breaking news
Komaram Bheem
-
సరుకులు సైతం అందించాలి
ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరి రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు పప్పు, నూనె, చక్కెర, ఉప్పు, కారం వంటి నిత్యావసర సరుకులు అందించాలి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెరగడంతో కొనలేని పరిస్థితి ఉంది. – వొజ్జల శిరీష్శర్మ, ఆసిఫాబాద్ ఐదేళ్లుగా ఎదురుచూశాంఐదేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. అప్పటి నుంచి రేషన్కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు సర్వే నిర్వహించి మంజూరు చేశారు. కొన్నేళ్లపాటు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. – గుర్నులె జ్యోత్స్న, వాంకిడి -
అట్టహాసంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్గనగర్లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్లు విద్యాసాగర్, అరవింద్, పీఈటీలు యాదగిరి, లక్ష్మి, సరోజ, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్అర్బన్: సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించి ముందు వరుసలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. తిర్యాణి మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం విద్య, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ, ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, మిషన్ భగీరథ, గ్రా మీణాభివృద్ధి శాఖల అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స అందించాలన్నారు. ప్రతినెలా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సరైన పోషకాహారం అందించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): రోడ్డు, రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. వాంకిడి మండలంలోని టోల్ప్లాజా వద్ద అధిక శబ్దానిచ్చే 50 మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాడిఫైడ్ సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా వచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని సూచించారు. అలాగే డీజేల ఏర్పాటుకు అనుమతి లేవని, రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత ధ్వని కాలుష్యం కలిగించేలా స్పీకర్లు పెట్టొద్దన్నారు. కార్యక్రమంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, రమేశ్, సంజయ్, ఎస్సైలు మధుకర్, చంద్రశేఖర్, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉండి వైద్యం అందించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పర్మినెంట్ 108 అంబులెన్స్ అందుబాటులో లేదని, సిబ్బందికి సరిపడా భవనాలు లేవని, తదితర సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఐటీడీఏ పీవోతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్చార్జి మంత్రితో మాట్లాడి సిబ్బందికి నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా సార్మెడి కుర్సెంగ మోతీరాం, గిన్నెధరి సార్మెడి అడ తాను, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మర్సుకోల కమల తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కోసం రైతుల ఆందోళన
కాగజ్నగర్టౌన్: సరిపడా డీఏపీ, యూరియా బస్తాలు ఇవ్వడం లేదని శుక్రవారం కాగజ్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగినా పీఏసీఎస్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, చిట్టీలు ఉన్న వారికే ఇస్తున్నారని ఆరోపించారు. విడతల వారీగా ఎకరానికి రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. చిట్టీలు ఉన్నవారికే ఎరువులు ఇస్తారని చెప్పడంతో రైతులు వరుసలో నిలబడి రాత్రి 8 గంటలు దాటే వరకు బస్తాలు తీసుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి రామకృష్ణను వివరణ కోరగా.. కాగజ్నగర్ మండలంలో ఖరీఫ్ సాగుకు 85 వేల బస్తాలు అవసరం కాగా ఇప్పటికే రైతులకు పీఏసీఎస్ ద్వారా 27 వేల బస్తాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా 14వేల బస్తాలు, ఇతర ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా డీఏపీ బస్తాలు అందించామని తెలిపారు. ఈ నెల 9న డీఏపీ, యూరియా బస్తాల పంపిణీ కూపన్లను పీఏసీఎస్లకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు కోరడంతో అప్పగించామన్నారు. రైతులు నానో యూరియా వాడాలని సూచించారు. సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. -
పనులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్లో శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అంతకుముందు వందరోజులు పనిచేసిన ఉపాధి కూలీలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీ ఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో బుచ్చయ్య, డీఎల్పీవో హుస్సేన్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ తదితరులు పాల్గొన్నారు. -
నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం
కాగజ్నగర్టౌన్: జిల్లాలో కుక్కల జనాభాను నియంత్రణకు కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన డాగ్స్ రిహాబిటేషన్ కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఓ వైపు కుక్కలు మనుషులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీధికుక్కల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శునకాలకు తప్పనిసరిగా స్టెరిలైజేషన్ చేసిన తర్వాతే బయటికి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ కాగజ్నగర్లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కేంద్రం నిరుపయోగంగా మారింది. రూ.20లక్షలతో నిర్మాణం కుక్కల నియంత్రణలో భాగంగా కాగజ్నగర్లోని సీబాబుకాలనీలో గల ప్రభుత్వ స్థలంలో రూ.20 లక్షలతో డాగ్స్ రిహాబిటేషన్ సెంటర్ భవనాన్ని నిర్మించారు. కుక్కల జనాభాను అరికట్టేందుకు శస్త్ర చికిత్సలు, స్టెరిలైజేషన్, యాంటీ రెబీస్ వ్యాక్సిన్లు తదితర చర్యలు ఇక్కడ చేపట్టాల్సి ఉంది. ఈ సెంటర్లో కుక్కలకు చికిత్స చేసేందుకు కావాల్సిన సర్జికల్ థియేటర్లు, రికవరీ యూనిట్లు, ఇతర మౌలి క సదుపాయాలు సమకూర్చాలి. భవన నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు సిబ్బందిని నియమించలేదు. ఈ కారణాలతోనే కేంద్రం ప్రారంభంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ప్రారంభిస్తాంపట్టణంలో కుక్కల నియంత్రణకు సీబాపుకాలనీలో రిహాబిటేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయ్యింది. ప్రారంభంలో జరుగుతున్న జాప్యం విషయాన్ని అడిషనల్ కలెక్టర్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లాం. శస్త్ర చికిత్సకు కావాల్సిన పరికరాలు సమకూర్చి, సిబ్బందిని నియమిస్తాం. త్వరలోనే కేంద్రం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ పెరుగుతున్న కుక్కల సంఖ్యకాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. సుమారు 70 వేల మంది నివస్తున్నా రు. రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ వార్డులోని ఖాళీ ప్రదేశాలు, ఖాళీ క్వార్టర్లలో తలదాచుకుంటూ సంతానం పెంచుకుంటున్నాయి. కుక్కల నియంత్రణ కు పటిష్టమైన ఎనిమల్ బర్త్ కంట్రోల్ (స్టెరిలైజేషన్) లేకపోవడంతో వాటి సంతతి పెరుగుదలపై అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రిపూట రోడ్లపై తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులకు దిగుతున్నాయి. ఇ టీవల పట్టణంలోని కాపువాడకు చెందిన మహిళపై శునకాలు దాడి చేసి గాయపర్చాయి. అధి కారులు స్పందించి మున్సిపాలిటీలోని డాగ్స్ రిహాబిటేషన్ సెంటర్ను ప్రారంభించి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించి వాటి జనాభాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. -
రక్తదానం అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: రక్తదానం అందరి బాధ్యతని, ప్రతిఒక్కరూ ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, డీఎంహెచ్వో సీతారాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ హాజరయ్యారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతీ మూడు నిమిషాలకు ఒకరికి రక్తం అవసరం పడుతుందని, మనిషి మాత్రమే రక్తదానం చేయగలడన్నారు. నాలుగురోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రంలో రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తం సేకరించాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో సీతారాం రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ కాగజ్నగర్, ఆసిఫాబాద్లో రెండు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని, జైనూర్లో మరొకటి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, వైద్యశాఖ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడిపై మూడుసార్లు కాటువేసిన కట్లపాము
పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొడప నవదీప్(11) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నేలపై నిద్రించాడు. సుమారు 9గంటల ప్రాంతంలో కట్లపాము నవదీప్ చేతిపై మూడుసార్లు కాటువేసింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లైటు వేశారు. పక్కనే ఉన్న కట్లపామును గమనించి కొట్టి చంపారు. బాలుడిని చికిత్స కోసం కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సిర్పూర్(టి)లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నవదీప్ ఇటీవలే ఇంటికి వచ్చాడు. పాముకాటుతో కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు సులోచన, జగదీష్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబానికి పలువురు దాతలు ఆర్థికసాయం అందించారు. -
‘పింఛన్లు పెంచకుంటే ఊరుకోం’
కౌటాల(సిర్పూర్): హామీ మేరకు కాంగ్రెస్ ప్ర భుత్వం పింఛన్లు పెంచకుంటే ఊరుకోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కౌటాలలో గురువారం ఏర్పాటు చేసిన మహాగర్జన స న్నాహక సదస్సులో మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా పెన్షన్లు పెంచకుంటే హైదరాబాద్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎ స్ మండల అధ్యక్షుడు ఇగురపు విఠల్, నాయకులు పిట్టల సత్యనారాయణ, థామస్, అని ల్, రాజేశ్, హీరమన్, శంకర్ పాల్గొన్నారు. -
క్షీణిస్తున్న ‘పాల్వాయి’ ఆరోగ్యం
కాగజ్నగర్టౌన్: ఎమ్మెల్యే పాల్వయి హరీశ్బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. రాత్రి ప్రభు త్వ ఆస్పత్రి వైద్యుడు శ్రీధర్బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం కాగజ్నగర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించా రు. సమావేశంలో ఈర్ల విశ్వేశ్వర్రావు, శ్రీని వాస్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతుసత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు పలికారు. కాగజ్నగర్ మండలంలోని బెంగాళీలు, విశ్వబ్రహ్మణ సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మాజీ, నాయకులు ముకేశ్గౌడ్, తిరుపతి, ఆంజనేయులు, గోవర్ధన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
‘ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తాం’
బెజ్జూర్(సిర్పూర్): భారీ వర్షాలతో ప్రాణహి త నది ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహా రం అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండలంలో ప్రాణహిత వరదతో మునిగిన పంటలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూర్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో గతంలో పరిహారం అందించారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు. సమస్యలు ఉంటే తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏవో రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పంద్రం పుష్పలత, జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, టాకిరే శ్రీనివాస్, రాచకొండ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు చేస్తే రాయితీలు రద్దు
ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు రద్దు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం మాదకద్రవ్యాల నివారణపై ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, అధికారులు భూయజమానులపై చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి పాన్టేలాలు ఉండొద్దని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలిజిల్లాలో పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్దోత్రే అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్నబీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో ఉత్సవాల నిర్వాహకులు, మసీదు కమిటీ ప్రతినిధులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ మంట పాల పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా సమావేశాల్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీటీవో రాంచంందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఎస్పీ రామానుజం, ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
3న జాతీయ లోక్అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో గురువారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి ఉల్లం అజయ్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అమృత్పౌల్ కౌర్, ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులు పరి ష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీ చేయడానికి అనుకూలంగా ఉన్న కక్షిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
మద్యం పాలసీ వచ్చేసింది..
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రస్తుత పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండగా, పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేలా 2025– 27 నూతన ఎకై ్సజ్ పాలసీ ఖరారు చేసింది. రెండేళ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుం గతంలో రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలకు పెంచింది. అయితే టెండర్ షెడ్యూల్ను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరించే అవకాశాలు ఉన్నా యి. రెండేళ్లపాటు దుకాణాల నిర్వహణకు ఒకరు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలుడిసెంబర్ నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి రానుంది. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1,020 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో మాదిరిగానే జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రాతిపదికన షాపులు కేటాయించనుంది. గౌడ కులస్తులకు 2, ఎస్సీ 4, ఎస్టీలకు 6 దుకాణాలు కేటాయించగా, జనరల్ కేటగిరీలో మరో 20 దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన టెండర్లు నిర్వహించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రుసుం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ అయితే ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్ఫొటోలు జత చేయాలి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్ను సంప్రదించగా.. జిల్లాలో పాత విధానం మాదిరిగానే మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. -
మట్టి వినాయకుడు.. పర్యావరణ పరిరక్షకుడు
చింతలమానెపల్లి: వినాయక చవితి ఉత్సవా లకు భక్తులు సిద్ధమవుతున్నారు. గణనాథు డి విగ్రహాలకు తుది మెరుగులు దిద్దే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. గతంలో ఇళ్లలో ప్రతిష్టించే విగ్రహాలను కుమ్మరి కళాకారులు తయారు చేసే మట్టి విగ్రహాలకు కాల క్రమేణా ఆదరణ తగ్గింది. రంగులతో మురిపించే విగ్రహాలు పర్యావరణానికి హానికరంగా మారుతుండటం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై స్పృహ పెరగడంతో మళ్లీ మట్టి విగ్రహాలకు ఆదరణ వస్తోంది. చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామంలో కుమ్మరి కళాకారులు మట్టి విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇళ్లలో ప్రతిష్టించేందుకు వీలుగా మంచిర్యాల, కాగజ్నగర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆర్డర్పై తీసుకెళ్తున్నారు. కూలి మాత్రమే గిట్టుబాటు కుమ్మరి కళాకారులకు మట్టి పని మాత్రమే ఉపాధి. వినాయక విగ్రహాల తయారీకి సిర్పూర్(టి) మండలం లోనవెల్లి నుంచి మట్టి తీసుకొస్తాం. మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. కానీ రోజుల తరబడి పని చేసినా కూలి మాత్ర మే గిట్టుబాటవుతుంది. ఎక్కువగా ఆర్డర్లు వస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మట్టి వినాయకుల వినియోగానికి ప్రచారం చేసి, కులవృత్తిగా ఉన్న విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి. – శంకర్, రుద్రాపూర్ – మరిన్ని కథనాలు 8లోu -
వరద నష్టాల నివారణకు చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన వరద నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలి పారు. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, లోలెవల్ వంతెనలు కొట్టుకుపోయాయన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 4,503 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, సుమారు 3,100 మంది రైతులు పంటలను నష్టపోయారని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, రైతుల వివరాలు నమోదు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పశు సంపద నష్టం వివరాలతో నివేదికలు రూపొందిస్తే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో రహదారులు కొంతమేర ధ్వంసమయ్యాయని, తెగిన అప్రోచ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి విద్యార్థుల ను ఇతర గురుకులాలకు తరలించారని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డుపడుతుందని ఆరోపించా రు. అంతకు ముందు మంత్రి జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. ఆసిఫాబాద్ మండలం మాలన్గొందికి చెందిన సిడాం గంగుకు చెందిన మేకలు వ ర్షాలతో మృత్యువాత పడగా, బాధితుడికి రూ.1.50 లక్షల పరిహారం ప్రొసీడింగ్ అందించారు. సమావేశంలో కాగజ్నగర్ అటవీ డివిజన్ అధికారి సుశాంత్, జీసీవో తిరుపతి, ఆర్డీవో లోకేశ్వర్రావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, రోడ్డు భవనాల శాఖ ఈఈ సురేశ్, డీఏవో శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలుకలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూపం ఏర్పాటు చేశామన్నారు. రైతులను ఆదుకోవాలివట్టివాగు ప్రాజెక్టు కాలువకు గండి పడటంతో రైతులు పత్తి పంట నష్టపోయారని బాధితులను ఆదుకో వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రై తులకు పూర్తిస్థాయిలో సాగు నీరందించాలన్నారు. ఎన్టీఆర్ కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం చూపుతాంరెబ్బెన: ఎన్టీఆర్ కాలనీ వాసుల వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంత్రికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ పాల్గొన్నారు. కుమురంభీం విగ్రహానికి నివాళికెరమెరి: మండల కేంద్రంలోని సాకడ చౌరస్తా వద్ద ఉన్న కుమురంభీం విగ్రహానికి మంత్రి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిఆసిఫాబాద్రూరల్: వరదలతో దెబ్బతిన్న కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసిఫా బాద్ మండలం రాజురకు వెళ్లే రహదారిపై కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. రాజుర గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని, బూర్గుడ నుంచి రాజుర వరకు రోడ్డు వేయాలని, పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
23న రాష్ట్రస్థాయి ధర్నా
కాగజ్నగర్టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 23న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్పీసీ రాష్ట్ర నాయకులు చరణ్దాస్, వైద్య శాంతికుమారి పిలుపునిచ్చారు. పట్ట ణంలో బుధవారం మహాధర్నా పోస్టర్ ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జాడికేశవ్, రాజ్కమలాకర్, మహిపాల్, మహేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకి నాయకుల రాజీనామా
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సీనియర్ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారా యణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కాగజ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు రవికాంత్తోపాటు సుమారు 500 మంది కార్యకర్తలు రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. -
కార్మికుడి వారసులకు చెక్కులు అందజేత
రెబ్బెన: సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి వారసులకు బుధవారం ఏకమొత్తం చెక్కును గోలేటి లోని జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి అందజేశారు. గోలేటి 1ఏ గనిలో కోల్కట్టర్గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో గులాం మృతి చెందాడు. అతని వారసులైన యూసుఫ్ అలీ, మాసుం అలీ వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు మెడికల్ ఫిట్ సాధించలేకపోవడంతో ఏకమొత్తం చెల్లింపు కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆదాయపు పన్నును మినహాయింపు కాగా ఒక్కొక్కరికి రూ. 6.25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం రాజేశ్వర్రావు, ఏఐటీయూసీ నాయకులు కిరణ్, జూనియర్ అసిస్టెంట్ బాబా, తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్ట్రంలోని అంశాలపై ఖాన్ అకాడమీ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఖాన్ అకా డమీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకా రం కృత్యాలు సాధన చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు భరత్రావు, సమ్మయ్య, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే రక్ష!
చింతలమానెపల్లి(సిర్పూర్): రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు వినియోగించుకుంటున్నారు. కొత్తపోకడలు అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు పెరిగాయి. బాధితులకు న్యాయం చేయడంతోపాటు మోసాల బారిన పడకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2024లో 401 సైబర్ క్రైం ఫిర్యాదులు రాగా వీటిలో 31 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2025లో ఇప్పటివరకు 195 ఫిర్యాదులు రాగా 15 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. పలు రకాలుగా మోసం‘బ్యాంకుల్లో నగదు తమకు తెలియకుండానే మా యమవుతుంది... బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్పే ద్వారా నగదు తీసుకున్నారు.. ఖాతాల్లోని నగదు వినియోగించుకోలేక పోతున్నాం..’ అంటూ ఇటీవల తరచూ పోలీస్స్టేషన్లకు, బ్యాంకులకు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్లో ఆటలు ఆడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య కూడా వందల సంఖ్యలో ఉంటోంది. చిన్నారులు సైతం లక్షలాది రూపాయలను ఆన్లైన్లో కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్, షాపింగ్ ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఇటీవల కస్టమ్స్ అధికారులమని, నగ్న వీడియో కాల్స్తో బెదిరింపులు సైతం కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీ డియాను నేరగాళ్లు మోసాలకు అనువుగా మార్చుకుంటున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి ఈ సమాచార వేదికల ద్వారా నెట్వర్క్ పెంచుకుంటున్నారు. నిమిషాల్లో రూ.లక్షల ఆదాయం, కార్లు, విలువైన బహుమతుల పేర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు. రకరకాల కరెన్సీల పేరుతో పెట్టుబడి పెట్టించి రెట్టింపు లాభాలు ఆశ చూపి బుట్టలో వేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో గుర్తు తెలియని లింక్లు తెరిచినా వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలను తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉండే అతను లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. ఇల్లు, భూములు అమ్ముకుని చెల్లించినా పూర్తిస్థాయిలో తీరలేదు. సాధారణ జీవితం గడిపే అతడు ఎలా అప్పుల పాలయ్యాడనేది గ్రామంలో చర్చనీయంగా మారింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. రకరకాలుగా బెదిరింపులు..రాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఎవరో అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తే.. అవతలి వైపు ఒక నగ్నంగా ఉన్న వ్యక్తి.. ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని ఆపై బెదిరింపులకు పాల్పడతారు. భయపడినా, అమాయకంగా కనిపించినా బెదిరింపులకు దిగుతారు. అందిన కాడికి డబ్బులు వసూలు చేసేందుకు ఎంతకై నా తెగిస్తారు. అలాగే కొరియర్ పంపించి, అందులో వివాదాస్పద వస్తువులు ఉన్నాయని పోలీసు అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడతారు. బ్యాంకు అధికారులమని చెప్పి వ్యక్తిగత వివరాలతోపాటు పాస్బుక్, ఆధార్, ఓటీపీ ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఇలా ఖాతాల్లోని సొమ్ము మాయం చేస్తున్నారు. సమయంలో అప్రమత్తంగా ఉంటే సమస్య నుంచి బయటపడొచ్చని అధికారులు సూచనలు చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లికి చెందిన ఆత్రం సాయి ఆన్లైన్లో రూ.28వేలు మోసపోయినట్లుగా ఫిర్యాదు పోలీసులకు చేశాడు. హర్షసాయి అనే యూట్యూబర్ పేరుతో హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి చెందిన తౌఫిక్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. అనుచరులతో కలిసి నకిలీ నంబర్లు, వాట్సాప్ ద్వారా ప్రలోభాలు గురిచేసి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.‘జన్నారం’ ఘటనతో అలర్ట్మంచిర్యాల జిల్లా జన్నారంలో సిమ్కార్డుల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్ పోలీసులు చేధించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులతోపాటు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలను సైబర్ నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటుండటంతో జిల్లా పోలీసు అల ర్ట్ అయ్యారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాజాత బృందాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్పీ కాంతిలాల్, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు సైతం వేదికలపై డిజిటల్ మోసాల గురించి ప్రస్తావిస్తున్నా రు. యువత అవగాహన పెంచుకుని తల్లి దండ్రులకు వివరించాలని సూచిస్తున్నారు. స్టేషన్లలో సీఐ, ఎస్సై, సిబ్బందితో టీంను ఏర్పాటు చేసి కేసులను విచారిస్తున్నారు. సైబర్ క్రైం కేసుల్లో ఆర్థిక, ఆర్థికేతర ఘటనలుగా వేర్వేరుగా విభజించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
పల్లెల్లో పనుల జాతర
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 22న పనుల జాతర – 2025 కార్యక్రమం చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఏ ర్పాట్లు సిద్ధం చేశాయి. ఆ రోజున ఉపాధిహామీ పథకంతోపాటు వాటర్షెడ్ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛ భారత్ వంటి విభాగాల్లో చేపట్టిన, చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో 951 పనులుజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పనుల జాతర –2025 నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి దత్తారావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 951 పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయనునున్నారు. ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పనుల జాతరలో భాగంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి– ఉపాధి భరోసా కింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులైన పశువుల కొట్టం, కోళ్లు, గొర్రెల షెడ్లు, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లా పిట్ నిర్మాణం, జలనిధి పథకం కింద వాన నీటి సంరక్షణ, భూగర్బ జలాలు పెంచే ఫారం పాండ్స్, ఊట కుంటలు వంటి పనులు ప్రారంభించనున్నారు. రైతులు, లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో మంజూరు ఉత్తర్వులు అందించనున్నారు. అలాగే ఉపాధిహామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలతోపాటు దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను సన్మానిస్తామని అధికారులు వెల్లడించారు. -
రెండోరోజూ నిరవధిక నిరాహారదీక్ష
కాగజ్నగర్టౌన్: పోడు భూముల సమస్యకు పరిష్కారం, జీవో 49 రద్దు కోసం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సోమవారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజూ మంగళవారం కూడా కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మే 30న తడోబా రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుతూ కుమురం భీం జిల్లాలోని 334 గ్రామాలను రిజర్వు ఫారెస్ట్గా పేర్కొంటూ అక్రమంగా తీసుకువచ్చిన జీవో నం.49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిందా పోడు రైతులను రవీంద్రనగర్లోని కర్జెల్లి ఫారెస్ట్ కార్యాలయానికి పిలిపించి బెదిరింపులకు పాల్పడడం దారుణమని, దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో పోడు భూముల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి, ప్రభుత్వం నుంచి జీవో 49 రద్దు చేస్తామనే ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, రెండోరోజు వైద్యులు ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేశారు. దీక్షకు సంఘీభావంగా సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, దహెగాం, కాగజ్నగర్, చింతలమానెపల్లి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శాసనసభ స్పీకర్కు లేఖ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని, పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఎమ్మెల్యే హరీశ్బాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49 కుమురం భీం జిల్లాలో చిచ్చురేపుతుందన్నారు. పోడు రైతులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు హైదరాబాద్కు కాలినడకన వెళ్తుండగా వారిని అరెస్టు చేసి సొంత గ్రామాలకు తరలించారని తెలిపారు. కాగజ్నగర్ అటవీ కార్యాలయం ముట్టడికి శాంతియుతంగా పిలుపునిస్తే ప్రభుత్వం అనుమతివ్వకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. -
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట
● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జైనూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యౖ మెన విద్యనందించడంతోపాటు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉ మ్మడి జిల్లా ఇన్చార్జి, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. జైనూర్ మండలం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గురుకుల నిద్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన చిత్రాల వివరాలు తెలు సుకున్నారు. చరిత్ర పుస్తకాలు ప్రింట్ చేయించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల వసతిగృహానికి చేరుకున్నారు. భోజన వివరాలు అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్ పాల్గొన్నారు. ‘ఉపాధ్యాయులదే బాధ్యత’ఆసిఫాబాద్రూరల్: పాఠశాలలు, వసతిగృహా ల్లో విద్యార్థుల హాజరు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావాలని, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ప్రకారం హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సెలవుపై వెళ్లే ఒకరోజు ముందు అనుమతి తీసుకోవాలన్నారు. ఎస్వోలు శ్రీనివాస్, అబిద్ అలీ, ఉదయ్బాబు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను మంగళవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. విద్యార్థుల హాజరుశాతం, వంటశా ల, ప్రయోగశాలను పరిశీలించారు. అనంత రం జన్కాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎంఈవో సుభాష్, ఎస్వో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ ఉన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో గల శ్రీనివాస ఫ ల్టిలైజర్ షాపును మంగళవారం ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, ఈ పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాక్ వివరాలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనల ప్ర కారం యూరియా, ఇతర మందులు వినియోగించాలని సూచించారు. ఎరువులు, మందులు అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మిలింద్కుమార్ పాల్గొన్నారు. అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్పక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ ఆది కర్మ యోగి కార్యక్రమాల ద్వారా 12 మండలాల్లోని 102 గ్రామాల్లో ఉన్న గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా బ్లాక్ స్థాయి(మండల) మాస్టర్ ట్రైనర్లు గ్రామస్థాయి శిక్షకులకు శిక్షణ ఇవ్వాలన్నారు. వివిధ శాఖల నుంచి పంచాయతీ స్థాయి సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించారు. శిక్షణ పూర్తయిన తర్వాత 102 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఎంహెచ్వో సీతారాం, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పర్యాటకశాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు. -
‘మినరల్’ దందా
బెజ్జూర్(సిర్పూర్): ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ.. మినరల్ వాటర్ పేరిట కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్యూరిఫైడ్ నీళ్ల పేరిట నిర్వాహకులు ఏటా రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు కలుషిత నీటిని అందిస్తున్నారు. కేవలం ఒక ట్యాంక్, మరో రెండు బా యిలర్ మాదిరి ట్యాంకులు.. అన్నింటినీ అనుసంధానిస్తూ పైప్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో పట్టణాలకు పరిమితమైన మినరల్ వాటర్ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. క్యాన్కు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్లను శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. 500లకు పైగా ప్లాంట్లు జిల్లాలో ప్రస్తుతం 500 పైగా ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసి కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాలు శుద్ధి చేయకపోవడం, జలాన్ని శుద్ధి చేయకుండా సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలువురు ఇళ్లతోపాటు దుకాణాలు, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. కనీసం నీటి నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో నిబంధనలు పాటించని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ సర్టిఫికెట్లు కొన్నింటికి ఉన్నా ఏటా రెన్యువల్ చేసుకోవడం లేదు. నిబంధనలపై పట్టింపేది..? వాటర్ ప్లాంట్లో మైక్రోబయాలజిస్ట్, కెమిస్ట్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉంటూ పీహెచ్ విలువ 7 కంటే తగ్గకుండా చూసుకోవాలి. పీహెచ్ స్థాయిలో హెచ్చుతగ్గులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. ప్రతీ క్యాన్పై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ కూడా వేయాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్ఐ అనుమతి తీసుకోవడంతో పాటు ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ప్రతీ మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. కానీ పై నిబంధనలేవీ జిల్లాలోని ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. ఈ విషయంపై ‘సాక్షి’ భూగర్భజల శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి కె.సుహాసినిని వివరణ కోరగా.. ఇప్పటివరకు జిల్లాలోని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, లింగాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందించామని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలి మినరల్ వాటర్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్యాన్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వర్షాకాలంలో వాగు, చెలిమె నీళ్లు తాగొద్దు. – సీతారాంనాయక్, డీఎంహెచ్వో -
తప్పని నిరీక్షణ
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఓ వైపు అధికారులు కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎరువులు సరిపడా అందడం లేదు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని గోదాం వద్దకు మంగళవారం పెంచికల్పేట్, ఎల్లూర్, ఎల్కపల్లి, కొండపల్లి, కమ్మర్గాం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించారు. అలాగే సిర్పూర్(టి) మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కూపన్ల కోసం క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాశారు. సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. – పెంచికల్పేట్/సిర్పూర్(టి) -
వీడని వాన
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/సిర్పూర్(టి)/కౌటాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాన పడటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాలో 62.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా వాంకిడిలో 94.3, జంబుగ 67, రెబ్బెన 62, ధనోరా 61.3, కెరమెరి 57.5, సిర్పూర్– టి 39.5, సిర్పూర్– యూ 38, జైనూర్ 36.0, గిన్నెధరి 33.0, వంకులం 31.5, కాగజ్నగర్ 27.5, ఆసిఫాబాద్ 25.8, లింగాపూర్ 23.0, బెజ్జూర్ 21.0, లోనవెల్లి 20.8, దహగాం 10.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్లుభారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మున్సి పల్ రెస్క్యూ టీం కార్మికులకు మున్సిపల్ కమిషనర్ గజానంద్ రెయిన్కోట్లు పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 96664 68821, 97057 80116, 73862 82002 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఉప్పొంగిన ‘పెన్గంగ’మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో సిర్పూర్(టి) మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లోని మాకిడి, జక్కాపూర్, హుడ్కిలి, వెంకట్రావ్పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిర్పూర్(టి)– మాకిడి అంతర్రాష్ట్ర రహదారిలోని హుడ్కిలి సమీపంలోని లోలెవల్ వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రహీముద్దీన్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో సత్యనారాయణ వరద ప్రవహాన్ని పరిశీలించారు. హుడ్కిలి వంతెన మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. వెంకట్రావ్పేట్ సమీపంలోని వెంకట్రావ్పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని వంతెన వద్ద నది ఉధృతిని పరిశీలించారు. సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిలోని పారిగాం సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో రాకపోకలపై ఆరా తీశారు. -
బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, విజయ్కుమార్, ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేందర్గౌడ్, మారుతి, రాణి, సుదర్శన్గౌడ్, వెంకట్నాయక్, జిల్లా కార్యదర్శులుగా సోమేశ్వర్, నవీన్గౌడ్, ఇందిర, సుభోద్, రోజా, గుప్తా, జిల్లా కోశాధికారిగా కిరణ్కుమార్, కార్యాల యం కార్యదర్శిగా సూర్య ప్రకాశ్, సోషల్ మీడియా ఇన్చార్జిగా సంతోష్, మీడియా కన్వీనర్గా సత్యనారాయణ, ఐటీ ఇన్చార్జిగా అమిత్ బిశ్వాస్ను ఎన్నుకున్నారు. -
ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు సోమవారం 52,220 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు 4 మీటర్లు పైకెత్తి 52,220 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.872 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే వట్టివాగు ప్రాజెక్టుకు 3,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, రెండు గేట్లు 0.9 మీటర్లు పైకెత్తి 3,250 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న గుండి, రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్కు చెందిన మీరారాణి మండల్ తన పేరుతో గల లావుణి పట్టా భూమిని తమ్ముడు పట్టా చేసుకున్నాడని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది. జిల్లాలో ఔట్సోర్సింగ్ పోస్టులను సమానంగా కేటాయించాలని మిత్ర సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ కొండగొర్ల చంద్రశేఖర్ దరఖాస్తు సమర్పించాడు. బూర్గుడ సమీపంలోని ఫోర్లేన్ రహదారి పక్కన ఖాళీ స్థలాలను కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంతో వరదతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బూర్గుడ రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తూ తన తండ్రి మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన ఒడ్డే పెంటన్న దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడ శివారులో తన భూమిని అక్రమంగా మార్చిన పట్టా రద్దు చేయాలని ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్కు చెందిన జాడి పుల్లయ్య విన్నవించాడు. ఆసిఫాబాద్ మండలం జెండగూడకు చెందిన కామెడె నర్సింగ్రావు తనకు వారసత్వంగా సంక్రమించిన భూమికి పట్టా పాస్బుక్ జారీ చేయాలని కోరాడు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్కు చెందిన పొన్నం పురుషోత్తం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమన్వయంతో దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
‘దిందా’ రైతులతో
ఎమ్మెల్సీ, అధికారుల చర్చలుచింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు భూముల రైతులతో సోమవారం ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్ బొగాడే చర్చలు జరిపారు. ఖర్జెల్లి అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో పోడు రైతులతో సమావేశమయ్యారు. దిందా రైతులకు ఎఫ్డీవో అటవీ చట్టాల గురించి వివరించారు. ఒక్కో రైతుకు ఎంత భూమి ఇవ్వాలనే విషయంపై అంగీకారానికి రావాలని సూచించారు. రైతులు మాట్లాడుతూ తమకు గతంలో ఇస్తానని ప్రకటించిన భూమికి తోడు అదనంగా మరో 250 ఎకరాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలో 330 రేషన్ కార్డులు ఉండగా, మరో 20 కుటుంబాలకు లేవని తెలిపారు. మొత్తం 350 కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరారు. ఐదెకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు యథాస్థితిని కొనసాగించాలని, ఎక్కువ ఉన్న రైతులకు మాత్రం ఐదెకరాలు ఇచ్చి మిగతా భూమిని తీసుకునేందుకు అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఎఫ్డీవో మాట్లాడుతూ రైతులకు నిబంధనల మేరకు మూడెకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులు తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని అటవీ అధికారులకు సూచించారు. నాలుగెకరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎఫ్ఆర్వో సుభాష్, కౌటాల సీఐ సంతోష్, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. -
గృహయోగానికి ‘అటవీ’ అడ్డంకి
సిర్పూర్(టి) మండలం మేడిపల్లికి చెందిన సుమన్బాయి భర్త పిల్లలతో కలిసి గుడిసెలో ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో ఎంతో సంతోషపడ్డారు. అయితే అటవీశాఖ అధికారులు ఇంటి పనులు అడ్డుకున్నారు. సిడాం లచ్చు ఏళ్లుగా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అతడి భూములకు ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక కావడంతో లచ్చుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు ఆగిపోయాయి.సిర్పూర్(టి): దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా బతుకుతున్న గిరిజనుల చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అటవీశాఖ అధికారులు మాత్రం అనుమతుల పేరిట అభ్యంతరం తెలుపుతున్నారు. ఫలితంగా ఏడు నెలులు గడిచినా ఆ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకునేందుకు సన్నద్ధమవుతుండగా అటవీశాఖ అధికారులు పనులు అడ్డుకుని నిలిపివేశారు. దశాబ్దాలుగా నివాసం..మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అటవీశాఖ అనుమతులు లేకపోడంతోనే అర్ధంతరంగా నిలిచిపోయాయి. అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే చేపట్టినా ఇప్పటికీ సర్వే రిపోర్టు రాలేదు. అయితే మేడిపల్లిలో దశాబ్దాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. భూములకు 50 ఏళ్ల నుంచి పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీరోడ్లు, మిషన్ భగీరథ ట్యాంక్, విద్యుత్ కనెక్షన్లు, పాఠశాల భవనాలు నిర్మించగా, ఇప్పుడు అధికారులు అటవీశాఖ పరిధిలో గ్రామం ఉందంటూ అడ్డు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ కారిడార్ నేపథ్యమే కారణమా..?మహారాష్ట్ర నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పెద్దపులులు సంచరించే మార్గంలో సిర్పూర్(టి) రేంజ్ కీలకం. దీనిని అటవీశాఖ టైగర్ కారిడార్గా గుర్తించింది. పులుల రాకపోకలను నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేంజ్ పరిధిలోని అటవీ భూముల్లో తిరిగి ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం, పోడు సాగు అడ్డుకోవడంతోపాటు టైగర్ ట్రాకింగ్కు ప్రత్యేక ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న మేడిపల్లి పంచాయతీ అటవీశాఖ తమ పరిధిలో ఉందంటూ ఇళ్ల నిర్మాణాలు నిలిపివేసిందనే చర్చ సాగుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మేడిపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాం. అయితే అడవి పరిధిలో గ్రామం ఉందంటూ అటవీశాఖ పనులు నిలిపివేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. సబ్ కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. – సత్యనారాయణ, ఎంపీడీవో, సిర్పూర్(టి)అనుమతులు రాలేదు సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటివరకు అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ప్రవీణ్కమార్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో 154 ఇళ్లు మంజూరు..సిర్పూర్(టి) మండలం మేడిపల్లి పంచా యతీ పరిధిలోని మేడిపల్లి, రావన్పల్లి, లింబుగూడ గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలకు కలిపి మొత్తం 154 ఇళ్లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసింది. మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 750 మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న గ్రామస్తులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇళ్లు మంజూరై ఏడు నెలలు గడుస్తున్నా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రావన్పల్లి గ్రామంలో కేవలం ఏడు ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించారు. -
మహనీయుల ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, గౌడసంఘాల నాయకులతో కలిసి సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజనుల కోసం పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతిగౌడ్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, నాయకులు సుదర్శన్గౌడ్, రమేశ్, ప్రణయ్ పాల్గొన్నారు. విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలిఆసిఫాబాద్రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. మండలంలోని ఎల్లారం ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. -
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దు
దహెగాం(సిర్పూర్): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండల కేంద్రంతోపాటు హత్తిని, ఐనం, పెసరికుంట గ్రా మాల్లో సోమవారం పర్యటించారు. వర్షానికి కూలిన హత్తినికి చెందిన లింగయ్య ఇంటితోపాటు మండల కేంద్రానికి చెందిన చిన్నక్కల ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఐనం సమీపంలోని లోలెవల్ వంతెనల వద్ద వరదతో దెబ్బతిన్న పంటల వివరాలను త హసీల్దార్ మునవార్ షరీఫ్ను అడిగి తెలుసుకున్నారు. పెసరికుంటలో పది కుటుంబాలకు చర్చిలో పునరావసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడికి తరలించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, కార్యదర్శులు ఉన్నారు. -
కై రిగూడలో తీజ్ సంబరాలు
రెబ్బెన: మండలంలోని కై రిగూడలో బంజారా, లంబాడా ప్రజలు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని పెళ్లి కాని యువతులు గత 9 రోజులుగా అత్యంత నియమనిష్టతలతో తీజ్ బుట్టలకు నీళ్లు పోస్తూ పూజలు చేయగా ఆదివారం తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సేవాలాల్, జగదాంబ ఆలయంలో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. తీజ్ బుట్టలను ఆలయం వద్ద నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీజ్బుట్టలను వాగుల్లో నిమజ్జనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో పాటు గ్రామ నాయక్ సుబ్బారావు, చౌహాన్ ఇందల్, కున్సోత్ రమేశ్, జరుపుల గణపతి, శంకర్, దారావత్ రవీందర్, గుడి పూజారి వసంత్రావు, వెంకట్రావ్, యువకులు వేడుకల్లో పాల్గొన్నారు. -
ఆయకట్టు అగమ్యగోచరం!
మరమ్మతు చేపట్టాలి భారీ వర్షంతో గండి పడిన వట్టివాగు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు అధికారులకు సరై న అవగాహన లేకపోవడంతో అవసరమైన ఆయకట్టుకు నీరివ్వడం లేదు. సా గు లేని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. – మెకర్తి గోపాల్, బూర్గుడ, మం.ఆసిఫాబాద్ ప్రతిపాదనలు పంపించాం భారీ వర్షంతో ప్రాజెక్టు కుడి కాల్వకు గండి పడింది. రూ.14 లక్షలతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైతే రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం. – అన్నాజీరావు, డీఈఈఆసిఫాబాద్: భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వకు గండి పడటంతో ఆయకట్టు సాగు అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు సాగు పనులు ముమ్మరంగా సాగుతుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. మరమ్మతులకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో వట్టివాగు కాల్వల్లోకి భారీగా వరద చేరింది. దీంతో కొమ్ముగూడ సమీపంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వ 8 కిలోమీటర్ల వద్ద గండి పడింది. బూర్గుడ సమీపంలోని ఎల్– 2 వద్ద సుమారు 200 ఎకరాల్లో పంట పొలాలు వరదనీటిలో మునిగాయి. పంట పొలాలు నీటితో చెరువుల ను తలపించాయి. సాగునీరంతా వృథాగా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాజెక్టు అధి కారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం వరినాట్లు వేస్తున్న తరుణంలో కాల్వకు గండి పడడంతో సాగు పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. లక్ష్యం చేరని ప్రాజెక్టుఆసిఫాబాద్ మండలం పహడిబండ వద్ద రూ.120 కోట్లతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజె క్టు కింద 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కుడికాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడ మ కాలువ ద్వారా 2,700 ఎకరాలకు సాగు నీరు అందాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 16 వేల ఎకరాలకు సాగు నీరంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నా వాస్తవంగా మూడు వేల ఎకరాలకు కూడా మించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు కాల్వలు మొత్తం దెబ్బతిన్నాయి. ఆది నుంచి ఆధునికీకరణ కు నోచుకోకపోవడంతో లైనింగ్ కోల్పోయి పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చాలాచోట్ల నామరూపాలు లేకుండా పోయాయి. ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టు రైతులకు సాగునీరందించే పరిస్థితి లేదు. రెండు, మూడేళ్లు నిరీక్షించిన చాలామంది రైతులు పంట పొలాలకు సాగునీరందక.. కట్టలు తెంచేసి ఆరుతడి పంటలే సాగు చేసుకుంటున్నారు.నీరున్నా నిష్ఫలంవట్టివాగు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నప్పటికీ ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులో వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు అధికా రులు రెండు గేట్లు ఎత్తివేశారు. గరిష్ట నీటిమట్టం 239.5 మీట ర్లు కాగా, ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 2700 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1000 క్యూసెక్కులు ఉంది. భారీ వర్షాలకు ప్రాజెక్టు కాల్వ కు గండి పడటంతో రూ.14 లక్షలతో మరమ్మతుల కు ప్రతిపాదనలు పంపించారు. అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
సమస్య పరిష్కారంలో అధికారులు విఫలం
కాగజ్నగర్టౌన్: పోడు భూముల సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు అత్యుత్సాహంతో పోడు రగడ జఠిలమైందన్నారు. పోడు రైతులను అడ్డుగా పెట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంత ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చింతలమానెపల్లి మండలం దిందా రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శామీర్పేట్కు చేరుకోగానే పోలీసులు అడ్డుకొని దొంగలు గా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నా రు. దిందా, ఇటుకపహాడ్, డబ్బా, కొండపల్లి గ్రామాల్లో అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారులకు వత్తాసు పలుకుతూ బీసీలకు పోడు భూములపై హక్కు లేదనడం అన్యాయమని పేర్కొన్నారు. బాధిత రైతుల పక్షాన సోమవారం అటవీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈకార్యక్రమాని కి పోడు రైతులు, వివిధ సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షు డు దోని శ్రీశైలం, రాష్ట కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్లోయ, ఓబీసీ మోర్చ రాష్ట కార్యవర్గ సభ్యుడు గొలెం వెంకటేశ్, జిల్లా కార్యదర్శి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, రాపర్తి ధనుంజయ్, సుధాకర్, వెంకన్న, భుజంగరావు, తిరుపతి, సదానందం, సత్యనారాయణ, సంతోష్, బావూజీ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్కు పందుల బెడద
ఈచిత్రంలో కనిపిస్తున్న పెంచికల్పేట్ గ్రామానికి చెందిన రైతు పేరు శ్రీనివాస్రెడ్డి. గన్నారం శివారులో సుమారు 13 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాడు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. నెల రోజుల క్రితం పెద్దఎత్తున అడవి పందుల గుంపు తోటలో ప్రవేశించి ఆయిల్పామ్ గెలలను నాశనం చేశాయి. పంట రక్షణ కోసం సుమారు రూ.3లక్షలతో తోట చుట్టూ మెష్ ఫెన్సింగ్ వేశాడు. ఆయినా అడవి పందులు తోటలోకి చొరబడుతున్నాయని వాపోతున్నాడు. పెంచికల్పేట్: ప్రభుత్వం సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందించడంతో జిల్లాలో అన్నదాతలు అధికారుల సూచనలతో పెద్దఎత్తున ఆయిల్పామ్ పంట సాగుచేశారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం కాపుకు వచ్చాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఆయిల్పామ్ గెలలను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పందులతో పరేషాన్..జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం ఎకరానికి 90శాతం సబ్సిడీ, ఉచితంగా డ్రిప్, అంతర పంటల సాగుకు సైతం ప్రోత్సాహకం అందజేసింది. దీంతో పెంచికల్పేట్, దహెగాం, కాగజ్నగర్ మండలాల్లోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేశారు. కాగా ప్రస్తుతం మొక్కలు తక్కువ ఎత్తులో ఉండటంతో అడవి పందుల గుంపులు తోటలను ధ్వంసం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో సంచరిస్తున్నాయి. ఆయిల్పామ్ గెలలను నాశనం చేస్తున్నాయి. పంటల రక్షణకు తోటల చుట్టూ కంచె వేసినా అడవి పందుల బెడద తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. గెలలను రక్షించుకోవడానికి పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో కాపలా కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల దాడులతో నష్టపోయిన పంటలకు సంబంధిత శాఖ అధికారులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పంటల రక్షణకు సూచనలు ఆయిల్పామ్ సాగు చేసిన రైతుల తోటలను సందర్శించి పంటల రక్షణకు సూచనలు చేస్తున్నాం. ప్రస్తుతం తక్కువ ఎత్తులో ఉన్న చెట్లకు కాత రావడంతో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటల రక్షణకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు అందజేస్తున్నాం. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తా. – సుప్రజ, హార్టికల్చర్ అధికారి, కాగజ్నగర్ డివిజన్ -
వేతన వెతలు
తిర్యాణి: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు రిసోర్స్ టీచర్ (సీఆర్టీ)లకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉపాధ్యాయులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్నా నెలనెల జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రైమరీ పాఠశాలల్లో 460 మంది సీఆర్టీలుగా విధులు నిర్వహిస్తుండగా వారికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంఽధించిన జీతాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. కాగా జీతాలకు సంబంధించిన బడ్జెట్ పంపినప్పటికీ ఆర్థికశాఖ నుంచి వేతనాలు విడుదల కాలేదంటూ ట్రెజరీ అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని, దిక్కు తోచని పరిస్థితుల్లో సీఆర్టీలు ఉన్నారు. సీఆర్టీలదే కీలకపాత్ర..ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే సీఆర్టీలు విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు పాఠశాల సమయంలో విద్యా బోధన చేస్తూనే మరోవైపు రాత్రి పూట స్టడీఅవర్లను సైతం నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి ఉన్నతికి దోహద పడుతున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడి విధులు నిర్వహిస్తున్నా తమకి నెలల వారీగా జీతాలు పెండింగ్ ఉంచడంపై మనస్తాపానికి గురవుతున్నారు. కుటుంబ షోషణ కోసం తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని, అప్పులు ఇచ్చిన వారికి ఎప్పుడు తిరిగి ఇస్తామో కూడా చెప్పలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట..!నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉండటంతో సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత (ఆగస్టు) నెలలో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా సీఆర్టీలకు ప్రతీనెల గ్రీన్ చానెల్ పద్ధతిలో వేతనాలు అందించాలని, మహిళా సీఆర్టీలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంటీఎస్ (మినిమమ్ టైం స్కేల్) ను అమలు పర్చాలని, దశల వారీగా సర్వీసును రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.విద్యాబోధన చేస్తున్న సీఆర్టీ -
‘టీఎల్ఎం’ మేళాకు వేళాయె
కెరమెరి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చి ఆశించిన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు కనీస అభ్యసనస్థాయి సాధించేలా కృత్యాధార బోధనకు బోధనాభ్యాసన సామగ్రి (టీఎల్ఎం – టీచర్ లెర్నింగ్ మెటీరియల్) దోహద పడుతోంది. ఈ సామగ్రిని సృజనాత్మకంగా రూపొందించి పాఠశాలల్లో అమలు పర్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఎల్ఎం మేళాల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మండల స్థాయిలో, ఈనెల 20న జిల్లాస్థాయిలో మేళాలు నిర్వహించనున్నారు. జిల్లాకు ఎంపిక..ప్రతీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్ఎంలను మండలస్థాయిలో నేడు ప్రదర్శించనున్నారు. ఎన్సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ఆధారంగా మండలస్థాయిలోని పది ఉత్తమ టీఎల్ఎంలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాలలో రెండేసి, అన్నింటిలో కలిపి ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యానిపుణులతో కూడిన జ్యూరీని నియమిస్తారు. జిల్లాస్థాయిలో ఆరుగురు నిపుణుల జ్యూరీ ఎనిమిది ఉత్తమ టీఎల్ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తుంది. సులువుగా అర్థమయ్యేలా..విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యే వి ధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నా రు. ప్రత్యేకంగా టీఎల్ఎం ద్వారా విద్యా బోధన చే స్తున్నారు. తమ మేథస్సుతో ఎన్నో ఉపకరణాలు త యారుచేసి, పాఠ్య పుస్తకంలో ఉన్న పాఠ్యాంశం ఆ ధారంగా టీఎల్ఎం తయారు చేసి బోధన చేస్తున్నా రు. దీంతో విద్యార్థి సులువుగా పాఠాలను అర్థం చేసుకునే వీలు ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీఎల్ఎం విని యోగించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్ర స్తుతం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వి ద్యార్థులు తయారు చేసిన టీఎల్ఎం గోడలకు అతి కించి కనిపిస్తున్నాయి. ఇందుకోసం గతంలో ఏటా ప్ర భుత్వం ప్రతీ పాఠశాలకు రూ.500 విడుదల చేసే ది. కానీ ప్రస్తుతం పాఠశాల నిధుల నుంచి టీఎల్ఎ ంకు వెచ్చించాలని అధికారులు పేర్కొంటున్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంపు టీఎల్ఎం ఉపకరణాల ద్వారా విద్యార్థుల కనీస అ భ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. నేడు మండల కేంద్రాల్లో నిర్వహించే టీఎల్ఎం మేళాకు ప్రాథమి క, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. టీఎల్ఎంలను ప్రదర్శించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్జిల్లాలోని పాఠశాలల వివరాలు.. -
నిండుకుండలా పీపీరావు ప్రాజెక్టు
దహెగాం: ఇరవై రోజుల క్రితం నీరు లేక వెలవెల బోయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరి కళకళలాడుతున్నాయి. మండలంలోని కల్వాడ సమీపంలో ఉన్న పీపీరావు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత మంగళవారం, శనివారం భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీరు నిండి మత్తడి పైనుంచి నీరు పారింది. దీంతో ఎర్రవాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. ఆదివారం ప్రాజెక్టు నీటి మట్టం 147.5 మీటర్లు కాగా పూర్తి నీటి మట్టానికి చేరుకుని మత్తడిపై నుంచి నీరు పారుతోంది. ఇన్ఫ్లో 750 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 750 క్యూసెక్కుల వరద ఎర్రవాగులోకి చేరుతుంది. దీంతో ఆయకట్టు సాగుకు ఢోకా లేదని రైతులు పేర్కొంటున్నారు. -
ప్రతీనెల ఒకటిన వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతీనెల గ్రీన్ చానల్ ద్వారా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో మా ట్లాడారు. పంచాయతీ కార్మికులకు ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని చట్టపరంగా రావాల్సిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏటా రెండు జతల యూనిఫామ్స్, సబ్బులు, ష్యూస్ అందజేయాలని తెలిపారు. సమస్యల ను పలుమార్లు డీపీవో దృష్టికి తెచ్చినా స్పంద న లేదని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షులు నాగేశ్, విలాస్, పుష్పలత, సహాయ కార్యదర్శులు సోనేరావు, శంకర్, వసంత్, అనిల్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్రస్థాయి అండర్–15 వాలీబాల్ పోటీలకు 16మంది విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వెంకటేశం, కోచ్ రాకేశ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర పోస్ట్మెట్రిక్ వసతిగృహం మైదానంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్కూల్ గేమ్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉత్త మ ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది బాలికలు, ఎనిమిది మంది బాలురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 18, 19తేదీల్లో రంగారెడ్డిలోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. రోడ్డు వేయాలని ఆందోళన కాగజ్నగర్ రూరల్: మండలంలోని అందవెల్లి–భట్టుపల్లి గ్రామాల మధ్య రోడ్డు వేయాల ని శనివారం గ్రామస్తులు ఆందోళన చేశారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు ఉంచి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు బురదమయమై నడిచి వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నా నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కాగా, వీరి ఆందోళనతో దహెగాం–కాగజ్నగర్ మార్గంలో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలు సుకున్న కాగజ్నగర్ రూరల్, పట్టణ సీఐలు కుమారస్వామి, ప్రేంకుమార్, ఎంపీడీవో ప్ర సాద్ ఆందోళన వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. శాశ్వత పరిష్కారం కల్పించేదాకా నిరసన కొనసాగిస్తామని, అధికారులు స్పందించి పేరుకుపోయిన బురద తొలగించాలని, తాత్కాలిక రోడ్డు వేయాలని కోరారు. -
‘ఇంటర్’కూ పీటీఎం
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంపున కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు (పీటీఎం) నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందించింది. తరగతి గదిలో తమ పిల్లలు చదువుతున్న తీ రు, ప్రవర్తన, హాజరు గురించి తల్లితండ్రులు తెలు సుకునే అవకాశముంది. అలాగే ఇంటి వద్ద విద్యార్థులు చదువుతున్నారా.. లేదా.? గైర్హాజరుకు కారణాల గురించి అధ్యాపకులు తల్లిదండ్రులను ఆరా తీసే అవకాశమేర్పడింది. ఇది విద్యార్థులు తమ సా మర్థ్యాలను మెరుగుపరుచుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడనుంది. అంతిమంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతం కానున్నాయి. ప్రతీనెల నాలుగో శనివారం కళాశాలలో వి ద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లకు ఆదేశాలు అందాయి. జిల్లాలో 11 కళాశాలల్లో అమలుజిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నా యి. ఇందులో జనరల్ విద్యార్థులు 1,784 మంది, ఒకేషనల్ విద్యార్థులు 568 మంది విద్యనభ్యసిస్తు న్నారు. చాలా కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంది. ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు కొందరు కాలేజీ వరకు వెళ్లడం లేదు. ఇంటి వద్ద చదవకపోవడంతో వెనుకబడిపోతున్నా రు. గతేడాది కొంత మెరుగ్గా ఉన్న ఫలితాలు అంతకుముందు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించ డం ద్వారా ఈ సమస్య అధిగమించే అవకాశం ఉంటుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు కళాశాలల్లో పీటీఎంలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సమావేశంలో ఏం చర్చిస్తారంటే..పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి ఆయా కళాశాలల అధ్యాపకులు ముందుగా ఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. సమావేశం నిర్వహించే తేదీ, సమయాన్ని తెలుపాలి. సమావేశంలో వారి పిల్లల సామర్థ్యాల గురించి అ ధ్యాపకులు వివరించాలి. వారు ఏ దశలో ఉన్నారో తెలుపాలి. ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో చెప్పాలి. మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇంటి వద్ద కూడా చదివించాలని దిశానిర్దేశం చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా కళాశాల నిర్వహణ గురించి సమావేశంలో తెలుసుకోవాలి. అధ్యాపకు ల పనితీరును గమనించాలి. తద్వారా ఇరువైపులా విద్యార్థులపై శ్రద్ధ పెరిగి వారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. హాజరు తగ్గుదలకు కారణాలుజిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీలోని పలు మండలాల్లోగల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హా జరుశాతం చాలా తక్కువగా ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం, ఆర్టీసీ బస్సులు వేళకు రాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చాలావరకు పేదకుటుంబా లవారే కావడంతో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే స్తోమత లేక తరచూ గైర్హాజరవుతుండడం గమనార్హం. -
ద్విచక్రవాహనాలు స్వాధీనం
రెబ్బెన: సింగరేణి ఆస్తులున్న ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఎస్అండ్పీసీ సిబ్బందిని చూసి పరారవడంతో వారి ద్విచక్రవాహనాలను బె ల్లంపల్లి ఏరియా ఎస్అండ్పీసీ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్అండ్పీసీ ఇన్చార్జి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 13న మధ్యాహ్నం ఏరియాలోని గోలేటి–1ఏ ఇంక్లైన్ ఆవరణలో కి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు ద్విచ క్ర వాహనాలపై అక్రమంగా ప్రవేశించారు. మద్యం తాగుతూ చోరీకి పాల్పడే అవకాశమున్నట్లు అనుమానించిన ఎస్అండ్పీసీ సిబ్బంది వెంటనే మొబై ల్ టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించా రు. వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లడాన్ని చూసిన అనుమానితులు వారి వెంట తీసుకువచ్చిన ద్విచక్రవాహనాలు అక్కడే వదిలేసి పారిపోయారు. అనుమానితుల ద్విచక్రవాహనాలను సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. విఽధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్అండ్పీసీ ఇన్చార్జి అభినందించారు. -
కాగజ్నగర్ పోలీస్స్టేషన్ తనిఖీ
కాగజ్నగర్ టౌన్: కాగజ్నగర్ పట్టణ పోలీస్స్టేషన్ను ఎస్పీ కాంతిలాల్పాటిల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికా ర్డులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఆయుధాల భద్ర త, కేసుల వివరాలు పరిశీలించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. మ హిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, సీఐ ప్రేంకుమార్, సిబ్బంది ఉన్నారు. -
పింఛన్లు పెంచాలని డిమాండ్
కౌటాల: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి గుండ థామస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని వారం కౌటాల జగదాంబ గార్డెన్ పింఛన్దారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్దారుల సమస్యలు ప రిష్కరించడంతో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు. ఈ నెల 21న కౌటాలలో తలపెట్టిన పింఛన్దారుల సభలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పిట్టల సత్యనారాయణ, విఠల్, రాజేశ్, హీరమాన్, తిరుపతి, శంకర్, బాలయ్య, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు. -
వాన.. వరదగా..
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/దహెగాం/పెంచికల్పేట్/తిర్యాణి/కాగజ్నగర్ టౌన్/కాగజ్నగర్ రూరల్/రెబ్బెన/కెరమెరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవా రం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం (అడ), వ ట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయమై పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఆయా మండలాల్లో..దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఐనం గ్రామ సమీపంలోని కాగజ్నగర్ ప్రధాన రహదారిలో రెండు లోలెవల్ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రం నుంచి కల్వాడ వైపు వెళ్లే మార్గంలో లోలెవల్ వంతెనపై వరద పారడంతో అటువైపు వెళ్లేవారు హత్తిని మీదుగా ప్రయాణించారు. మల్లన్న ఒర్రె ఉప్పొంగడంతో సమ్మక్క గద్దెల వద్ద నుంచి వరద పారింది. సబ్కలెక్టర్ శ్రద్దాశుక్లా దహెగాంతోపాటు ఐనం, పెసరికుంట గ్రామాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. ఈమె వెంట తహసీల్దార్ మునవా ర్ షరీఫ్, ఎంపీడీవో రాజేందర్, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్, ప్రణీత్బాబు ఉన్నారు. పెంచికల్పేట్ మండలంలోని పెద్దవాగు, ఉష్కమల్లవాగు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ, పెంచికల్పేట్ గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరింది. పెంచికల్పేట్–సలుగుపల్లి, గుండెపల్లి–కమ్మర్గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. లింగాపూర్ మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగాయి. వంతెనలపై వరదనీరు ప్రవహించడంతో పిట్టగూడా, మోతీపటార్, గుమ్నూర్, కంచ న్పల్లి, ఫూల్సింగ్తండా, చోర్పల్లి, నాగుగూడా, కీ మానాయక్తండా, పట్కల్మంగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్ నుంచి మంగి గ్రామానికి వెళ్లే దారిలోగల బ్రిడ్జిపై వాగునీరు ప్రవహించడంతో రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెలి మల ప్రాజెక్ట్ అలుగు పారి జలపాతాన్ని తలపించగా స్థానికులు ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగజ్నగర్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్వారకానగర్, సంజీవయ్య కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, తొమ్మిదోవార్డు, కాపువాడ తదితర ప్రాంతా లను వరదనీరు ముంచెత్తింది. ఆర్ఆర్వో కాలనీలో ని కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ ఆవరణలో వరదనీరు చేరగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వెనుకబడి న తరగతుల సంక్షేమాధికారి సజీవన్ హాస్టల్కు చే రుకుని పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ స్పందించి వరద నీటిని బయటకు పంపించారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో పలువురు ఇళ్లలోకి వరదనీరు చేరింది. కాలనీని ఆర్ఐ సౌమ్య, పంచా యతీ అధికారులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కాలనీకి ఎగువ నుంచి వరదనీరు వస్తున్న ప్రదేశాన్ని తహసీల్దార్ సూర్యప్రకాశ్ పరిశీలించి మ ళ్లింపు చర్యలు చేపట్టారు. గంగాపూర్, పులికుంట, పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. నంబాల బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహించడంతో నంబా ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఎస్సై చంద్రశేఖర్ నంబాల బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేశా రు. ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి నిలిచిపోయింది. కా గజ్నగర్ మండలంలోని రాస్పెల్లి, మెట్పల్లి, గజ్జి గూడ, మోసం, కోయవాగు తదితర వాగులు ఉ ప్పొంగాయి. పెంచికల్పేట్–కాగజ్నగర్ ప్రధాన ర హదారిలో ఈజ్గాం వద్ద రోడ్డుపై నీరు ప్రవహించగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ జ్గాం చౌరస్తా, ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. మెట్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సందర్శించి వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, రూరల్ ఎస్సై కుమారస్వామి ఉన్నారు. కెరమెరి మండలంలోని కర్పెతగూడ వంతెన పూర్తిగా నీటి మునిగింది. లక్మాపూర్, అనా ర్పల్లి, వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15 గ్రామాల ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. చాలాకాలం తర్వా త కెరమెరి, సాంగ్వి, గోయగాం వాగులు పొంగిపొర్లాయి. సాంగ్వి, రాంపూర్, ఇంద్రానగర్, కెలికే కల్వ ర్టు పైనుంచి వరదనీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వాగు పరీవాహక ప్రాంతంలో 50 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. తిర్యాణి మండలం మాణిక్యపూర్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వాగునీటి నుంచి దాటుతున్న ప్రజలుమండలాలవారీగా వర్షపాతం నమోదు ఇలా.. జిల్లాలో అత్యధికంగా కౌటాల మండలంలో 65.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కాగజ్నగర్లో 7.8 మి.మీ వ ర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 25.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 27.8 మి.మీ, ఆసిఫాబాద్లో 30.8, రెబ్బెనలో 8, జైనూర్లో 16.4, సిర్పూర్ (యూ)లో 15.6, లింగపూర్లో 30.8, కెరమెరి 16.2, వాంకిడిలో 10.8, సిర్పూర్ (టీ)లో 16.8, చింతలమానెపల్లిలో 29.2, పెంచికల్పేట్లో 40.4, బెజ్జూర్ 47.2, దహెగాం మండ లంలో 25.2 మి.మీ వర్షం కురిసింది. ప్రాజెక్ట్లకు భారీగా వరదనీరుఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా కుమురంభీం (అడ) ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తి 52,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 టీఎంసీలు (234 మీటర్లు) కాగా, ప్రస్తుతం 5.968 టీఎంసీ లుగా ఉంది. 52,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఆరు గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.890 టీఎంసీలు (238.75 మీటర్లు) కాగా, ప్రస్తుతం 2.579 టీఎంసీలుగా ఉంది. 9,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల ను దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆ సిఫాబాద్ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దిగువన గల గుండి, రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు పోవద్దని అధికారులు సూచించారు. -
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వాతావరణశాఖ సూచన మేరకు భారీ వర్షా ల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి, రాజురా గ్రామాల్లోని లోలెవల్ వంతెనలను అదనపు కలెక్టర్ డేవిడ్, డీపీవో భిక్షపతిగౌడ్తో కలిసి పరిశీలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రాజురా లోలెవల్ వంతెన ఇరువైపులా కోతకు గురి కాగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం కోసం 8500844365 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
ప్రతిభకు ప్రశంస
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన 125 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, అధికారులతో కలిసి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతోపాటు డీటీడీవో రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సజీవన్, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికుల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం హమాలీలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభినవ పోతన.. వరదన్న
చెన్నూర్: తెలుగు రాష్ట్రాల్లో సాహితీ రంగంలో వానమామలై వరదాచార్యులు కీర్తి గడించారు. ఓ వైపు సాహిత్యంలో, మరోవైపు రాజకీయంలో రాణించా రు. వరదన్న చేతి నుంచి జాలు వారిన రచనలు ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వరదాచార్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేశారు. నేడు వరదా చార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. జననం.. విద్యాభ్యాసంవరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో 16 ఆగస్టు 1912లో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించారు. తండ్రి బక్కయ్యశాస్త్రి చెన్నూర్లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వరదాచార్యులకు చదువు అబ్బలేదు. ఆయన సహజ కవి. 13వ ఏటా పద్యాలు, కవితలు, రచనలు ప్రారంభించారు. డిగ్రీలు లేని పండితుడు కావడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్లోని దోమకొండ జనతా కళాశాలకు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం వానమామలై ఆంధ్ర సారస్వత పరిషత్లో విశారద రాసి ఉత్తీర్ణులయ్యారు. వరదాచార్యులు రాసిన ‘మణిమాల’ విశారద పరీక్షలో పాఠ్యాంశంగా ఉంది. అది చదివే పరీక్ష రాశారు. బాలల కోసం అనే బుర్రకథలు, నాటికలు రచించారు. దోమకొండ నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించుకుని 1961 నుంచి 1972 వరకు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. కవి ప్రస్థానంలో..చెన్నూర్ పట్టణానికి చెందిన వానమామలై వరదాచార్యుల 50 ఏళ్ల కవి ప్రస్థానంలో ఎన్నో రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఆంధ్రకవి, వసంత, మధుకవి, కవికోయిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవసంత లాంటి బిరుదులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భారతీ సాహిత్య సమితి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం చేశారు. పూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యావాచస్పతి (డిలిట్) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో మరెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన అనేక రచనలు ముద్రితం కాగా, కొన్ని ముద్రణకు నోచుకోలేదు. రాజకీయ ప్రస్థానంలో..18 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పని చేసిన వరదాచార్యులును అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు 1972లో ఎమ్మెల్సీగా అవకాశమివ్వగా 1978 వరకు పని చేశారు. చెన్నూర్లో వేదపాఠశాల ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పని చేశారు. 31 అక్టోబర్ 1984లో ఆయన తుదిశ్వాస విడిచారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
దహెగాం: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు వరదతో పూర్తిగా కొట్టుకుపోయాయని, ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. దహెగాం మండలం గిరవెల్లి, కర్జి తదితర గ్రామాల్లో వరదలతో దెబ్బతిన్న పత్తి పంటను శుక్రవారం నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెద్దవాగు, ఎర్రవాగులు ఉప్పొంగడంతో వరదతో పత్తి నీట మునిగిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ స్పందించి సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని కోరారు. కర్జి చెరువు మత్తడి తెగి ఐదేళ్లవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరంతా వృథాగా పోతుందన్నారు. దహెగాం మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్లు సక్రమంగా లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేరకపోవడంతో లోహా గ్రామానికి చెందిన మడే రమాదేవి పాముకాటుకు గురై మృతి చెందిందని తెలిపారు. ఆయన వెంట నాయకులు లెండుగురే శ్యాంరావ్, దందెర మల్లేశ్, మనోహర్, అంజన్న తదితరులు ఉన్నారు. -
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
ఆసిఫాబాద్రూరల్: విధి నిర్వహణతోపాటు ప్రజల కు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎఫ్డీవో దేవిదాస్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్తో కలిసి రక్తదానం చేశారు. అటవీశాఖలో విధులు ఎన్నో సవాళ్లతో కూడుకుందన్నారు. వాటిని అధిగమిస్తూనే ప్రజలకు సేవ చేయాలని సూచించారు. రక్తదాన శిబిరంలో 62 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు అజ్మత్, రేంజ్ అధికారులు గోవింద్చంద్ సర్దార్, అనిల్కుమార్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, చంద్రమోహన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలను స్మరిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: స్వాతంత్య్ర పోరాటంతో ఎందరో మహానుభావులు జీవితాలు, ప్రాణాలను త్యా గం చేశారని, అలాంటి అమరులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరా లకు తెలియజేయాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలు లేకుండా నిజమైన స్వేచ్ఛను అనుభవించలేమని తెలిపారు. ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత చూపాలని సూచించా రు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన తొ మ్మిది మంది పోలీసు అధికారులకు సేవా పతకాలు అందించి అభినందించారు. కాగజ్నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ ఎస్సై శ్రీనివాస్, భరోసా సెంటర్ మహిళా ఎస్సై తిరుమల, కాగజ్నగర్ ఏఎస్సై బాలాజీ, హెడ్ క్వార్టర్ ఏఎస్సై శ్రీనివాస్, హెడ్ క్వార్టర్ హెడ్ కానిస్టేబుల్ ఇమామా, బిశ్వజిత్ మాగి, సిర్పూర్ హెడ్ కానిస్టేబుల్ అజీమొద్దీన్, ఏఆర్ హెడ్క్వార్టర్ నాందేవ్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు పాల్గొన్నారు. -
గోల్కొండ పరేడ్లో ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్కు ఆసిఫాబాద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తరంజన్ నేతృత్వం వహించారు. తెలంగాణ కేడర్ 2022 బ్యాచ్కు చెందిన చిత్తరంజన్ గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్కు కూడా కమాండర్గా వ్యవహరించి.. నాయకత్వం, డ్రిల్ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఏఎస్పీగా పనిచేస్తూ ప్రజా కేంద్రిత పోలీసింగ్ విధానం, జిల్లా ఉప విభాగంలోని గిరిజన యువతతో సన్నిహిత సంబంధాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నారు. తిర్యాణి పాత పోలీస్ స్టేషన్ను ప్రజా గ్రంథాలయంగా, పాత వాంకిడి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఆటస్థలంగా మార్చారు. పశువుల అక్రమ రవాణా, అక్రమ వడ్డీ వ్యాపారం, నిషేధిత గంజాయి సాగు రవాణా, వ్యాపారం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అటవీ పరిసర గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించేందుకు దీర్ఘకాలిక ప్రచారాలు చేపట్టారు. -
బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం
రెబ్బెన(ఆసిఫాబాద్): కొత్త గనుల ఏర్పాటుతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన వేదిక శిలాఫలకం ఆవిష్కరించారు. ఏరియాలో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారిని సన్మానించి బహుమతులు ప్ర దానం చేశారు. జీఎం మాట్లాడుతూ గోలేటి, మాదారం ఉపరితల గనుల ఏర్పాటు ద్వారా ఏరియాకు పూర్వవైభవం రానుందన్నారు. ఉద్యోగుల కుటుంబాల కోసం ఐదు కొత్త బో రుబావుల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న ట్లు తెలిపారు. ఏరియాకు నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 95 శాతం ఉత్పత్తి సాధించా మన్నారు. కార్యక్రమాల్లో సేవా అధ్యక్షురాలు పద్మ విజయ భాస్కర్రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి
ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడుతున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ఆసిఫాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర సంబురాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎఫ్వో నీరజ్కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన బండ ప్రకాశ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. 70 ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తుందని, అదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీగతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ పథకం ప్రారంభించి రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు తెలి పారు. ఇందిరమ్మ రైతుభరోసా కింద ఎకరాకు రూ. 12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామన్నారు. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతుబీమా పథకం కింద 501 మంది రైతుల నామినీలకు రూ.5 లక్షల చొప్పున రూ.25.05 కోట్లు ఖాతాల్లో జమ చేశామని వివరించారు. శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతొలివిడతగా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేశామని, ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ ఏడాది మార్చి 17న శాసన సభలో ఆమోదించామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో 11,997 మంది పేదలు వైద్య చికిత్స పొందారన్నారు. గృహజ్యోతి కింద జిల్లాలోని 72,817 కుటుంబాలకు రూ.31.58 కోట్లు రాయితీ కల్పించామని తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ కోసం స్థలం గుర్తింపుఇందిర మహిళా శక్తి పథకం కింద రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని 4 గ్రామ సంఘాల పరిధిలో ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని సోలార్ పవర్ ప్లాంట్ కోసం గుర్తించి ప్రభుత్వం నుంచి రూ.40 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 914 స్వయం సహాయక సంఘాలకు రూ.58.11 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 727 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఏడా ది ఏప్రిల్ 14న భూభారతి నూతన చట్టాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 356 దరఖాస్తులు రాగా, 148 పరిష్కరించామన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటామన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 51 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 62 శాతంతో 31 లక్షలు నాటడం పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. ఎకో టూరిజం కింద గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. 61 వేల కుటుంబాలకు ‘ఉపాధి’ పనిదినాలుగ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 61 వేల కుటుంబాలకు రూ.21.14 వేల పని దినాల పని కల్పించామన్నారు. కూలీలకు రూ.48.53 కోట్లు చెల్లించడంతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.10.58 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. జిల్లాలోని 973 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 8,568 మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నామన్నారు. ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద 450 మంది దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించామని వె ల్లడించారు. రాష్ట్రంలోని మూడు ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఒకటైన కుమురంభీం ఆసిఫాబాద్లో ఇందిరమ్మ అమృత పథకం కింద 14 నుంచి 18 ఏళ్లు గల 18,230 మంది కౌమర బాలికలకు పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 74 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 2,950 మంది సభ్యులు ఉండగా 2024– 25 సంవత్సరానికి 47.38 లక్షల ఉచిత చేపపిల్లలు సరఫరా చేసినట్లు తెలిపారు. 2025– 26 సంవత్సరానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 188 మంది విద్యార్థులకు రూ.6.25 లక్షలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 1,297 మంది విద్యార్థులకు రూ.2.28 లక్షలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 279 మందికి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కింద రూ.4.92 కోట్లు ఉపకార వేతనాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాను ప్రగతిపథకంలో నడిపించి, అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకిత భావంతో పనిచేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.భరతమాత వేషధారణలో విద్యార్థినిఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుస్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నృత్యాలతో అలరించారు. వాంకిడి కస్తూరిబా గాంధీ విద్యాలయం బాలికలు విన్యాసాలు చేశారు. గిరిజన బాలికల కళాశాల విద్యార్థినులు ‘ఇదే మా భారతం ’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శక్రీడా పాఠశాల, ఇతర ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గోండి పాటలకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, డీపీవో భిక్షపతి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కా ర్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రంథా లయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా న్యాయస్థానంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్వో నీరజ్కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అహ్మద్, ఎమ్మెల్యే క్యాంపు, బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చైతన్య కళాశాలలో నాగేశ్వర్రావు, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి అశ్వక్ అహ్మద్, వివేకానందచౌక్లో దివ్యాంగుడు వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు చౌక్లో వాసవీక్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సి పల్ కార్యాలయం, గాంధీ చౌక్లో మున్సిపల్ కమి షనర్ గజానంద్, శిశుమందిర్లో మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకన్న, ఆర్ఎంపీ వైద్యుల సంఘం, బీసీ సంఘం కార్యాలయాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ జెండా ఎగురవేశారు. -
నేడు పంద్రాగస్టు వేడుకలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో శుక్రవారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందు కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఏడాది సమీకృత కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహిస్తున్నారు. చెత్తాచెదారం తొలగించి షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ హాజరుకానున్నారు. గు రువారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్తోపాటు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉద యం 9.30 గంటలకు పతాకావిష్కరణ, పోలీ స్ గౌరవ వందనం స్వీకరణ అనంతరం ముఖ్య అతిథి జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. కలెక్టర్ జిల్లా అధి కారులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. లోటుపాట్లు లేకుండా వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏఈ ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో తిరంగా ర్యాలీ
కాగజ్నగర్టౌన్: రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్పంప్ నుంచి మార్కెట్ వీధుల గుండా సర్సిల్క్ మీదుగా పెట్రోల్పంప్ ఏరియా వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించడానికి ప్రజల్లో ఐక్యతను చాటడాని కి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పంద్రాగస్టు సందర్భంగా ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీ నర్ వీరభద్రాచారి, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, కోశాధికారి అరుణ లోయ, మండల అధ్యక్షుడు అశోక్, మహిళా మోర్చా జిల్లా అ ధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘దిందా’ రైతుల అరెస్టు
కాగజ్నగర్టౌన్/చింతలమానెపల్లి/కౌటాల/ వాంకిడి: పోడు భూములపై హక్కుల కోసం ఈ నెల 6న హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టిన చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ రైతులను గురువారం పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు రాజధానికి చేరుకునే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీ స్స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి దిందాకు తీసుకువస్తుండగా వారి బస్సును కాగజ్నగర్ మండలం కోసిని వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోడు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ ప్రేంమకుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేసి కౌటాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఐదు గంటలపాటు స్టేషన్లో ఉంచి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డికి దిందా రైతుల ఉసురు తాకుతుందన్నారు. అక్రమ అరెస్టులతో అన్నదాతలను అణిచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ క్యాంప్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు దాసరి ఉష, విశ్వనాథ్, లెండుగురే శ్యాంరావు, నాందేవ్, బండు, హర్షద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులుపాదయాత్రగా వెళ్లిన రైతులకు మద్దతు తెలిపేందుకు పలువురు దిందా గ్రామస్తులు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ శివారులో ఎస్సై ఇస్లావత్ నరేశ్ ఆధ్వర్యంలో పోలీసుల అడ్డుకోని వారిని సముదాయించారు. న్యాయం జరిగేవరకు పోరాడుతాం..న్యాయం జరిగేవరకు పోరాడుతామని చింతలమానెపల్లి మండలం దిందాకు చెందిన పోడు రైతులు అన్నారు. వాంకిడి పోలీస్స్టేషన్లో వారు మాట్లాడారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు అటవీ శాఖ అధికారులు కంచెలు ఏర్పాటు చేశారని, వ్యవసాయ పనులకు వెళ్తే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూములు తమకు అప్పగించాలని కోరేందుకు సుమారు 60 మంది పాదయాత్రగా హైదరాబాద్ బాట పట్టినట్లు తెలిపారు. వాంకిడి పోలీస్ స్టేషన్కు సుమారు 20 మంది రైతులను తరలించగా మిగిలిన వారిని కాగజ్నగర్, రెబ్బెన పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. -
నవోదయ పీఈటీ విజయనగరంలో మృతి
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ప్రదీప్ (31) గురువారం మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో జూలై 27 నుంచి ఆగస్టు 28 వరకు నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కోచ్గా కాగజ్నగర్ నవోదయ విద్యాలయం నుంచి వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. పీఈటీ మృతితో విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది విజయనగరం బయలు దేరారు. నేడు బెల్లంపల్లిలో ఉమ్మడి జిల్లా మహాసభబెల్లంపల్లి: తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ (టీహెచ్డబ్ల్యూ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభను శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. 21 విభాగాల్లో పని చేస్తున్న హమాలీలు పాల్గొంటారని, సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ తయారు చేయనున్నట్లు తెలిపారు. -
మద్యానికి దూరం.. చారిగాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషేఽ దానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూరగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
నవ భారతం నిర్మించుకుందాం
‘సాక్షి’ టాక్షోలో పాల్గొన్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులుఆసిఫాబాద్రూరల్: ‘పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అంటరానితనం రూపుమాపి, 2047 నాటికి నవ భారతం నిర్మించుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియా ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి’ అంటూ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన భారతదేశం సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. నేడు(శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్నాం. ఈ నేపథ్యంలో 2047 నాటికి వందేళ్ల స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలనే అంశంపై గురువారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. స్వేచ్ఛను పొంది వందేళ్లు పూర్తయ్యే నాటికి ఆర్థిక, సాంఘిక వెనుకబాటు పూర్తిగా తొలగిపోయి, నవ భారతంలోకి భవిష్యత్తు తరాలు అడుగు పెట్టాలని విద్యార్థినులు ఆకాంక్షించారు. -
ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి
కాగజ్నగర్టౌన్: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్మ పున్నం అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పద్మశాలి భవనంలో జిల్లా సంఘం అధ్యక్షులు కొరెంగ మాలశ్రీ అధ్యక్షతన గురువారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ముగింపు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ప్రభుత్వాలు హరించివేస్తున్నాయని ఆరోపించారు. అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు 2023లో నూతన అటవీ హక్కు చట్టం తీసుకువచ్చారని అన్నారు. తాత్కాలికంగా నిలుపుదల చేసిన జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు నెర్పల్లి అశోక్, కోట శ్రీనివాస్, బక్కన్న, శ్యాం, కమల, మడే శశి, సుర్పం రాంచందర్, ఆత్రం చిన్ను, ముంజం ఆనంద్కుమార్, జాడి మల్లయ్య, టీకానంద్, కార్తీక్, దుర్గం దినకర్, నంది పద్మ, కూశన రాజన్న, ఊట్ల రవి పాల్గొన్నారు. -
చర్చలు సఫలం.. సమ్మె వాయిదా
ఆసిఫాబాద్అర్బన్: పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు మూడేళ్ల ఈపీఎఫ్, ఈఎస్ఐ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఏఐటీయూసీ, సీటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ వారితో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, సీఐటీయూ నాయకులు శ్రీకాంత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్, బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ మాట్లాడారు. ఈ నెల 24లోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
ఈ కష్టాలను తీర్చే దారి లేదా?
వాంకిడి(ఆసిఫాబాద్)/దహెగాం(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సదుపాయాలు, దారులు లేక అత్యవసర సమయాల్లో గిరిజనులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. తాజాగా ఓ గర్భిణి నడుం నొప్పితో ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడితే, ప్రసవం కోసం మరో నిండు గర్భిణి నరకయాతన పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన దారిలేక అంబులెన్స్ రాకపోవడంతో వాంకిడి మండలం గోందాపూర్కు చెందిన గిరిజన మహిళ పురుటినొప్పులతో విలవిలలాడింది.డొంగర్గాం గ్రామానికి చెందిన ఆత్రం రాజు, కన్నుబాయి దంపతుల కుమార్తె దేవుబాయిని చౌపన్గూడ పంచాయతీ పరిధిలోని గోందాపూర్కు చెందిన మడావి మెంగుకు ఇచ్చి వివాహం చేశారు. గర్భిణిగా ఉన్న దేవుబాయి ఇటీవల తన తల్లి గ్రామమైన డొంగర్గాంకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే ఈ గ్రామం గుట్టపై ఉండడంతో సుమారు నాలుగు కిలోమీటర్లు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అంబులెన్స్ను గుట్ట కింద ఉన్న దొడ్డగూడ సమీపంలోనే నిలిపివేశారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో నిండు గర్భిణి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సాయంతో వర్షంలో తడుస్తూ కొంతదూరం నడిచింది. ఆ తర్వాత బైక్పై అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. అనంతరం ఆమె వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల సూచనల మేరకు దేవుబాయికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో మహిళకూ దారి కష్టాలే..కుమురంభీం జిల్లాలోనే దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన నైతం సమ్మక్క అనే తొమ్మిది నెలల నిండు గర్భిణికి గురువారం సాయంత్రం నడుం నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అయితే దారి సరిగ్గా లేదని అంబులెన్సు డ్రైవర్ గ్రామంలోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సమ్మక్కను ఆటో ఎక్కించారు. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు అక్కడక్కడా కోతకు గురికావడం వల్ల ఆటో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సమ్మక్కను నడిపించుకుంటూ కర్జి గ్రామం ప్లాంటేషన్ వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్లో దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. -
‘ఎస్పీఎంలో స్థానిక కార్మికులపై చిన్నచూపు’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న స్థానిక కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో బుధవారం ఎస్పీఎం హెచ్ఆర్, జీఎం గిరిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీఎం యాజమాన్యం స్థానికులపై చిన్నచూపు చూస్తూ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వేతనాలు పెంచుతుందని ఆరోపించారు. కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తుందని అన్నారు. ప్రతీ కార్మికుడికి నెలకు రూ.26,500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కల్లూరి శ్రీనివాస్, యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు గోగర్ల రాములు, ఉపాధ్యక్షుడు గోగర్ల శ్యామ్రావు, చిట్టవేణి రాజేశ్, కోశాధికారి బండి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి జాడి అశోక్ పాల్గొన్నారు. -
విజయనగరం ఎయిడెడ్ పాఠశాల పరిశీలన
కౌటాల(సిర్పూర్): సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశా ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేయడంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తలో దిక్కు..!’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం కౌటాల మండలంలోని విజయనగరం ఎయిడెడ్ పాఠశాల భవనాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి సజీవన్, కౌటాల తహసీల్దార్ ప్రమోద్ పరి శీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవనాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. విజయనగరం ఎయిడెడ్ పాఠశాలలో మొత్తం 16 తరగతి గదులు, నాలుగు వసతి గదులు, వంట గది, డైనింగ్ హాల్, ఆడిటోరియం, ఐదెకరాల క్రీడా మైదానం ఉందన్నారు. జిల్లా అధికారులు విజయనగరం పాఠశాలను గురుకుల విద్యార్థుల కోసం ఎంపిక చేస్తే 15 రోజుల్లో పాఠశాల భవనాలకు మరమ్మతులు చేసి అప్పగిస్తామని పాఠశాల కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఉన్నారు. ఎఫెక్ట్.. -
ఈఎస్ఐ, పీఎఫ్ వివరాలు వెల్లడించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ పూర్తి వివరాలు వెల్లడించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బుధవారం రెండోరోజు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలియజేయడం లేదన్నారు. కార్మికులకు ప్రతినెలా 5లోగా వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్మికులు మురళి, నవీన్, మమత, గంగన్న, సౌజన్య, రూప, విమల, నిరోష తదితరులు పాల్గొన్నారు. -
భారీ వర్షానికి అతలాకుతలం
రెబ్బెన: మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి గంగాపూర్, పులికుంట, నవేగాం వాగులతో పాటు పెద్దవాగు ఉప్పొంగింది. నంబాల బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహించడంతో నంబాల, నారాయణపూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. గంగాపూర్ వాగు కు భారీగా వరద పొటెత్తి బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ మెట్లను తాకుతూ ప్రవహించింది. గోలేటిలోని మానెపల్లికుంట అలుగు ప్రవహించడంతో ఆ వరద ప్రవాహానికి రేకులగూడకు చెందిన టేకం సరోజ ఇల్లు కూలిపోయింది. అటవీ ప్రాంతం నుంచి వరద రావడంతో ఎన్టీఆర్ నగర్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మద్దెల శ్రీనివాస్, మేకల నగేశ్, బోగే శారద, బెజ్జం సావిత్రి, మల్లేశ్, రాజుల శ్రీకాంత్, మోడెం శంకర్, మోడెం రాజాగౌడ్, పూదరి నగేశ్, నికోడే నాందేవ్, రవీందర్, కొర్ర తిరుపతి, భీంరావు, కొమురవెళ్లి స్వామి, రామగోని రవి, ప్రసాద్గౌడ్ ఇళ్లలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు తడిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాలనీని పరిశీలించి ప్రజలను పరామర్శించారు. కాలనీలోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై చంద్రశేఖర్ కాలనీని సందర్శించారు. వరద నీటికి అడ్డంగా ఉన్న చెత్తాచెదారాన్ని జేసీబీతో తొలగించారు. -
● జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ● ఉధృతంగా ప్రవహించిన వాగులు, ఒర్రెలు ● ఇళ్లలోకి చేరిన వరద నీరు.. స్తంభించిన జనజీవనం ● నీట మునిగిన పంట పొలాలు ● అడ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
చింతలమానెపల్లి మండలం రణవెల్లి వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగుఆసిఫాబాద్రూరల్/కెరమెరి/చింతలమానెపల్లి/ దహెగాం/పెంచికల్పేట్/రెబ్బెన/కౌటాల: జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు వర్షం దంచికొట్టింది. కుండపోత వానకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత, వార్దా, పెన్గంగ, పెద్దవాగు వరదతో ఉప్పొంగాయి. భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగును ఎస్పీ కాంతిలాల్ పాటిల్తో కలిసి ఆయన పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ సహయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాలకు కంటోల్ రూం 8500844365 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి, అప్పపల్లి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండలం తలోడి పంచాయతీ కార్యాలయం ఎదుట భారీగా వరదనీరు చేరింది. రెబ్బెనలో రికార్డు స్థాయిలో.. జిల్లాలో 101.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెబ్బెన మండలంలో రికార్డు స్థాయిలో 219.8 మి.మీ.లు, అత్యల్పంగా బెజ్జూర్లో 58.4 మి.మీల వర్షం కురిసింది. తిర్యాణిలో 179.8 మి.మీ, ఆసిఫాబాద్లో 115.0 మి.మీ, కాగజ్నగర్ 133.6 మి.మీ, కౌటాల 112.0 మి.మీ, జైనూర్ 71.8 మి.మీ, సిర్పూర్(యూ) 61.2 మి. మీ, లింగపూర్ 52.6 మి.మీ, కెరమెరి 115.0 మి. మీ, వాంకిడిలో 80.6 మి.మీ, సిర్పూర్(టి) 74.7 మి.మీ, చింతలమానెపల్లి 72.2 మి.మీ, పెంచికల్పేట్ 80.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల్లో ఇలా.. ● కెరమెరి మండలంలో లక్మాపూర్, అనార్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుమా రు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. సాయంత్రం వరకు వర్షం తగ్గినా వాగుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. సాంగ్వి, రాంపూర్, ఇంద్రానగర్, కెలి కె సమీపంలోని కల్వర్టుపై నుంచి నీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకుండా పోయింది. పంచాయతీ కార్యదర్శులు, పోలీసులు వాగులు,కల్వర్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.● చింతలమానెపల్లి మండలంలోని శివపెల్లి, రణ వెల్లి, దిందా గ్రామాలకు వెళ్లే రహదారులపై వా గులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిందా గ్రా మానికి రాకపోకలు పూర్తిగా, రణవెల్లి గ్రామానికి తాత్కాలికంగా నిలిచిపోయాయి. తహసీల్దార్ మడావి దౌలత్ దిందా వాగు వద్దకు చేరుకుని ప రిస్థితిని పర్యవేక్షించారు. వాగు దాటకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజలు వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. ● దహెగాం మండల కేంద్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు, ఎర్రవాగులకు వరద పోటెత్తింది. దిగువ ప్రాంతాల్లో ఉన్న వరి, పత్తి పంటలు నీట ము నిగాయి. ఐనం వద్ద ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పీపీరావు ప్రాజెక్టులోకి వరద చేరడంతో అలుగు దూకింది. ఎర్రవాగు పరీవాహక ప్రాంతంతోపా టు పెద్దవాగు పరీవాహక ప్రాంతాలైన బీబ్రా, ఐనం, పెసరకుంట, దహెగాం, ఒడ్డుగూడ, దిగిడ, లగ్గామాలో పంటలు దెబ్బతిన్నాయి. ● పెంచికల్పేట్ మండలంలో పెద్దవాగు వరదతో బొంబాయిగూడ, ఎల్కపల్లి, పెంచికల్పేట్, ఎల్లూర్, అగర్గూడ, గుండెపల్లి, కమ్మర్గాం, నందిగాం గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ఉచ్చమల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎర్రగుట్టకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లవాడ వెళ్లే రహదారిలోని ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తోంది. పెంచికల్పేట్– బెజ్జూర్ మధ్య ఒర్రెలు పొంగడంతో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. బొక్కివాగు, పెద్దవాగు, ఉచ్చమల్లవాగు వరదలతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అడ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత ఎగువ ప్రాంతం నుంచి వరద చేరుతుండటంతో బుధవారం కుమురంభీం(అడ ) ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 21,254 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.778 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 237.65 మీటర్లుగా ఉంది. ఇన్ప్లో 8,333 క్యూసెక్కులు ఉండటంతో ఐదు గేట్లను 2 మీటర్లు పైకెత్తి 21,254 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. గుండి వాగులో ప్రవాహం పెరిగింది. దిగువన ఉన్న గుండి, రాజుర, రహపల్లి, చోర్పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. -
మాదక ద్రవ్యాలు అరికట్టడంలో భాగస్వాములవ్వాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత కాదని, సామాజిక కర్తవ్యంగా భావించాలని సూచించారు. మా దక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్, కార్యాలయ సిబ్బంది మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. -
రైతుల పాదయాత్రకు మద్దతు
చింతలమానెపల్లి: ‘మా భూములు మాకే ఇవ్వాలి’ అంటూ హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టిన చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ రైతులకు బుధవారం పలువురు నాయకులు మద్దతు పలికారు. ప్రజ్ఞాపూర్ వద్ద ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పోడు రైతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా లక్సమక్కపల్లి వద్ద రైతులను కలిసి ఆర్థికసాయం అందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గజ్వేల్ నియోజకవర్గం ములుగు వద్ద హైదరాబాద్ రహదారిలో కలిసి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. పోడు పట్టాలిచ్చి అటవీ అధికారుల ఆగడాల నుంచి రైతులకు రక్షణ కల్పించాలని, రైతు భరోసా, రైతుబీమా, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘సిర్పూర్’ను నంబర్ 1గా తీర్చిదిద్దుతా
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాగజ్నగర్టౌన్: అభివృద్ధికి నోచుకోని సిర్పూర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తర్వాత మొ దటిసారి కాగజ్నగర్ పట్టణానికి బుధవారం సాయంత్రం వచ్చారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పదవి కట్టబెట్టారని తెలిపారు. ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు మోసానికి గురయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు లెండుగురే శ్యామ్రావు, ముస్తాఫీస్, మినహాజ్, నవీన్, రాజు, అర్షద్ పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ‘దిందా’.. వృద్ధురాలి వేతన
చింతలమానెపల్లి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. చింతలమానెపల్లి మండలంలోని దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జాడి లలితకు మూడు రోజులుగా వైద్యం అందడం లేదు. లలిత ముగ్గురు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పెద్ద కుమారుడు వినోద్, చిన్న కుమారుడు సోను మంచిర్యాలలోని ఒక హోటల్లో పని చేస్తుండగా, రెండో కుమారుడు మహారాష్ట్రలో కూలీ పని చేస్తున్నాడు. భర్త బక్కయ్య 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంటి వద్ద లలిత ఒక్కరే ఉంటుంది. ఈ క్రమంలో మూడు రోజులుగా జ్వరం, రక్తపోటు సమస్యతో అనారోగ్యానికి గురై మంచాన పడింది. ఆరోగ్య ఉపకేంద్రం వారానికి ఒక్కసారి మా త్రమే తెరుస్తారని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు కుమారులకు సమాచారం ఇచ్చారు. చిన్న కుమారుడు సోను తల్లిని తీసుకెళ్లేందుకు రాగా దిందా వాగు కారణంగా గ్రామానికి చేరుకోలేకపోయాడు. వాగుకు అవతలి వైపే ఆగిపోయాడు. గ్రామస్తులు మానవతా ధృక్పథంతో అంబలి పోస్తున్నారు. -
విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను మంగళవారం సందర్శించారు. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. తరగతి గదిలో కూర్చుని గణితం పాఠం విన్నారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టా రు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతతో నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఏఎంవో ఉప్పులేటి శ్రీనివాస్, ఏపీడీ వెంకట్, ఎంఈవో ఆడే ప్రకాశ్, ఎంపీడీవో అంజద్పాషా, కాంప్లెక్స్ హెచ్ఎంలు చంద్రశేఖర్, భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి’
ఆసిఫాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్చార్జి కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా జిల్లా కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కన్వీనర్ కోట్నాక విజయ్కుమార్తో కలిసి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధించిన విజయాలు, సైనిక సామర్థ్యాలను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రభుత్వం ఉగ్రదాడులను తిప్పికొట్టిందని గుర్తు చేశారు. ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బానోత్ వెంకట్ నాయక్, ఎలగతి సుచిత్, అరిగెల మల్లికార్జున్, వీరభద్రాచారి, అరుణ్లోయ, బండి రాజేందర్ పాల్గొన్నారు. -
ఫుల్ గిరాఖీ
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని ప్రయాణికులను సురక్షితంగా చేర్చాం.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఆపరేట్ చేశాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. ఆదాయం సైతం గతంతో పోలిస్తే ఘననీయంగా పెరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – ఎస్.భవానీప్రసాద్, ఆర్ఎం, ఆదిలాబాద్ ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ‘మహాలక్ష్మి’లే అధికం..తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. ముందస్తు ప్రణాళికతో..వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగా రు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బస్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వరకు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఉద్యోగుల ఇబ్బందులను సైతం పరిగణలోనికి తీసుకొని ఈ సారి వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. రీజియన్ పరిధిలో ఇలా.. (ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు)అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకో వడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆది లాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. డిపో బస్సులు ప్రయాణించిన ఆదాయం కి.మీ.(లక్షల్లో) (రూ.కోట్లలో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26 -
ఖాళీగా విజయనగరం ఎయిడెడ్ పాఠశాల
కౌటాల మండలం విజయనగరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల పడెకరాల స్థలంలో ఉంది. రెండేళ్లుగా విద్యార్థులు లేక ఖాళీగా ఉంటుంది. సిర్పూర్(టి) గురుకులంలో కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాలకు చెందిన విద్యార్థులే 350 మందికి పైగా ఉన్నారు. విజయనగరం పాఠశాలలో తాత్కలికంగా సర్దుబాటు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే విజయనగరం ఎయిడెడ్ పాఠశాల మారుమూల ప్రాంతంలో ఉందని ఉపాధ్యాయులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉన్నాతాధికారులు కాగజ్నగర్లోని భవనాలతోపాటు విజయనగరం ఎయిడెడ్ పాఠశాల భవనాలను పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
స్వయం సహాయక సంఘాలతో ఆర్థిక ఎదుగుదల
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: స్వయం సహాయక సంఘాల ఏ ర్పాటుతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని, ప్రతీ మహిళను సంఘాల్లో చేర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు వీఏవోలు, ఏపీవోలు, కమ్యూనిటీ సమన్వయకర్తలకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకం కింద వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతీ మహిళ సంఘంలో ఉండేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ యాదగిరి, శేషారావు, యశోద, నరేందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, సీసీలు పాల్గొన్నారు. -
విధులకు వెళ్తుండగా ప్రమాదం..
కౌటాల మండల కేంద్రానికి చెందిన ధన్రాజ్ సిర్పూర్(టి) గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇక్కడి ఇంటర్ విద్యార్థులను మంచిర్యాల జిల్లాలోని కాసిపేటకు తరలించారు. విధులకు హాజరు కావడానికి తొలిరోజు కౌటాల నుంచి కాగజ్నగర్కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో కాగజ్నగర్ మండలం కోసిని సమీపంలో రోడ్డుపై ఉన్న పందిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో ధనరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. దూరభారం కారణంగానే ఉపాధ్యాయుడు గాయపడినట్లు తోటి అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా
ఆసిఫాబాద్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, మూడేళ్ల పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు వెల్లడించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ సి బ్బంది ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ నాయకుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని పలుమార్లు అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ చెన్నకేశవను కలిసినా స్పందన లేదన్నారు. కలెక్ట ర్ విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చె ల్లించాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ లేదా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాల ని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆస్పత్రి సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
న్యాయవాదిపై తప్పుడు కేసు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది పూదరి నరహరిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నరహరిపై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ కాంతిలాల్ పాటిల్కు వినతిపత్రం అందించారు. న్యాయవాదులు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా నరహరిపై తప్పుడు కేసు నమోదు చేసిన రెబ్బెన ఎస్సైని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ముక్త సురేశ్, రజి హైదర్, బోనగిరి సతీశ్బాబు, రాపర్తి రవీందర్, ఎస్.శ్రీనివాస్, ఆసిఫాబాద్, సిర్పూర్, గోదావరిఖని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్రూరల్: చలో హైదరాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం సంఘం నాయకులతో కలిసి మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయాల ని, పాత పెన్షన్ ఇవ్వాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధి క సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని 2004 నుంచి రద్దు చేయడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వృద్ధాప్యంలో పెన్షన్కు దూరమయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, నా యకులు రాజశేఖర్, ప్రకాశ్, ఎంఈవో సుభా ష్, వినేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
● శిథిలావస్థకు సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, కళాశాల ● భవనాలు ఖాళీ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం ● ఇతర గురుకులాల్లో విద్యార్థుల సర్దుబాటు ● ఆందోళనలో తల్లిదండ్రులు
శిథిలావస్థకు భవనాలు..30 ఏళ్ల క్రితం సిర్పూర్(టి) బాలుర సాంఘి క సంక్షేమ గురుకులం ప్రారంభించారు. మ రమ్మతులు చేపట్టకపోవడంతో తరగతి గదులతోపాటు హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. గత నెలలో కురిసిన వర్షాలకు భవనాల పెచ్చులూడి పడ్డాయి. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు 12 రోజులపాటు అత్యవసర సెలవులు ప్రకటించారు. భవనాల పరిస్థితిని వేసవిలో నే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటే విద్యాసంవత్సరంలో మధ్యలో ఇలాంటి దుస్థితి నెలకొనే అవకాశం ఉండేది కాదు. గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.6.30 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటికీ టెండర్లు పూర్తికా లేదు. భవనాలు నిర్మించేందుకు దాదాపు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. కౌటాల/సిర్పూర్(టి): కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలు కూలే పరిస్థితులు ఉండటంతో గురుకులానికి మొదట సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేసి నెట్టుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర గురుకులాలకు విద్యార్థులుసిర్పూర్(టి) గురుకులంలోని 497 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని ప్రస్తుతం ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేశారు. రెండు రోజులుగా విద్యార్థులను తల్లిదండ్రులు ఆయా గురుకులాలకు తీసుకెళ్తున్నారు. 5, 6, 7 తరగతుల్లోని 297 మంది విద్యార్థులను ఆసిఫాబాద్కు కేటాయించారు. 8వ తరగతి చదువుతున్న 66 మందిని మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకులం, 9, 10 తరగతి చదివే 141 మందిని బెల్లంపల్లి సీవోఈకి, సీఈసీ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం 47 మందిని కాసిపేటకు, ఎంఈవోసీ ద్వితీయ సంవత్సరం చదివే 14 మందిని కోరుట్లకు తరలించారు. వారితోపాటే అధ్యాపకులు, ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేశారు. సోమవారం 300 మంది, మంగళవారం 150 మంది వరకు విద్యార్థులు సిర్పూర్(టి) గురుకుల పాఠశాలను ఖాళీ చేసి సర్దుబాటు చేసిన ప్రాంతాలకు వెళ్లిపోయారు.తాత్కాలికంగా సర్దుబాటు చేశాం భద్రత కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతోపాటు తల్లిదండ్రుల ఒప్పందంతో విద్యార్థులను ఇతర ప్రాంతాల్లోని గురుకులాల్లో సర్దుబాటు చేశాం. కొన్నిరోజుల తర్వాత కాగజ్నగర్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుంటాం. ఉన్నతాధికారులు భవనాలు పరిశీలించిన తర్వాత అక్కడే తరగతులు కొనసాగిస్తాం. సిర్పూర్–టి గురుకులానికి పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. – శ్రీనివాస్, ప్రిన్సిపాల్, సిర్పూర్(టి) గురుకుల పాఠశాలసరైన వసతులు కల్పించాలి మా కుమారుడు సిర్పూర్(టి) గురుకులంలో ఏడో తరగతి చదువుతున్నాడు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఆసిఫాబాద్కు తరలించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇతర ప్రాంతాలకు తరలించడం ఇబ్బందికరంగా ఉంది. పక్కా భవనాలు నిర్మించేవరకు అన్ని వసతులు ఉన్న అద్దె భవనాల్లో నిర్వహించాలి. కౌటాల మండలం విజయనగర్ ఎయిడెడ్ పాఠశాలను సైతం ఉన్నతాధికారులు పరిశీలించాలి. – అంకులు, విద్యార్థి తండ్రి, కౌటాల -
కాగజ్నగర్లో ‘వందేభారత్’కు హాల్టింగ్ ఇవ్వాలి
కాగజ్నగర్టౌన్: సికింద్రాబాద్– నాగ్పూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్కే శ్రీవాస్తవ్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. అలాగే కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన జీఎం శ్రీవాస్తవ్ ఆధునికీకరణకు రూ.19 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాగజ్నగర్లోని సంజీవయ్య కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. చింతగూడ– ఈజ్గాం రైల్వే క్రాసింగ్ ఎత్తు పెంచి ఓవర్బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరగా, రైల్వే స్పెషల్ ప్రాజెక్టుగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.120 కోట్లతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు -
బీమా.. రైతన్నకు ధీమా!
● రైతుబీమాతో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల భరోసా ● ఈ నెల 13 వరకు పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ● రైతువేదికల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు ● కొత్తవారితోపాటు తప్పుల సవరణకు అవకాశంకౌటాల(సిర్పూర్): ఆపత్కాలంలో అన్నదాతల కు టుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది రైతుబీమా పథకం. వివిధ కారణాలతో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2025– 26 సంవత్సరానికి గాను అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ విస్తారణ అధికారులు పథకంపై కొత్త పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 13 వరకు గడువు ఉండగా.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వారు రైతుబీమా పథకానికి అర్హులు. ఇటీవల వరుస సెలవులు రావడంతో నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. వ్యవసాయ పనులతో రైతులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, బీమా పథకం రైతుకు మంచి ప్రయోజనకరంగా ఉంది. ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా సాధారణ మరణాలతో సహా నామినీకి 15 రోజుల్లోగా రూ.5లక్షల ప్రమాద బీమా సొమ్ము అందిస్తున్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. 2018లో పథకం ప్రారంభంరైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు 2018 ఆగస్టు 14న అప్పటి ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రారంభించింది. జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, 1,42,596 మంది రైతులు ఉన్నారు. ఇందులో రైతుబీమా పథకానికి అర్హులైన 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వారు దాదాపుగా 90 వేల మందికి పైగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. పథకం ప్రారంభమై ఏడేళ్లు కావొస్తుండగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రెండు వేల మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.వంద కోట్ల వరకు నగదును చెల్లించారు. పోడు పట్టాలు పొందిన రైతులు సైతం రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా రైతుబీమా పథకం ఏటా ఆగస్టు 14న మొదలై వచ్చే ఏడాది ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగుస్తుంది. గతేడాది రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, పాత వాటిని రెన్యువల్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. కౌలు రైతులపై చిన్నచూపురైతుబీమా పథకం వందల ఎకరాలు ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం వర్తింపజేస్తుండగా, కౌలు రైతులపై చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టడంతో రైతుల కుటుంబాలకు భరోసా కలిగింది. కౌలుకు భూములు సాగు చేస్తున్న రైతులకు సైతం ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.అర్హతలు ఇవే.. రైతు పొలానికి సంబంధించిన పట్టా పాసుపుస్తకం ఉండాలి. ఆధార్కార్డులో వయస్సు 18 నుంచి 59 ఏళ్లు ఉండాలి. 2025 జూన్ 5లోగా పట్టా పాసుపుస్తకం పొందిన వారు మాత్రమే అర్హులు. పట్టాదారు పాసు పుస్తకా లు ఉండి గతేడాది నమోదు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులు స్వయంగా కార్యాలయానికి వెళ్లి అధికారి సమక్షంలో దరఖాస్తు అందజేయాలి. పట్టా పాసుపుస్తకం, ఆధార్కార్డు, నామినీ ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లు ఈ నెల 13లోగా సమర్పించాలి. ఇప్పటికే ఎల్ఐసీ ఐడీ కలిగిన రైతులకు రెన్యువల్ అవుతుంది. పొరపాట్లు ఉంటే రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి సవరించుకోవాలి. రైతులు దరకాస్తు చేసుకోవాలి పట్టా పాసుపుస్తకం ఉండి 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు రైతు బీమా చే యించుకోవాలి. పాసుపుస్తకం జిరాక్స్తో పాటు ఆధార్కార్డు జిరాక్స్ పత్రాలతో స్వయంగా రైతులే ఏఈవోల వద్దకు వెళ్లాలి. ఇతరులు వెళ్తే వివరాలు నమోదు చేయరు. రైతుబీమా పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఈ నెల 13లోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఎ లాంటి సందేహాలు ఉన్న స్థానిక వ్యవసా య శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. – శ్రీనివాసరావు, డీఏవో -
బడి ప్రారంభం.. ఆదివాసీల హర్షం
కెరమెరి(ఆసిఫాబాద్): ఏళ్లుగా పాఠశాల లేక ఇబ్బందులు పడిన ఆదివాసీల కల ఎట్టకేలకు నెరవేరింది. కెరమెరి మండలంలోని మారుమూల గ్రామం పాటగూడలో సోమవారం మోడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఇస్తావత్ ప్రేందాస్, ఎస్ఈఆర్పీ చహకటి శ్యాంరావు గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. గతంలో స్కూల్ అందుబాటులో లేకపోవడంతో 3, 4వ తరగతి చిన్నారులు బాబేఝరి, జోడేఘాట్లోని ఆశ్రమ పాఠశాలలకు వెళ్లేవారు. కానీ 1, 2వ తరగతి పిల్లలు మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు ‘సాక్షి’లో ప్రచురించగా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 14 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి గనుల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో భూనిర్వాసితులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డితో చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ సింగరేణిలో భూములు కోల్పోయిన నిర్వాసితులను సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలన్నా రు. రోడ్ల మరమ్మతులు, రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో కొత్తవాటి నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పన, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా గోలేటి పరిసర గ్రామాల ప్రజలు, భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జీఎం ఎమ్మెల్యేకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
దళితుల భూములు ఆక్రమిస్తే ఫిర్యాదు చేయాలి
కాగజ్నగర్టౌన్: దళితుల భూములు ఆక్రమణకు గురైతే వెంటనే కమిషన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సజీవన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, తహసీల్దార్ మధుకర్, ఎంపీడీవో కోటప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ పుష్పగుచ్ఛం, మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. రాంచందర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 338 ద్వారా షెడ్యూల్డ్ కులాల కమిషన్కు విశేష అధికారాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు
ఆసిఫాబాద్రూరల్: చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలురు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా వారిలో రక్తహీనత, పోషకాహార లోపం, ఇతర అనారోగ్య సమస్యలు నివారించవచ్చన్నారు. జిల్లాలో 1,07,702 మంది 19 ఏళ్లలోపు వారికి మాత్రలు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సీతారాం, వైద్య సిబ్బంది ఉన్నారు. సౌర విద్యుత్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు మూడు రోజుల్లో నివేదికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, పోడు పట్టా భూములకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం అమలుపై సమీక్షించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన స్థలం, వైశాల్యం, విద్యుత్ వినియోగం వివరాలతో నివేదికలు రూపొందించాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని పొదుపు చేయాలని, జిల్లాకు ఆరు వేల ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ‘స్వాతంత్య్ర’ వేడుకలు ఘనంగా నిర్వహించాలిజిల్లాలో ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘ నంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణను అదనపు కలెక్టర్, ఆర్డీవో, అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. మైదానంలో సంక్షేమ పథకాల శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప టిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటే లాభాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): పోటీ ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గిస్తేనే సింగరేణి సంస్థకు లాభాలు వస్తాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నా రు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాల యం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం మల్టీ డిపార్టుమెంటల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థను మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకే యాజమాన్యం మల్టీ డిపార్టుమెంటల్ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. సింగరేణితో పోల్చితే మహా రాష్ట్రలోని డబ్యుసీఎల్లో టన్నులకు రూ.2వే ల తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు రవాణా టన్నుకు రూ.5 వ్యయం అవుతోందన్నారు. సింగరేణిలో ప్రస్తుతం 22 భూగర్భ గనులు, 17 ఓసీపీలు కొనసాగుతుండగా, త్వరలో నాలుగైదు భూగర్భ గనులు మూతబడుతాయని తెలిపారు. దీంతో సింగరేణికి లాభమే తప్ప నష్టం ఉండదన్నారు. నా ణ్యమైన బొగ్గును తక్కువ రేటుతో అందిస్తేనే సింగరేణి మనుగడలో ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజ మల్లు, పీవో నరేందర్, డీజీఎం ఉజ్వల్కుమార్, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, డీవైపీఎం రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7‘ప్రైవేట్’ చేతుల్లో వారసంత తిర్యాణిలోని వార సంత ప్రైవేట్ వ్యక్తుల స్థ లంలో కొనసాగుతుంది. పంచాయతీ ఆదా యం కోల్పోతుంది. అలాగే ప్రజలు, వ్యాపారులకు సౌకర్యాలు కరువయ్యాయి. 9లోu వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. విజిట్ వీసా.. ఎడారి గోస! గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులు పలు కారణా లతో పోలీసులకు చిక్కుతున్నారు. వారి క్షేమ సమాచారం స్వదేశంలోని కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025 8లోu 31.1 /24.5గరిష్టం/కనిష్టం -
వందేభారత్.. నష్టాల ప్రయాణం
● రెండు జిల్లాల్లో ఒక్క హాల్టింగ్ కూడా లేని రైలు.. ● ఆక్యుపెన్సీ సాధించడంలో విఫలం ● పట్టించుకోని రైల్వే అధికారులు ● విజ్ఞప్తులతోనే సరిపెడుతున్న ప్రజాప్రతినిధులు బెల్లంపల్లి: మహారాష్ట్రలోని నాగ్పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వందశాతం ఆక్యుపెన్సీ లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. డిమాండ్ ఉన్న రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికుల ఆదరణ కరువవుతోంది. ఈ మార్గంలో వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని ఎంతగానో ఆరాటపడిన ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మహారాష్ట్రలో నాగ్పూర్ తర్వా త సేవాగ్రామ్ (వార్దా), చంద్రపూర్, బల్లార్షా రైల్వేస్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క రైల్వేస్టేషన్లోనూ నిలుపుదల ఉత్తర్వులు జారీ చే యకపోవడం రైలు ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చంద్రపూర్–బల్లార్షా మధ్య కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఆ ప్రాంతంలో నిరభ్యంతరంగా హాల్టింగ్కు పచ్చజెండా ఊపి పదుల కిలోమీటర్ల దూరం ఉన్న ఆసిఫాబా ద్, మంచిర్యాల జిల్లాల్లోని రైల్వేస్టేషన్లను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల మూడు ప్రధా న రైల్వేస్టేషన్లతో పాటు జిల్లా కేంద్రమైన పెద్దపల్లి రైల్వే జంక్షన్లోనూ హాల్టింగ్కు ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రయాణికుల డిమాండ్ను రైల్వే అధికా రులు పెడచెవిన పెట్టారు. బల్లార్షా తర్వాత రామగుండం, కాజీపేట జంక్షన్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. రామగుండంలో ఈ రైలు ఎక్కే ప్రయాణికులు అంతంత మాత్రమే. కాజీపేటలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల వందేభారత్ రైలు సక్సెస్ కాలేకపోతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆక్యుపెన్సీ సాధనలో వెనుకంజవందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటికీ వందశాతం ఆక్యుపెన్సీ సాధించలేదు. అనాలోచిత నిర్ణయాలతో రైలును ఆదిలో 20 కోచ్లతో ప్రారంభించారు. అయితే ప్ర యాణికుల ఆదరణ ఆశాజనకంగా లేకపోవడంతో క్రమంగా ఆక్యుపెన్సీ తగ్గుతూ వచ్చింది. ఫలితంగా గత ఫిబ్రవరి మూడో వారంలో కోచ్లను ఒక్కసారిగా 20 నుంచి 8కి కుదించారు. పరిమిత సంఖ్యలో కోచ్లు ఉండటంతో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 70 శాతం వరకు పెరగడం కాస్త ఊరటనిస్తుండగా వందశాతం సాధించే దిశగా పరుగులు పెట్టలేకపోతోంది. బుట్టదాఖలవుతున్న విజ్ఞాపన పత్రాలువందేభారత్ సూపర్ఫాస్ట్ రైలును ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఆపాలని కోరుతూ ఏడాది కాలం నుంచి ప్రజా ప్రతినిధులు, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు రైల్వే అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. కానీ బలమైన ఒత్తిళ్లు చేయడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే రైల్వే అధికారులు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జంక్షన్లలో హాల్టింగ్ సౌకర్యం కోసం ఉత్తర్వులు జారీ చేయాలని పలు మార్లు కోరినా సానుకూలంగా స్పందించడం లేదు. డిమాండ్ ఉన్న స్టేషన్లలో రైలు నిలుపుదల చేయకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైల్వే ఫోరం సభ్యులు అందిస్తున్న విజ్ఞాపన ప త్రాలు బుట్టదాఖలు అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా రైల్వే అధికారులు పునరా లోచించి ప్రయాణికుల ఆదరణ చూరగొనేలా తగి న చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వినతులు స్వీకరించి.. భరోసా కల్పించి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ తన పట్టా భూమిని సేకరించిందని, అందులోని 324 నీలగిరి చెట్లకు నష్టపరిహారం ఇప్పించాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన పేట తిరుపతి కోరాడు. చింతలమానెపల్లి మండలం రణవెల్లి గ్రామంలోని లావుణి పట్టా భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, న్యాయం చేయాలని సిర్పూర్–టి మండలం డోర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం రుషి ఫిర్యాదు చేశాడు. పదో తరగతి పూర్తి చేసిన తనకు రేషన్ డీలర్గా అవకాశం ఇవ్వాలని చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన సునీత కోరింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలని పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద పెంటయ్య అర్జీ సమర్పించాడు. తన కుమారుడికి ఏదైనా గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సీటు ఇవ్వాలని సిర్పూర్(టి) డోర్పల్లి గ్రామానికి చెందిన జాడి విఠల్ కోరాడు. సిర్పూర్(టి) మండల కేంద్రంలో సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని దడ్డి బుజ్జి విన్నవించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజావాణి -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనం దండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర దక్కడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నా యి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) తన నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీ మా పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవస రం లేదు. కేవలం ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశా త్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతి నిధులు, వ్యవసాయాధికారులు నానో యూరియా ఫ్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంతోపాటు సంకటహరణ బీమా పథకం గురించి వివరిస్తున్నారు. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు..ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లే దా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలు దారు ని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు బీమా పరి హారం పొందడానికి అసలు రశీదు తప్పనిసరి. దీంతోపాటు విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిమ్ పత్రాలు ప్రమా దం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.ఉమ్మడి జిల్లాలో రైతులు, సాగు విస్తీర్ణం, వినియోగించే ఎరువుల వివరాలు..జిల్లా రైతుల సంఖ్య సాగు విస్తీర్ణం యూరియా డీఏపీ (ఎకరాల్లో..) (మెట్రిక్ టన్నుల్లో) (మెట్రిక్ టన్నుల్లో) మంచిర్యాల 1.64 లక్షలు 3.31 లక్షలు 43 వేలు 13 వేలు నిర్మల్ 1.90 లక్షలు 4.40 లక్షలు 35 వేలు 10 వేలు ఆసిఫాబాద్ 1.32 లక్షలు 4.45 లక్షలు 60 వేలు 12 వేలు ఆదిలాబాద్ 1.65 లక్షలు 5.85 లక్షలు 35 వేలు 13 వేలురైతులకు ప్రయోజనకరం సహకార సంఘాల ద్వారా ఇప్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఆసంస్థ ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసుకోవాలి. – అంజిత్కుమార్, ఏవో, దండేపల్లిబీమా అర్హతలు..సహకార సంఘాల ద్వారా రైతులు ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరి మితి లేకుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్ కొనుగోలుపై రూ. 10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100% పరిహా రం, రెండు అవయవాలు కోల్పోతే 50%, ఒక అవయవం కోల్పోతే 25% పరిహారం అందుతుంది. ఈ బీమా ఎరువులు కొనుగోలు చేసిననాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. -
లాభాల లెక్క తేలేదెన్నడో?
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల లెక్క తేల్చకుండా నానుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా లాభాలు ప్రకటించకపోవడంపై కా ర్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 69.01 మిలియన్ టన్నులు సాధించింది. ఏప్రిల్ 1, 2025న లెక్కలను సమీక్షించిన యాజమాన్యం నాలుగు నెలలు గడిచినా లాభాల వివరాలను వెల్లడించలేదు. వాటా కోసం కార్మిక సంఘాల డిమాండ్..సింగరేణి లాభాలను ప్రకటించిన తర్వాత, ఆ లాభాల్లో నిర్దిష్ట శాతాన్ని కార్మికులకు వాటాగా చెల్లించడం ఆనవాయితీ. కానీ లాభాల ప్రకటనలో జాప్యం కారణంగా కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించిన తర్వాత, కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి లాభాల వాటా ప్రకటించాలని కోరుతున్నారు. ఈసారి కూడా లాభాల ప్రకటన ఆలస్యం కావడంతో కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాలు, లాభాల లెక్కింపు సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, క్రయవిక్రయాలు ఆర్థిక సంవత్సరం ఆధారంగా జరుగుతాయి. ఈ లెక్కల ఆధారంగానే లాభాలను నిర్ధారిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యంలో 69.01 మిలియన్ టన్నులు సాధించినప్పటికీ, లాభాల వివరాలు బయటకు రాకపోవడం కార్మికులను కలవరపెడుతోంది. ‘‘ఈసారైనా త్వరగా లాభాలు ప్రకటిస్తారని ఆశించాం, కానీ ఇంకా ఎలాంటి సమాచారం లేదు’’ అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల ప్రకటన జాప్యంతో కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీ లాభాలను త్వరగా ప్రకటించి, కార్మికులకు వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నాయి. లాభాలు ప్రకటించాలి కంపెనీ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి. అందులో కార్మికులకు వాటా చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలు ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదు. వాటా డబ్బులు సమయానికి చెల్లిస్తే పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు పనికొస్తాయి. – ఎస్కే.బాజీసైదా,ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి35 శాతం వాటా చెల్లించాలి ఈసారి బొగ్గు ఉత్పత్తి పెరిగినందున లాభా ల వాటా కూడా పెంచి ఇవ్వా లి. లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా లాభాలను ప్రకటించకపోవడం గుర్తింపు సంఘం వైఫల్యమే. – వి.అనిల్రెడ్డి, హెచ్ఎమ్మెస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా తేల్చని సింగరేణి లాభాల్లో వాటా కోసం కార్మికుల ఎదురు చూపు యాజమాన్యం తీరుపై అసంతృప్తి -
‘ఆదాయం వెల్లడించక పోవడం సరికాదు’
తిర్యాణి(ఆసిఫాబాద్): చింతలమాదర జలపాతానికి వచ్చే ఆదాయం వెల్లడించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని ఏకో టూరిజం కమిటీ(ఈటీసీ) చైర్మన్ తుంరం గోపాల్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పర్యాటకుల కోసం జలపాతం వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. టికెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయాన్ని 80 శాతం జలపాతం అభివృద్ధి, 20 శాతం పంచాయతీ అభివృద్ధికి వినియోగించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు కృష్ణ, నాగు, అర్జున్, సాగర్, సోము తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్షనే..!
ఫేక్ హాజరు వేస్తే● కార్యదర్శులపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం ● తప్పనిసరిగా పంచాయతీ పరిధిలో అటెండెన్స్ వేయాల్సిందే.. దహెగాం(సిర్పూర్): ఇటీవల రాష్ట్రంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ హాజరు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విధులకు రాకున్నా ఫేక్ హాజరు వేసే కార్యదర్శులపై చర్యలకు తీసుకోనుంది. నకిలీ ముఖ గుర్తింపు హాజరు వేసేవారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు అవసరమైతే సస్పెన్షన్ వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. కాగా జిల్లాలో కొందరు కార్యదర్శులు యాప్లో ఫేక్ హాజరు వేసినట్లు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. జీపీ మానిటరింగ్ యాప్లో..జీపీ మానిటరింగ్ యాప్ను కార్యదర్శులు తమ మొబైల్లో ఓపెన్ చేసి డీఎస్ఆర్(డిస్ట్రిక్ శానిటేషన్ రిపోర్ట్)లో పంచాయతీ పరిధిలో ఉండి ఉదయం 11 గంటలలోపు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే పలువురు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. విధులకు హాజరు కాకుండా సొంత పనులకు వెళ్తూ ఫేక్ హాజరు వేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ వద్దకు అధికారులు ఫైల్ పంపినట్లు తెలిసింది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేకపోవడంతో కొందరికి అదనంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో కార్యదర్శులు రెండు పంచాయతీల్లో ముఖ గుర్తింపు హాజరు వేయకుండా రెగ్యులర్ పోస్టింగ్ ఉన్నచోట మాత్రమే వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జిగా ఉన్న పంచాయతీల్లో కారోబార్లతో వేయిస్తున్నారు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఫేక్ హాజరు వేస్తే అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలో ఫేక్ హాజరు వేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించగా, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలి సింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏడాదిన్నరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీరు తదితర అవసరాలకు అప్పులు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా విధుల్లో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.పరిశీలించి చర్యలు తీసుకుంటాం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఫేక్ హాజరు వేసినట్లు తమ దృష్టికి రాలేదు. నిబంధనలు ఉల్లంఘించి ఫేక్ హాజరు వేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వర్తించాలి. ప్రతీ రోజు ఉదయం 11 గంటలలోగా పంచాయతీ పరిధిలో హాజరు వేసుకోవాలి. – భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి335 గ్రామ పంచాయతీలు..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో రెగ్యులర్ కార్యదర్శులు 258 మంది పనిచేస్తుండగా, ఔట్సోర్సింగ్ విధానంలో 52 మంది మొత్తం 310 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెల్లో పాలన సజావుగా సాగడంతోపాటు జవాబుదారీతనం కోసం ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు విధులకు సక్రమంగా హాజరు కావాలనే ఉద్దేశంతో జూన్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) హాజరు అమలు చేస్తోంది. ఈ ముఖ గుర్తింపు హాజరుపై మొదట్లో పంచాయతీ కార్యదర్శులు విముఖత వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రస్థాయిలో చర్చలు జరిగిన అనంతరం జూన్ 12 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. -
పచ్చదనంపై నిర్లక్ష్యం!
కాగజ్నగర్టౌన్: ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం వనమహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తోంది. జూన్లో వర్షాలు కురి సిన తర్వాత మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. అయితే కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. బల్దియా కార్యాలయం ఆవరణలో మే నెలలోనే పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్, ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా మొక్కలు నాటా రు. ఆ తర్వాత వర్షాలు కురిసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వనమహోత్సవం జోరందుకోలేదు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో ఇంటింటికి మున్సిపల్ సిబ్బంది మొక్కలు అందజేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న పట్టణవాసులకు నిరాశే మిగిలింది. 60వేల మొక్కల లక్ష్యం..కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నా యి. ఆయా వార్డుల్లో 60 వేల మొక్కలు నాటాల ని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన మొక్కలను కాగజ్నగర్ మండలం వంజీరి గ్రామ సమీపంలో మున్సిపల్ స్థలంలోని నర్సరీలో పెంచుతున్నారు. ఏటా వనమహోత్స వం కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి వేల సంఖ్యలో మొక్కలు అవసరం ఉంటాయి. నర్సరీ నుంచి మొక్కలను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలను వినియోగిస్తారు. ఆయా కాలనీల్లోని ప్రజల కు రోడ్ల పక్కన, ఇళ్ల పరిసరాల్లో నాటేందుకు పంపిణీ చేస్తారు. కానీ ఇప్పటివరకు 10 శాతం కూడా పంపిణీ పూర్తికాలేదు. మున్సిపల్ అధికా రులు ఎప్పటివరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సంరక్షణ చర్యలు కరువుకాగజ్నగర్ బల్దియాకు మొక్కలు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన వంజీరి నర్సరీపై సంబంధిత అధికారుల పట్టింపు కరువైంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కవర్లలో మొక్కలు లేకుండా కింద పడేసి ఉన్నాయి. నర్సరీలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి దర్శనమిస్తున్నా యి. బొప్పాయి, కర్జూర, అల్లనేరడు, గులాబీ, మందారం చెట్లు నామమాత్రంగా ఉన్నాయి. నర్సరీలోని మొక్కలు పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమం లక్ష్యం చేరుకునేందుకు సరిపోవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏర్పాట్లు చేస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో త్వరలోనే వనమహోత్సవం కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ ప్రజలకు ఉచితంగా మొక్కలు కూడా అందజేస్తాం. మొక్కల పెంపకం, సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ కాగజ్నగర్ బల్దియాలో నామమాత్రంగా వనమహోత్సవం మొక్కల పంపిణీపై దృష్టి సారించని అధికార యంత్రాంగం అస్తవ్యస్తంగా మున్సిపల్ నర్సరీ నిర్వహణ -
ఆర్టీసీకి రాఖీ ధమాకా
ఆసిఫాబాద్: రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం సమకూరుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి హైదరా బాద్కు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. డిపోకు మామూలు రోజుల్లో రోజు కు రూ.16 లక్షల నుంచి రూ. 18లక్షల ఆదా యం వస్తోంది. రక్షాబంధన్ నేపథ్యంలో ఈ నెల 8న 47 వేల మంది ప్రయాణికులను గ మ్యానికి చేర్చగా రూ.21,78,000 ఆదాయం సమకూరింది. ఈ నెల 9న 48 వేల మంది ప్రయాణించగా రూ.21,61,000 ఆదాయం వచ్చిందని డీఎం రాజశేఖర్ తెలిపారు. ఆదివారం సైతం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. -
ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం
కాగజనగర్టౌన్: మాలీ కులస్తులకు ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం చేస్తామని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు అన్నారు. కాగజ్నగర్లోని జ్యోతిబా పూలే భవనంలో ఆదివారం మాలీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 2022లో అసెంబ్లీలో మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసిందని అ న్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మాలీ కులస్తులకు న్యాయం చేయకుంటే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్రావు, హన్మంతు, వాసుదేవ్, శ్రీనివాస్, తిరుపతి, రంగశ్రీనివాస్, నిరంజన్ పాల్గొన్నారు. -
ఆదివాసీల అభివృద్ధికి నిరంతర కృషి
ఆసిఫాబాద్: ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం ని రంతర కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివా రి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భ వన్లో జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ని ర్వహించిన వేడుకలకు ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి రమాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన కుమురంభీం స్ఫూర్తిగా ఆది వాసీలు ముందుకు సాగాలని తెలిపారు. అధికారు ల సమన్వయంతో సంపూర్ణతా అభియాన్కింద ఎంపికై న తిర్యాణి మండలం రెండుసార్లు జాతీయ అవార్డు కై వసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. జీవో 49 రద్దు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని, ఆదివాసీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాభివృద్ధిలో భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించి గిరిజన పిల్లలకు గుణాత్మక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాకు నూతన వసతి గృహాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వైద్యాభి వృద్ధికోసం నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఆ దివాసీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలి పారు. ఆదివాసీల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు శివాజీ చౌక్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేడ్కర్ చౌక్లోని అంబేడ్కర్, కు మురంభీం చౌక్లోని కుమురంభీం విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. డప్పుచప్పు ళ్లు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీ భవన్కు చేరుకున్నారు. ఆదివాసీ జెండాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు ఆదివాసీ గీ తాలపై చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో డీఎంహెచ్వో సీతారాం, ఎఫ్డీవో దేవిదాస్, గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అర్జు, జీసీడీవో శకుంతల, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరా వు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏసీఎం ఉద్దవ్, జిల్లాలోని తొమ్మిది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఘనంగా ఆదివాసీ దినోత్సవంఆదివాసీల్లో చైతన్యం తేవాలి కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల్లో చైతన్యం నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు సూచించా రు. శనివారం మండలంలోని జోడేఘాట్లో కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి, భీం సమాధిపై పూలు చల్లి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలని సూచించారు. ఆదివాసీ చ ట్టాల అమలు కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్రావు, సెడ్మకి ఆనంద్రావు, పెందోర్ రాజేశ్వర్ తదితరులున్నారు. -
● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనాలు పెండింగ్ ● ఆగస్టులో ముగుస్తున్న కాంట్రాక్ట్ గడువు ● ఆందోళనలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఇబ్బంది పడాల్సి వస్తోందినాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదు. ఆస్పత్రిలో డ్యూటీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. సంబంధిత ఏజెన్సీ వారిని అడిగితే డబ్బులు రాలేదని చెబుతున్నారు. – నరేశ్, సెక్యూరిటీ, కాగజ్నగర్ సీహెచ్సీ అధికారులే దయ చూపాలేరెక్కాడితే గాని డొ క్కాడని కుటుంబం మాది. నాకు ముగ్గు రు ఆడపిల్లలున్నా రు. చాలీచాలని జీతా లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నం. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడాల్సి వస్తోంది. అధికారు లే దయ చూపి సమస్య పరిష్కరించాలి. – భాగ్య, స్వీపర్, కాగజ్నగర్ చర్యలు తీసుకోవాలిఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలందిస్తున్నాం. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న మాపై అధికారులు దయ చూపాలి. వెంటనే స్పందించి మా వేతనంలో కోత పెట్టిన ఈఎస్ఐ, పీఎఫ్ వాటా సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలి. – తిరుమల, పేషెంట్ కేర్, కాగజ్నగర్ కాగజ్నగర్ టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధా న పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు మూడేళ్లుగా కాంట్రాక్టర్ ఈఎస్ఐ, పీఎఫ్ వాటా జమ చేయడంలేదు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెజ్జూరు, సిర్పూరు(టి), వాంకిడి, తిర్యాణి, జైనూర్ ఆస్పత్రుల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సె క్యూరిటీ విభాగాలు, స్వీపర్లు, అటెండర్లుగా 100 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరు 2022లో భీం సొసైటీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కింద విధుల్లో చేరారు. అప్పటినుంచి విధులు నిర్వహిస్తున్నా సంబంఽధిత కాంట్రాక్టర్ శ్రీకాంత్ వీరి వేతనాల్లో కో త పెట్టిన డబ్బులు ఈఎస్ఐ, పీఎఫ్ వాటా చెల్లించడంలేదు. ఆస్పత్రి అధికారులతో కుమ్మకై ్క ఉద్యోగులు వాటా సొమ్ము కాజేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, ఇటీవల వచ్చిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు వేతనాలు అందిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత సూ పరింటెండెంట్ చెన్నకేశవ్ను మందలించారు. కాంట్రాక్టర్ మూడేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించకుండా ఉంటే అతడిపై చర్యలు తీసుకోవడంలేదని నిలదీ శారు. అయితే వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ గడు వు ఈ నెలతో ముగియనుండగా ‘కోత’ల వివాదం సమసి పోతుందనే భావనలో ఉన్నట్లు కార్మికులు వాపోతున్నారు.కుమ్మకై ్క నష్టం జేస్తున్నరుకాంట్రాక్టర్, సూపరింటెండెంట్ కుమ్మక్కయ్యారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి మూడేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లిస్తలేదు. ఉన్నతాధికారులకు తెలిపినా స్పందించలేదు. వైద్యవిధాన పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. – బోగె ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారులకు తెలిపినా అంతే.. భీం సొసైటీ ద్వారా విధులు నిర్వహిస్తున్న. ఈఎస్ఐ, పీఎఫ్ వాటా ఎగ్గొడుతున్న కాంట్రాక్టర్పై అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు మా సమస్య పరిష్కరించాలి – ఇమ్రాన్, సెక్యూరిటీ, కాగజ్నగర్ -
బస్టాండ్లలో రాఖీ రద్దీ
ఆసిఫాబాద్: రాఖీ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే ప్రయాణికులతో కిటకిటలాడింది. ఇదే సమయంలో అద్దె బస్సు డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండుగంటల పాటు బస్టాండ్ వద్ద నిరసన తెలుపగా మరింత రద్దీ పెరిగింది. డీఎం రాజశేఖర్ కల్పించుకుని పండుగపూట నిరసన తెలుపడం సరికా దని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చే స్తానని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించా రు. రాఖీ సందర్భంగా హైదరాబాద్కు ఒక సూపర్ లగ్జరీ బస్సు, మూడు ఎక్స్ప్రెస్లు అదనంగా నడుపుతున్నట్లు ఈ సందర్భంగా డీఎం తెలిపారు. కాగజ్నగర్ టౌన్: కాగజ్నగర్ బస్టాండ్ శనివారం మహిళా ప్రయాణికులతో కిటకిటలాడింది. కాగజ్నగర్ నుంచి మంచిర్యాల, కౌటాల, బెజ్జూరు, ఆసిఫాబాద్, పెంచికల్పేట్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఎక్కే క్రమంలో తోపులాటలు కూడా జరిగాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ కనిపించింది. -
అటవీ భూముల్లో అక్రమసాగు
కాగజ్నగర్ టౌన్: కాగజ్నగర్ అటవీ డివిజన్ రేంజ్ పరిధిలోని కర్జెల్లి బీట్లో రెండువేల ఎకరాల అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించామని కాగజ్నగర్ ఎఫ్డీవో సు శాంత్ సుఖ్దేవ్ బొబడే తెలిపారు. శనివారం కాగజ్నగర్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరుల కు వెల్లడించారు. కర్జెల్లి బీట్ పరిధిలో 350 కు టుంబాలు అటవీభూమిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. కర్జెల్లి రేంజ్లోని ఎనిమిది కుటుంబాలవారు 150 ఎకరా లు, మరో ఎనిమిది కుటుంబాల వారు 74, 44 కుటుంబాల వారు 244, 16 కుటుంబాల వా రు 472, 14 కుటుంబాలవారు 632, మరో ఇ ద్దరి వద్ద 34 ఎకరాల అటవీభూమి అక్రమంగా సాగులో ఉందని తెలిపారు. అక్రమంగా సాగు చేసుకుంటున్న వారితో సమావేశాలు నిర్వహించి విచారణ చేపట్టి ఒక్కొక్కరికి మూడెకరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. కర్జెల్లి ఎఫ్ఆర్వో సుభాష్ ఉన్నారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
కెరమెరి: కాంగ్రెస్ ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. శనివారం మండలంలో ని జోడేఘాట్లో నిర్వహించిన ఆదివాసీ దినో త్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల హక్కులు, సంప్రదాయాల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆదివాసీల భూ ములు, అటవీ హక్కులు, జీవన విధానం కా పాడడం మనందరి బాధ్యత అని పేర్కొన్నా రు. సీఎం రేవంత్రెడ్డి గిరిజనుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు కుమురంభీం సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. కు మురంభీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం, నాయకులు పెందోర్ రాజేశ్వర్, కోవ ఇందిర, యశోద, సుజా యత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల పరిరక్షణకు చర్య తీసుకోవాలి
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ప్రేమల గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆదివాసీ దినోత్సవ ప్రా ముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆది వాసీ అభివృద్ధికి తోడ్పడుతున్న అధికారులు, సంఘాల నాయకులను అభినందించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే దుస్తులు ధరించి నృత్యాలు చే స్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కుమురంభీం, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులకు ఎమ్మెల్యే రాఖీ కట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, బీఆర్ఎస్ నాయకురాలు మర్సోకోల సరస్వతి, తుడుందెబ్బ నాయకులు బుర్స పోచయ్య, కొట్నాక విజయ్కుమార్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఐదు వారాలైనా పైసలు రాలే..
తిర్యాణి: దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ఉపాధి కల్పించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపె ట్టింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తోంది. చేసిన పని ఆధారంగా గరిష్టంగా ఒక్కొక్కరికి రోజుకు రూ.304 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. తదనంతరం పథకంలో మార్పులు చేయడం.. ఇందులోని నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుద ల చేయకపోవడంతో కూలీలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కింద 1.23లక్షల జాబ్కార్డులుండగా అందులో 2.43 లక్ష ల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 91వేల జాబ్ కార్డులు యాక్టీవ్లో ఉండగా 1.70 లక్షల మంది కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. నిలిచిన వేతనాలు ఉపాధిహామీ చట్టం ప్రకారం కూలీలు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలి. కానీ, గత మే మొదటి వారం నుంచి ఇప్పటివరకు కూలీలకు వేతనాలు అందలేదు. జూన్తోనే దాదాపు అన్ని చోట్ల ఉ పాధి పనులు ముగుస్తుంటాయి. తిరిగి నవంబర్ నుంచి ప్రారంభమవుతుంటాయి. అయితే పనులు పూర్తయి దాదాపు రెండు నెలలైనా నేటికీ (2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) జిల్లాలో రూ.15.08 కోట్ల కూలీల వేతనాలు పెండింగ్లో ఉ న్నట్లు తెలుస్తోంది. అయితే వానాకాలం పంటల సాగు ముగిశాక రైతు కూలీలకు పని దొరకకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరి చారు. అయితే ఒక్కో కూలీకి సంబంధించి దాదాపు ఐదు వారాల వేతనాల చెల్లింపులు నేటికీ పెండింగ్లో ఉన్నాయి. దీంతో కూలీలు కుటుంబ పోషణకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఎక్కువగా కూలీలకు సంబంధించి పోస్టాఫీస్ ఖాతాల్లోనే వేతనాలు జమ అవుతుంటాయి. దీంతో వేతనాలు వచ్చాయో.. లేదో.. తెలియక కూలీలు నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిలిచిన ఉపాధిహామీ వేతనాలు పెండింగ్లో రూ.15.08 కోట్లు ఇబ్బందులు పడుతున్న కూలీలు -
‘కూపన్ల బాధ్యత ఇవ్వకుంటే రాజీనామా’
కాగజ్నగర్ టౌన్: ఎరువులు, యూరియా పంపిణీ చేసేందుకు జారీ చేసే కూపన్ల బాధ్యత తమకు ఇ వ్వకుంటే రాజీనామా చేస్తామని ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం చైర్మన్ ఉమామహేశ్వర్రావు పేర్కొన్నారు. శనివారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ కూపన్లను వ్య వసాయాధికారులు పంచడమేమిటని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా పీఏసీఎస్ల ఆధ్వర్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, యూరియా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాధికారులు రైతులకు పంటలపై సూచనలు, సలహాలు చేస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కానీ, రైతువేదికల్లో ఉండి రైతులకు కూపన్లు పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు. వ్యవసాయాధికా రులు ఇష్టం వచ్చిన వారికి కూపన్లు అందజేస్తున్నారని ఆరోపించారు. దీంతో అసలైన రైతులకు ఎరువులు అందక నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, నగునూరి తిరుపతి, దరిణి రాములు, కెకరి నానాజీ, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్గా నృత్యాలు చేస్తుంటారు. -
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటు న్న తమకు వాటిపై హక్కులు కల్పించాల ని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40మంది రైతులు మూడురోజుల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మి ల్లులో సేద తీరి న అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చే సుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికా రులు వాటిని సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు ప త్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా రు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీ ఎం రేవంత్రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు. -
పాము కాటుకు యువకుడి మృతి
దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్ చేసి బాత్రూమ్లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్ డోర్ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మ హేశ్ కుటుంబీకులకు విషయం తెలుపగా ద హెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్కీబాత్లో పీఎం మోదీ కై లాస్ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్ను అభినందించారు. -
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్కు చెందిన శంకర్తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు.. రెబ్బెన: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది మండలంలోని నంబాలకు చెందిన రత్నం నారాయణ (47) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే నారాయణ పదేళ్లుగా షుగర్తో బాధ పడుతున్నాడు. ఇటీవల మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. అనారోగ్య సమస్యలు భరించలేక చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనకు అస్వస్థత ఉన్నట్లు భార్య ప్రమీలకు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను రెబ్బెన పీహెచ్సీకి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మృతి వాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చాప్లే వెంకటేశ్ (30) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోగా బుధవారం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, గురువారం సాయంత్రం అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లలిత, ముగ్గురు కూతుళ్లు, కుమారుడున్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట సంజయ్, కోనూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలువేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
హాజరు శాతం పెంచాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సందర్శించి వంటశాల, ఆహారం నాణ్యత, హాజరు పట్టిక, వసతిగృహంలో సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు, తరగతి గదులు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం రాసిమెట్ట గ్రామంలో పీఎం ఆవాస్ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే పూర్తిచేయాలని సూచించారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. -
మారని బతుకులు
● ఆదివాసీల జీవితాల్లో వెలుగేది? ● ‘గిరి’ గ్రామాలకు సౌకర్యాలు కరువు ● రోడ్లు లేవు.. వైద్యసేవలకూ తిప్పలే ● విద్యావకాశాలను అందిపుచ్చుకోని వైనం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవందట్టమైన అడవిలో కాలినడక తిర్యాణి(ఆసిఫాబాద్): ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు తిర్యాణి మండలం మాణిక్యపూర్ పంచాయతీ పరిధిలోని బుగ్గరామన్న గూడెంకు చెందిన ఆదివాసీ మహిళలు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నిత్యం మాణిక్యపూర్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో నడిచి వెళ్తున్నారు. దారంతా బండరాళ్లతోపాటు వాగులు అడ్డంకిగా ఉన్నాయి. ఈ గూడెంలో 14 కుటుంబాలు ఉండగా, 40 మంది నివాసం ఉంటున్నారు. అత్యవసర సమయంలో రాకపోకలు సాగించేందుకు, రేషన్ బియ్యం, నిత్యావసరాలు పింఛన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. -
అనుబంధాల వారధి.. రాఖీ
● నేడు రాఖీ పండుగఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే వేడుక రాఖీ పండుగ. జన్మనిచ్చిన అమ్మ ప్రేమను.. జీవితాన్ని పంచిన నాన్న అప్యాయతను అన్నదమ్ముల్లో చూసుకుంటారు సోదరీమణులు. అన్నా.. అని పిలిస్తే ఎంతటి కష్టంలోనైనా అండగా నిలుస్తాడని భావిస్తుంటారు. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. శనివారం నిర్వహించే పండుగ కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆడబిడ్డలు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని వారు కూడా సోదరులకు రాఖీ కట్టేందుకు బయలుదేరి వెళ్తున్నారు. అనివార్య కారణాలతో వెళ్లలేని వారు కొరియర్ ద్వారా రాఖీలు పంపిస్తూ అనుబంధాన్ని చాటుతున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని షాపులల్లో సందడి నెలకొంది. శుక్రవారం వివేకానంద చౌక్, గాంధీచౌక్, అంబేడ్కర్ చౌక్ల్లో మహిళలు, యువతులు రాఖీలు కొనుగోలు చేశారు. వివిధ రకాల బొమ్మలతోపాటు ముందస్తుగా ఆర్డర్ ఇస్తే అన్నదమ్ముల పేర్లు, ఫొటోతో ముద్రించి ఇస్తున్నారు.విడదీయలేని బంధం సోదరులు, సోదరీమణుల బంధం జీవితంలో విడదీయరానిది. ప్రతీ సంవత్సరం ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా వదులుకుని మహారాష్ట్రకు వెళ్తా. పూణేలో ఉన్న మా సోదరులకు రాఖీ కడతాను. అలాగే అక్కాచెల్లెళ్లు లేనివారికి రాఖీ కట్టడం ఎంతో తృప్తినిస్తుంది. – సి.సుహాసిని, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు జిల్లా కేంద్రంలో రాఖీల దుకాణాల వద్ద సందడిముందుగానే వచ్చా.. నాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతుంది. మహారాష్ట్రలో ఉంటున్నాం. ప్రతీ సంవత్సరం పండుగకు వస్తుంటా. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడలోని మా అన్న ఇంటికి వచ్చా. సోదరులకు రాఖీ కడతా. – నిరోష, మహారాష్ట్ర ఆత్మీయతకు ప్రతీక మాది పెద్ద కుటుంబం. చిన్నతనం నుంచి రాఖీ పండుగ ఘనంగా చేసుకుంటాం. అన్నదమ్ములకు ఏటా తప్పకుండా రాఖీ కడతా. ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే పండుగ మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. – కోలే నిర్మల, జైత్పూర్ అన్న ఇచ్చే కానుకలు దాచుకుంటా మా సొంతూరు చెన్నూర్. కానీ వివాహం తర్వాత హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నాం. కానీ ఎన్ని పనులు ఉన్నా పెండింగ్ పెడ తాం. పుట్టిన ఊరిలో పండుగ జరుపుకోవడంలో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. రాఖీ కట్టిన తర్వాత అన్న అభిలాష్ ఇచ్చే కానుకలు భద్రంగా దాచుకుంటా. స్నేహితులు, బంధువులకు గర్వంగా చూపిస్తా. – స్వప్న, హైదరాబాద్ -
పకడ్బందీగా సంక్షేమ పథకాలు అమలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ, విద్యా, మున్సిపల్ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వందశాతం నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించాలని, పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనికల్పించాలని, పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల హాజరుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, అధికారులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. ఆరోగ్యం
● జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో చిల్డ్రన్స్ పార్కుల ఏర్పాటు ● వాకింగ్ ట్రాక్లు, ఆట వస్తువులతో అభివృద్ధి ● ఉదయం, సాయంత్రం చిన్నారులు, పెద్దలతో సందడి వాతావరణం ● సద్వినియోగం చేసుకుంటున్న పట్టణవాసులుఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిల్డ్ర న్స్పార్కులు ఆహ్లాదం పంచుతున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో ఉదయం, సాయంత్రం పచ్చని గడ్డి మైదానాల్లో పట్టణ ప్రజలు సేద తీరుతున్నారు. పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలు నాటగా.. పిల్లలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ఉదయం వాకర్స్ వ్యాయమం, యెగా కోసం వినియోగిస్తుండగా, సాయంత్రం పార్కులో కుటుంబ సమేతంగా గడుపుతున్నారు. సందర్శకుల రాకతో వీకెండ్స్లో మరింత సందడి వాతావరణం కనిపిస్తోంది. ఫొటో షూట్లకు కేరాఫ్గా..కాగజ్నగర్ మున్సిపాలిటీలో చిల్డ్రన్స్ పార్కులు పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పట్టణంలోని సర్సిల్క్ కాలనీ, కాపువాడ, మార్కెట్ ఏరియాలోని గాంధీ చౌక్, ఎల్లాగౌడ్తోట సమీపంలోని పట్టణ పార్కులు ఉన్నాయి. పచ్చటి వాతావరణంతో కూర్చోవడానికి బల్లలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం ఉండడంతో వాకింగ్ కోసం వినియోగించుకుంటున్నారు. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలో పార్కులు పచ్చని చెట్లతో అడవులను తలపించే విధంగా ఉన్నాయి. దీంతో వివిధ శుభకార్యాలకు ఫొటోషూట్లు నిర్వహించేందుకు అడ్డాలుగా ఫొటోగ్రాఫర్లు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఇవి వరంలా మారాయి. తక్కువ ఖర్చుతో ఉచితంగా మంచి లొకేషన్లు ఉండడంతో నిత్యం సందడిగా కనిపిస్తున్నాయి. వాకింగ్తో సంపూర్ణ ఆరోగ్యం నేను ఆసిఫాబాద్లోని చిల్డ్ర న్స్ పార్కులో రెగ్యులర్గా వాకింగ్తోపాటు యోగా చే స్తా. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాను. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. – శ్రీనివాస్, ఉపాధ్యాయుడు రూ.2.09 కోట్లతో అభివృద్ధిజిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులో రూ.2.09 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో డీఎంఎఫ్టీ నిధులు రూ.1.57 కోట్లు, రూర్బన్ నిధులు రూ.52 లక్షలు ఉన్నాయి. అప్పటి అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి చొరవతో అప్పటి పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ పార్కు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వెదురు బొంగులతో వెయిటింగ్ రూమ్, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. పిల్లల కోసం చుట్టూ వాల్ పెయింటింగ్స్, సీతాకోక చిలుకలు, జింకలు, ఊయల, నిచ్చెన, ఫౌంటేన్తోపాటు క్రీడా పరికరాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెద్దల కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, కెఫెటేరియా ఏర్పాటు చేశారు. పార్కులో ప్రవేశ రుసుం రూ.10 ఉంది. అయితే ఉదయం పూట వాకర్స్ కోసం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఆసిఫాబాద్: జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది నరహరిపై రెబ్బెన మండలం నంబాల సమీపంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాపర్తి రవీందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ నరహరి కోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దుండగులు దాడి చేశారని పేర్కొన్నారు. రెబ్బెన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్సై కేసు నమోదు చేయకుండా, నరహరిని స్టేషన్కు పిలిపించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు గు రిచేశారని ఆరోపించారు. ఎస్సైను సస్పెండ్ చేయా లన్నారు. లాయర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావా లని డిమాండ్ చేశారు. న్యాయవాదుల గుమాస్తాల సంఘం సభ్యులు మద్దతు పలికారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి.సురేశ్, సతీశ్బాబు, ముక్త సురేశ్, రైస్ అహ్మద్, కిశోర్, నికోడె రవీందర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుబ్బేట రాజు అన్నారు. ప్లాస్టిక్ నివారణ, వినియోగంతో కలిగే నష్టాలపై గురువా రం జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలు, హోటళ్ల యజమానులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే జప్తు చేయడంతోపాటు జరిమానా విధిస్తామన్నా రు. వర్షాకాలం నేపథ్యంలో హోటళ్లలో ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టిఫిన్ సెంటర్లలో తాజా నూనె వినియోగించాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు పంపిణీ
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకాగజ్నగర్టౌన్: జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, ఇది నిరంతర పక్రియ అని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రత కోసం కాకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కిలో రేషన్ బియ్యంపై రూ.29 ఖర్చు చేస్తుందన్నారు. బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని మా దృష్టికి వచ్చిందని, అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్నగర్ మండలంలో 664 మందికి కొత్త కార్డులు అందిస్తామని, 5,099 మంది కార్డుల్లో మార్పులుచేర్పులు చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, బీజేపీ మండలాధ్యక్షుడు అశోక్, నాయకులు కార్తీక్, వంశీ, సుమన్ పాల్గొన్నారు. పోస్ట్మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ప్రారంభంకాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోస్టుమెట్రిక్ హాస్టల్ అందుబాటులోకి రావడంతో నియోజకవర్గంలో ఇంటర్, డిగ్రీ చదువుకునే విద్యార్థులు కాగజ్నగర్పట్టణంలో ఉండొచ్చన్నారు. ప్రస్తుతం వందమందికి వసతి కల్పించిందని తెలిపారు. వసతిగృహంలో 70 శాతం ఎస్సీ, 12 శాతం బీసీ, 5 శాతం ఎస్టీ, 4 శాతం ఓసీ, 9 శాతం ఇతరులకు రిజర్వేషన్ కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఐఈవో కల్యాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ యాప్లో ముఖ గుర్తింపు హాజరు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ అన్నారు. కెరమెరి, ఝరిలోని ప్రభుత్వ పాఠశాలలను గురువారం సందర్శించారు. ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్ సిబ్బంది ఎంతమంది రిజిస్ట్రేషన్ పూర్తిచేశారో అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ కూడా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్, భరత్కుమార్ పాల్గొన్నారు. -
వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా అండర్పాస్లు
రెబ్బెన/సిర్పూర్(టి): వన్యప్రాణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అండర్పాస్ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్టు హరిణి అన్నారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని గోలేటి సెక్షన్, అమీన్గూడ బీట్లోని కంపాట్మెంట్ నంబర్ 300/1లో వన్యప్రాణులు, పులుల రాకపోకల కోసం రైల్వేలైన్ అండర్పాస్లు, సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలో రైల్వే బ్రిడ్జి ప్రాంతాలను గురువారం పరిశీలించారు. సైంటిస్ట్ డాక్టర్ ఉజ్వల్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రేవాల్తో కలిసి అండర్పాస్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం పెరిగిందని, మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి జిల్లాకు పెద్దపులులు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని రైల్వే, జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అండర్పాస్ల ద్వారా వన్యప్రాణులు కుమురంభీం జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. అనంతరం ఇటిక్యాల పహాడ్ ప్లాంటేషన్ సందర్శించి టైగర్ ట్రాకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్డీవో సుశాంత్ బొబడే, ఎఫ్ఆర్వోలు భానేష్, పూర్ణచందర్, ప్రవీణ్కుమార్, డిప్యూటీ ఆర్వో చంద్రమోహన్, ఎఫ్ఎస్వోలు మోహన్రావు, ఎఫ్బీవోలు రాజేశం, వెంకటేశ్, నరేశ్, రవీనా, అరవింద్, రైల్వే, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఆసిఫాబాద్: జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్స వం ఘనంగా నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఈ నెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తొమ్మిది తెగల నాయకులు సహకరించాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ప్రజలు, సాంస్కృతిక బృందాలను తీసుకువచ్చేందుకు వాహన ఖర్చులు ఐటీడీఏ భరించాలని కోరారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో రాజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మడావి శ్రీనివాస్, నాయకులు సిడాం అర్జు, మారుతి, నర్సింగ్రావు, సుధాకర్, ఆత్రం భీమ్రావు, సంతోష్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కూరగాయల సాగుపై దృష్టిసారించాలిపీవీటీజీ రైతులు కూరగాయల సాగుపై దృష్టి సా రించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి రమాదేవి, ఐటీడీఏ ఉద్యాన వి భాగం అధికారులతో కలిసి పీవీటీజీ రైతులకు 10 రకాల హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు ఉచితంగా అందించారు. పీవీటీజీలకు ప్రభుత్వం టమాట, మిర్చి, వంకాయ, కాకరకాయ, ఆకుకూరల వంటి విత్తనాలు అందిస్తుందని తెలిపారు. -
అక్షరాస్యులుగా తీర్చిదిద్దుదాం
ఆసిఫాబాద్రూరల్: నిరక్షరాస్యులను అక్షరా స్యులుగా తీర్చిదిద్దుదామని విద్యాశాఖ కోఆ ర్డినేటర్ మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని తెలంగాణ మోడల్ స్కూల్లో నవ భారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా గురువా రం జిల్లాలోని అన్ని మండలాల రిసోర్స్పర్సన్లకు ఉల్లాస్పై జిల్లాస్థాయి శిక్షణ నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో 22వేల మందిని అక్షరాస్యత లేనివారిని గుర్తించామన్నా రు. పాఠశాలలు, గ్రామ సభలు, అంగన్వాడీ కేంద్రాల్లో వీరికి బోధన కొనసాగుతుందన్నా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, రి సోర్స్పర్సన్ తిరుపతయ్య, శ్యాంసుందర్, మోహన్, సామలశ్రీ పాల్గొన్నారు. -
వేతనాలు చెల్లించడం లేదని ధర్నా
కాగజ్నగర్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సె క్యూరిటీ సిబ్బందికి నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఎదుట సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఉపేందర్ మాట్లాడుతూ సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించారు. ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా ప్రతీ నెల 5లోగా వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సి బ్బంది రాము, ఇమ్రాన్, సాయి, తిరుమల, పుష్ప, మీనాక్షి, రాజేశ్, నరేశ్, భాగ్య, శారద, నిర్మల, మునేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
● ఈసారి కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమే.. ● టెండర్ల ప్రక్రియకు పడని ముందడుగు ● సొంతంగా చేపపిల్లలు కొనుగోలు చేస్తున్న మత్స్యకారులు
టెండర్లు పిలవలేదుజిల్లాలో మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన ఉచిత చేపపిల్లల సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ చేపడుతుందని అనుకుంటున్నా. జిల్లాలో కొంతమంది మత్స్యకారులు ప్రైవేటుగా చేపపిల్లలు కొనుగోలు చేసుకుని చెరువుల్లో వదులుకుంటున్నారు. అయితే చాలా కొద్దిమంది మాత్రమే దూరప్రాంతాల నుంచి పిల్లలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే చేపపిల్లలు కూడా తీసుకుంటున్నారు. – సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారిరెబ్బెన(ఆసిఫాబాద్): మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. చె రువులు, కుంటల్లో పెంచి వాటి ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే లక్ష్యం ఉన్నతంగానే ఉన్నా అమలులో ఏర్పడుతు న్న జాప్యం మత్య్సకారుల పాలిట శాపంగా మారుతోంది. వర్షాకాలం సీజన్ దాదాపు ముగిసే సమయానికి ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు అందిస్తుండటంతో అవి సరైన సైజు పెరగక మత్స్యకారులు నష్టపోతున్నారు. సకాలంలో అందిస్తేనే ఉపయోగకరంగా ఉంటుందని మత్స్య పారిశ్రామిక సంఘాలు అధికారులకు మొరపెట్టుకున్నా తీరు మారడం లేదు. అసలే ఆలస్యం.. ఆపై చిన్నసైజు చేపపిల్లలు అందిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపడం లేదు. ఉచితం అనే ఒక్క కారణంగా బలవంతంగా తీసుకుని చెరువుల్లో విడుదల చేస్తున్నా ఆశించిన లాభం దక్కడం లేదు. టెండర్లు ఏవి..? జిల్లాలో 15 మండలాల పరిధిలో 72 మత్స్యపారిశ్రామిక సంఘాలు ఉండగా.. వాటిలో సుమారు 2800 మంది సభ్యులు ఉన్నారు. చేపల వేట, వాటి విక్రయంగా ద్వారా ఈ సంఘాల సభ్యులు ఉపాధి పొందుతున్నారు. చేపల పెంపకానికి జిల్లాలో 282 చెరువులను సంబంధిత శాఖ అధికా రులు గుర్తించారు. వాటిలో సుమారు 1.40 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏ టా ప్రభుత్వం టెండర్లను పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటింది. గతేడాది సెప్టెంబర్ రెండో వారంలో చేప పిల్లలు పంపిణీ చేయగా ఈసారైనా కాస్త ముందు అందిస్తారని మత్స్యకారులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లను కూడా పిలవలేదు. దీంతో ఈసారి కూడా పంపిణీ ప్రక్రియ ఆలస్యమయ్యేలా ఉందని వాపోతున్నారు. గతేడాది జిల్లా అధికారులు 1.20 కోట్ల చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 80లక్షల చేప పిల్లలకు మాత్రమే ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ రెండోవారం కావడంతో చాలా మండలాల్లో మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో జిల్లాలో 56లక్షల చేప పిల్లలను మాత్రమే అధికారులు అతికష్టం మీద పంపిణీ చేశారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు ఉచిత చేపపిల్లల పంపిణీ ఆలస్యమవుతుండటంతో మత్య్సకారులు సొంత ఖర్చులతో ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో పలు మండలాల మత్స్యకారులు ఇప్పటికే చేపపిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్లల సైజు సైతం చిన్నగా ఉంటున్నాయి. ఫలితంగా చెరువుల్లో నీరు తగ్గే సమయానికి ఒక్కో చేప అరకిలో వరకు కూడా బరువు పెరగడం లేదు. మత్స్యకారులు ఉచిత చేపపిల్లల కోసం ఎదురుచూడకుండా సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చి చెరువుల్లో వదులుతున్నారు. ఇప్పుడు వదిలిన చేపపిల్లలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేటాడుతారు. ఒక్కో చేప గరిష్టంగా 2.5 కిలోల బరువు తూగుతుంది. దీంతో మత్స్యకారులకు లాభం వస్తుంది. అదే ప్రభుత్వం అందించిన చేపపిల్లలు గరిష్టంగా కిలో బరువు కూడా పెరగకపోవడంతో ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని మత్స్యకార సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. -
బీజేపీతోనే రాష్ట్ట్రంలో అభివృద్ధి
ఆసిఫాబాద్రూరల్/కాగజ్నగర్టౌన్: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారి బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు నివాసంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్స్లో బీజేపీ జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్, కుమురం భీం విగ్రహాలకు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా పంటల సాగకు ఉపయోగపడ డం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు ల పేరుతో రూ.లక్షల కోట్లు అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 2014 నుంచి బీజేపీ సర్కారు రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 19 నెలలవుతున్నా.. 19 రూపాయల అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఆదిలాబాద్ విమానశ్రయానికి స్థలం చూపిస్తే ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కాగజ్నగర్ పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.వందల కోట్లు మంజూరు చేసినా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్, ధర్నాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలుపుదల చేసిందన్నారు. ఆయా సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు ఆంజనేయులుగౌడ్, కృష్ణకుమారి, బోనగిరి సతీశ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు‘స్థానిక ఎన్నికల కోసమే 49 జీవో తాత్కాలిక నిలిపివేతస్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. జీవోను పూర్తిగా రద్దు చేయాలని, లేకుంటే కుమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. 2014లో రాబందుల ఆవాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కన్జర్వేషన్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నివేదిక పంపించిందని గుర్తు చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం రూ.108 కోట్ల నిధులు మంజూరు చేస్తే రూ.80 కోట్లు వేరే జిల్లాకు తరలించారని ఆరోపించారు. -
ప్రభుత్వ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’
● నాలుగేళ్లు నిండిన పిల్లలకు అవకాశం ● జిల్లాలో 41 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక ● ఆగస్టు 15 నుంచి తరగతులు ప్రారంభం!ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐ బోధనతోపాటు ఇక నుంచి ప్రీప్రైమరీ పాఠశాలల నిర్వహణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నారు. రానున్న 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించనున్నారు. జిల్లాలో 41 ప్రీ ప్రైమరీ పాఠశాలలు జిల్లాలో మొదటి విడతలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య కోసం ఎంపిక చేయగా, రెండో విడతలో 25 స్కూల్స్ను ఎంపిక చేశారు. మొత్తం 41 ప్రీ ప్రైమరీ పాఠశాలల పరిధిలో నాలుగేళ్ల వయస్సు నిండిన విద్యార్థులు 400 మంది ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆగస్టు 15 నుంచి పూర్వ ప్రాథమిక విద్య తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రీప్రైమరీ పాఠశాల నిర్వహణకు పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు ఒక ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. గాలివెలుతురు సక్రమంగా ఉండటంతోపాటు ఫర్నీచర్ అందుబాటులో ఉంచాలి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, ఆకర్షణీయంగా గదిని తీర్చిదిద్దాలి. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా లోపల, బయట సరైన ఆట వస్తువులు అందుబాటులో ఉంచాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సమన్వయంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సర్కారు సూచించింది. యూడైస్లో వివరాలు నమోదు.. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నాలుగేళ్లు నిండిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. అడ్మిషన్ సమయంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారుల వయస్సు, నివాస ధ్రువపత్రాలు తీసుకోవాలి. వివరాలను సంబంధించి రిజిస్టర్లో నమోదు చేసిన వెంటనే యూడైస్ పోర్టల్లోనూ అప్లోడ్ చేయాలి. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించాలి. ప్రీ ప్రైమరీ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహణకు టీచర్, రెండు ఆయా పోస్టులను మంజూరు చేశారు. కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్(వైస్ చైర్మన్) డీఈవో (కన్వీనర్)తో కూడిన జిల్లా కమిటీ పర్యవేక్షణలో వీరిని ఎంపిక చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో జయశంకర్ కీలకపాత్ర పోషించారని, సహాయకర్తగా విశేష సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాన్ని ధారపోసిన మహనీయుడని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతి, డీటీవో రాంచందర్, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, కలెక్టరేట్ ఏవో కిరణ్, అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి వాంకిడి(ఆసిఫాబాద్): పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలోని జెడ్పీ ఉన్న త పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. వర్షాకా లం దృష్ట్యా పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకోవాలన్నారు. కట్టెల పొయ్యిపై కాకుండా గ్యాస్ స్టౌ వ్లపై ఆహారం తయారు చేయాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఉదయ్బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీ బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లుముందస్తు రిజర్వేషన్ ఇలా..పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.ఆదిలాబాద్: రాఖీ పండుగతోపాటు వరలక్ష్మి వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. వరుస సెలవుల దృష్ట్యా ఉద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది. వరుసగా సెలవులు ఈనెల 8న వరలక్ష్మీవ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరాబాద్కు 72 బస్సులను నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుబాటులో రాఖీ బుకింగ్ కౌంటర్లు.. పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో వీటిని ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు సైతం పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సెల్ నంబర్ 91542 98531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 91542 98547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 91542 98541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553 పై సంప్రదించాలని కరీంనగర్ జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ కోరారు.118 ప్రత్యేక బస్సులు..ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ బట్టి బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎస్.భవాని ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
అనుమతి లేకుండా నీలగిరి చెట్లు నరికివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి ఎక్స్రోడ్ నుంచి గోలేటి టౌన్షిప్ వైపు మార్గంలోని సింగరేణి రోడ్డుకు ఇరువైపులా యాజమాన్యం గతంలో నీలగిరి మొక్కలు నాటింది. ఈ దారిలో పులికుంట వాగు ఒడ్డున సింగరేణి సంస్థకు చెందిన భారీ నీలగిరి వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. సమాచారం అందుకున్న సింగరేణి సెక్యూరిటీ అధికారి శ్రీధర్, ఎస్అండ్పీసీ సిబ్బంది బుధవారం చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. మూడు భారీ నీలగిరి చెట్లు నరికినట్లు గుర్తించారు. రోడ్డు పక్కన సింగరేణి యాజమాన్యం పెంచిన వృక్షాలను అనుమతి లేకుండా నరికివేయడంతోపాటు కొత్తగా నిర్మిస్తున్న జిన్నింగ్ మిల్లు సమీపంలో చెట్లను ముక్కలు చేసి మాయం చేసినట్లు నిర్ధారించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని సెక్యూరిటీ అధికారి తెలిపారు. -
ఢిల్లీ తరలిన కాంగ్రెస్ నేతలు
ఆసిఫాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నేతలు తరలివెళ్లారు. ఢిల్లీ కి వెళ్లిన వారిలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీసీ సంఘాల నాయకులు డాక్టర్ రమేశ్, బాలేశ్వర్గౌడ్, గోపాల్, శివ తదితరులు ఉన్నారు. ముగిసిన శిక్షణ తరగతులు పెంచికల్పేట్: మండల కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఎంపీడీవో అల్బర్ట్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో వంద రోజులు పని పూర్తి చేసిన వారికి ఎస్బీఐ ఆధ్వర్యంలో ఎంటర్ప్య్రూనర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ కార్యాలయ హెచ్ఆర్ మేనేజర్ మల్లేశ్, ఏపీవో సతీశ్, ఏపీఎం అశోక్, డీఆర్పీ ఆనంద్, ఎస్బీఐ సిబ్బంది ఆశన్న తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీని సందర్శించిన ఏడీ
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని మోడి కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని బుధవారం మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్(ఏడీ) శ్రీనివాసచారి సందర్శించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయుల హాజరు, టీచర్ల వార్షిక యూని ట్ ప్లాన్స్, టీచింగ్ డైరీలతోపాటు తరగతిలో బోధన పద్ధతులను పరిశీలించారు. బేస్లైన్, ఫార్మాటివ్ అసెస్మెంట్ పరీక్ష పత్రాలను పరిశీ లించి, విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు ఎలా సాధించాలో తెలియజేశారు. పాఠ్య ప్రణాళిక ప్రకారం కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా ఏఎంవో ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్వో ప్రవీణ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల పోరాట సమితి(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాయకులు చరణ్దాస్, శాంతికుమారి మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏ చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, సర్దుబాటు జీవో 25 సవరణ, రెగ్యులర్ ఎంఈవోల నియామకంతోపాటు 317 జీవోతో నష్టపోయిన టీచర్లకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి బకాయిలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు మంజూ రు చేయాలన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఊశన్న, కేశవ్, శ్రీనివా స్, శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలంలో భగ భగ
● అనుహ్యంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● వారం రోజులుగా జాడలేని వాన ● నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం ● మందకొడిగా సాగుతున్న వరినాట్లుమంగళవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలుకౌటాల(సిర్పూర్): వానాకాలం సీజన్లో భిన్న వాతావరణ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో అనుహ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు వారం రోజులుగా వాన జాడలేకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన వర్షాలకు పొలాలను దమ్ము చేయగా, ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కూలీల కొరతతో వరి పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. వర్షాధారంగా సాగు చేసే భూముల్లో నాట్లు వేసేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. మండుతున్న సూరీడు.. వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా పగటి పూ ట రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. పగలు, రాత్రి సమయంలో ఉక్కపోత ఉంటోంది. నైరుతి రుతుపవనాలతో ద్వితీయార్థంలో ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా.. ఆగస్టులో ఎండ తీవ్రతకు ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంట లు దాటితే సుర్రుమంటోంది. వ్యవసాయ కూలీలు పనులు చేయడానికి తిప్పలు పడుతున్నారు. సా యంత్రం మబ్బులతో వాతావరణం చల్లబడుతు న్నా రాత్రంతా మళ్లీ ఉక్కపోత కొనసాగుతోంది. భిన్న వాతావరణంతో ఎండ వేడికి తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. మరో మూడు, నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సాధారణమే..కార్తెలన్నీ కరిగిపోతున్నా కరువుతీరా వర్షాలు మాత్రం కురవడం లేదు. ఈ వానాకాలంలో సీజన్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 598.5 మి.మీ. సగ టు వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా 598.2 మి.మీటర్లుగా నమోదైంది. జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జైనూర్, తిర్యాణి, సిర్పూర్(యూ), దహెగాం మండలాల్లో లోటు కనిపిస్తోంది. కాగజ్నగర్, బెజ్జూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే ఉంది. వారం రోజులుగా వరుణుడి జాడ లేకపోవడంతో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు వరి నాట్లు వేసుకోవచ్చని, ఈ నెలలో భారీ వర్షాలు కురిస్తే పంటల సాగుకు ఇబ్బంది ఉండదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆగస్టులో భారీ వర్షాలు పడకపోతే పంటల సాగుకు దేవుడే దిక్కని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ నుంచి ఆగస్టు 5 వరకు మి.మీ.లలో)మండలం కురవాల్సింది కురిసింది స్థితి(శాతం) జైనూర్ 640.4 481.4 –25 లోటు సిర్పూర్(యూ) 616.2 424.8 –38 లోటు లింగాపూర్ 598.1 623.0 +4 సాధారణం తిర్యాణి 513.0 339.7 –22 లోటు రెబ్బెన 514.9 586.9 +14 సాధారణం ఆసిఫాబాద్ 541.2 601.9 +11 సాధారణం కెరమెరి 537.7 563.2 +5 సాధారణం వాంకిడి 568.9 652.1 +15 సాధారణం కాగజ్నగర్ 553.4 668.8 +21 అధికం సిర్పూర్(టి) 618.1 643.1 +4 సాధారణం కౌటాల 660.3 683.2 +3 సాధారణం చింతలమానెపల్లి 651.7 790.0 +21 అధికం బెజ్జూర్ 667.9 820.8 +21 అధికం పెంచికల్పేట్ 663.6 566.5 –11 సాధారణం దహెగాం 652.8 467.4 –28 లోటు ప్రాంతం ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్) సిర్పూర్(టి) 37.9 బెజ్జూర్ 37.7 ఎల్కపల్లి 37.3 కౌటాల 37.0 వెంకట్రావ్పేట 36.7 లోనవెల్లి 36.6 దహెగాం 36.4 జంబుగా 36.2 గిన్నెదరి 36.1 -
పీఎంశ్రీతో వసతులు మెరుగు
● ప్రభుత్వ బడులకు ప్రత్యేక నిధులు ● సౌకర్యాల కల్పనకు పెద్దపీట ● అత్యుత్తమ పాఠశాలగా పెంచికల్పేట్ జెడ్పీ స్కూల్ ఎంపికఆనందంగా ఉంది అధికారులు పీఎంశ్రీలో పెంచికల్పేట్ ఉన్నత పాఠశాలను అత్యుత్తమ స్కూల్గా ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింస్తున్నాం. డిజిటల్ బోధన ద్వారా నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. రానున్న రోజుల్లో పాఠశాలను మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. – విజయనిర్మల, హెచ్ఎం, పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, పెంచికల్పేట్పెంచికల్పేట్(సిర్పూర్): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ(ప్రధాన మంతి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ఢిల్లీలో పీఎంశ్రీ పాఠశాలలను జాతికి అంకితం చేశారు. జిల్లాలో 18 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా వీటిలో పెంచికల్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అత్యుత్తమ పాఠశాలగా అధికారులు ఎంపిక చేశారు. బోధన ప్రత్యేకం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తు న్న పీఎంశ్రీ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రత్యే క చర్యలు చేపడుతున్నారు. అదనపు తరగతుల నిర్వహణ, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్, అటల్ థింకింగ్ లైబ్రరీ, కంప్యూటర్, ప్యానల్ ఆధారిత బోధన చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యానల్స్, బొమ్మల ద్వారా బోధన చేపడుతూ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవనాలు కల్పిస్తున్నారు. మరో వైపు విద్యార్థుల్లో పర్యావరణంపై ఆసక్తిని పెంచడానికి తోటల పెంపకం, నీటి సంరక్షణకు ఇంకుడు గుంత ల ఏర్పాటు, స్వచ్ఛత, మొక్కల పెంపకం, యూత్ ఎకో క్లబ్, సెల్ఫ్ డిఫెన్స్, సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు చేశారు. క్షేత్ర పర్యటనలతో అనుభవాలు..తరగతి గదులతోపాటు విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభూతిని పెంపొందించడానికి క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. ఏటా ఫీల్డ్ ట్రిప్స్, ఎక్స్ఫ్లోజర్ విజిట్, సైన్స్, మ్యాథ్స్ యాక్టివిటీలు, పాఠశాల వార్షికోత్సవాలు, ట్విన్నింగ్ మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది డెస్క్టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ బోధన చేస్తున్నారు. లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందిస్తున్నారు.పెంచికల్పేట్ స్కూల్కు నిధులుపీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు మౌలిక వసతులు కల్పిస్తోంది. పెంచికల్పేట్ ఉన్నత పాఠశాలకు రూ.18,79,990 నిధులు విడుదల చేసింది. రూ.11.80లక్షలతో ల్యాబ్, లైబ్రరీ నిర్మాణం పూర్తి చేశారు. మిగతా నిధులతో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అత్యుత్తమ పాఠశాలగా ఎంపిక చేయడంతో మరో రూ.15లక్షలు పాఠశాలకు అందనున్నాయి. -
ఎస్పీఎంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి
ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక నిరుద్యోగుల కే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యోగ కల్పన పోరాట సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందించారు. ఆ సంఘం కన్వీన ర్ రమేశ్ మాట్లాడుతూ ఎస్పీఎం పునఃప్రారంభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. కోట్ల రాయితీలు, మినహాయింపులు పొంది స్థానికేతరులకు(ఇతర రాష్ట్రాల వారికి) ఉ ద్యోగాలు కల్పించడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు విద్యార్హతలు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని మిల్లులో 75శాతం మంది స్థానిక ఉద్యోగులు విధుల్లో చేరేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హైమద్, తాజొద్దీన్, సాయి తదితరులు ఉన్నారు.