0– 6 నెల ల చిన్నారులు 2,855 మంది, మూడేళ్లలోపు వారు 18,657 మంది, 3– 6 ఏళ్ల లోపు వారు 24,196 మంది లబ్ధి పొందుతున్నారు. వీరితో పాటు 2,698 మంది బాలింతలు, 4,992 మంది గర్భిణులు, 19,635 మంది కిశోర బాలికలకు సేవలు అందుతున్నాయి. 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదా రులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం, డిస్ప్లేలు పగిలిపోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియ ల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అంగన్వాడీ సిబ్బందికి నూతన ఫోన్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 835 అంగన్వాడీ కార్యకర్తలు ఉండగా.. 31 మంది సూపర్వైజర్లు, ఐదుగురు బ్లాక్ కోఆర్డినేటర్లకు కలిపి మొత్తం 871 మందికి స్మార్ట్ఫోన్లను అందజేశారు. నెలకోసారి ఎఫ్ఆర్ఎస్ నమోదుఅంగన్వాడీ కేంద్రాల్లోని 3 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతినెలా ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్త ఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో మళ్లీ 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తసెల్ టవర్లు 5జీ నెట్వర్క్ అందిస్తున్న వేళ, 4జీ ఫోన్లతో భవిష్యత్తులో మళ్లీ పాత సమస్యలు పునరావృతం కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా అందించిన ఫోన్లుప్రాజెక్టు ఫోన్లు ఆసిఫాబాద్ 228 జైనూర్ 136 కాగజ్నగర్ 165 సిర్పూర్(టి) 189 వాంకిడి 117 సూపర్వైజర్లు 31 బ్లాక్ కోఆర్డినేటర్లు 5ఇక సేవలు వేగవంతంతాజాగా 4జీ సాంకేతికతతో కూడిన ఫోన్లు అందడంతో అంగన్వాడీ సేవలు వేగవంతం కానున్నాయి. ప్రతిరోజూ యాప్లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. -
‘అధ్వానంగా సింగరేణి కార్మికుల పరిస్థితి’
రెబ్బెన: కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కార్మికులకు 200కు పైగా హక్కులు సాధించి పెట్టామని తెలిపారు. కానీ ప్రస్తుత గుర్తింపు సంఘం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పనితీరును కార్మికులు గమనిస్తున్నారని, త్వరలోనే ఆ సంఘాలకు గుణపాఠం తప్పదని అన్నారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, తిరుపతి, ఫిట్ కార్యదర్శి రమేశ్, వెంకటేశ్, నాయకులు కై త స్వామి, కృష్ణ, రాజమౌళి, రమేశ్, చంద్రశేఖర్, సురేందర్, మల్లేశ్, శంకర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి రంగం బలోపేతంపై దృష్టి
దహెగాం: సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంపై నీటిపారుదల శాఖ దృష్టి సారించిందని ఇరిగేషన్ డీఈఈలు అజయ్కుమార్, భద్రయ్య తెలిపారు. మండలంలోని కర్జి పెద్ద చెరువు వద్ద చేపట్టిన ప్రీ లెవల్ సర్వేను మంగళవారం పరిశీలించారు. వారు మాట్లాడు తూ కర్జి పెద్ద చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.5.97 కోట్లు మంజూరు చేసిందన్నా రు. చెరువు ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన ప నుల గురించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పునరుద్ధరణ తర్వాత ఆయకట్టుకు శాశ్వతంగా సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సాంకేతిక అనుమతులు పొందిన అనంతరం టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏఈఈ మణితేజ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఆసిఫాబాద్: మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన బేటా జన్మోత్సవ్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ పిల్లలను ‘కాపాడుకుందాం, చదివించుకుందాం, ఎదగనిద్దాం’ నినాదంలో పని చేస్తున్నామన్నారు ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందించి వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తామన్నారు. అనంతరం పిల్లలకు కావాల్సిన 12 రకాల వస్తువులతో కూడిన 10 బేబీ కిట్లను అందజేశారు. అంగన్వాడీ టీచర్లకు విధుల కోసం 871 4జీ మొబైళ్లను పంపిణీ చేశారు. -
సమస్యలు విన్నవించి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై అర్జీలు అందించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్డీవో లోకేశ్వర్తో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కాగజ్నగర్ పట్టణానికి చెందిన బేతి సునంద, రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన కమిటె శంకర్, వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము విజయ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఓపెన్ కాస్టు ప్రభావంతో భూమి కోల్పోతున్న తనకు పరిహారం అందించాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన జాదవ్ రోహిదాస్ విన్నవించారు. నిషేధిత జాబితా నుంచి తన పట్టా భూమిని తొలగించాలని తిర్యాణి మండలం గంభీరావ్పేటకు చెందిన లింగంపల్లి చిన్నమ్మ అర్జీ అందించింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం నారాయణపూర్కు చెందిన మన్నెంపల్లి అరుణ, కౌటాల మండలం గురుడుపేటకు చెందిన చల్ల లక్ష్మి వేర్వేరుగా దరఖాస్తులు అందించారు.గాలివానకు ఇల్లు నేలమట్టం ఇటీవల గాలివానకు ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యింది. పేద కుటుంబం కావడంతో అద్దె ఇంట్లో ఉండాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలి. – పోగుల లక్ష్మి, టీఆర్నగర్, ఆసిఫాబాద్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. చింతలమానెపల్లి శివారులోని సర్వే నం. 59/17లో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. కొత్త పట్టా పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టర్ చొరవ చూపి కొత్త పట్టాపాస్ పుస్తకం ఇప్పించాలి. – మానెపల్లి శంకర్, చింతలమానెపల్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గతంలో పలుమార్లు ఇందిరమ్మ ఇంటి కోసం ద రఖాస్తు చేసుకున్నా. ఆన్లైన్లో ఇల్లు మంజూరైనట్లు చూపుతున్నా సంబంధిత అధికారులు మాకు రాలేదని చెబుతున్నారు. సొంత స్థలం ఉన్నా.. ఇల్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – అంకిత, ఎడవెల్లి, మం.రెబ్బెన పీవోపీ నుంచి తొలగించాలి కెరమెరి మండలం సాంగ్వి శివారులోని సర్వే నం.25లో నాలు గెకరాల వ్యవసాయ భూమి ప్రొహిబిషన్(పీవోపీ)లో ఉంది. ప్రస్తుతం రైతుబంధు, రుణ సదుపాయం పొందుతున్నాను. పీవోపీలో ఉంటే భవిష్యత్తులో విక్రయించడం కుదరదు. అధికారులు సర్వే చేసి పీవోపీ జాబితా నుంచి భూమిని తొలగించాలి. – సంతోష్, సాంగ్వి, మం.కెరమెరి -
ఆకట్టుకున్న నమూనా ఐక్యరాజ్య సమితి సమావేశం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఫాతిమా కా న్వెంట్ పాఠశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నమూనా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలోని 14 పీఎం శ్రీస్కూళ్ల నుంచి 42 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతి నిధులుగా వ్యవహరించి ప్రసంగించారు. వా తావరణ మార్పులు, మానవులపై పడే ప్రభా వం, ప్రపంచ దేశాలు ఏ విధంగా కృషి చే యాలి.. అనే అంశాలపై చర్చించారు. ఎంఈవో వాసాల ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయ ని, విద్యార్థులు అంతర్జాతీయ అంశాలపై అ వగాహన కలిగి ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. జిల్లాస్థాయి నుంచి 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చే స్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు లాలాజీ, రాజ, ఇస్లావత్, విజేష్, హదియాబేగం, రేష్మ సుల్తానా పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీవైఎస్వో హనుమంత రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27 నుంచి మే 1 వరకు హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి క్రీడా పాఠశాలల్లో ప్రవేశం ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో పల్లెర్ల శేయష్, కొండ హరిహరన్, రాకం వేధాంత్, గాలిపెల్లి శివతేజ, రామంచ కృతిక్, దోమల గౌతమ్ రామ్, ఆరె శ్రీ సహస్, రాచర్ల అనురాగ్, మహమ్మద్ అర్హముద్దీన్, మేంగని అనిరుధ్, విద్యార్థినుల్లో బొమ్మెన అధ్విక, బొగురాల మాన్వి, కావేర తీఖ్షిత, రొడ్డ శాన్విక, చింతం సింధూజ, మలవత్ సాయి పల్లవి, సింగతి అక్షయ, కొడపర్తి లితాక్ష, బానోత్ హిమజ, ధరావత్ అక్షయ ఉన్నారు. సీఎం సభలో తప్పిపోయిన మహిళబజార్హత్నూర్: మండలంలోని పిప్రిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభకు హాజరయైన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగామకు చెందిన బత్తుల గంగూబాయి తప్పిపోయినట్లు ఎస్సై సంజయ్ కుమార్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8712659934, 9440619432 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
భీమారం/చెన్నూర్రూరల్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భీమారం మండల కేంద్రం, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, భీమారం మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకన్న, చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, బూత్ అద్యక్షుడు సింగారపు రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అక్షరాభ్యాసం.. భూమిపూజ..
8x5నిర్మల్/భైంసా/బాసర: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ మహాత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. దేశంలోనే ఏకైక సరస్వతీక్షేత్రంగా విరాజిల్లుతున్న నిర్మల్ జిల్లా బాసరను భవ్యమందిరంగా, విశాలమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.225 కోట్లు మంజూరు చేయడ మే కాకుండా సోమవారం స్వయంగా వచ్చి ఈ పనులకు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో ముధోల్లో నిర్మించనున్న యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకూ ఇక్కడే శంకుస్థాపన చేశారు. కేవలం ఆలయం వరకే ముఖ్యమంత్రి పర్యటన పరిమితమైంది. లంచ్టైమ్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పర్యాటక, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మనుమడితో అక్షరాభ్యాసం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉదయం 11.42 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బాసర చేరుకున్నారు. సీఎం భార్య గీతారెడ్డి, బిడ్డ నైమిషారెడ్డి, అల్లుడు సత్యరెడ్డి, మనుమడు రియాన్ష్ మరో హెలికాప్టర్లో 11.46 గంటలకు చేరుకున్నారు. సీఎం తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎకై ్సజ్, ప్రొహిబిషన్, పర్యాటకశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు హెలీపాడ్ వద్ద కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఎదుట అక్షరాభ్యాస పీఠం వద్ద రేవంత్రెడ్డి దంపతులు తమ మనుమడు రియాన్ష్తో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్భాలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పైనున్న మహంకాళీ అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకున్నారు. వేదఆశ్వీరచన మండపంలో సీఎం కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు జ్ఞాపికలు, కండువాలతో సన్మానించారు. లంచ్టైంలో మాటామంతి.. బాసర పర్యటనలో స్థానిక ఓ ప్రైవేటు రిసార్ట్లో లంచ్టైమ్లోనే సీఎం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను కలెక్టర్ అందించగా, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవశ్యకతను బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్కియాలజీ, టూరిజం అధికారులతో మాట్లాడుతామన్నారు. కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్తోపాటు మహిళా సంఘాలసభ్యులు తయారు చేసిన వరికుచ్చులను సీఎంకు జ్ఞాపికలుగా అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనను విజయవంతం చేసినందుకు స్థానిక గ్రామస్తులు, సహకరించిన భక్తులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఘనంగా భూమిపూజ..బాసర ఆలయంలోని తూర్పు ద్వారం పక్కన పునరాభివృద్ధి పనులకు ము ఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు నగేశ్, వేంనరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సుదర్శన్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, డీసీసీ చీఫ్, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, నిర్మల్, భైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్యగణేశ్చక్రవర్తి, తూమోల్ల దత్తాద్రి, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్, రేఖానాయ క్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీ సీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులతో కలిసి భూమిపూజను అట్ట హాసంగా నిర్వహించారు. ఇక్కడే ముధోల్లో నిర్మించే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ట్రిపుల్ఐటీ, యూనివర్సిటీ ఊసే లేదు.. సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటనలో అందరూ ఊహించిన ట్రిపుల్ఐటీ విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ ఏర్పాటు గురించి ఎక్కడా చర్చ రాకపోవడం గమనార్హం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న ఆర్జీయూకేటీ గురించి మాట్లాడుతారని, జనవరి 16న నిర్మల్సభలో ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆలయ అభివృద్ధి మినహా ఈ రెండు ప్రముఖ అంశాలకు సీఎం పర్యటనలో ప్రాధాన్యత దక్కకపోవడం జిల్లావాసులను నిరాశపర్చింది. -
ఆహార భద్రత అందరి బాధ్యత
మంచిర్యాలటౌన్: సురక్షితమైన ఆహారం ఆరోగ్యానికి ఆధారమని, ఆహార భద్రత అందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్య కార్యక్రమాల అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు రాకుండా ఉంటుందని, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారి మహేష్ వసురం, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత, ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బోథ్ ఏరియా ఆస్పత్రి పరిశీలన
బోథ్: బోథ్ ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం పరిశీలించారు. పిప్రిలో సీఎం సభ అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజనాల రవీంద్ర ప్రసాద్ విన్నపం మేరకు ఆస్పత్రిని పరిశీలించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనిపై డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అన్ని వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల వీరంగంమందమర్రిరూరల్: పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఎస్సై నరేష్ సంఘటన స్థ లానికి చేరుకుని నిందితులను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రతీరోజు వైన్షాపుల వద్ద మందుబా బులు వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుతున్నారు. -
‘ఎన్నికల పొత్తు ధర్మాన్ని పాటించాలి’
పాతమంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకున్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులు, గెలుపోటములపై పార్టీ నాయకులతో విశ్లేషణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడంతో సీపీఐకి నష్టం జరిగిందని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో పొత్తు విషయమై చర్చలు జరిగినా స్థానిక నాయకత్వం పార్టీని అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం వల్ల అక్కడ బీఆర్ఎస్ గెలుపు అనివార్యమైందని తెలిపారు. బెల్లంపల్లిలో నామినేషన్ల వరకు పార్టీని మభ్యపెట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఓట్లు అవసరమైనప్పుడు పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత కమ్యూనిస్టులను విస్మరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పొత్తును ప్రజలు హర్షించారని, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కోల్బెల్ట్ ఏరియాలో సీపీఐకి బలమైన క్యాడర్ ఉందని, భవిష్యత్లోనైనా కాంగ్రెస్ పార్టీ మైత్రి సంబంధాలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, జిల్లా సమితి సభ్యులు పౌలు, దేవి పోచన్న, దుర్గారాజ్, కుంచాల శంకరయ్య పాల్గొన్నారు. -
హెచ్ఎం, వార్డెన్కు మెమో జారీ
కాసిపేట: మండలంలోని మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, వార్డెన్ దిన్దర్షాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) రమాదేవి మెమో జారీ చేశారు. మండలంలోని మల్కేపల్లి, దేవాపూర్, రేగులగూడ ఆశ్రమ పాఠశాలలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించాల్సి ఉండగా వడ్డించలేదన్నారు. రేగులగూడ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, నెన్నెల మండలం కుశ్నపల్లిలో విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంతో కుశ్నపల్లి హెచ్ఎం లచ్చన్న, ఏఎన్ఎంకు మెమో జారీ చేసినట్లు తెలిపారు. హెచ్ఎంలు గోపాల్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి
ఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన భుక్తాపూర్ కాలనీలో గల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు ఆడిగి సమాధానం రాబట్టారు. కంప్యూటర్ ల్యాబ్, వంట గదిని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. మెనూ అమలు తీరును అడగగా ఐటీడీఏ యాప్ ఏర్పాటు చేసి పకడ్బందీగా మెనూ అమలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. అనంతరం డార్మెట్రీ నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జుగా కింద మరో రూ.2 కోట్లు మంజురయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, సీఈ బాలు నాయక్, ఎస్ఈ ఫణికుమారి, ఈఈ తానాజీ, ఏటీడీవో నిహారిక, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యమే మహాబలం
ఆసిఫాబాద్: ప్రతిఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ఆరోగ్యమే మహాబలమని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో 2కే రన్ చేపట్టారు. అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎంహెచ్వో సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుబోద్ కుమార్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కుమురం భీం చౌక్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.కలెక్టర్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలతో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. ఈ నెల 6 నుంచి 11 వరకు వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన కారుకూరి సత్తయ్య(63) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం స్థానిక ఓ లిక్కర్ మార్ట్లో మద్యం సేవించి అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య సత్యలీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్రావు తెలిపారు. -
గురుకులాలపై నిర్లక్ష్యం
చెన్నూర్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రతీనెల రెండో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా చేయడం ద్వారా ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ గతేడాది నుంచి చెన్నూర్ ప్రాంత గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రహరీ దూకి ఇద్దరు యువకులు లోపలికి వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నూర్ పట్టణంలో గల గురుకుల పాఠశాలలో గతంలో పలు సంఘటనలు జరిగినా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడమేనా? గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడంతో రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వహించినప్పటికి పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో ‘మాకేందుకులే’ అనే ధోరణి అవలంభిస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకులాలకు అందుబాటులో ఉండి విద్యార్థులు గాడి తప్పకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా చేస్తే మార్పు రావచ్చు విద్యార్థుల మానసికస్థితిలో మార్పులు విద్యార్థుల మానసిక స్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చెన్నూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి బాధాకరం. మరో విద్యార్థిని చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె సెఫ్గా ఉంది. చెన్నూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – రామకళ్యాణి, డీసీవో, మంచిర్యాల ఏడాదిగా సమావేశాల్లేవ్ గతంలో గురుకుల పాఠశాలలో ప్రతీనెల రెండో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం కమిటీపై అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కమిటీలను పటిష్టం చేయాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలి. – ఎన్.సారయ్య, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి -
కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్ పరిసర ప్రాంతాలలో ఏర్పడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు సోమవారం పెగడపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ నిర్వహణతో గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యాష్ కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో దుస్స భాస్కర్, రాజా గౌడ్, రాజేందర్ రెడ్డి, ప్రభాకర్చారి తదితరులు ఉన్నారు. -
అప్పులున్నా ప్రజా సంక్షేమాన్ని ఆపలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మా త్రం ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్చార్జి మంత్రి జూపల్లి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, ఎంపీలు గోడం నగేశ్, వేంనరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రేంసాగర్రావు, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులుకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మళ్లీ వ స్తానని..అభివృద్ధి పనులకు అవసరమైన నిధులిస్తా నని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా నాడు చేపట్టిన పీపుల్స్మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బజార్హత్నూర్ మండలం పిప్రిలో సోమవారం నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. భట్టితో కలిసి వచ్చిన ఆయన రూ. 1,238 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, మండలస్థాయి నాయకుల వద్దకు వచ్చి వారితో కరచాలనం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకు సా గుతున్నట్లుగా వెల్లడించారు. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడిగా దళిత గిరిజన,దండోరాతో తాను, పీపు ల్స్ పాదయాత్రతో భట్టి చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు సాగుతున్నామన్నారు. అపారమైన ఖనిజ సంపదతో పాటు సంస్కృతికి నిలయమైన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అందాల్సిన అవసరముందన్నారు. బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మార్చి 2027 వరకు సాధ్యం కాదని ఆ తర్వాత దా న్ని పరిశీలిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీటిని అంది స్తామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం జూన్ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.ఇండస్ట్రీయల్కారిడార్ ఏర్పా టుతోపాటు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేసి దాని ప్రారంభోత్సవానికి సైతం తానే హాజరవుతా నని భరోసానిచ్చారు. రెండు నెలలకోసారి జిల్లాకు వస్తూనే ఉంటానని, నిధులు తెస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వవిప్లు ఆది శ్రీనివాస్, విజ యరమణా రావు, ఎంపీ గోడం నగేశ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ప్రేంసాగర్రావు, అని ల్ జాదవ్, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి,మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్దీపక్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన జనం ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యతనివ్వాలి నా జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది రేవంత్రెడ్డి ఒక్కరే. గోదావరి ఒడ్డున, గుట్టపై ఉన్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.75 కోట్లను కేటాయించాలి. ఆదివాసీలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్కు ఎంత చేసినా తక్కువే. అభివృద్ధి పరంగా మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి పునః ప్రారంభించాలి. – కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్మెంట్తో పని చేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం. – బొమ్మ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెండు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, మూడు సబ్స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ 26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది 1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. బోథ్లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేయాలని భీంపూర్ మండలం తాంసి కె గ్రామస్తులు, రికార్డు అసిస్టెంటు ఉద్యోగం ఇప్పించాలని ఉట్నూర్కు చెందిన మెస్రం కార్తీక్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్కు చెందిన కుడిమెత శ్రీనివాస్ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలు కరువు
ఆసిఫాబాద్అర్బన్: మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ గొల్లగుడ గ్రామానికి చెందిన లచ్చన్న అనారోగ్యంతో బాధపడుతుండగా ఆదివా రం అతడి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అతడిని వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. వెంటిలేటర్ లేదని కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావ్ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని లచ్చన్నను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ‘ప్రాణాలతో చెలగాటమాడొద్దు’ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడు తూ.. జిల్లా కేంద్రంలో అలంకారప్రాయంగా మారి న 200 పడకల ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరి కాదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. రూ.100 కోట్లతో ఆస్పత్రి భవనం నిర్మించినా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల కొరత ఉందని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ చొరవ చూపి ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని, అన్ని రకాల వైద్యం, పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. -
జగ్జీవన్రామ్ జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రావ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ కె.హరిత పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, వివిధ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ వేత్తగా అణగా రిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన సూచించిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎ మ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, సమానత్వం, సమన్యాయం, ఐక్య త కోసం బాబూ జగ్జీవన్రామ్ చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికా రి అశోక్, కుల సంఘాల ప్రతినిధులు కేశవ్రావ్, సిడాం అర్జు, గంగుబాయి, గణేశ్, శంకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
జిల్లాలో గాలివాన బీభత్సం
కెరమెరి: మండలంలోని గోయగాం గ్రామపంచా యతీ పరిధి పిప్రి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన మడావి పావుగా, ఆత్రం పగ్గు ఇళ్లు స్వల్పంగా కూలిపోయా యి. ఇళ్ల పైకప్పులు పూర్తిగా లేచిపోయాయి. కు టుంబ సభ్యులంతా ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ సహకారంతో నిర్మించుకున్న రేకుల షెడ్లు కూలడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు తెలి పారు. ప్రభుత్వం తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మురళీధర్, సర్పంచ్ ఆనంద్రావు, ఉపసర్పంచ్ రాందాస్ గ్రామాన్ని సందర్శించి అధికారులకు నివేదిక అందించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్ బాధితులను కలిసి వివరాలు తెలు సుకున్నారు. తహసీల్దార్ సంతోష్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు తక్షణసాయం అందేలా చూస్తామని, ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చింతలమానెపల్లి మండలంలో..చింతలమానెపల్లి: మండలంలో ఆదివారం తెల్ల వా రు జామున వర్షంతో పాటు వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. రుద్రాపూర్, బాబాసాగర్, ఖర్జెల్లి, దిందా, కేతిని, హేటిగూడ గ్రామాల్లో వీచిన గా లులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దిందా గ్రామంలో కోల తిరుపతి ఇంటి కప్పు ఎగిరిపోయింది. రుద్రాపూర్ గ్రామానికి చెందిన గుర్లె సంజీ వ్, హేటిగూడ గ్రామానికి చెందిన మండూరి తిరుపతి, నికాడి భీంరావు, కేతిని గ్రామానికి చెందిన సో యం నందారాం ఇళ్ల కప్పులు లేచిపోయాయి. ప లువురి పెంకుటిళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. ఖర్జెల్లి నుంచి గూడెం అటవీ ప్రాంతంలో పలు చెట్లు రోడ్డుకు అడ్డుగా చెట్లు పడిపోయాయి. కేతిని నుంచి దిందా మార్గంలో చెట్లు నేల కూలగా బీజేపీ నాయకుడు డోకె రామన్న ఆధ్వర్యంలో తొలగించారు. బెజ్జూర్ మండలంలో..మండలంలోని అందుగులగూడ, కుంటలమానెపల్లి, పోతెపల్లి, సుశ్మీర్, సలుగుపల్లి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. డబ్బా నుంచి బెజ్జూర్ మార్గంలో పలుచోట్ల చెట్లు రహదారిపై కూలిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. కుంటలమానెపల్లి గ్రామంలో పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అందుగులగూడలో నలుగురి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. పోతెపెల్లి గ్రామంలో వర్షం పడడంతో ఇంటి పైకప్పు సరిచేస్తుండగా డోకె సంజీవ్ పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం తరలించారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కెరమెరి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఆది వారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ, సన్ షైన్ హాస్పిటళ్ల సహకారంతో కెరమెరి పోలీసు ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబి రానికి హాజరై మాట్లాడారు. ముందుస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ప్రారంభ ద శలోనే గుర్తించవచ్చని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిరుపేద గ్రామీణులకు వైద్యశిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పోలీ సులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటార ని, ఏ సమస్య వచ్చినా ‘డయల్ 100’ కాల్ చేసి తెలుపాలని సూచించారు. శిబిరానికి కెరమెరి ఆర్ఎంపీ, పీఎంపీలు పూర్తి సహకారమందించగా, సీఐ సత్యనారాయణ, కెరమెరి, వాంకిడి ఎస్సైలు మధూకర్, మహేందర్, ఇన్చార్జి జిల్లా ఫార్మసీ అధికారి కలీల్ హుస్సేని, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డుకు మోకాలడ్డు!
దహెగాం: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీశాఖ అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 2018లో పీఎంజీఎస్వై కింద మండలంలోని కర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రయాణ పాట్లు పడుతున్నారు. అటవీశాఖ అనుమతి నిరాకరణకర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ గ్రామం వరకు సుమారు 12కిలో మీటర్ల మేర చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, కర్జి నుంచి రాంపూర్ వరకు అటవీప్రాంతం ఉండడంతో అటవీ అధికారులు రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అప్పటి నుంచి రోడ్డు నిర్మా ణం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. రోడ్డు పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ రవాణా కష్టాలు తొలగుతాయని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని వాపోతున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో నిలుస్తున్న బస్సులుకర్జి నుంచి మొట్లగూడ వరకు మట్టి రోడ్డు ఉండడంతో వానాకాలంలో బురదగా మారుతోంది. దీంతో ఆర్టీసీ సేవలు వానాకాలం నాలుగు నెలలు నిలిచి ప్రజలు రవాణా కష్టాలు పడుతున్నారు. కర్జి గ్రామ సమీపంలోని ప్లాంటేషన్ వద్ద భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురవుతోంది. దీంతో ఆటోలు కూడా వెళ్లలే ని పరిస్థితి నెలకొంటోది. కేవలం వేసవి, శీతాకాలా ల్లో మాత్రమే మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బ స్సు మొట్లగూడ వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. వానాకాలంలో ఇతర ప్రాంతాల కు రాకపోకలకు సాగించాలంటే ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులను ప్రసవానికి తరలించడం ఇబ్బందిగా మారిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చి తరువాత విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు ఉన్నాయా.. లేదా.. వెనక్కి వె ళ్లాయా? అనే అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు ఇ ప్పించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల ని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి 2018లో వేసిన శిలాఫలకం -
ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్
ఆసిఫాబాద్అర్బన్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయి తే, కలెక్టరేట్లో నిర్వహించిన బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు ఆమె హాజరు కాగా, వెంట ఒక పోలీస్ వాహనం కూడా వెళ్లింది. కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీస్ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతనిధిని అని, తనకు ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉందని చెప్పారు. పోలీసుల ను అడ్డుపెట్టుకుని తనను అక్రమంగా నిర్బంధించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అన్యాయమ ని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో!
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఫుట్పాత్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. చిరువ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డివిజన్ కేంద్రంగా ఉన్నపుడే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెట్టింపైంది. వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా స్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు కు ఇరువైపులా పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఆటో స్టాండ్లకు అనువైన స్థలం లేక రోడ్డుపైనే నిలుపుతున్నారు. అసలే ఇరుకై న రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్పాత్ వ్యాపారాల కారణంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయా దుకాణాలకు సరుకులు సప్లయ్ చేసే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతుండడంతో సమస్య మరీ తీవ్రమైంది. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, హోటళ్లు, ఆర్టీసీ డిపో, షాపింగ్ మాల్స్, ఇతర ప్రధాన దుకాణాలు దగ్గరదగ్గరగా ఉండడంతో వాహనాల పార్కింగ్కు స్థలం లేక ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. మేజర్ గ్రామపంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్లు వెడల్పు చేయాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రద్దీగా ప్రధాన కూడళ్లుపట్టణంలోని ప్రధాన కూడళ్లయిన అంబేడ్కర్చౌక్, వివేకానందచౌక్, జగ్జీవన్రామ్చౌక్, గాంధీచౌక్, పొట్టి శ్రీరాములుచౌక్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రధాన కూడళ్లలో వ్యా పార, వాణిజ్య సముదాయాలు ఉండడంతో త ప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసుకుంటున్నారు. దీంతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురికా వాల్సి వస్తోందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నా రు. నూతనంగా ఇళ్లు నిర్మించుకునేవారు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్లను ఆక్రమించి ర్యాంపులు నిర్మించుకుంటున్నారు. అయినప్పటికీ అడ్డుకునేవారే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
నేడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన
భైంసా/బాసర/కై లాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా బాసర, ఆదిలా బాద్ జిల్లా పిప్రిలో పర్యటించనున్నారు. మొదట బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చే సినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..ఉదయం 10.20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరుతారు. 11గంటలకు బాసర హెలీప్యాడ్కు అక్కడి నుంచి రాజన్న గెస్ట్హౌస్కు చేరుకుంటారు. 11.10 నుంచి 12.10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 12.30 నుంచి 1.30 వరకు రిజర్వ్ టైమ్. 1.45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. 2.15 గంటలకు పిప్రికి చేరుకుంటారు. 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. ఐఎస్వో సర్టిఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. 4.20గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
ఆస్పత్రి ప్రతిపాదిత స్థలం పరిశీలన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను, ఈఎస్ఐ ఆస్పత్రి భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ హరిత ఆదివారం పరిశీలించారు. సమీపంలోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంజేశారు. చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రి య విద్యాలయం ఏర్పాటుకు కాగజ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ శివారులో ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను సందర్శించారు. అనంతరం పట్టణంలోని పోలింగ్ కేంద్రం–62లో నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బూత్స్థాయి అధికారులతో పనుల నిర్వహణపై సమీక్షించారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పష్టమైన ఓటరు జాబితా తయారీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ మధూకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి
తిర్యాణి: అసాంఘిక కార్యకలాపాలపై కఠి నంగా వ్యవహరించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని పోలీస్స్టేషన్ ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరు రిజి ష్టర్లు పరిశీలించారు. కేసుల పురోగతి వివరా లను ఎస్సై వెంకటేశ్ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్ట వ్య తిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మా దక ద్రవ్యాలపై దృష్టి సారించాలని తెలి పా రు. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చే సుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యహరించాలని పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. -
గోండు పిల్లలు.. మెరికలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఏడేళ్ల గోండు విద్యార్థిని పేరు పర్చకి వర్ష. కొఠారి పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. మాతృభాష గోండి అయినప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడుతోంది. సాధారణ వాక్యాలను ఇంగ్లిష్లో చెప్పగలదు. రాష్ట్ర గీతం, జాతీయ గీతం, వందేమాతరం, ప్రతిజ్ఞ, జయజయహే తెలంగాణ గీతం చూడకుండా స్పష్టంగా పాడుతుంది. కెరమెరి: మండలంలోని కొఠారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే గోండు పిల్లలు గోండు భాషతోపాటు తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడి అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 15మంది విద్యార్థులున్నారు. నాలుగో తరగతిలో ఆరుగురు విద్యార్థులుండగా ఐదుగురు, రెండోతరగతిలో ఐదుగురు విద్యార్థులుండగా నలుగు రు తెలుగు పాఠాలు స్పష్టంగా చదవగలుగతున్నా రు. ఆంగ్లంలోనూ నాలుగో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు బాగా చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు పడాల నందకుమార్, గ్రూపు స్టడీ, టీఎల్ఎంకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాల ఆవరణలోకి రాగానే విద్యార్థులంతా తెలుగు మాట్లాడేలా హెచ్ఎం శిక్షణ ఇచ్చారు. గోండి భాష మినహా మరే భాష తెలియని పిల్లలు ఈ బడిలో చదువుతూ తెలుగు, ఆంగ్లం స్పష్టంగా మాట్లాడే స్థాయికి ఎదగడం విశేషం. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి..ప్రధానోపాధ్యాయడు విద్యార్థులు తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద వి ద్యార్థులు ఉదయం 6నుంచి 7గంటల వరకు చదవాలని, సాయంత్రం 6 నుంచి 8గంటల వరకు రా యాలని నిర్ణయించారు. వారు రాస్తున్న, చదువుతు న్న ఫొటోలను వారి తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూ ప్నకు షేర్ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో హోంవర్క్ ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పూర్తి చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలో చెప్పిన పా ఠ్యాంశాలు, కథలు, గేయాలు వారికి కంఠత ఉంటున్నాయి. ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెడుతున్నాను పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై శ్రద్ధ పెడుతున్నాను. తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టుకోసం బడిలో వారి గోండి భాషను నిషేధించాను. బడిలో ఉన్నంతవరకు తెలుగు, ఇంగ్లిష్ లోనే మాట్లాడాలనే నిబంధన పెట్టాను. విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా చదవడం, హోంవర్క్ చేసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపు ద్వారా పర్యవేక్షిస్తున్నాను. ఇందుకు తల్లిదండ్రులు సహకరిస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. – పడాల నందకుమార్, ప్రధానోపాధ్యాయుడు, కొఠారి ఉన్నతంగా తీర్చిదిద్దాలి ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు అన్ని భాషల్లో రాయడం, చదవడం రావాలి. కొఠారి హెచ్ఎం చక్కగా విద్యార్థులకు బోధిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు. అన్ని పాఠశాలల్లోని చిన్నారులు తెలుగు, ఆంగ్లంలో మాట్లాడే స్థాయికి ఎదగాలి. ఇందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలి. – ఆడే ప్రకాశ్, ఎంఈవో, కెరమెరి -
‘ప్రత్యేక సవరణ’ను పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రా ష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, తహసీల్దా ర్లు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. బూత్స్థాయి అధి కారుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు. ఆయా పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా తీసుకోవాలని, ఆ యా పార్టీలకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలుపాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులకు ప్రక్రియ నిర్వహణలో సందేహాలంటే నివృత్తి చేయాలని తెలిపారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఫా రం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాల ని సూచించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జి ల్లాలో 678 పోలింగ్ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్ర తీ పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. బూత్ స్థాయి అధి కారులు, సూపర్వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చి వారి కి గుర్తింపు కార్డులు అందజేశామని తెలిపారు. బూ త్ స్థాయి ఏజెంట్ల జాబితాను గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల నుంచి తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. త్వరలో చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పరిశీలన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఎల్లగౌడ్తోట సమీ పంలో చేపట్టిన వంద పడకల ఏరియాస్పత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని సైట్ ఇంజినీర్కు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలని వైద్యులకు సూచించారు. వీరి వెంట సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు విజయ్, మహేశ్, అరుణ్, డయాలసిస్ టెక్నీషియన్ శివ, ఆయుష్మాన్ భారత్ ఇన్చార్జి సందీప్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
పాముల్వాడలో ‘ప్రజాబాట’
లింగాపూర్: సిర్పూర్(యూ) మండలంలోని పాముల్వాడ గ్రామంలో శనివారం ‘ప్రజా బాట‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్ ఆపరేషన్ సర్కిల్ సూ పరింటెండెంట్ ఇంజినీరింగ్ జాడే ఉత్తమ్ మాట్లాడారు. విద్యుత్శాఖ తరఫున లూజ్లై న్లు, వంగిన స్తంభాలు, తక్కువ స్థాయిలో ఉ న్న ట్రాన్స్ఫార్మర్లను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వివిధ గ్రామాల్లో ఇప్పటికే బావులు, బోర్లకు కొత్త విద్యుత్ కనెక్షన్లు అవసరమని తెలిపారు. నిబంధనల ప్రకారం నూ తన కనెక్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వ న్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలతో ఉచ్చులు అమర్చితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడీ శ్రీనివాస్, ఏఈ కలీల్ అహ్మద్, లైన్ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధి చెందాలి
కౌటాల: రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కేవీకే శాస్త్రవేత శ్రీనివాస్ సూచించారు. శనివారం విజయవాహిని చారి టబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గురుడుపేట గ్రామంలో చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మీణ ప్రాంత రైతులు వ్యవసాయంతో పాటు చేపలు, కోళ్లు పెంచాలని సూచించారు. రైతులకు సబ్సిడీపై చేపలు, దాణా అందజేస్తూ.. పెంపకంపై సలహాలు, సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులు చిరుధాన్యాలను సాగు చేయాలని, చేపలు, కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. సిబ్బంది గజానంద్, అరుణ్, వినయ్, సుమలత, నాయకులు మెర్పల్లి బ్రహ్మయ్య, నారాయణ, విజయ్, శంకర్, సిద్దు, రైతులు పాల్గొన్నారు. -
డొమెస్టిక్ దొడ్డిదారి!
కాగజ్నగర్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం పుణ్యానా జిల్లాలోని కొందరు వంటగ్యాస్ డీలర్ల పంట పండుతోంది. ధనార్జనే ధ్యేయంగా సా మాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నా రు. జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో ఈ తరహా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్యులు డీలర్ల కార్యాలయాలు, గోదాంల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు అక్రమార్కులు ఎక్కువ డబ్బులు చెల్లించే వారికే సిలిండర్లను సులభంగా అందిస్తున్నారనే విమర్శలున్నాయి. నెల రోజులుగా పట్టణంలోని ఆయా గ్యాస్ డీలర్ల కార్యాలయాలు, గోదాంల వద్ద సామాన్యులు పడిగాపులు కాస్తూ కనిపించడమే ఇందుకు నిదర్శనం. యథేచ్ఛగా వినియోగంకాగజ్నగర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గ్యా స్ కొరత ఉన్నా ఒక్కరోజు కూడా మూతబడకుండా కొనసాగుతున్నాయి. ఒక వైపు సామాన్యులకు ఒక్క డొమెస్టిక్ సిలిండర్ లభించని పరిస్థితి ఉంది. అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఆశించిన స్థాయిలో డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ జరుగుతోందనే ఆరో పణలున్నాయి. రూ.980కి లభించే డొమెస్టిక్ సిలిండర్లను రూ.2వేల నుంచి రూ.2,500 వరకు హోట ళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవి ఒక్కరోజు కూడా మూత పడకుండా కొనసాగడమే నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో యథేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. తనిఖీలు నామమాత్రమే!కాగజ్నగర్లో గ్యాస్ కృత్రిమ కొరతతో ప్రజలు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధి కారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపేసుకుంటున్నారనే ఆరోణలున్నాయి. కాగజ్నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, రాజీవ్ చౌక్, పెట్రోల్ పంపు ఏరియాల్లో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ల తయారీ కేంద్రా ల్లో యథేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తు న్నా వాటిపై దాడులు చేయని సంబంధిత అధికారులు చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి 3–4 డొమెస్టిక్ సిలిండర్లను జప్తు చేసి 6ఏ కింద కేసులు నమోదు చేసి చేతులు దులుపేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని జిల్లాలోని గృహ వంటగ్యాస్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం కాగజ్నగర్తో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను తమ వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. సామాన్య ప్రజలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అందించకుండా అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించే డీలర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. తనిఖీలు ముమ్మరం చేసి అక్రమార్కుల చర్యలను అడ్డుకుంటాం. – మధూకర్, కాగజ్నగర్ తహసీల్దార్ -
బయటొకటి.. లోపల మరొకటి..
పట్టణంలోని కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కమర్షియల్ సిలిండర్లను అందరికీ కనిపించేలా ముందు పెడుతున్నారు. లోపల మాత్రం డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. నెలరోజులుగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోగా రెండ్రోజుల క్రితమే డీలర్లు అనేక హోటళ్లకు రెండు, మూడు చొప్పున మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, నెల రోజులుగా సరఫరా లేనప్పటికీ వారు ముందు కమర్షియల్ సిలిండర్లు ఏర్పాటు చేయడం వెనుక మరో రహస్యం ఉంది. ఖాళీగా ఉన్న కమర్షియల్ సిలిండర్లలో ప్రత్యేక యంత్రం ద్వారా డొమెస్టిక్ సిలిండర్లలోని గ్యాస్ను బదిలీ చేసి వినియోగిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలకు మరింత కొరత ఏర్పడి గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు సమయానికి అందక వారు ఇబ్బందులు పడుతుండగా, అక్రమార్కులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. -
పేద కుటుంబాలకు ఆర్థికసాయం
కెరమెరి: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం 124 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 అందిస్తోందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహాలు జరుపుకొనేందుకు అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. తహసీల్దార్ గోడాం సంతోష్కుమార్, సర్పంచ్ పెందోర్ ఆనంద్రావు, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, నాయకులు యూనస్, నిసార్, జాహెద్ తదితరులున్నారు. -
అక్రమ నిర్మాణాల తొలగింపు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధి లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను శనివారం మున్సిపల్ క మిషనర్ తిరుపతి సిబ్బందితో తొలగించారు. అక్ర మ నిర్మాణాల తొలగింపుతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చిరువ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన క మిషనర్ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పట్టణ ప్రజల కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే అక్రమ నిర్మాణాలు తొలగించాల్సి వస్తోందని తెలిపారు. పూర్తి స్థాయిలో తొలగిస్తారా? పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలోని రోడ్డు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారుల షెడ్లు తొలగించారు. కానీ, పట్టణంలోని ప్రధాన రాజీవ్ గాంధీ చౌ రస్తా, అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌర స్తా, రైల్వే ఓవర్బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న దుకా ణాలను తొలగిస్తారా? అనే సందేహం పట్టణ ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన చర్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఒకేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అ ధికంగా ఉన్న ప్రధాన చౌరస్తాల్లోని అక్రమ నిర్మాణా లు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అడ్డగోలుగా ఆక్రమణలు
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాలకు ఇరువైపులా కొందరు రోడ్లు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో సుమారు 70వేల జనాభా ఉంది. అక్ర మ నిర్మాణాలతో ఏళ్లుగా జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు, అంబులెన్స్లు దారుల్లో చిక్కుకుపోతున్నాయి. ఈ తరుణంలో యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఇది ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణలు ఇక్కడే..పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియా, తెలంగా ణ తల్లి చౌరస్తా నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, భట్టుపల్లి చౌరస్తా, రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తాల మీదుగా సంజీవయ్య కాలనీ వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎల్లాగౌడ్ తోట ప్రభుత్వ ఆస్పత్రి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. వివిధ కాలనీల నుంచి మార్కెట్కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు రెండువైపులా దుకాణాలు నిర్మించగా, చిరువ్యాపారులు తోపుడు బండ్లు రోడ్లపైనే పెడుతున్నారు. పెండింగ్లోనే తొలగింపు ప్రక్రియపట్టణంలో ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాల ను ఇంకా తొలగింపునకు నోచుకోవడంలేదు. పలు మార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుండడంతో పట్టణ ప్రజలు అసహనానికి గురవుతున్నారు. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణంలోని ప్రజారవాణాలు, కాలువలు, ఫుట్పాత్లపై ఎటువంటి ఆక్రమణలు అనుమతించరాదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించే అధికారం కమిషనర్కు ఉంటుంది. నిర్ణీత గడువులోగా స్వ చ్ఛందంగా తొలగించకపోతే మున్సిపాలిటీ బలవంతంగా తొలగించే అధికారం సైతం ఉంటుంది. ప్రజ ల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతుంది. అవసరమైతే జరిమానాల ఖర్చులను సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయవచ్చు. ఇప్పటికై నా పట్టణంలోని ఆక్రమణలను పూర్తిగా తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
పూర్వవైభవం దిశగా కాంగ్రెస్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా సాగుతుందని, 2028 ఎన్నికల లక్ష్యంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్స్లో శుక్రవారం ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ శ్రవంత్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియామక పత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం అందరినీ సమన్వయం చేసుకుంటూ.. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కార్యవర్గంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం లభించిందని తెలిపారు. జిల్లాలో అవసరమైన వనరులను గుర్తించి పరిశ్రమలు తెచ్చుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే ఏ స్థాయిలోనైనా రాణించవచ్చని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తుందన్నారు. పదేళ్లుగా ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్గాంధీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణకు డీసీసీ పదవి దక్కిందని తెలిపారు. వెన్నుపోటుతో చైర్మన్ పదవి కోల్పోయాంఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరుఫున గెలిచిన కొందరి వెన్నుపోటుతో చైర్మన్ పదవిని కోల్పోయామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నా రు. కొండాలక్ష్మణ్ బాపూజీ పుట్టిన జిల్లాలో బీసీల కు సుముచిత న్యాయం జరిగే అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావుకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలను కలుపుకొని వెళ్లే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు పీసీసీ అధ్యక్షుడిని సన్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, గ్రంథాలయ చైర్మన్ అనిల్, నియోజ కవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షు డు విశ్వప్రసాద్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ఇరుకుల మంగ, విశ్వనాథ్, దేవయ్య, మాజీ ఎమ్మె ల్యే ఆత్కం సక్కు, నాయకులు మల్లేశ్, అబ్దుల్లా, తారీఖ్, బాలేశ్గౌడ్ పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమాదేవి, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు, అరిగెల మల్లికార్జున్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, విశ్రాంత ఎస్సై వెంకన్న, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అవుడపు ప్రణయ్, దూడల అశోక్, కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
చిన్నారులకు ఉపశమనం
కెరమెరి: ఉదయం తొమ్మిది దాటితే చాలు వడగాలు లు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పెద్దలే బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పసిపిల్లలు, గర్భిణులు ఎదుర్కొంటున్న ఇ బ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల వేళల్లో మార్పులు చేస్తూ చిన్నారులకు ఊరటనిచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలలకు గత నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. పాఠశాల విద్యార్థుల కంటే అతి పిన్న వయస్సు గల చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించా లంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలి చ్చింది. ఈ నెల 30 వరకు ఒంటిపూట నిర్వహించనున్నారు. బుధవారం నుంచి జిల్లాలోని 1006 అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 నుంచి 12.30 వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. గతేడాది మార్చి 15 నుంచే పాఠశాలలతో పాటే అంగన్వాడీ కేంద్రాలకు సైతం ఒంటిపూట బడులు ప్రారంభం కాగా, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులకు ఉపశమనం లభించింది. మే నెలంతా సెలవులుఈ నెలాఖరు వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. మే నెలంతా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు సెలవులు ప్రకటించారు. గతంలో ఏప్రిల్ 30 వరకు రెండు పూటలు బడులు కొనసాగగా.. మే నెలలో 15 రోజులు అంగన్వాడీలు, మరో 15 రోజులు ఆయాలు విధులు నిర్వర్తించేవారు. వేసవిలో మండే ఎండలతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పెరుగుతున్న ఎండల దృష్ట్యా మేలో పూర్తిగా కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 0– 5 ఏళ్ల పిల్లల సర్వేజూన్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 0– 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల వార్షిక సర్వే చేపట్టాలి. సర్వే, ఇంటి సందర్శనలు, ప్రీ స్కూల్ పిల్లల నమోదు, బడి మానేసిన వారిని తిరిగి బడిలో చేర్చుకోవడం తదితర పనులు చేపట్టి నివేదికలు సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా, ప్రజాపాలన సందర్భంగా మే 25 నుంచి 30 వరకు మహిళా ఇతివృత్తంతో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో సూచించింది.అసౌకర్యాల మధ్య..ఇప్పటి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను తెరిచేవారు. సరైన సౌకర్యాలు, సొంత భవనాలు లేని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న వందలాది అంగన్వాడీ కేంద్రాల్లో ఎండలకు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన నీటి సదుపాయం కూడా లేదు. చిన్నారులు భోజనం చేశాక నీటి కోసం చేతిపంపుల వద్దకు పరుగులు పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఈ సమస్య ఉంది. రెండేళ్ల క్రితం ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు మంజూరైనప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేక అలంకారప్రాయంగా ఉన్నాయి. ఫ్యాన్లు అమర్చినా ఎందుకూ పనికిరాకుండా పోయా యి. ఈ నేపథ్యంలో ఒంటిపూట నిర్వహణ ఊరట కలిగించనుంది. -
ప్రతిపాదనలేనా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వే బడ్జెట్లో గతేడాది తరహాలో దక్షిణ మధ్య రైల్వే పరిధి కాజిపేట–బల్లార్షా సెక్షన్కు మళ్లీ ప్రతిపాదనలు వచ్చాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్డు, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్నగర్, సిర్పూర్(టి) వరకు ఉన్న లైన్లో అభివృద్ధి పనులకు రైల్వే రూ.కోట్లలో నిధులు ప్రతిపాదించింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో ప్రతిపాదించినా నిధులు ఖర్చుకు నోచుకోవడం లేదు. నిధులు విడుదల కాక పనులు నిలిచిపోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టగా, తాజాగా రైల్వే కేటాయింపులపై వివరాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే పలు పెండింగ్ పనులకు మరోసారి బడ్జెట్లో ప్రతిపాదించారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ లైన్కు సర్వేఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కలిగే మంచిర్యాల వయా ఉట్నూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు 186 కిలోమీటర్ల నిడివితో కొత్తగా రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వేకు రూ.100.28 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత రెండు బడ్జెట్ల్లోనూ కేటాయించినా అడుగు ముందుకు పడలేదు. ఇక రాఘవపురం, మందమర్రి మధ్య మూడో లైన్ పనుల కోసం గతంలో కేటాయించిన రూ.180 కోట్లు యధావిధిగా ఈ బడ్జెట్లో చేర్చారు. 4.37కి.మీ నిడివి గల మంచిర్యాల–పెద్దంపేట మూడోలైన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నాలుగో లైన్ కోసం సర్వేప్రస్తుతం కాజిపేట–బల్లార్షా మధ్య మూడో లైన్ పూర్తయింది. ఇక భవిష్యత్లో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా నాలుగో లైన్ కోసం కాజిపేట–బల్లార్షా మధ్య మొత్తం 234కి.మీ. సర్వే కోసం రూ.4.68కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లోనూ ప్రతిపాదించారు. నాలుగోలైన్కు ట్రాఫిక్ సర్వే కోసం రూ.1.17కోట్లు, బెల్లంపల్లి యార్డులో మైక్రో టన్నెలింగ్ కోసం రూ.4కోట్లు, స్టేషన్లో వ్యాగన్ల నిర్వహణ కోసం సౌకర్యం కల్పించేందుకు రూ.14.12కోట్లు, సిర్పూర్ టౌన్ స్టేషన్ లోడింగ్లైన్ కోసం రూ.24.72కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్లో చేర్చినప్పటికీ విడుదల కాక పనులు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. ఆర్వోబీలు, ఓఆర్వోబీ..కొత్తగా ఆయా స్టేషన్లు, రైల్వేలైన్ల పరిధిలో అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల కోసం ఇక్కడి ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపగా, బడ్జెట్లో చేర్చారు. వీటిలో రాళ్లపేట–బెల్లంపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ నిర్మాణానికి రూ.5.90కోట్లు, రేపల్లెవాడ–ఆసిఫాబాద్ స్టేషన్ల మధ్య ఆర్యూబీకి ఏర్పాటుకు రూ.10.46కోట్లు, మందమర్రి మంచిర్యాల మధ్య రోడ్ అండర్ బ్రిడ్జి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రూ.9.65కోట్లు అంచనా వేశారు. ఆసిఫాబాద్ రోడ్ సమీపంలోనూ ఆర్వోబీ(రోడ్ఓవర్బ్రిడ్జి) కోసం రూ.40.48 కోట్లు అంచనా ఉంది. రాళ్లపేట–కాగజ్నగర్ మధ్య ఆర్యూబీ నిర్మాణానికి రూ.7.14 కోట్లు ప్రతిపాదించారు. కాగజ్నగర్–రాళ్లపేట మధ్య ఉన్న వంతెనపై రెండు అదనపు గడ్డర్లు ఏర్పాటుకు రూ.1684కోట్లు ప్రతిపాదించారు. కాగజ్నగర్ పట్టణ స్టేషన్లో మరో ఫుట్ ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50కోట్లు, రైళ్లు, రైల్వే లైన్ పక్కన రోడ్డు లైన్, వాటర్ సిస్టం కోసం రూ.13.02కోట్లు అంచనా వేశారు. -
యేసు మార్గం అనుసరణీయం
ప్రేమమయుడైన యేసు శాంతి మార్గం అందరికీ అనుసరణీయమని కౌటాల చర్చి ఫాదర్ టోమ్ అన్నారు. కౌటాల కతోలిక చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రై డే నిర్వహించారు. ప్రజలను పాపముల నుంచి రక్షించడానికి యేసు క్రీస్తు శిలువ వేయబడ్డారని తెలిపారు. విజయనగరం చర్చిలో ఫాదర్ సీజో, యాపలగూడలో ఫాదర్ శేరిన్, శివలింగాపూర్ చర్చిలో పాస్టర్ సువార్త రాజన్న, సదాశివపేట చర్చిలో పాస్టర్ శ్రీనివాస్ దేవుని వాక్యం బోధించారు. యేసు మరణానికి గుర్తుగా ఏటా గుడ్ఫ్రైడే నిర్వహిస్తారని తెలిపారు. మండల కేంద్రంతోపాటు విజయనగరం, యాపలగూడ, చింతలమానెపల్లి మండలం బాలజీ అనుకోడ, సిర్పూర్(టి) గ్రామాల్లోని క్రైస్తవులు కౌటాలకు చేరుకుని కీర్తనలు పాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి శాంతి ర్యాలీగా కల్వరి గిరిపైకి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. – కౌటాల -
ఆది దంపతుల కల్యాణం
కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు రెబ్బెన మండలం ఇందిరానగర్లోని స్వయంభూ మహంకాళి ఆలయంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం జాతర మహోత్సవం ప్రారంభమైంది. తొలిరోజు ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు దేవార వినోద్ దంపతులు కల్యాణంలో కూర్చుకున్నారు. టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, కంకణాలు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ దారావత్ అరుణకృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతిగౌడ్, సభ్యులు పాల్గొన్నారు. కాగా, జాతరలో భాగంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. – రెబ్బెన ఉత్సవ విగ్రహాలతో నిర్వాహకులు తలంబ్రాలు సిద్ధం చేస్తున్న భక్తులు -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీ పరిధిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డు నం.1లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వార్డు నం.1లో పది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులను గుర్తించి మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. యూఐడీఎఫ్ నిధులతో సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులు చేపడతామన్నారు. అలాగే డాడానగర్ చౌరస్తా నుంచి వివేకానంద సెంటర్ వరకు సీసీరోడ్డు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఏడీఏ మనోహర్, ఏపీవో గౌరవీ శంకర్, కౌన్సిలర్లు అలియా బేగం, జ్యోతి, తాజ్ పాల్గొన్నారు. అనంతరం బారెగూడ పంచాయతీలోని శివపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి రూ.30లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
సిర్పూర్(టి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధిహామీ పనులు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు నరసింహ, ఈఈ ధర్మేంద్ర, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణ కు ‘సఖి’ సేవలుఆసిఫాబాద్: మహిళల రక్షణకు సఖి కేంద్రం సేవలందిస్తుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో గల సఖి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించి, సమస్యలు తక్షణం పరిష్కరించే దిశగా సఖి కేంద్రం పని చేస్తుందని తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సహాయం, వైద్యసేవలు, ఆశ్రయం కల్పన వంటి సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించి, కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులు తెలుసుకున్నారు. -
సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
దహెగాం: సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం మండలంలోని చినరాస్పెల్లి పంచాయతీలో సర్పంచ్ తెలిగే రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఆదేశించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఉచిత కరెంట్, సన్నరకం వడ్లకు బోనస్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ తాళ్లపల్లి రామారావు, డీపీవో భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు సక్రమంగా వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం రాజంపేట్ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఉచిత బస్సు, విద్యుత్ మినహా ఇతర గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం..!
కాగజ్నగర్టౌన్: జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలు పన్నుల వసూలులో లక్ష్యం చేరలేకపోయింది. అధికారులు వందశాతం పన్నులు చెల్లించిన వారికి బహుమతులు అందిస్తామని ఆఫర్లు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినా ఆశించిన స్థాయిలో వసూళ్లు కాలేదు. కాగజ్నగర్ బల్దియా పరిధిలో 30 వార్డులు ఉండగా 13,568 గృహాలు, 1096 వాణిజ్య గృహాలు, 567 పాక్షిక గృహాలు ఉన్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియగా పన్నుల లక్ష్యాన్ని చేరలేదు. పన్నుల సేకరణను వేగవంతం చేయడానికి అధికారులు ప్రత్యేక డ్రైవ్ సైతం నిర్వహించారు. మరోవైపు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కొత్తగా ఏర్పడిన బల్దియాలో పన్నుల వసూలు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.1.05 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.60 లక్షలు మాత్రమే వసూలైంది. అంతంత మాత్రమే వసూలు2025– 26 ఆర్థిక సంవత్సరంలో కాగజ్నగర్ మున్సిపాలిటీకి రూ.380.47కోట్ల పన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే మార్చి 31 నాటికి రూ.234.26 కోట్లు మాత్రమే వసూలైంది. 61.57 శాతంగా నమోదైంది. రెసిడెన్షియల్ పన్నుల లక్ష్యం రూ.355.57 కోట్లు కాగా ఇందులో రూ.218.93 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నాన్ రెసిడెన్షియల్ విభాగంలో రూ.14.04 కోట్ల లక్ష్యానికి రూ.8.66 కోట్లు సేకరించారు. తాత్కాలిక రెసిడెన్షియల్ విభాగంలో రూ.10.83 కోట్ల లక్ష్యానికి రూ.6.67 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. పట్టణంలో 15 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా రూ.24.48 లక్షలు కట్టాలి. కానీ రూ.5.30 లక్షలు మాత్రమే వసూలు కాగా మరో రూ.19.18 పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 225 కార్యాలయాలు ఉండగా, రూ.13.30 లక్షలు చెల్లించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి మార్చి 31 వరకు ఒక పైసా వసూలు కాలేదు. ఆఫర్లు ప్రకటించినా..మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిల వసూలుకు అధికారులు బంపర్ ఆఫర్లను ప్రకటించారు. వందశాతం లక్ష్యం చేరుకోవాలనే లక్ష్యంతో పూర్తి బకాయిలు చెల్లించిన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బాక్సులో చీటీలు వేసి లక్కీడ్రా ద్వారా ఎన్నికై న వారికి మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతిగా రైస్కుక్కర్లు అందిస్తామని ప్రకటించారు. మరో వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. అయినా పన్ను చెల్లింపుదారులు ఆసక్తి చూపడంలేదు. నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపం వసూళ్లపై ప్రభావం చూపింది. బకాయిదారులు పన్నులు చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు చెల్లించకపోవడంతో లక్ష్యం చేరుకోవడం గగనంగా మారింది. ప్రత్యేక బృందాల ఏర్పాటు మున్సిపాలిటీలోని ప్రజలు పన్నులు చెల్లించి అధికారులకు సహకరించాలి. పన్నుల వసూలుకు వార్డుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. పన్నుల వసూలుకు కాలనీల్లో అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతున్నాం. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో చైర్మన్గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్సీ దండె విఠల్, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, సిబ్బంది ఆయనను అభినందించారు. అంతకు ముందు వేద పండితులు మహేశ్, శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, నాయకులు గాదెవేణి మల్లేశ్, తారీక్, జావిద్, శైలేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కర్జి చెరువు పునరుద్ధరణకు రూ.5.87 కోట్లు
దహెగాం: మండలంలోని కర్జి గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.87 కోట్లు మంజూరు చేసింది. 2021లో భారీ వర్షాలకు చెరువులోకి వరద పోటెత్తడంతో మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఏటా వర్షాకాలంలో నీరంతా వృథాగా పోతోంది. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నీటి పారుద ల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కర్జి చెరు వు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్బాబు తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. సుమారు 600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. నిధులు విడుదల కావడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 6,925 మంది హాజరు ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో గురువారం ని ర్వహించిన పదో తరగతి భౌతికశాస్త్రం పరీ క్షకు 6,950 మంది విద్యార్థులకు 6,925 మంది హాజరుకాగా, 25 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 225 మందికి 205 మంది పరీక్ష రాశారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఈవో లలిత సందర్శించారు. -
నేడు జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ హాజరవుతారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ఇటీవల జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించిన 54 మందితో మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందిస్తారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఏఐసీసీ ప్రతినిధి సచిన్ సావంత్, మీనాక్షి నటరాజన్ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, ఆత్మ చైర్మన్ గడ్డల సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తారిక్, నాయకులు గాదెవేణి మల్లేశ్, సుధాకర్, జక్కయ్య, భీమ్రావు, సంతోష్, సత్తన్న పాల్గొన్నారు. -
అందరి సహకారంతోనే 101 శాతం వార్షిక బొగ్గు ఉత్పత్తి
● జీఎం విజయ భాస్కర్రెడ్డి రెబ్బెన: బెల్లంపల్లి ఏరి యా గడిచిన ఆర్థిక సంవత్సరంలో అందరి సహకారంతో 101 శా తం వార్షిక ఉత్పత్తిని సాధించిందని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. మార్చిలో ఏరియా 3.50 లక్షల టన్నులకు 4.30 లక్షల టన్నులు సాధించి 123 శాతం ఉత్పత్తిని నమోదు చేసిందని తెలిపారు. ఇక వార్షిక ఉత్పత్తిలో ఏరియాకు 35లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 35.36లక్షల టన్నులతో 101 శాతం ఉత్పత్తి చేపట్టగలిగామన్నారు. సింగరేణి వ్యాప్తంగా కేవలం రెండు ఏరియాలు మాత్రమే వందశాతం వార్షిక ఉత్పత్తిని సాధించగా, అందులో బెల్లంపల్లి ఏరియా ఉండటం సంతోషకరమన్నారు. గత సంవత్సరం 36.05 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయగా.. ఈసారి 4.34 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని తెలిపారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు, సీనియర్ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నేడు గ్రామ సభలు
ఆసిఫాబాద్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఉదయం 9 గంటల నుంచి పంచాయతీ కార్యాలయాలు, అనుకూల ప్రదేశాల్లో సర్పంచ్, వార్డుల్లో కౌన్సిలర్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహిస్తారు. తొలుత ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపిస్తారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాల గురించి వివరిస్తారు. లబ్ధిదారుల జాబితా చదవడం, కొత్త పథకాలు, గ్రామ సమస్యలపై చర్చిస్తారు. ఇంటింటికీ ఆహ్వాన లేఖలు చింతలమానెపల్లి: గ్రామ సభకు హాజరుకావాలని కోరుతూ బుధవారం మండలంలోని డబ్బా గ్రామ సర్పంచ్ డోంగ్రి సంతోష్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. డబ్బా గ్రామంలోని ప్రజలు సభకు హాజరు కావాలని కోరుతూ కార్యదర్శి, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఆహ్వాన లేఖలు అందించారు. ఎక్కువ మంది ప్రజలు హాజరై గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో లేఖల ద్వారా ఆహ్వానించినట్లు సర్పంచ్ వెల్లడించారు. -
ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం
ఆసిఫాబాద్అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఆటో, ట్రాలీ డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారులపై హెవీ లోడ్తో ప్రయాణించొద్దన్నారు. రాత్రిపూట రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, లైట్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, పట్టణ ఎస్సైలు కమలాకర్, చంద్రశేఖర్, సీనియర్ రెసిడెంట్ అప్తామాలజిస్ట్ పవన్, హౌజ్సర్జన్ అబ్బాస్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెలోకి మిషన్ భగీరథ కార్మికులు
ఆసిఫాబాద్అర్బన్: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సమ్మెబాట పట్టా రు. జిల్లా కేంద్రంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహానికి మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మి కుల యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మా ట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకులు చాపిడి బాలేష్, పురుషోత్తం, వెంకటేశ్, వేణు, కుమార్, పల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
ఆసిఫాబాద్అర్బన్: నూతనంగా అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద బుధవారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మా ట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు– 2022 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కేరళ ప్రభుత్వం మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, కోశాధికారి ఆనందరావు, మండల అధ్యక్షుడు కమలాకర్, నాయకులు నర్స య్య, సదయ్య, రాంచందర్, మురళీ, బాలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి’
ఆసిఫాబాద్: క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపే తం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ దిశానిర్దేశ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన అరిగెల నాగేశ్వర్రావు, గొల్లపల్లి వీరభద్రాచారిని ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు కొట్నా క విజయ్కుమార్, అరిగెల మల్లికార్జున్, కోవ విజయ్, సుంకరి పెంటు, మెకర్తి లచ్చన్న, కోట గొల్లయ్య, మెరుగు శంకర్, విశ్రాంత ఎస్సై వెంకన్న పాల్గొన్నారు. -
సేవాపథం.. స్నేహహస్తం
చింతలమానెపల్లి: ప్రజలతో మమేకమయ్యేందుకు జిల్లా అటవీశాఖ ఫ్రెండ్లీ ఫారెస్ట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. అడవుల్లో చెట్లు నరకడం, వన్యప్రాణుల వేట, పోడు సాగును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. సాధారణంగా అడవుల సమీప గ్రామాల్లోని అటవీ ప్రాంతంపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో చెట్లు నరకడం, వన్యప్రాణులను హతమార్చడం, పోడు భూముల సాగుతో అటవీ ప్రాంతాలు తగ్గిపోతున్నా యి. ప్రభుత్వ, అటవీశాఖ నిబంధనల ప్రకారం అనేక మందిపై కేసులు సైతం నమోదవుతున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు, ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పలు రకాల క్రీడాపోటీలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ అటవీ శాఖ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. క్రీడాపోటీలకు ప్రాధాన్యం జిల్లాలో 2,420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లో ఖర్జెల్లి, పెంచికల్పేట్, సిర్పూర్(టి), కాగజ్నగర్, బెజ్జూర్ రేంజ్లు ము ఖ్యమైనవి. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో 98వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకునే దిశగా కాగజ్నగర్ డివిజన్లోని అటవీ సమీప గ్రామాల్లో అధికారులు చురుగ్గా ఫెండ్లీ ఫారెస్ట్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రధానంగా యువతను ఆకర్షించడం ద్వారా గ్రామీణులకు అవగాహన కలిగించవచ్చని భావిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పులి పేరుతో గతంలో క్రీడాపోటీలను నిర్వహించారు. వ్యవసాయ పనులు లేని, సెలవులు ఉన్న సమయాల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించడం ద్వారా ప్రజలు అడవుల వైపు వెళ్లకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.బాధ్యతతో పనిచేస్తున్నాంఅడవుల రక్షణ అందరి బాధ్యత. అధికారులతోపాటు ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్ర జల్లో అవగాహన తీసుకువచ్చేందుకు డివిజన్లో ఫ్రెండ్లీ ఫారెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యువతలో అవగాహన పెంచాలనేది మా ఆలోచన. సేవా కార్యక్రమాలతో ప్రజల అవసరాలను తీర్చాలనే బాధ్యతతో పనిచేస్తున్నాం. – సుభాష్, ఖర్జెల్లి రేంజ్ అధికారి ప్రజలు కూడా ముఖ్యమేఅటవీశాఖకు వన్యప్రాణులు, అడవులతోపాటు సమీపంలోని ప్రజలు కూడా ముఖ్యమే. ఆదివాసీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల సహకారం లేకుండా అటవీ సంరక్షణ అసాధ్యం. గిరిజనులు ఎదుర్కొనే ఇబ్బందులను ఉద్యోగులు ప్రత్యక్షంగా చూస్తుంటారు. ప్రజల సంరక్షణకు మా వంతుగా అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. – అప్పయ్య, కాగజ్నగర్ ఎఫ్డీవోసేవా కార్యక్రమాలతో చేరువసేవా కార్యక్రమాలతో అటవీ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని కేతినిలో గ్యాస్ కనెక్షన్లు అందించగా, గూడెంలో సోలార్ వీధి దీపాలను అమర్చారు. తిర్యాణి మండలం ఏదులపాడు గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేతిపంపుల నిర్మాణం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వైద్యశిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. -
ఇసుక రవాణా మరింత సులభతరం
ఆసిఫాబాద్: ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ విధానంతో ఇసుక రవాణా మరింత సులభతరం అవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యులు సైతం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భూ దస్త్రాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు క్రమపద్ధతిలో భద్రపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, మైనింగ్ అధికారి గంగాధర్, తహసీల్దార్ రియాజ్ అలీ, డీటీ పోచన్న, సిబ్బంది పాల్గొన్నారు. జనగణన పకడ్బందీగా చేపట్టాలి జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మూడు రోజులుగా ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో బుధవారం మాట్లాడారు. సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతీ మండలం నుంచి ఒకరు చొప్పున ఫీల్డ్ ట్రైనర్లను ఎంపిక చేసి, మూడు రోజులపాటు శిక్షణ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీవో వాసుదేవరెడ్డి, మాస్టర్ ట్రైనర్ హుస్సేన్ పాల్గొన్నారు. నివాస సముదాయాలు పూర్తి చేయాలి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయ సిబ్బంది, అధికారుల నివాస సముదాయాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, అసంపూర్తిగా నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావు, ఏవో కిరణ్ పాల్గొన్నారు. -
● అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవులుగా ఈఎంటీలు ● 108 అంబులెన్స్ల ద్వారా మెరుగైన సేవలు ● ఏడాదిలో 16,696 కేసులకు స్పందన ● నేడు ఈఎంటీల దినోత్సవం
వాంకిడి: ఫోన్ కాల్ వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందిస్తూ.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఎంతటి మారుమూల ప్రాంతానికై నా సేవలందిస్తూ 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వాహనం ఘటనాస్థలికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నా కాలినడకన వెళ్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 15 వరకు 108 అంబులెన్స్లు ఉన్నాయి. ఇందులో 33 మంది ఈఎంటీలు, 34 మంది పైలెట్(డ్రైవర్)లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఘటన స్థలానికి చేరడం, ప్రథమ చికిత్స చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. అత్యవసర సమయాల్లో గర్భిణులకు ప్రసవాలు జరిపించడం నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి, రోగాల బారినపడి సాయం కోరే వారికి సేవలందిస్తున్నారు. 16,696 కేసులకు స్పందన 2025 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 16,696 కేసులకు 108 సిబ్బంది స్పందించి రోగులను ఆస్పత్రులకు చేర్చారు. ఇందులో డెలివరీ కేసులు 540, రోడ్డు ప్రమాద కేసులు 1,794, గర్భిణుల కేసులు 4,975, కడుపునొప్పి కేసులు 1,741, పా యిజన్ కేసులు 840, వివిధ రకాల కేసులు 3,619 ఉన్నాయి. ప్రమాదం, ప్రసవ వేదన, జ్వరం, కడుపు నొప్పి, పాముకాటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పి, మూర్చ, స్పృహ కోల్పోవడం వంటి ఘటనలకు తక్షణ చికిత్స అందకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఈఎంటీలు వేగంగా ఘటన స్థలానికి చేరుతూ ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు 108 సేవలు వరంగా మారాయి. ప్రసవ నొప్పులు ప్రారంభం కాగానే కుటుంబ సభ్యులు నేరుగా 108కి ఫోన్ కాల్ చేస్తున్నారు. నొప్పులు పెరగడం, ఆస్పత్రికి తరలించేందుకు సమయం లేకపోతే మార్గమధ్యలోనే సిబ్బందే ప్రసవం చేస్తున్నారు. అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని తల్లీబిడ్డలను క్షేమంగా ఆస్పత్రులకు చేర్పిస్తున్నారు. 24 గంటలపాటు అందుబాటులో..24 గంటలపాటు 108 సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసరంలో ఏ సమయంలోనైనా కాల్ చేసినా వెంటనే స్పందిస్తారు. ప్రమాద స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేస్తారు. అనంతరం సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రిలో చేర్పిస్తారు. – మెరుగు నరేశ్యాదవ్, జిల్లా ప్రోగాం మేనేజర్వెంటనే స్పందిస్తున్నాంఏడాదిన్నరగా 108 అంబులెన్స్లో ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్నాను. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం. క్షణాల్లో బయలుదేరి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స నిర్వహిస్తాం. ఆపదలో ఉన్న వారికి సేవలందించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. – ఎనగంటి ప్రవీణ్, ఈఎంటీసద్వినియోగం చేసుకోవాలిప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 108 సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రమా దం జరిగినా వెంటనే సమాచారం అందించాలి. సిబ్బంది క్షణాల్లో స్పందించి సాంకేతికత ఆధారంగా ఘటన స్థలానికి చేరుకుంటారు. ఈఎంటీలు ప్రథమ చికిత్స అందిస్తారు. – సామ్రాట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ఆరేళ్లుగా సేవలుఆరేళ్లుగా ఈఎంటీగా సేవలందిస్తున్నా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించి ఆస్పత్రులకు చేర్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. విధి నిర్వహణలో డెలివరీ, రోడ్డు ప్రమాదాలు, తదితర కేసులకు స్పందించి ఘటన స్థలాలకు చేరుకుంటాం.– అడ అజయ్, ఈఎంటీఅనుకోని ప్రమాదాల బారిన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి మేమున్నామని ఆపద్బాంధవులుగా ధైర్యాన్ని నింపుతూ 108 సిబ్బంది ఎనలేని సేవలందిస్తున్నారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి క్షణాల్లో గమ్యం చేరడంలో పైలెట్ల చాతుర్యం ఒకెత్తు అయితే.. ఆస్పత్రికి చేరేవరకు క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో ఈఎంటీలు పాత్ర మరో ఎత్తు. ‘నీకేమీ కాదు.. నీకు నేనున్నాను’ అంటూ ధైర్యం కల్పిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు చేస్తున్నారు. గురువారం ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ)ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో గురువారం నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్ 100 కాల్స్పై సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయొద్దని సూచించారు. అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. గంజాయి, మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కనెక్షన్.. ఇక ఈజీ
వాంకిడి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీసుకువచ్చిన నూతన విధానంతో విద్యుత్ సేవలు సులభతరంగా, పారదర్శకంగా అందనున్నాయి. కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ సర్వీస్ లైన్ చార్జీలు లోడ్ ఆధారంగా చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వ్యక్తిగత క్షేత్రస్థాయి తనిఖీల అవసరం లేకుండా కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. గతంలో విద్యుత్ కనెక్షన్ కావాలంలే సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ ప్రతిపాదనలు రూపొందించి దాని ప్రకారం దరఖాస్తుదారులు రుసుం చెల్లించేవారు. ఈ విధానాన్ని సవరిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి కొత్తగా రెగ్యులేషన్ నం.1 ఆఫ్ 2026 ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన పద్ధతిలో ఒక కిలోమీటరు దూరం వరకు ఎలాంటి చార్జీలు వర్తించవు. కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉండే సర్వీసులకు మాత్రమే లోడ్ ఆధారంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన లేకుండానే త్వరితగతిన సర్వీసులు మంజూరు చేస్తారు. కాగా జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నూతన విధానంలో చార్జీల వివరాలు జిల్లాలో మొత్తం 1,78,961 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గృహ వినియోగ కనెక్షన్లు 1,41,933 ఉండగా, వ్యాపార కనెక్షన్లు 15, 190, వ్యవసాయ కనెక్షన్లు 15,373 ఉన్నాయి. నూతన విధానంలో గృహ వినియోగదారులు కిలో వాట్ వరకు 500 సర్వీస్ లైన్ చార్జీలు చెల్లించాలి. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు గృహ వినియోగ 1,41,933 వ్యాపార 15,190 ఎల్టీ ఇండస్ట్రీయల్ 630 కోటేజ్ ఇండస్ట్రీస్ 11 వ్యవసాయం 15,373 హైటెన్షన్ కనెక్షన్లు(హెచ్టీ) 104 ఇతరాలు 5,720లోడ్ ఆధారంగా చార్జీలు.. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీస్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు వర్తిస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఖర్చు భారం వినియోగదారుడిపై మోపరు. ట్రాన్స్ఫార్మర్ సరఫరా, ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు ఉండవు. శాఖ వారే బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏకరీతి విధానంతో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సులభంగా అందనున్నాయి. -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి అరిగెల నాగేశ్వర్రావు
ఆసిఫాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన అరిగెల నాగేశ్వర్రావును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్న నాగేశ్వర్రావుకు రాష్ట్ర పదవి దక్కింది. అలాగే ఆయనతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కాగజ్నగర్కు చెందిన గొల్లపల్లి వీరభద్రాచారికి అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అమర్సింగ్ తిలావత్ను నియమించారు. నాగేశ్వర్రావు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనకు రాష్ట్ర పదవి కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం’
కాగజ్నగర్టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ ఆరోపించారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో మంగళవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను తాము అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా నాయకులు కార్తీక్, టీకానంద్, ముంజం ఆనంద్కుమార్, శ్రీనివాస్, అనిత, త్రివేణి, జాదవ్, రాజేందర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి బడ్జెట్ @ రూ.37.8కోట్లు
ఆసిఫాబాద్అర్బన్: మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన నూతన ఆసిఫాబాద్ పురపాలక తొలి బడ్జెట్ను మంగళవారం ఆమోదించారు. జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే సరైన గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం 2026– 27 సంవత్సరానికి సంబంధించి రూ.37.80 కోట్లతో మున్సిపల్ తొలి బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. బడ్జెట్ను మూడు భాగాలుగా విభజించారు. మున్సిపాలిటీకి స్వతహాగా వచ్చే నిధులు రూ.5.01 కోట్లు కాగా.. అంతే మొత్తంలో జీతాలు, ఇతర ఖర్చులు చూపించారు. డిపాజిట్ల రూపంలో రూ.60 లక్షల నిధులు సమకూరుతుండగా, దానికి సంబంధించి అంతే మొత్తం ఖర్చు ఉంది. ఇతర గ్రాంట్లకు సంబంధించి నాన్ప్లాన్ విభాగంలో రూ.5కోట్లు, ప్రణాళిక విభాగంలో రూ.3.65 కోట్లు రానున్నట్లు అంచనా వేశారు. మౌలిక వసతుల కల్పన కోసం ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చే నిధులతో రూ.32.19 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో పొందుపర్చారు. కౌన్సిల్ సభ్యులు పలు సందేహా లను లేవనెత్తగా.. అధికారులు, ఎమ్మెల్యే నివృత్తి చే శారు. తమ వార్డుల సమస్యలను చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకవచ్చారు. ఆదాయం పెంచడం ద్వారానే అభివృద్ధి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యపడుతుందని మున్సిపల్ చైర్మన్ ఆకాశ్ తెలిపారు. అన్ని రకాల పన్నులు, అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్, నాన్ ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో బడ్జె ట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో అన్ని రకాల ఖర్చులు(వేతనాలు), పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ చార్జీలు, రుణాల చెల్లింపులు, గ్రీన్ బడ్జెట్, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణ, సాధారణ పరిపాలనకు కేటాయింపులు చేసినట్లు వివరించారు. అదనపు ఆదాయ మార్గాలను గుర్తించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ మున్సి పాలిటీ పరిధిలోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించా రు. ఇది మున్సిపల్ పాలక మండలి బాధ్యత అని స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఆ దాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల నిరసన మున్పిపల్ చైర్మన్ కార్యాలయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, బడ్జెట్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, సమావేశ మందిరంలో సరైన కుర్చీలు కూడా వేయకుండా అవమానిస్తున్నారని ఆరోపిస్తూ నేలపై కూర్చోని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించారు. గతంలో ప్రొటోకాల్ ప్రకారం వైస్ చైర్మన్ కుర్చీ ఏర్పాటు చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనల ప్రకారం సమావేశ గదిలో అధికారులు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
700 నుంచి 800 మంది జనాభాకు ఒక బ్లాక్
హాజరైన సిబ్బంది ఆసిఫాబాద్: జిల్లాలో బుధవారం నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతీ గణన వివరాలు కాగితం రూపంలోనే ఉండగా, తొలిసారి మొబైల్ అప్లికేషన్లో వివరాలు అప్లోడ్ చేయనున్నారు. మొత్తం ప్రక్రియ డిజిటల్గా చేపట్టనున్నారు. 2027 జనగణన రెండు దశల్లో చేయనుండగా, మొదటి దశలో గృహాల జాబితా, రెండోదశలో జనాభా, వ్యక్తిగత వివరాలు సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లు గడపగడపకూ వెళ్లి ఇళ్ల జాబితా తయారు చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి కార్యాచరణ, శిక్షణపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ హరిత జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో శిక్షణ కొనసాగుతుండగా బుధవారం పూర్తికానుంది. ఇప్పటికే 20 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా ఎంపిక చేసుకుని సర్వే ప్రారంభి స్తారు. రెండో దశ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి కాగా, మూడో దశలో 21 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది.జిల్లాలో జనగణన– 2027లో భాగంగా బుధవారం నుంచి మొదటి విడత ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి చార్ట్ అధికారులు, ఫీల్డ్ అధికారులు, సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జనాభా గణనలో భాగంగా చా ర్ట్ అధికారులుగా వ్యవహరిస్తున్న తహసీ ల్దార్లు, ఎంపీడీవోలకు తమ పరిధిలోని ప్రతీ అంశంపై అవగాహన ఉండాలన్నారు. రెవె న్యూ గ్రామాలు, పంచాయతీలను క్షేత్రస్థాయిలో సందర్శించి, క్షేత్ర సహాయకులతో హౌజ్ లిస్ట్ బ్లాక్లను రూపొందించాలని ఆదేశించా రు. ప్రతీ ఎన్యుమరేటర్కు 700 నుంచి 800 జనాభా వచ్చేలా బ్లాక్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 335 పంచాయతీలు, 2 ము న్సిపాలిటీల్లో ఇళ్ల గణన పూర్తి చేసి, వారం రో జుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సర్వే ఇలా.. పదేళ్లకోసారి జరిగే జనగణనలో మొదట హౌజ్ మ్యాపింగ్ ద్వారా గుర్తించిన ఇళ్లను లెక్కిస్తారు. ఈ దశలో ఎన్యుమరేటర్లు టాబ్లెట్లతో ఇల్లు వివరాలు, చిరునామాలు డిజిటలైజ్ చేయనున్నారు. హౌజ్ మ్యాపింగ్లో ఇల్లు నిర్మాణం, వాడే వస్తువుల నుంచి తినే తిండి వరకు పూర్తి వివరాలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల గణన కోసం 34 ప్రశ్నలు అడుగుతారు. ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఇంటి నంబర్, యాజమాన్య స్థితి, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య, యజమాని పేరు, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు అనే సమాచారం సేకరిస్తారు. ఇంట్లో తాగునీరు, నీటి లభ్యత, విద్యుత్, మరుగుదొడ్డి రకం, డ్రెయినేజీ వ్యవస్థపై వివరాలు తీసుకుంటారు. అలాగే వంటకు వాడుతున్న ఇంధనం, వంటగది సౌకర్యం ఉందా.. డిజిటల్ ఆస్తులు రేడియో, టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్, స్మార్ట్ ఫోన్ వివరాలు, సైకిల్, స్కూటర్, కారు, వ్యాన్, ప్రధానంగా వినియోగించే తృణధాన్యాల వివరాలు సేకరిస్తారు. ఆధార్ను మొబైల్ ఓటీపీతో ధ్రువీకరిస్తారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 434 రెవెన్యూ గ్రామాలు, 335 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 5.93 లక్షల జనాభా, 1.20 లక్షల గృహాలు ఉన్నాయి. జనగణనలో ప్రస్తుత ఇళ్ల సంఖ్య తేలనుంది. తహసీల్దార్లు, ఎంపీడీవోలను చార్ట్ అధికారులుగా నియమించారు. 171 మంది సూపర్వైజర్లు, 995 ఎన్యుమరేటర్లు విధుల్లో ఉంటారు. 700 నుంచి 800 మంది జనాభాను ఒక బ్లాక్గా గుర్తించి ఎన్యుమరేటర్కు లెక్కించే బాధ్యత అప్పగిస్తారు. ప్రతీ ఆరుగురు సర్వేయర్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు. అత్యవసర పరిస్థితుల కోసం పదిశాతం అదనపు సిబ్బందిని నియమించారు. -
వ్యర్థంతో అర్థం
వ్యర్థ పదార్థాలతో ఉపయోగకరమైన వస్తువుల తయారీపై మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏకో క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. విద్యార్థులు పర్యావరణ హిత వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. క ళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీస్తాయన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వ్యర్థ పదార్థాలను వినూత్న మార్గాల్లో ఉపయోగించేలా ప్రొత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. – కాగజ్నగర్టౌన్ -
జిల్లాలో ఎఫ్ఎల్ఎస్ పరీక్ష విజయవంతం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఎంపిక చేసిన 23 ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు డీఈవో లలిత అన్నారు. పరీక్ష విజయవంతంగా పూర్తిచేసిన ఛాత్రోపాధ్యాయులను మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో అభినందించారు. డీ ఈవో మాట్లాడుతూ జిల్లాలోని 23 పాఠశాలల నుంచి 229 మంది మూడో తరగతి విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. చదవడం, రా యడం, గణిత నైపుణ్యాలను అంచనా వే యడం ఈ పరీక్ష ఉద్దేశమన్నారు. ఫలితాల ఆధారంగా అభ్యాస స్థాయిని విశ్లేషించి లోపాలను గుర్తిస్తామని, భవిష్యత్తులో తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై ఆర్థికభారం తగ్గించేందుకే ‘మహాలక్ష్మి’
ఆసిఫాబాద్: మహిళపై ఆర్థిక భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వా రా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని కలెక్టర్ హరిత అన్నారు. 2026 మార్చి 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సేవలు(290 కోట్ల ఉచిత ప్రయాణాలు) పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో విజయోత్సవాలు నిర్వహించారు. డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళా ఉద్యోగులు విద్య, వైద్యం, కుటుంబ అవసరాల కోసం సులభంగా వెళ్లగలుగు తున్నారని తెలిపారు. మహిళలతోపాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ హరితతోపాటు పలువురు మహిళా ప్రయాణికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల, ఉపాధ్యాయురాలు శైలజ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమకారుడికి గౌరవం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని భట్టుపల్లి చౌరస్తాకు తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేస్తూ మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతకు ముందు వార్డు నం.6, 7, పరిధిలో ఉన్న చౌరస్తాకు తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య చౌరస్తాకు పేరు పెట్టాలని కౌన్సిలర్ కావేటి విజయ్కుమార్ కోరారు. తీర్మానం అనంతరం ఆయన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ మలివిడత తెలంగాణ ఉద్యమంలో కావేటి సమ్మయ్య పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. నల్ల టీషర్టు ధరించి అసెంబ్లీ పైకెక్కి చేసిన నిరసన ఘటన రాష్ట్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిందని తెలిపారు. అలాంటి ఉద్యమకారుడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. -
ఆటంకాలు అధిగమించి.. లక్ష్యం చేరి..
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా మరో ఏడాది సైతం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. వరుసగా మూడేళ్లు లక్ష్యాన్ని చేధించడం ఏరియా చరిత్రలో ఇదే తొలిసారి. అధిక వర్షాలు, పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని రవాణాకు ఆటంకాలు, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు.. వంటి అనేక సవాళ్లు ఎదురైనా ఉద్యోగులు గడువుకు రెండు రోజుల ముందే లక్ష్యాన్ని సాధించారు. యాజమాన్యం తీసుకున్న ముందస్తు చర్యలు, సమష్టి కృషి, ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయి. భారం మోసిన ఖైరిగూర ఓసీపీబెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడేది. కాలక్రమేణా భూగర్భ గనులు, ఓసీపీలు మూ తపడ్డాయి. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఒక్కో గని మూ తవేతకు గురికాగా ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీ ఒక్కటే మిగి లింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకపోవడంతో గోలేటి ఓసీపీ ప్రారంభానికి నోచుకోలేదు. అయినా దానికి అతికొద్ది మొత్తంలో ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు. దీంతో వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనలో ఏరియాకు ఖైరిగూర ఓసీపీ గుండెకాయలా మారింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా ఆదివారం నాటికే 35.14 లక్షల ఉత్పత్తిని సాధించి వందశా తం లక్ష్యం పూర్తి చేసింది. ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే ఖైరిగూర ఓసీపీ ఏరియా భారాన్ని భుజాన వేసుకుని వందశాతం ఉత్పత్తిని అందించి ఏరియాకు తలమానికంగా మారింది. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఖైరిగూర ఓసీపీ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చరిత్ర సృష్టించింది. ఒక్క రోజే 26,426 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు అంతే మొత్తంలో రవాణా చేసి గత రికార్డులను తిరగరాసింది. ప్రతిబంధకంగా మారిన వర్షాలుఉత్పత్తి లక్ష్య సాధన అనుకున్నంత సులువుగా ఏమీ జరగలేదు. గతేడాదితో పోల్చితే ఈసారి అధిక వర్షాలు ప్రతిబంధకంగా మారాయి. ఖైరిగూర ఓసీపీ వెళ్లే మార్గంలోని పావురా ల గుట్ట వద్ద కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో పూ ర్తిగా దెబ్బతింది. ఓసీపీకి వెళ్లే అవకాశమే లేకపోవడంతో ప్ర త్యామ్నాయ మార్గం ద్వారా ఉద్యోగులను తరలించారు. దా దాపు 15 రోజులపాటు బొగ్గు రవాణా ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది ఏరియాలో 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే.. ఈసారి ఏకంగా 2099 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. పంప్ మోటర్ల ద్వారా క్వారీలోకి చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తోడారు. వర్షం తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తిని కొనసాగించారు. ఓబీ వెలికితీత కాంట్రాక్టర్ సహకారం కూడా కలిసి వచ్చింది. లక్ష్యానికి తగినట్లుగా ఓబీ వెలికితీత సాగడంతో బెంచ్లు అందుబాటులోకి వచ్చాయి. వర్షాకా లంలో కోల్పోయిన ఉత్పత్తిని వర్షాలు తగ్గుముఖం పట్టిన త ర్వాత చేపట్టేందుకు యాజమాన్యం ప్రణాళికలు అమలు చే సింది. అంతిమంగా అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి బెల్లంపల్లి ఏరియాను వరుసగా మూడో సంవత్సరం కూడా వార్షిక లక్ష్యం సాధించిన ఏరియాగా నిలబెట్టారు. అందరి సహంకారతోనే ఉత్పత్తి లక్ష్య సాధనబెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేధించినట్లు జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే 35లక్షల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఖైరిగూర ఓసీపీలో సోమవారం అధికారులు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ఆదివారం నాటికి 35.14లక్షల టన్నుల ఉత్పత్తి సాధించించామన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజే 26,426 టన్నుల ఉత్పత్తి సాధించడంతో పాటు బొగ్గు రవాణాను చేయడం అభినందనీయమని కొనియాడారు. ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
బకాయిల వసూలుకు బంపర్ ఆఫర్లు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో పేరుకుపోయిన పన్నుల బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. వందశాతం లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో మొత్తం బకాయిలు చెల్లించిన వారికి బహుమతులు అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. లక్కీడ్రా ద్వారా మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతిగా రైస్కుక్కర్ అందించనున్నారు. మున్సిపాలిటీలో 14,088 గృహాలు ఉండగా రూ.3.80 కోట్ల పన్నుల టార్గెట్కు ఇప్పటివరకు రూ.2.19కోట్లు వసూలైంది. ఆదివారం వరకు 58.09 శాతం వసూలు కాగా మరో రూ.1.61 కోట్లు పెండింగ్ ఉంది. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. -
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, చిల్లగింజలు మొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురుచూడకుండా, వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలని కోరారు. నూతన డీఆర్ డిపోల్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, రమేశ్, మనోహర్, ఇస్తారి, లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సోమవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలను స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎత్తు, బరువు, నైపుణ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్టు, 800 మీటర్ల పరుగుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. -
ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: ఇటీవల జరిగిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సన్మానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి సత్కరించారు. టీఎంఎస్ఎస్ ఉట్నూర్, ఖానాపూర్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పతకాలతో సత్తా చాటారు. రా బోయే రో జుల్లో మరిన్ని వేదికల్లో సత్తా చాటాలని ఆ కాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులకు నెహ్రూ జువాలజీకల్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, హు స్సేన్ సాగర్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శింపజేశారు. ఉత్సాహంగా గడిపిన ఎమ్మెల్యే వారి తో డిన్నర్ చేశారు. సన్మానం పొందిన వారిలో పతకాలు సాధించిన ఎస్.నవీన్, యు.గణేశ్, ఎం.మారుతి, ఎమ్.నిఖిల్ కుమార్, ఎస్.శంకర్, కె.సురేందర్, ఆర్.శివసాయి, ఏ.యాదవ్ శావ్, పి.హనుమంతరావు, హెచ్ కె.నగేశ్ ఉన్నారు. క్రీడాకారులతోపాటు జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, నిర్మల్ డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, శిక్షకులు శివ, రాజకుమార్, హెచ్డబ్ల్యూఓ గంగారం తదితరులు ఉన్నారు. -
అటవీ జంతువుల సంరక్షణకు చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ హాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం పశుసంవర్ధకశాఖ, అటవీశాఖ సిబ్బందికి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్కుమార్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్కుమార్, సైంటిస్టు అజయ్ గౌర్, బయాలజిస్ట్ ఎల్లంతో కలిసి ప్రత్యేక సూచనలు అందించారు. కార్యక్రమంలో ఎఫ్డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వోలు గోవింద్, చంద్ సర్దార్, యోగేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతుబీమా అందించాలి నా భర్త మాచర్ల సాహెబ్రావు పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వంకాయ, మిర్చి, టమాటా పండించేవారు. అధిక వర్షాలతో పంట నష్టం జరిగింది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు రాకపోవడంతో అప్పుల బాధతతో 2021 సెప్టెంబర్ 8న గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జీవో 194 ప్రకారం రైతుబీమా, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలి. – మాచర్ల రేఖ, నెహ్రూనగర్, మం.కెరమెరి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలి ఎలాంటి ఆధారం లేని నిరుపేద కుటుంబానికి చెందిన నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. కనీస అవసరాలు తీర్చేవారు కూడా లేరు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి బాసటగా నిలవాలి. – డబ్బుల బాపు, మొట్టగూడ, మం.దహెగాం ఉపాధి కల్పించేందుకు కుట్టు శిక్షణ ఆసిఫాబాద్అర్బన్: మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీఆర్డీవో దత్తారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల యూనిఫాం కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ట్రైనర్లకు పలు సూచనలు చేశారు. శిక్షణకు వచ్చిన వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఏపీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎం నాగజ్యోతి, ట్రైనర్లు పాల్గొన్నారు. -
ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలు(లక్షల టన్నుల్లో)
నెల లక్ష్యం సాధించిన ఉత్పత్తి శాతం ఏప్రిల్ 3.50 2.74 78 మే 3.50 3.04 87 జూన్ 2.00 2.62 131 జూలై 2.00 2.00 100 ఆగస్ట్ 2.00 1.36 68 సెప్టెంబర్ 2.00 0.74 37 అక్టోబర్ 3.00 3.03 101 నవంబర్ 3.5 3.53 101 డిసెంబర్ 3.5 3.92 112 జనవరి 3.5 4.30 123 ఫిబ్రవరి 3.00 3.77 126 మార్చి 3.22 3.93 122(ఆదివారం వరకు) -
స్టెప్పులేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. -
కుమురం భీం
7ప్రశాంతంగా ఎఫ్ఎల్ఎస్ పరీక్ష జిల్లాలో పలు ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం నిర్వహించిన ఎఫ్ఎల్ఎస్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎంఈవోలు పరీక్ష తీరును పర్యవేక్షించారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత కొనసాగుతాయి. రాత్రి చలి ప్రభావం ఉండదు. కరువైన పర్యవేక్షణ చెన్నూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వస్తున్నాయి. 8లోu మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026 -
త్వరితగతిన వినతుల పరిష్కారం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిర్యాణి మండలం ఎదులపాడ్ పంచాయతీ పరిధిలోని అరటిపల్లిలో అంగన్వాడీ భవనం నిర్మించాలని సర్పంచ్ మడావి పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని తిర్యాణి మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన హనుమంత్రావు, నిలిపివేసిన పింఛన్ను పునరుద్ధరించాలని కాగజ్నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజా వేర్వేరుగా వినతులు అందించారు. తన తండ్రి ఉద్యోగం చేస్తూ మరణించాడని, కారుణ్య నియామకం కింద అవకాశం కల్పించాలని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడిగోపుల మాన్విత కోరింది. కాన్పూర్ ఐఐటీలో ఫస్టియర్ చదువుతున్న తనకు ల్యాప్టాప్ అందించాలని కౌటాల మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుమ్మరి సంస్కృతి విన్నవించింది. ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాసుపుస్తకంలో ఎకరం స్థలం తక్కువగా నమోదైందని, దీనిని సవరించాలని రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన టేకం భుజంగ్రావు కోరాడు. -
మెడికల్ బోర్డు పునరుద్ధరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో సంవత్సరం కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జీఎం ఎం.శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డ వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. మెడికల్ ఫిట్ అయిన 300 మంది డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ నాయకులు అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు గొర్ల సంతోష్, బుస్స రమేశ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: మండలంలోని గుండి శివారులో నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. సోమవారం హత్య కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. 2022లో పెంచికల్పేట్ మండలానికి చెందిన సాగర్ ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికివెళ్లే దారిలో శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును ఎస్పీ చొరవతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సాగర్ను కాగజ్నగర్కు రమ్మని పిలిచి, ఆటోలో ఎక్కించి ఆసిఫాబాద్ మండలం గుండి శివారు పంట పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసును హత్యగా నిర్ధారించారు. కౌటాల బాలుర వసతి గృహం కుక్ కొండూరి మల్లేశ్వరి, కాగజ్నగర్ ద్వారాకానగర్కు చెందిన ఎన్నం అశోక్, పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చెన్నూరి స్వామి నేరాన్ని ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, చెన్నూరి స్వామి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు, వీరిలో సీఐ బాలాజీ వరప్రసాద్, డీసీఆర్బీ సీఐ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌటాల ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఐటీకోర్ కానిస్టేబుల్ మహేశ్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జనగణన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ గ్రామాలు, పంచాయతీ వార్డుల వారీగా బ్లాక్లు ఏర్పాటు చేయాలని, ఒక్కో ఎన్యుమరేటర్కు 700 నుంచి 800 జనాభా వచ్చేలా చూడాలన్నారు. జాబితా రూపొందించి సీఎంఎస్ పోర్టల్లో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో జనగణన, ఇళ్ల గణన అధికారుల సమన్వయంతో చేపడతామని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ప్రారంభించామని, త్వరలో మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో అదననపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, సీపీవో వాసుదేవరెడ్డి, ఉపగణాంక అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కాన్కూర్లో జల సంరక్షణ చర్యలు
జైపూర్: మండలంలోని కాన్కూర్ అటవీ ప్రా ంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు. టీజీఎఫ్డీసీకి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలోని వాగులో రెండు చోట్ల నీటిఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూ డిక తొలగించి అడ్డుకట్టలు వేశారు. టీజీఎ ఫ్డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్లో వేసవిలో నీటి వృథాను అరి కట్టి జల సంక్షరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని అంబేద్క ర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇ లా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెంది న అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగి త్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మా ర్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్ట డంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొరవడిన క్రమశిక్షణ..కరువైన పర్యవేక్షణ
చెన్నూర్: గురుకుల విద్యాలయాలు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు పెట్టింది పేరు. గతంలో విద్యాబ్యాసం కఠినతరంగా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ విద్యార్థుల్లో కొరవడిందా, ఉపాధ్యాయుల వేధింపులు ఎక్కువయ్యయా అనే అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. వాచ్మెన్ నుంచి పాఠశాలల వరకు పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల తినుబండారాలను తనిఖీ చేసి లోనికి పంపిస్తారు. పాఠశాలకు గడ్డిమందు వచ్చిందంటే పర్యవేక్షణ కొరవడిందని చెప్పుచ్చు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గాడితప్పుతున్నారా అనే అనుమానులకు తావిస్తున్నాయి. మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం పట్ల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురుకులాల్లో విద్యార్థులు బయటికి వెళ్లాలంటే కేవలం దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగతారోజుల్లో మాత్రమే ఇళ్లకు పంపిస్తారు. నెలలో రెండు ఆదివారాల్లో తల్లిదండ్రులు వస్తే ఔటింగ్కు పంపిస్తారు. ఇన్ని నిబంధనలు ఉన్న విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న విషయం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మృతుల వివరాలు ఇలా.. చెన్నూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి చెన్నూర్ గురుకుల పాఠశాలలోనే మూడేళ్లలో ముగ్గురు మృతువాత పడ్డారు. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్కు గురయ్యారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో జరుగుతున్న వరుస ఘటనలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలల పై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలలో అధ్యాపకురాలు, విద్యార్థిని, మైనార్టీ గురుకులంలో విద్యార్థి చొప్పున ముగ్గురు మృతి చెందారు. మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో తోటి విద్యార్థిని కొడుతూ సెల్ఫోన్లో వీడియో తీసిన పది మంది విద్యార్థులు సస్పెన్స్కు గురికాగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ను విధుల నుంచి తొలగించారు. -
గవర్నర్ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడు
పాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్రెడ్డి కలిశా రు. హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సంక్షేమానికి రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, గత బడ్జెట్లో రూ.183 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలిపారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని, భవిష్యత్లో ఉద్యమాలకు సిద్ధం కావా లని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజుల రామచంద్ర, నాయకులు ఓదెలు, చందు, భాగ్య, శనిగారపు సత్యం, మామిడి రమేష్, కోటిపల్లి కళావతి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు. పెళ్లికావడం లేదని యువకుడి ఆత్మహత్య కాగజ్నగర్టౌన్: పెళ్లి కావడం లేదని మనస్తా పం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఎస్సై సుధాకర్ తెలి పారు. ఆ యన కథనం ప్రకారం.. కాగజ్నగర్లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన బంక సురేష్(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నా డు. గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈక్రమంలో సోమవారం ఇంట్లో వాసానికి లుంగీ తో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కడుపునొప్పి భరించలేక వ్యక్తి..సిర్పూర్(టి): కడుపునొప్పి భరించలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై సాగర్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని పాతట్లగూడ కాలనీకి చెందిన పర్శన శంకర్(59) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సా మాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
మేల్కోకుంటే ముప్పే..!
ఆసిఫాబాద్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతుండటంతో రానున్న రోజుల్లో సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎండలు ముదిరితే అడ(కుమురంభీం) ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 236.65 మీటర్లకు తగ్గగా, మరో ప్రధాన ప్రాజెక్టు వట్టివాగు గరిష్ట నీటి మట్టం 239.500 మీటర్లు కాగా, ప్రస్తుతం 236.700 మీటర్లకు చేరింది. చెలిమెల ప్రాజెక్టులో 322.75 మీటర్లు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో 163.00, పీపీరావు ప్రాజెక్టులో 146.150 మీటర్ల నీటి మట్టం ఉంది. అలాగే చెరువులు, కుంటల్లో కూడా నీరు, భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. ప్రస్తుత నీటి నిల్వ ఇలా..కుమురంభీం ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ సామర్థ్యం 5.2 టీఎంసీలు కాగా, నీటిమట్టం 236.65 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో వంద క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేయడం లేదు. మిషన్ భగీరథ కోసం 30 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అడ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ ద్వారా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 11 వేల కనెక్షన్లు, 5 వాటర్ ట్యాంకులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో నీటి కొరతతో నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. వేసవిలో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు సైతం ఉన్నాయి. వట్టివాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 2.89 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నత్తనడకన ‘జగన్నాథ్పూర్’కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పనులు దశాబ్దకాలంగా నత్తనడకన నడుస్తున్నాయి. కాగజ్నగర్, దహెగాం మండలాల పరిధిలోని 15 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, భూసేకరణ, ఇతర సమస్యలతో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. ఆయకట్టు రైతులకు చుక్క నీరందని దుస్థితి నెలకొంది. ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిర్యాణి మండలం ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు, పీపీరావు ప్రాజెక్టుల రైతులకు కూడా పూర్తిస్థాయి ఆయకట్టు నీరందడం లేదు. ప్రతిపాదనలు పంపించాం కుమురంభీం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అవసమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మహారాష్ట్రలోని పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం ప్రాజెక్టు వద్ద ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తారు. వారి నివేదక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నిధులు విడుదలైతే మరమ్మతులు చేపడతాం. – గుణవంత్రావు, ఇరిగేషన్ ఈఈజిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు(మీటర్లలో)ప్రాజెక్టు గరిష్ట కనిష్ట కుమురంభీం(అడ) 243.0 236.65 వట్టివాగు 239.5 236.7 చెలిమెల 326.3 322.7 జగన్నాథ్పూర్ 165.0 163.0 పీపీరావు 147.5 146.1ఆనకట్టకు మరమ్మతులేవి..?కుమురంభీం ప్రాజెక్టును 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఆసిఫాబాద్, సిర్పూర్– టి నియోజకవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం. అయితే నాలుగేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలడంతో నీటి నిల్వలను తగ్గించారు. ఏటా వర్షాకాలంలో దెబ్బతినకుండా పాలిథిన్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. కట్టపై వేసిన తారురోడ్డుకు సైతం బీటలు వారడంతోపాటు రక్షణగా నిర్మించిన సైడ్ వాల్స్ ధ్వంసమవుతున్నాయి. ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. అప్పట్లో హడావుడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. మరమ్మతులకు రూ.5 కోట్లు అవసరం ఉండగా, నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులకు పైసా నిధులు విడుదల చేయలేదు. అసంపూర్తి కాల్వలతో ప్రస్తుతం కేవలం ఐదు వేల ఎకరాలకే సాగు నీరందుతోంది. -
వంకులం @41.5 డిగ్రీలు
కౌటాల: కొద్దిరోజులుగా అకాల వర్షాలు, మ బ్బులు పట్టిన ఆకాశం, చల్లగాలులతో ఆహ్లా దకర వాతావరణం ఉండగా, మళ్లీ భానుడు భగ్గుమంటున్నాడు. గడిచిన మూడు రోజులు గా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. వేడి కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం రెబ్బెన మండలం వంకులంలో పగటి ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కాగజ్నగర్లో 41.4, వాంకిడి 41.2, కౌటాల 41.1, సిర్పూర్(టి) 41.0, ఆసిఫాబా ద్ 40.9, తిర్యాణిలో 40.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలోని 12 మండలాలు అలర్ట్ జోన్లో ఉండగా.. మిగతా మూడు మండలాలు వాచ్ జోన్లో ఉన్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
‘ఉల్లాస్’ పరీక్షకు స్పందన
కెరమెరి: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కు అనూహ్య స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 345 కేంద్రాలు ఏర్పాటు చేయగా, స్వయం సహయక సంఘాల్లో ని మహిళలు దాదాపు 80 శాతం మంది ఉదయమే పరీక్షలు రాశారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నా మధ్యాహ్నం 2 గంటలకే పరీక్ష ముగిసింది. దాదాపు 11,903 మందికి పైగా పరీక్షలు రాసినట్లు ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం బూర్గుడ పాఠశాలలో నిర్వహించిన పరీక్షను డీఆర్డీవో దత్తారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న సాక్షరత భారత్ స్థానంలో ఉల్లాస్ను తీసుకువచ్చినట్లు తెలిపారు. మహిళలకు చదవడం, రాయడం నేర్పడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. -
లక్ష్యం చేరేనా..?
రెబ్బెన: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గడువు ముంచుకొస్తుండగా జిల్లాలో 83.39 శాతం లక్ష్యం పూర్తయ్యింది. అయితే నాలుగు మండలాలు టార్గెట్లో 80శాతం కూడా చేరుకోలేదు. దీంతో పంచాయతీ అధికారులు పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కార్యదర్శులు, సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. రికార్డుల ప్రకారం జిల్లాలో 1,36,880 ఇళ్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.6,04,12,387 కాగా.. డిమాండ్ రూ.5,79,42,840 కాగా బకాయిలు రూ.24,69,547 ఉంది. శనివారం నాటికి జిల్లాలో రూ. 5,03,78,496 పన్నులు వసూలు పూర్తయింది. మరో రూ. 1,00,33,891 పెండింగ్ ఉంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, మద్దతుదార్లు ఇంటి పన్నులను పూర్తిగా చెల్లించడంతో కార్యదర్శులకు కొంతమేర ఊరట కలిగింది. మిగిలిన ఇళ్లకు సంబంధించిన పన్నులు, మొండి బకాయిలు వసూలు చేయడంలో వారు నిమగ్నమయ్యారు. చాలామంది వ్యవసాయ పనులకు ఉదయం పూటే వెళ్తుండటంతో సిబ్బంది ఉదయం, సాయంత్రం గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా వందశాతం వసూళ్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ‘పెంచికల్పేట్’లో 100 శాతం15 మండలాల్లో ఇప్పటివరకు ఒక్క పెంచికల్పేట్ మండలం మాత్రమే టార్గెట్ పూర్తి చేసింది. ఈ మండలంలోని 12 పంచాయతీల్లో 4,563 ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సర ప న్నులు రూ.14,07,382 ఉండగా పాత బకా యిలు రూ.7,233 ఉన్నాయి. మొత్తం రూ. 14,14,615 వసూలు చేసి వందశాతం లక్ష్యం చేరుకున్నారు. సిర్పూర్(టి) మండలం 96 శాతం, కౌటాల 93, ఆసిఫాబాద్ 92, సిర్పూర్(యూ) 90, కాగజ్నగర్ 90, కెరమెరి 90శాతం లక్ష్యం సాధించాయి. ఇక జైనూర్ 62 శాతంతో అట్టడుగున నిలిచింది. తర్వాతి స్థానంలో బెజ్జూర్ 68 శాతంతో ఉంది. పోర్టల్లో వివరాలు నమోదు..జిల్లాలో 83.39 శాతం పన్నుల వసూలు కాగా, క్షేత్రస్థాయిలో దాదాపు 90 శాతానికి పైగా ఉంటుందని సమాచారం. కార్యదర్శులు వసూలు చేసిన పన్నుల వివరాలను ఈ–పంచాయతీ పోర్టల్లో నమోదు చేయాలి. దీనికితోడు గతంలో ఇల్లు ఉండి కూలిపోయిన వాటికి కూడా ప్రభుత్వ రికార్డుల్లో పన్ను ఉంటోంది. జాతీయ రహదారి విస్తరణ, ఇతర అభివృద్ది పనులతో కోల్పోయిన ఇళ్లు సైతం రికార్డుల్లో ఉన్నాయి. దీంతో వందశాతం పూర్తి కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. గడువులోగా సాధ్యమైనంత వరకు పన్నుల లక్ష్యం చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కృషి చేస్తున్నాం జిల్లాలో ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం 83 శాతం చేరుకున్నాం. ప్రస్తుతం వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో 90శాతం వరకు పూర్తి చేసినా ఆన్లైన్లో కని పించేందుకు 24 గంటల సమయం పడుతోంది. – ఉమర్ హుస్సేన్, డీఎల్పీవోమండలాల వారీగా వసూలు వివరాలు మండలం డిమాండ్ వసూలు శాతం బ్యాలెన్స్ జైనూర్ 36,07,266 22,13,681 62 13,93,585 బెజ్జూర్ 34,75,010 23,17,202 67 11,48,043 తిర్యాణి 35,33,542 24,63,882 70 10,69,660 లింగాపూర్ 10,34,839 7,78,998 75 2,55,841 వాంకిడి 72,43,326 56,25,928 78 16,17,398 చింతలమానెపల్లి 28,06,983 23,21,322 83 4,85,661 దహెగాం 28,67,463 23,84,349 83 4,83,114 రెబ్బెన 85,31,268 70,95,869 83 14,35,399 కెరమెరి 37,59,404 33,59,104 90 4,00,300 కాగజ్నగర్ 65,79,802 59,36,976 90 6,42,826 సిర్పూర్(యు) 10,47,607 9,47,086 90 1,00,521 ఆసిఫాబాద్ 41,60,666 38,02,212 91 3,58,454 కౌటాల 59,58,692 55,64,518 93 3,94,174 సిర్పూర్(టి) 43,91,904 41,42,769 94 2,49,135 పెంచికల్పేట్ 14,14,615 14,14,835 100 – 220 -
పన్ను చెల్లించండి.. బహుమతి పొందండి
కాగజ్నగర్టౌన్: వందశా తం పన్ను ల లక్ష్యాన్ని చేరుకునేందుకు కాగజ్నగర్ పట్టణ పరిధిలోని ప్రజలకు మున్సిపల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, నీటి, కులాయి చార్జీలను పూర్తిగా చెల్లించిన వారికి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందిస్తున్నట్లు ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతి రైస్ కుక్కర్ను లక్కీడ్రా ద్వారా అందిస్తున్నట్లు ప్రకిటించారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి కోరారు. -
అమ్మకు అక్షరం
కెరమెరి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ది సొసైటీ) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ పేరిట విద్యాబోధన చేపట్టింది. ఐదు నెలలుగా శిక్షణ పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆదివారం జిల్లావ్యాప్తంగా తుది పరీక్ష రాయనున్నారు. డీఆర్డీఏ, మహిళా సంఘాల సభ్యులకు అక్షరాలు నేర్పించేందుకు గతేడాది అక్టోబర్ 26 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నూతన విద్యా విధానం– 2020లో భాగంగా గతంలో ఉన్న సాక్షరత భారత్ స్థానంలో ఉల్లాస్ను అమల్లోకి తెచ్చారు. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మూడు గంటలపాటు పరీక్షజిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మూడు గంటల పాటు పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 335 గ్రామ పంచాయతీల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో 345 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,903 మంది నిరక్షరాస్య మహిళలు పరీక్షకు హాజరుకానున్నారు. అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉన్న జిల్లాలో నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, అక్షరాలను గుర్తించేలా చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇప్పటికే జిల్లా నుంచి మండలాలకు ప్రశ్నపత్రాలు, పెన్నులు చేరడంతో శనివారం సీసీలు ఆయా గ్రామ పంచాయతీలకు పరీక్ష సామగ్రిని చేరవేశారు. ఇన్విజిలేటర్లుగా వీవోఏలు, సీసీలుజిల్లావ్యాప్తంగా నిర్వహించే ఉల్లాస్ పరీక్షలకు మండల సమాఖ్యల్లో విధులు నిర్వహిస్తున్న వీవోఏలు, సీసీలతోపాటు కొన్నిచోట్ల అంగన్వాడీ కార్యకర్తలు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్నారు. అయితే గతంలో పది మంది సభ్యులకు అక్షరాలు దిద్దించేందుకు ఒక వలంటీర్ను నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా కల్పించారు. రంగురంగుల బొమ్మలు, అందమైన అక్షరాలతో ముద్రించిన పుస్తకాలు అందించారు. రోజులో రెండు గంటల చొప్పున మొత్తం 200 గంటలు బోధించారు. తరగతుల నిర్వహణకు ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లను వినియోగించుకున్నారు. డిజిటల్ కంటెంట్తో కూడిన కంప్యూటర్లు, టీవీలను కూడా కొన్నిచోట్ల సమకూర్చారు. గ్రామైక్య సంఘంలోని మహిళలు ఐదు నెలలుగా నేర్చుకుంటున్న అంశాలను ఈ పరీక్ష ద్వారా పరీక్షించనున్నారు. తప్పనిసరిగా హాజరు కావాలి అక్టోబర్ 26 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అక్షరాలు చదవడం, రాయడం, గుర్తించడం ఎంతవరకు వస్తుందనే విషయాలను తెలుసుకునేందుకు ఆదివారం నిర్వహించే పరీక్షతో తేలనుంది. ప్రతిఒక్కరూ హాజరై తమ ప్రతిభ చాటుకోవాలి. 15 మండలాల్లో 11,903 మంది నిరక్షరాస్య మహిళలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మూడు గంటలు పరీక్ష రాయవచ్చు. – మద్రి శ్రీనివాస్, ఉల్లాస్ ప్రోగ్రాం ప్రాజెక్టు అధికారి -
కుమురం భీం
Iసెల్ఫోన్.. సేఫ్..! సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదుల ఆధారంగా ప్రజలు పోగొట్టుకున్న మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రికవరీ అనంతరం బాధితులకు అప్పగిస్తున్నారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగాలులు వీస్తాయి. మాయమై పోతున్నడమ్మా.. వివాహేతర సంబంధాలు, ఆర్థిక, ప్రేమ, పాత కక్షలు.. కారణాలు ఏవైనా కొందరు మానవత్వం మరుస్తున్నారు. తోటి మనుషుల ను విచక్షణ మరిచి హతమారుస్తున్నారు. IIలోu ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026 -
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో శనివా రం పంచాయతీరాజ్, విద్యాశాఖ, గ్రంథాలయ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పాఠకులకు కుర్చీలు, టేబుళ్లు, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా చల్లని తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఆలయాల చరిత్రకు సంబంధించిన గ్రంథాలయ సర్వస్వం, ఈ విజ్ఞాన సూచిక, ఎంప్లాయిమెంట్ న్యూస్, కురుక్షేత్ర యోజన, కస్టమర్ ఆవాజ్, పునాది వంటి తెలుగు, ఇంగ్లిష్ మ్యాగజైన్లు ఉండాలన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సరిపడా మెటీరియల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు గ్రంథాలయాల అభివృద్ధికి సెస్సు చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరం వార్షిక పద్దును ఆమోదించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఏ.సరిత, డీపీవో భిక్షపతి, లైబ్రేరియన్లు సదానందం, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
6న ఆదిలాబాద్కు సీఎం
కై లాస్నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితారాణా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో సీతారాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద ఒప్పంద ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హతల వివరాలు https: //asifabad.telangana.gov. inలో పొందిపర్చినట్లు వెల్లడించారు. ఈ నెల 30లోగా స్థానిక వైద్యకళాశాలలో అర్హత పత్రాలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో కౌన్సెలింగ్కు హాజ రుకావాలని సూచించారు. 25 మంది గైర్హాజరు ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో శనివా రం నిర్వహించిన పదోతరగతి గణితం పరీక్షకు 6,950 మంది విద్యార్థులకు 6,925 మంది హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తెలిపా రు. అలాగే 114 మంది ప్రైవేట్ విద్యార్థులకు 106 మంది హాజరయ్యారు. కాగజ్నగర్లోని పలు కేంద్రాలను డీఈవో లలిత సందర్శించారు. వేసవి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా ఆసిఫాబాద్: వేసవిలో డిమాండ్కు అనుగుణంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తం జాడే ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గతేడాది చివరి నుంచే అప్రమత్తమై ఏ విపత్తు ఎదురైనా నిరంతరాయంగా విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో సేవలందిస్తున్నామన్నారు. వినియోగదారులు కార్యాలయాల బాట పట్టకుండా వాట్సాప్ చాట్బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. -
సాగులో సాంకేతికత పెంచేందుకు కృషి
కాగజ్నగర్టౌన్: సాగులో ఆధునిక సాంకేతికత పెంచి, రైతులకు శ్రమ, సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అ న్నారు. కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో శుక్రవారం కొత్తపేట, దహెగాం, గురుడుపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో మూడు సహకార సంఘాలకు డ్రోన్లు అందించిందని తెలి పారు. డ్రోన్ల ద్వారా పంటలపై మందుల పిచికారీ వేగంగా చేయవచ్చని, రైతులకు శ్రమ తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు డ్రోన్లు అందిస్తుందని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏవో రామకృష్ణ, ఏఈవో రేష్మిత, సొసైటీ సీఈవో సతీష్, రైతులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పఠనోత్సవం!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పఠనాసక్తి, విద్యా సామర్థ్యాలు పెంపొందించేందుకు సర్కారు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. కరోనా ప్రభావం తర్వాత తగ్గిన పఠన స్థాయిని పెంచడమే లక్ష్యంగా గ్రంథాలయాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రంథాలయాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఉపాధ్యాయులు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు. కెరమెరి: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ధారాళంగా చదవడం, రాయడం రావాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలల్లో 3వ, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఎఫ్ఎల్ఎస్(ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) ద్వారా బోధన జరుగుతోంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో విద్యాసామర్థ్యాల పెంపునకు ఇది ఎంతో దోహదపడుతోంది. 2వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు ధారాళంగా చదవడం రావాలనే ఉద్దేశంతో గతంలో గ్రంథాలయ పుస్తకాలను సైతం అందించారు. వీటి నిర్వహణకు ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సైతం నిధులు అందనున్నాయి. తగ్గిన పఠనస్థాయికరోనా ప్రభావం తర్వాత విద్యార్థుల్లో పఠన స్థాయి గణనీయంగా తగ్గింది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనస్థాయి పెంపునకు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సర్కారు పాఠశాలల్లో పఠనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బడుల్లో ప్రత్యేక గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు నిత్యం గ్రంథాలయాల్లోని పుస్తకాలు, పత్రికలు చదవాలనే ఆదేశాలున్నాయి. లైబ్రరీలకు తాజాగా మరిన్ని పుస్తకా లు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. అయితే విడుదలైన నిధులను ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ పేరిట డీడీ కడితే వారే పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలను అందించే అవకాశం ఉంది. రూ.17.63 లక్షలు మంజూరుపుస్తకాలు కొనుగోలు చేసి చదివించాలనే ఉద్దేశంతో 2025– 26 విద్యా సంవత్సరానికి పాఠశాలలకే నేరుగా నిధులు విడుదల చేస్తూ ఎస్పీడీ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా వేర్వేరుగా నిధులను విడుదల చేశారు. జిల్లాలో 1052 ప్రభుత్వ పాఠశాలలకు రూ.17,63,456 నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.1,171 చొప్పున, ఉన్నత పాఠశాలలకు రూ.5,198 కేటాయించనున్నారు. గతంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కథలు, విజ్ఞానదాయక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత నిధులతో విద్యార్థులకు ఆసక్తికరమైన పుస్తకాలు కొనుగోలు చేసి చదివించే అవకాశాన్ని ఉపాధ్యాయులకు కల్పించారు. -
‘మానవతావాది అశోక చక్రవర్తి’
వాంకిడి: మౌర్య సామ్రాజ్యంలో ప్రజలకు సక ల సౌకర్యాలు కల్పించి మహా మానవతా వాదిగా సామ్రాట్ అశోక చక్రవర్తి ఎన్నో మన్ననలు పొందారని సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మార్షల్ దుర్గం సందీప్ అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం సా మ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘ నంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బౌద్ధంలో ప్రార్థనలు చేశా రు. అశోకుడి రాజ్యంలోని ప్రజలకు విద్య, వైద్యం కోసం తక్షశీల, నలంద వంటి విశ్వవిద్యాలయాలను కట్టించారని గుర్తు చేశారు. బౌద్ధ ప్రచారంలో భాగంగా అనేక స్థూపాలు, శాసనాలు నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ పెద్దలు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్, రోషన్ ఉప్రె, ప్రకాశ్, రమేశ్ డొంగ్రె, తిరుపతి, ఉపేందర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
కౌటాల: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేయాలని హౌసింగ్ డీఈ సత్రియ అన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని శుక్రవారం పరిశీలించి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వివరాలను తెలిజేశారు. ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన వారికి సకాలంలో బిల్లులు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలోగా పనులు పూర్తిచేసుకుని, గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు. లబ్ధి దారుల సందర్శన కోసం మోడల్ ఇంటిని పనిదినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట ఏఈ ఎండీ షజయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు భరోసా’తో అన్నదాతల్లో ఆనందం
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ అబ్దుల్లాతో కలిసి సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. పెట్టుబడి సాయం అందిస్తూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశ్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తారిఖ్, భీంరావు, కౌన్సిలర్ వినోద్, నాయకులు ఇందిరా, తిరుపతి, సుధాకర్, ఇమ్రాన్, నిజాం, హరీశ్, రాము, జక్కన్న, మారుతిపటేల్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్చిచ్చు.. ఆటకట్టు
పెంచికల్పేట్: వేసవి ముదురుతుండటంతో అడవుల్లో చెట్లు ఆకు రాల్చుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఎండు ఆకులకు ఒక్క నిప్పురవ్వ తాకినా కాలిబూడిదగా మారుతాయి. చెట్లు, జీవరాశులకు తీవ్ర నష్టం చేకూరుస్తాయి. దీంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తుగా సంసిద్ధమైంది. కార్చిచ్చులను గుర్తించేందుకు శాటిలైట్ సమాచారాన్ని వినియోగించుకుంటోంది. అలాగే ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు కార్చిచ్చులు ఏర్పడిన సమయంలో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. అడవుల రక్షణకు ఫైర్లైన్స్జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ అటవీ డివిజన్లలో 11 రేంజ్లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. మారుమూల గిరిజన గ్రామాలు అటవీ ప్రాంతాల అతి దగ్గరగా ఉన్నాయి. నిత్యం పశువుల కాపరులు, వంట చెరుకు కోసం రైతులు అడవులకు వెళ్తుంటారు. ఎండిపోయిన ఆకులతో ప్రమాదవశాత్తు, మానవ తప్పిదాలతో కార్చిచ్చు రగిలి ఏటా వేలాది ఎకరాల్లో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. మానవ తప్పిదాలతోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటల ఉధృతిని తగ్గించడం, అడవుల రక్షణకు ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. శాటిలైట్ సమాచారంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను అరికడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే సమాచారంతో తక్కువ సమయంలో ఘటన స్థలాలకు చేరుకునేందుకు వీలవుతుంది. అధికారులు భారీ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు అవగాహనజిల్లాలోని అడవుల్లో అత్యంత విలువైన వృక్ష, జంతు సంపద ఉంది. పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదులు నిత్యం నీటితో ప్రవహిస్తుండటంతో అరుదైన వన్యప్రాణులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. కాగజ్నగర్ డివిజన్లో పెద్దపులులు, ఇతర వన్యప్రాణాలు, పక్షులు సంచరిస్తున్నాయి. అడవుల్లో కార్చిచ్చులు చెలరేగితే వీటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని గ్రామాల్లో అధికారులు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్నారు. తునికాకు, ఇప్పపువ్వు సేకరణకు అడవులకు నిప్పు పెట్టే అవకాశం ఉండటంతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు.ప్రమాదాల నివారణకు చర్యలు అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పశువుల కాపర్లు, అడవులకు వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాం. కార్చిచ్చుల సమయంలో మంటలు అడవుల్లోకి వ్యాపించకుండా ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
నేత్రపర్వం.. పులకించిన భక్తజనం
మంగళసూత్రం చూపిస్తున్న అర్చకుడుజన్కాపూర్లో హారతి ఇస్తున్న కలెక్టర్ కె.హరితఆసిఫాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలోని పట్టణాలు, పల్లెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన వేదికలపై వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శుక్రవారం సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి ఆశేష భక్తజనం పులకించింది. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కోదండ రామాలయంలో అర్చకులు నిమ్మకంటి సంతోష్శర్మ, మహేశ్ శర్మ, ఒఝల శిరీష్శర్మ, ముదిగొండ రాజశేఖర శర్మ, నరేశ్ శర్మ, శ్రీధర్, తిరుపతి చారి, ఢిల్లీ విజయకుమార్ ఆధ్వర్యంలో పెళ్లి తంతు జరిపించారు. ముందుగా కేశవనాథ ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను హనుమాన్ దీక్షాస్వాములు బ్యాండ్ మేళా, మహిళల కోలాటాలు, భక్తిగీతాలతో గాంధీచౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా జన్కాపూర్ రామాలయం వరకు శోభాయాత్రతో తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు కోవ సాయినాథ్, హారిక దంపతులు, కేశవనాథ కమిటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా పట్టువస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాలు సమర్పించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సుముహూర్తంలో అర్చకులు కల్యాణ ఘట్టం నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి కలెక్టర్ కె.హరిత, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, బీజేపీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కార్తీక్, కొండు భారతి, కాంగ్రెస్ నాయకులు గాదెవేణి మల్లేశ్, బాలేశ్వర్గౌడ్, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. దీక్షాస్వాములు, భక్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. సాయంత్రం ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కమిటీ సభ్యులు డేగల సత్యనారాయణ, శివచందు, పర్రె యాదగిరి, సీహెచ్ రవి, భద్రయ్య, శైలేందర్, మహేశ్, మైనార్టీ నాయకులు జావిద్, కష్యప్ పాల్గొన్నారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. -
డ్రైవర్లకు మెరుగైన చూపు అవసరం
చెన్నూర్: ప్రతీ డ్రైవర్కు మెరుగైన కంటి చూపు అవసరమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కంటి చూపే కీలకమని అన్నారు. 150 మందికి పరీక్షలు నిర్వహించి 24 మందికి కళ్లద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఐదుగురిని కంటి శస్త్రచికిత్సకు ఎంపిక చేశామని తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు బన్సీలాల్, కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీ భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు పరిశీలించిన తర్వాత ఫిర్యాదులపై ఎస్సై రాజేందర్ను అడిగి తెలుసుకున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు. ఇంధనంపై గందగోళం సృష్టిస్తే చర్యలు మంచిర్యాలక్రైం: ఇంధనం కొరత ఉందంటూ గందరగోళం సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇంధనం కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ముందస్తుగా వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించడం, క్యాన్లలో తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయడం చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ ఇళ్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో రెండో ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన బోనుగూరు లింగయ్య(40) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. లింగమూర్తికి భార్య రాజలక్ష్మి, ఇద్దరు కూతుర్లు రాగశ్రీ, ఆధ్యశ్రీ ఉన్నారు. భార్య రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నామని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
తానూరు: మండలంలోని బోరిగాం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జాదవ్ కృష్ణనంద్ పటేల్ను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సస్పెండ్ చేశారని ఎంపీడీవో అమీర్ఖాన్ తెలిపారు. జాదవ్ కృష్ణనంద్ పటేల్ అసైన్డ్ భూమిలో 1–84,1–85 నంబర్లతో స్థలాన్ని సృష్టించి అదే స్థలంలో ఇళ్లు నిర్మాణానికి ప్రోసీడింగ్ జారీచేశారు. పూర్తి విచరణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ చర్యలు తీసుకున్నారని ఎంపీడీవో తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని ధర్నామంచిర్యాలఅగ్రికల్చర్: ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వి ద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యా క్షన్ కమిటీ(టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల డివిజన్ కార్యాలయం ఎ దుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు రానున్న నాలుగు రోజుల్లో విడతల వా రీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ తిరుపతి, కన్వీనర్ తోట నగేష్, కో చైర్మన్ ఉప్పలేటి నరేష్, రమేశ్ రాజు, ప్రభాకర్, మహేందర్, రమేశ్, సాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్రీడాశాఖకు కాంట్రాక్టర్ షాక్
ఆదిలాబాద్: జిల్లా క్రీడా శాఖను (డీఎస్ఏ) నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు అందుతుండడంతో స్థానిక వనరుల ద్వారా నిధులు సమీకరిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం కోసం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పరిధిలో ఉన్న షాపులను, స్విమ్మింగ్ పూల్ను టెండర్ల ద్వారా లీజుకు ఇస్తున్నారు. గతేడాది మార్చిలో ఓ కాంట్రాక్టర్ రూ.21 లక్షలకు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ హక్కులు దక్కించుకున్నాడు. కానీ సకాలంలో రుసుము చెల్లించకపోవడంతో క్రీడాశాఖ ఆదాయానికి గండిపడుతోంది. 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు.. గతేడాది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్కు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం ప్రకారం ప్రతీనెల లీజు రుసుమును జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఖాతాలో జమ చేయాలి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. పర్యవేక్షణ లోపంపై విమర్శలు స్విమ్మింగ్ పూల్ నిర్వహణను లీజుకు ఇచ్చినప్పటి నుండి ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నా సదరు కాంట్రాక్టర్కు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా అధికారులు మౌనం వహించడంపై క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా లీజు ధరను రూ.16.60 లక్షల వరకు తగ్గించాలని సదరు కాంట్రాక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఉన్నతాధికారులు వివరాలను కోరగా, రెండవ లీజుదారుడు ఎంతవరకు కోట్ చేశారనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జిల్లా క్రీడాశాఖ అధికారులు నివేదికను సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పెంపు.. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ 12 సంవత్సరాల లోపు చిన్నారులకు అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.500 తీసుకోవాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.1000 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ 10 ఏళ్లలోపు వారికి నెలవారీ ఫీజు రూ.1000, ఆపై వారికి రూ.1500, స్పెషల్ బ్యాచ్ పేరిట రూ.2వేల నెలవారీ ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రికవరీ చేస్తారా?.. తగ్గిస్తారా? బకాయి మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి అధికారులు రికవరీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్ పెట్టుకున్న అర్జీని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం లీజు మొత్తాన్ని తగ్గిస్తుందా? లేక పాత ఒప్పందం ప్రకారమే వసూలు చేస్తుందా అనేది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే లీజు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే అవకాశాలు లేకపోలేదు.మూడు నెలల బకాయిలను పరిశీలిస్తే రూ.5.25 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతీనెల 15లోగా లీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే రోజుకు రూ.2,500 పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 15 నుంచి 30 వరకు మూడు నెలల్లో 45 రోజులకు లెక్కించినా, పెనాల్టీ మొత్తంగా రూ.1,12,500 అవుతుంది. లీజు రుసుము పెనాల్టీ మొత్తాన్ని కలిపితే సుమారుగా రూ.6,37,500 అవుతుంది. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు?
కాసిపేట: మండల కేంద్రంలోని ముత్యంపల్లి గ్రామశివారులో బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టగా గుప్త నిధుల వేటకే తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి జేసీబీతో పురాతన శిల్పం ఉన్న రాయి పక్కన తవ్వకాలు చేపట్టినట్లు, గతంలో సైతం ఇక్కడ పలుమార్లు రాత్రి సమయంలో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనుగొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు ఎటువంటి సమాచారం లేదని తెలపగా, జేసీబీతో రాత్రి సమయంలో గోతి తవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. దండేపల్లి గ్రామానికి చెందిన 110మంది కూలీలు గురువారం ఉదయం దండేపల్లి అడవిలో అటవీ ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లారు. పనులు చేపట్టిన కొద్దిసేపటికే కూలీలపై తేనేటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు. 20మందిపై దాడి చే యడంతో 108అంబులెన్స్లో దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న జిల్లపెల్లి గంగ, శశికుమార్, చీపిరిశెట్టి సత్తన్న, పద్మ, భీమోజు సుజాతలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నిర్మల్లో వైద్యుడిపై దాడి
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు సంతోష్రాజ్పై ఓ వర్గం వ్యక్తులు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ పట్టణంలోని వైద్యులందరూ ఆందోళనకు దిగారు. స్థానిక జయశంకర్ చౌరస్తాలో రోడ్డుపై గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. బిల్లుల విషయంలో సదరు ఆసుపత్రికి సిబ్బందితో ఓవర్గం వ్యక్తులు గొడవకు దిగారు. ఇదే క్రమంలో వైద్యుడు సంతోష్రాజ్పైనా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. వైద్యుల రాస్తారోకో... తోటి వైద్యుడిపై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని డాక్టర్లు అందరూ రోడ్డెక్కారు. ర్యాలీగా స్థానిక జయశంకర్ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీల కౌన్సిలర్లు, పలు సంఘాలు మద్దతు పలికాయి. గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో బస్సులు, ఆటోలు, వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికిరణ్ వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళన కొనసాగించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి సైతం వైద్యులతో మాట్లాడారు. -
టైగర్జోన్పై గళమెత్తిన ఎమ్మెల్యే బొజ్జు
ఖానాపూర్: నియోజకవర్గంలోని ఆదివాసీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తారు. కవ్వాల్ టైగర్జోన్ కారణంగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలను పరిష్కరించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని కోరారు. మల్యాల, దొంగపల్లి, యాపల్గూడ, వంటి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాలపై డ్రోన్ సర్వే నిర్వహించడం వల్ల ఆదివాసీ మహిళల గోప్యతకు భంగం కలుగుతోందన్నారు. ఇసుక కొరత కూడా తీవ్ర సమస్యగా మారిందన్నారు. అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పరిశీలన
తానూరు: ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసి వాటిని తాగడం ఎంతో మేలని మహిళా అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని బోంద్రట్ గ్రామంలో సాయిబాబా మహిళ సంఘం సభ్యురాలు సిందే అర్చన–సాయినాథ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను గురువారం పరిశీలించారు. వర్షపు నీరు భూమిపై పడకముందే సేకరించి వాటిని నిల్వచేసి అదేనీటిని ఏడాదంతా తాగుతున్నట్లు వివరించారు. దీంతో తమకు ఎలాంటి వ్యాధులు రావడం లేదని తెలిపారు. వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండి అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్చన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, సీసీ సవిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు ప్రతిభ, వీవోఏ రాణి పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని రాయపూర్కాండ్లీలో రైతు బక్కనోల్ల రాజుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు మూడురోజుల క్రితం మొక్కజొన్న పంటను కోసి చేనులోనే ఉంచాడు. గురువారం పంటచేను పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో మంటలు చెలరేగి అర ఎకరంలో పంట దగ్ధమైంది. పంట విలువ రూ.30 వేల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. లూజు వైర్ల విషయమై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పంట దగ్ధమైందని రైతు ఆరోపిస్తున్నాడు. -
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
మామడ: ఉపాధిహామి పనులకు సంబందించిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక గురువారం నిర్వహించారు. ఉపాధిహామీ పనుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జూలైలో నిర్వహించే వనమహోత్సవానికి ఇప్పటి నుంచి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం చేయాల్సిన పనులను ప్రారంభించాలన్నారు. మండలంలోని 27 గ్రామపంచాయతీల పరిధిలో గతేడాది రూ.7.43 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సమావేశంలో గుర్తించారు. మండలంలో 6,882 జాబ్ కార్డులుండగా 11,312 మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు. 72 మంది వందరోజుల పనిదినాలు పూర్తి చేశారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీవీవో లక్ష్మ ణ్, హెచ్ఆర్ సురేందర్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, ఏపీవో శివాజీ, ఎస్సార్పీ మహేశ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి
గుడిహత్నూర్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన సాద్వి కుమారి అశ్విని కాగ్నే (19) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరాఠీ వార్కరీ సంప్రదాయానికి చెందిన అశ్విని కాగ్నే మహారాష్ట్రలోని ఖందార్ తాలుకా కల్లారీ గ్రామంలో నిర్వహిస్తున్న సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం పెదనాన్న వసంత్ కాగ్నే, తల్లి అయోధ్యాబాయితో కలిసి ఆటోలో బయలు దేరారు. సీతాగోంది సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో అశ్విని, వసంత్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. చెరువులో నీటమునిగి ఒకరు..లక్సెట్టిపేట: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన తనుగుల రాజలింగం (46) బుధవారం ఉదయం తన గేదెలను మేపేందుకు చెరువు వైపు వెళ్లాడు. చెరువుకు అవతలివైపు ఉన్న పంటచేలను మేసేందుకు గేదెలు నీటిలో నుంచి వెళ్తుండడంతో వాటిని మరల్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం బయట పడింది. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పరిశీలించారు. చేపల వలకు చిక్కుకుని జాలరి.. లోకేశ్వరం: చేపల వలకు చిక్కుకుని జాలరి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన జాలరి పల్లికొండ సతీష్ (31) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని మాల్కాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో వేసిన వలను తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సౌదీలో నిర్మల్వాసి.. నిర్మల్టౌన్: సౌదీ అరేబియా ఓమ్లోజ్ మదీనా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాలు ప్ర కారం..పట్టణంలోని సోఫీనగర్కు చెందిన జావిద్ (42) ఉపాధి కోసం రెండున్నర సంవత్సరాల క్రితం సౌదీకి వె ళ్లాడు. వారం రోజుల క్రితం అక్కడ జ రిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
బుగ్గిపాలైన వలస బతుకులు
లక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో....బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్ ముగ్గురూ కలిసి ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహాన్కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. -
31లోగా పన్నులు వసూలు చేయాలి
కెరమెరి: పంచాయతీల్లో ఈ నెల 31లోగా పన్నులు వసూలు చేయాలని డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమవేశమయ్యారు. వసూలుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకు 87 శాతం పూర్తయినట్లు తెలిపారు. బకాయిలపై దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
రెబ్బెన: తమిళనాడులోని ఓని టెన్కాశీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే ఇండియా సౌత్ జోన్ బాల్బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. పి.సాయిచరణ్, కె.అంజలి, జి.అనూష తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనున్న జిల్లా క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు మహేందర్రెడ్డి, మారిన వెంకటేశ్వర్లు, పీఈటీ భాస్కర్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, మల్లేశ్, శ్రీకాంత్, గోపాల్ అభినందించారు. -
‘అభివృద్ధిలో సిర్పూర్ వెనుకబడింది’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. గత 20 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇది మీ తండ్రి చేశారని అంటుంటారని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తున్న మావోయిస్టులను అభినందించాలని, కానీ హీరోలను చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తాను నక్సలైట్ బాధితుడిని అని, చిన్నతనంలో తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఏడాది క్రైమ్ రేట్, పోక్సో కేసులు పెరిగాయని, గిరిజన మహిళల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ దందాను అడ్డుకోవాలని కోరారు.


