breaking news
Komaram Bheem
-
ఎడ్లబండ్ల పోటీల్లో చెర్లపల్లి విజేత
చెన్నూర్రూరల్: ప్రతీ సంవత్స రం మాదిరిగానే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని లింగంపల్లి గ్రామంలో బుధవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 30 ఎడ్లబండ్లు పందెంలో పాల్గొన్నాయి. బెల్లంపల్లి మండలం చెర్లపల్లికి చెందిన మాదాసు శివ ఎడ్లబండి మొదటి, లింగంపల్లి గ్రామానికి చెందిన జీళ్ల రవి ఎడ్లబండి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. కాసిపేటకు చెందిన ఎడ్లబండి తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ బహుమతి రూ.12వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.8వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంగ రమేష్, ఉప సర్పంచ్ జీళ్ల తిరుపతి, కిష్టంపేట సర్పంచ్ రావుల తిరుమల, తిరుపతి, ఉప సర్పంచ్ మహేష్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు. బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి (45) రైల్వేట్రాక్ పక్కన తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదని, ఎరుపు రంగు బనియన్, ఆకుపచ్చ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మరి న్ని వివరాల కోసం 8712658601, 98491 98382 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్..భీమారం: ఈ నెల 13న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్ బుధవారం మృతి చెందినట్లు జైపూర్ సీఐ నవీన్కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బానోత్ భీమానాయక్ (47)కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఇంట్లోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం బుధవారం వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తల్లి ఎంకూబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పలు రైళ్ల రాకపోకలు రద్దుబాసర: బాసర నుంచి నవీపేట్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు నిజామాబాద్, నాందేడ్ మధ్య నడిచే 77645,77646 నంబరు గల రైళ్ల రాకపోకలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11409, 11410, 11413, 11414, 17687, 17688 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. 20811, 17641, 17057, 17606, 17661 నంబరుగల రైళ్లను రెగ్యులేషన్ కింద నడపనున్నట్లు రైల్వే డీవై, సీవో ఎం దిలీప్ కుమార్దాస్ తెలిపారు. పేకాడుతున్న ఐదుగురి అరెస్టుభీమిని: మండలంలోని మల్లీడి గ్రామ పంచా యతీ శివారులో బుధవారం పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి పే కాడుతున్న అన్నపురం సంజీవ్గౌడ్, సంగర్సు రమేశ్రావు, కోట విజయ్కుమార్, సంగర్సు రాంకిషన్రావు, చిలువేరు భాస్కర్గుప్తాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు లక్ష్మ ణాచారి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిబాజా మోగాల్సిన ఇళ్లలో చావుకేకలు
కౌటాల(బెజ్జూర్): సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుందామని చికెన్ కోసం బైక్పై వెళ్లిన మామ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కౌటాల మండలంలోని ముత్తంపేటకు చెందిన డోంగ్రే రాజశేఖర్ (21)కు బెజ్జూర్ మండలం కుంటాలమానెపల్లికి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈనెల 13న సంక్రాంతికి రాజశేఖర్ అత్తారింటికి వెళ్లాడు. బుధవారం అతని మామ బోర్కుట్ శంకర్ (48)తో కలిసి బైక్పై చికెన్ తెచ్చేందుకు సలగుపల్లి వెళ్లారు. తిరుగుప్రయాణంలో మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి వంతెనను ఢీకొనడంతో ఇద్దరూ పైనుంచి కిందపడిపోయారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పండుగపూట మామాఅల్లుళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతదేహాలకు సిర్పూర్(టి) ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెజ్జూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మృత్యువే గెలిచింది..!
తాండూర్: కుమారుడి బంగారు భవిష్యత్ కోసం ఆ తల్లిదండ్రులు కన్న కలలు కల్లలయ్యాయి. బడికి వెళ్లమన్నందుకు ఆ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద ఘటన తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీలోని ఒడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. మాదారం ఎస్సై సౌజన్య తెలిపిన వివరాల మేరకు ఒడ్డెర కాలనీకి చెందిన దేవల్ల రాజేశ్, కోమలత దంపతుల కుమారుడు రుద్రహనితేజ(15) తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 21న పాఠశాలకు వెళ్లమని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: నాగోబా మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో బయలుదేరిన మెస్రం వంశీయులు బుధవారం ఉదయం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న మర్రిచెట్టుపై గంగాజలాన్ని భద్రపరిచారు. అనంతరం నైవేద్యం తయారుచేసి ఇంద్రాదేవికి సమర్పించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎడ్లబండ్లపై వచ్చిన 22 కితల మెస్రం వంశీయులు ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో గల మర్రిచెట్టు వద్ద బస చేశారు. మర్రిచెట్టు వద్ద మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలతో పాటు మెస్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూమ్ (కర్మఖాండ)పూజలు చేయనున్నారు. ఈ నెల 18న రాత్రి 10:30 గంటలకు నాగోబా ఆలయంలో మహాపూజ చేసి జాతర ప్రారంభిస్తామని, 22న దర్బార్ సమావేశం ఉంటుందని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు మెస్రం హనుమంత్ కటోడ, మెస్రం కోసేరావ్, దాదారావ్, తిరుపతి, గణపతి, తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
ఆదిలాబాద్టౌన్: చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్చార్జి సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసి బస్టాండ్ ఏరియాలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి వద్ద దాదాపు రూ.8వేల విలువ గల రెండు చైనా మాంజా చరకాలు, 14 ప్యాకెట్ల చైనా మాంజ లభించినట్లు పేర్కొన్నారు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. మందమర్రిలో మరొకరిపై.. మందమర్రిరూరల్: పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల పతంగుల దుకాణంలో చైనా మాంజా విక్రయిస్తున్న నిర్వాహకుడు కొక్కుల మధుపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్ తెలిపారు. బుధవారం దుకాణంలో తనిఖీ నిర్వహించగా మూడు బెండళ్ల చైనా మాంజా లభ్యమైనట్లు తెలిపారు. మాంజాను స్వాధీనం చేసుకుని నిందితుడిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి పూచీకత్తుపై విడుదల చేశామన్నారు. -
● వైద్యుల నిర్లక్ష్యమంటూ బాధితుల ఆందోళన ● ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు
గర్భస్థ శిశువు మృతిమంచిర్యాలక్రైం: గర్భస్థ శిశువు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రం మంచిర్యాలలో బుధవారం కలకలం రేపింది. బాధితులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు వైద్యులపై కేసు నమోదైంది. బాధితుల కథనం ప్ర కారం.. నెన్నెల మండలం చిన్నవెంకటాపూర్ గ్రా మానికి చెందిన అంబటి వెంకటేష్ భార్య రమ్య పె ళ్లయిన ఐదేళ్లకు గర్భం దాల్చింది. మొదటి నెల నుంచి మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలి సూచనల మేరకు మందులు వాడుతోంది. ఈ నెల 14న సాధారణ ప్రసవానికి వైద్యురాలు సమ యం ఇచ్చింది. బుధవారం ఇంటి వద్ద నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యురాలు లేకపోవడంతో ఆమె సూచన మేరకు తన బంధువు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యురాలు పరీక్షించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరిశీలించి గర్భంలోనే శిశువు మృతిచెందిందని ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే గర్భస్థ శిశువు మృతిచెందిందని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే స్తూ మొదట వైద్యం పొందిన ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక సీఐ ప్రమోద్రావు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేశారు. మరో ఆస్పత్రిలో వ్యక్తి మృతి మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో మందమర్రి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన వడ్లూరి శ్రీ నివాస్(53) బుధవారం మృతిచెందాడు. సీఐ ప్ర మోద్రావు, బాధితుల కథనం ప్రకారం.. కాలు దె బ్బతగిలి శ్రీనివాస్ ఈ నెల 10న ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బుధవారం అస్వస్థతకు గురి కావడంతో రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుడితో బంధువులు వాగ్వాదానికి దిగారు. పోలీస్లు ఇరువర్గాలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
నాగోబా జాతరకు ముమ్మర ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ఈ నెల 18న మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాటు పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పనులను ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్ పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కేస్లాపూర్ నుంచి దస్నాపూర్ వరకు బీటీరోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. కేస్లాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్లాపూర్ బైపాస్ మట్టిరోడ్డుతో పాటు మెండపల్లి, హర్కపూర్ చౌక్ నుంచి మట్టిరోడ్లను పూర్తి చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు పనులు ముమ్మరం చేశారు. జాతర సమీపిస్తుండడంతో వ్యాపారులు దుకాణ సముదాయాలు, రంగుల రాట్నాలు, సర్కస్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు శుభాకాంక్షలు
ఆసిఫాబాద్రూరల్: గృహజ్యోతి లబ్ధిదారులు, ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పత్రాలు పంపించారని విద్యుత్శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే అన్నారు. ఆ శాఖ అధికారులతో కలిసి బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామంలో లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ శుభా కాంక్షల పత్రాలు అందించారు. ఆయన మా ట్లాడుతూ విద్యుత్ అవసరాల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం, కు టుంబ అవసరాల కోసం వినియోగించుకోవా లని సూచించారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 52,82,498 మందికి నేటి వరకు రూ.3,593 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించిందని తెలిపారు. కార్యక్రమంలో డీఈ వీరేశ్, ఏడీఈ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా మాజీ సైనికుల దినోత్సవం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలో బుధవారం మాజీ సైనికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలో మాజీ సైనికుల దినోత్సవాన్ని జరుపుకో వడం చాలా సంతోషకరమన్నారు. ఏటా జనవరి 14న ఆర్మీ వెటరన్స్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని సూచించారు. యూనిఫాం లేకున్నా ఎప్పటికీ దేశంపై వారి నిబద్ధత మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పియూష్ మండల్, విశ్వజిత్, కృపా, విజయ్, నరేందర్, పురుషోత్తం, ఉత్తమ్, సుశాంత్, బిపుల్, సర్వీస్ సోల్జర్ శ్రవణ్, సాయి, జావిద్, నజ్రుల్నగర్ ఉప సర్పంచ్ సమిర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి ● రంగవల్లులతో కళకళలాడిన లోగిళ్లు ● నేడు మకర సంక్రాంతి
ఎస్పీఎంలో భోగి మంటలు కాగజ్గనర్టౌన్: పట్టణంలో ఎస్పీఎం క్లబ్లో బుధవారం తెల్లవారుజామున పేపర్ మిల్లు యూనిట్ హెడ్ ఏకే మిశ్రా ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఎస్పీఎం అధికారులు, కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హరిదాసు వేషధారణలో విద్యార్థులు కాలనీల్లో పర్యటించారు. వీరికి కాలనీ వాసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్పీఎం జీఎం కమర్షియల్ అనిల్కుమార్, గిరి, రమేశ్రావు, సురేందర్, గిరిశ్రాయ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గిరీశ్కుమార్, సంతోష్, మురళీ, పుల్లూరి శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.పండుగ విశిష్టత సంక్రాంత్రి పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడు. నదుల్లో స్నానాలచరించడం శ్రేష్ఠంగా భావిస్తారు. తల స్నానంతో పీడలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే చిన్నారులకు భోగి పళ్లు పోయడం ద్వారా వారిపై ఉన్న దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. నువ్వులు, బెల్లం కలిపిన పిండి వంటలను భుజిస్తారు. మహిళలు గౌరీ దేవిని పూజిస్తారు. ముత్తైదువలు నోములు నోముకుంటారు. ఇక శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు. ఆసిఫాబాద్అర్బన్: మూడు రోజుల పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. తొలిరోజు జిల్లావ్యాప్తంగా భోగిని ఘనంగా జరుపుకొన్నారు. పల్లెలతోపాటు జిల్లా కేంద్రంలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఇళ్ల లొగిళ్లు రంగవల్లులతో నిండిపోయాయి. గొబ్బెమ్మలతో అలంకరించడంతో పాటు భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. బ్రాహ్మణ వాడలో సాయంత్రం చిన్నారులకు బోగి పండ్లు పోశారు. చిన్నారులకు మంగళ హారతులు ఇస్తూ తలపై చకినాలు, రేగుపండ్లు, నువ్వులతో చేసిన పోకలు, చిక్కుడుకాయలు, అక్షింతలు పోసి ఆశీర్వాదించారు. ఆలయాల్లో గోదారంగనాయకస్వాయి కల్యాణం జరిపించారు. స్వచ్ఛంద సంస్థలు, సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలిసూర్యుని గమనమే సంక్రాంతి. దక్షణాయం నుంచి ఉత్తరాయాణానికి మార్పే సంక్రమణం. ప్రతీ నెలకు ఒక సంక్రమణం ఉంటుంది. సూర్యుని గమన మార్పునకు రంగల్లులు తీర్చిదిద్దడం పండుగ లక్ష్యం. చిన్నారులకు భోగి పండ్లు పోయడం ద్వా రా ఆయురారోగ్యాలు, ఆష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా ప్రజలు సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలి. – ఒజ్జల శిరీశ్శర్మ, అర్చకుడు, ఆసిఫాబాద్ -
ఆటలే ఆటలు
వీర్ధండిలో కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులుకౌటాల: సంక్రాంతి నేపథ్యంలో పల్లెల్లో క్రీడావాతావరణం నెలకొంది. పట్టణాల్లో స్థిరపడిన ప్రజలు గ్రామాలకు చేరుకోగా ప్రతీ ఇంట పిండి వంటలు, ముగ్గులతో సందడి నెలకొంది. పెద్దవాళ్లు పండగ జోష్లో ఉండగా.. యువత ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. జిల్లావ్యాప్తంగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఎడ్లబండి పోటీలను నిర్వహిస్తున్నారు. కౌటాల మినీ స్టేడియంలో కేపీఎల్ సీజన్– 2లో భాగంగా రెండు వారాలుగా క్రికెట్ పోటీలు అభిమానులను అలరిస్తున్నాయి. కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సాండ్గాం గ్రామంలో క్రికెట్ పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కౌటాల మండలం వీర్ధండిలో సంక్రాంతి సందర్భంగా ఏటా కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. జిల్లా వాసులతోపాటు మహారాష్ట్రకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాబాపూర్లో నేడు ఎడ్లబండి పోటీలు ఆసిఫాబాద్రూరల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గురువారం ఎడ్లబండి పందెలు, కబడ్డీ, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ గ్రామంలో 2014 నుంచి సంక్రాంతి పండుగ సమయంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వాంకిడి, రెబ్బెన, కాగజ్నగర్, తిర్యాణి మండలతోపాటు మంచిర్యాల జిల్లా నుంచి సైతం పోటీదారులు హాజరవుతుంటారు. జిల్లా కేంద్రంలో పతంగుల పండుగ ఆసిఫాబాద్అర్బన్: వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పతంగుల పండుగ నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు ఉదయ్బాబు, కార్యదర్శి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని హూలీట్రినిటీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు పతంగుల పండుగ ఉంటుందని, విజయవంతం చేయాలని వారు కోరారు. -
జంగు సేవలు చిరస్మరణీయం
కెరమెరి: ఆదివాసీ సమాజానికి, స్వగ్రామానికి జంగు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని చిన్నసాకడ గ్రామంలో పెందోర్ జంగుపటేల్ స్మారక కబడ్డీ 26వ వార్షిక క్రీడోత్సవాలకు బుధవారం హాజరయ్యారు. జంగు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మర్సకోల సరస్వతి, మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, సర్పంచులు పెందోర్ ఆనంద్రావు, తుంరం లచ్చు, కుడ్మెత కొద్దు, కుంరం అంబారావు, ఆత్రం లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
కొలాంల కొంగుబంగారం
కెరమెరి: కొలాం ఆదివాసీల కొంగుబంగారం.. మహిమాన్వితులు పోతురాజు, ధర్మరాజు ఉత్సవాలు కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామ సమీపంలోని ఆలయంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఎన్నికల్లో పోటీ సమయంలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదీ చరిత్ర శతాబ్దాలకు పూర్వం ఉత్తూరుపేట్ ప్రాంతంలో ఇందాపురం వంశస్తులు(కొలాం తెగకు చెందిన సిడాం గోత్రం వారు) నివాసం ఉండేవారు. ఒక రోజు భయంకరమైన మెరుపులు మెరిసి, ఒక మహిమ గల రాయి భూమి నుంచి బయటికి వచ్చింది. దానిని మళ్లీ లోపలికి పంపించేందుకు వారు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొద్దిరోజులపాటు ప్రయత్నించినా మళ్లీ ప్రత్యక్షం అయ్యేది. గ్రామ పెద్ద రాజు కలలోకి వచ్చి.. ‘తాను పోతురాజు, ధర్మరాజు దేవుడిని. ఇన్ని రోజులైనా తనను గుర్తించలేదా.. మీ మంచి కోసమే ప్రత్యక్షమయ్యాను. ఊరి చివరలో గుడి కట్టించి పూజిస్తే కోర్కెలు తీరుస్తా’ అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి కొలాంలు ఆ రాయిని దేవుడిగా భావించి గుడి కట్టారు. ఏటా మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందాపురం వంశస్తుల ఇంటి పేరుతోనే గ్రామాన్ని నేడు ఇందాపూర్గా పిలుస్తున్నారు. పోతురాజు వెలిసిన ప్రాంతంలోనే ప్రవహిస్తున్న పెద్దవాగును సింగర్వాడిగా పిలుస్తున్నారు. పూజా కార్యక్రమాలు ఇలా.. ఇందాపూర్లో గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు సింగర్వాడిలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. రాత్రి 6 గంటలకు పోతురాజు, ధర్మరాజు దేవతలకు నైవేద్యం సమర్పించి, రాత్రి 9 గంటలకు పెద్ద దేవునికి పూజలు చేస్తారు. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు బోనం సమర్పిస్తారు. 4 గంటలకు కట్టుకట్టడం, గుడి ప్రదక్షిణలు చేయడం, ఉదయం 7 గంటలకు భక్తులకు ఆశీర్వాదం ఇవ్వడం, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. 11 గంటలకు మైసమ్మకు పూజలు, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి పూజలు చేసి సాయంత్రం 4 గంటల వరకు మొక్కులు చెల్లిస్తారు. సంప్రదాయ నృత్యాలు చేస్తారు. శనివారం ఉదయం 9:30 గంటలకు పోచమ్మకు పూజలు, సాయంత్రం 5 గంటలకు లక్ష్మీపూజ, ఆరు గంటలకు దేవతలను గుడిలోకి సాగనంపుతారు. ఈ సందర్భంగా నిర్వహించే క్రీడాపోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
ఆదివాసీల ఇష్టదైవం
కొలాం ఆదివాసీలకు పోతురాజు, ధర్మరాజు ఇష్టదైవం. సంగర్వాడిలో మూడు రోజులు ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. కొలాం ప్రజలు భారీగా తరలిరానున్నారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. – సిడాం రాజు, ఆలయ కమిటీ చైర్మన్ కోరికలు నెరవేరుతాయికులమతాలకు అతీతంగా భక్తులు పూజలు చేస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పూజలు చేస్తారు. ఆలయం వద్ద భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. – సిడాం ధర్మూ, ఆలయ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించగా, ఈ నెలాఖరులో ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలు, డెడికేటెడ్ కమిషన్ నివేధిక ఆధారంగా బీసీలకు వార్డులు, చైర్పర్సన్ స్థానాలు కేటాయించారు. అయితే ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఇటీవల శాసన సభలో సవరించిన పురపాలిక చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఆసిఫాబాద్లో 20 వార్డులు, కాగజ్నగర్లో 30 వార్డులు ఉండడగా జిల్లా కేంద్రంపై చర్చ కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గతంలో ఉన్న వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారింది. జిల్లా కేంద్రం గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండగా ఐదేళ్లుగా ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. గతంలో ఆసిఫాబాద్ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వ్ కావడంతో జనరల్ అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఎట్టకేలకు రాజంపేట విడదీసి జన్కాపూర్, సాలెగూడ, గొడవెళ్లితో కలిసి నూతన బల్దియాను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విడదీయడంతో రిజర్వేషన్ మార్పుపై జనరల్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వార్డు స్థానాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో అనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కాగజ్నగర్కు ఎనిమిదిసార్లు ఎన్నికలు కాగజ్నగర్ మున్సిపాలిటీలో గతేడాది జనవరి 25న మున్సిపల్ పాలకవర్గ గడువు ముగిసింది. ఏడాదిగా ప్రత్యేకాధికారి పాలనలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ కౌన్సిలర్లు తమ వార్డుల రిజర్వేషన్లు మారితే ఎక్కడి నుంచి పోటీ చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. ఓటర్ల తుదిజాబితా ఆధారంగా తమకు అనుకూలమైన ఓటర్లు ఏ వార్డులో ఉన్నారు.. ఏయే సామాజిక వర్గాల ఓటర్లెంత మంది అనే దానిని పరిశీలిస్తున్నారు. కాగజ్నగర్కు ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగినా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే మహిళలకు అధ్యక్ష పీఠం దక్కింది. మిగిలిన ఏడుసార్లు పురుషులే దక్కించుకున్నారు. ఇందులో ఒకసారి స్వతంత్ర, మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ పీఠాన్ని దక్కించుకున్నాయి. 2020 ఎన్నికల్లో చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించారు. వార్డు స్థానాల్లో జనరల్కు 6, జనరల్ మహిళకు 9, బీసీ జనరల్కు 5, బీసీ మహిళలకు 4, ఎస్సీ జనరల్కు 3, ఎస్సీ మహిళకు 2, ఎస్టీ జనరల్కు ఒక్కటి చొప్పున కేటాయించారు. వార్డుల కేటాయింపు ఇలా..ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకా రం, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆసిఫాబాద్లోని 20 వార్డుల్లో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు మూడు, బీసీలకు ఐదు, మహిళలకు ఆరు, ఆన్రిజర్వ్కు నాలుగు కేటాయించారు. అలాగే కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీల కు ఐదు, బీసీలకు తొమ్మిది, జనరల్కు తొ మ్మిది, ఆరు ఆన్రిజర్వ్డ్కు కేటాయించారు. -
తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని వినతి
రెబ్బెన: అర్హులైన ఉద్యోగులకు పంప్ ఆపరేటర్(పీవోపీ) ప్రమోషన్లను తక్షణమే కల్పించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఖైరిగూర ఓసీపీలో మేనేజర్ శంకర్కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా పంప్ ఆపరేటర్ ప్రమోషన్లు ఇవ్వకుండా కాలయాపన చే స్తున్నా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నూతనంగా విధుల్లో చేరిన మహిళ ఉద్యోగులకు పరిసరాలు, గనిపై అవగాహన కల్పించిన తర్వాత షిప్ట్లో విధులు కేటాయించాలన్నారు. వారికి రెస్ట్ రూములు, అటాచ్డ్ బాత్రూంలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి వెంకటేశ్, నాయకులు కైత స్వామి, కుదిరె మొగులయ్య, షిఫ్ట్ ఇన్చార్జీలు కృష్ణ, రవి, రాజేశం, చందర్, మల్లేశ్, తిరుపతి, సురేశ్, సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● మొదలైన సంక్రాంతి సందడి ● నేడు భోగి వేడుకలు ● స్వగ్రామాలకు చేరుకుంటున్న జిల్లా ప్రజలు
ఆసిఫాబాద్అర్బన్: రంగవల్లులు, గొబ్బెమ్మలు, పతంగులు, పిండి వంటల ఘుమఘుమలు, హరి దాసు పాటలు, బసవన్నల ఆటలతో పల్లె లోగిళ్లు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా నేటి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం భోగి, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు. ఈ నెల 10న రెండో శనివారం కూడా కలిసిరావడంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటున్న జిల్లా ప్రజలు ఇప్పటికే పల్లెబాట పట్టారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఇళ్లకు చేరుకుంటున్నారు. పండుగ సందడిసంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇళ్ల ముంగిట ముత్యాల ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి. ఆవుపేడతో గొబ్బెమ్మలు, రేగుపళ్లు, నవధాన్యాలు, గరిక, పూలను అందంగా అలంకరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్లో రంగుల దుకాణాలు వెలిశాయి. కొత్తగా పెళ్లయిన వారు నోములు నోచుకోవడం సంప్రదాయం. అలాగే పండుగకు చకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, ఇతర పిండి వంటలను ఆస్వాదిస్తారు. ఇళ్లల్లో చకినాల ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో పది రోజుల ముందు నుంచే పిండివంటల తయారీని ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారు ఒకరికొకరు సాయంగా నిలిచారు. ఇక చిన్నారులు రంగురంగుల పతంగులతో సెలవులను ఆస్వాదిస్తున్నారు. గ్రామంలోని స్నేహితులతో సందడి చేస్తున్నారు. -
నీటి వనరుల సంరక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం డీఎఫ్వో నీరజ్కుమార్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్యతో కలిసి అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులతో నీటి వనరుల రక్షణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 150 చెరువులను చిత్తడి నేలలుగా గుర్తించినట్లు తెలిపారు. అధికారులు ఆయా చెరువులను సందర్శించి నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా పర్యావరణ హితంగా పంతంగులను ఎగురవేసే పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు ప్రభాకర్, గుణవంత్రావు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలివేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జల్ సేవా అంకలన్ పథకం కింద జిల్లాలో 15 పంచాయతీలు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 20న సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి తాగునీటిపై చర్చించాలని సూచించారు. ఫిబ్రవరిలో తాగునీటి వనరులను తనిఖీ చేయాలన్నారు. పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, గ్రిడ్ ఈఈ రాకేశ్, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘లాల్య..గెంద్యా’తో సేద్యం
కెరమెరి: ‘లాల్యా.. గెంద్యా’.. వినడానికి వింతగా ఉన్నా.. ఇవి కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన సేంద్రియ రైతు కేంద్రె బాలాజీ తన ఎద్దుల జతకు పెట్టుకున్న పేర్లు. దూరంలో ఉన్నా ఈ పేర్లతో పిలిస్తే అవి తన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అంతేకాక సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాలాజీకి ఐదెకరాల భూమి ఉండగా, సోదరులకు చెందిన పదెకరాల్లో పత్తి, కంది, గోధుమ, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలతోపాటు మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. ఏటా సేద్యానికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తే రూ.9 లక్షల రాబడి ఉంటుందని ఆయన చెబుతున్నాడు. పొలాల పండుగ సమయంలో ఉపవాసం ఉండి ఎద్దులకు ఆహారం పెట్టిన తర్వాతే తాను తింటానని తన ‘లాల్య..గెంద్యా’తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. -
మహిళా ఉద్యోగులకు షిఫ్ట్లు నిలిపివేయాలి
రెబ్బెన: ఖైరిగూర ఓసీపీలో మహిళా ఉద్యోగులకు జనరల్, సెకండ్ షిఫ్ట్లు తక్షణమే నిలిపివేయాలని ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ కోరారు. గని మేనేజర్ శంకర్తో మంగళవారం సమావేశమై ఓసీపీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగులకు రెస్ట్రూంలు, వాష్రూంలు ఏర్పాటు చేయాలన్నారు. జీఎం కమిటీ సభ్యులు రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్బాబు, చంద్రశేఖర్, సహాయకార్యదర్శి ఓదెలు, షిఫ్ట్ ఇన్చార్జి అంజయ్య, రాయిని రాజయ్య, మహిళా మైన్ కమిటీ సభ్యులు మాయ తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం’
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి సమీక్షించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆసిఫాబాద్లో తొలిసారి జరిగే ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నారు. ఆశావహులు క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాల ప్రకారం బీఫారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, నాయకులు నిజాం, సోమయ్య, శంకర్, గుండా శ్యాం, మారుతి పటేల్, విశ్వనాథ్, ఫైజల్, తారీఫ్, జావిద్, కార్తీక్ పాల్గొన్నారు. -
కుమురం భీం
7వరి నాట్లలో వలస కూలీలు పెంచికల్పేట్ మండలంలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్కు చెందిన కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. 9లోu ఆకాశం నిర్మలంగా ఉంటూ.. పగలంతా ఎండ ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. చలితీవ్రత తగ్గుతుంది. ఉదయం మంచు కురుస్తుంది.పశు వైద్యశాల లేక ఇక్కట్లు లింగాపూర్ మండలంలో పశువైద్యశాల లేదు. మూగజీవాలకు వైద్యం చేయించేందుకు స్థానిక రైతులు జైనూర్కు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. 9లోu బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026 -
సాగులో రఘోత్తముడు
దహెగాం: వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపిస్తూ.. కొత్త సాంకేతికతతో వ్యవసాయం చేస్తున్నాడు దహెగాం మండల కేంద్రానికి చెందిన రఘోత్తంరెడ్డి. జీవితాన్ని పూర్తిగా పంటల సాగుకు అంకితం చేసి, పొలం వద్ద ఇల్లు నిర్మించుకున్నాడు. రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాడు. దహెగాం మండలంలో 26 ఏళ్ల క్రితం స్థానిక రైతులు ఎక్కువగా జొన్న పండించేవారు. 2000లో వరంగల్ నుంచి దహెగాంకు వచ్చిన రఘోత్తంరెడ్డి భూములు సాగుకు యోగ్యంగా ఉండడంతో ఇక్కడే స్థిరపడ్డాడు. ముందుగా ఏడెకరాల్లో వరి సాగు ప్రారంభించాడు. సాగు సాధ్యం కాదని గ్రామస్తులు భయపెట్టి, పశువుల బెడద ఉంటుందని హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గలేదు. మొదట్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రంతా టార్చిలైట్తో పంటలకు కాపలా ఉంటూ కష్టాలు ఎదుర్కొన్నాడు. పత్తి సాగుపైనా దృష్టిదహెగాంలో మొదట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి పత్తి సాగు చేసి వెళ్లిపోయాడు. అనంతరం రఘోత్తంరెడ్డి వరితోపాటు పత్తి సాగుపై దృష్టి సారించాడు. వరంగల్ నుంచి విత్తనాలను తీసుకొచ్చి పత్తి సాగు ప్రారంభించగా, స్థానిక రైతులు కూడా ముందుకొచ్చారు. 2007లో సీడ్ వరి (ఆడ, మగ) సాగును కూడా పరిచయం చేశాడు. గతేడాది ఎల్లో మిర్చి పండించగా, ప్రస్తుతం పత్తి, వరి, మిర్చి పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాగులోనే ఆనందం నాలుగేళ్లుగా ఊరి చివర ఉన్న పొలంలోనే ఇల్లు కట్టుకున్నా. నేను వరి, పత్తి సాగు చేయడం ప్రారంభించిన తర్వాత మిగిలిన వారు పంటలు పండించడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు అందించాలి. – రఘోత్తంరెడ్డి -
హెల్మెట్తో ప్రాణాలకు రక్ష
ఆసిఫాబాద్రూరల్/కాగజ్నగర్టౌన్: ద్విచక్ర వా హనదారుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణగా నిలు స్తుందని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ మండలం మోతుగూడ, కాగజ్నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ వాడటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. డ్రైవింగ్ సమయంలో అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గతేడాది నుంచి ఇప్పటివరకు 90 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై సుధాకర్, సర్పంచ్ బొట్టుపల్లి గోపాల్, ఉప సర్పంచ్ పవన్, లారీ అసోసియేషన్ సభ్యులు పాలక్రావు, వినోద్, పాల్గొన్నారు. -
కౌలుకు సాగు.. ఎద్దులపై ప్రేమ
కాగజ్నగర్రూరల్: రాస్పెల్లికి చెందిన ఇనుముల శ్రీకాంత్ కుటుంబానికి వారసత్వంగా ఎలాంటి భూమి లేదు. భార్య అంజలి, పిల్ల లు త్రినేయ, మన్వితతో కలిసి ఉంటున్నాడు. కౌలుకు తీసుకుని పదెకరాల్లో వరి, 15 ఎకరాల్లో పత్తి పండిస్తున్నాడు. వ్యవసాయం కౌలుకు చేస్తున్నా రెండు ఎడ్లను ప్రేమతో పెంచుతున్నాడు. వాటి పోషణ కోసం ఏటా సుమారు రూ.50వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో వరి గడ్డి కట్టకు రూ.100, క్వింటాల్ తౌడు బస్తాకు రూ.2400 వెచ్చిస్తున్నాడు. తాను అందుబాటులో లేని సమయంలో తన భార్య వాటి బాగోగులను చూస్తుందని చెబుతున్నాడు. -
బ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్అర్బన్: ఆ సిఫాబాద్ పట్టణ బ్రా హ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివా రం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ మినీ ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా వైరాగడె ప్రతాప్, గౌరవ అధ్యక్షుడిగా సుగుణాకర్, ఉపాధ్యక్షులుగా అభయ్కుమార్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పరాండే సాయి, సంయుక్త కార్యదర్శులుగా ఆమ్టే అనూప్కుమార్, బాలకిషన్, కోశాధికారిగా అనంత్, ప్రచార కార్యదర్శిగా వారణాసి శ్రీని వాస్రావ్, సాయికృష్ణ, న్యాయ సలహాదారులుగా దీపక్, రామకృష్ణను ఎన్నుకున్నారు. అలాగే మహిళా సమాజ్ అధ్యక్షులుగా ఆరతి, గౌరవ అధ్యక్షులుగా ఆమ్టే శ్రీమతి, ఉపాధ్యక్షులుగా మసాదె స్వాతి, ప్రధాన కార్యదర్శిగా శ్రుతిక, సహాయ కార్యదర్శులుగా మంతెన ఉమ, జయంతి, కోశాధికారిగా కీర్తిని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. -
పులిదాడిలో లేగదూడ మృతి
వాంకిడి: పులిదాడిలో మృతి చెందిన లేగదూడ యజమానికి అటవీ శాఖ అధికారులు తక్షణ నష్టపరిహారం అందజేశారు. అటవీ శాఖ రేంజ్ అధికారి గోవింద్చంద్ సర్దార్ వివరాలు వెల్లడించారు. వాంకిడి మండలం వెలిగి సెక్షన్ పరిధిలోని మాలిని గ్రామానికి చెందిన తెలంగ్రావు అనే వ్యక్తి లేగదూడ శనివారం సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన సమయంలో సాయంత్రం పులి దాడి చేసి హతమార్చిందన్నారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి తక్షణ నష్ట పరిహారం కింద రూ.5 వేలు అందించామని తెలిపారు. త్వరలో పూర్తి నష్ట పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహంచారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఝాన్సీలక్ష్మి, బీట్ అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్, వెంకటేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘ఆర్ఎస్పీతోనే కార్మిక హక్కుల సంరక్షణ’
కాగజ్నగర్రూరల్: ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మి కుల హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోనే సాధ్యమవుతుందని సిర్పూరు పేపరు మిల్లు ప్రొటక్ట్ యూని యన్(రి.నం–2381) కార్యనిర్వాహక అధ్యక్షుడు గోలెం వెంకటేశ్ స్పష్టం చేశారు. కాగజ్నగర్ మండలం కోసిని గ్రామంలోని ప్రాణహిత భవన్లో ఆది వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించకుండా యాజమాన్యం.. గుర్తింపు సంఘాలు లేవని హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఆర్ఎస్పీ తన వ్యక్తిగత న్యాయవాది లక్ష్మీనారాయణ ద్వారా న్యాయస్థానంలో జడ్జిమెంట్ త్వరగా విడుదలయ్యేలా సహకరించారని స్పష్టం చేశారు. కార్మికుల సంబురాలను ఓర్వలేని కొందరు నాయకులు ప్రవీణ్ కుమార్తోపాటు యూనియన్పై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికిని కోల్పోతామనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో యూనియన్ నాయకులు సుభాష్, అహ్మద్ పాషా, రాజమౌళి, చక్రవర్తి, చంద్రమోహన్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులం.. భవిత పదిలం
ఆసిఫాబాద్రూరల్: ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను తీర్చిదిద్దుతోంది. పేద విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా, ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన అందుతోంది. 2026– 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో నూతన ప్రవేశాలు, అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 14 గురుకులాలు.. భారీగా సీట్లుజిల్లావ్యాప్తంగా 14 గురుకుల పాఠశాలలు ఉన్నా యి. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు 5, సాంఘిక సంక్షేమ గురుకులాలు 5, మైనారిటీ గురుకులాలు 4 ఉన్నాయి. ఇందులో బాలికల కోసం 8, బాలుర కోసం 6 గురుకులాలు కేటాయించారు. ఒక్కో గురుకులంలో ఐదో తరగతికి 80 సీట్ల చొ ప్పున.. జిల్లాలోని మొత్తం 14 గురుకులాల్లో 1,120 మంది విద్యార్థులు ప్రవేశం పొందే వీలుంది. వీటితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకు వివిధ కారణాలతో ఖాళీ అయిన(బ్యాక్లాగ్) సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండనుంది. అర్హతలు.. పరీక్ష విధానంఐదో తరగతిలో ప్రవేశానికి 2026 ఆగస్టు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 13 ఏళ్లు, బీసీ/ఇతర వర్గా ల వారికి 11 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 ల క్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించొద్దు. వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీ క్ష నిర్వహిస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు. తెలుగులో 20 మార్కులు, ఇంగ్లిష్ లో 25, గణితంలో 25, పర్యావరణ విజ్ఞానం(ఈవీఎస్)కు 20, మెంటల్ ఎబిలిటీకి 10 మార్కులు ఉంటాయి. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది. 22న ఎంట్రెన్స్ ఎగ్జామ్అర్హులైన విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నాలుగో తరగతి చదువుతున్న వారు 5వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ఈ నెల 21లోగా అధికారిక వెబ్సైట్ https://tg cet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవా లి. పరీక్ష రుసుం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 22న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. -
వలస కూలీల తిరుగు ప్రయాణం
కాగజ్నగర్టౌన్: ‘స్వస్థలంలో ఉపాధి పనులు దొరకక ఎంతో అలమటించామని, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని రాజస్తానీ కూలీలు పేర్కొన్నారు. జిల్లాలో పత్తి తీసేందుకు వచ్చిన వలస కూలీలు ఆదివారం స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. రెండు నెలల క్రితం కుటుంబాలతో వచ్చిన వారిని జిల్లా రైతులు అక్కున చేర్చుకుని సౌకర్యాలు కల్పించారు. ఆహార ధాన్యాలు అందించడంతోపాటు వారానికి ఒకసారి మాంసాహారం అందించారు. కుటుంబ సభ్యుల మాదిరిగా బాగోగులు చూసుకున్నారు. ప్రస్తుతం పత్తితీత పనులు తుదిదశకు చేరడంతో గ్రామాల్లోని పెద్దవారిని చూసుకునేందుకు వెళ్తున్నామని కూలీలు పేర్కొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి
నేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి, గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓబన్న జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒడ్డె ఓబన్న జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఒడ్డె ఓబన్న జ యంతి నిర్వహించారు. ఒడ్డెర నాయకులు, ప్రముఖులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒడ్డె ఓబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ రేనాడు ప్రాంతంలో 1816 జనవరి 11న జన్మించాడని తెలిపారు. 18వ శతాబ్దంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా సంచార జాతులైన వడ్డెరలు, బోయలు, చెంచు ప్రజలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. నల్లమల ప్రాంతంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలను ఎదుర్కొన్నారని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. -
ప్రాణహిత.. బతుకుబాట!
మహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు తోకల లక్ష్మి. తన కుటుంబంతో పాటు ప్రాణహిత నది తీరానికి వలస వచ్చింది. ఇక్కడే చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి నాటు పడవతో నదిలోకి వెళ్లి చేపలు పడుతుంటారు. పట్టిన చేపలను పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయించి జీవనం సాగిస్తుంటారు. ఇలా అనేక కుటుంబాలు ప్రాణహిత నదిలో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నాయి. పెంచికల్పేట్: మత్స్యకారుల కుటుంబాలు దు ర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నాయి. చేపల వేట కోసం ప్రాణహిత నదిలో గుడారాలు వేసుకుని కటిక చీకటిలో పిల్లపాపలతో కాలం వెల్ల దీస్తున్నాయి. ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవ నం సాగిస్తున్నాయి. జిల్లాలోని సిర్పూర్(టీ), కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలను ఆనుకుని ప్రాణహిత నది ప్రవహిస్తోంది. తలాయి నుంచి మొట్లగూడ వరకు పలు ప్రాంతాల్లో చేపల వేటతో సుమారు 100 గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. లోనవెల్లి, తుమ్హిడేటి, బెజ్జూర్, తలా యి, మురళీగూడ, మహారాష్ట్రలోని దేవలమర్రి, చిన్నవట్ర గ్రామాల మత్స్యకారుల కుటుంబాలవారు నది తీరంలోనే ఉంటూ నిత్యం చేపలు పడుతూ విక్రయిస్తున్నారు. ఆరునెలలు నదిలోనే..ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో పదుల సంఖ్యలో గంగపుత్రుల కుటుంబాలు తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబర్ నుంచి జూన్ చివరి వరకు నదిలో ఇసుక మేట లపై జీవనం సాగిస్తారు. నాటుపడవల ద్వారా జెల్లా, బొచ్చె చేపలతో పాటు రొయ్యల వేట సాగిస్తున్నారు. పట్టిన చేపలను రొయ్యలను తె లంగాణలోని బెజ్జూర్, మహారాష్ట్రలోని అహెరి, అలపల్లి మార్కెట్లలో విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రమాదకరంగా నాటు పడవలపై..ప్రాణహిత నదిలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. అకాల వర్షాలు కురిసినపుడు నది లో నీటి ప్రవాహం పెరుగుతుంది. నిత్యం నా టు పడవల ద్వారా లోతైన ప్రాంతాలకు వేటకు వెళ్తుండగా ప్రమాదాలు జరిగే అవకాశముంది. అధునాతన వలలు లేక పాత వాటినే వినియోగిస్తుండటంతో పెద్ద చేపలు చిక్కినప్పుడు అవి తెగిపోతున్నాయి. నదిలో పట్టిన చేపలను బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రాణహిత నది చేపలు కిలోకు రూ.200 పైనే పలుకుతోంది. మార్కెటింగ్ లేక తక్కువ ధరకే చేపలు అమ్ముకుంటున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటినా అధికారులు స్పందించి నూతన వలలు, వాహనాలు, అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. చేపల వేటతోనే జీవనం ప్రాణహిత నదిలో చేపల వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. తరాలుగా చేపల వేటనే వృత్తిగా వస్తోంది. నదిలోనే గుడారాలు ఏర్పాటు చేసుకుని రాత్రి పూట నాటు పడవలపై వెళ్లి చేపలు పడుతున్నాం. వలకు చేపలు చిక్కితేనే పూట గడుస్తుంది. లేదా ఆరోజు పస్తులుండుడే. – రామచంద్రు, మత్స్యకారుడు, దేవలమర్రి ప్రభుత్వాలు ఆదుకోవాలి చేపలవేట కోసం పిల్లాపాపలతో సుమారు ఆరునెలలు నదిలోనే జీవనం సాగిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలోనే రాత్రి పూట చేపలను వేటాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నాం. ప్రభుత్వాలు అధునాతన పడవలు, వలలు ఉచితంగా పంపిణీ చేయాలి. – శైలేశ్, మత్స్యకారుడు, దేవలమర్రి -
వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణ మే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సు గుణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ పేదలు, కూలీ లు, రైతుల జీవనాధారంగా ఉన్న ఉపాధిహామీ ప థకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకువచ్చిన కొ త్త చట్టాలు ప్రజావ్యతిరేకమని ఆరోపించారు. ఉపాధిహామీ పథకం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబా లకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. అలాంటి చ ట్టాన్ని బలహీనపర్చడం అన్యాయమని పేర్కొన్నా రు. వీబీజీ రామ్జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 30వరకు జిల్లాలో గ్రామగ్రామాన నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకుని మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయ క్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, ఆయా మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
కెరమెరి: షష్టిని పురస్కరించుకుని మండలంలోని చిన్నపాట్నాపూర్ గ్రామంలో ఆదివారం నుంచి ఈ నెల 13వరకు నిర్వహించనున్న వంగెపురి భీమయ్యక్ దేవస్థాన పూజ, జాతర పోస్టర్ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం ఆవి ష్కరించారు. ఆలయ కమిటీ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను కలిసి జాతరకు రావాలని ఆహ్వానించారు. మూడురోజులపా టు నిర్వహించనున్న జాతరలో ఆటపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఆలయ కమిటీ సభ్యులు ఆత్రం దర్మూ, ఆత్రం యా దోరావు, సిడాం భీంరావు, టేకం గంగారాం, చహకటి మారుతి, ధంబీరావు ఉన్నారు. -
అమెరికాకు పంపిస్తాం
సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటకాలు, టిఫిన్స్ చేయడంలో బిజీ అవుతాను. బంధుమిత్రులతో కలిసి రకరకాల పిండివంటలు తయారు చేస్తాం. ముఖ్యంగా మా పిల్లలిద్దరు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సంక్రాంతికి నేను చేసే పిండివంటలు మా పిల్లలకు ఎంతో ఇష్టం. వారి కోసం సకినాలు, అరిసెలు, కరిగెలు, పూతరేకులు, గారెలు, ఇతర పిండి వంటకాలు తయారు చేసి పంపిస్తాం. సంక్రాంతి పండుగకు వారికి చేరేలా పార్సిల్ చేస్తాం. ఇండియాలో లాగే అమెరికాలోనూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. – సునీత, గృహిణి, ఆసిఫాబాద్ -
దక్షిణ భారతస్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక
ఆసిపాబాద్: జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు, విద్యార్థి దక్షిణభారత స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల విభాగంలో కాగజ్నగర్ పెట్రోల్ పంప్ జెడ్పీ సెకండరీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు మామిడాల తిరుపతయ్య, విద్యార్థుల విభాగంలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎస్.ప్రవీణ్కుమార్ హరిత శక్తి విభాగంలో ప్రతిభ చాటారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ వీరిని అభినందించారు. ఈ నెల 19నుంచి 23వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న దక్షిణ భారత స్థాయిలోనూ జిల్లా ప్రతిష్టను నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 18న రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని సూచించారు. తిరుపతయ్యను అభినందిస్తున్న దీపక్ తివారిప్రవీణ్కుమార్ను అభినందిస్తున్న ఉపాధ్యాయుడు -
వివరాలు నమోదు చేయాలి
కౌటాల: రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బీ వెంకట్ సూచించారు. మండలంలోని నాగేపల్లి గ్రామంలో శనివా రం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల పథకాల ద్వారా ప్రయోజనం పొందవచ్చ ని తెలిపారు. రైతులంతా ఆధార్కార్డు, ఫోన్ నంబర్తో సంబంధిత ఏఈవో లేదా మీ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ కావుడే బిక్కు, ఏవో ప్రేమలత, ఏఈవో అంజన్న, రాజేశ్వర్, ఘన్శ్యాం, కల్పన, రైతులు పాల్గొన్నారు. -
ఎంతో తృప్తినిస్తోంది
నేను 20 ఏళ్లుగా పిండివంటల తయారీ వ్యాపా రం చేస్తూ పలువురికి ఉపాధి కల్పించడం ఎంతో సంతృప్తినిస్తోంది. పండుగ సమయాల్లో కనీసం మూడు క్వింటాళ్ల సకినాలు, అరిసెలు, చేకోడీలు, సేవు, సాచా, పప్పు బిళ్లలు, చుడ్వా, మురుకులు తయారుచేసి తక్కువ ధరకే విక్రయిస్తుంటాను. ప్రతీరోజు ఇడ్లీ, వడ మొదలైన టిఫిన్స్ కూడా చేస్తుంటాను. దీనిని ఉపాధిగా ఎంచుకున్న నుంచి ఇప్పటివరకు నాణ్యత, పరిమాణం తగ్గించలేదు. ముఖ్యంగా పలహారాల తయారీలో నా భర్త సురేశ్ సహకారం చాలా ఉంది. – మార స్వరూప, ఆసిఫాబాద్ -
కుమురం భీం
Iఇష్ట దేవతలకు పూజలు ఆదివాసీలు అడవితోపాటు సూర్యచంద్రులు, నీరు, నిప్పును పూజిస్తారు. షష్టిలో పాండవుల్లో భీముడిని భీమయ్యక్ స్వామిగా కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. IIIలోu‘గిరి’ యాదిలో హైమన్డార్ఫ్ హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజెబెత్ దంపతులు గి రిజనుల జీవనస్థితి, సమస్యలు, వారి హక్కు ల కోసం పోరాడారు. నేడు డార్ఫ్ దంపతుల వర్ధంతి సందర్భంగా కథనం.. IIలోuఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది.ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026 -
సంక్రాంతి ఉపాధి!
ఆసిఫాబాద్అర్బన్: సంక్రాంతి పండుగకు కొద్దిరో జుల ముందునుంచే ఇళ్లల్లో సందడి మొదలవుతుంది. ఏ ఇంట్లో చూసినా ఇంటిల్లిపాది పిండివంటల తయారీలో బిజీబిజీగా కనిపిస్తారు. ఎన్నో పోషకా లు గల సకినాలు, అరిసెలు తదితర పిండివంటలు చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే, కొందరికి ఈ పండుగ ఉపాధినిస్తోంది. సొంతంగా ఇళ్లల్లో పిండివంటలు చేసుకోలేని వారికి రెడీమేడ్గా చేసిస్తూ ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని మార స్వరూప, బ్రాహ్మణవాడలోని బొగడమీది జయశ్రీ పిండివంటలు తయారు చేసి విక్రయిస్తున్నారు. పిండివంటల తయారీలో మరి కొందరికి ఉపాధినిస్తున్నారు. సంక్రాంతే కా కుండా దసరా, దీపావళి తదితర పండుగలు, ఇతర శుభకార్యాల సమయాల్లోనూ రుచికరమైన పిండివంటలు తయారు చేసి విక్రయించడం వీరి ప్రత్యేకత. వీరు తయారు చేసిన పిండివంటలు స్థానికంగానే కాకుండా ఆర్డర్పై విదేశాలకు పంపించడం వీరి మరో ప్రత్యేకత. ఇలా పిండివంటల తయారీని వ్యాపారంగా చేసుకున్న వీరు ఆర్థికంగా రాణిస్తున్నా రు. పిండివంటల తయారీతో మరికొందరు మహిళలకు ఉపాధినిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లెల్లో సందడి దహెగాం: సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున పల్లెల్లో సందడి మొదలైంది. ఉదయం నుంచే పిండిగిర్నీల వద్ద రద్దీ కనిపిస్తోంది. ప్రతీ ఇంట్లో ఘుమఘుమలాడే పిండివంటలు తయా రు చేస్తున్నారు. శనివారం నుంచి సంక్రాంతి సె లవులు ప్రకటించడంతో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఇళ్లకు చేరారు. దీంతో ఇంటిల్లిపాది పిండి వంటల తయారీలో నిమగ్నమయ్యారు. ఎవరికివారే కాకుండా మహిళలు ఒ కరికొకరు సహాయపడుతున్నారు. కబుర్లు చెప్పుకొంటూ అలసట లేకుండా రుచికరమైన సకినాలు, గారెలు, అరిసెలు, చెకోడీలు తదితర వంటకాల తయారీలో బిజీగా కనిపిస్తున్నారు. -
బీటీ రోడ్డు మంజూరు చేయాలి
కెరమెరి: మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరి హద్దులోని పరంధోలి తదితర గ్రామాలకు వెళ్లేందు కు ఉమ్రి క్రాస్ రోడ్డు నుంచి బీటీ రోడ్డు నిర్మించాల ని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ శనివారం ఎంపీ గోడం నగేశ్ను కో రారు. జిల్లా కేంద్రంలోని ఆయన గృహంలో కలిసి వినతపత్రం అందించారు. ముకదంగూడ, పరంధో ళి గ్రామపంచాయతీలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేక పంటలకు సాగునీరు అందడంలేదని తెలిపారు. శంకర్లొద్ది అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కప్లై పుణ్యక్షేత్రంలోని గుహ వద్ద విశ్రాంతి గదిని ఏర్పా టు చేయాలని కోరారు. శంకర్లొద్ది, మహరాజ్గూ డ గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రయాణపాట్లు
ఆసిఫాబాద్: జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సమీపిస్తుండడంతో పాఠశాలలు, కళా శాలలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కాగజ్నగర్, ఆసిఫాబాద్ రోడ్, సిర్పూర్ (టీ) రైల్వేస్టేషన్లలో వచ్చిపోయే అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు తగినన్ని బస్సులు, రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేక ఒక్కో బస్సులో సామర్థ్యానికి మించి వెళ్తున్నారు. ఓ వైపు బస్సుల కొరత ఉండగా, మరో వైపు లగేజీతో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. బస్సుల్లో రిజర్వేషన్లు దొరక్క పోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చేవారు నాలుగైదు బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఎక్కడం.. దిగడం సమస్యగా మారింది. ఏటా సంక్రాంతి ముందు బస్సుల సమస్య ఉండడంతో కొంతమంది తమ సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ వెళ్లని గ్రామాలకు కూడా ఆటోలు, ప్రైవేట్ వాహనాలు కూడా కిక్కిరిసి వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు రెగ్యులర్ సర్వీసులతో పాటు ఐదు ప్రత్యేక బస్సులు వేశారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు రెగ్యులర్గా 14 సర్వీసులు నడుస్తుండగా, పండుగ నేపథ్యంలో మరో ఐదు అ దనపు సర్వీసులు నడుపుతున్నారు. కాగా, అదనపు బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పండుగ సందడి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని కిరాణా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. జిల్లా కేంద్రం, కాగజ్నగర్ మున్సి పాలిటీతోపాటు మండల కేంద్రాలు సందడిగా మా రాయి. సంక్రాంతి వంటకాలకు అవసరమైన నువ్వులు, మంచినూనె, బెల్లం, బియ్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. సకినాలు, అరిసెలతో పాటు ఇతర పిండి వంటలు తయారు చేసుకునేందుకు గ్రామాలు, పట్టణాల్లోని అన్ని వర్గాలవారు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పాటు మహిళలు వివిధ నోములు నోముకునేందుకు అవసరమున్న సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థుల ఇంటిబాట పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో జిల్లాలోని ఆశ్రమ వసతిగృహాలు, కళా శాలల విద్యార్థులు ఇంటి బాట పట్టారు. శనివారం ఉదయం నుంచే విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వసతిగృహాలు, పాఠశాలలకు చేరుకున్నారు. కొంతమంది ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చే సుకోగా, చాలామంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. దీంతో వసతి గృహాలు, బస్టాండ్లు సందడిగా మారాయి. ప్రయాణికుల అవసరాన్ని బట్టి కొంతమంది ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో చదువుకుంటున్న ఇక్కడి విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఒకటిన్నర చార్జీ వసూలు చేస్తోంది. ఆర్థిక భారమైనప్పటికీ కొంతమంది ప్రయా ణికులు ఇక్కడి నుంచే సొంత వాహనాలు హై దరాబాద్కు పంపించి తమ పిల్లలను తీసుకువచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. పండుగ సమీపిస్తుండడంతో ఆది, సోమవారాల్లో మరింత ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు సంక్రాంతి రద్దీని పురస్కరించుకుని జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు అదనపు బస్ సర్వీసులు నడుపుతున్నాం. రెగ్యులర్ సర్వీసులతో పాటు ఈ నెల 14వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజశేఖర్, ఆర్టీసీ డీఎం -
లాభసాటిగా ఉంది
సొంతంగా ఇంటి వద్దనే టిఫిన్స్, ఇతర రుచికరమైన పిండివంటలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాను. ఇలా స్వయం ఉపాధి ద్వారా నేను ఆర్థి కంగా ఎదుగుతుండడం సంతోషం, తృప్తినిస్తోంది. ముఖ్యంగా పండుగల సమయాల్లో బిజీగా ఉండడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. నా వ్యా పారానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉంది. ఐదేళ్లుగా టిఫిన్స్, ఇతర వంటకాలను ఆర్డర్పై సరఫరా చేస్తున్నాను. ఈ వ్యాపారం లాభాసాటిగా ఉంది. దీని వెనుక ఎంతో కష్టం కూడా ఉంది. – బొగడమీది జయశ్రీ, ఆసిఫాబాద్ -
కుమురం భీం
Iపాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. IIIలోu ఆకాశం మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. రోడ్లపై పశువుల సంచారం దహెగాం మండల కేంద్రంలో పశువులు ఇ ష్టారీతిన సంచరిస్తున్నాయి. రాత్రిపూట సైతం రోడ్లపైనే నిద్రిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. IIIలోu శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026 -
ప్రమాదరహిత డిపోగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్: రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ఆసిఫాబాద్ డిపోను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఎస్పీ నితిక పంత్, జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్య, డీఎం రాజశేఖర్తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల ని వారణ అందరి బాధ్యత అన్నారు. ఆర్టీసీని ప్రమాదరహిత ప్రయాణంగా రూపొందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం వహించొద్దని, సెల్ఫోన్ మాట్లాడొద్దని సూ చించారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే వందశాతం ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో 2024తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్యలో పెద్దగా మార్పు లేదని పేర్కొన్నారు. అంతకు ముందు డిఫెన్స్ డ్రైవింగ్, వాహనాలు నడిపేటప్పుడు జరిగే అగ్ని ప్రమాదాల నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అగ్నిమాపక శాఖ, వైద్యాధికారులు ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఆర్టీసీ కార్మికులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సీతారాం, వైద్యుడు వినోద్కుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకాంక్షిత బ్లాక్లో వసతుల కల్పనకు కృషి
ఆసిఫాబాద్: ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్లో వసతుల కల్పనకు కృషి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారి రజత్కుమార్ సైని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్, జిల్లా కార్యక్రమంలో నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న వసతులపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ ద్వారా తిర్యాణి బ్లాక్, జిల్లా స్థాయి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ మారుమూల గ్రామంలో ఇంటర్నెట్, రహదారులు, గిరిజనులకు పక్కా ఇళ్లు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు నీతి ఆయోగ్ నిధుల ద్వారా చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రభారికి అధికారులు వివరించారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలితిర్యాణి: అభివృద్ధే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారి రజత్ కుమార్ సైని అన్నారు. మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి పరిశీలించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని కార్యాలయాల్లో 50 కంప్యూటర్లు, 30 ప్రింటర్లు, ఐదు ప్రొజెక్టర్లు, 40 టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గుడిపేటలో మోడల్ అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం, జెండాగూడలో పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగ పూట జరభద్రం!
కౌటాల: అసలే సంక్రాంతి పండుగ సెలవులు.. ప్రజ లు ఇళ్లు విడిచి ఊరెళ్తే దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్లకు టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగజ్నగర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), పెంచికల్పేట్, కౌటాల, రెబ్బెన మండలాల్లో అధికంగా దొంగతనాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా, పోలీస్ పెట్రోలింగ్. తనిఖీలు, కొనసాగుతున్నా చోరీలకు అడ్డుకట్ట పడటం లేదు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యం..జిల్లాలో 2025లో 58 వరకు ఇళ్లలో చోరీలు జరగగా, 151 వరకు దొంగతనాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నగదు, బంగారు. వెండి తదితర ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. పండుగ సమయంలో జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. దొంగలు కాలనీల్లో పగటిపూట రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీకి పాల్పడే అవకాశం ఉంది. అందినకాడికి దోచుకుని మహారాష్ట్రకు పారిపోతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీకి చెందిన దండె మంగ ఇంట్లో ఈ నెల 5న దొంగలు పడ్డారు. ఈ నెల 3న మంగ ఇంటికి తాళం వేసి హైదరాబాద్లోని కుమార్తె వద్దకు వెళ్లింది. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చింది. తలుపులు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడు తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
తేలిన వ్యాధిగ్రస్తుల లెక్క!
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం డిసెంబర్ 18 నుంచి 31 వరకు నిర్వహించిన లెప్రసీ సర్వే ముగిసింది. సర్వేకు ఆశ కార్యకర్తలు దూరంగా ఉండటంతో కార్యక్రమం నామమాత్రంగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా జిల్లాలో వ్యాధి విజృంభిస్తుండగా, సర్వేలో కేవలం 18 మందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ కావడం అనుమానాలకు తావిస్తోంది. కుష్ఠు నిర్మూలనే లక్ష్యంకుష్ఠును సమూలంగా నిర్మూలించి, వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వైద్యారోగ్య శాఖ చేపట్టింది. కేంద్ర ప్రభు త్వ ఆధ్వర్యంలో ఇందుకోసం కార్యాచరణ రూపొందించారు. జిల్లా అధికారులు ఎల్సీడీసీ(లెప్రసీ కేస్ డిటెక్టీవ్ క్యాంపెయిన్) నిర్వహించారు. ఏటా ఆశ వర్కర్లు సర్వే చేపట్టేవారు. అయితే వారికి గతంలో చేపట్టిన సర్వే డబ్బులు అందకపోవడంతో ఈసారి దూరంగా ఉన్నారు. దీంతో జిల్లాలోని పీహెచ్సీల హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు బాధితుల వివరాలు సేకరించారు. 200 మంది అనుమానితులుజిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే చేపట్టారు. హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు సర్వేలో పాల్గొని రో జువారీ నివేదికలు రూపొందించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వే చేయగా.. ఆ యా బృందాల పరిధిలో ఒక్కో టీం ప్రతీ రోజు 25 ఇళ్లను సందర్శించింది. ఇంటింటా నిర్వహించిన స ర్వేలో 200 మంది అనుమానితులను గుర్తించారు. ఇందులో 18 మందికి కుష్ఠు వ్యాధి నిర్ధారణ అ య్యింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 108 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉచితంగా వైద్యం కుష్ఠు బాధితులకు వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందిస్తాం. శరీరంపై తెల్లని స్పర్శ లేని, పాలిపోయిన మచ్చలు ఉంటే స్థానిక ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించాలి. మొద్దుబారిన మచ్చలు, చేతివేళ్లు వంగడం, మచ్చలపై వెంట్రుకలు ఊడిపోవడం, చెమట రాకపోవడం, పాదాల్లో పుండ్లు తదితర లక్షణాలు కనిపిస్తే అనుమానితులుగా గుర్తిస్తారు. శరీరంపై ఐదు కంటే ఎక్కువగా మచ్చలు ఉంటే ఆరు నెలలపాటు, అంతకన్నా అధికంగా ఉంటే 12 నెలలపాటు ఉచితంగా వైద్యం అందిస్తాం. – డాక్టర్ వినయ్ ఉప్రె, లెప్రసీ ఇన్చార్జి ప్రోగ్రాం అధికారి -
ఇంగ్లిష్పై పట్టు సాధించాలి
కాగజ్నగర్టౌన్: విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించాలని ఎంఈవో ప్రభాకర్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని డివిజనల్ రిసోర్స్ సెంటర్లో శుక్రవారం ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెడ్ఎడ్ టాక్స్ ఇంగ్లిష్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎల్టా ఆధ్వర్యంలో నిర్వహించిన పో టీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నా రు. కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, విద్యాశాఖ కోఆర్డినేటర్ శాంతికుమార్, తులసీరామ్, హదియా, వెంకటేశ్వర్, శంకర్రావు, శ్రీనివాస్, సత్యం, మల్లయ్య పాల్గొన్నారు. -
ఎస్పీఎం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్లోని సిర్పూర్ పేపరు మిల్లు(ఎస్పీఎం) గుర్తింపు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. డీసీఎల్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ యాజమాన్యం హైకోర్టు పరిధిలోని లేబర్ కోర్టును ఆశ్రయించగా, శుక్రవారం ఆ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. గతేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ను ఎన్నికల అధికారిగా నియమించారు. అక్టోబర్ 27న కార్మిక సంఘాలు, మిల్లు ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం సైతం నిర్వహించారు. అయితే యాజ మాన్యం సమావేశానికి గైర్హజరై కోర్టును ఆశ్రయించింది. పలు కార్మిక సంఘాల నాయకులు రిట్ పిటిషన్ను దాఖలు చేసి న్యాయవాదులతో వాదనలు వినిపించారు. కోర్టు ఈ కేసును రిజర్వులో ఉంచి.. శుక్రవారం యాజమాన్యం వేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. నాయకుల సంబురాలుకోర్టులో సానుకూలంగా తీర్పు రావడంతో కార్మిక సంఘం నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు మాట్లాడుతూ కార్మికుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ న్యాయవాది లక్ష్మీనారాయణ ద్వారా బలమైన చర్యలు చేపట్టారన్నారు. ఎన్నికల ప్రక్రియను కార్మిక శాఖ అధికారుల ద్వారానే నిర్వహించాలనే లక్ష్యంతో పూర్తి సహకారం అందించారన్నారు. అనంతరం స్థానికంగా టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్, మనోహర్, శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా భీమయ్యక్ జాతర
తిర్యాణి మండలం దంతన్పల్లిలోని భీమయ్యక్ ఆలయ సమీపంలో శుక్రవారం జాతర అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా ఆదివాసీలు ఆలయంలో సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ జాతరకు హాజరై మాట్లాడారు. భీమయ్యక్ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నీటి సదుపాయం, రోడ్డు, షెడ్డు నిర్మించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం గంగారాం, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆత్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. – తిర్యాణి జాతరలో ఆదివాసీల కోలాహలంమాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆదర్శనగర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానాచార్యులు శ్రీవాణి శుక్రవారం తెలిపారు. ఈ నెల 8న మంచిర్యా ల జిల్లాలో నిర్వహించిన విభాగ్ స్థాయి ఖేల్కూద్ పోటీల్లో పాఠశాలకు చెందిన సోనాక్షి, విష్ణుశ్రీ, ఎస్కే ఫౌజియా, ఎ.అక్షర 800 మీట ర్ల పరుగు పందెం, సిద్దిక్ క్యారమ్లో ప్రథమ బహుమతి సాధించారని తెలిపారు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
కాగజ్నగర్టౌన్: వేతనాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో కాగజ్నగర్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు 18 రోజులుగా చేస్తున్న సమ్మెను శుక్రవారం రాత్రి విరమించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ దండె విఠల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. సోమవారం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వేతనాలను మంజూరు చేశారని తెలిపారు. కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమయ్యాయని, సోమవారం కార్మికుల ఖాతాలోకి జమ చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాగజ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇటీవలే నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలతో కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడిందని, కార్మికులు వేతనాల నుంచి కోత విధిస్తున్నా పీఎఫ్ డబ్బులను కూడా వారి ఖాతాల్లో జమ చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల వేతనాల కోసం ప్రస్తుతం రూ.2 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారని తెలిపారు. అలాగే పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే పారిశుద్ధ్య పనుల్లోకి పంపించాలని అధికారులను ఆదేశించారు. బకాయి పన్నులను వార్డు ఆఫీసర్లు వసూలు చేయకపోవడంతోనే ఈ సమస్య దాపురించిందని, పెద్ద కంపెనీల నుంచి బకాయిలను వసూలు చేయాలని సూచించారు. దుబారా ఖర్చులు పెరిగాయేగానీ, ఆదాయం పెరగడం లేదన్నారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రెండేళ్ల క్రితం వినాయక నిమజ్జనంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న కార్మికుడు మృతి చెందగా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించలేదని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ మధుకర్, సీఐటీయూ నాయకులు త్రివేణి, కూశన రాజన్న, ముంజం శ్రీనివాస్, ఆనంద్కుమార్, రాజేందర్, శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల విజయం
● సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కూశన రాజన్న కార్మికుల తరఫున సిర్పూరు పేపరు మిల్లు మ జ్దూర్ యూనియన్ ఎంతో పోరాటం చేసిందని, హైకోర్టు వెలువర్చిన తీర్పును కార్మికుల విజ యంగా భావిస్తున్నామని సిర్పూరు పేపరు మి ల్లు మజ్దూర్ యూనియన్(సీఐటీయూ ఈ – 2510) ప్రధాన కార్యదర్శి కూశన రాజన్న పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిల్లు యజమాన్యం ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించింద ని, కార్మికులకు అన్యాయం జరుగకూడదని యూనియన్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఎన్నికల ప్రక్రియపై స్టే రాకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. కౌంటర్ పిటిషన్ వేసి హైకోర్టులో న్యాయవాది ఆబిద్ హుస్సేన్ ద్వారా వాదనలను వినిపించామన్నారు. కార్మిక శాఖ అధికారులు చొరవ తీసుకుని ఎన్నికల తేదీలను ప్రకటించాలని, లేనిపక్షంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముంజం శ్రీనివాస్, రాజన్న, అంగల శ్రీనివాస్, ఆర్.రాజన్న, భూమయ్య, ముంజం ఆనంద్కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కప్ పోటీల్లో సత్తా చాటాలి
ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరిగే సీఎం క్రీడా కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం యువజన క్రీడా సేవల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడల టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్తో కలిసి టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు నిర్వహించి, విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ నుంచి కుమురంభీం చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సంచాలకుడు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల నియంత్రణ
ఆసిఫాబాద్: నేరస్తులకు కోర్టులో శిక్ష పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా ప్రజలకు పోలీసు శాఖపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కోర్టు కానిస్టేబుల్ కీలకమైన బాధ్యతని, ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన సాక్షాలు కోర్టుకు సమర్పించడంపై దృష్టి సారించాలన్నారు. కోర్టు సమాచా రం, ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్హెచ్వోకు తెలియ జేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ సతీశ్, సీఐలు, ఎస్సైలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా సదరం ధ్రువపత్రాల జారీ
ఆసిఫాబాద్అర్బన్: సదరం శిబిరాల్లో పారదర్శకంగా ధ్రువపత్రాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపులను గురువారం సందర్శించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సదరం శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన వారికి ధ్రువపత్రాలు అందించాలన్నారు. దివ్యాంగులు, వారి సహాయకులకు తాగునీరు, నీడ, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయంలోనే పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్యులకు సూచనలు చేశారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఏ రామకృష్ణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ధ్యానంతో వ్యక్తిత్వ వికాసం
రెబ్బెన: ధాన్యం వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. హార్ట్ ఫుల్నెస్ సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు గంటపాటు ధ్యానంపై అవగాహన కల్పించి సాధన చేయించారు. జీఎం మా ట్లాడుతూ ధ్యానంతో రుగ్మతలు తగ్గి సంపూర్ణ ఆరో గ్యం చేకూరుతుందన్నారు. ఏకాగ్రత పెరుగుతుంద ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, హార్ట్ ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు దీపక్, జయలక్ష్మి, రాజన ర్సు, మహేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకురాలికి డాక్టరేట్
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇట్నూరి శారద డాక్టరేట్ పట్టా పొందినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి గురువారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రేమలత పర్యవేక్షణలో డిజైన్, సింథసిస్ అండ్ కంప్యూటేషనల్ స్టడీస్ ఆఫ్ ఇండోల్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం శారదకు డాక్టరేట్ ను ప్రకటించింది. శారదను ప్రిన్సిపాల్తోపా టు అధ్యాపకులు లక్ష్మీనరసింహం, జనార్ధన్, రాజేశ్వర్, కృష్ణవేణి, దేవేందర్, రోజ్మేరి, సాంబవి, సానియా అభినందించారు. -
డార్ఫ్ దంపతుల సేవలు ప్రశంసనీయం
కెరమెరి: హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసీలకు చేసిన సేవలు ప్రశంసనీయమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జైనూర్ మండలం మార్లవా యిని గురువారం సందర్శించారు. ఈ నెల 11న నిర్వహించే డార్ఫ్ దంపతుల వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులకు దుప్పట్లు అందించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాప్రాముఖ్యత, క్రమశిక్షణ, అలవాట్లు, తదితర విషయాలపై అవగాహన కల్పించా రు. చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. వర్ధంతి కార్యక్రమంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, ఎస్సై రవీందర్, సర్పంచ్ కనక ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన అవసరమని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాలు వేగంగా నడిపితే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, హెచ్ఎం కవిత, ఉపాధ్యాయులు లక్ష్మణ్, హేమంత్ షిండే, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’మిత అల్పాహారం!
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అందించే అల్పాహారంపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. తరగతులు జరిగినన్ని రోజులు కాకుండా పరిమిత రోజులకు కుదించడం, ఒక్కపూట అల్పాహారం నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది అక్టోబర్ ఆరు నుంచి సాయంత్రం పూట ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత రెండు పూటల తరగతులకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు నిధులు మంజూరు చేస్తూ విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వరకు వినియోగించాలని, 19పని దినాలకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15చొప్పున వెచ్చించాలని పేర్కొన్నారు. నెలల తరబడి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా.. మొక్కుబడిగా 19రోజులకే అల్పాహారం పరిమితం చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజుల్లోనే ఎందుకు..! పదో తరగతి విద్యార్థులు మూడు నెలలుగా సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంటల వరకు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యం అవుతుండడంతో ఆకలితో అలసట, నీరసించి చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. మార్చి 14న వార్షిక పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంపునకు సంక్రాంతి తర్వాత నుంచి రెండు పూటల ప్రత్యేక తరగతుల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఉదయం 8.15గంటల నుంచి 9.15గంటల వరకు తరగతుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పీఎంశ్రీ పాఠశాలలు మినహాయిస్తే 91 పాఠశాలల్లోని 2,885మంది విద్యార్థులకు సంబంధించి రూ.8.16లక్షలు మంజూరయ్యాయి. కేవలం 19రోజులకే పరిమితం చేయడంతోపాటు సాయంత్రం పూటకు అరకొరగా కేటాయించారు. గత ఏడాది ఫిబ్రవరి 1నుంచి మార్చి 20వరకు పాఠశాలలు నడిచే రోజుల్లో అల్పాహారం అందించారు. అప్పుడు 38రోజులు అల్పాహారం అందించగా ఈ ఏడాది సగానికి కుదించడం విమర్శలకు తావిస్తోంది. ఫిబ్రవరి 16నుంచి మార్చి 10వరకు నిధులు వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఎం బ్రేక్ఫాస్ట్.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గతంలో సీఎం బ్రేక్ఫాస్ట్ అందించేవారు. బడికి వచ్చేవారికి 45ని మిషాల ముందు అల్పాహారం వడ్డించేవారు. సోమవారం ఇడ్లి, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరి, ఆలుకుర్మా లేదా టమాటా బాత్, సాంబార్, బుధవారం ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ ఇలా రోజుకొకటి చొప్పున మెనూలో పొందుపర్చారు. తర్వాత కాలంలో నిధులు మంజూరు కాకపోవడం, నిర్వాహకులు ముందుకు రాక సీఎం బ్రేక్ఫాస్ట్ నిలిచిపోయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేకపోగా.. సాయంత్రం పరిమితం చేయడంతో విద్యార్థులకు ఆకలి కష్టాలు తప్పేలా లేదు. -
రాష్ట్రస్థాయిలో రాణించాలి
రెబ్బెన: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటి స్థానంలో నిలవాలని డీవైఎస్వో అష్వక్ అహ్మద్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం బాల్బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో డీవైఎస్వోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రవితేజ, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, పీఈటీ భాస్కర్, కోలిండియా కోచ్ రాకేశ్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, శ్రీకాంత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సామర్థ్యాల గుర్తింపునకు ‘ఎఫ్ఎల్ఎస్’
కెరమెరి: విద్యా ప్రమాణాల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. జాతీ యస్థాయిలో పలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గ తంలో 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించిన న్యాస్ పేరును ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్)గా మార్చింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థుల విద్యాసామర్థ్యాల గుర్తింపునకు ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, మాక్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు.. మూడో తరగతి విద్యార్థులను విద్యా సామర్థ్యాలను పరీక్షించాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్సీఈఆర్టీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర కు పిల్లలకు చదవడం, రాయడంతోపాటు గణితంలో నాలుగు రకాల లెక్కలు చేయడంపై జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో ఈ ప్రక్రియను నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పే రుతో నిర్వహించేవారు. ప్రస్తుతం దానిస్థానంలో పలు మార్పులు చేసిన ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్)ను ప్రవేశపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణితం సబ్జెక్టుల్లో విద్యా సామర్థ్యాలను పరి శీలించనున్నారు. జిల్లాలో 1,253 పాఠశాలల్లో 8,480 మంది మూడో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి మాత్రమే ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించనున్నారు. కొనసాగుతున్న నమూనా పరీక్షలు జిల్లాలోని పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎస్ పరీక్ష కోసం వి ద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. ప్రధాన పరీక్షకు ముందు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక మాక్ టెస్టు పూర్తయ్యింది. ఈ నెల మూడోవారంలో రెండో మాక్ టెస్టు, ఫిబ్రవరి రెండో వారంలో చివరి టెస్టు నిర్వహించనున్నారు. అధిక మార్కులు సాధించేందుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.చదవడం, రాయడం, లెక్కించడంపై దృష్టిఇప్పటికే తొలి మాక్ టెస్టు పూర్తయ్యింది. దీని ఆధారంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తున్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మాక్ టెస్టులో 18 ప్రశ్నలు ఉండగా, ఇందులో 8 మౌఖిక, 8 రాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. మొదటి పరీక్షలో కొంత వరకు సులువైన ప్రశ్నలు ఇచ్చారు. చదవడం, రాయడం, అంకెలు, సంఖ్యలను గుర్తించడం వంటివి చేయిస్తున్నారు. ఐదు ప్రశ్నల్లో నాలుగింటిని గుర్తిస్తే 80 మార్కులు వేస్తున్నారు. నాలుగింటి కంటే తక్కువ ప్రశ్నలు గుర్తిస్తే.. అలాంటి విద్యార్థులకు మరింత శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. చదవడం, రాయడంతోపాటు లెక్కించడంపై దృష్టి సారిస్తున్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘ప్రజాబాట’
దహెగాం: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రా న్స్కో ఎస్ఈ జాడే ఉత్తమ్ అన్నారు. మండలంలోని లగ్గాంలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ పొలాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉంటే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రైతులు 1912 టోల్ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంఆర్టీ సహాయక ఇంజినీర్ శ్రీనివాస్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీర్ వెంకటేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మబోతే అడవి..
నిల్వ చేస్తే కొరివిఇక్కడ పత్తి నిల్వను చూపుతున్న రైతు పేరు రాంటెంకి రవి. దహెగాం మండలంలోని కోత్మీర్ గ్రామానికి చెందిన ఈయన వర్షాకాలంలో 14 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇప్పటివరకు 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకున్నాడు. ధర క్వింటాలుకు రూ.వంద తగ్గడంతో అమ్మకుండా ఇంటి వద్దే ఉంచాడు. కాలం కలిసి రాక పత్తి దిగుబడి తగ్గిందని, దానికి తోడు మద్దతు ధర లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంటి ఆవరణలో నిల్వ చేసిన పత్తిని చూపిస్తున్న ఈ రైతు కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి గ్రామానికి చెందిన మెంథ్యాల రాజేశ్. ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాలేదు. ఇప్పటివరకు తీసిన సుమారు 70 క్వింటాళ్ల పత్తిని అమ్మకుండా ఇంటి ఆవరణలో కవరు కప్పి ఉంచాడు. ధర నిలకడగా లేకపోవడంతో నష్టపోతామని చెబుతున్నారు. వీరే కాదు.. జిల్లాలో అనేక మంది అన్నదాతలు పత్తి సాగు చేస్తున్న రైతులు పంటను అమ్ముకోకుండా ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. దహెగాం: పత్తి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆశించిన ధర వస్తుందని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంది. ఓ వైపు సీసీఐ క్రమంగా మద్దతు ధరలో కోత పెడుతుండగా, ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కూడా అన్నదాతలను దోపిడీకి గురిచేస్తున్నారు. పత్తితీత పనులు నెల రోజుల నుంచి ముమ్మరం కాగా ధర మాత్రం తగ్గింది. తగ్గిన దిగుబడిఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. యూరియా కొరత, అధిక వర్షాలతో మొక్కల్లో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. భారీ వర్షాల ప్రభావం పూత, కాతపై పడింది. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 7 నుంచి 8 క్వింటాళ్లు వచ్చింది. సీజన్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా పడలేదు. జూలైలో వర్షాలకు మొలకలు వచ్చాయి. పంట ఆశాజనకంగా ఉండగా పూత, కాత దశలో భారీ వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చాయి. ఆగస్టులో పెద్దవాగు, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు భారీగా కొట్టుకుపోయాయి. మద్దతు ధరలో కోతఈ ఏడాది కాగజ్నగర్, రెబ్బెన మండలం కొండపల్లి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్(టి), కౌటాల, జైనూర్లో మొత్తం 18 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నారు. కేవలం నాలుగు నుంచి ఐదు జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే ప్రైవేటు కొనుగోళ్లు సాగుతున్నాయి. మొదట పత్తి క్వింటాల్కు సీసీఐలో మద్దతు ధర రూ.8,110 ప్రకటించి కొనుగోలు చేసింది. ఇరవై రోజుల్లో రెండుసార్లు మద్దతు ధరలో కోత విధించింది. రూ.వంద తగ్గించి ప్రస్తుతం సీసీఐలో రూ.8,010 చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7000 వరకు చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ ద్వారా 9,36,162 క్వింటాళ్లు, ప్రైవేటులో 23,043 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
‘మీ వెంటే దీక్ష చేస్తాం’
ఆరు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో రేయింబవళ్లు కార్యాలయం ఎదుట బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్టు కార్మికుడు మల్లేశ్ కొద్దిరోజులుగా ఇంటికి వెళ్లడం లేదు. బుధవారం ఆయన భార్య కళావతి సమ్మె శిబిరానికి చేరుకుని కన్నీంటి పర్యంతమైంది. న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాల కోసం కూడా చలిలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోరాటంలో పాలుపంచుకుని పిల్లలతో సహా వచ్చి ఇక్కడే దీక్ష చేస్తామని రోదించింది. దీంతో తోటి మహిళా కార్మికులు కళావతిని ఓదార్చారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు ఎంఈవోలు, హెచ్ఎంలు ముందస్తు ప్రణాళిక రూ పొందించాలన్నారు. విద్యార్థులు వందశాతం పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. గైర్హాజరైన వారి తల్లిదండ్రులతో తరచూ మాట్లాడాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ మూడు నెలలు కీలకమని పేర్కొన్నారు. వెనుకబడిన వారిపై దృష్టి సా రిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూ చించారు. ఎస్ఏ– 1 పరీక్షల్లో ఉత్తీర్ణతను ఆధారంగా చేసుకుని బోధన కొనసాగించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎంకు వినతి
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ నియోజవకర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాద్ ప్రగతి భవన్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు కొండా లక్ష్మ ణ్బాపూజీ పేరు నామకరణం చేసినా కాలేజీ వద్ద బోర్డు ఏర్పాటు చేయలేదని, సంబంధిత వెబ్సైట్లోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నమోదు చేయాలని కోరారు. అలాగే చత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. కార్యక్రమంలో అనుమాండ్ల జగదీష్ ఉన్నారు. -
● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాల ముప్పు ● అవగాహన లేక దూదిలో ఆటలు, నిద్ర ● శ్వాస ఆడక మృతి చెందుతున్న చిన్నారులు
కౌటాల: ఆశించిన ధర కోసం రైతులు ఇంట్లో నిల్వ చేసుకుంటున్న పత్తి పంట చిన్నారుల ఊపిరి తీస్తోంది. దూదిలో సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకునే పసివారిని విగతజీవులుగా మారుస్తోంది. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో కౌటాల మండలంలో పత్తిలో 12 ఏళ్ల బాలుడు దాగుడుమూతలు ఆడుతూ శ్వాస ఆడక మృతి చెందగా, కెరమెరి మండలం కరంజీవాడ(అంద్గూడ)లో ఈ నెల 5న 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ఇంట్లోని ఆశాదీపాలను ఆర్పివేస్తూ.. కన్నవారికి తీరని కడుపు కోతను మిగులుస్తోంది. అమ్ముదామా.. ఆగుదామా.. జిల్లాలోని రైతులు వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు ఆశించిన ధర లేక రైతులు ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.8100 ప్రకటించినా వివిధ కారణాలతో ఇటీవల సీసీఐ కేంద్రాల్లో రూ.100 తగ్గించారు. కొనుగోళ్లకు సీసీఐ అధికారులు తేమ పేరిట కొర్రీలు పెడుతుండగా, ప్రైవేట్ వ్యాపారులు క్వింటా పత్తికి రూ.7 వేల వరకే చెల్లిస్తున్నారు. అమ్ముదామా.. ఆగుదామా.. అనే సంశయంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఇంకా మొదట తీసిన పత్తిని కూడా అమ్ముకోలేదు. దిగుబడి లేకపోవడంతో రెండో విడతకే మొత్తం పత్తితీత పూర్తవుతుంది. ఇళ్లలోనే నిల్వ పత్తి ధర పెరుగుతుందేమో అనే ఆశతో చాలామంది పంట దిగుబడులు ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. పెట్టుబడి పెరిగినా.. దిగుబడి తగ్గడంతో అనుకున్న రేటు వచ్చినప్పుడే అమ్ముకుందామని వేచి చూస్తున్నారు. ఇది కొందరి పాలిటశాపంగా మారుతోంది. అవగాహన లేకపోవడం, భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తోంది. విద్యుత్, అగ్ని ప్రమాదాలతో వేలాది క్వింటాళ్ల పత్తి కాలిపోయి రైతులు నష్టపోతున్నారు. జనవరిలో సంక్రాంతి పండుగ సెలవులు వస్తుండటంతో పిల్లలు ఇళ్లకు చేరుకుంటున్నారు. స్నేహితులతో కలిసి పత్తిలో ఆడుకుంటున్నారు. ఇది వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. రైతు ఇంట్లో నిల్వ ఉన్న పత్తి(ఫైల్) -
గంగాపూర్ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
రెబ్బెన: గంగాపూర్లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర మహోత్సవంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. మండలంలోని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావు, దేవాదాయశాఖ అధికారులతో కలిసి జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా వరుస క్రమంలో వెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, వాహనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ స్థలం, దుకాణ సముదాయాలు క్రమపద్ధతిలో ఉండేలా చూడాలని, పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రెబ్బెన నుంచి గంగాపూర్ వరకు రహదారిపై దుమ్ము లేవకుండా ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ కోతలు లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బస్సులు నడిపించాలని, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి, పంచాయతీరాజ్, విద్యుత్, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘మార్లవాయి ప్రగతికి పచ్చజెండా’
ఆసిఫాబాద్అర్బన్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ ప్రగతికి ప్రజా ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో మార్లవాయి గ్రామాన్ని సందర్శించి అక్కడి చరిత్ర, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. స్పందించిన సీఎం రేవంత్రెడ్డి గ్రామాభివృద్ధికి రూ.91 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో ప్రొ.హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ల కాంస్య విగ్రహాలు, స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీకి ఆహ్వానం కెరమెరి: జైనూర్ మండలం మార్లవాయిలో ఈ నెల 11న నిర్వహించే హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ల వర్ధంతికి హాజరుకావాలని ఎస్పీ నితిక పంత్ను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహణ కమిటీ సభ్యులతో మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిశారు. -
సురక్షిత ప్రయాణమే లక్ష్యం
● రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమాసింగ్ ఠాకూర్ కాగజ్నగర్రూరల్: రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే తమ లక్ష్యమని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమాసింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కాగజ్నగర్లోని రైల్వేస్టేషన్లో బుధవారం రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐజీ మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మోసాలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆర్పీఎఫ్ కేవలం ఆస్తుల రక్షణకే పరిమితం కాకుండా మహిళల భద్రత, పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్కుమార్, కాగజ్నగర్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమణకుమార్, కాజిపేట జీఆర్పీ సీఐ నరేశ్కుమార్, ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టు వీడని కార్మికులు
కాగజ్నగర్రూరల్: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 17 రోజులుగా సమ్మె చేస్తున్న కాగజ్నగర్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పట్టు వీడటం లేదు. ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో య థావిధిగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఐదు రో జులుగా కార్యాలయంలోకి అధికారులను వెళ్లనీయకుండా గేటు ఎదుటు బైఠాయిస్తున్నారు. మున్సిపాలిటీలో 188 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా, 124 మంది పారిశుద్ధ్య పనులు, మిగతా వారు తాగునీరు, విద్యుత్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో నుంచి 15 మందిని ఆఫీసు కా ర్యకలాపాల కోసం కేటాయించారు. వీరికి మాత్రం వేతనాలు ఇచ్చి.. తమను విస్మరించడంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. అధికారుల అడుగులకు మడుగులొత్తే వారికి కార్యాలయంలో విధులు కల్పించి వేతనాలను చెల్లిస్తున్నారని ఆరోపించారు. డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల మద్దతు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు బుధవారం డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులు మద్దతు పలికారు. కార్మికులతో కలిసి సమ్మెలో కూర్చున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిందని, కనీసం తాగునీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనిత, వినోద, మహిళలు పాల్గొన్నారు. -
‘కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగట్టాలి’
రెబ్బెన: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం నిర్వహించిన ఏఐటీయూసీ గేట్మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీన పరుస్తూ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కొత్త గనుల ఏర్పాటు, కార్మిక సమస్యలపై మాట్లాడటానికి తెలంగాణకే తలమానికంగా ఉన్న సింగరేణికి శాశ్వత సీఅండ్ఎండీని నియమించాలన్నారు. తాడిచర్ల 2 గనిని జెన్కోకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 20 మంది మహిళా కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారికి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. బ్రాంచి కా ర్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, జీఎం కమిటీ సభ్యులు శేషశయన రావు, రాజేశ్, సహాయ కార్యదర్శి ఓదెలు, ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు -
కుమురం భీం
7పల్లెల సమస్యలు తీర్చుతూ రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సర్పంచులు, వార్డు సభ్యులు ముందుకు సాగుతున్నారు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి ఉష్ణోగ్రత మరింత పడిపోతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. చల్లగాలులు వీస్తాయి. గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’ గురుకులాలు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష రాసేవారికి ప్రభుత్వం ‘సాధన’ పుస్తకం పంపిణీ చేయనుంది. 8లోuబుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026 -
ధ్యానంతో మానసిక ప్రశాంతత
రెబ్బెన: ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు, సింగరే ణి అధికారులు, ఉద్యోగులకు గంట పాటు ధ్యానంపై అవగాహన కల్పించి సాధన చే యించారు. మూడు రోజుల పాటు ధ్యాన శిక్షణ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు దీపక్, జయలక్ష్మి, రాజనర్సు, ఏరియా ఇంజనీరు కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్కుమార్ బెహరా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రధానమంత్రి కృషి సంచాయ్ పనుల పరిశీలన
లింగాపూర్: మండలంలోని జాముల్ధర, వంకామద్ది గ్రామాల్లో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం (2.0)లో భాగంగా చేపట్టిన పనులను మంగళవారం జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల అధికారి డాక్టర్ సాంబశివరావు పరిశీలించా రు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆంజనేయులు, జాముల్ధర సర్పంచ్ జుగనాక గంగాదేవిరమేశ్, టెక్నికల్ అసిస్టెంట్ షేక్ హైమాద్, బోడ తిరుపతి, ఏపీఎం సూర్యకాంత్, పంచాయతీ కార్యదర్శి పాపయ్య పాల్గొన్నారు. -
వినాయకుడికి ఘనంగా పూజలు
ఆసిఫాబాద్అర్బన్: అంగారిక చతుర్థి పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ గణపతి దేవాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వా రికి అర్చకులు ఒజ్జల శిరీష్శర్మ, శ్రీనివాస్శర్మ ల ఆధ్వర్యంలో అభిషేకం అష్టోత్తర శతనా మావళి, గరికపూజ, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. చతుర్థి సందర్భంగా భక్తులు రాత్రి 9 గంటలకు చంద్రోదయం తర్వాత ఉపవాసదీక్షలు విడిచారు. ప్రత్యేక పూజలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. -
9లోగా అభ్యంతరాలు సమర్పించాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డు ల వారీగా ఓటరు జాబితాపై ఈ నెల 9లోగా అభ్యంతరాలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీప క్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించామని, జా బితాలో పొందుపరిచిన వివరాలను ప్రతీ ఓటరు పరిశీలించుకోవాలన్నారు. జాబితాలోని పేర్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 9లోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13,905 మంది ఓటర్లు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతీఒక్కరు పాటించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీపోల్యాప్లో వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించుకోవచ్చని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు బూతుస్థాయి ఏజెంట్లు సహకరించాలని తెలిపారు. సమావేశంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్లు గజా నంద్, రాజేందర్, పట్టణ ప్రణాళికా అధికారి య శ్వంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్’కు సై!
ఆసిఫాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్ నగారా మోగనుంది. రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాచుకుంది. కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబా ద్ మున్సిపాలిటీలో తొలిసారి మున్సిపల్ ఎన్ని కలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని పార్టీలు కసరత్తు ప్రా రంభించాయి. రాజకీయ పార్టీలు వార్డుల వారీ గా ఓటర్లు, సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటున్నాయి. ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవాలని కసరత్తు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో విజ యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల పదవీ కాలం గతేడాది జనవరిలో ము గియగా, 11 నెలలుగా ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. జిల్లాలో 65,110 మంది ఓటర్లు జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం 65,110 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 31,125 మంది పురుషులు, 33,985 మంది మహిళలు ఉన్నారు. ఆసిఫాబా ద్ మున్సిపాలిటీలో జిల్లా కేంద్రంతో పాటు గొడవెళ్లి, జన్కాపూర్ గ్రామాలు కలిపి 20 వా ర్డులు ఉండగా, 13,905 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో 6,811 మంది పురుషులు, 7,092 మంది మహిళలు ఉన్నారు. కాగజ్నగర్లోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉండగా 25,004 మంది పురుషులు, 26,193 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే పలుమార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తాజాగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మంది రంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల య్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసొస్తే..రిజర్వేషన్లు కలిసొస్తే మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఆశావహులకు రిజర్వేషన్లపై గుబులు పట్టుకుంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు. తొలిసారి ఎన్నికలు జరుగుతున్న ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో బీసీల జనాభా అధికంగా ఉండడంతో రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఆయా సామాజిక వర్గాల వారు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. రిజర్వేషన్లు కలిసొస్తే పలువురు రాజకీయ నాయకులు పోటీకి సై అంటున్నారు. ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగే ఎన్నికల్లో చైర్మన్తో పాటు మెజారిటీ కౌన్సిలర్లను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాగజ్నగర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో పక్కా ప్లాన్ వేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు, ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. -
కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత
కాగజ్నగర్రూరల్: మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్రిక్తతంగా మారింది. మంగళవారం రాత్రి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇందులో శంకరమ్మ అనే కార్మికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వెంటనే ఆమెను చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కార్యాలయంలోనికి వెళ్లే యత్నం..గత నాలుగు రోజులుగా మున్సిపల్ కార్యాలయంలోకి కమిషనర్తో సహా సిబ్బందిని వెళ్లనీయకుండా కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో అధికారులు పోలీసుల సహాయంతో మంగళవారం రాత్రి కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్ర యత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కాగా కార్మికులకు రావాల్సిన వేతనాల కోసం న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్నార ని, కార్మికులకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్కుమార్, రాజేందర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసులతో సమ్మెను అణిచివేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకుండా రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలన్నారు. చర్చలు విఫలం..గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార యంత్రాంగం వేతనాలను అందించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ స్పెషల్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కమిషనర్ రాజేందర్ సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి. మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్మికులతో చర్చలు జరిపారు. ఒక నెల వేతనం మాత్రమే రెండు, మూడు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో అంగీకరించని కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తామని పేర్కొంటూ చర్చల నుంచి వెళ్లిపోయారు. -
ఊరెళ్తున్నారా.. సమాచారం ఇవ్వండి
ఆసిఫాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న జిల్లా వాసులు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సమేతంగా ఊరెళ్తుండడంతో చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడుతారని పేర్కొన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, తదితర విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకూడదని, ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చోరీలను నివారించవచ్చని, ప్రశాంతంగా పండుగ జరుపుకోవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని సూచించారు. -
రోడ్డు భద్రత.. జీవితానికి రక్ష
జిల్లాలో జాతీయ రహదారితో పాటు అంతర్రాష్ట్ర రహదారులున్నాయి. వీటిపై నిత్యం వేలాది వాహనాలు అధికలోడుతో వెళ్తుండటంతో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రవాణాశాఖ, పోలీస్శాఖ అధికారులు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – కౌటాల జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, రహదారి భద్రత నియమాలు పాటించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏటా జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కల్పిస్తుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన 39 జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈ నెల 31 తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రమాదాల్లో యువత..మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణించే వారిలో ఎక్కువ సంఖ్యలో యువకులే ఉండడం కలిచివేసే అంశంగా ఉంది. అలాగే ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రమాదాల నివారణకు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ నియమాలు, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారిని కఠినంగా శిక్షించాలి. మైనర్లు బైక్లు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్లో 3,757 కేసులు నమోదు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 267 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో పలువురు మృతి చెందారు. అవగాహన కార్యక్రమాలు..‘వాహనదారులు ఒక్క క్షణం ఆలోచించండి.. రహదారి భద్రత నియమాలు పాటించండి.. ప్రాణం తీసే అతివేగాన్ని వదలండి.. ప్రమాదాల బారిన పడి కుటుంబాలకు దూరం కాకండి.. మిమ్మల్ని నమ్ముకున్న వారికి కన్నీటిని మిగల్చకండి’ అంటూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులకు రహదారి భద్రత ఆవశ్యకతను వివరిస్తున్నారు. ‘రహదారి భద్రత.. మన జీవన భద్రత’ అని 39వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా పలు చోట్ల ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణం, ఆయా మండల కేంద్రాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 40కి పైగా ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నియంత్రణకు మూల మలుపుల గుర్తింపు, స్పీడ్ బ్రేకర్లు, సూచికలు ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా నడిపితే ప్రమాదాలు.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల భద్రత, రక్షణ ధ్యేయంగా పోలీస్శాఖ పని చేస్తుంది. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రమాదాలతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏటా రోడ్డు ప్రమాదాల్లో యువకులు, కుటుంబ పెద్దలు మృతి చెందుతుండడంతో కుటుంబాలు దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. – నితిక పంత్, ఎస్పీ రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు (ఫైల్) -
బాలికల భవిష్యత్తుకు టీకా
ఆసిఫాబాద్అర్బన్: మహిళల్లో అధికంగా వస్తున్న గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లాలో 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇదివరకే పీహెచ్సీల వారీగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి చేసింది. బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖరీదైన వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వనున్నారు. 100కు పైగా కేసులు నమోదు..మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుందని అధికారులు చెబుతున్నారు. వైరస్ శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నయం కావడానికి అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ అవగాహన లేమితో చాలా మంది పరీక్షలు చేయించుకోకపోవడంతో దీని బారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈక్రమంలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణయించింది. ఉత్తర్వులు రాగానే టీకాలు 14 సంవత్సరాల వయస్సు నిండిన బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకే వైద్యాధికారులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టీకాలు వేస్తాం. ఈ టీకా ద్వారా 83శాతం సర్వైకల్ క్యాన్సర్ సోకకుండా నియంత్రించవచ్చు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నియంత్రణకు టీకా రక్షణ కల్పిస్తుంది. – సీతారాం, డీఎంహెచ్వోజిల్లా వ్యాప్తంగా సర్వే..సర్వైకల్ క్యాన్సర్ను నియంత్రించే హెచ్పీవీ టీకాను కిశోర బాలికలకు ఇవ్వాలని నిర్ణయించిన దృష్ట్యా దీనిపై ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. వైద్యారోగ్య లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 4వేల మంది కిశోర బాలికలు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వారికి ఒక డోసు హెచ్పీవీ టీకా వేస్తే భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
కౌటాల: ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. సోమవారం బోదంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించా రు. పాఠశాలలోని సౌకర్యాలు, విద్యాప్రమాణాలు, తరగతి గది నిర్వహణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకా రం భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలన్నారు. అనంత రం మండల కేంద్రంలోని శ్యామ్ మోడల్ పాఠశాల ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంఈవో గావుడే హన్మంతు ఉన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలిఆసిఫాబాద్రూరల్: వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితా ల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కేజీబీవీ పాఠశాలల ఎస్వోలు, ప్రిన్సి పాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అర్థమయ్యేరీతిలో విద్యాబోధన చేయాలన్నారు. వందశా తం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకో వాలన్నారు. విద్యాశాఖ ఎస్వో అబిద్ అలీ, కేజీబీవీ ఎస్వో భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ వైద్యం.. ప్రాణాంతకం!
చింతలమానెపల్లి: వైద్యంపై కనీస పరిజ్ఞానం లేని ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స రోగులకు ప్రాణ సంకటంగా మారింది. అర్హత లేకున్నా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతగా మందులు రాయ డం, పరిధికి మించి ఇంజక్షన్లు వేయడం, మందులు విక్రయించడం చేస్తున్నారు. కొంతమంది కొన్ని నెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసి ఆతర్వాత నేరుగా వైద్యం అందించేందుకు గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు బేఖాతర్గతంలో ప్రభుత్వాలు వైద్యం అందించడాన్ని సేవగా భావించి కొంతమేరకు నిబంధనలతో అనుమతులు ఇచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఆర్ఎంపీలు లాభాపేక్షతో ధనార్జనే ధ్యేయంగా క్లినిక్లలో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స కేంద్రాలను నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ దీనిని బేఖా తరు చేస్తూ ఏకంగా భవనాలలో పడకలను ఏర్పా టు చేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్ల పేరిట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకే గ దిలో నిర్వహిస్తున్నారు. మందులు విక్రయించేందు కు ఫార్మసిస్టుగా అర్హత ఉండాలి. కానీ అవేం లేకుండానే ఆర్ఎంపీలే రక్తం సేకరించడం, మందులు ఇవ్వడం చేస్తున్నారు. హద్దులు దాటి చేస్తున్న ఈవైద్యం రోగుల ప్రాణాలకు సంకటంగా మారింది. పునరావృతమవుతున్నా.. ఆర్ఎంపీల వైద్యం వికటించి 2023లో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అధిక డోస్తో ఇంజక్షన్లు చేయడంతో అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లుగా చికిత్స అందించిన వైద్యులు బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 2024, 2025లో సైతం జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు మృత్యువాత పడ్డారు.దుష్పరిణామాలెన్నో..జ్వరం, నొప్పిలాంటి రుగ్మతలను తగ్గించడానికి ఆర్ఎంపీలు అనుమతిలేని స్టెరాయిడ్, హైలెవల్ యాంటిబయాటిక్ మందులను వినియోగిస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు వినియోగించే మందులను సైతం నేరుగా ఆర్ఎంపీలు వినియోగిస్తున్నారు. అనుభవం లేని వైద్యులు అందించే పెయిన్ కిల్లర్లు విరివిగా వినియోగిస్తుండడంతో మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల డయాలసిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెద్ద రోగాలకు వినియోగించే యాంటిబయాటిక్లను విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగి శరీరం స్పందించడంలేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగం నయం చేయడం కష్టంగా మారిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యం అందకపోవడమే..గ్రామాల స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ వై ద్యం అందకపోవడంతోనే రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయించడానికి కారణంగా తెలుస్తోంది. సరిపడా వైద్య వసతులు లేకపోవడం, వై ద్యులు అందుబాటులో లేకపోవడం, గ్రామాలలో సబ్సెంటర్లు ఉన్నా ఏఎన్ఎంలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రభుత్వ వైద్యం గ్రామీణ ప్రజలకు అందడంలేదు. ప్రజలు ఉన్నా ఆరోగ్య కేంద్రాలు లేకపోవడమూ కారణమే. ఉదాహరణకు చింతలమానెపల్లి మండలం ఏర్పాటై పదేళ్లు కావస్తున్నా ఒకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆరోగ్య కేంద్రంలో సాయంత్రం 5గంటల వరకే విధులు నిర్వహించడంతో రోగులకు ఆర్ఎంపీలే దిక్కవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలు పరిమిత స్థాయికే పరిమితమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్రా మీణ మండలాల్లో పనిచేస్తున్న పలువురు వై ద్యులు స్థానిక ఆర్ఎంపీలు నిర్వహించే ఆసుపత్రులలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితి దాటితే చర్యలు ఆర్ఎంపీ వైద్యులు తమ పరిమితి దాటి చికిత్స చేస్తే చర్యలు తప్పవు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసు కేసులు నమోదు చేస్తాం. ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఆర్ఎంపీలు చికిత్స అందించాలి. చింతగూడ ఘటనలో పోలీసు కేసు నమోదైంది. ప్రభుత్వ వైద్యులు నిర్ణీత వేళల్లో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి. – సీతారాం, డీఎంహెచ్వో -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
రెబ్బెన: విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సో మవారం రెబ్బెన పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గంగాపూర్ జాతర ఏర్పాట్లు పరిశీలన..మండలంలోని గంగాపూర్ వద్ద నిర్వహించనున్న జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశాంచారు. ఈ కార్యక్రమంలో సీఐ సంజయ్, ఎస్సై వెంకట కృష్ణ, జాతర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన న్యాయవాదులుఆసిఫాబాద్: జిల్లా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో న్యాయవాదులు ఎస్పీ నితిక పంత్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద క్యాలెండర్, స్వీట్ అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో సీనియర్ న్యాయవాదులు బోనగిరి సతీశ్బాబు, జుమ్మిడి రాజేశ్, మంతెన చరణ్తేజ, ధీరజ్ భౌమిక్, ఇగురుపు సంజీవ్, అశోక్, జాబరి నవీన్ ఉన్నారు. ఎస్పీని కలిసిన ఆర్టీసీ కార్మికులుఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఎస్పీ నితిక పంత్ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, ఎఫ్సీఐ బోర్డు సభ్యులు పులుగం తిరుపతి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దివాకర్, జాడి లక్ష్మణ్, కార్మికులు ఉన్నారు. -
ఓటరు జాబితాలో తప్పులు సవరిస్తాం
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరి ధిలో రానున్న ఎన్నికల కోసం ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తప్పులను సవరిస్తామని మున్సి పల్ ప్రత్యేక అధికారి, ఆర్డీవో లోకేశ్వర్రావ్ తెలిపా రు. ముసాయిదా జాబితాపై పలువురు అభ్యంత రం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం అన్ని పార్టీల నాయకులతో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గజానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ వరకు అవకాశం ఉందని, రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలన్నారు. ఓటు లేనివారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదని, గతంలో ఓటు ఉండి పేరు రానివారు దరఖాస్తుల చేసుకుంటే ఎన్నికల కమిషనర్కు అందజేస్తామన్నారు. సోమవారం వరకు 15 మంది అభ్యంతరాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రతీ ఫిర్యాదు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో టీపీవో యశ్వంత్కుమార్, వివిధ పార్టీల నాయకులు చిలువేరు వెంకన్న, మాటూరి జయరాజ్, సాంగ్డె జీవన్, సలీం, నిసార్, వసంత్రావ్, మల్లికా ర్జున్, శ్రీనివాస్, నారాయణ, రాజు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రె అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ కమిషన్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కేంద్రాల ఏర్పాటు, పన్ను వసూళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 8 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించాలన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీలో ఇంటిపన్ను, ఇతర పన్నులు వందశాతం వసూలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గజానంద్, రాజేందర్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రె ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావ్తో కలి సి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అ ర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుర్గం అమ్మక్క, తమ పట్టాభూమిని కొలతలు చేసి హద్దులు వేయాలని కాగజ్నగర్ మండలం అంకుసాపూర్కు చెందిన సోగాల సోమయ్య, బీమా డబ్బులు ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణానికి చెందిన కంపె ల లలిత, తమ వ్యవసాయ భూమి పట్టా చేయాల ని చిర్రకుంటకు చెందిన రాంటెంకి అమ్ముబాయి, మరి కొంతమంది వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
కౌటాల: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యశాఖ అధికారి సీతారాం అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగద్గురు రామానందాచార్య దక్షిణ్ పీఠం నానీజ్థామ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన 18 నుంచి 55 ఏళ్లలోపు వారు మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు రక్తం దొరకడం లేదన్నారు. ఈ సందర్భంగా 111 మంది నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్కుమార్, ఎస్సై చంద్రశేఖర్, వైద్యులు రవీంద్రకుమార్, అజ్మత్, నవ త, పవన్ కళ్యాణ్రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కమిటీ సభ్యులు కాలిదాస్, పండరి, తులసీరాం, మహేంద్ర, బావుజీ, దోమాజి, తదితరులు పాల్గొన్నారు. -
చుట్టపు చూ‘పులే’..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ వచ్చిన వలస పులులు జిల్లాను విడిచివెళ్లాయి. ఇటీవల జిల్లా అడవుల్లోకి కొత్తగా వచ్చిన మూడు పులులు జిల్లా సరిహద్దులను దాటి పోయాయి. కొద్ది రోజులుగా చెన్నూరు, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ వరకు వచ్చిన ఓ మగ పులి పది రోజుల క్రితమే గోదావరి దాటి మంథని మీదుగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వరకు వెళ్లింది. మరో పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానేరు వాగు తీరం వెంబడి తిరుగుతోంది. సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాలు, పరిసర గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక జన్నారం డివిజన్లో సంచరించిన పులి ఇందన్పల్లి మీదుగా గోదావరి దాటి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతోంది. ఇలా.. కొత్తగా వచ్చిన మూడు పులులు ప్రస్తుతం జిల్లా దాటి వెళ్లిపోయాయి. ఈ పులులు మహారాష్ట్ర నుంచి తమ అనుకూల ఆవాసం కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి డివిజన్ల మధ్య ర్యాలీ, గడ్పూర్, దేవాపూర్, తిర్యాణి అడవుల మధ్య మరో పులి సంచరిస్తోంది. అలాగే, వేమనపల్లి మండలం నీల్వాయి, ప్రాణహిత తీర అటవీ పరిసర ప్రాంతాల్లో మరో పులి తిరుగుతోంది. ఆవాసం, తోడు వెతుక్కుంటూ..కొత్త పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశించగానే వాటి సంచారంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలు తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా అడవుల్లో రెండు పులులు సంచరించిన విషయం తెలిసిందే. జిల్లాలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, ఓపెన్కాస్టులు, గోదావరి తీర ప్రాంతాలతో పాటు అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులకు ఇక్కడ అనుకూలమైతేనే ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. ఇక్కడి అడవుల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే కొంతకాలం ఉంటున్నాయి. లేకపోతే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో స్థానికులకు తారసపడుతున్నాయి. అలాగే రైతుల పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఇటీవల సంచరించినవి రెండు మగ పులులుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి తోడు కోసమే ఆడపులుల కోసం తిరుగుతున్నాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఏటా చలికాలంలో పులులు తోడు వెతుక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు. కోర్లోకి వెళ్లలేక..కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల ఆవాసంగా ఉంది. అన్ని అనుకూలతలున్న వందల ఎకరాల భూమి కోర్ పరిధిలోనే ఉంది. అయితే.. ఇప్పటికీ ఒక్క పులి కూడా ఆవాసమేర్పరుచుకోలేదు. ఏటా సీజన్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్లడమే గాని పులులు ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కోర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అటవీ సమీపంలో భూములు ఉండడంతో స్థానికులకు కంట పడుతున్నాయి. మరోవైపు ప్రాణహిత, గోదావరి తీరాలతో పాటు వాగులు, వంకలు, దట్టమైన పొదల్లో ఉంటున్నాయి. అ యితే.. ఇటీవల శ్రీరాంపూర్ ఆర్కే–8 పరిస ర ప్రాంతంలో ఓ పులి కనిపించింది. భీమా రం మండలం నరసింహాపురం బస్టాప్ సమీప వాగులో దాని పాదముద్రలను అట వీ అధికారులు గుర్తించారు. ఇదే తీరుగా నెలన్నరగా పులులు జిల్లాలో సంచరించా యి. గోదావరి తీరాలు, నీటి కుంటలు, వా గుల వెంట అడవుల్లో కలియదిరుగుతున్నా యి. అయితే.. ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు జిల్లాలో స్థిర నివాసమేర్పరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగా, మళ్లీ ఆ పులులు తిరిగి జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశముందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఖాళీలే అన్నీ..
అంగన్వాడీ.. అస్తవ్యస్తంగా కేంద్రాల నిర్వహణ పై చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలంలోని అమీన్గూడ (కోయ తలండి) గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం. ఇందులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ పదేళ్ల క్రితం ప్రమోషన్పై బదిలీపై వెళ్లింది. ఎనిమిదేళ్ల క్రితం ఆయా మృతి చెందింది. అప్పటినుంచి అంగన్వాడీ కేంద్రం తెరుచుకోవడం లేదు. దీంతో పక్కనున్న తలండి అంగన్వాడీ టీచర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆ గ్రామంలోని లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. ఈ సమస్య జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉంది. తిర్యాణి: జిల్లాలో చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాలు మూసే ఉంటున్నాయి. టీచర్లు, ఆయాలు లేకపోవడమే ఇందుకు కారణం. అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు లేకపోవడంతో ఏళ్లుగా కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల టీచర్లుంటే.. కొన్నిచోట్ల ఆయాలు లేరు. కొన్ని చోట్ల ఆయాలు ఉంటే.. టీచర్లు లేరు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల ఉంది. టీచర్లు లేని చోట ఆయాలే టీచర్ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆయాలు అటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వంట చేస్తూ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా చిన్నారులకు అక్షరాలు నేర్పేవారే కరువయ్యారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల అమలుకూ టీచర్లు లేక పూర్తిగా విజయవంతం కావడం లేదు. ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్న వైనంజిల్లాలోని జైనూర్, సిర్పూర్(యూ), కెరమెరి, తిర్యాణి, లింగాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా మండలాల్లోని పీవీటీజీ ప్రాంతాల్లో చదువుకున్న మహిళల సంఖ్య తక్కువగా ఉంది. గత నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్గా, ఆయాగా పని చేయాలంటే స్థానికతను ఆధారంగా తీసుకునేవారు. వివాహానంతరం అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇలాంటి నిబంధనలతో గతంలో పలుచోట్ల ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్గా పనిచేయాలంటే కనీస అర్హత ఇంటర్తో నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. దీంతో అర్హులు లేని గ్రామాల్లో మళ్లీ ఖాళీలేర్పడే అవకాశముంది. ఈ ఖాళీల భర్తీపై డీడబ్ల్యూవో పీడీ భాస్కర్ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సృష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు వెంటనే అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో సి బ్బంది లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేయాలి. – బోగే ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శినోటిఫికేషన్ కోసం నిరీక్షణజిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్ (టి), వాంకిడి, జైనూర్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతీ కేంద్రానికి ఒక టీచర్, హెల్పర్ ఉండాలి. 1,006 కేంద్రాల్లో ప్రస్తుతం 841 టీచర్లు, 559 మంది హెల్పర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదు ప్రాజెక్టుల పరిధిలో 165 టీచర్ పోస్టులు, 447 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి సంబంధించి నేటికీ ప్రభుత్వం నుంచి సృష్టమైన ప్రకటన విడుదల కాలేదు. వందల సంఖ్యలో ఖాళీ లుండగా నిరుద్యోగులు ప్రభుత్వం నియామకాలు చేపడితే దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సా ధించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తి వారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించా రు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలన్నారు. సిలబస్ పూర్తి చేసి, రోజుకు ఒక సబ్జెక్టులో స్లిప్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు సైతం అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. -
గందరగోళంగా ముసాయిదా జాబితా
● ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో ప్రత్యక్షం కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు విడుదల చేసిన కాగజ్నగర్ ముసాయిదా ఓటరు జాబితా గందరగోళంగా మారింది. 26వ వార్డులోని జా బితాలో సీరియల్ నంబర్ 1,130 నుంచి 1350 వరకు గల ఓటర్లు 28వ వార్డుకు చెంది న వారు. అయితే వారి పేర్లను 26వ వార్డు జాబితాలో చేర్చారు. అలాగే సుమారు 50 మంది మృతుల పేర్లు తొలగించకుండానే జా బితా ప్రదర్శించారు. వార్డు నం. 24, 27, 28, 7, 8, 23 వార్డుల్లో సైతం చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి పేర్ల ను సవరించలేదు. మరికొన్ని వార్డుల్లో భర్త, తండ్రి పేర్లు లేకుండానే రూపొందించారు. ఓ టరు జాబితా తప్పుల తడకగా ఉండటంతో నాయకులు అభ్యంతరాలు సమర్పించేందు కు సన్నద్ధమవుతున్నారు. సోమవారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. తప్పిదాల ప్రభావం రిజర్వేషన్లపై పడే అవకాశముందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తప్పిదాలను సవరించాలని కోరుతున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని 14 రోజులుగా కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తుండగా, శనివారం కార్యాలయ కార్యకలాపాలను స్తంభింపజేవారు. రాత్రిపూట కార్యాలయం ఎదుట నిద్రించారు. కార్యాలయ పనులు చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం వేతనాలు అందించి.. వార్డుల్లో పనిచేసే తమకు జీతాలను అందించడం లేదని మండిపడ్డారు. వేతనాలు ఇచ్చే వరకూ పోరాడుతాంకార్మికులకు వేతనాలు ఇచ్చేంత వరకు మద్దతు ఇస్తూ పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి మున్సిపల్ కార్మికులతో కలిసి కార్యాలయం ఎదుట నిద్రించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. చర్చలు విఫలంమున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ వహీదుద్దీన్, కమిషనర్ రాజేందర్ సమక్షంలో కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రెండు నెలలకు సంబంధించిన వేతనాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వగా, మరో నెల వేతనం ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ముందుకొచ్చారు. కానీవేతనాలు చెల్లింపునకు రెండు, మూడు రోజులు గడువు కావాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు ఈ అంగీకారానికి ఒప్పుకోలేదు. ఈ రోజే వేతనాలను ఖాతాల్లో జమ చేస్తే తప్ప సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. సుమారు గంట పాటు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని నాయకులు తెలిపి బయటకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ కుమార్, శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు.. ప్రమాదాల్లో చిత్తు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలో విచ్చలవి డిగా కొనసాగుతున్న బెల్టుషాపులు, అర్ధరాత్రి వర కు లభిస్తున్న మద్యం, గంజాయితో యువత మత్తు కు బానిసలుగా మారుతున్నారు. మత్తులో వాహనా లతో రోడ్లపైకి వస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాగజ్నగర్ పట్టణంలో జరిగిన పలు ప్రమాదాలు మత్తులోనే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్లో రెండు బైక్లు ఢీకొన్ని ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. పట్టణంలోని కొన్ని కిరాణషాపుల్లో కూడా మద్యం లభిస్తోంది. అర్ధరాత్రి దాటే వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు అడపాదడపా తనిఖీ చేస్తున్నా.. వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని..పట్టణంలో రైల్వే స్టేషన్కు ఆనుకుని ఉన్న కాపువాడ, సీబాపుకాలనీ, నిజాముద్దీన్ కాలనీ, రైల్వే కాలనీలో రాత్రిపూట యువకులు గంజాయిని సేవించి మత్తులో జోగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలైన కాపువాడ, ఆర్ఆర్వో కాలనీ, సీబాబుకాలనీ, భట్టుపల్లి రోడ్, చారిగాం రోడ్, డాడానగర్, వినయ్ గార్డెన్ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. చీకటిపడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి పట్టణవాసులు జంకుతున్నారు. బస్సు, రైల్వే స్టేషన్లలో దిగిన మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల బెడద పెరిగిపోయిందని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గస్తీ పెంచుతాం రైల్వే స్టేషన్కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గస్తీని పెంచుతాం. అర్ధరాత్రి వేళల్లో బెల్టుషాపుల నిర్వహించే వా రిపై చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడితే తమకు ఫిర్యాదు చేయాలి. వెంటనే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరించడంతోపాటు నిందితులను అదుపులోకి తీసుకుంటాం. అధిక వేగంతో వెళ్లే వాహనదారులను పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్ నవంబర్ 16న కాగజ్నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మత్తులో ఓ కారు డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగ్గపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. డ్రైవర్ దుర్గం రాహుల్ను పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా, మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అధిక మద్యం సేవించడంతోనే 99 ఎంజీ ఆల్కహాల్ పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. -
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత ఉంటుంది. ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావొచ్చు. – కల్యాణి, చిర్రకుంట 400 కి.మీ.లు వెళ్లాలి నేను పెద్దపల్లి సెంటర్ మొ దటి ఆప్షన్గా, లాస్ట్ ఆప్షన్గా హైదరాబాద్ పెట్టా. కా నీ హైదరాబాద్లో సెంటర్ కేటాయించారు. పెంచికల్పేట్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఉదయం 9 గంటలకే పరీక్ష ఉండటంతో ఒకరోజు ముందుగానే వెళ్లాలి. – వినోద్కుమార్, పెంచికల్పేట్ ఆన్డ్యూటీ సౌకర్యం కల్పించాలి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేశారు. పరీక్షకు వెళ్తున్న వారికి ఆన్డ్యూటీ సౌకర్యం కల్పించకపోవడం అన్యాయం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్డ్యూటీ సౌకర్యం కల్పించాలి. – లక్ష్మణ్, ఎస్ఏ ఫిజిక్స్, ఆసిఫాబాద్ -
టెట్కు దూరభారం
ఆసిఫాబాద్రూరల్: టెట్ అభ్యర్థులకు దూరభారంతో ఇబ్బందులు తప్పడం లేదు. మొదటిరోజు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సైతం వారు చివరి ఆప్షన్లో పెట్టుకున్న పట్టణాల్లో కేంద్రాలను కేటాయించారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో ఒకరోజు ముందుగానే పట్టణాలకు వెళ్తున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. జిల్లా నుంచి 2,735 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఉపాధ్యాయులు 1,102 మంది కాగా, 1,633 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి కావడంతో నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతున్నారు.హుజురాబాద్లో రాశా నేను చింతలమానెపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. ఇటీవల హుజురాబాద్లో టెట్ రాశా. 2010 కంటే ముందు నియామకమైన టీచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి. – మానిక్రావు, సైన్స్ టీచర్ -
ఒంటరిగా బతకలేక.. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బలవన్మరణం
ఆదిలాబాద్: అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్సింగ్నగర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. 2007లో గోల్డెన్షేక్ హ్యాండ్ ద్వారా రిటైర్ అయ్యాడు. వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు. హైదరాబాద్కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘ఎల్లంపల్లి’లో నీటమునిగి కౌలురైతు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీట మునిగి కౌలురైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడ్తనపల్లికి చెందిన చిందం ఆంజనేయులు (38) గ్రామ శివారులో పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున పొలానికి నీరు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి బ్యాక్వాటర్లో పడిపోవడంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య సుమలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జోనల్ కార్యాలయం ప్రారంభంలక్సెట్టిపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కాళేశ్వరం జోన్ పరిధి జోనల్ కార్యాలయ భవనాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల భవనంలో శనివారం జోనల్ అధికారి గిరిజ ప్రారంభించారు. మంచిర్యాలలోని ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న భవనాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణానికి మార్చినట్లు తెలిపారు. జోనల్ స్థాయి సేవలన్నీ ఇక్కడి నుంచే లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు, సిబ్బంది నవీన్, ధర్మేందర్, లక్ష్మణచారి, నాగరాజు, జ్యోతి, గీతాంజలి, శిరీష, తదితరులు పాల్గొన్నారు. -
పాము కాటుకు బాలుడు మృతి
ఇంద్రవెల్లి: పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సకారంతాండలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బ ద్లుట్ దయరామ్, భాగ్యశ్రీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ (4) శుక్రవారం సాయంత్రం తోటి పిల్ల లతో కలిసి గ్రామ సమీపంలో గల రెగిచెట్టు వద్దకు వెళ్లి పండ్లు తిన్నాడు. కొంతసేపటికి స్పృహతప్పి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కాలుకు పాము కాటు వేసినట్లు అనుమానం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
చికిత్స పొందుతూ లోకో పైలెట్ మృతి
రెబ్బెన: మండలంలోని దేవులగూడ వద్ద ఆర్టీసీ లహరి బస్సును బొలెరో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైల్వే లోకో పైలెట్ జితేందర్ కుమార్ బరియా(41) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బెల్లంపల్లి రైల్వే లోకో పైలెట్గా పనిచేస్తున్న జితేందర్ బరియా తన తోటి అసిస్టెంట్ లోకో పైలెట్ అమిత్ శర్వన్తో కలిసి గత నెల 23న తెల్లవారు జామున బొలెరోలో రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యలో దేవులగూడ వద్ద జాతీయ రహదారిపై ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ లహరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో బొలెరో బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో బొలెరో డ్రైవర్ కొమరే విజయ్ (25) అదే రోజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జితేందర్ బరియాను హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని స్వస్థలం రాజస్థాన్లోని కోటా జంక్షన్. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. -
అడవిజంతువు దాడిలో ఏడు గొర్రెలు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్లో అల్లంల రమేశ్కు చెందిన ఏడు గొర్రెలపై శనివారం వేకువజామున అడవిజంతువు దాడి చేయడంతో మృతి చెందాయి. మండల పశువైద్యాధికారి డాక్టర్ శాంతిరేఖ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. షెడ్డులో ఉంచిన గొర్రెలపై గుర్తు తెలియని అటవీ జంతువు దాడిచేసి ఉంటుందని, ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. గొర్రెల విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 20 రోజుల క్రితం అదే గ్రామంలో గుండాల రమేశ్, కొమ్ము పోచయ్యకు చెందిన 20 గొర్రెలు అడవి జంతువుల దాడిలో మృతి చెందాయని స్థానికులు పేర్కొన్నారు. రాత్రివేళ నక్కల అరుపులు వినిపిస్తున్నాయన్నారు. -
గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెంలో గల శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం పుష్యపౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 133 జంటలు సామూహిక సత్యనారాయణవ్రతాలు నోముకున్నాయి. జాతరకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జాతర సందర్భంగా గూడెం ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. విద్యార్థిని మృతికి కారణమైన ఆర్ఎంపీ అరెస్ట్ కాగజ్నగర్రూరల్: మండలంలోని కోయవాగు గ్రామానికి చెందిన మధురవేణి అక్షర మృతికి కారణమైన ఆర్ఎంపీ తన్నీరు బిక్షపతిని అరెస్ట్ చేసినట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సందీప్ తెలిపారు. చింతగూడ కోయవాగులో శ్రీలత, రవి దంపతుల కుమార్తె అక్షర ఆసిఫాబాద్లోని కేజీబీవీలో ఆరోతరగతి చదువుతోంది. జ్వరం, వాంతులు కావడంతో ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు సమీపంలోని భిక్షపతి అనే ఆర్ఎంపీ వద్ద నవంబర్ 11 నుంచి మూడురోజుల పాటు వైద్యం చేయించారు. నయం కాకపోవడంతో అతని సూచన మేరకు కాగజ్నగర్లోని డయోగ్నస్టిక్ సెంటర్కు వెళ్లి రక్త పరీక్షలు చేయించారు. యూరిన్ ద్వారా బ్లడ్ కోల్పోతుందని రిపోర్టు రావడంతో మొదట హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి, ఆతర్వాత నిలోఫర్లో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి డిసెంబర్ 29న మృతి చెందింది. ఆర్ఎంపీ ఇచ్చిన హైడోస్ ఇంజిక్షన్ల వల్ల కిడ్నీలు చెడిపోయి మృతి చెందిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ఎంపీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. -
తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
వాంకిడి: దశాబ్దాల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా ఇతరులపై అక్రమంగా పట్టా చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన లోబడె విమలబాయి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమాన గ్రామానికి చెందిన అడ్డూరి హన్మయ్య పేరిట ఖమాన శివారులోని 285/అ2 సర్వే నంబరులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. 1950 నుంచి ఖమాన గ్రామానికి చెందిన లోబడే విమలబాయి కుటుంబం సాగు చేస్తోంది. అట్టి భూమిని ఇటీవల అడ్డూరి హన్మయ్య తన కుమారులైన అడ్డూరి దేవయ్య, అడ్డూరి రమేష్, అడ్డూరి సురేష్ పేరున గిఫ్ట్ సెటిల్మెంట్ కింద పట్టా చేయించాడు. ఇట్టి విషయంపై కలెక్టరేట్లో దరఖాస్తు చేసినా తహసీల్దార్ తమను పట్టించుకోకుండా అక్రమ పట్టా చేశారని, న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బాధితురాలు లోబడె విమలాబాయి, ఆమె కూతురు లలిత పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు, బంధువులు గుంజుకున్నారు. దీనిపై తహసీల్దార్ కవితను వివరణ కోరగా నివేదికను ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో అఖిల తేలి గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రె సందీప్, మండల ఉపాధ్యక్షుడు బాలేష్, నాయకులు హివ్రె ప్రవీణ్, శంకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
ఖందేవ్ జాతర షురూ..
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సందర్భంగా జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా తరలిరావడంతో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. తొడసం వంశీయులు ఈ నెల 1న గురువారం మాన్కాపూర్ వద్ద మాసేమాల్ పేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. 2న శుక్రవారం సాయంత్రం ఖందేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి మహాపూజతో జాతర ప్రారంభమైంది. 3న శనివారం తొడసం వంశీయుల సంప్రదాయ భేటి నిర్వహించారు. సంప్రదాయ భేటీ ఖందేవ్ ఆలయ ప్రాంగణంలో తొడసం వంశీయులు పూజ అనంతరం సంప్రదాయ భేటి నిర్వహించారు. కొత్త కోడళ్లను దేవునికి పరిచయం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయులు వారి సాధక బాధలతో పాటు ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ఆలయ అభివద్ధి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తొడసం వంశీయులు, కటోడాలు తొడసం మోతీరాం, తొడ సం బాపూరావు, తొడసం ఆనందరావు, తొడసం చిత్రు, పటేళ్లు తొడసం రాజు, తొడసం తెలంగాణరావు, తొడసం గంగు, తొడసం భీంరావు, తొడసం బండు, ఆదివాసీ జేఏసీ చైర్మన్ మెస్రం రూప్దేవ్, సర్పంచ్ బానోత్ కావేరి, జ్ఞానేశ్వర్, రాథోడ్ సురేశ్, మాజీ సర్పంచులు బానోత్ గజానంద్ నాయక్, ఉర్వేత రూప్దేవ్, మడావి రూప్దేవ్, రాథోడ్ రాజునాయక్, ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మెస్రం శేఖర్బాబు, మాజీ జెడ్పీటీసీ బిర్జులాల్ కర్మానకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకండే దేవరావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ షేక్ దాదేఅలి, తదితరులు పాల్గొన్నారు. నువ్వుల నూనె నైవేద్యం..ఖందేవుని సన్నిధిలో తొడసం వంశీయుల వద్ద నుంచి నువ్వుల నూనె సేకరించి కటోడ దేవుని కి నైవేద్యం సమర్పించారు. అనంతరం తొ డసం వంశ ఆడపడుచు ఆదిలాబాద్ మండలంలోని ఖన్నాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాక్రుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొదటి మొక్కును తీర్చుకుంది. మహారాష్ట్రలోని జివితి తాలూకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాకుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మూడోసారి మొక్కు తీర్చుకుంది. -
నాటు వైద్యానికి దూరంగా ఉండాలి
బజార్హత్నూర్: ఆదివాసీ గిరిజనులు అనారోగ్యానికి గురైతే నాటు వైద్యం నమ్మకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం మండలంలోని డేడ్రా గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత లక్ష్యాలను ఏర్పర్చుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. డేడ్రా, మాన్కపూర్, గిరి జాయి, కొలాంగూడ, ఉమార్డ, భూతా యి(కే), బద్దునాయక్తాండ గిరిజనులకు బ్లాంకెట్లు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు సంజయ్కుమార్, శ్రీసాయి, సర్పంచ్ విజయలక్ష్మి, లింగుపటేల్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మహాపూజకు సిద్ధమవుతున్న మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించనున్న నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ పూజల నిర్వహణకు మెస్రం వంశీయులు సిద్ధమవుతున్నారు. శనివారం మెస్రం వంశ మహిళలు నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ ముగింపు వరకు ప్రత్యేక పూజలకు అవసరమయ్యే స్వచ్ఛమైన నువ్వులతో గానుగ ద్వారా నూనె తీశారు. ఈ నూనెను నాగోబా మహాపూజతో పాటు నైవేద్యానికి వాడుతామని మెస్రం వంశ మహిళలు తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేతజన్నారం: జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్కు అందిన సమాచారం మేరకు సెక్షన్ అధికారులు రవి, హన్మంతరావు, బీట్ అధికారులు రాజేశ్వర్, శ్రీనివాస్, తన్వీర్ పాషా ఇందన్పల్లి పరిధిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక తీయడం నేరమని, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని రేంజ్ అధికారి హెచ్చరించారు. -
కొనసాగుతున్న పారిశుధ్ధ్య కార్మికుల సమ్మె
కాగజ్నగర్ టౌన్: మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె శనివారం 13వరోజుకు చేరింది. కమిషనర్, సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా మున్సిపల్ కాంట్రాక్ట్ కా ర్మికులు ప్రధాన గేటు ఎదుట బైఠాయించా రు. దీంతో చేసేదేమీలేక వారు కార్యాలయంలోకి వెళ్లలేదు. తమ నిరసనను ఉన్నతాధికా రులు పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంజేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికా రిగా ఉన్న దీపక్ తివారీ ఇప్పటివరకు సమ్మె శిబిరాన్ని సందర్శించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సీనియర్ సిటిజన్ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య వివరించడంతో పాటు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి కార్మి కులకు అందాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. కాగా, ము న్సిపల్ కార్మికులంతా రాత్రివేళ కార్యాలయం ఎదుట వంట చేసుకుని అక్కడే భోజనం చేశా రు. సీఐటీయూ నాయకుడు ముంజం ఆనంద్కుమార్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శంకర్, సంజీవ్ తదితరులున్నారు. -
లారీ ఢీకొని ఒకరు దుర్మరణం
దండేపల్లి: మండలంలోని తాళ్లపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం మండలం రాంపూర్కు చెందిన కోల మల్లయ్య (60) దుర్మరణం చెందాడు. దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. మల్లయ్య బైక్ రిపేర్ ఉందని ఇంటి నుంచి తాళ్లపేటకు బయల్దేరాడు. తాళ్లపేటకు చేరుకోగానే అతివేగంగా వచ్చిన లారీ బైక్ను వెనక నుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన మృతుడి బంధువు కాశయ్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటన స్థలికి చేరుకుని బోరున విలపించారు. తన భర్త మృతికి కారకుడైన లారీ డ్రైవర్పై చర్యలు తీసుకోవా లని మృతుని భార్య అసుమతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
చెక్పవర్.. అభివృద్ధిపై నజర్!
కెరమెరి: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచా యతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి దాకా ఉపసర్పంచ్కు జాయింట్ చెక్పవర్పై ఉంటుందా.. లేదా అనే విషయంలో సందిగ్ధం ఉండేది. గత పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో నూతన పాలకవర్గం ఏర్పడేదాకా పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారికి జా యింట్ చెక్ పవర్ ఉండేది. ఆయా పంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులకు నిధులు డ్రా చేయాలంటే వీరిద్దరి సంతకాలు అవసరముండేది. ఇటీవల కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరడంతో రాష్ట్ర ప్రభుత్వం పాత ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ చెక్ పవర్ కల్పించేందుకు ఇటీవల సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు, వేలిముద్రలు, పాన్కార్డు, పోన్ నంబర్ తదితర వివరాలు సేకరించిన మండలాధికారులు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి అందజేశారు. నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోకే..కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోకి నేరుగా ని ధులు విడుదల చేస్తోంది. ప్రతీ మూడు లేదా ఆరు మాసాలకోసారి నిధులు విడుదలవుతాయి. ఈ ఆర్థి క లావాదేవీల నిర్వహణకు కేంద్ర పబ్లిక్ ఫైనా న్షియల్ మేనేజ్మెంట్ (పీఎఫ్ఎంఎస్) అనే ఆన్లైన్ పోర్టల్ను తీసుకువచ్చింది. సర్పంచ్, ఉపసర్పంచ్ వేలిముద్రల ఆధారంగా డిజిటల్ కీ తయారు చేస్తా రు. ఆ కీని ఉపయోగించి పనులు చేసిన వారి బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు నేరుగా బదిలీ చేసే అధికారముంది. గతంలో డిజిటల్ కీ తయారు బాధ్యతల ను ఏజెన్సీకి అప్పగించగా డబ్బులు చెల్లించి దానిని తయారు చేసుకున్నారు. ప్రస్తుతం కీ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగిస్తారా? లేదా.. డీపీఎం, ఈ పంచాయతీ ఆపరేటర్ల ద్వారా చేస్తారా? అనే విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. అమలులో ఐఎఫ్ఎంఎస్జిల్లాలో 335 గ్రామపంచాయతీలుండగా 332మంది సర్పంచులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నెలనెలా నిధులు విడుదల చేయాలి. వీటిని డ్రా చేయడానికి ఐఎఫ్ఎంఎస్ అమలులో ఉంది. నిధులు డ్రా చేయడానికి డిజిటల్ కీ లేకపోయినా సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు ఆన్లైన్ చేయాలి. వారి డిజిటల్ సంతకాలు బ్యాంక్, ట్రెజరీ అధికారులకు పంపాలి. పంచాయతీ కార్యదర్శి చెక్ రాసి సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో ట్రెజరీకి పంపించాలి. డిజిటల్ సంతకాలు సక్రమంగా ఉంటేనే సంబంధిత బిల్లు పాస్ అవుతుంది. వివరాలు అందించాం జిల్లాలోని సర్పంచ్, ఉపసర్పంచులకు సంబంధించిన వివరాలు సేకరించాం. సంతకాలు, వేలిముద్రలు బ్యాంక్, ట్రెజరీ అధికారులకు అందించాం. ఈ మేరకు గతంలో ఉన్న సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్ అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. వీటిని మండలాలకు పంపించాం. డిజిటల్ కీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. – భిక్షపతిగౌడ్, డీపీవో -
విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలి
వాంకిడి: వినియోగదారులు విద్యుత్ను పొ దుపుగా వాడాలని ఎస్ఈ ఉత్తమ్ జాడె సూ చించారు. శనివారం మండలంలోని ఇందాని గ్రామంలో విద్యుత్ వినియోగం, తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు సూచనలతో కూడిన కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే ప్ర మాదాలు జరిగే అవకాశాలున్నట్లు తెలిపా రు. ఇంట్లో ఎవరూ లేనపుడు టీవీ, ఫ్యాన్లు, కూలర్లు బంద్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి విద్యుత్ సమస్యలున్నా శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్తో మరమ్మతులు చేయించుకోవాలని తెలిపారు. ఎస్ఏవో దేవిదాస్, ఏడీఈ శ్రీనివాస్, ఎస్ఎల్ఐ శ్రీనివాస్, ఎల్ఐ రవి, సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కుమురం భీం
7పచ్చదనం.. పరిహాసం! వాంకిడి మండల కేంద్రం మీదుగా నిర్మించిన నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. ఖందేవ్ జాతర షురూ.. నార్నూర్లోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సందర్భంగా జనసంద్రమైంది. వివిధ రా ష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు రావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 8లోu కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. చలి కాస్త తగ్గుతుంది. పొగమంచు కురుస్తుంది. ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026 -
సూపర్ఫాస్ట్ రైళ్లు ఆపాలి
రెబ్బెన: మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రై ల్వేస్టేషన్లో సూపర్ఫాస్ట్ రైళ్లు ఆపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కో రారు. శనివారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఏరియా రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గోపిని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఆయన మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఒక్కగానొక్క రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బెల్లంపల్లి, కాగజ్నగర్ రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించాల్సి వ స్తోందని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకు ని సూపర్ఫాస్ట్ రైళ్లు ఆపాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రైల్వే ఏడీఈఎన్ హామీ ఇచ్చినట్లు తెలి పారు. ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, ఉపాధ్యక్షుడు రాజాగౌడ్, నాయకులు శంకర్, విజయ్, సంతోష్, మోహన్ తదితరులున్నారు. -
సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: మొదటి ఉపాధ్యాయురాలిగా పని చేసిన సావిత్రీబాయి పూలేను మహిళా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయుల దినోత్సవానికి అదనపు కలెక్టర్, ఇన్చార్జి విద్యాశాఖ అధికారి దీపక్ తివారీ, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగతో కలిసి హాజరయ్యారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి ణి రమాదేవి, విద్యాశాఖ అధికారులతో కలిసి సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 50శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులు పని చేస్తున్నారని తెలిపా రు. మహిళా ఉపాధ్యాయులు సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకుని బాలికలు విద్య, క్రీడా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన 10మంది మహిళా ఉపాధ్యాయులను శాలు వాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఏఎంసీ డైరెక్టర్ వైరాగడె మారుతీపటేల్, బీసీ సంఘం ప్రతినిధి ఆవిడపు ప్రణయ్కుమార్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్తూ ‘మెస్రం’ పాదయాత్ర ● గత నెల 30న కేస్లాపూర్లో ప్రారంభం ● హస్తినమడుగు దారిలో 145మంది వంశీయులు
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు. -
గ్రామాల పేర్లు మార్చాలి
చింతలమానెపల్లి/కాగజ్నగర్రూరల్: నియోజకవర్గంలోని చింతలమానెపల్లి మండలం లంబాడిహే టి, కాగజ్నగర్ సమీపంలోని లం..గూడ గ్రామాల పేర్లు మార్చాలని ఎమ్మెల్యే హరీశ్బాబు మంత్రులను కోరారు. శనివారం అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అంశాలపై మాట్లాడారు. చింతలమానెపల్లి మండలంలోని లంబడిహేటి గ్రామానికి అక్కడి లంబాడాల మతగురువు ప్రేమ్సింగ్ మహరాజ్ పేరిట ప్రేమ్నగర్గా మార్చాలని తీర్మానించినట్లు తెలిపారు. కాగజ్నగర్ మండలంలోని ఒక గ్రామం పేరు పలకడానికి ఇబ్బందిగా ఉందని తాను స్పెల్లింగ్ మాత్రమే తెలియజేస్తానని పేర్కొన్నారు. ఆగ్రామం పేరును నందిగూడగా రెవెన్యూ, పంచాయితీ రికార్డుల్లో మార్చాలని సంబంధిత మంత్రులను కోరారు. కాగజ్నగర్ మండలంలో 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆక్సిలరేటేడ్ ఇరిగేషన్ ప్రోగ్రాం కింద పెద్దవాగుపై జగన్నాఽథ్పూర్ ప్రాజెక్ట్ నిర్మించిందని, పెద్దవాగులో 365 రోజులూ నీళ్లుంటాయని తెలిపారు. రూ.135కోట్లతో పెండింగ్లో ఉన్న 10శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని వివిధ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని సంబంధిత మంత్రులను ఎమ్మెల్యే కోరారు. -
సవరణ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి సూచించా రు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అ ధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. ఓటరు జాబితాలో కేటగిరీలుగా మ్యాపింగ్, డెస్క్ పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులకు రోజువారీ గా లక్ష్యాన్ని నిర్దేశించాలని సూచించారు. బూత్ స్థా యి ఏజెంట్లు, రాజకీయ పార్టీల సహకారం తీసుకు ని సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని తెలి పారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ప్ర త్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీ గా ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో ఒకే రకమైన నమోదులను గుర్తించి, మ రణించిన, గ్రామం వదిలి వెళ్లిపోయిన వారిని గు ర్తించి ఫారం–8 ద్వారా నోటీసులు జారీ చేసి వివరా లు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, రా జకీయ పార్టీల సహకారంతో కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులకు గు ర్తింపు కార్డులు ఇస్తామని, గడువులోపు కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్దాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావ్, ఎన్నికల విభాగం అధికారులున్నారు. -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రె పేర్కొన్నా రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. స బ్ జైలు, పోలీస్స్టేషన్, కేబీ చౌక్, బస్టాండ్ మీదుగా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదా రులు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ విని యోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూ చించారు. రోడ్డు భద్రతపై పోలీస్, రవాణా, రెవె న్యూ తదితర శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలంతా రోడ్డు భద్ర త నియమాలు పాటించాలని సూచించారు. మ ద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల ని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రజల భద్రత, రక్షణ ప్రధాన ధ్యేయంగా పోలీస్శాఖ పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కాగజ్నగర్ ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వాహిదొద్దీన్, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజమల్లు, సీఐ బాలాజీ వరప్రసాద్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కాగజ్నగర్ టౌన్ సీఐ ప్రేంకుమార్, ఆర్ఐలు అంజన్న, విద్యాసాగర్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర శాఖల అధికారులు, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై అవగాహన తప్పనిసరి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి రహదారి దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారి నియమాలు పాటించాలన్నారు. తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఐఈవో రాందాస్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీజిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శుక్రవా రం డీఏవో వెంకటితో కలిసి దుప్పట్లు పంపిణీ చేశా రు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడిన విద్యార్థిని ఆర్తిని అభినందించారు. కార్యక్రమంలో ఏవో మిలింద్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులపై ఆశలు.. అభివృద్ధికి ఎదురుచూపులు!
రెబ్బెన: రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పాలకవర్గాలు లేక ప్రభుత్వాలు పంచాయతీలకు నిధుల విడుదలను నిలిపివేయడంతో ఖాతాలు ఖాళీగా మారాయి. పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చుచేసి పంచాయతీలను నడిపించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు పూర్తికాగా.. పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సమస్యలపై దృష్టి సారించారు. ఉత్సాహంగా పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాయి. అయితే ఖాళీ ఖాతాలు వారి అడుగులకు సంకెళ్లు వేస్తున్నాయి. ప్రస్తుతానికి సొంత డబ్బులు ఖర్చు చేస్తూ చిన్న చిన్న హామీలు నెరవేస్తున్నారు. పాలన గాడిలో పెట్టేలా..గత నెలలో మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా 332 మంది సర్పంచులు, 2,833 మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల క్రితం సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేకాధికారులు పాలనను గాలికొదిలేసి, సమస్యలు పట్టించుకోలేదు. ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం మల్టీపర్పస్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించడం మినహా ఇతర పనులు ముందుకు సాగలేదు. అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులకు మరమ్మతులు లేక అడుగడుగునా గుంతలమయంగా మారాయి. తాగునీటి సరఫరాను సక్రమంగా చేపట్టేందుకు పైపులైన్ల మరమ్మతులు, గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ఇతరాత్ర పనులు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కార్యదర్శులే జేబు నుంచి ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించారు. ఖాతాల్లో నిధులు లేకపోవడంతో వారికీ ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకు నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి పల్లె పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలను గుర్తిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు కాగా అప్పులు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధులుగ్రామాల్లో ఎన్నికల సందడి పూర్తికావడంతో పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిధుల కొరతను తీర్చేందుకు పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో కొత్తగా పాలనపగ్గాలు చేపట్టిన సర్పంచులకు ఆదిలోనే తీపి కబురు అందింది. రాష్ట్ర నుంచి నిధులు మంజూరైతే అభివృద్ది పనులను ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. మేజర్ గ్రామాలకు రూ.10లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5లక్షల చొప్పున జనవరి మొదటి వారంలోనే అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాలకు మళ్లీ పాతరోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. పాలక వర్గాలు కొలువుదీరడంతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల సైతం మంజూరయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు సాధారణ, ఉపాధిహామీ, పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు ద్వారా ఆదాయం సమకూరనుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధిలోని జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.618 చొప్పున నిధులు విడుదల చేస్తుంది. గతంలో కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేది. అక్కడి నుంచి పంచాయతీలకు చేరేవి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు నిధులను విడుదల చేస్తోంది. రెండేళ్ల కాలానికి సంబంధించి పెండింగ్ నిధులు మొత్తం పంచాయతీలకు అందనున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్పవర్ అధికారం ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు బ్యాంకులు, ట్రెజరీలతో కొత్త సర్పంచులు, ఉప సర్పంచుల సంతకాలు మార్చే పనుల్లో నిమగ్నమయ్యారు. -
గుడుంబా నిర్మూలనపై అవగాహన
దహెగాం: మండల కేంద్రంలోని యువకులు, ఎకై ్స జ్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం గుడుంబా నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో విచ్చలవిడిగా గుడుంబా విక్రయిస్తుండటంతో బానిసలుగా మారిన వారు ఇళ్లలోని వస్తువులు అమ్ముకుని తాగుతున్నారని తెలిపారు. గుడుంబాను అరికట్టాలని కోరారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ రవి మాట్లాడుతూ గతేడాది మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 520 లీటర్ల నాటుసారా, 150 కిలోల బెల్లం, 9 వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 76 కేసులు నమోదు చేశామన్నారు. 80 మంది నిందితులను అరెస్టు చేయగా, 56 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా సమాచారం అందించాలని కోరారు. -
పుర ఓటర్లు
@ 65,110ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. కాగజ్నగర్ బల్దియా ఓటరు జాబితాను గురువారం విడుదల చేయగా, నూతన మున్సిపాలిటీ ఆసిఫాబాద్ జాబితా విడుదలలో మాత్రం జాప్యం జరిగింది. తీవ్ర కసరత్తు చేసిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 5న మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగజ్నగర్ బల్దియాలో ఎక్కువ మందిజిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 65,110 ఉండగా.. ఇందులో 33,985 మంది మహిళలు, 31,125 మంది పురుషులు ఉన్నారు. కాగజ్నగర్ పరిధిలో 51,205 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు. గత ఎ న్నికల సమయంలో ఇక్కడ 44,946 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి 6,295 మంది పెరిగారు. ఇక నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 13,905 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 6,811 మంది, మహిళలు 7,092 ఉన్నారు. 15, 16 వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు!ఈ సారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ బ్యాలెట్ బాక్స్ల స్టాకు వివరాలను జిల్లా అధికారుల నుంచి ఆరా తీస్తోంది. 2019లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతినే అనుసరించారు. ముసాయిదా జాబితా ప్రకారం ఆసిఫాబాద్ ఓటర్లు వార్డు నం. పురుషులు మహిళలు మొత్తం 01 393 480 873 02 233 218 451 03 325 313 638 04 387 343 730 05 383 425 808 06 487 473 960 07 375 394 769 08 338 350 688 09 293 352 645 10 292 341 633 11 295 281 576 12 241 252 493 13 318 293 611 14 362 336 698 15 359 354 714 16 396 451 848 17 301 333 634 18 328 362 690 19 343 330 673 20 362 411 773 మొత్తం 6,811 7,092 13,905 ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే విధులు కేటాయించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీకి మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సబ్ కలెక్టర్, ఆసిఫాబాద్కు నోడల్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను డీటీడీవో రమాదేవి, వాహనాలు సమకూర్చేందుకు జిల్లా రవాణా అధికారి, అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి జిల్లా ఉద్యానవన అధికారి అబ్దుల్ నదీమ్, ఎన్నికల పరిశీలకులకు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కు డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, మీడియా కమ్యూనికేషన్కు డీపీఆర్వో సంపత్కుమార్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతిరోజూ నివేదికలు సమర్పించే నోడల్ అధికారులుగా మున్సిపల్ కమిషనర్లు ఉంటారని తెలిపారు. అధికారులు మున్సిపల్ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గజానంద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడాపాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ మీనారెడ్డి, కోచ్ అరవింద్ శుక్రవారం తెలిపారు. వా రు మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్ జీఎఫ్ అండర్– 14 హ్యాండ్బాల్ పోటీల్లో తుకుబా యి, మహేశ్వరి ప్రతిభ చూపారని అన్నారు. ఈ నెల 5 నుంచి 10 వరకు రాజస్తాన్లో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయస్థాయి సెపక్ తక్రా పోటీలకు..రెబ్బెన: పంజాబ్లోని ఎల్పీ యూనివర్సిటీలో శనివారం నుంచి ఈ నెల 5 వరకు జరిగే జాతీయస్థాయి సెపక్తక్రా పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని సెపక్తక్రా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ శుక్రవారం తెలిపారు. జూనియర్ బాలబాలికల పోటీలకు రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి చాప్లె శ్రీకాంత్, ఆసిఫాబాద్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన అజ్మీర కీర్తి ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ చీఫ్ ప్యాట్రాన్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.తిరుపతి అభినందించారు. -
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్అర్బన్: విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్లో పనిచేస్తున్న ఏఆర్ ఎస్సై జగదీశ్ చంద్రమండల్ గతేడాది గుండెపోటుతో మరణించగా, శుక్రవారం బాధిత కుటుంబానికి పోలీసు కార్యాలయంలో రూ.99,800 విలువైన చెక్కు అందించారు. కుటుంబ ప్రస్తుత స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్రెడ్డి, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ స్మైల్– 12’కు శ్రీకారం
పెంచికల్పేట్: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా అధికారులు ఆపరేషన్ స్మైల్ 12వ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన తనిఖీలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే వ్యాపార సముదాయాలు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పారిశ్రామిక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టనున్నారు. బాల కార్మికులను విముక్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నాలుగేళ్లలో 269 మందికి విముక్తికలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో పోలీసు అధికా రులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కులు పరి రక్షణ సమితి, విద్యాశాఖ సమన్వయంతో ఆసిఫా బాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ బృందానికి ఎస్సై ముత్యం, కాగజ్నగర్ బృందానికి ఎస్సై యా దగిరి నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో ఏటా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారిన వారికి అధికారులు కొత్తదారి చూపుతున్నా రు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కా ర్యక్రమాలతో అధికారులు ఇప్పటివరకు 269 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో బాలు రు 251 మంది, బాలికలు 18 మంది ఉన్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు బాలలకు భరోసా కల్పించడానికి ఏటా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతాలతోపాటు బాలకార్మికుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నాం. బాల కార్మికులు కనిపిస్తే ప్రజలు 1098 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించారు. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారిఆపరేషన్ స్మైల్ ద్వారా విముక్తి పొందిన బాలబాలికలుసంవత్సరం బాలురు బాలికలు బాలకార్మికులు బాల్యవివాహాలు డ్రాపౌట్స్ మొత్తం 2022 92 9 98 2 1 101 2023 42 1 37 0 06 43 2024 63 5 59 3 06 68 2025 54 3 52 1 04 57 -
● గణనీయంగా తగ్గిన మిరప సాగు విస్తీర్ణం ● స్థానికంగా అమ్ముకునే సౌకర్యం లేక మహారాష్ట్రకు రైతులు.. ● దళారుల చేతికి చిక్కి నష్టపోతున్న వైనం
చింతలమానెపల్లి మండలం రణవెల్లికి చెందిన జాటోత్ సోమేశ్కు ఐదెకరాల సొంత భూమి ఉంది. గతేడాది మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. మొత్తం 180 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. మహారాష్ట్ర మార్కెట్కు తరలించగా, క్వింటాల్కు రూ.11,000 ధర పలికింది. రవాణా చార్జీలు పోగా రూ.9,500 మిగిలాయి. పెట్టుబడి, కూలీల ఖర్చులు తీసివేస్తే నష్టమే మిగిలింది. మొత్తం రూ.30లక్షలు ఖర్చు చేస్తే రూ.22లక్షల ఆదాయం వచ్చింది. గతేడాది నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఆరు ఎకరాల్లోనే మిరప సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం గుండు పూత వచ్చి కాపు తగ్గింది. దిగుబడి రాకపోతే మిరప సాగు వదిలేయాల్సిందేనని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.. ఈ విధంగా జిల్లాలో చాలా మంది రైతులు ఈ ఏడాది మిరప సాగుకు దూరంగా ఉన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కౌటాల: కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న దనూరి విజ య్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ హరికృష్ణ తెలిపారు. మండల కేంద్రంలోని పాఠశాలలో గురువారం విజయ్ ను ఉపాధ్యాయులు అభినందించారు. హెచ్ఎం రాంచందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ నెల 5 నుంచి 7 వరకు రాజస్తాన్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు విజయ్ ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. ఉపాధ్యాయులు రమేశ్, సంధ్యారాణి, సింధు, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్సీ
కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. 7కుమురం భీంసరస్వతి.. రైతుల పెన్నిధి ఉత్తర తెలంగాణకు శ్రీరాంసాగర్ జలాశయం వరప్రదాయినిగా నిలుస్తోంది. ప్రాజెక్టు మూడో ప్రధాన కాలువ ద్వారా 64 గ్రామాల్లో 33,622 ఎకరాలకు సాగు నీరందుతోంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత అధికమవుతుంది. -
నూతనోత్సాహంతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో గురువారం నూతన సంవత్స ర వేడుకలు నిర్వహించారు. న్యూఇయర్కు స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఇప్పటి వర కు ఉత్పత్తి, నాణ్యతలో ముందంజలో ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 90 రోజుల్లో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాన్ని 100 శాతం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారులు సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో నీటి గోస
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంతో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా అధికారులు స్పందించకపోవడంతో అత్యవసర సేవల కార్మికులు సైతం విధులు బహిష్కరించారు. దీంతో పట్టణంలో తాగునీటి సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో 30 వా ర్డులు ఉండగా, 70 వేలకు పైగా జనాభా ఉంది. ప ట్టణంలోని ఐదు వాటర్ ట్యాంక్ల ద్వారా వార్డులకు రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చే స్తారు. కానీ ప్రస్తుతం నీటి సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్లో జనరల్ ఫండ్ నిధులు లేమితో కా ర్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎస్పీఎం నల్లాలే దిక్కు ఎస్పీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి రెండు నల్లాలే ప్రస్తుతం పట్టణ ప్రజలకు దిక్కుగా మారాయి. పట్టణంలోని మున్సిపల్ నీరు రాకుంటే ప్రజలు ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. నౌగాంబస్తీ, టీచర్స్ కాలనీ, బాలాజీనగర్, శ్రీరాంనగర్, ద్వారకానగర్, శ్రీకృష్ణనగర్, కౌసర్ నగర్ కాలనీవాసులు ఈ నల్లా వద్దకు వస్తుంటారు. ప్రస్తుతం వాటర్ క్యాన్లలో నింపుకొని నీటిని తీసుకెళ్తున్నారు. అలాగే పట్టణంలోని సంఘం బస్తీ ఏరియాలోని ఎస్పీఎం చార్ నల్ వద్ద నుంచి అశోక్ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ, రైల్వే లైన్, తదితర కాలనీల ప్రజలు నీటిని తీసుకెళ్తున్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీలకు వచ్చే నెలలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. గురువారం కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై అంటించారు. 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఇతరులు ఎనిమిది మంది ఉన్నా రు. గత ఎన్నికల సమయంలో బల్దియాలో 44,946 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి 6,295 మంది పె రిగారు. కాగా, నూతన మున్సిపాలిటీ ఆసిఫా బాద్లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల కోసం అధికారులు శ్రమిస్తున్నారు. శుక్రవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 5న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిలర్ పదవిని ఆశిస్తున్న వారు పార్టీల నాయకులు, ఓటర్లను ఇప్పుడే కలుస్తున్నారు. యువ ఓటర్లతోపాటు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో నేరాలు నియంత్రించి, శాంతిభద్రతలు పెంపొందిస్తామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త లక్ష్యాలతో పనిచేస్తామని తెలిపారు. ప్రజల రక్షణపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల నివారణ, సైబర్ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 2026లో చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తీసుకుంటున్నాం. గంజాయి సాగు, విక్రయాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతేడాది జిల్లాలో 73 కేసులు నమోదు చేసి, 122 మందిని అరెస్టు చేశాం. 15.224 కిలోల ఎండు గంజాయి, 1,118 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నాం. సాక్షి: సైబర్ నేరాల నియంత్రణకు కార్యాచరణ ఏంటి? ఎస్పీ: సైబర్ నేరాల నియంత్రణపై అన్ని మండలాల్లో కళాబృందాలతో ఈ ఏడాది ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సైబర్ మోసం జరిగిన సమయంలో గోల్డెన్ అవర్లో 1930కి కాల్ చేస్తే పో లీసులు స్పందిస్తారు. ఖాతాలను ఫ్రీజ్ చేస్తాం. జిల్లాలో 37 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 20 మంది నిందితులను అరెస్టు చేశాం. సాక్షి: పోలీసు గ్రీవెన్స్కు వచ్చిన దరఖాస్తులు ఎలా పరిష్కరిస్తున్నారు? ఎస్పీ: ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా స్పందించకుంటే డీపీవోకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ దరఖాస్తు నిశితంగా పరిశీలిస్తాం. గతేడాది 232 దరఖాస్తులు రాగా, 220 పరిష్కరించాం. సోమవారం వీలుకాని పక్షంలో వేరే రోజు కూడా రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా సంప్రదించాలి. సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలను ఎలా అరికడతారు? ఎస్పీ: జిల్లాకు ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ లేదు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. పెట్రోలింగ్, వాహన తనిఖీలు చేస్తాం. కాగజ్నగర్లో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ను నియమించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించాం. గతేడాది జిల్లాలో 267 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 3,757 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశాం. సాక్షి: జిల్లాలో చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీటి అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: జిల్లాలో దొంగతనాలు నియంత్రించేందుకు ప్రతిరోజూ రాత్రి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 600 పాయింట్ బుక్లు ఏర్పాటు చేశాం. బ్యాంకులు, పెట్రోల్ పంపులు, ఏటీఎం ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాం. సాక్షి: ఏటా మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. జిల్లాలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలేంటి?ఎస్పీ: వేధింపులకు గురైతే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. షీటీంలు, కళాబృందాలతో గ్రామాలు, పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తాం. గతేడాది 106 మహిళల వేధింపుల కేసులు నమోదు చేశాం. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. నేరాలు జరిగితే ఎవరి వద్దకు వెళ్లాలి అనే విషయం తెలియాలి. బాధితుల కోసం ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్ను అందుబాటులో ఉంచుతున్నాం. -
యాసంగి జోరు
వరినారు తీస్తూ.. లగ్గాం శివారులో వరినాట్లు వేస్తున్న కూలీలు మందు చల్లుతున్న రైతుట్రాక్టర్తో పొలాన్ని చదును చేస్తూ.. వానాకాలం పత్తి, ధాన్యం విక్రయాలు తుదిదశకు రావడంతో జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో యాసంగి సాగు పనులు మొదలయ్యాయి. దహెగాం మండలంలో వరిసాగు పనులు జోరందుకున్నాయి. బోరు, బావుల సౌకర్యం ఉన్న రైతులు సీడ్ వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో కేజీ వీల్స్ ట్రాక్టర్లకు డిమాండ్ ఏర్పడింది. వీల్స్ కొట్టడం, నాట్లు వేయడం వంటి పనులతో సందడి కనిపిస్తోంది. – దహెగాం -
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్తో కలిసి రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువారం అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్షించారు. ఉద్యోగులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించి పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం రహదారులపై సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి శంకర్నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా శౌర్య దివస్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద గురువారం జైభీమ్ సేన, సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో శౌర్య దివస్, భీమ్ కోరేగావ్ ఘనంగా నిర్వహించారు. నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు హూక్టుజి దుర్గె, జైభీమ్ సేన అధ్యక్షుడు జాడె వినోద్ మాట్లాడుతూ కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరానితనం నుంచి విముక్తి పొందడానికి మహార్ కులానికి చెందిన 500 మంది సైనికులు జనవరి 1న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పీష్వా సైన్యంతో విరోచితంగా పోరాడి విజయం సాధించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఏటా జనవరి 1న భీమా కోరేగావ్ స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించే వారని అన్నారు. కార్యక్రమంలో సుధాకర్, పెంటయ్య, అనిల్ దుర్గె, అజిత్ కట్కార్, వెంకటేశ్, మహేశ్, కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్తివారి ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్రావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, డీపీవో భిక్షపతి, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తం జాడేతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, ఏపీవోలు, విద్యుత్, ఇంజినీరింగ్ శాఖ అఽధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలల అభివృద్ధి పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాలల్లో సివిల్ పనులు, పారిశుద్ధ్య పనులు, ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. -
ఐఏఎస్ అవుతా..
2025లో ఎంత సంతోషంగా ఉన్నానో.. కొత్త ఏడాది ఇదే కొనసాగాలి. విద్యాలయంలో క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినవారు స్నేహితులయ్యారు. మిత్రులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. నేను ఐఏఎస్ అధికారిగా సమాజానికి సేవ చేస్తా. – అఖిల్, 6వ తరగతి, జైనథ్ కాగజ్నగర్టౌన్: గడిచిన కాలం ఒక జ్ఞాపకం... రాబోయే కాలం ఒక ఆశ.. తీపి, చేదు అనుభవ పాఠాలను 2025లో వదిలేసి... కొత్త ఆశయాలు, రెట్టింపు ఉత్సాహంతో 2026లోకి అడుగుపెట్టేశాం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ‘నవోదయం’లా.. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ క్రమంలో న్యూఇయర్లో ప్రతీఒక్కరి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలి.. ప్రపంచ దేశాల్లో భారత్ వెలిగిపోవాలి’ అని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యార్థులు ఆకాంక్షించారు. బుధవారం ‘సాక్షి’ వారిని ప్రత్యేకంగా పలకరించింది. కొత్త ఏడాదిలో నూతన ఆవిష్కరణలు రావాలని, అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని వారు కోరారు. ఆవిష్కరణలు రావాలి కొత్త సంవత్సరంలో భారతదేశం నుంచి అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడాలి. శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టి ఇండియాకు పేరు తెచ్చారు. నేను కూడా అంతరిక్ష ఆవిష్కరణలు చేసి అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని ఉంది. – విహాన్ తేజ్, 6వ తరగతి, కాసిపేట, మం.తాండూర్ కొత్త సమాజం చూడబోతున్నా.. ఆరు నుంచి నవోదయలో చదువుకుంటున్నా. 12వ తరగతి పూర్తయితే 2026లో ఉన్నత చదువు కోసం బయటకు వెళ్లాల్సిందే. అక్కడ కొత్త సమాజం, కొత్త మిత్రులను చూడబోతున్నాను. సమాజంలో ఏవిధంగా ఉండలో నేర్చుకుంటాను. సివిల్స్కు సన్నద్ధమై కలెక్టర్ అవుతా. సమాజానికి సేవ చేస్తాను. ప్రభుత్వం మహిళలను ప్రొత్సహించాలి. – యశస్విని, 12వ తరగతి, మంచిర్యాల -
కంపెనీ ప్రారంభిస్తా
నేను వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. ఐఐటీ చదివేందుకు రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల నుంచి ఎంపికయ్యా. అలా కాగజ్నగర్లో 12వ తరగతి ఐఐటీ కోసం వచ్చా ను. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉండడంతో అన్ని భాషలు నేర్చుకునే అవకాశం కలిగింది. చదువు పూ ర్తయ్యాక కంపెనీ ప్రారంభించి ఉపాధి చూ పుతా. – మణిదీప్, 12వ తరగతి, వరంగల్ ఇండియా ఉన్నతంగా ఉండాలి కొత్త సంవత్సరంలో ఇండియా ప్రపంచంలోనే ఉన్నతంగా ఉండాలి. అన్ని దేశాలకు ఆదర్శం కావాలి. యుద్ధాలు, అల్లర్లు ఆగిపోవాలి. అనేక రంగాల్లో భారత్ ఒక మోడల్గా ఉంది. రానున్న సంవత్సరాల్లోనూ ఇలాగే కొనసాగాలి. – లాస్య, 9వ తరగతి, బోథ్ -
సొంత భవనాల్లోకి సమాఖ్యలు
వాంకిడి: మహిళా సమాఖ్యల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండల, గ్రామ సంఘాలకు ఉపాధిహామీ నిధుల నుంచి సొంత భవనాలు నిర్మించేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు మహిళా సంఘాలకు గ్రామాల్లో సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండల, గ్రామీణ స్థాయిల్లో స్థలాల గుర్తింపునకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో ప్రక్రియ కొనసాగుతోంది. మహిళలు స్వశక్తితో ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం బ్యాంకు రూణాలు అందజేస్తోంది. అయితే సంఘాల సమావేశాలు నిర్వహించేందుకు చోటు లేకపోవడంతో ఇళ్లు, చెట్లు, ఆరుబయట ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఊరూరా సొంత భవనాలు నిర్మించేందుకు నిధులను మంజూరు చేయనుంది. మండల సమాఖ్య భవనాలతోపాటు ప్రతీ మండలానికి ఉత్పత్తులు స్టోర్ చేసుకునేందుకు గోదాంలు, వర్క్ షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ భవనానికి రూ.10 లక్షలు మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు ఉపాధిహామీ నిధులు వాడుకునే అవకాశం కల్పించారు. ప్రతీ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించనున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 15 మండల సమాఖ్యలు ఉండగా.. 386 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. 11 మండలాల సమాఖ్యలకు కార్యాలయ భవనాలు ఉండగా.. పెంచికల్పేట్, చింతలమానెపల్లి, లింగాపూర్, రెబ్బెన మండలాల్లో నూతన కార్యాలయాలు నిర్మించనున్నారు. అలాగే ప్రతీ మండలానికి రూ.30 లక్షలతో గోదాంలు, రూ.10 లక్షలతో వర్క్ షెడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం మండలాల వారీగా గ్రామాల్లో స్థలాలు పరిశీలిస్తున్నారు. ఊరి బయట స్థలాలు కాకుండా గ్రామ మహిళా సంఘాలకు భవనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. స్థలాల గుర్తింపు పూర్తయిన తర్వాత సభ్యులతో తీర్మానం చేసి పంచాయతీకి సమర్పిస్తారు. గ్రామసభ తీర్మానంతో పూర్తి వివరాలను ఎంపీడీవోకు సమర్పిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తనిఖీ చేసి ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా భవనాలు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 50 నుంచి 100 భవనాలు నిర్మించనున్నారు. -
యాంకరింగ్ చేశా
2025 జనవరి 1న విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను యాంకరింగ్ చేశా. అది నాకు ఎంతో ప్రేరణతోపాటు చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం ఆనందంగా గడవాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో డిబేట్ స్పీకర్, జర్నలిస్టుగా రాణిస్తా. – రౌతు అలేఖ్య, పదో తరగతి, చింతలమానెపల్లి అందరూ బాగుండాలి కరోనా సమయంలో నవోదయ విద్యాలయంలో చేరాను. అప్పటి నుంచి విద్యాలయం చాలా అభివృద్ధి చెందింది. కొత్త ఏడాదిలో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్లు నిర్వహించేందుకు అధ్యాపకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. – మహిక, 11వ తరగతి, మందమర్రి -
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఎస్పీ నితిక పంత్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బుధవారం అట్రాసిటీ కేసులపై అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025లో 32 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 29 కేసుల్లో బాధితులకు రూ.20లక్షలు పరిహారం మంజూరయ్యాయన్నారు. ప్రతీ నెల 30న గ్రామాల్లో తహసీల్దార్, ఎస్సై, ఇతర అధికారులతో పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తూ చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుల వివక్ష లేకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ అట్రా సిటి కేసులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు కేసుల విచారణ వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అశోక్, సత్యజిత్ మండల్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, మానిటరింగ్ కమిటీ సభ్యులు కేశవ్రావు, అశోక్, సిడాం అర్జు, గోపాల్, గణేశ్, గంగుబాయి పాల్గొన్నారు. -
కరాటేలో కాంస్య పతకం
లింగాపూర్(ఆసిఫాబాద్): మంచిర్యాలలో ఈ నెల 21న జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో లింగాపూర్ మండలం పిక్లాతండాకు చెందిన బానోత్ అంగూరీ కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయంలో సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు మంగళవారం విద్యార్థినిని శాలువాతో సత్కరించా రు. కాగా అంగూరీ ప్రస్తుతం జైనూర్ మండలం భూసిమెట్టలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కార్యక్రమంలో కరాటే మాస్టర్ జె.గణేశ్, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు
కెరమెరి(ఆసిఫాబాద్): జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహాపూజ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యవత్మాల్ ఎమ్మెల్యే తొడసం రాజు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు వారికి తలపాగాలు చుట్టారు. ఎంపీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, ఛతీస్గఢ్, తదితర నుంచి భక్తులు వస్తారని తెలిపారు. గిరిజన ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు చరిత్ర అందించాలన్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లుజంగుబాయి అమ్మవారి ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన జంగుబాయి దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సమన్వమ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు యవత్మాల్ ఎమ్మెల్యే రాజు తెలిపారు. అంత కు ముందు పోచమ్మకు పూజలు చేశారు. దేవతలకు మొక్కులు చెల్లించి, కొత్త కోడళ్లతో భేటింగ్ అయ్యారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సలాం శ్యాంరావు, అధ్యక్షుడు కొడప జాకు, గౌ రవ అధ్యక్షుడు మరప బాజీరావు, పుర్క బాపూరావు, ఆర్డీవో లోకేశ్వరరావు, డీపీవో భిక్షపతి, గిరిజనశాఖ డీడీ రమాదేవి పాల్గొన్నారు. -
‘నవోదయ’లో రోబోటిక్స్ ఎగ్జిబిషన్
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం రోబోటిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ అమరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ రోబోలను వ్యవసాయం, కర్మాగారాలు, వైద్యచికిత్సల నిమిత్తం వివిధ రంగాల్లో ఉపయోగిస్తారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో మనుషులు చేయలేని పనులను సైతం అవి సమర్థవంతంగా నిర్వహించగలవన్నారు. సైన్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం పెంపొందిస్తాయని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతాయని అన్నారు. రోబోటిక్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు 32 మోడళ్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు ఐలయ్య, ప్రధానోపాధ్యాయుడు రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏఎంసీ చైర్పర్సన్గా ఇరుకుల మంగ
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా ఇరుకుల మంగ నియామకమయ్యారు. వైస్ చైర్మన్గా గాజుల రవీందర్, 16 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేర కు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం నూతన చైర్పర్సన్గా మంగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఏళ్లుగా సామన్య కార్యకర్తగా పార్టీ బలోపేతం కృషి చేసిన తనను రాష్ట్ర నాయకత్వం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వైరాగడె మారుతిపటేల్, గాజుల జక్కన్న, నాయకులు ఎండీ నిజాం, ఆకుల శ్రీనివాస్గౌడ్, సుదర్శన్గౌడ్, వెంకట్రెడ్డి, విజయ్, వాసుదేవ్, బాలేష్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


