breaking news
Komaram Bheem
-
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని డీటీడీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో డీఎస్వో మీనారెడ్డితో కలిసి క్రీడాకారులను అభినందించారు. డీటీడీవో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి 12 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలి పారు. వీరు ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్ఎం జంగు, ఏటీడీవో చిరంజీవి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. జావెలిన్ త్రో పోటీలకు సాక్షి..జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్న సాక్షి జావెలిన్ త్రో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందని ప్రిన్సిపాల్ రాందాస్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో విద్యార్థినిని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. -
రేషన్కార్డులు సద్వినియోగం చేసుకోవాలి
చింతలమానెపల్లి: ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతువేదికలో శుక్రవారం ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి రేషన్కార్డులు పంపిణీ చేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కోసం ప్రభుత్వం రేషన్కార్డులు అందిస్తుందన్నారు. బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు చేస్తామని, డీలర్లు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. అక్రమంగా బియ్యం కొని బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ హామీల అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డులు అందిస్తుందన్నా రు. మండలంలోని దిందా వాగు వంతెన నిర్మా ణం వర్షాకాలం ముగియగానే ప్రారంభమవుతుందని తెలిపారు. ఖర్జెల్లి నుంచి గూడెం రహదా రికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అటవీ అనుమతులు రానిచోట మినహా అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, తహసీల్దార్ మడావి దౌలత్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఏవో కీర్తీషా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్, పార్టీ యూత్ అధ్యక్షుడు బండి మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంకౌటాల: ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాలలోని రైతువేదికలో శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కౌటాల మండలానికి 656 కొత్త రేషన్కార్డులు మంజూరు చేయగా, 1,064 మంది సభ్యుల పేర్లు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, తహసీల్దార్ ప్రమోద్, సహకార సంఘం చైర్మన్ మాంతయ్య పాల్గొన్నారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలికాగజ్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు తెలుసుకున్నారు. పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు హనుమంతు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
చిట్టిచేతులకు విముక్తి
● విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● రెండు డివిజన్లలో కొనసాగిన తనిఖీలు ● 48 మంది బాలల గుర్తింపు, మూడు కేసులు నమోదు ● చిన్నారులు తిరిగి విద్యనభ్యసించేలా చర్యలువాంకిడి(ఆసిఫాబాద్): తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడం, బాల కార్మికులను రక్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివి జన్లలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన 11వ విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రెండు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1– 18 సంవత్సరాల వయస్సు గల అనేక మంది బాలలకు విముక్తి కల్పించారు. తప్పిపోయిన, బాల కార్మికులుగా కొనసాగుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆధునిక కాలంలో చదువు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లాలో నెల రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో 48 మంది బాలలను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలుఆపరేషన్ ముస్కాన్– 11లో భాగంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్, బాలల సంరక్షణ శాఖ నుంచి ఒకరు, చైల్డ్ హెల్ప్లైన్ నుంచి ఒకరు, కార్మిక శాఖ నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ఈ బృందాలు నెల రోజులపాటు జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, మెకానిక్ షాప్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, మిల్లులలో తనిఖీలు చేపట్టాయి. గుర్తించిన బాలలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 48 మంది గుర్తింపు..నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో విద్యకు దూరంగా ఉంటున్న మొత్తం 48 మంది బాలలను గుర్తించారు. ఆసిఫాబాద్ డివిజన్లో 25 మందిని గుర్తించగా.. అందులో 23 మంది బాల కార్మికులు ఉన్నారు. మరో ఇద్దరు డ్రాప్ అవుట్ స్టూడెంట్లు ఉ న్నారు. కాగజ్నగర్ డివిజన్లో 23 మందిని గుర్తించగా.. అందులో 18 మంది బాలకార్మికులుగా ఉన్నారు. మరో ఐదుగురు డ్రాప్ అవుట్ పిల్లలు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి బడులకు పంపేలా చర్యలు తీసుకున్నారు. అనాథ పిల్లలను వసతి గృహాలకు తరలించి ఉచితంగా వసతి, భోజనం, విద్య, వైద్యం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చదువుకునే వయస్సులో చట్ట వ్యతిరేకంగా బాలలను పనుల్లో పెట్టుకుని కార్మికులుగా మారుస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మూడు కేసులు నమోదు చేశారు.ఇటుకల బట్టీలో తనిఖీ చేస్తున్న సభ్యులుబాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు 18 ఏళ్లలోపు బాలలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. చదువుకునే వయస్సులో పిల్లలను పనులకు పంపించకూడదు. జిల్లాలో రెండు ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 48 మంది పిల్లలను రక్షించాం. మూడు కేసులు సైతం నమోదు చేశాం. బాలల సంరక్షణకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తిస్తే సమాచారం అందించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
‘బనకచర్ల’తో అన్యాయం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏపీ ప్రభుత్వం చేపట్టి న బనకచర్ల లింకు ప్రాజెక్టుతో తెలంగాణకు గోదా వరి నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవా రం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ విద్యార్థి సదస్సు నిర్వహించారు. సాగునీటి రంగ నిపుణులు వి.ప్రకాశ్రావు ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇ చ్చారు. కృష్ణా జలాల మాదిరే గోదావరి జలాలను తీసుకుపోయేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ చర్యతో నీటిలో హక్కులు కోల్పోయి భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ స్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో బనకచర్లపై చర్చ జరగలేదని చెబితే.. ఏపీ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చర్చ జరిగిందని అంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి అ న్నింటిలో ఏపీ సీఎం చంద్రబాబు అండగా ఉండడంతోనే ఈ ప్రాజెక్టుకు అడ్డుచెప్పడం లేదని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజె క్టు ఒక ఫియర్ కుంగితేనే అంతా అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు విజిత్రావు, రాజారాం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యార్థి నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాలలో విద్యార్థి సదస్సు -
జిల్లాకు అవార్డులు
సంపూర్ణతా అభియాన్లో ఆసిఫాబాద్: కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సంపూర్ణతా అభియాన్లో అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అవార్డుల్లో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాలు ఎంపిక కాగా, అందులో జిల్లాలోని తిర్యాణి బ్లాక్ కూడా ఉంది. ఈ క్రమంలో 5 పాయింట్లు సాధించిన జిల్లా సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. అలాగే సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమారోహ్లో భాగంగా అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అవార్డుకు ఎంపిక కాగా, బ్రాంజ్ మెడల్ దక్కింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డులు అందుకోనున్నారు. తిర్యాణి బ్లాక్లో అభివృద్ధి పనులుపౌరుల జీవన నాణ్యతను మెరుగుపర్చడం కోసం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలోని 500 బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రెండేళ్ల కింద తిర్యాణి మండలాన్ని ఏబీపీగా ఎంపిక చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్లో దక్షిణ జోన్లో ప్రథమ స్థానం, దేశవ్యాప్తంగా నాలు గో స్థానంలో నిలిచింది. ఉత్తమ బ్లాక్గా ఎంపిక కావడంతో అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. 9 రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆర్థికాభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంశాలపై దృష్టి సారిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అంతరాయం ఏర్పడకుండా నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఆరు నెలల ఒకసారి క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నారు. మహిళలకు వందశాతం రుణాలు అందజేస్తున్నారు. భూసార పరీక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వినియోగించుకుంటున్నారు. నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వీకరణ -
పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
● నేటి నుంచి 11వ తేదీ వరకు ప్రక్రియ ● జిల్లాలో 108 మందికి ప్రమోషన్లు ఆసిఫాబాద్రూరల్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖలో ప్రమోషన్ల సందడి మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్– 2 హెడ్మాస్టర్లుగా, స్కూల్ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. జిల్లాలో సుమారు 108 మందికి పదోన్నతి దక్కనుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ ఈ నెల 11న ముగియనుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రమోషన్లకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. 108 మంది అవకాశం..జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో స్కూల్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం 2,050 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 397 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందనున్నారు. 108 మంది ఉపాధ్యాయులకు పదోన్నతుల అవకాశం రానుంది. ఇందులో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీలకు 76 మందికి ప్రమోషన్లు వస్తే ప్రైమరీ స్కూళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యావలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖాళీలు ఇలా..జిల్లాలో ఉన్న 108 ఖాళీలలో పీజీ హెచ్ఎంలు 6, పీఎస్ హెచ్ఎంలు 26, స్కూల్ అసిస్టెంట్లు 76 మందికి అవకాశం రానుంది. సబ్జెక్టుల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. ఎస్ఏ గణితం 11, ఫిజికల్ సైన్స్ 7, బయోసైన్స్ 4, సాంఘిక శాస్త్రం 17, తెలుగు 13, హిందీ 12, ఇంగ్లిష్ 6, స్పెషల్ ఎడ్యుకేషన్ 6, తదితర పోస్టులు ఉన్నాయి.షెడ్యూల్ ఇలా.. ఈ నెల 2న ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్– 2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈవో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పదోన్నతుల కోసం ఎస్ఏ, ఎస్టీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రదర్శిస్తారు. 3న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 4, 5 తేదీల్లో సీనియార్టీపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవో వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 6న గ్రేడ్– 2 హెచ్ఎంల పదోన్నతి కోసం ఎస్ఏలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 7న ఎస్ఏలకు గ్రేడ్– 2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. 8,9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్– 2 హెచ్ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీ ల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటిస్తారు. 10వ తేదీన ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. 11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఉత్తర్వు కాపీలు అందజేస్తారు. విద్యార్థులు నష్టపోకుండా చూడాలి ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులకు అవకాశం ఇవ్వడం హర్షణీయం. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీల్లో వీవీలను నియమించాలి. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. సర్దుబాటు ప్రక్రియ కాకుండా నూతన నియామకాలు సైతం చేపట్టాలి. – శాంతికుమారి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు -
విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడాపాఠశాలలో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పీడీలు, పీఈటీలకు గురువారం ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. డీటీడీవో మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. వ్యాయమ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతూ క్రీడల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో మీనారెడ్డి, జీసీడీవో శకుంతల, ఏటీడీవో చిరంజీవి, హెచ్ఎం జంగు, కోచ్లు విద్యా సాగర్, అరవింద్, తిరు మల్, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గుణాత్మక విద్య అందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సకల సదుపాయాలతో కూడిన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరమ్మతుల కోసం విడుదలైన నిధులతో కళాశాలలో అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాందాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్కాగజ్నగర్రూరల్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్ను గురువారం సందర్శించి పలు విభాగాలపై సమీక్షించారు. రికార్డులు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, చార్జ్షీట్లు, తదితర రికార్డులు పరిశీలించారు. బ్లూకోల్ట్ సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు డయల్ 100కు వచ్చిన కాల్స్పై తక్షణమే స్పందించాలన్నారు. వేగంగా సంఘటన స్థలానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మెరుగైన సేవలందించేందుకు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేవిధంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సందీప్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్ కార్డులు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేజైనూర్(ఆసిఫాబాద్): జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్రావుతో కలిసి రేషన్కార్డు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జైనూర్ మండలంలో 913 నూతన రేషన్ కార్డు మంజూరు చేయగా, 1,595 మంది సభ్యుల పేర్లు నమోదు చేశామని తెలిపారు. అనంతరం జైనూర్లో చేయూత పింఛన్ల పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బీర్శావ్ తదితరులు ఉన్నారు. సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలిలింగాపూర్(ఆసిఫాబాద్): ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సిర్పూర్(యూ) మండలంలోని మహగాం రైతువేదికలో గురువారం సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సిర్పూర్(యూ) మండలానికి 241, లింగాపూర్ మండలానికి 304 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్, రిజిస్టర్, ఔషధాల గది, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన విద్యార్థినులతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, పౌర సరఫరాల అధికారి సాదిక్, తహసీల్దార్ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో ప్రగతి..!
● గిరిజన బడుల బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమాలు ● నెలనెలా అభ్యసన ఫలితాలపై సమీక్ష ● ప్రతీ విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ తయారీ ● జిల్లాలో 377 గిరిజన పాఠశాలలుకెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల బలోపేతానికి ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రతినెలా అభ్యసన ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాలల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. గిరిజన విద్యార్థులే పాఠశాలల నిర్వహణలో పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని 15 క్లస్టర్ల పరిధిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉండగా, ప్రాథమిక పాఠశాలలు 331 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 14,190 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై కథనం. అక్షర జ్యోతి..అక్షర జ్యోతి కార్యక్రమం గతేడాది నుంచి ప్రారంభమైంది. ప్రాథమిక పాఠశాలల్లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం.. గణితంలో చతుర్విద ప్రక్రియల్లో కనీస నైపుణ్యాల కోసం 45 రోజులు కార్యాచరణ రూపొందించారు. 2వ తరగతి నుంచి 9వ తరగతుల వరకు బేస్లైన్ టెస్టులు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పర్యవేక్షణ, మార్పిడి విధులు అమలు చేయాలి. విద్యార్థులతో కమిటీలుఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను నాలుగు హౌజ్లుగా విభజించి వారిలో ఒకరి ని కెప్టెన్గా నియమించారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే పేరుతో కమిటీలు ఏర్పా టు చేశారు. ఈ గ్రూపుల్లోని విద్యార్థులు ఆశ్రమ పాఠశాలకు అధ్యక్షుడు, కార్యదర్శులుగా ప్రధానో పాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు లేని స మయంలో పాఠశాలలను నిర్వహించడం, తోటి వి ద్యార్థులకు అనుమానాలను నివృత్తి చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఒక్కో కమిటీకి ఒక్కో ఉపాధ్యాయుడిని ఇన్చార్జిగా నియమించారు. నెలాఖరున మీటింగ్లుప్రతినెలా చివరిరోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతితోపాటు విద్యాభివృద్ధిపై సమీక్షించుకోవాలి. నెలవారీ సిలబస్ పూర్తి, అభ్యసన ఫలితాల పురోగతి, విద్యార్థుల హాజరు, ఆరోగ్యం, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల ఫలితాలపై సమీక్షించుకోవాలి. సదరు అంశాల్లో ఏవైనా సరైన పద్ధతిలో కొనసాగకుంటే ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాలి. ప్రతీ విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ ఉండేలా ప్రతినెలా ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. నెలలో మూడో శనివారం పీటీఎం(పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) నిర్వహించాలి. అదే శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలి. ఫుడ్ సేఫ్టీ కమిటీ, మెనూ కమిటీని ఏర్పాటు చేసి పకడ్బందీగా అయలు చేయాలి. అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ‘మిషన్ ఎడ్యుకేషన్’జిల్లాలోని అన్ని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో మిషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం. ప్రార్థన సమయానికి హాజరు కావడం, ప్రతీ పాఠశాలకు నేమ్ బోర్డులు ఉండాలి. టీఎల్ఎంను గోడలపై ప్రదర్శించాలి. అలాగే విద్యార్థులు తయారుచేసిన టీఎల్ఎంలను కూడా ప్రదర్శించాలి. ప్రతిరోజూ హోంవర్క్ రాయించేలా చేయాలి. ఉపాధ్యాయులు నోటుపుస్తకాలు పరిశీలించాలి. వందశాతం హాజరుకు హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలి. లీప్ ఫర్ వర్డ్ఎల్డబ్ల్యూఎఫ్ (లీప్ ఫర్ వర్డ్) అనే ఇంగ్లిష్ లర్నింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ కొన్ని పదాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. వారిలో ఆంగ్ల నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 5వ తగరతుల వరకు అమలు చేస్తున్నారు. యోక్(యంగ్ లీడర్ క్లబ్) కార్యక్రమాన్ని 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ప్రతీ తరగతి నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారిని టీం లీడర్లుగా ఎన్నుకుంటారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలబరేషన్, కమ్యూనికేషన్ అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. -
‘పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు’
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరికీ గుర్తింపు దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సుభాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలన్నారు. వార్డు, గ్రామస్థాయిలో బలోపేతంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ, మండల, గ్రామ పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను తయారు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం టికెట్లు కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు బాలేశ్వర్గౌడ్, గజ్జి రామయ్య, నాయకులు ప్రకాశ్రావు, రమేశ్, చరణ్, వసంత్రావు, మహేశ్గౌడ్, మునీర్ అహ్మద్, గోపాల్నాయక్, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతి
కాగజ్నగర్టౌన్: రాష్ట్రంలోని ఆరె కులస్తుల ను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరె కులస్తులు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 28 కులాలను ఓబీసీ జాబితా లో చేర్చాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి అతి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చంకపురే గణపతి, డోకె దామోదర్, ఎలకరి దామోదర్, ఎల్ములే మల్లయ్య, సత్పుతే తుకారం, లోనారే రవీందర్, డుబ్బుల వెంకన్న, భరత్ తదితరులు ఉన్నారు. -
ఒక సిమ్తో ఒకేసారి కాల్ !
● ఆ తర్వాత సిమ్ లేకుండా ధ్వంసం ● ‘జన్నారం సైబర్’ కేసులో నిందితుల తీరిదీ.. ● మాస్టర్ మైండ్ జాక్ ఖాతాలో భారీగా నగదు ● ముమ్మరంగా కేసు దర్యాప్తు, నిందితులకు 14రోజుల రిమాండ్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒక ఫోన్కాల్కు ఒకేసారి సిమ్ వాడుతూ ఆ తర్వాత వాటిని ధ్వంసం చేస్తూ నిత్యం వందలాది కాల్స్ చేస్తూ రూ.లక్షల సొమ్ము కాజేసే యత్నం జరిగింది. జన్నారం కేంద్రంగా సాగిన సైబర్ నేరాన్ని రామగుండం సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏడుగురు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14రోజుల రిమాండ్ విధించారు. సైబర్ నేరాలు చేసేందుకు ఆధునిక సాంకేతికతను వాడుతూ అమాయక జనాలను కేవలం ఫోన్లో మాట్లాడి మభ్యపెడుతూ సొమ్మును తస్కరించే పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెలన్నరలోనే వేలాది మందికి ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ చేస్తూ ఇక్కడి లొకేషన్ చూపించేలా ఏర్పాట్లు చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాగా పిలిచే కంబోడియా, మయన్మార్ నుంచి ఈ వ్యవస్థను నియంత్రిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాలో రోడ్లపై విక్రయించే వారి నుంచి సిమ్లు వందలకొద్దీ కొనుగోలు చేసి, యాక్టివ్ చేసి మాట్లాడగానే పని పూర్తయిన వెంటనే ఆ సిమ్ను పాడేసినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు యాక్టివ్ అయిన సిమ్ వివరాలను ఓ బుక్లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బుక్లోని వివరాల ప్రకారం ఎవరెవరికి కాల్స్ చేశారు..? ఇందులో ఎంతమొత్తం డబ్బు దోచుకున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. జాక్ ఖాతాల్లో రూ.కోట్లలో డబ్బుప్రస్తుతం పరారీలో ఉన్న వైజాక్ చెందిన జాక్ అలియాస్ రాజు జన్నారానికి చెందిన వారితోపాటు ఆంధ్రా వారినీ ఈ నేరంలో భాగస్వామ్యం చేస్తూ పథకం రచించాడు. గత మే నుంచే ఈ తంతంగం మొదలు కాగా, గత నెలన్నరగా మోసాలు చేసే ప్రయత్నాలు చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్ బ్యాంకు ఖాతాలో రూ.కోటికిపైగా లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక అతడు చెప్పినట్లు చేసినందుకు రూ.లక్షల్లో డబ్బు స్థానికులకు పంపాడు. మోసం చేస్తున్నామని తెలిసినా జన్నారం వాసులు ఇందులో ఇరుక్కుపోయారు. ఐఎంఈఐ కనిపించకుండాసైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తే వాళ్లు చేసే ప్రాంతం, చూపించే లొకేషన్ భిన్నంగా ఉండేందుకే జన్నారంను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక సిమ్ బాక్స్లో ఒకేసారి 256సిమ్లు వాడుతూ, ఐఎంఈఐ కూడా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంతేకాక లొకేషన్ ట్రేస్ చేస్తే అడవులు, కొండల మధ్య టవర్ సిగ్నల్స్ను ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ముందుగా జన్నారం పోలీసులు ఆచూకీ వెతికినా నేరగాళ్లు బయటపడలేదు. ఇదంతా కంబోడియా నుంచే పూర్తిగా ఈ వ్యవహారం నడిచిందా? వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు. వీరిలో చేతిలో ఎంతమంది మోసపోయారు? దోచిన డబ్బు ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరంలో ప్రధానంగా వ్యవహరించిన జాక్ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా!
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలం బోరి గాం శివారులోని సర్వే నం.139లో రూ.25.44 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో పాక్షికంగా శిథిలావస్థ చేరుతున్నాయి. సామగ్రి సైతం దొంగలపాలైంది. గత ప్రభుత్వ హయాంలో కాగజ్నగర్ పట్టణంలో 2018 ఆగస్టు 2న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 20 బ్లాకుల్లో 480 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, 288 మాత్రమే పూర్తి చేశారు. తాజాగా ఇళ్లను లబ్ధి దారులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టులో మరమ్మతులు పూర్తిచేసి పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్మాణ పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో డబుల్ బెడ్రూంల చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగాయి. ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి అందినకాడికి వస్తువులు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం చేయడంతోపాటు విద్యుత్ స్విచ్లు పైపులు, వాటర్ట్యాంక్లు ధ్వంసం చేశారు. ఇళ్ల పైభాగంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్లు కొన్ని అపహరణకు గురికాగా, మిగితావి కిందపడి దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంచాలని ఏసీఎంవో ఉద్దవ్ అన్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీచర్లకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాలలో జరిగిన కృత్యాలను వాట్సాప్ గ్రూపులో రోజువారీగా పంపాలని సూచించారు. గిరిజన విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాలు పెంచేందుకు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీఎంవో లక్ష్మణ్, డీఎస్వో మీనారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం
కెరమెరి(ఆసిఫాబాద్): స్వచ్ఛత పాటిస్తే ఆరో గ్యంగా ఉండవచ్చని, వ్యాధులు దరిచేరవని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. మండలంలోని చిత్తగూడ గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో మా ట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లొద్దని సూచించారు. రూ.5వేల ఖరీదైన పరీ క్షలు పీహెచ్సీల్లో చేస్తారని తెలిపారు. ఇళ్ల ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమ తెరలు వాడాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆది వాసీలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ షఫియోద్దీన్, సిబ్బంది రవిదాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
● ప్రధాన మంత్రి సురక్ష యోజన అమలు ● బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం ● వంద శాతం అమలు చేసేందుకు చర్యలు ● జిల్లాలో 1,65,479 మంది యాక్టివ్ కూలీలు
వాంకిడి(ఆసిఫాబాద్): గ్రామీణ ప్రాంతాల కూలీల కు స్థానికంగానే వంద రోజులపాటు ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తుంది. అ యితే పనులకు వెళ్లిన వారు ప్రమాదానికి గురై మృతి చెందడమో.. లేక పూర్తి అంగవైకల్యం పొందే అవకాశాలు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉపాధి కూలీల కుటుంబం రోడ్డున పడకుండా బీమాతో భరోసా కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఉపాధిహామీ జాబ్ కార్డు కలి గిన ప్రతీ కూలీకి ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఉపాధి కూలీల కు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. కూలీలతో కొంత ప్రీమియం సోమ్ము చెల్లింపజేసి, వారికి బీమా క ల్పించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరా లు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బీమాకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మండల సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.20లతో రూ.2 లక్షల బీమా జిల్లాలో మొత్తం 1,23,103 జాబ్ కార్డులు ఉండగా 89,430 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,44,358 మంది కూలీలు పేర్లు నమోదు చేసుకోగా, 1,65,479 మంది యాక్టివ్గా పని చేస్తున్నారు. వీరందరికి బీమా వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 70 ఏళ్లలోపు వారు అర్హులు. వీరంతా బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఆధార్తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచులో ఖాతా నుంచి ప్రతీ సంవత్సరం రూ.20 ప్రీమియం కింద బీమా కోసం జమ చేస్తామని అంగీకార పత్రాన్ని బ్యాంకులో ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా.. పూర్తి వైకల్యం కలిగినా పీఎం సురక్ష యోజన ద్వారా రూ.2లక్షల పరిహారం అందించనున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
పెన్షన్.. ఊరట
● 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ● వర్తింపజేయాలని హైకోర్టు తీర్పు ● ఫలించిన టీచర్ల న్యాయ పోరాటంఆదిలాబాద్టౌన్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ టీచర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రెండు దశాబ్దాల తర్వాత సమస్య పరిష్కారానికి నోచుకోవడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. న్యాయస్థాన తీర్పుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 746 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలు చేశారు. ఈ నిర్ణయానికి ముందే 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకం జరిగినప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీరికి సీపీఎస్ అమలు చేశారు. దీంతో 2019, 2020 సంవత్సరాల్లో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. మంగళవారం హైకోర్టు డీఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో.. డీఎస్సీ 2003లో ఉమ్మడి జిల్లాలో 746 పోస్టులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో 317 పోస్టులకు నియామకాలు చేపట్టగా, మైదాన ప్రాంతంలో 429 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 372, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 264, భాషా పండిత పోస్టులు 98, పీఈటీ పోస్టులు 12 ఉన్నాయి. ఈ డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు. నాటి నుంచి నేటి వరకు.. 2003 నవంబర్ 14న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎంపికైన వారికి 2005 నవంబర్ 23న నియామకాలు చేపట్టారు. మరోవైపు 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం నియామకాలు చేపట్టినప్పటి నుంచి సీపీఎస్ అమలవుతుందని చెప్పడంతో వీరికి ఇప్పటివరకు అదే అమలు చేశారు. అయితే 2019లో వీరితో నియామకమైన న్యాయశాఖ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు పత్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకు సైతం పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి
కాగజ్నగర్టౌన్: మానవ అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని డీసీపీవో బి.మహేశ్ అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో షూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం అందరి బాధ్యత అన్నారు. అమాయక ప్రజలను నమ్మించి ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి తరలిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రలోభాలకు గురిచేస్తే 1098, డయల్ 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ రమణ్కుమార్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు, కమర్షియల్ సీఐ కార్తీక్, టౌన్ ఎస్సై యాదగిరి, చైల్డ్ హెల్ప్లైన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రవీణ్, ఎన్జీవో జి ల్లా కోఆర్డినేటర్ సంతోష్, సూజర్వైజర్లు సంతోష్ కుమార్, దేవాజీ, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు
● ఎమ్మెల్సీ దండె విఠల్బెజ్జూర్(సిర్పూర్): ప్రజలు ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, జీవో 49 పూర్తిగా రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దండె విఠల్ స్పష్టం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, ప్రజలకు అన్యాయం చేసే ఏ జీవోను ఇక్కడ అమలు చేయనీయమన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బెజ్జూర్ మండలానికి 322 నూతన రేషన్ కార్డులు జారీ కాగా, 985 మంది పేర్లు కార్డుల్లో కొత్తగా చేర్చామని తెలిపారు. అర్హులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది విచారణ జరిపి కార్డుల జారీకి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో బండారి ప్రవీణ్కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంతో మేలు.. పెంచికల్పేట్(సిర్పూర్): ప్రజా ప్రభుత్వంతో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి అందించారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేయలేదని విమర్శించారు. పెంచికల్పేట్ మండలంలో 109 రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుని వచ్చారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహాసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిరెబ్బెన(ఆసిఫాబాద్): విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలను బుధవారం సందర్శించారు. హాజరు పట్టికతోపాటు ఇతర పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ, విద్యా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. మెనూ ప్రకారం రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి గ్రామాల్లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుతో పాటు ల్యాబ్, మెడిసిన్ రూంలు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. డీపీవో భిక్షపతి, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వర్లు, వైద్యాధికారి సుజిత్, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో స్టాల్స్ ఏర్పాటు
ఆసిఫాబాద్అర్బన్: మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన తినుబండారాలు, వస్తువులు విక్రయించేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు స్టాల్స్ను సందర్శించారు. 500 గ్రాముల తేనె రూ.300, మామిడి, నిమ్మ, చింతకాయ, ఉసిరి, టమాట, పచ్చళ్లు కేజీ రూ.400కి విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే కేజీ చికెన్ పచ్చడి రూ.1200, మిల్లెట్ బిస్కెట్లు రూ.100, మల్టీ గ్రైన్ స్వీట్లు కేజీ రూ.200, మల్టీ గ్రైన్ హాట్ కేజీ రూ.150కి విక్రయిస్తున్నారు. ఈ స్టాల్స్ ఐదు రోజులపాటు కొనసాగుతాయని డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. -
మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
కాగజ్నగర్టౌన్: మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అలావలెను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని మాలీ(బారె) కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు -
ఉత్తమ పురస్కారానికి ఎంపిక
సిర్పూర్(టి): అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పులుల సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారులు, సి బ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారాలు అందించింది. ఈ సందర్భంగా సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్ ఎస్వో మోహన్రావ్ ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్లో మంగళవా రం నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీఎఫ్ సువర్ణ, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో పులుల ఉనికికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ట్రాకింగ్లో ఉత్త మ సేవలు అందించినందుకు అవార్డు వరించిందని ఎఫ్ఆర్వో ప్రవీణ్కుమార్ తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మోహన్రావ్ను అభినందించారు. -
● బ్యాంకు ఖాతాలు, నగదు ఫ్రీజ్ ● సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా చర్యలు ● జిల్లాలో వేల సంఖ్యలో బాధితులు ● అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారుల సూచన
చింతలమానెపల్లి: జిల్లాలో అనేక మంది బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు దర్యాప్తులో భాగంగా లావాదేవీలు జరిగిన అనేక ఖాతాలపై దృష్టి సారిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగదు బదిలీ చేయకుండా ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాల ను పలు రకాలుగా వినియోగించుకోవడమే ఇందు కు కారణం. అయితే నేరంతో సంబంధం లేకున్నా ఖాతాలు స్తంభించిపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సైబర్క్రైం నానాటికీ కొత్త దారులు వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆర్థిక నేరగాళ్ల వలకు అమాయకులు చిక్కుతున్నారు. జిల్లాలో బాధితులు ఇటీవల బ్యాంకు ఖాతాల్లోని నగదును వినియోగించుకోలేక పోతున్నామని బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. ఖాతాలు స్తంభించినట్లు, ఖాతాల్లోని కొంత నగదు వినియోగించుకోలేక పోతున్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల నుంచి ఈ ఫిర్యాదులు వస్తున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సదరు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. ఆ ఖాతాలు సైబర్ క్రైం ఘటనల్లో స్తంభించినట్లు గుర్తించారు. నగదుకోసం పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతాల్లోని నగదు వినియోగించుకోలేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బాధితులు వేల సంఖ్యల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలే కారణం బాధితుల్లో ప్రధానంగా దుకాణదారులు, పెట్రోల్ బంకులు, ఆన్లైన్ కేంద్రాలు, నగదు చెల్లింపు కేంద్రాల వారు ఉంటున్నారు. సైబర్క్రైం ద్వారా అక్రమాలకు పాల్పడిన వారు ఆ మొత్తాన్ని రకరకాల మార్గాల్లో నగదుగా మార్చుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, రమ్మీ వంటి ఆన్లైన్ ఆటలు, ఆన్లైన్ షాపింగ్ ఆధారంగా పెట్టుబడి పెడుతున్నా రు. ఆన్లైన్ యాప్స్, గేమ్స్లో గెలుచుకున్న వారు పట్టణాలు, గ్రామాల్లో నగదును విత్డ్రా చేస్తున్నా రు. దుకాణదారులు, పెట్రోల్ పంపులు, ఆన్లైన్ చెల్లింపు కేంద్రాలతోపాటు నగదు ఉన్నవారి నుంచి చైన్ పద్ధతిలో నగదు విత్డ్రా చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ.. సైబర్ నేరాలకు అవకాశం ఉన్న బెట్టింగ్ యాప్స్, ఇతర ఆన్లైన్ గేమ్స్పై తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నేర దర్యాప్తు సంస్థలు గతంలో పలువురు ప్రముఖులపై సైతం కేసులు నమోదు చేశాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. పొరుగు రాష్ట్రంలో ఇలా సంపాదించిన ఆన్లైన్ సొమ్మును మన జిల్లాల్లో చెల్లింపులు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల అంచనా. దీంతో పాటు ఫేక్ జీపీఎస్ ఆధారంగా అప్లికేషన్లు వినియోగించి సైబర్ మోసాల్లో పలువురు భాగస్వాములు అవుతున్నారు. స్థానికంగా పరిష్కారం లభించదు ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ మోసాలపై పోలీసు శాఖ నిఘా ఉంది. ఇతర రాష్ట్రాలలో నమోదైన సైబర్ క్రైం ఘటనల్లో ఖాతాలు స్తంభించినపుడు సదరు బ్యాంకులకు సమాచారం ఉంటుంది. ఆయా ఖాతాల వివరాలను బ్యాంకుకు మెయిల్, ఇతర మార్గాల్లో సమాచారం అందిస్తారు. నేరుగా పాల్గొనకపోయినప్పటికీ సహకరించిన కూడా నేరంలో పాల్గొన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఖాతాల్లో నగదు స్తంభించిన వారికి స్థానికంగా పరిష్కారం లభించకపోవచ్చు. కేసు నమోదైన పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి సైబర్ నేరానికి పాల్పడలేదని నిరూపించుకుంటే నగదు విడిపించుకోవచ్చు. గుర్తు తెలి యని వ్యక్తులు, లేదా గుర్తింపు లేని సంస్థలతో లావాదేవీలు చేయకపోవడమే మంచిది. – రామానుజం, డీఎస్పీ, కాగజ్నగర్ -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కెరమెరి(ఆసిఫాబాద్): పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. జ్వరపీడితుల వివరాలు తెలుసుకున్నారు. మందుల కోసం చీటీలు ఎందుకు రాసి ఇస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా సిబ్బంది గైర్హాజరు కావొద్దన్నారు. ఆయన వెంట డీఎంహెచ్వో సీతారాం, డాక్టర్ వినోద్, ఎంపీడీవో అంజద్పాషా ఉన్నారు. నాణ్యతలేని సరుకులు వినియోగిస్తే చర్యలువిద్యార్థుల భోజనం కోసం నాణ్యత లేని సరుకులు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. మండలంలోని మోడి కేజీబీవీని సందర్శించారు. విద్యాలయ పరిసరాలు, మెనూ పట్టిక, వంటశాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వందశాతం ఉత్తీర్ణతపై దృష్టి సారించాలని సూచించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం కేజీబీవీలపై ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, ప్రత్యేకాధికారి వెంకటేశ్, ఎంపీడీవో అంజద్పాషా, తహసీల్దార్ భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ కాగజ్నగర్టౌన్: రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, విధుల్లో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి సందర్శించారు. ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆస్పత్రులను సందర్శించామని, సమస్యలు, సేవల తీరుపై నివేదిక అందిస్తామని తెలిపారు. కాగజ్నగర్ సీహెచ్సీలో వసతుల కల్పన, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ స్టాఫ్ను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శానిటేషన్ వర్కర్లు మూడేళ్లుగా పీఎఫ్ డబ్బులు సొసైటీ కట్టడంలేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన కిందిస్థాయి సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వేతనాలను అందిస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం చేసే వారికి కాంట్రాక్టు ఇచ్చి ప్రభుత్వం పేరు బద్నాం చేస్తున్నారని సూపరింటెండెంట్ చెన్నకేశవ్రావుపై మండిపడ్డారు. వెంటనే సదరు సొసైటీని రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ 30 పడకల ఆస్పత్రి త్వరలో 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందనుందని, టెండర్లు పూర్తయయ్యాయని తెలిపారు. త్వరలోనే స్థలాన్ని సేకరిస్తామన్నారు. కాగజ్నగర్ సీహెచ్సీలో గైనకాలజిస్టుల కొరత ఉందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే బెజ్జూర్లో 2015లో 30 పడకల ఆస్పత్రి మంజూరైనా శంకుస్థాపనకే పరిమితమైందని ఎమ్మెల్యే తెలిపారు. నూతన ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ సూపరింటెండెంట్ జితేందర్, సీనియర్ అసిస్టెంట్ నరేశ్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలిజైనూర్: సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్రావు, వైద్యాధికారి అశోక్, సహకార సంఘం చైర్మన్ హన్నుపటేల్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, అంబాజీరావు తదితరులు ఉన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, సూపరింటెండెంట్ చెన్నకేశవ్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
వసతుల కల్పనకు పెద్దపీట
పెంచికల్పేట్(సిర్పూర్): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. జాతీయ నూతన విద్యావిధానం అమలు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఎంశ్రీ పాఠశాలలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలలో పీఎంశ్రీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించారు. డిజిటల్ బోధన, ల్యాబ్స్, గ్రంథాలయం పరిశీలించి, ప్యానల్ బోర్డుల ద్వారా బోధన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతితోపాటు గతేడాది పరీక్ష ఫలితాలపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. రానున్న రోజుల్లో పీఎంశ్రీ కింద మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపటనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ నిర్మల, ఎస్సై అనిల్కుమార్ తదితరులు ఉన్నారు. -
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కెరమెరి(ఆసిఫాబాద్): రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నెలరోజుల్లో అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కెరమెరి మండలం కేస్లాగూడలోని రైతువేదికలో మంగళవారం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఎదురుచూశారని తెలిపారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతన కార్డులు జారీ చేస్తుందన్నారు. బియ్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని స్పష్టం చేశారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్డీవో లోకేశ్వరరావు, ఇన్చార్జి డీఎస్వో సాదిక్, ఏడీఏ వెంకట్, తహసీల్దార్ భూమేశ్వర్, డీటీ సంతోష్కుమార్, ఎంపీడీవో అంజద్పాషా, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అసెంబ్లీ ఇన్చార్జి శ్యాంనాయక్, నాయకులు పాల్గొన్నారు. -
సంక్షేమ గురుకులానికి సెలవులు
● శిథిలావస్థకు సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ పాఠశాల భవనం ● విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం సిర్పూర్(టి): నియోజకవర్గ కేంద్రం సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలకు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల తరగతి గదులతోపాటు డార్మెంటరీ భవనం శిథిలావస్థ చేరి పెచ్చులూడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. మంగళవారం సా యంత్రం నుంచి తల్లిదండ్రులు వచ్చి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. దీనిపై ‘సాక్షి’ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. గురుకులం భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల సౌకర్యార్థం కొన్నిరోజులు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి సూచన మేరకు ఇతర భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగజ్నగర్కు తరలింపు..?సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 640 మంది విద్యార్థులకు ప్రస్తుతం 490 మంది చదువుకుంటున్నారు. నూతన భవన నిర్మాణాలకు రూ.6.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయినా ఇప్పటివరకు టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరి సెలవులు ప్రకటించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకులాన్ని కాగజ్నగర్ పట్టణానికి తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్(టి)కి మంజూరైన ఏకలవ్య గురుకులాన్ని ఇదే విధంగా కాగజ్నగర్లో నిర్వహిస్తున్నారు. నూతన భవనాలు నిర్మించి గురుకులాన్ని నియోజకవర్గ కేంద్రంలో కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలీసులు నిబద్ధతతో పనిచేయాలి
జైనూర్(ఆసిఫాబాద్): పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది విధులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్టేషన్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. గ్రామ చరిత్ర షీట్లను పూర్తిస్థాయిలో అప్డేట్ చేయాలని సూచించారు. మహిళల ఫిర్యాదుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
వంట తంటాలకు చెల్లు!
● ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు అందించేందుకు నిర్ణయం ● కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించిన సర్కారు ● జిల్లాలో 745 గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు ● తీరనున్న కట్టెల పొయ్యి కష్టాలురెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్యాస్ కనెక్షన్లు లేనివాటి వివరాలు ఇప్పటికే సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయి. ప్రతీ పాఠశాలలో పగటిపూట కోడిగుడ్డుతో కూడిన భోజనం ప్రభుత్వాలు అందిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా అవి మూలనపడ్డాయి. నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిల మీదే ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుబాటులో 250 మాత్రమే..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 995 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. 47,770 మంది విద్యార్థులకు ప్రతీరోజు భోజనం అందిస్తున్నారు. కేవలం 250 పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్, స్టౌవ్లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని స్కూళ్లకు సిలిండర్లు, స్టౌవ్లు అందించినా వివిధ కారణాలతో కొన్నాళ్లకే మూలనపడ్డాయి. అప్పటి నుంచి నిర్వాహకులు కట్టెల పొయ్యిల మీద వంటలు వండుతున్నారు. వంట చేసే సమయంలో వెలువడే పొగతో అనేక అవస్థలకు గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోపాటు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు అందించేందుకు కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించింది. జిల్లాలో 745 పాఠశాలల్లో కనెక్షన్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. త్వరలోనే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్ స్టౌవ్లు రానున్నాయి. కట్టెల పొయ్యిమీద వండితే వంట పాత్రలు సైతం శుభ్రం చేసేందుకు రెక్కలు ముక్కలు చేసుకునేవారు. పొగతో మసిబారిన పాత్రలు కడిగేందుకు అనేక అవస్థలకు గురవుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు అందిస్తే ఆ కష్టాలూ తీరనున్నాయి. అయితే ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు అందిస్తుంది.. ఏ పథకం ద్వారా పంపిణీ చేస్తుంది.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పెరిగిన మెస్ చార్జీలుమధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెస్ చార్జీలను ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పెంచారు. పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల నేపథ్యంలో అమలులో ఉన్న మెస్ చార్జీలు ఆశించిన తీరుగా లేవు. 1 నుంచి 5వ తరగతి తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 చెల్లిస్తుండగా.. 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.10.17 చొప్పున, 9, 10 తరగతి వారికి రూ.13.17 చొప్పున చెల్లిస్తున్నారు. రోజు విడిచి రోజు ప్రతీ విద్యార్థికి కోడిగుడ్డు సైతం అందిస్తుండగా, దాని కోసం ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. ఏ రోజైనా విద్యార్థులకు గుడ్డు అందించని పక్షంలో బిల్లులో కోడిగుడ్డు బిల్లును కట్ చేసి.. కేవలం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లు మాత్రమే నిర్వాహకులకు చెల్లిస్తారు.సిలిండర్ల భారం ఎవరిపైనో..?మధ్యాహ్న భోజనాల తయారీ కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల భారం ప్రభుత్వమే భరిస్తుందా లేక నిర్వాహకులపై వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో అందించిన గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ల భారాన్ని నిర్వాకులే భరించారు. దీంతో చాలామంది భారం మోయలేక గ్యాస్ విని యోగించడమే మానేశారు. పట్టణ ప్రాంతా లతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు తక్కువ ధరకే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకు కోసం సుమారు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో వంటచెరు కు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకుకు సుమారు రూ.3వేల వరకు ఖ ర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు అవసరమైన సిలిండర్లు ఉచితంగా అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.కనీస వేతనాలు అమలు చేయాలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలు చేయలేదు. రూ.26వేల కనీస వేతనం అందించాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ అందించాలని నిర్ణయించడం శుభపరిణామం. వెంటనే కనెక్షన్లు అందించి ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలి. కార్మికులకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. – బోగే ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉచితంగా సిలిండర్లు అందించాలి మధ్యాహ్న భోజనాలు తయారు చేసేందుకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు ఇస్తామని చెబుతోంది. అయితే సిలిండర్లను ఉచితంగా అందించాలే. ఇప్పటివరకు మేమే కట్టెలు కొని వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యితో వచ్చే పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చేసేదేమీ లేక కష్టపడి పిల్లల కోసం వంట వండుతున్నాం. – ఎర్ర కాంతమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, సిర్పూర్(టి) -
1న కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి చేపడుతున్న దశలవారీ పోరా టాల్లో భాగంగా ఆగస్టు 1న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్పీసీ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏ చెల్లించాలని, పీఆర్సీ అమలు చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాకు పంపించాలని, విరమణ పొందిన వారికి బకాయిలు చెల్లించాలన్నారు. జీవో 25 సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం పేస్కేల్ ఇవ్వాలని, గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్, పార్ట్టైం, ఔట్సోర్సింగ్ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ కిరణ్, హేమంత్ షిండే, తంగడిపల్లి రమేశ్, తారాచంద్, రవికుమార్, సంతోష్, శ్రీకర్ పాల్గొన్నారు. -
విన్నవించి.. పరిష్కారం కోరి
● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులకు సమస్యలు విన్నవించి పరిష్కరించాలని కోరారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జైనూర్ మండలం కోహినూర్కు చెందిన ఆడె శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. తన భర్త మరణించాడని వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం దాంపూర్కు చెందిన కొర్పెత శారదాబాయి విన్నవించింది. 2023లో ఎస్డీఎఫ్ నిధుల కింద నిర్మించిన రహదారి బిల్లులు చెల్లించాలని రెబ్బెన మండలం తక్కళ్లపెల్లికి చెందిన పుప్పాల వేణుగోపాల్ అర్జీ సమర్పించాడు. తన అసైన్డ్ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని దహెగాం మండలం గిరవెల్లికి చెందిన దువ్వుట నానయ్య వేడుకున్నాడు. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం ఇందాపూర్కు చెందిన దుర్గం గంగుబాయి దరఖాస్తు చేసుకుంది. వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బామ్నె యశోద వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన అనంతుల విజయ, బాబాపూర్కు చెందిన ఇందూరి లక్ష్మి వేర్వేరుగా అర్జీ పెట్టుకున్నారు. రెబ్బెన మండలంలో జాతీయ రహదారిలో భూమి కోల్పోయానని, కొంత భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారని, మిగిలిన పరిహారం ఇప్పించాలని మండల కేంద్రానికి చెందిన బొమ్మెన సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నాడు. పేర్లు తొలగించారు ‘మేము ఇళ్లు లేని నిరుపేదలం. మాకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, జాబితా నుంచి పేర్లు తొలగించి ఇతరులకు కేటాయించారు. నిరుపేదలైన మాకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి.. ’ అని రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన ముస్కు స్వప్న, జాడి కమల, నీరటి మొండక్క, దాగం అనూష, కొల్లూరి లక్ష్మి తదితరులు వేడుకున్నారు. మీసేవ కేంద్రం కేటాయించాలి నేను ఆదివాసీ మహిళను. డిగ్రీ పూర్తి చేసి, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నాను. మా గ్రామంలో మీసేవ కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో మీసేవ కేంద్రం కేటాయించి నాకు ఉపాధి కల్పించాలి. – మెస్రం సరస్వతి, జాంగూడ, మం.జైనూర్ఆధార్కార్డు ఇప్పించాలి నాకు సుమారు 70 ఏళ్లు ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసరా పింఛన్ రావడం లేదు. వృద్ధాప్యంలో ఆర్థికంగా అవస్థలు పడుతున్నాను. ఆధార్కార్డు ఇప్పించి, ఆసరా పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – నాగోష పోచాలు, ఇందాని, మం.వాంకిడి -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడా పాఠశాల ఆవరణలో సోమవారం అండర్ 14, 16, 18, 20 బాలబాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ చూపినవారు ఆగస్టు 3, 4 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూని యర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి బండ మీనారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, ఏటీడీవో చిరంజీవి, హెచ్ఎం జంగు, అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి మంగపతి, సంయుక్త కా ర్యదర్శి హరికృష్ణ, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, వనిత, పీడీ, పీఈటీలు వెంకటేశ్, శార ద, బాలాజీ, మంజుల పాల్గొన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. హైదరాబా ద్లోని డీఎస్ఎస్ భవనంలో సోమవారం గిరిజన సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై ఏడో గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు గల రహదారిని తక్షణమే పునర్నించాలన్నా రు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, వారికి అడ్వాన్స్ ఇవ్వకుండా ఇళ్లు నిర్మాణం సాధ్యం కాదన్నారు. లబ్ధిదారులకు ముందుగానే రూ.లక్ష ఇవ్వాలని కోరారు. అటవీ హక్కుల చట్టం అమలు, పోడు భూముల సమస్య ల పరిష్కారం, గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా గిరిజన యువతను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. డీఎస్ఎస్ భవనంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ను ఎమ్మెల్యే మర్యాదపూర్వంగా కలిశారు. జిల్లాలోని 339 గ్రామ ప్రజలకు నష్టం కలిగించే జీవో 49 పూర్తి చేయాలని కోరారు. -
పకడ్బందీగా పథకాలు అమలు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదన పు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సోమవారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం అడ పీ హెచ్సీ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. జన్కాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తనిఖీ చేశారు. ఆర్ఆర్ కాలనీలో చేపడుతున్న అభివృద్ధి ప నులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం, శుద్ధమై న తాగునీరు అందించాలని ఆదేశించారు. -
‘మధ్యాహ్న’ కార్మికుల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించాలని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం మ ధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణమాచారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణ ఈ కుబేర్ నుంచి మినహాయించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ పాఠశాలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం అమలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6న విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల ధర్నాకు సీపీఎం నాయకులు దినకర్, ఆనంద్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. -
జీవో 49 రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తాం
ఆసిఫాబాద్అర్బన్: కుమురంభీం కన్జర్వేషన్ పేరుతో తెచ్చిన జీవో 49ను పూర్తిగా రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ స్పష్టం చేశారు. ఆదివాసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి, పెసా చట్టాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన జీవో తెచ్చిందని ఆరోపించారు. కుమురంభీం, బీర్సా ముండా, రాంజీగోండు స్ఫూర్తితో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీల కు న్యాయం చేస్తే సీఎం రేవంత్రెడ్డికి పాలాభిషే కం చేస్తామని తెలిపారు. జీవో రద్దు కోసం ఆగస్టు 1 నుంచి శాంతియుత ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే..సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా రద్దు చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతు పలికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆది వాసీలు సత్తా చూపాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు లేకుండా 339 గ్రామాల్లో ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించారు. వచ్చే నెల 4న కాగజ్నగర్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. కాగా మహాధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు తెలి పాయి. అంతకు ముందు ఆదివాసీ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా, పోలీసులు పరిమిత సంఖ్య లో మాత్రమే అనుమతించారు. స్థానిక సీఐ రవీందర్తోపాటు వాంకిడి సీఐ సత్యనారాయణ బందోబస్తు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, మల్లికార్జున్, కొప్పుల శంకర్, పెంటయ్య, కనక ప్రభాకర్, మడావి శ్రీని వాస్, మాంతయ్య, గణేష్, దుర్గం దినకర్, కార్తీ క్, శ్రీనివాస్, ఆనంద్, కృష్ణమాచారి, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ జిల్లా కేంద్రంలో ఆదివాసీల మహాధర్నా పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్బాబు -
మనుగడ పోరాటం..!
● ఆవాసం కోసం పులులు.. అస్తిత్వం కోసం ఆదివాసీలు ● పులుల సంరక్షణ చర్యలపై తీవ్ర వ్యతిరేకత ● కవ్వాల్లో జాతీయ జంతువుకు తిప్పలు ● నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ చర్యలు.. ఆదివాసీల మనుగడ మధ్య సంఘర్షణ నెలకొంది. పులులతో జీవవైవిధ్యం కోసం అటవీశాఖ చర్యలు చేపడుతుండగా, స్థానిక గిరిజన సముదాయాలు అటవీశాఖ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులులను సంరక్షించి జీవ వైవిధ్యం సాధించడం అటవీశాఖకు సవాల్గా మారింది. ఏటా జూలై 29న నిర్వహించే అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున పులుల రక్షణ, అవగాహన పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది. ఈసారి కవ్వాల్ రిజర్వ్లో పులుల సంచారం, మానవ–వన్యప్రాణి ఘర్షణలు, గిరిజనుల ఆందోళనలు అటవీ శాఖకు సవాళ్లుగా మారాయి. మహారాష్ట్ర నుంచి పులుల వలసమహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా–అంధారీ అభయారణ్యాల నుంచి పెన్గంగా, ప్రాణహిత నదులు దాటి పులులు కవ్వాల్ టైగర్ రిజర్వ్లోకి వలస వస్తున్నాయి. గడిచిన దశాబ్దంలో కాగజ్నగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. 2012లో టైగర్ రిజర్వ్గా ప్రకటించిన కవ్వాల్లో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, 1123.21 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియా ఉన్నప్పటికీ పులి స్థిర ఆవాసం ఏర్పర్చుకోవడం లేదు. దీంతో ఇక్కడి పరిస్థితులు అనుకూలించక తిరిగి వెళ్లిపోతున్నాయి. కొన్ని వేటగాళ్లకు చిక్కి మృత్యువాతపడుతున్నాయి. జీవో 49 దుమారం..మే 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 ఉమ్మడి జిల్లాలో దుమారం రేపింది. ఈ జీవో ప్రకారం.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ను తడోబా–అంధారీతో కలిపే ప్రాంతాన్ని కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్గా గుర్తించింది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో 339 గ్రామాలపై ఆంక్షలు విధించడంతో గిరిజన సంఘాలు నిరసనలు చేపట్టాయి. తుడుందెబ్బ సంఘం నాయకత్వంలో ఆదిలాబా ద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యా ల జిల్లాల్లో బంద్ నిర్వహించారు. ప్రభుత్వం జీవో ను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజనులు తమ జీవనోపాధి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.‘వాటి మనుగడ మన చేతుల్లోనే.. పులుల కోసం గర్జించు.. పులులు, అడవులు, ప్రాణాలను రక్షించు’ ఈ ఏడాది అంతర్జాతీయ పులుల దినోత్సవ ఇతివృత్తమిది.మానవ–వన్యప్రాణి సంఘర్షణ..కవ్వాల్ రిజర్వ్లో మానవ–వన్యప్రాణి సంఘర్షణ తీవ్ర సమస్యగా ఉంది. నాలుగేళ్లలో పులుల దాడుల్లో నలుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వందలాది పశువులు పులుల దాడితో చనిపోయాయి. పశువుల యజమానులకు పరిహారం అందినప్పటికీ, స్థానికుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. పులులు కూడా వేట, ఉచ్చులు, మానవ కార్యకలాపాలతో ముప్పు ఎదుర్కొంటున్నాయి. పోడు భూములు, సింగరేణి గనులు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద పులుల సంచారం ఘర్షణలను పెంచుతోంది. చివరగా మహారాష్ట్ర నుంచి పులులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రతిపాదనలు చేసున్నా, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య ఘర్షణ తగ్గించేలా చర్యలు తీసుకుంటేనే ఇరువర్గాలకు ఊరట కలుగుతుంది. -
బీసీ బాలికల వసతి గృహం తనిఖీ
కాగజ్నగర్టౌన్/ఆసిఫాబాద్: కాగజ్నగర్ పట్టణంలోని బీసీ బాలికల వసతిగృహాన్ని సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంతోపా టు హాజరు పట్టిక పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం భోజనం అందించాలని వార్డెన్ రేష్మ బానుకు సూచించారు. సిబ్బందిపై చర్యలువిద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టడం లేదని ఓ వీడియో ద్వారా తమ దృష్టికి రావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంటమనిషిని సస్పెండ్ చేయడంతోపాటు ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం వార్డెన్, వంట మనిషి హాజరుకాకపోవడంతో విద్యార్థినులు స్వయంగా అల్పహారం, భోజనం వండుకున్నట్లు తెలిసిందని, దీనిపై విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వంట మనిషి, ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వార్డెన్ను తొలగించి, మరో వార్డెన్ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. -
అన్నివర్గాల సంక్షేమానికి కృషి
సిర్పూర్(టి): రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలుసిర్పూర్(టి): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని సోమవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మండల కేంద్రంలో ని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. తహసీల్దార్ రహీముద్దీన్, ఏడీఏ మనోహర్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో వేణుగోపాల్, సిబ్బంది ఉన్నారు. -
సాగు నీరు వెళ్లేదెలా..?
తగ్గిన ‘వట్టివాగు’ ఆయకట్టు ప్రాజెక్టుల కాలువలకు మరమ్మతులు కరువు ● పిచ్చిమొక్కలు పెరిగి.. పూడిక నిండి ● లైనింగ్ ఊడిపోయి అధ్వానంగా మారిన వైనం ● ఏళ్లుగా పట్టించుకోని అధికార యంత్రాంగం ● ఆరుతడి పంటలు వేస్తున్న ఆయకట్టు రైతులుప్రధాన ప్రాజెక్టుల సాగునీటి కాలువలపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. పిచ్చిమొక్కలు పెరిగి పూడికతో నిండాయి. లైనింగ్ ఊడి అధ్వానంగా మారాయి. ప్రాజెక్టుల్లో నీరున్నా పొలాలకు చేరలేని దుస్థితి. ఫలితంగా ఆయకట్టు కింద చాలామంది రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బోర్ల కింద ఓ వైపు వరి నాట్లు వేస్తుండగా, ప్రాజెక్టుల కింద సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట సమీపంలో 2.89 టీఎంసీల సామర్థ్యంతో 24,500 ఎకరాలకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో వట్టివాగు నిర్మించారు. నేటి వరకు కాలువల ఆధునికీకరణ చేపట్టలేదు. ప్రస్తుతం లైనింగ్ కోల్పోయి అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి వరద వెళ్లలేని పరిస్థితి. తూములు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా మంది వరికి బదులుగా పత్తి వేసుకున్నారు.పత్తి సాగు చేస్తున్న పిచ్చిమొక్కలు పెరిగి కాలు వలు సక్రమంగా లేక నీరు ప్రవహించడం లేదు. గతంలో వరి పండించిన రెండెకరాల్లో ఈ సీజన్లో పత్తి పంట సాగు చేస్తున్న. నాతోపాటు చాలామంది పొలాలకు సాగు నీరందడం లేదు. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలు వేసుకున్నారు. – శంకర్, మోతుగూడ, మం.ఆసిఫాబాద్ రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలానికి ప్రధాన సాగునీటి వనరుగా వట్టివాగు ప్రాజెక్టు నిలుస్తోంది. అయితే మండలానికి సాగునీటిని అందించే ప్రాజెక్టు తూములు, తలుపులు దెబ్బతిన్నాయి. గతంలో పచ్చని వరిపైరుతో కళకళలాడిన పొలాలు నేడు పత్తి చేలుగా మారాయి. డీ– 6 నుంచి డీ– 12 వరకు వట్టివాగు కాలువల ద్వారా మండలంలోని పొలాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇక్కడ వట్టివాగు కాలువ కింద సాగు విస్తీర్ణం సుమారు 12వేల ఎకరాలు ఉండగా నీరు అందక రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం మూడు వేల ఎకరాలకు మించడం లేదు. ప్రధాన కాలువకు ఎగువన దెబ్బతిన్న తూములకు మరమ్మతులు చేపట్టకపోవడంతో అవసరానికి మించి సాగు నీరు పారుతోంది. నీటికి అడ్డుకట్ట వేసేందుకు తూముల వద్ద ఏర్పాటు చేసిన తలుపులు దొంగలపాలయ్యాయి. వాటి స్థానంలో కొత్త వాటిని బిగించలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలవలకు మరమ్మతులు చేపట్టకపోవడం, కాలువల్లో పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు పనులు లేక నీటి సరఫరాకు అడ్డంకి ఏర్పడుతోంది. ఇరిగేషన్ అధికారులు వారాబంధీ అమలుచేసే ప్రయత్నం చేస్తున్నా సాగునీరు సక్రమంగా అందడం లేదు. గతేడాది ప్రధాన కాలువలో పూడికతీత చేపట్టి తుంగ, పిచ్చిమొక్కలు తొలగించారు. అయితే డిస్ట్రిబ్యూటరీ కాలువ తూములకు మరమ్మతులు, తూములకు తలుపులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం కల్వాడ సమీపంలో ఎర్రవాగు, నల్లవాగులపై నిర్మించిన పీపీరావు ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా మారాయి. పిచ్చి మొక్కలు పెరిగి సాగు నీరందడం లేదు. ఎడమ కాలువ ద్వారా కల్వాడ, కుంచవెల్లి, చంద్రపల్లి, పీకలగుండం, గిరవెల్లి, ఒడ్డుగూడ, లగ్గాం, పంబాపూర్, బ్రహ్మన్ చిచ్యాల, చినరాస్పెల్లి, అమరగొండ, బోగారం, బామానగర్ గ్రామాల్లోని 11,150 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో సుమారు 6 నుంచి 7 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. ప్రధాన కాలువల్లో పూడిక నిండగా, పిల్ల కాలువలు ఆనవాళ్లు కోల్పోయాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండకపోవడంతో పొలాలకు నీరు వదలడం లేదని అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం 147.5 మీటర్లు కాగా ప్రస్తుతం 146.9 మీటర్లకు చేరుకుంది. వర్షాధారంగా రైతులు నారుమడులు, పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి సిద్ధం చేసిన.. భారీ వర్షాలు లేక ప్రాజెక్టులో వరద చేరలేదు. కాలువల ద్వారా సాగు నీరు వస్తలేదు. నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురుకు నారుమడి అలికిన. కాలువల్లో తుంగ గడ్డి మొలిసి అధ్వానంగా మారాయి. వానాకాలం మాత్ర మే వరి పండుతుంది. యాసంగిలో పొలాలు బీడుగానే ఉంటాయి. కాలువ ల పూడిక తీస్తే రెండు పంటలు పండిస్తం. అధికారులు జర దయ చూపాలే. – బోరెం మారయ్య, రైతు, పీకలగుండం తూములు.. అస్తవ్యస్తంఅధ్వానంగా పీపీరావు ప్రాజెక్టు కాలువలు బోర్లే దిక్కు వట్టివాగు ప్రధాన కాలువ కింద పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. డీ– 12 కెనాల్ కింద సుమారు 30 ఎకరాల వ రకు ఏటా వానాకాలం, యాసంగిలో వరి పండిస్తున్నా. పొలానికి వట్టివాగు కాలవల ద్వారా సాగునీరు వచ్చే అవకాశం ఉన్నా ఎగువ నుంచి పూర్తిస్థాయిలో అందడం లేదు. 12 ఎకరాల పొలానికి అయితే చుక్కనీరు రాదు. దీంతో పొలంలో వేసుకున్న బోర్ల ద్వారానే పంట పండిస్తున్నాం. – వల్లూరి శ్రీనివాస్, కౌలు రైతు -
దెబ్బతిన్న సిమెంట్ లైనింగ్
పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామ శివారులో ప్రభుత్వం రెండు వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించింది. కుడి, ఎడమ కాలువల ద్వారా కోయచిచ్చాల, పెంచికల్పేట్, ఎల్లూరు, గన్నారం గ్రామాల్లో పొలాలకు నీటిని సరఫరా చేసేందుకు కాలువలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టడంలేదు. కాలువలకు ఇరువైపులా ఉన్న సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. మరోవైపు పూడిక చేరడంతో 500 ఎకరాలకు సైతం సాగునీరందని పరిస్థితి నెలకొంది. తూములు దెబ్బతిని ప్రాజెక్టులోని నీరు నిరంతరం వృథాగా పోతుంది. మరమ్మతు చేయాలి 13 ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. కాలువల్లో మట్టి చేరడంతో పొలాలకు నీరందడం లేదు. పంటల సాగు కష్టంగా మారింది. అధికారులు స్పందించి కాలువలు, తూము వద్ద గేట్లకు మరమ్మతు చేయాలి. – పాగిడె కిరణ్, రైతు, ఎల్లూరు -
ఒకేరోజు మూడు పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం సీఆర్టీ పోస్టుల భర్తీతోపాటు గ్రామ పాలన అధికారి(జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టుల కోసం రాత పరీక్షలు నిర్వహించారు. సీఆర్టీ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశారు. 1,137 మంది అభ్యర్థులకు 1,086 మంది హాజరు కాగా 51 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలుర, బాలికల, గిరిజన బాలుర(పీటీజీ)లోని సెంటర్లను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీటీడీవో రమాదేవి పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల రాత పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు 97 మంది 80 మంది హాజరు కాగా 17 మంది గైర్హాజరయ్యారు. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా, 97 మందికి 80 మంది హాజరయ్యారు. ఇక జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో గ్రామ పాలన అధికారుల అర్హత పరీక్ష నిర్వహించారు. 35 మందికి 33 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ఒకేరోజు మూడు పరీక్షలు ఉండటంతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ప్రశాంతంగా సీఆర్టీ, జీపీవో, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు జిల్లా కేంద్రంలో సెంటర్లు ఏర్పాటు -
సన్మార్గంలో నడవాలి
కాగజ్నగర్రూరల్: యువత సన్మార్గంలో నడవాలని కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి అన్నారు. కాగజ్నగర్ మండలం అనుకోడ గ్రామంలో ఆదివారం పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ యువత గుడుంబా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో ఇంటింటా తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమతులు లేని 20 మోటారు సైకిళ్లు, రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేశారు. అదేవిధంగా 800 లీటర్ల గుడుంబా పానకంతో పాటు రెండు బస్తాల ఇప్పపువ్వు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఈజ్గాం ఎస్సై కల్యాణ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతన్నా.. జర భద్రం రసాయనిక మందులు రైతులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పిచికారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిలాబాద్ కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు.రామ గుండం లక్ష్మణ గుండం భీమ గుండం ప్రకృతి సోయగాలకు జిల్లా అటవీ ప్రాంతాలు నిలయంగా మారాయి. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. లింగాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సప్త గుండాలుగా పిలిచే (రామ, లక్ష్మణ, భీమ, సీత, సవతి, చిరుతల, బుగ్గ గుండం జలపాతాలు) మిట్టే జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అలాగే పెంచికల్పేట్ మండలం గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకుంది. జలపాతాలకు ఏటా సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. – లింగాపూర్/పెంచికల్పేట్ రోడ్డు మరమ్మతులు షురూ సిర్పూర్(టి) పట్టణంలోని ప్రధాన రహదారులకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.9లోu -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి శ్రీధర్, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ప డకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులు, డ్రెయినేజీల శుభ్రత, రహదారులపై నిల్వ నీటి తొలగింపు, దోమల వృద్ధిని నియంత్రించేందుకు ఆయిల్బాల్స్, బయోటెక్ పిచికారీ చేయాలని ఆదేశించారు. తాగునీటి వనరుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలని, డెంగీ, మలేరియా ఇతర విషజ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించాలని సూచించారు. తెగిపోయిన రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. జనజీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో చింతలమానెపల్లి మండలంలో రహదారి తెగిపోగా రూ.20 లక్షలతో మరమ్మతు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి తదితరులు పాల్గొన్నారు. -
నగదు బదిలీ చేయాలి
చేప పిల్లలు సకాలంలో చెరువుల్లోకి వదిలితే 8, 9 నెలల్లో పెరిగి ఆ శించిన దిగుబడి వస్తుంది. అదును దాటితే ఆర్థికంగా నష్టపోతాం. చేపలు ఎదగపోవడంతోపాటు దిగుబడి కూడా తగ్గుతుంది. జూలైలో 50, 60 రోజుల చేపపిల్లలను జలాశయాల్లోకి వదిలితే ఫిబ్రవరి, మార్చి వరకు ఎదుగుతుంది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలి. నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసి సకాలంలో చెరువులు, కుంటల్లోకి వదులుతాం. ఈ ఏడాది నుంచైనా నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. – ఎనుములె బిజ్జు, మత్స్యకారుడు, ఆసిఫాబాద్ -
మత్స్యకారులకు శాపం
విడుదలలో జాప్యం.. ఆసిఫాబాద్అర్బన్: భారీ వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతేడాది నీటి వనరుల్లోకి చేపపిల్లల విడుదలలో జాప్యం జరగడంతో అనుకున్న సైజుకు ఎదగలే దు. ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ప్రకటించి నా ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 280 జలవనరులుజిల్లాలో 72 మత్స్యకార సంఘాలు ఉండగా 2,900 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. జిల్లాలో సుమారు 1.35 కోట్ల చేపపిల్లలు విడుదల చేసేందు కు అనువైన 280 జలవనరులను గుర్తించారు. సా ధారణంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు నాటి కి జలవనరుల్లో చేపపిల్లలను వదిలితే వేసవి రాకముందే అవి అనుకున్న సైజుకు ఎదుగుతాయి. ఫలి తంగా మత్స్యకారులు చెరువులు ఎండిపోక ముందే చేపలు పట్టి విక్రయించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ గతేడాది సెప్టెంబర్ 16 తేదీ నుంచి విడుదల ప్రక్రియ ప్రారంభించారు. 35 నుంచి 40 మిల్లీమీటర్లు, 80 నుంచి 100 ఎం.ఎం. సైజు కలిగిన 72.93 లక్షల వరకు విడుదల చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. టెండర్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా కేవలం 74 జలవనరుల్లో 47.39 లక్షలు మాత్రమే విడుదల చేయగలిగారు. ఎండల తీవ్రతకు చాలా చెరువులు అడుగంటిపోయాయి. వేడికి చేపలు డిమాండ్కు తగిన సైజ్కు చేరుకోలేదు. దీంతో చాలా మండలాల్లో మత్స్యకారులు నష్టపోయారు. వేలం పాట ద్వారా రూ.7.51 లక్షల ఆదాయం వచ్చినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సంఘాలు లేని 130 చెరువులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం సంబంధిత పంచాయతీలు, కొంత మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇంకా చెరువులకు చేరని చేపపిల్లలు టెండర్ ప్రక్రియ ప్రారంభించని ప్రభుత్వం ఆలస్యమైతే సైజు పెరగదని మత్స్యకారుల ఆందోళనజోరుగా వర్షాలు.. కనిపించని హడావుడి జిల్లాలో ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కుమురంభీం ప్రాజెక్టుతోపాటు బొక్కివాగు, పీపీరావు, అర్కగూడ తదితర ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండగా చెరువులు మత్తడి దూకుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు చెబు తున్నారు. వేసవిలో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా లక్ష్యం నిర్దేశించుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు కాలేదని తెలుస్తోంది. చేపపిల్లల విడుదలలో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాల సభ్యులు కోరుతున్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
జైనూర్(ఆసిఫాబాద్): చట్టాలపై మహిళలు, విద్యార్థినులకు అవగాహన అవసరమని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శుక్రవారం మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైం, నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అపరిచితుల కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల మాయమాటలు విని మోసపోవద్దన్నారు. సోషల్ మీడియాను వినియోగించడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికావొద్దన్నారు. పోలీసుశాఖ, ఐకేపీ, ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో మహిళలు, విద్యార్థినులు డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఈవ్టీజింగ్, సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్, ఐసీడీఎస్ సీడీపీవో ఇందిర, ప్రజ్వల ఎన్జీవో ప్రతి నిధులు సిరాజ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దుబాటు కొలిక్కి..!
● విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డిప్యూటేషన్లు ● జిల్లాలో 92 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు ● ఈ నెల 28 నుంచి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఆదేశాలు80 పాఠశాలలకు.. ప్రస్తుతం తెలుగు మీడియంలోని ఉపాధ్యాయులనే సర్దుబాటు చేస్తున్నారు. గతేడాది డీఎస్సీ నియామకాలు, పదోన్నతులు జరిగాయి. అయినా పలుచోట్ల ఖాళీలు ఉండటంతో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఖాళీలను గుర్తించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 80 పాఠశాలలకు 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో ఎస్జీటీలు 58 మంది, స్కూల్ అసిస్టెంట్లు 34 మంది ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఆసిఫాబాద్లో 16 మంది, బెజ్జూర్ 4, చింతలమానెపల్లి 4, దహెగాం 6, జైనూర్ 3, కాగజ్నగర్ 11, కెరమెరి 11, కౌటాల 3, పెంచికల్పేట్ 4, రెబ్బెన 11, సిర్పూర్(టి) 8, తిర్యాణి 2, వాంకిడి 9 మందిని సర్దుబాటు చేశారు. వీరంతా ఈ నెల 28వ తేదీ నుంచి వారికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 2025– 26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య తుదిదశకు చేరుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో 721 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 39,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలలో అదనంగా ఉన్నవారిని సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్ల ద్వారా సర్దుబాటు చేయాలని రా ష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభు త్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తికాక ముందు స్ప ష్టంగా ఖాళీల సంఖ్య తెలిసే అవకాశం లేదని సర్దుబాటు ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 397 ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 721 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో స్కూల్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2,050 మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 397 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. గతేడాది జీవో 317 ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 65 మంది స్పౌజ్(భార్య, భర్త) కేసుల్లో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. 1 నుంచి 10 మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాలలో 200 ఉంటే సబ్జెక్టు ఒక్క ఉపాధ్యాయుడు, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం బోధించేందుకు ఇద్దరు టీచర్లకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం. – యాదయ్య, డీఈవో -
సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వండి
తిర్యాణి(ఆసిఫాబాద్): విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ ఎస్ఈ శేషారావు సూచించారు. మండలంలోని దుగ్గాపూర్లో శుక్రవారం విద్యుత్ శాఖ– పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. రైతులకు విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. పొలాల్లో స్తంభాలు వంగినా, తీగలు కిందికి జారినా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. అంతకుముందు గిన్నెదరి సబ్స్టేషన్ నుంచి తిర్యాణి సబ్స్టేషన్ వరకు పూర్తయిన 33 కేవీ ఇంటర్ లాకింగ్ సిస్టంను ప్రారంభించారు. సరఫరా లో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్ లాకింగ్తో అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈ వీరేశం, ఏడీఈలు శ్రీనివాస్, రాజేశ్వర్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీర్ సౌమ్య పాల్గొన్నారు. -
సర్వేయర్ల పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గ్రామ పాలన అధికారులు స్క్రీనింగ్, లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి శుక్రవారం పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్కాపూర్లోని జూనియర్ కళాశాలలో గ్రామ పాలన అధికారులు స్క్రీనింగ్, లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పాలన అధికారులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లైసెన్స్డ్ సర్వేయర్లకు రెండు సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులు, రూట్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపాలని, వైద్య ఆరోగ్యశాఖ శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు ఎంప్లాయి గుర్తింపు కార్డు, హాల్ టికెట్, ఆధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, ఆర్టీసీ డీఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం వైద్య, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆస్పత్రి ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో అదనపు తరగతి గదులు, శుద్ధమైన తాగునీరు, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులను ప్రశ్నలు అడిగి, వారి విద్యా సామర్థ్యాలు పరీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఇన్చార్జి డీఈవో ఉదయ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని వంకులం ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, హాజరు పట్టిక, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బడి వయస్సు పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలు పరీక్షించారు. అయితే పాఠశాలలో పలువురు విద్యార్థులు యూనిఫాంలో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. పునఃప్రారంభం రోజునే యూనిఫాంలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా విద్యార్థులకు అందించలేదు. దీనిపై నిర్లక్ష్యం వహించిన ఐకేపీ ఏపీఎం వెంకటరమణ శర్మతో పాటు సీసీ రాజేశ్వరీపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మండలంలోని కై రిగాంలో గల పల్లె దవాఖానాను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి, క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ఆశ కార్యకర్తలతో కలిసి పర్యటించాలన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్వో సీతారాం, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధికారులు పాఠశాలలను సందర్శించాలిఆసిఫాబాద్రూరల్: అధికారులు ప్రతిరోజూ ఒక పాఠశాలను సందర్శించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఎంఈవోలు, ఏపీఎంలతో సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు లేనిచోట సర్దుబాటు చేయాలన్నారు. రెండో విడత యూనిఫాం పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిలింగాపూర్(ఆసిఫాబాద్): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. మందుల గది, వార్డులు, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల గురించి వివరించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా నెలలు నిండిన గర్భిణులను ప్రసవం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు రాకుండా ఫాగింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. కస్తూరిబా విద్యాలయంలో మొక్కలు నాటారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో రాంచందర్, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చింతలమానెపల్లి: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల ని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నా రు. మండలంలోని దిందా వాగు ఉధృతిని గు రువారం పరిశీలించారు. వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించారు. వాగులోకి ఎవరూ దిగకుండా, దాటే ప్రయత్నం చేయకుండా చూడాలని ఆదేశించారు. వంతెన వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. మండలంలోని గ్రామాల పరిస్థితిని తహసీల్దార్ దౌలత్ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్ఐ విజయ్, తదితరులు ఉన్నారు. -
ఎడతెరిపిలేని వర్షం
ఆసిఫాబాద్/చింతలమానెపల్లి/కౌటాల: జిల్లాలో వర్షం తెరిపిలేకుండా కురుస్తోంది. వరదలతో రోడ్లు కొట్టుకుపోగా, పంట చేలలోకి నీరు చేరింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లాలో 64.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెజ్జూర్లో అత్యధికంగా 239.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చింతలమానెపల్లిలో 197.2 మి.మీ.లు, కౌటాల 112.3, పెంచికల్పేట్ 99.1, దహెగాం 54.9, సిర్పూర్(టి) 50.6, లింగాపూర్ 32.9, తిర్యాణిలో 30.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షంతో ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. ప్రాజెక్టు ఐదో గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. గరిష్ట నీటిమట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.40 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 1039 క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 1039 క్యూసెక్కులు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వార్దా, వైన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతలమానెపల్లి మండలంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు సెం.మీ.ల వర్షం కురిసింది. గూడెం మార్గంలో గురువారం ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. దిందా, శివపెల్లి, నాయకపుగూడ వాగుల్లో ఉధృతి తగ్గకపోవడంతో ఆయా గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బూరెపల్లి, రణవెల్లి, గంగాపూర్, కారెబ్బెన, గూడెం, దిందా, ఖర్జెల్లి, కోయపెల్లి, బూరుగూడ సమీపంలోని వాగులు ఉప్పొంగడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గూడెం, శివపెల్లి గ్రామాల శివార్లలో పత్తి చేలలో బురద పేరుకుపోయి ఇసుక, రాళ్లు మేటలు వేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గూడెం, బెజ్జూర్ మార్గంలో కోయపెల్లి సమీపంలో కల్వర్టు, రహదారి కొట్టుకుపోయింది. కోయపెల్లి, నాగెపెల్లి గ్రామాల మధ్య వంతెనకు ఇరువైపులా కోతకు గురైంది. ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు నిర్వహించడం గమనార్హం. బెజ్జూర్ నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోకి మెట్ల ద్వారా వర్షపు నీరు చేరింది. వార్దా, వైన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ప్రమోద్ సూచించారు. నదుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. కుమురంభీం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో -
జీవో 49 రెఫరెండంగా ఎన్నికలకు వెళ్దాం
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకాగజ్నగర్టౌన్: జీవో 49 రెఫరండంగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే హరీశ్బాబు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి భాష మార్చుకోవాలన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జీవో 49పై కనీస సమాచారం లేకుండా మాట్లాడడం దారుణమన్నారు. గెజిట్ రద్దు చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ విషయంలో అటవీ అధికారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ప్రత్యుత్తరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీవోను నిలుపుదల చేసిందని, తాము శాశ్వత పరిష్కారం దిశగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. జీవో రద్దుకు కాంగ్రెస్ నాయకులు సైతం కృషి చేయాలని హితవు పలికారు. -
మహాలక్ష్మి కళ
● ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ● కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు ● సర్వీసుల సంఖ్య పెంచాలని విన్నపం ● ఆసిఫాబాద్ డిపోకు రూ.48.86 కోట్ల ఆదాయంఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని జిల్లాలోని మహిళలు పెద్దసంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ పథకాన్ని 2023 డిసెంబర్ 9న ప్రారంభించగా, అప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్దఎత్తున వినియోగించుకోవడంతో ఆసిఫాబాద్ డిపోకు అదేస్థాయిలో ఆదాయం సైతం సమకూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని 200 కోట్ల మహిళలు వినియోగించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి సంబురాలు నిర్వహించారు. డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్, డీఎం రాజశేఖర్ ఆధ్వర్యంలో మహిళా ప్రయాణికులను సన్మానించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు లేక ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చేది కాదు. ఉచిత బస్సు సౌకర్యంతో ప్రస్తుతం కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్నారు. రూ.48.86 కోట్ల ఆదాయంజిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 83 బస్సు సర్వీసులు ఉన్నాయి. 75 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో రెండు లహరి, 13 లగ్జరీ, రెండు డీలక్స్, ఎనిమిది ఎక్స్ప్రెస్, మరో 28 హైర్ బస్సులు ఉండగా, మిగితావి ఆర్డీనరీ సర్వీసులు. ప్రతిరోజూ డిపోకు ఆదాయం రూ.20 లక్షలు కాగా, అన్సీజన్ కావడంతో ప్రస్తుతం రూ.18 లక్షల వరకు సమకూరుతోంది. ఏప్రిల్, మే నెలల్లో ప్రతిరోజూ ఆదాయం రూ.20 లక్షల టార్గెట్ను అందుకుంది. ప్రతిరోజూ 47 వేల మంది ప్రయాణికులను 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు తరలిస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో పరిధిలో 1.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా, రూ.48.86 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో డిపో ఆదాయం లక్ష్యానికి దూరంగా ఉండగా, ఉచిత బస్సుతో గణనీయమైన ఆదాయం వస్తోంది. కేవలం ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు నడుస్తుండగా, రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ మహిళలకు మహాలక్ష్మి పథకం దూరమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ప్రైవేటు వాహనాలను వారు ఆశ్రయిస్తున్నారు. ఎక్స్ప్రెస్ సర్వీసులకు ప్రతిపాదన మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సు సేవలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డిపో ఆదాయం సైతం గతంతో పోలిస్తే పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ రూట్లో నాలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికుల సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం. – రాజశేఖర్, ఆసిఫాబాద్ ఆర్టీసీ డీఎంకిటకిటలాడుతున్న బస్సులుతెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో 68 శాతం మహిళలు ప్రయాణిస్తున్నారు. మహిళలకు కేవలం ఎక్స్ప్రెస్, ఆర్డీనరీలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని రూట్లలో బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆర్డీనరీ బస్సుల్లో మహిళల సంఖ్య పెరగడంతో పురుషులకు సీట్లు సరిపోవడంతో లేదు. టికెట్ చెల్లించే పురుష ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి
ఆసిఫాబాద్రూరల్: కీలకమైన విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎస్ఎఫ్ఐ జి ల్లా అధ్యక్షుడు సాయి అన్నారు. విద్యా సంస్థల బంద్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వా మపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించి, విద్యార్థులను ఇంటికి పంపించారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. పోస్టుల భర్తీ, ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుద ల, గురుకులాలకు సొంత భవనాలు, విద్యార్థులకు ఉచిత బస్పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, నాయకులు సతీష్, ప్రసాద్, నితిన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఉప్పొంగిన వాగులు, ఉధృతంగా ప్రవహించిన నదులు ● స్తంభించిన జనజీవనం, ఇళ్లలోకి చేరిన వరద ● జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ● రానున్న మూడు రోజులపాటు వర్ష సూచన ● అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
వరద నుంచి కాపాడిన వ్యక్తితో అధికారులుగూడెం వద్ద మునిగిన వరినారు చూపుతున్న రైతుబుధవారం నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో)ప్రాంతం వర్షపాతం బెజ్జూర్ 213.2చింతలమానెపల్లి 181.6పెంచికల్పేట్ 76.6కౌటాల 60.0దహెగాం 30.2సిర్పూర్(టి) 27.6లింగాపూర్ 16.2తిర్యాణి 10.0గూడెం నుంచి కోయపెల్లి మార్గంలో వంతెన వద్ద కొట్టుకుపోయిన రహదారిప్రజలు అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టు రహదారుల పైనుంచి దాటొద్దని, జలాశయాలు, చెరువులు, కుంటలు చూసేందుకు వెళ్లొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండొద్దని, తడిగా ఉన్న విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ తాకొద్దన్నారు, చేపల వేటకు వెళ్లొద్దన్నారు. జలపాతాలను సందర్శించవద్దన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం కోసం విపత్తు ప్రతిస్పందన దళాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని, విపత్కర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 87126 70551 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఆసిఫాబాద్/కౌటాల/చింతలమానెపల్లి/బెజ్జూర్: రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచికొట్టింది. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించగా, చెరువులు, పొలాల్లోకి వరద చేరింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ప్రాణహిత, వార్ధా, పెన్గంగ, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా, మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. ● బెజ్జూర్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం అత్యధికంగా 213.2 మీమీ వర్షం నమోదైంది. సుశ్మీర్ ఒర్రె ఉప్పొంగి ప్రవహించింది. సోమిని, మూగవెల్లి, ఉప్పలగూడెం, పాతసోమిని తదితర గ్రామాలతోపాటు మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్ర సమీపంలోని సెగ్రిగేషన్ షెడ్డులో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. చుట్టూ వరద చేరడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎస్సై సత్తార్ పాషా స్థానికుల సాయంతో అతడిని రక్షించారు. చిన్నసిద్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు ఉదయ్కిరణ్, మహేశ్వరి, సువర్ణ విధులు ముగించుకుని మండల కేంద్రానికి వెళ్తుండగా ఎల్కపల్లి, చిన్న సిద్దాపూర్ గ్రామాల మధ్య ఒర్రెను ప్రమాదకరంగా దాటారు. పెద్దవాగు, చిన్నవాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. ● చింతలమానెపల్లి మండలం బాబాసాగర్, నాయకపుగూడ దారిలో వాగు ఉప్పొంగడంతో నాయకపుగూడకు రవాణా నిలిచిపోయింది. శివపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు వద్ద ఇదే పరిస్థితి. పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో ప్రయాణాలు ఆగిపోయాయి. చింతలమానెపల్లి నుంచి గూడెం మీదుగా అహేరికి వెళ్లే మార్గం పలుచోట్ల మునిగింది. కేతిని సమీపంలోని ఊట్లవాగు వంతెనకు ఇరువైపులా వరద ప్రవహించింది. గూడెం నుంచి ప్రాణహిత వంతెన సమీపంలో అరకిలోమీటరు మేర వరద రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు సైతం రద్దు చేశారు. దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వంతెన మునిగి సుమారుగా కిలోమీటర్ వరకు వరద ప్రవహిస్తోంది. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోగా, బూరెపల్లి, రణవెల్లి గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలకు ఆగిపోయాయి. గూడెం, కోయపెల్లి, బూరుగూడ, దిందా గ్రామాల్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు తిరిగి రాలేకపోయారు. గ్రామాల్లోనే ఉండిపోయారు. ● కౌటాల తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలాస్థలో చేరడంతో వర్షానికి భవనం పైకప్పు నుంచి నీరుగారి గదుల్లోకి చేరింది. కార్యాలయం ఎదుట కూడా వరదనీరు చేరింది. వీర్ధండి గ్రామంలో ఇళ్లలోకి వరద చేరింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది, తాటిపల్లి వద్ద వార్ధా నది, గుండాయిపేట, వీర్ధండి వద్ద వైన్గంగ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జాలరులు చేపల వేటతోపాటు నాటు పడవల ప్రయాణాలు నిలిపివేశారు. -
ప్రతీరోజు ఒక పాఠశాలను సందర్శించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: అధికారులు ప్రతీరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వసతి గృహాల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా వందశాతం పనులు ప్రారంభించే విధంగా పర్యవేక్షించాలన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల సర్వే నిర్వహించి, వివరాలు సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల వివరాలను సేకరించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. వనమహోత్సవం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌజింగ్ పీడీ వేణుగోపాల్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ఆసిఫాబాద్రూరల్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట డీఎంహెచ్వో సీతారాం, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లైబ్రరీలతో విద్యార్థుల్లో పఠనాసక్తి
ఆసిఫాబాద్రూరల్: పాఠశాలల్లో గ్రంథాలయా ల ఏర్పాటుతో విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికా రి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నత పాఠశాలలో బుధవారం శక్తి వంతీ కరణ(పటిష్టత, బందోబస్తు) అంశంపై 90 మంది కాంప్లెక్స్ స్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా పుస్తకాలు చదివించాలన్నారు. ఏసీజీఈ ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్, హెచ్ఎం విజయలక్ష్మి, రిసోర్స్పర్సన్లు చౌదరి వెంకటేశ్, జాదవ్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
‘అసత్య ప్రచారం మానుకోవాలి’
కాగజ్నగర్టౌన్: జీవో 49పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జీవో 49కు అనుకూలంగా ప్రతిపాదనలు చేసి పంపించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో గెజిట్ ఆపాలని సవాల్ విసిరారు. జీవో గెజిట్ ఆపలేని పక్షంలో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ విఠల్ ప్రకటించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఆనంద్రావు, నాయకులు సిడాం గణపతి, దస్తగిరి, గజ్జి రామయ్య, ఆవుల రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లపై రీసర్వే
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులుజిల్లాలోని 15 మండలాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 5,910 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో మండలానికి ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేసింది. 15 పైలట్ గ్రామాలకు 1,625 ఇళ్లు మంజూరు కాగా, రెండో విడతలో 3,285 ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల రీసర్వే ప్రక్రియను చేపట్టగా.. పంచాయతీ కార్యదర్శులకు పైలట్ గ్రామాల్లో సర్వే తలనొప్పిగా మారుతోంది. యాప్లో గతంలో నివసించిన పాత ఇంటి ఫొటోతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి లొకేషన్ ఫొటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే చాలామంది లబ్ధిదారులు గతంలో నివాసం ఉన్న ఇంటిని తొలగించి.. అదే ప్రదేశంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పాత ఇల్లు లేకపోవడంతో రీసర్వేలో పాత ఇంటి ఫొటో అప్లోడ్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. పాత ఇంటి ఫొటో స్థానంలో ఖాళీ ప్రదేశాన్ని, పక్కనే ఉన్న మరో పాత ఇంటి ఫొటోనైనా అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన ఇళ్లలో ఇప్పటికే సుమారు 1,300 వరకు నిర్మాణాలు ప్రారంభం కాగా.. 720 వరకు పునాదులు కూడా పూర్తయ్యాయి. కొన్ని లెంటల్ లెవల్, మరికొన్ని స్లాబ్ కూడా పూర్తయ్యాయి. అయితే రీసర్వేలో ఇంటిని నిర్మించే ఖాళీ స్థలం ఫొటోను సైతం యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉండడంతో దాని స్థానంలో పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల వివరాలను మరోసారి సేకరిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా సర్వే చేయిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్రం కూడా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాటాతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. 60కి పైగా అంశాలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా కార్యదర్శులు గ్రామాల్లో వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రధాన మంత్రి ఆవాస్ ప్లస్ యాప్లో ముందుగా వారీ వివరాలను నమోదు చేసి, కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలో రెవెన్యూ గ్రామాల్లో ఆవాస్ ప్లస్ యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మ్యాపింగ్ పూర్తి చేసి, అన్ని గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సర్వే ప్రక్రియ సాగుతోంది. అయితే యాప్లో 60పైగా ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు. పేరు, ఆధార్కార్డు, జాబ్కార్డు నంబర్, జెండర్, సోషల్ కేటగిరీ, వ యస్సు, మొబైల్ నంబర్, విద్యార్హత, వృత్తి, కుటుంబ సభ్యుల సంఖ్య, క్యాన్సర్ వంటి వ్యాధులు, నాన్ అగ్రికల్చర్ వృత్తి వివరాలు, మురుగుదొడ్లు, కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రొఫెనల్ ట్యాక్స్ చెల్లింపులతోపాటు అన్నిరకాల సమాచారంతో కూడిన సుమారు 60కిపైగా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వా త లబ్ధిదారుడి ఫొటోతో పాటు ప్రస్తుతం నిర్మించే ఇంటి లొకేషన్, గతంలో ఉన్న పాత ఇంటి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే సర్వే సమయంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో కార్యదర్శులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాలు మ్యాపింగ్ లేకపోవడం, పలు గ్రామాల్లో నెట్వర్క్ సరిగా లేకపోవడం, ఆధార్ అప్డేట్ లేకపోవడం, కొంతమంది లబ్ధిదారుల అధార్ నంబర్ ఇప్పటికే నమోదు అయినట్లు చూపించడం, కొన్నిరకాల బ్యాంకుల పేర్లు యాప్లో కనిపించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే సర్వే కోసం పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుడి కోసం వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఉండడం లేదు. ఇలా పలు కారణాలతో రీసర్వే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది. మరోసారి లబ్ధిదారుల వివరాలు సేకరణ కేంద్ర ప్రభుత్వ యాప్లో అప్లోడ్ సాంకేతిక సమస్యలతో పంచాయతీ కార్యదర్శులు సతమతం -
విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు
కెరమెరి(ఆసిఫాబాద్): వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దుని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజల కు జాగ్రత్తలు వివరించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం మోడి బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను ఏకాగ్రతతో వినాలని సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. హరితవనంలో మొక్కలు నా టారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, తహసీల్దార్ భీమయ్య, ఏడీఏ వెంకట్, ఎంపీడీవో అంజద్పాషా, ఏఈ నజీమోద్దీన్, హెచ్ఎం ప్రేందాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కలపాలని ఎమ్మెల్యేకు వినతి
ఆసిఫాబాద్అర్బన్: కెరమెరి మండలంలోని సరిహద్దు గ్రామమైన బోలాపటార్ను తెలంగాణ రాష్ట్రంలోనే కలపాలని గ్రామస్తులు మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం తమకు తెలంగాణ లోనే ఆధార్కార్డు, రేషన్కార్డు, ఇతర ధ్రువపత్రాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో విలీనం చేస్తే నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని తెలంగాణలో విలీ నం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మారుతి, సంతోష్, రమేశ్, బాలు, ఆనంద్రావ్, భీంరావ్, సోనేరావ్, వి నోద్, చిన్ను, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
49 జీవో శాశ్వత రద్దుకు పోరాటం
● సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబుకాగజ్నగర్టౌన్: జీవో 49 శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. కాగజ్నగర్ పట్టణం సర్సిల్క్ కాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బంద్ సంపూర్ణం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెమో ఇచ్చిందన్నారు. తాత్కాలికంగా నిలుపుదల చేయడం కేవలం కంటి తుడుపు చర్యని, శాశ్వత రద్దు కోసం పోరాటాలు విరమించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే జీవో తెచ్చామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలికారని, ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుదల ఆర్డర్స్ కోసం కేంద్రాన్ని సంప్రదించారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో బీజేపీని లక్ష్యం చేసి విమర్శలు గుప్పించారని మండిపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని, ఈ నెలాఖరులోగా జీవో రద్దు చేయని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, కోశాధికారి అరుణ్లోయ, నాయకులు విశ్వేశ్వర్రావు, సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్, మనోహర్గౌడ్, చిప్పకుర్తి శ్రీనివాస్, తిరుపతి, సాంబయ్య, గణపతి, లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్కు సంబంధించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఆదివాసీ సంఘాల నాయకుల విన్నపంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాలేశ్వర్గౌడ్, మసాదె చరణ్, గాధెవేణి మల్లేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థా యి సబ్జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీలకు కాగజ్నగర్కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. కాగజ్నగర్ పట్టణంలో మంగళవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్– 14 బాలుర విభాగంలో అబ్దుల్ అ యాన్, ఎం.పవన్, బాలికల విభాగంలో ష బ్నం, శ్రీవాత్సవ్, టి.సంజన ఎంపికయ్యారని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వి.మధు, కార్యదర్శి ఎం.శేఖర్, చైర్మన్ శివనాయర్, కోశాధికారి రమాకాంత్ యాదవ్ తెలిపారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
● 24 నుంచి 27వరకు ఇంటర్ లాకింగ్ పనులు ● తాత్కాలికంగా కొన్ని, పాక్షికంగా మరికొన్ని రద్దుబెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులో నిర్మిస్తు న్న బైపాస్ రైలుమార్గం ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడానికి ఈ నెల 24నుంచి 27వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. బల్లార్షా–కాజిపేట మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ పూర్తి గా, మరికొన్ని తాత్కాలికంగా, ఇంకొన్ని పాక్షికంగా రద్దు చేసింది. రద్దయినవి ఇవే..కరీంనగర్–సిర్పూర్(టి)–కరీంనగర్ మెము ఎక్స్ప్రెస్, రామగిరి మెము ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 25నుంచి 27వరకు రద్దు చేశారు. బల్లార్షా–కాజిపేట–బల్లార్షా ఎక్స్ప్రెస్ 24నుంచి 26వరకు ఎగువ మార్గంలో బల్లార్షా వైపు, 25నుంచి 27వరకు దిగువ మార్గంలో కాజిపేట వైపు రద్దయింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 25నుంచి 27వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దయినవి..హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్–బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, భద్రాచలం రోడ్–బల్లార్షా–భద్రాచలం రోడ్డు వరకు రాకపోకలు సాగించే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ ఈ నెల 25నుంచి 27వరకు, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఎగువ మార్గంలో 24నుంచి 26వరకు, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ దిగువ మార్గంలో 25నుంచి 27వరకు పాక్షికంగా రద్దు చేశారు. ఆలస్యంగా నడిచేవి..పెద్దపల్లి జంక్షన్ వద్ద రైల్వే బైపాస్ను అందుబాటులోకి తేవడానికి కొన్ని రైళ్లను ప్రారంభ స్టేషన్ నుంచి నిర్దేశించిన సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. ● తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 26న తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రా త్రి 8.05గంటలకు బయల్దేరాల్సి ఉండగా 2.30 గంటలు ఆలస్యంగా రాత్రి 10.35గంటలకు బయల్దేరుతుంది. ● న్యూఢిల్లీ నుంచి నాంపల్లి తెలంగాణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 24న దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో 1.15గంటలు నియంత్రణ చేశారు. ● నిజాముద్దీన్ నుంచి కేఎస్సార్ బెంగళూర్ సిటీ మధ్య రాకపోకలు సాగించే రాజధాని సూపర్ఫా స్ట్ ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో 20నిమిషాలు నియంత్రణ చేయనున్నారు. ● చెన్నయ్ సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తమిళనాడు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గంటసేపు నియంత్రిస్తారు. ● విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లో 45నిమిషాలు నియంత్రణ చేయనున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల తిరస్కరణకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల వివరాలను ఈ నెల 30 లోగా పంపించాలని ఆదేశించారు. ఈ నెల 27న జేఎన్టీయూ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అర్హులకు కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో 44 శాతం పూర్తి చేశామన్నారు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి దేవిదాస్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్, హౌజింగ్ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
చిత్తశుద్ధి ఉంటే శాశ్వతంగా రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవో 49ను రద్దు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బూటకపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే తాత్కాలికంగా నిలుపుదల కాకుండా, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురంభీం స్ఫూర్తితో జీవో 49 రద్దుకు ఎంతకైనా పోరాడుతామని హెచ్చరించా రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జీవో తీసుకురాగా, తిరిగి వారే రద్దు చేశామని ప్రకటించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒంటెద్దు పోకడలను ప్రజలు గమనిస్తున్నారని, వారి ని తరిమికొట్టే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఓట్ల కోసం కొత్త డ్రామాలు చేస్తున్నారని, ఆదివా సీ ప్రజలను ఆదివాసీ నాయకులే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జీవో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బుర్స పోచయ్య, మర్సుకోల సరస్వతి, సిడాం శంకర్, జాబరి రవి, కిష్టయ్య, భీమేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
స్వచ్ఛతపై పట్టింపేది?
కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన నాగేశ్వర్, జయ దంపతుల కుమార్తె మన్విత స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటుంది. ఈ నెల 15న జ్వరం రాగా కౌటాల పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మళ్లీ 16వ తేదీన పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ‘ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా..’ అంటూ తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కలచివేసింది. దహెగాం(సిర్పూర్): పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిలవడం, చెత్తకుప్పలు పేరుకుపోయి ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. ఓ వర్షాలు పడుతుండగా మరోవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో భిన్న వాతావరణం ఉంది. ఫలితంగా విష జ్వరాల ముప్పు పొంచి ఉంది. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు జ్వరంతో మృతి చెందారు. గతేడాది ఫిబ్రవరి 2న సర్పంచుల కాలం ముగియగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు. గతేడాది నవంబర్లో మాత్రమే కొంతమేర నిధులు అందాయి. అప్పటినుంచి నయా పైసా రాకపోవడంతో పాలన ఇబ్బందిగా మారింది. 17 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన..సర్పంచుల పదవీ కాలం ముగిసి 17 నెలలు కావొ స్తోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలానికి ఒక ప్రత్యేకధికారి, పంచాయతీలకు కూడా 125 మంది ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టారు. ఒక్కో అధికారి రెండు నుంచి నాలుగు పంచాయతీలు బా ధ్యత చూస్తున్నారు. దీంతో వారు పంచాయతీలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏజెన్సీ మండలాల్లో ర్యాఫిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు అయితే మలేరి యా, డెంగీ వంటి కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోకపోతే రానున్న రెండు నెలల్లో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ఫాగింగ్తోపాటు చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ మురుగు నీటి నిల్వతో దోమలు, ఈగలు వృద్ధి జాడలేని ఫాగింగ్, బ్లీచింగ్ పనులు వారం రోజుల వ్యవధిలో జ్వరంతో ఇద్దరు మృతి తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మహిళ పాండుబాయి వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా జ్వరం తగ్గకపోగా, రక్తకణాలు కూడా పడిపోయాయి. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. ఐదు రోజులపాటు చికిత్స పొందగా, పరిస్థితి విషమించి ఈ నెల 19న ప్రాణాలు కోల్పోయింది. గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ..పంచాయతీల్లో నిధుల లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. మురుగు నీరు రోడ్లపై పారుతోంది. గ్రామాలతోపాటు మండల కేంద్రాల్లో కూడా ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతున్నాయి. 5,000 బస్తాల బ్లీచింగ్ పౌడర్ అవసరం ఉంటుంది. నిధులు లేక మురుగు నీటిపై కనీసం బ్లీచింగ్ ఫౌడర్ కూడా చల్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణకు కొనుగోలు చేసిన దాదాపు 250 ఫాగింగ్ యంత్రాలు మూలనపడ్డాయి. దోమల నివారణ మందు పిచికారీ చేయాలంటే రోజుకు కనీసం 10 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. డీజిల్ కొనుగోలుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్సీ రాష్ట్ర ఆర్థిక నిధులు, కేంద్రం నుంచి ఎఫ్ఎఫ్సీ 15 ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. పంచాయతీల్లో పన్నులను బ్యాంకులో జమ చేయగా.. వాటిని కూడా పారిశుద్ధ్య పనుల కోసం వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాం. పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. – భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి సిబ్బందిని అప్రమత్తం చేశాం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏజెన్సీలో ర్యాఫిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మలేరియా, డెంగీ కేసులు లేవు. పీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకుంటున్నాం. – సీతారాం నాయక్, డీఎంహెచ్వో -
నిరుద్యోగ ర్యాలీ అడ్డగింత
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎంలో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మంగళవారం నిరుద్యోగ జేఏసీ నాయకులు పట్టణంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ర్యాలీని ప్రారంభిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని జేఏసీ నాయకులను పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్పీఎం కంపెనీ ఉద్యోగ కల్పన పొరాట సంఘం కన్వీనర్ పొన్న రమేశ్ మాట్లాడారు. ఈ నెల 16న ర్యాలీ అనుమతుల కోసం మీ సేవలో చలాన్ కట్టామని, డీఎస్పీకి సైతం లేఖ ఇచ్చామని తెలిపా రు. పోలీసులు అత్యుత్సాహంతో ర్యాలీ అడ్డుకున్నారని ఆరోపించారు. మిల్లు యాజమాన్యానికి పోలీ సులు తొత్తుగా మారారని విమర్శించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, సీపీఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు అంబాల ఓదెలు తదితరులు జేఏసీ నాయకులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ మిల్లులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. స్కిల్డ్ జాబ్స్ 80 శాతం స్థానికులకు ఇవ్వాలని, అన్స్కిల్డ్ విభాగంలో 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలను తుంగలో తొక్కి స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వల స్థాయి, వినియోగం, వానాకాలం సీజన్లో వ్యవసాయ సాగు, యూరి యా నిల్వలు, ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేస్తూ ఎరువులు పక్కదారి పట్టకుండా చూ డాలన్నారు. యూరియా స్టాకు వివరాలు ప్రతీ షా పు ఎదుట బోర్డుపై ప్రదర్శించే విధంగా చూడాలని సూచించారు. భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జనజీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రహదారులు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఇరిగేషన్ అధికారులు గుణవంత్రావు, ప్రభాకర్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, వ్యవసాయ శాఖ ఏడీ మిలింద్కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
‘సమస్యలపై దశలవారీగా పోరాటం’
కాగజ్నగర్టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీగా పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి(యూఎస్పీసీ) నాయకులు ప్రకటించారు. పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం యూఎస్పీసీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ యూఎ స్పీసీ ఆధ్వర్యలో ఈ నెల 23, 24 తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని, ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నా, 23న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ విడుదల చేసి, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులతోపాటు ప్రతీ రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ డీవో, మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని, పండిత్, పీఈటీల అప్గ్రేడేషన్ పూర్తయినందున జీవో 2, 3, 9, 10 రద్దు చేసి, జీవో 11, 12 ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. గురుకులాల టైం టేబుల్ సవరించాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలానికి జీతం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చరణ్దాస్, వైద్య శాంతికుమారి, లక్ష్మణ్, జాడి కేశవ్, రాజ్కమలాకర్రెడ్డి, సురేశ్, మహేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కౌటాల(సిర్పూర్): క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో కౌటాల పోలీస్స్టేషన్లో సోమవారం మండలస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన బోదంపల్లి జట్టుకు రూ.10వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ముత్తంపేట జట్టుకు రూ.5 వేల నగదుతోపాటు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడు తూ గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలతో మానసికోల్లాసం, స్నేహభావం పె రుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించా రు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై విజ య్, నాయకులు బుర్స నాగయ్య, సత్యనారా యణ, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
జాప్యం లేకుండా ఉద్యోగులకు సేవలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగులకు జాప్యం లేకుండా సేవలందించాలని డీవైపీఎం ఎస్వీ రాజేశ్వర్రావు అన్నారు. గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల టెర్మినల్ బెనిఫిట్స్, గృహ రుణాల రాయితీ, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు తది తర సంక్షేమ పథకాలు, ఉద్యోగుల గైర్హాజరు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గనులు, డిపార్టుమెంట్ల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు నిత్యం సమాచారం అందిస్తూ, వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తూ పెండింగ్ దరఖాస్తులు లేని ఏరియాగా బెల్లంపల్లిని నిల పాలని సూచించారు. సమావేశంలో సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, సంక్షేమ అధికారి రజినికుమార్, జూనియర్ అసిస్టెంట్లు బాబా, సాగర్ పాల్గొన్నారు. -
కాలేజీలకు కొత్త శోభ
● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ● కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం ● వసతుల కల్పనకు నిధులు సైతం.. ● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులుకౌటాల(సిర్పూర్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో పాటు నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. కొన్నేళ్లుగా అసౌకర్యాల మధ్య చదువులు కొనసాగుతున్న సర్కారు కాలేజీలు కొత్త శోభ సంతరించుకోనున్నాయి. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 2,535 మంది చదువుకుంటున్నారు. జిల్లాలోని ఒక్కో కాలేజీలో 13 చొప్పున సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఇప్పటికే కౌటాల, కాగజ్నగర్ కళాశాలల్లో అమర్చగా, మిగతా చోట పనులు కొనసాగుతున్నాయి. తరగతుల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా ప్రతీ తరగతి గదితోపాటు ఆరు బయట వరండా, ప్రయోగశాలల్లో కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారు. రోజువారీగా విద్యార్థుల హాజరు, బోధన తీరు కళాశాలల నిర్వహణ తదితర అంశాల ను ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్తోపాటు ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. కమాండ్ నుంచి కంట్రోల్..అధ్యాపకులతోపాటు విద్యార్థులు కళాశాలకు క్ర మం తప్పకుండా వస్తున్నారా.. లెక్చరర్లు సక్రమంగా పాఠాలు చెబుతున్నారా.. తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు.. తదితర అంశాలు పర్యవేక్షించేందుకు ఇంటర్ బోర్డు సీసీ కెమెరాలు వినియోగించనుంది. సీసీ కెమెరాలు హైదరాబాద్లో గల నాంపల్లి ఇంటర్బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించనున్నారు. అధ్యాపకులు పాఠాలు చెప్పే విధానాన్ని కూడా అధికారులు, నిపుణులు పర్యవేక్షిస్తారు. ఇంటరాక్టివ్ సీసీ కెమెరాల ద్వారా సూచనలిస్తారు. విద్యార్థులు కాలేజీలకు సక్రమంగా హాజరు కాకపోతే తల్లిదండ్రుల మొబైల్కు సందేశం పంపనున్నారు. పాఠశాలల్లో మాదిరిగా టీచర్, పేరెంట్ మీటింగ్కు కళాశాలల్లో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఇంటర్బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వసతుల కల్పనకు నిధులు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు కోసం నిధులు మంజూ రు చేశారు. ఏళ్లుగా వసతుల లేమితో సతమతమవుతున్న కళాశాలలకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని 11 జూనియర్ కళాశాలలకు రూ.1.64 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో భవనాల మరమ్మతు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యు త్ పనులు, తాగునీరు, గ్రీన్చాక్ బోర్డులు, డ్యూయ ల్ డెస్కులు, ఫ్యాన్లు, షెడ్లు, భవనాలకు రంగులు వంటి పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాల ల మాదిరిగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. నిధులు మంజూరు ఇలా.. కళాశాల నిధులు(రూ.లక్షల్లో) జైనూర్ 15.70 కాగజ్నగర్ 28.82 సిర్పూర్(టి) 10.60 కౌటాల 20 బెజ్జూర్ 12.60 తిర్యాణి 16.80 దహెగాం 3.70 ఆసిఫాబాద్ 15.40 కెరమెరి 25.50 వాంకిడి 3.70 రెబ్బెన 11.60సరైన నిర్ణయం కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సరైన ని ర్ణయం. ఆకతాయిలు కళా శాల వైపు రాకుండా విద్యార్థినులకు భద్రత ఉంటుంది. అధ్యాపకులు క్రమం తప్పకుండా తరగతులు బో ధిస్తున్నారు. విద్యార్థుల హాజరు కూడా పెరిగింది. మధ్యాహ్న భోజనం అమలు చేస్తే బాగుంటుంది. – స్వాతి, విద్యార్థిని, కౌటాల నిరంతర పర్యవేక్షణ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక నిపుణులు పనులు చేస్తున్నారు. కౌటాల, కాగజ్నగర్ కళాశాలల్లో ఏర్పాటు పూర్తయింది. కెమెరాలతో పూర్తి నిఘా ఉంటుంది. విద్యార్థుల హాజరు, అధ్యాపకులు సమయపాలన, ఫలితాల మెరుగుదలకు అవకాశం ఉంటుంది. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. – కళ్యాణి, డీఐఈవో -
జీఎంకు అధికారుల సంఘం వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): కైరిగూడ ఓసీపీ వద్ద అధికారులను నిర్బంధించడాన్ని ఖండిస్తూ బెల్లంపల్లి ఏరియా అధికారులు సోమవారం జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందించారు. అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఆదివారం రెండో షిప్టుకు హాజరైన ఆపరేటర్లందరూ కలిసి అండర్ మేనేజర్ లక్ష్మీనారాయణ, మల్లయ్యను గదిలో నిర్బంధించి బయటకు రాకుండా ధర్నా చేశారన్నారు. మూడో షిఫ్టుకు హాజరయ్యే అండర్ మేనేజర్ లక్ష్మీనారాయణను పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఉజ్వల్కుమార్ బెహరా, ఉమాకాంత్, శ్రీనివాస రావు, కృష్ణమూర్తి, వీరన్న, మదీనాబాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం
● జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్ ● స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూత ● నిర్మానుష్యంగా మారిన బస్టాండ్లు, మార్కెట్లు ● మద్దతు పలికిన రాజకీయ, ప్రజా సంఘాల నాయకులుఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా– అంధారి టైగర్ రిజర్వ్తో కలిపే జిల్లాలోని కారిడార్ అటవీ ప్రాంతాన్ని ‘కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్’గా ప్రకటిస్తూ జారీ చేసిన 49 జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బంద్లో భాగంగా జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఉదయం నుంచి మూసివేశారు. బస్సులను అడ్డుకోవడంతో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ఏజెన్సీ మండలాలైన లింగాపూర్, కెరమెరితోపాటు వాంకిడి, కాగజ్నగర్, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల్లో ప్రజలు బంద్ పాటించారు. పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో జనసంచారం కనిపించలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆందోళన వద్దుటైగర్ కన్జర్వేషన్ పేరుతో తీసుకువచ్చిన జీవో 49 రద్దు అవుతుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. హైదరాబాద్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జీవో 49 రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు. జీవో విడుదల అనంతరం జిల్లాలో పరిస్థితులను వివరించారు. కేంద్రం ఒత్తిడితో జారీ చేసిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీవో రూపొందిందని, బీజేపీ ఒత్తిడితోనే జారీ అయిందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కాగజ్నగర్లో నిరసనలుకాగజ్నగర్ పట్టణంలో వ్యాపారులు, ప్రజలు స్వ చ్ఛందంగా బంద్ పాటించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతోపాటు నాయకులు రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవో 49ను అమలు చేస్తే జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఐద్వా మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ జిల్లాలోని 339 గ్రామాల ఆదివాసీ ప్రజలను వారి భూములకు దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నాయని ఆరో పించారు. అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహించరానిదన్నారు. ఆర్టీసీ బస్సులు ఆసిఫాబాద్ డిపో నుంచి కాగజ్నగర్ బస్టాండ్కు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పలేదు. కాగజ్నగర్ బస్టాండ్ వెలవెలబోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్లోయ, అసెంబ్లీ కన్వీనర్, వీరభద్రచారి, నాయకులు సిందం శ్రీనివాస్, శంకర్, తిరుపతి, శ్రీనివాస్, సీసీఎం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.నిర్మానుష్యంగా కాగజ్నగర్లోని మార్కెట్ ఏరియా జీవో 49 నిలుపుదలటైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించారు. ఆదివాసీల ఆందోళనల దృష్ట్యా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇచ్చిన నివేదిక మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీవోను నిలిపివేస్తున్నట్లు మెమో జారీ చేశారు. కాగా, జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకుడు మడావి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బస్సులు అడ్డగింతతుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్కుమార్, రాజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షు డు మడావి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెందోర్ సుధాకర్, గోండ్వానా ఫౌండేషన్ చైర్మన్ సిడాం తిరుపతి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్తో పాటు పలు వురు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సులను అడ్డుకున్నారు. పోలీసులకు ఆదివాసీ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఉద యం బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పోలీసులు జో క్యం చేసుకుని బస్సు ల రాకపోకలు కొనసాగించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజ య్కుమార్ మాట్లాడుతూ టైగర్ కన్జర్వేషన్ పేరి ట ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చే యాలని డిమాండ్ చేశారు. పెసా చట్టం, 1/70 చ ట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో ఉందని స్పష్టం చేశారు. 339 గ్రామాలను తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివాసీలతోపాటు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్రూరల్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో పని చే స్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని పీ డీఎస్యూ జిల్లా కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశా రు. శనివారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో పని చేస్తున్న వర్కర్లు 15 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధింత అధికారులు చొ రవ తీసుకుని వెంటనే పెండింగ్ వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వర్కర్లు శారద, సరోజ, జ్యోతి, పార్వతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
నా ఎదుగుదలను ఓర్వలేకే దుష్ప్రచారం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కైలాస్నగర్: రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్గంగా గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రోఫైనాన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నిందితుడు పరారైన ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. నిందితుడు తనకు స్నేహితుడేనని, కలిసి చదువుకున్నామన్నారు. అయితే నిందితుడి ఫౌండేషన్కు తన ఫౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎమ్మెల్యే కావడం జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా, పత్రికలు, యూట్యూబ్ చానళ్లలో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారికి లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు. మోసపోయిన గిరిజన యువతకు న్యాయం చేసేలా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. -
కౌలురైతు బలవన్మరణం
కుంటాల: కుంటాలకు చెందిన కౌలు రైతు రాజారాం గజేందర్ (49) అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శనివా రం తెల్లవారుజామున స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని పంట చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఏఎస్సై జీవన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గజేందర్ మూడేళ్లుగా 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. అయితే, ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. దీంతో పెట్టుబడి, కౌలు చెల్లింపు కోసం అప్పులు చేశాడు. వచ్చిన దిగుబడి అప్పులు, వడ్డీలకు సరిపోవడం లేదు. ఇప్పటికీ రూ.3.60 లక్షల అప్పు ఉంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదు. దీంతో మనస్తాపం చెందిన గజేందర్ అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గజేందర్ తండ్రి రాజారాం బక్కన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
పదేళ్లు సీఎంగా ఉంటాననడం విడ్డూరం
● బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్● కేతిని ఆశ్రమ పాఠశాల సందర్శనచింతలమానెపల్లి: రైతుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రిగా ఇంకా పదేళ్లు తానే ఉంటానని రేవంత్రెడ్డి ప్రకటించుకోవడం వి డ్డూరంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కేతిని గ్రామంలో శనివారం ఆయన ప ర్యటించారు. దిందా వాగులో ప్రమాదవశాత్తు సుమన్ మృతి చెందగా అతడి కుటుంబాన్ని ప రామర్శించారు. సుమన్ కుటుంబాన్ని కలెక్టర్ ఆ దుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. గిరిజన విద్యార్థుల కు భోజనంలో మటన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై విద్యాశాఖ మంత్రి సవతితల్లి ప్రేమ చూపించవద్దని సూ చించారు. కేతిని గ్రామ గిరిజనులకు తునికాకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పో డు రైతులకు యూరియాతో పాటు విత్తనాలు అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేకు గిరి జనుల సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. ఆయన వెంట నియోజకవర్గ కన్వీన ర్ లెండుగురె శ్యాంరావు, మండల కన్వీనర్ గోమాసె లహాంచు, నాయకులు నక్క మనోహర్, శ్రీనివాస్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్రూరల్: ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరే ట్ కార్యాలయంలో సార్వత్రిక విద్యాపీఠం స మన్వయకర్తలు అశోక్, మధు, జిల్లా పరీక్షల నిర్వహణాధికారి ఉదయ్బాబుతో కలిసి ఓపె న్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసినవారు ఓపెన్ విద్యావిధానాన్ని సద్వి నియో గం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 20 సెంటర్లున్నాయని తెలిపారు. అసక్తిగలవారు ఈ నెల 31వరకు మీ సేవలో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్లు పొందాలని సూచించారు. -
ఉత్పత్తికి అంతరాయం కలగనీయొద్దు
రెబ్బెన: వర్షాలు కురిస్తే బొగ్గు ఉత్పత్తికి అంతరా యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే వెంకటేశ్వర్లు సూచించారు. బెల్లంపల్లి ఏరియాలో శనివా రం ఆయన పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్రెడ్డితో కలిసి అన్ని విభాగాల అ ధిపతులతో సమావేశమై గోలేటి ఓసీపీ పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఖైరిగూడ ఓసీపీని సందర్శించారు. వ్యూపాయింట్ నుంచి పని స్థలాల ను పరిశీలించారు. బొగ్గు నిల్వలు, వర్షాకాలంలో తీ సుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈస్ట్ వ్యూ పాయింట్ సమీపంలో మొక్కలు నాటారు. వట్టివాగుపై నిర్మిస్తున్న రక్షణ కట్ట పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు నా ణ్యతతో త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి డిస్పెన్సరీని సందర్శించారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, మందుల నిల్వల వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవా లని సూచించారు. సీజనల్ వ్యాధులపై ఉద్యోగుల కు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం నర్సరీని పరిశీలించి పెంచుతున్న మొక్కల రకాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమీప గ్రామాల ప్రజలకు మొక్కలు పంపిణీ చేయాలని అ ధికారులకు సూచించారు. ఖైరిగూడ పీవో నరేంద ర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, డీజీఎం సివిల్ మదీనా భాషా, ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, మురళి, జూని యర్ ఫారెస్ట్ అధికారి సుష్మ తదితరులున్నారు. వెంటనే ప్రమోషన్లు కల్పించాలిపెండింగ్లో ఉన్న ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్లను వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల గ్రేడ్ ప్రమోషన్లు ‘డీ’ నుంచి ‘సీ’ కి, ‘సీ’ నుంచి ‘బీ’కి, ‘బీ’ నుంచి ‘ఏ’ గ్రేడ్ అర్హత సాధించిన ఆపరేటర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కో రారు. గ్రేడ్ ప్రమోషన్లను నిర్ణీత కాలప్రమాణంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బ్రాంచి ఉపాధ్యక్షుడు బ య్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు జూపాక రాజేశ్, మారం శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు గణేశ్, సంతోష్కుమార్, లక్ష్మీనారాయణ, రఘుపతి, రమేశ్, ఎండీ ఆజాం తదితరులున్నారు. -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల డీటీడీవో, ఏటీడీవోలు, ఏఎన్ఎంలను ఆదేశించారు. శనివారం కేబీ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. మోవా లడ్డూ, విటమిన్ ‘సి’ పాలిక్ యాసిడ్ వంటి మాత్రలను వారంలో రెండుసార్లు మధ్యాహ్న భోజనం తర్వాత ఇవ్వాలని సూచించారు. స్నానానికి వేడి నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ప్రతీరోజు విద్యార్థుల హిమోగ్లోబిన్ శాతం పరిశీలించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏడీఎంహెచ్వో కుడిమెత మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
సారంగపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు జౌళి గ్రామానికి చెందిన పోటెండ్ల భీమేశ్ (34) శుక్రవారం సాయంత్రం స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని బంధువులు శనివారం ఉదయం ప్రాజెక్టు పరిసరాల్లో గాలించగా మృతదేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతిచెంది ఉంటాడని బావించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి గతంలో వివాహమైనా విడాకులు కావడంతో ఒంటరిగానే ఉంటున్నాడని బంధువులు తెలిపారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాల్వాయి
కాగజ్నగర్ టౌన్: సిర్పూరు ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. కాజీపేట లో నిర్మిస్తున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన కోసం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు మంత్రితో కలిసి ఆ యన రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలు రైలు సమస్యలు మంత్రి దృష్టి కి తీసుకువెళ్లారు. కాగజ్నగర్లో వందేభార త్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని, శబరిమల కు వెళ్లే భక్తుల కోసం కేరళ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలు నడపాలని, కాగజ్నగర్ రైల్వేస్టేషన్ అమృత్ భారత్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర కీలకం
● ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్బాసర: భారత ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. శనివారం ఆర్జీయూకేటీలో విద్యార్థులకు స్టార్టప్, ఆంత్రప్రెన్యూర్షిప్ మార్గదర్శక విలువలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ప్రధానంగా ప్రారంభ దశ స్టార్టప్లలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టార్టప్లపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థిరత్వం, విస్తరణ ప్రాముఖ్యతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతి, నాగసాయి కుమార్, దిల్బహర్ అహ్మద్, చరణ్రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో ఒకరికి కత్తిపోట్లు
సోన్: స్థల వివాదంలో ఒకరిని కత్తితో పొడిచిన సంఘటన మండలంలోని న్యూబొప్పారంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వేముల శ్రీనావాస్ తన ప్లాటును అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తికి విక్రయించాడు. తనను కాదని ఎలా అమ్ముతావని వరుసకు మేనమామ అయిన కనికరం చిన్నయ్య అడిగే క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో చిన్నయ్య శ్రీనివాస్పై కారంపొడి చల్లి కత్తితో పొడిచాడు. శ్రీనివాస్ కోపంతో చిన్నయ్య తలపై కర్రతో కొట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. ఇద్దర్ని వేరువేరుగా అంబులెన్స్లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు. -
కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు వద్దు
వాంకిడి: టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు నిర్ణయం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం దినకర్, కొలాం సంఘం జిల్లా అ ధ్యక్షుడు ఆత్రం జలపతి డిమాండ్ చేశారు. జీవో 49కి నిరసనగా శనివారం మండలంలోని లింబు గూడలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. గిరి జనులు, గిరిజనేతర పేదలను ‘జల్.. జంగల్.. జమీన్’కు దూరం చేయాలనే కుట్రతోనే జీవో 49 తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు రేవంత్రెడ్డి సర్కార్ తలవంచి ఈ చట్టా న్ని తీసుకువచ్చినట్లు విమర్శించారు. ఈ చట్టం అ మలైతే జిల్లాలోని 339 గ్రామాలకు మనుగడ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంజేశారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని ప్రాంతం భారత రాజ్యాంగంలో ని ఐదో షెడ్యుల్లో ఉన్నందున జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ, స్థానిక గిరిజనుల అభిప్రాయాల సేకరణ, పెసా చట్టం అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా రా జ్యాంగ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని ఆ రోపించారు. పులులు, అడవుల సంరక్షణ పేరిట గ్రామాలను ఖాళీ చేయించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జాడి తిరుపతి, ఆత్రం దేవ్రావు, సీడం జైతు, ఆత్రం మారు, లక్ష్మణ్, భీంరావు పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన విశ్వప్రసాదరావు
ఆసిఫాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ జెండాలు మోసిన వారికి ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ భరోసా ఇచ్చిన ట్లు విశ్వప్రసాదరావు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు. -
ఏజెన్సీ బంద్కు సీపీఎం మద్దతు
కాగజ్నగర్ టౌన్: ఆదివాసీలకు ఉరితాడుగా మారి న జీవో 49ని రద్దు చేయాలని ఈనెల 21న ఆదివా సీ సంఘాలు తలపెట్టిన ఏజెన్సీ బంద్కు సీపీఎం జి ల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జి ల్లా కార్యదర్శి కూశన రాజన్న తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని అమలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కన్జర్వేషన్ కారిడార్ పేరిట జిల్లాలోని 339 గ్రామాల ఆదివాసీ ప్రజలు తమ గ్రామాలు, భూ ములకు దూరమయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. రా జ్యాంగంలోని 5వ షెడ్యూల్, 1/70 పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ 49 జీవోను తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలను తరలించి అడవి ని, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా టైగర్ జోన్ కారిడార్ ఏర్పాటు కు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. జీవో 49 రద్దుకు తలపెట్టిన ఏజెన్సీ బంద్కు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మద్దతు తె లిపి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముంజం ఆనంద్కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.సాయికృష్ణ, వీ సాయికృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరి గూడేలకు పండుగ శోభ
ఆకిపేన్.. ● ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల సౌరభం ● నాలుగు మాసాలు వివిధ పండుగలు ● అకాడితో ప్రారంభమై దీపావళితో ముగింపు ● కుల దేవతలకు ప్రత్యేక పూజలు ● ఆదివాసీ పల్లెల్లో కోలాహలం ‘శీత్ల’ పండుగ శీత్ల భవాని లంబాడీల దేవత. పశువుల ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం శీత్ల భవానికి పూజలు చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని వారి నమ్మకం. ఆషాఢమాసంలో ఒక మంగళవారం గ్రామ సరిహద్దులోని పొలిమేరలో ఉన్న కూడలి వద్ద శీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. మహిళలు, యువతులు నెత్తిన బోనం ఎత్తుకుని వస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలిచ్చి వాటిపైనుంచి పశువులను దాటిస్తారు. పశు సంపద వృద్ధి చెందాలని, పాడిపంటలు బాగా పండాలని, ఎలాంటి దుష్టశక్తులు దరి చేరకుండా ఉండాలని శీత్ల మాతను పూజిస్తారు. విజ్జపేన్..! పెర్సాపేన్, రాజుల్దేవత వద్దకు విత్తనాలను తీసుకెళ్లి పూజలు చేస్తారు. పంటలకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని పెర్సాపేన్కు మొక్కుతారు. అంతకు ముందు గ్రామంలో ఉన్న విత్తనాలను ఒక వద్దకు చేర్చి కుల దేవతలకు అందరు కలిసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కటోడా వాటిని అందరికీ అందిస్తారు. ఆ తర్వాతే పొలం పనులు ప్రారంభిస్తారు.అడవిలో ఆకులు చిగురించి పచ్చగా మా రుతున్న క్రమంలో ఆదివాసీలు ఆకిపేన్ కు పూజలు చేస్తారు. ఈ కాలంలో అడవికి వెళ్లిన మూగజీవాలకు రక్షణగా ఉండాలని, ఎలాంటి హాని తలపెట్టవద్దని, పంటలు అధికదిగుబడి సాధించాలని పూజలు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మణరేఖ లాంటి గీతను గీస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు అడవిలోకి పరుగెత్తాయి. కోడి, మేకలతో జాతకం చెబుతారు. ప్రతీ పండుగకు ప్రత్యేకత ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేకత ఉంది. అకాడి నుంచి ప్రారంభమైన పండుగలు నాలుగు మాసాలపాటు కొనసాగుతాయి. దీపావళికి గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఇప్పుడే కుల దేవతలకు మొక్కుకుంటారు. కార్యం నెరవేరాక దీక్ష చేపడతారు. పూజల తర్వాత ఏత్మాసార్ పేన్కు పూజలు చేస్తాం. వన భోజనం ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. – కుర్సెంగ దుందేరావు, ఆదివాసీ నాయకుడు, చౌపన్గూడ కెరమెరి(ఆసిఫాబాద్): మారుతున్న ఆధునిక కా లంలోనూ ఆదివాసీలు తమ ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. సమాజంలో ఎ న్నో మార్పులు వస్తున్నప్పటికీ ఆదివాసీలు నేటికీ పుడమితల్లిని పూజిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లోనూ.. తమకు మరెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు. వారి ఇళ్లల్లో జరిగే వివాహాల్లో వైవిధ్యం ఉంటుంది. నూతనత్వం కనిపిస్తుంది. పండుగల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే అకాడి పండుగతో ప్రారంభమయ్యే ఆదివాసీల పండుగలు, ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి. నాలుగు మాసాల పాటు ఆదివాసీ గూడేల్లో వివిధ రకాల పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు అకాడి పండుగలో జరిపే ఇతివృత్తంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. అకాడి.. ఆషాఢమాసంలో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. పాడిపంటలకు రక్షణ కల్పించే అడవిదేవతగా భావించే రాజుల్పేన్ను పూజిస్తారు. నెలవంక కనిపించగానే జిల్లాలోని ప్రతీ గ్రామంలో దీనిని నిర్వహిస్తారు. అకాడి పండగను కొందరు పౌర్ణమి వరకు నిర్వహిస్తే మరికొందరు అమావాస్య వరకు నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారమని ఆదివాసీ పెద్దలు, కటోడాలు పేర్కొంటున్నారు. -
అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారుద్దీన్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సార్పీ–1 గనిలో కోల్ఫిల్లర్గా విధులు నిర్వర్తిస్తున్న జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డుకు చెందిన బైరి రమేశ్ (36) తన స్నేహితుల వద్ద రూ.5 వడ్డీచొప్పున సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రతీనెల వడ్డీ మాత్రమే కడుతున్నాడు. అసలు ఎలా చెల్లించాలో తెలియక మనస్తాపానికి గురై ఈనెల 17న గడ్డిమందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు, విరేచనాలు చేసుకుని కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య శ్వేత, కుమారుడు ఉన్నారు. శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు శంకర్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన ఆడ విశ్వేశ్వర్రా వ్ (48) నాలుగేళ్లుగా మా నసిక స్థితి కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. శనివారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సీతాబాయి, కుమారులు యశ్వంత్రావ్, రాజేశ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఈశ్వర్నగర్ గ్రామానికి చెందిన అందుసింగ్ బైక్పై ఇంటికి వెళ్తుండగా ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అందించడంతో కారును అదుపులో తీసుకుని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్రగాయాలైన అందుసింగ్ను స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్సై రమేశ్ను సంప్రదించగా ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
‘21న బంద్ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. శనివారం మావల మండలంలోని కుమురంభీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1/70, పెసా చట్టాలు ఆదివాసీల అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్కు సహకరించాలని కోరారు. సమావేశంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలితా, ఆదిలాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వెడ్మ ముకుంద్, ఉపాధ్యక్షుడు తొడసం ప్రకాష్, కుమ్ర వినోద్, తదితరులు పాల్గొన్నారు. పశువులను తరలిస్తున్న రెండు వాహనాలు పట్టివేతబెజ్జూర్: అక్రమంగా పశువులు తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు ఎస్సై సర్దార్ పాషా తెలిపారు. శనివారం ఉదయం బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక్కో వాహనంలో ఐదు చొప్పున పశువులు ఉన్నాయని, పెంచికల్పేట్ నుంచి చేడ్వాయి వెళ్తున్నట్లు చెప్పారు. పశువైద్యాధికారి, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందం ఏర్పాటు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● పోగొట్టుకున్న 109 సెల్ఫోన్లు బాధితులకు అందజేత ఆదిలాబాద్టౌన్: బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.16 లక్షల విలువ గల 109 సెల్ఫోన్లను శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశం మందిరంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే https://www.ceir.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 900 సెల్ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల్లో ఎలాంటి చలాన్లు కట్టకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దొంగిలించిన ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, ప్రత్యేక బృందం సభ్యులు ఎస్సై పి.గోపీకృష్ణ, ఎస్.సంజీవ్, ఎంఎ.రియాజ్, మజీద్, తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్దగల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మూడో రోజు రసవత్తరంగా సాగాయి. శనివారం క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. అండర్ 19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ముఖ్యఅతి థిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, నిర్మల్ అర్బన్ ఎమ్మార్వో రాజు, మున్సిపల్ డీఈ హరిభూవన్, మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్ గౌడ్, నందకుమార్ పాల్గొన్నారు. -
కోడిగుడ్ల సరఫరాకు దరఖాస్తుల స్వీకరణ
ఆసిఫాబాద్: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్సియల్ పాఠశాలల కు అగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఈ నెల 21నుంచి టెండర్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోగల తన చాంబర్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆన్లైన్ టెండర్ల స్వీకరణపై అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 విద్యాసంవత్సరానికి 2,06,33,123 కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఆన్లైన్ ద్వారా టెండర్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21నుంచి ఆగస్టు 5సా యంత్రం 5గంటల వరకు బిడ్ డాక్యుమెంట్లను డౌ న్లోడ్ చేసుకుని ఆన్లైన్లో అందజేయాలని సూ చించారు. బిడ్ హార్డ్ కాపీలను ఆగస్టు 6 సాయంత్రం 5గంటల లోపు కలెక్టరేట్లోని ఎస్సీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని తె లిపారు. ఆగస్టు 7న ఉదయం 11.30గంటలకు ధర ల బిడ్ తెరవనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు ని బంధనల ప్రకారం అవసరమయ్యే ధ్రువపత్రాలను టెండర్లతో జతపరచాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
● ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో డిమాండ్ ● జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు ● 24క్లస్టర్లలో 3వేల మంది రైతుల ఎంపిక ● కొనసాగుతున్న మట్టి నమూనా పరీక్షలు
ఎన్ఎంఎన్ఎఫ్ పథకంతో ప్రోత్సాహం రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగంతో పెట్టుబడులు పెరగడంతో జిల్లా రైతాంగం సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్) పథకం వీరికి వ రంగా మారింది. రసాయన ఎరువుల వినియోగంతో సాగుభూములు నిర్జీవంగా మారుతున్నాయి. ప్రకృతికి, మానవాళికి తీవ్ర విఘాతం జరుగుతోంది. దీంతో రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో 24 క్లస్టర్ల గుర్తింపుజిల్లాలో 15 మండలాల్లో 24 క్లస్టర్లను అధికారులు ఎన్ఎంఎన్ఎఫ్ పథకానికి ఎంపిక చేశారు. ఒక్కో క్లస్టర్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కొక్కరు ఒక్కో ఎకరంలో సేంద్రియ విధానంలో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3వేల మంది రైతుల కు చెందిన 3వేల ఎకరాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేస్తున్నారు. ఏ పంట ఏ భూమికి అనుకూలమో వివరించనున్నారు. మొద టి విడతలో పంటకు సరిపడా వేప పిండి, నూనె ఉచితంగా అందిస్తారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు మార్కెట్లో ఉండే డిమాండ్ను వివరించి రైతులను చైతన్య పరుస్తున్నారు. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఎంపికై న గ్రామాలివే..మండలం గ్రామాలు ఆసిఫాబాద్ వావుదం, మొవాడ్ వావుదం కాగజ్నగర్ మాలిని దహెగాం చిన్నరాస్పల్లి తిర్యాణి గిన్నెధరి, మాణిక్యాపూర్ వాంకిడి సోనాపూర్, సోనాపూర్ సవాతి రెబ్బెన తక్కలపల్లి కౌటాల గుండాయిపేట్ పెంచికల్పేట్ కమ్మర్గాం, నందిగాం, కమ్మర్గాం బెజ్జూర్ కుకుడ, సోమిని చింతలమానెపల్లి చింతలమానెపల్లి జైనూర్ జైనూర్ సిర్పూర్(యూ) పంగిడి, సిర్పూర్(యూ) కెరమెరి కరంజివాడ, కెరమెరి, సుర్దాపూర్, సాంగ్వీ లింగాపూర్ లింగాపూర్రసాయనాలను తగ్గించడమే లక్ష్యం రసాయన ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఎన్ఎంఎన్ఎఫ్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. సేంద్రియ విధానంలో సాగు చేసిన పంటలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. జిల్లాలో ఎంపికై న గ్రామాల్లో రైతుల భూముల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తున్నాం. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసేలా వారికి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ సంస్థ వారు పథకం అమలు తీరును పరిశీలిస్తున్నారు. సేంద్రియ సాగుకు ఎంపికైన రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. భవిష్యత్లో జిల్లాలో సేంద్రియ సాగు మరింత పెరిగే అవకాశముంది. – శ్రీనివాస్రావు, జిల్లా వ్యవసాయాధికారి -
పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల పురోగతి వివరాలను పోర్టల్లో న మోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి మిషన్ భగీర థ, వ్యవసాయ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, విద్యుత్, హౌజింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో 2023– 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్లో నమోదు చేసే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో సాగు విస్తీర్ణం, పంటల వివరాలు, పశువులకు అందుబాటులో ఉన్న పశుగ్రాసం, బ్యాంకు సేవలు, బ్యాంకు మిత్ర, నగదు డిపాజిట్, ఉపసంహరణ సేవలు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ని ర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతోపాటు ఇతర వివరాలు నమోదు చేయాలని ఆదేశించా రు. తెల్ల రేషన్కార్డులు కలిగిన కుటుంబాల సంఖ్య, కబ్జా నివాస గృహాల వివరాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరిగిన ఘటనల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల సంఖ్య, అందుబాటులో ఉన్న నర్సరీలు, సామాజిక పింఛన్ల వివరాలు ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సమాచారం క్లుప్తంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నరకయాతన
ప్రసవ వేదన.. ‘వర్షాలకు మా గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామానికి అంబులెన్స్ రాదు. ఉట్నూర్లో స్కానింగ్ సెంటర్ ఉన్నా అక్కడ స్కానింగ్ చేయడం లేదు. స్కానింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్నానికి వెళ్తున్నాం. రానుపోను నాలుగు గంటల సమయం పడుతుండగా, ఆస్పత్రిలో మూడు గంటలపాటు నిరీక్షించాలి. తిరిగి ఇంటికి రావాలంటే రాత్రి అవుతుంది..’ అని లింగాపూర్ మండలం పట్కాల్ మంగి గ్రామానికి చెందిన గర్భిణి రాథోడ్ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. దహెగాం మండలంలోని మరుమూల గిరిజన గ్రామమైన లోహకు చెందిన సిడాం రామయ్య, చిన్నక్క దంపతుల కుమార్తె పుష్పలత గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. లోహకు వెళ్లేదారి బురదమయంగా ఉండటంతో గ్రామం వరకు అంబులెన్స్ రాలేకపోయింది. కుటుంబ సభ్యులు నెలలు నిండిన పుష్పలతను ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎడ్లబండిలో తరలించాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత కూడా అంబులెన్స్ సిబ్బంది వారిని గ్రామం వరకు తీసుకెళ్లలేకపోయారు. మళ్లీ మూడు కిలోమీటర్లు ఎడ్లబండిలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు.● జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్ గ్రామాలు ● రాకపోకలకు వాగులు, ఒర్రెలు అడ్డంకి.. బురదమయంగా రోడ్లు ● అంబులెన్స్లు వెళ్లడం కష్టమే.. ● స్కానింగ్, ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణులు ఆసిఫాబాద్: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణులు పరిస్థితి దుర్భరంగా మారింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగడంతోపాటు మట్టిరోడ్లు బురదమయంగా మారుతుండటంతో అంబులెన్స్లు, 108, 102 వాహనాలు వెళ్లడం లేదు. ఫలితంగా ఏజెన్సీ గ్రామాల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి రావడానికి పడరానిపాట్లు పడుతున్నారు. 2,930 మంది గర్భిణులుజిల్లాలో 20 పీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీలు, ఐదు సీఎస్సీలు ఉన్నాయి. వీటిలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 27 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 2,930 మంది గర్భిణులు ఉండగా, వీరిలో తొమ్మిది నెలలు నిండిన 636 మంది ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 1,699 ప్రసవాలు జరిగాయి. జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్ గ్రామాలను అధికారులు గుర్తించారు. లింగాపూర్, సిర్పూర్– యూ, జైనూర్, దహెగాంతోపాటు ప్రతీ మండలంలో రహదారి సౌకర్యం లేని పల్లెలు ఉన్నాయి. ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణులను తరలించి, వైద్యాధికారి పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది. అధ్వానంగా గ్రామీణ రహదారులుజిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణ రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పక్కారోడ్లు లేకపోవడంతో వర్షాలకు బురదమయంగా మారుతున్నాయి. కల్వర్టులు, వంతెనలు లేకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లడం గర్భిణులకు కష్టంగా మారుతోంది. చాలా గ్రామాలకు కనీసం 108, 102 అంబులెన్స్లు కూడా వెళ్లడం లేదు. గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో ఎడ్లబండ్లలో ఆస్పత్రికి వెళ్తున్నారు. 15 మండలాలకు 108 సర్వీసులు 15 ఉండగా, 102 సర్వీసులు 15 ఉన్నాయి. పలు సందర్భాల్లో వైద్యచికిత్స కోసం రోగులను గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా తరచూ మంచిర్యాల, ఆదిలాబాద్కు రెఫర్ చేస్తున్నారు. ఇలా ప్రతీరోజు 4 వాహనాలు రెఫర్కే వెళ్తున్నారు. నెలకు సుమారు 500 కేసులు రెఫర్ చేస్తున్నారు. 108, 102 వాహనాలు మంచిర్యాల, ఆదిలాబాద్ వెళ్లి రావడానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతుండటంతో ఇతరులకు అత్యవసర సేవలకు వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు సిబ్బంది నుంచి సరైన స్పందన ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.రెండు స్కానింగ్ కేంద్రాలు జిల్లాలో రెండు స్కానింగ్ కేంద్రాలు గర్భిణులకు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కాగజ్నగర్ ఆస్పత్రిలో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఆరు నెలులుగా రేడియాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేటులో స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏజెన్సీ మండలాల ప్రజలు ఆదిలాబాద్లోని రిమ్స్కు వెళ్తున్నారు. ఇక కాగజ్నగర్ కేంద్రంలో వారానికి ఒకరోజు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుపేద మహిళలు ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో స్కానింగ్ టెస్టుకు రూ.1000 చెల్లించాల్సి రావడంతో పేదలకు భారంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏళ్లుగా గైనకాలజిస్టు లేకపోవడంతో కేవలం నార్మల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు అవసరమైతే మంచిర్యాల, కాగజ్నగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.రహదారుల సమస్య ఉంది మారుమూల రహదారి సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్సీకి, లేదా వారి బంధువుల ఇళ్లకు తరలిస్తున్నాం. జిల్లాలో రహదారుల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్టు, గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – సీతారాం, డీఎంహెచ్వో -
శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని డీఈవో యాద య్య అన్నారు. పీఎంశ్రీ అటల్ టింకరింగ్ ల్యాబ్ల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేష న్ మిషన్ సహకారంతో రూ.20లక్షలతో ని ర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్లు వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక రంగాలపై అవగాహన క ల్పించడం, ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆధునిక ఆవిష్కర్తలుగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, రిసోర్స్పర్సన్లు అమీర్, శివకృష్ణ, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ
ఆసిఫాబాద్: ఇక నుంచి ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ డీలర్ శిక్షణ తరగతులకు హాజరై విషయ పరిజ్ఞానం పొందాలని సూచించారు. నానో యూరియా వినియోగంపై శిక్షణజిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమి టెడ్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికా రులు, ఏఈవోలకు నానో యూరియా, డీఏ పీ వాడకంపై ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. సీనియర్ అగ్రనమిస్ట్ సుధాకర్రెడ్డి, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటె డ్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ యూరి యా, డీఏపీ వాడే విధానం, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. డీఏవో శ్రీనివాసరావు, కోరమాండల్ సేల్స్ ఆఫీసర్ శ్రావణ్, ఏడీలు మిలింద్కుమార్, వెంకటి, మనోహర్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
చింతలమానెపల్లి(సిర్పూర్): ప్రజల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్మే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ, చింతలమానెపల్లి, ఖర్జెల్లి, దిందా, గూ డెం, కేతిని గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. బాలాజీఅనుకోడ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్లో నూతన విద్యుత్లైన్ పనులు ప్రారంభించారు. అనంతరం ఖర్జెల్లి– గూడెం రహదారిని పరిశీలించారు. రహదారి మరమ్మతులకు రూ.కోటి 50లక్షలు మంజూరయ్యాని తెలిపారు. మట్టి మొ రంతో మరమ్మతులు చేపట్టొద్దని, కంకర వినియోగించాలని డీఈ లక్ష్మీనారాయణకు సూచించారు. దిందా వంతెన పరిశీలించి.. హైలెవల్ వంతెన ని ర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం పోడురైతులతో సమావేశమయ్యారు. భూముల వి షయంలో పోడు రైతులు సరైన ఒప్పందానికి రావా లని సూచించారు. గూడెం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. హెల్త్ సబ్సెంటర్ అద్దెభవనంలో ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆ యన దృష్టికి తీసుకెళ్లారు. గూడెం, సమీప గ్రామాల కు ఉపయోగపడేలా పీహెచ్సీ మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు. గూడెం ఉన్నత పాఠశాలలో 9, 10 వతరగతులు అప్గ్రేడ్ చేయాలని డీఈవోతో ఫోన్లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న గూడెం మాజీ సర్పంచ్ పూల్చంద్ జైశ్వాల్ను పరామర్శించారు. చింతలమానెపల్లిలో పలువురు పార్టీలో చేరగా.. కండువా కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్గౌడ్, చింతలమానెపల్లి, కౌటాల మండలాల అధ్యక్షులు డోకె రామన్న, కుంచాల విజయ్, నాయకులు మల్లయ్య, చౌదరి నానయ్య, తుకారాం, సుధాకర్, చౌదరి రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
‘రోడ్డు వేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని జాముల్ధార గ్రామం నుంచి కీమానాయక్ తండా, పంగిడిమాదర గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని శుక్రవారం మూడు పంచాయతీల ప్రజలు కీమానాయక్ తండా రోడ్డుపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మూడు పంచాయతీల పరిధిలో 20కి పైగా అనుబంధ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు అధ్వానంగా మారిందని, బురదతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామన్నారు. అంబులెన్స్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. -
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
● జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు ● ఎన్నికల విధుల్లో 7,045 మంది సిబ్బంది ● ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ నివేదిక సాక్షి, ఆసిఫాబాద్: స్థానిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం జిల్లాలోని 15 మండలాల్లో గల 335 గ్రామ పంచాయతీలకు గాను 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలను బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అధికారులు సైతం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2019లో జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడత శిక్షణ పూర్తి..పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులు ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధి కారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆ వివరాలను ‘తెలంగాణ పోల్’లో నమోదు చేశారు. ఇటీవల బదిలీలు, నూతన నియామకాలు, పదవీ విరమణలు జరిగాయి. దీని దృష్ట్యా జాబితాను మళ్లీ పరిశీలించి, సవరణలు చేసి పంపేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. పంచాయతీ, వార్డుల వారీగా సిబ్బంది..జిల్లాలో పంచాయతీ, వార్డుల వారీగా ఎన్నికల సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కొద్దినెలల కిందటే పది శాతం రిజర్వు సిబ్బందితో కలుపుకొని మొత్తం 7,045 మందిని విధులకు ఎంపిక చేశారు. విధుల్లో పాల్గొనే వారిలో పీవోలు 3,161, ఓపీవోలు 3,515, స్టేజ్–2 ఆర్వోలు 369 మంది ఉన్నారు. 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, ఓపీవోను నియమిస్తారు. అంతకంటే ఎక్కువ మంది ఓటర్లుంటే అదనంగా ఓపీవోలను పెంచుతారు. 650 కంటే ఎక్కువ మంది ఓటర్లుంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు 2,565, 200 నుంచి 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 295, నాలుగు వందల నుంచి 650 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 14 ఉన్నాయి. మొత్తంగా 2,874 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బీసీలకు 53 ఎంపీటీసీలు..!బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి కొత్త రిజర్వేషన్లు వర్తిస్తే జిల్లాలోని మొత్తం 127 ఎంపీటీసీ సభ్యుల స్థానాల్లో 53 బీసీలకు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. మండలాన్ని యూనిట్గా తీసుకుని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. తొలుత ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సమాయత్తంఅవుతోంది. కసరత్తు మళ్లీ షురూ..గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాను పునఃపరిశీలించి పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశించడంతో జిల్లా అధికారులు వివరాల సేకరణపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జిల్లాలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, జైనూర్లో 26, కెరమెరిలో 31, లింగాపూర్లో 14, రెబ్బెనలో 24, సిర్పూర్(యూ)లో 15, తిర్యాణిలో 29 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతలో వాంకిడి మండలంలోని 28, కాగజ్నగర్ నియోజకవర్గంలోని బెజ్జూర్లో 22, చింతలమానెపల్లిలో 19, దహెగాంలో 24, కాగజ్నగర్ రూరల్లో 28, కౌటాలలో 20, పెంచికల్పేట్లో 12, సిర్పూర్(టి)లో 16 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
రోడ్డు వేయాలని విద్యార్థుల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం జీడిచేను నుంచి భట్టుపల్లి వరకు రోడ్డు వేయాలని కాగజ్నగర్– దహెగాం ప్రధాన రహదారిపై భట్టుపల్లి వద్ద శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జీడిచేను గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నామన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వర్షాకాలంలో నడవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో ప్రత్యేక నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు. -
జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా మారి 17 నెలలు గడుస్తున్నా కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనా లు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమ్మెకు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ బాధ్య త వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మాట్ల రాజయ్య, కార్యదర్శులు తోట సమ్మయ్య, నాయకులు బాలేశ్, ప్రభాకర్, శంకర్, ఇస్తారి, లక్ష్మి, బాలయ్య, పద్మ, శ్యామల, మల్లేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారలోపం గుర్తింపునకు సర్వే
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్త సర్వే చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల తన చాంబర్లో డీఎంహెచ్వో సీతారాం, యూనిసెఫ్ ప్రతినిధులతో జిల్లాలో పోషకాహార లోపం కలిగిన పిల్లల నిష్పత్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్ల లకు సకాలంలో సరైన ఆహారం, మందులు అందించి పోషకాహార లోపాన్ని నియంత్రించాలన్నారు. యూనిసెఫ్ బృందం సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఖ్యాతి తివారి, న్యూట్రిషియన్ ఆఫీసర్ రేష, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతులు కల్పించాలికాగజ్నగర్టౌన్: నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించి, లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బోరిగాం శివారులో 12 బ్లాక్ల్లో 228 డబుల్ బెడ్రూంలు నిర్మించామన్నారు. విద్యుత్, తాగునీరు, కిటికీలు, తలుపులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు, పెయిటింగ్ తదితర పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ హౌజింగ్ పీడీ వేణుగోపాల్, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంచు జాగా వదిలిపెట్టం’
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాలు విలీనం చేసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, ఇంచు జాగా కూడా వదిలిపెట్టమని కెరమెరి మండల బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. సుప్రీం కోర్టులో సరిహద్దు గ్రామాలపై కేసు కొనసాగుతుండగా మహారాష్ట్ర సీఎం, రెవెన్యూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, పార్టీ మండల అధ్యక్షుడు అంబాజీ, నాయకులు యూనుస్, రూప్లాల్, రాజయ్య, జగన్నాథ్రావు, జాహెద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద ఉన్న నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించగా.. శుక్రవారం నుంచి ఈ నెల 20వరకు ప్రధాన పోటీలు కొనసాగుతాయి. అండర్–19 బాలురు, బాలికలు, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్, వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేష్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం మెయిన్ డ్రా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
గిరిజన విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత
ఉట్నూర్రూరల్: కెరమెరి మండలంలోని నిషాని గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఆత్రం వంశీకృష్ణ పైచదువుల నిమిత్తం గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన కార్యాలయంలో ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్లో అపజయాలు ఉండవని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మానం కళామందిర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల సేవారత్న పురస్కారం అందుకున్న కాథ్లే మారుతిని గురువా రం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సన్మానించారు. ఆ దిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మారుతి ఎంతోమంది గిరిజన విద్యార్థులకు వి లువిద్యలో శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫౌండేషన్ తరపున అతనికి రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
‘ఉమ్మడి జిల్లా బంద్కు సహకరించాలి’
ఆదిలాబాద్: జీవో 49 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 21న చేపట్టనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు సహకరించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదులు, గ్రామ పటేళ్లు, రాయి సెంటర్ సార్మేడీలు, ఆదివాసీ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ బొజ్జు, ముకుందరావు, పీ. నాగోరావు, గెడం ఆనందరావు, దుర్వ జుగాథిరా వు, ఆత్రం మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చోడలో దొంగల బీభత్సం
● ఒకేరోజు మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండి, నగదు అపహరణఇచ్చోడ: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన జాదవ్ దేవిదాస్ మూడు రోజుల కిత్రం ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి సొనాల మండలంలోని ఘన్పూర్కు వెళ్లారు. తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చొరబడి తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. విద్యానగర్ కాలనీలోని రమేశ్ ఇంట్లో చొరబడి 4 గ్రాముల బంగారంతో పాటు నగదు అపహరించారు. అదేకాలనీలో ఉన్న చిక్రం జంగు ఇంట్లో తులం బంగారం, ఐదు తులాల వెండి దొంగిలించారు. సంతోషిమాత ఆలయం వద్ద పార్క్ చేసిన పల్సర్ 220 బైక్ను తీసుకెళ్లి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వదిలేసి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ బృందాలను రప్పించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
రుచికరమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఆశ్రమ పాఠశాలల వంట సిబ్బందికి గురువారం ఒకరోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడు తూ వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. నిర్ణీత సమయంలో విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కాలం చెల్లిన సామగ్రిని వంటకు విని యోగించొద్దని, వర్షాకాలం దృష్ట్యా నిత్యం ఆహార పదార్థాలను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
● జీవో 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల పిలుపుకాగజ్నగర్రూరల్: ఆదివాసీలు, ప్రజలను గ్రామా ల నుంచి దూరం చేసే జీవో నంబర్ 49 రద్దుకు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని జీవో నం. 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన నాయకులు లాల్కుమార్, సోయం చిన్నయ్య, ఎండీ చాంద్పాషా మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు భద్రత లేదన్నారు. పశువులను మేపడానికి అడవుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని, వంట చెరుకు కోసం వెళ్లనీయడం లేదని ఆరోపించారు. పులుల సంరక్షణ పేరుతో ప్రజల జీ వనాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మెజారీటి ప్రజల ఆమోదం లేనందున జీవో 49 రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ నె 21న చేపట్టే బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, భారత్ బచావో ఆందోళన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఇన్నయ్య, బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొండయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయదేవ్ అబ్రహంతోపాటు ప్రజా, ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
108లో సుఖప్రసవం
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం గ్రామానికి చెందిన గర్భిణి రెడ్డి లవలోకకు పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అర్జన్న 108కి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అంబులెన్సులో కోటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో పంగిడిసోమారం అటవీప్రాంతంలోనే సుఖప్రసవం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇరువురిని కోటపల్లి పీహెచ్సీకి తరలించారు. కార్యక్రమంలో ఈఎంటీ షబనాజ్, ఫైలట్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
కెరమెరి(ఆసిఫాబాద్): ఉన్నత లక్ష్యాలు సా ధించేందుకు విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణ లో గురువారం మండలస్థాయి వాలీబాల్ టో ర్నమెంట్ను ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరో గ్యవంతమైన జీవన శైలిని పాటించాలని సూ చించారు. గంజాయి మొక్కలు పెంచడం, సరఫరా చేయడం, విక్రయించడం చట్ట విరుద్ధమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల ని ర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం పంచఫులా తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ఆర్టీఐకి అడ్డంకులు
● సమాచార అధికారుల నియామకంలో జాప్యం ● నిలిచిన దరఖాస్తుల స్వీకరణ శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్టీఐ దరఖాస్తులకు అడ్డంకి ఏర్పడింది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో అధికారులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్–2005) దరఖాస్తులు స్వీకరించడం లేదు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమాచారం కోరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా పరిధిలో ఈ చట్టం కింద దరఖాస్తులు స్వీకరించాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అఫీసర్ (ఏపీఐవో) లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పీఐవో గా బాధ్యతలు స్వీకరించిన ఓ డీజీఎం అధికారి ఏ ప్రిల్ 15న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆతర్వాత ఏపీఐవోగా బాధ్యతలు నిర్వహించిన అధికా రి కూడా గత నెల ఇక్కడి నుంచి ఇతర ఏరియాకు బదిలీ అయ్యాడు. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ రెండు సీట్లు ఖాళీగానే ఉంటున్నా యి. పీఐవో బాధ్యతలు నిర్వహించే అధికారి మృతి చెందిన తరువాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించే వరకు ఏపీఐవోకు ఇన్చార్జి పీఐవో బాధ్యతలు అప్పగించడానికి అనుమతి కోరుతూ ఏరియా అధికారులు కార్పొరేట్ అధికారులకు లేఖ రాశారు. వారు ఆలస్యంగా స్పందించడంతో ఆలోపే సదరు ఏపీఐవో అధికారి కూడా ఇక్కడి నుంచి వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. దీంతో ఈ రెండు బాధ్యతలను చూసేవారు కరువయ్యారు. వెనుదిరిగి పోతున్న దరఖాస్తుదారులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకో వడానికి జీఎం కార్యాలయానికి వచ్చిన కార్మికులు, సమాచార చట్టం కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు అక్కడ అధికారులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఆ స్థానాల్లో అధికారులు వచ్చేంత వరకు తమకు ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారం లేదని ఇతర అధి కారులు వారికి చెప్పి తిప్పి పంపిస్తున్నారు. దీనికి తోడు ఇది వరకే పీఐవోకు దరఖాస్తు చేసుకున్నాక సరైన సమాచారం, స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అఽధికారిగా ఉన్న ఏరియా జీఎంకు దరఖాస్తులు చేసుకున్న వారూ ఉన్నారు. ఆ దరఖాస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీఐవో వద్ద సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పీఐవో లేకపోవడంతో అప్పిలేట్ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోకుండా మరుగునపడ్డాయి. కార్పొరే ట్ అధికారుల జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. చట్టబద్ధత గల ఇలాంటి పోస్టుల భర్తీలో జాప్యం చేయడం సరికాదని, ఇలా చట్టాలను నీరుగార్చుతున్నారని దరఖాస్తు దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్కు లేఖ రాశాం.. పీఐవో, ఏపీఐవో పోస్టులు భర్తీ చేయడం కోసం కార్పొరేట్ అధికారులకు లేఖ రాశాం. కార్పొరేట్ అధికారుల ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరుగుతాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజుసింగ్ మోహన్సింగ్, సేవక్ సింగ్ రఘుబీర్సింగ్, సుర్దిప్ సింగ్ ముగ్గురు బంధువులు. నిర్మల్ జిల్లాలో కూలి పనులు చేసేవారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న రాత్రి బైక్పై లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ చేరుకుని పెట్రోల్ బంక్ సమీపంలోని ఇంటి ముందున్న బైక్ను దొంగలించారు. అనంతరం ఓ గోల్డ్షాప్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. అదే రాత్రి ఉమ్రికి వెళ్తూ మార్గమధ్యలో కుంటాల మండలం కల్లూరు బస్టాండు సమీపంలో రెండు దుకాణాల తాళాలు పగులగొట్టి రూ.2,500ల నగదు అపహరించారు. గురువారం నిర్మల్లో బంగారం విక్రయించడానికి వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2,500 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు వెండి ఆభరణాలను ‘నిర్మల్ పోలీస్’ అని అందంగా అలంకరించి, తప్పించుకోలేరని ఒక మెసేజ్ ఇచ్చారు. కేసును ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, పీసీఆర్ ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
చెరువులో పడి బాలుడు మృతి
దిలావర్పూర్: ప్రమాదవశా త్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెంది న కొప్పుల అశ్విత్ (15) బుధవారం సాయంత్రం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని కుడి చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాల కోసం వెళ్లి చెరువులో జారిపడి మృతి చెందినట్లు అశ్విత్ తల్లి కొప్పుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరి మృతిభైంసాటౌన్: పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్పాడ్కు చెందిన సిద్దివార్ రమణ (45) పట్టణంలోని కోర్వగల్లిలో నివాసముంటున్నాడు. కుమారుడు రాజుతో కలిసి ఉదయం స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్లో కిడ్నాప్ కలకలంనిర్మల్టౌన్: నిర్మల్లో బాలుడి కిడ్నాప్కు యత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలం అనంతపేట్కు చెందిన ఐదేళ్ల బాలుడికి తండ్రి కిరాణా కొట్టువద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే గ్రామానికి వెంట్రుకలు కొనుగోలు చేయడానికి ఆటోలో వచ్చిన ఆరుగురు మహిళలు బాలున్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. బాలుడు ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు అనుమానంతో బంగల్ పేట్ మహాలక్ష్మి వద్ద ఉన్న తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఆ మహిళలు మహాలక్ష్మి కాలనీకి కొద్ది దూరంలో బాలుడిని దించి వెళ్తుండగా పట్టుకుని నిలదీశారు. తమకేం తెలియదని బుకాయించడంతో వారిపై దాడి చేశారు. అనంతరం మహిళలను పోలీసులకు అప్పగించారు. పిచ్చికుక్క స్వైరవిహారంవేమనపల్లి: మండలంలోని జక్కెపల్లిలో గురువారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఏడుగురిపై దాడి చేసి గాయపర్చింది. అల్లాడి అనసూర్య ఎడమచేయి మణికట్టు వద్ద, ఆలం సాంబయ్య కాళ్లకు, చెన్నూరి బక్కు తల వద్ద, శనిగారపు పోశం కాళ్లకు, తలండి శ్రీనివాస్ చేతులను కొరికింది. చెన్నూరి శేఖర్పై పడి కొరికేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టి చంపాడు. జిల్లెడలో కూడా మరో నలుగురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆటో సాయంతో వేమనపల్లి పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కుక్క దాడిలో ఇరువురికి గాయాలుకాగజ్నగర్టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాపువాడకు చెందిన కర్ల కళావతిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరి మేయడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే స్టేషన్కు వెళ్లే మరో ప్రయాణికునిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద ఉందని ‘సాక్షి’ బుధవారమే కథనాన్ని ప్రచురించింది. అయినా అధికా రులు స్పందించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కుక్కల బెడదను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
హౌరా పట్టాలెక్కేనా..?
● కలకత్తాకు బెంగాళీలు, వ్యాపారుల రాకపోకలు ● కాగజ్నగర్ మీదుగా ఎక్స్ప్రెస్ రైలు నడపాలని విన్నపం ● ప్రతిపాదనలకే పరిమితమైన వైనం కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్ మీదుగా పశ్చిమ బెంగాల్కు హౌరా ఎక్స్ప్రెస్ నడిపించాలనే కల నెరవేరడం లేదు. కా జీపేట్ నుంచి కాగజ్నగర్ మీదుగా మహానగరమై న కలకత్తాకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. రైల్వే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పిస్తున్నా బుట్టదాఖలే అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని బసంత్నగర్, రామకృష్ణాపూర్, నజ్రూల్నగర్, రవీంద్రనగర్, సిర్పూర్(టి) తోపాటు మహారాష్ట్రలోని బల్లార్షా తదితర ప్రాంతాల్లో బెంగాళీలు అధిక సంఖ్యలో స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా నిత్యం వ్యాపార నిమిత్తం కలకత్తాకు తరచూ వెళ్తుంటారు. వ్యాపార నిమిత్తం పారిశ్రామిక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్ ప్రధాన రాజధాని కలకత్తాకు వాణిజ్య అవసరాల కోసం ఎంతోమంది రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో దుస్తులు, తదితర వస్తువుల తయారీ కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీరి సౌకర్యార్థం రైలు లేకపోవడంతో వీరంతా కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వరంగల్, విజయవాడ మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అదే కాజీపేట నుంచి కాగజ్నగర్ మీదుగా వెళ్తే తక్కువ దూరంతోపాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయి. గతంలో కాగజ్నగర్ నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక బోగీ ఉండేది. అది కాజీపేట వరకు వెళ్లి అక్కడి నుంచి లింక్ ఎక్స్ప్రెస్కు కలుపుకుని వయా వరంగల్ మీదుగా ఒక బోగీ హౌరాకు వెళ్లేది. కానీ కొన్ని కారణాలతో దానిని రద్దు చేశారు. ప్రయాణ ప్రయాస..ప్రయాణికులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే కలకత్తా వరకు సుమారు రెండు వేల కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి. వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సికింద్రాబాద్ లేదా, కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాలి. ఫలక్నూమ ఎక్స్ప్రెస్(12704), ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18045), వయా నల్గొండ, సికింద్రాబాద్ – షాలీమార్(కోల్కత్తా) వీక్లి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(22850), వయా వరంగల్ మీదుగా వెళ్తున్నాయి. హౌరా రైలు ప్రారంభమైతే బసంత్నగర్, కాగజ్నగర్లోని బెంగాళీ క్యాంప్, బల్లార్షాలోని బెంగాళీ క్యాంప్లలో సుమారు 52వేల మంది బెంగాళీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.కాగజ్నగర్ రైల్వేస్టేషన్కేంద్ర మంత్రులు సహకరిస్తేనే..కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు రైలు నడిపించేందుకు కేంద్ర మంత్రులు సహకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు, ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కలకత్తాకు రైలు నడపాలని పలుమార్లు ప్రతిపాదనలు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసినప్పటికీ రైల్వే అధికారులు స్పందించకపోవడంతో ఈ మార్గం గుండా రైలు నడిపిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
దొంగల బెడద
● బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు ● తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా రెచ్చిపోతున్న వైనం ● పోలీసులకు సవాల్గా మారుతున్న ఘటనలు కౌటాల(సిర్పూర్): చోరీలు జిల్లా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆలయాలు, ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పగలు రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తూ రాత్రిపూట తాళాలు పగులగొట్టి సొత్తు ఎత్తుకెళ్తున్నారు. మహారాష్ట్రకు జంప్..!జిల్లాలోని సగం మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. అలాగే కాగజ్నగర్, రెబ్బెన, సిర్పూర్(టి)లో రైల్వేస్టేషన్లతోపాటు రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. దీంతో పొరుగురాష్ట్రం నుంచి వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చింతలమానెపల్లి, కౌటాలలో మంగళవారం జరిగిన దొంగతనంలోనూ మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక నేరస్తులు చోరీలకు పాల్పడినా.. సరిహద్దు దాటి వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇటీవలి ఘటనలు కౌటాల మండల కేంద్రంలోని సదాశివపేట కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంట్లో ఈ నెల 15 న రాత్రి దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కరీంనగర్ వెళ్లిన ఆయన.. తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు గోడ దూకి పరారయ్యారు. ఈ ఘటనలో రూ. 7వేలు ఎత్తుకెళ్లారు. చింతలమానెపల్లి మండలం డబ్బా ఎక్స్రోడ్డులోని మహేశ్గౌడ్ ఫర్టిలైజర్ షాపులో ఈ నెల 15న రాత్రి దొంగలు పడి రూ.50 వేల వరకు నగదు దోచుకెళ్లారు. షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మే 30న కాగజ్నగర్ ఓల్డ్ కాలనీలో దొంగలు పడి నగదు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్ పట్టణంలో రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన నాలుగు లారీల బ్యా టరీలను జూన్ 18న రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న త్రినేత్ర శివాలయంలో జూన్ 10 న రాత్రి గుర్తుతెలియని చొరబడ్డారు. గ ర్భగుడి తాళం పగలగొట్టి శివలింగం పై ఉన్న వెండి నాగపడగ అపహరించారు. జాగ్రత్తలు అవసరంఏటా జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయి. 2023లో 104 దొంగతనాలు జరగగా, 2024లో 78 చోరీలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. రూ.లక్షల్లో నగదు, విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. రికవరీ మాత్రం అంతంతే ఉంటోంది. చోరీ జరిగినట్లు గురిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ఊరికి వెళ్తే విలువైన ఆభరణాలు వెంట తీసుకెళ్లాలి. లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం మేలు. ఇంట్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకోవద్దు. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు సమాచారం అందిస్తే రాత్రిపూట పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అనుమానితులు కాలనీల్లో కనబడితే పోలీసులకు సమాచారం అందించాలి. కొందరు సామగ్రి విక్రయిస్తున్నట్లు కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. అనుమానాస్పదంగా తిరిగే చిరువ్యాపారులపైనా ఓ కన్ను వేసి ఉంచాలి. ముఖ్యంగా ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
జైనథ్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలానికి చెందిన సుమిత్, అతని మిత్రుడైన సలీం షకిల్తో కలసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్గా ఏర్పడ్డారన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, బేల, మహారాష్ట్ర కోర్పణ మండలాల్లో బైక్లను అపహరించి ఇతరులకు విక్రయిస్తుండేవారన్నారు. వారి వద్దనుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్కు తరలించామన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోటపల్లి: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ సంజయ్ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించమన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రెండోలీగ్లో ఓడిన ఉమ్మడి జిల్లా జట్టుమంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎ స్సార్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రెండో లీగ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సాయి సత్య టీంతో 90 ఓవర్ల చాంపియన్షిప్లో ఓడిపోయింది. ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 30.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన సాయిసత్య టీం 24.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులోని సాయికుమార్ 7 వికెట్లు సాధించడం గమనార్హం. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో, ఇరుజట్లు పరుగులను చేసేందుకు ఇబ్బంది పడ్డాయని కోచ్ ప్రదీప్ తెలిపారు. దివ్యాంగులకు రైలులో రాయితీపై ప్రయాణంమంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్ర యాణ సౌకర్యం కల్పిస్తోందని సికింద్రాబాద్ డివిజన్ (ఎస్సీఆర్) అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఎస్ఆర్ మూర్తి అన్నారు. గురువా రం మంచిర్యాల రైల్వేస్టేషన్లో అవగాహన కల్పించారు. మంచిర్యాల కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పథకం
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్: జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పథకం అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్తో కలిసి పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సహాయ ఉపకరణాల పథకం కింద అర్హులకు పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. దివ్యాంగుల అర్హత పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పలువురు దివ్యాంగులు అదనపు కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకురాగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సమావేశంలో వైద్యులు, సంక్షేమ శాఖ సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘జన్మన్’తో గిరిజనుల అభివృద్ధి
● కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ● జిల్లాలో విస్తృత పర్యటనఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/తిర్యాణి/వాంకిడి/: ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. రెండోరోజు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తిర్యాణి మండలం సుంగాపూర్లోని శాటిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పీఎం జన్మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దేవలతలకు పూజలు చేసి, టేకం భీంపటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. పీవీటీజీల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పీఎం జీవన జ్యోతి, అటల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర రుణాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. పీఎం జన్మన్ కింద పీవీటీజీ గిరిజనులకు 11 రకాల వ్యాధు ల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో పీఎం జన్మన్ యోజన శిబిరాలు నిర్వహించి ఆధార్ కార్డు ఇప్పించడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరిపించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆధార్కార్డులు, ఉపాధిహామీ జాబ్కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, జన్మన్ ఖాతా పుస్తకాలు అందించారు. మల్టీపర్పస్ కేంద్రం సందర్శన అనంతరం వాంకిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో బాలింతతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మండలంలోని లింబుగూడలో పీఎం జన్మన్ పథకంలో భాగంగా రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ను సందర్శించారు. గిరిజనులు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని మహాదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 140కోట్ల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్య, వైద్యం, రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు రూ.1200 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, చెర్ల మురళి, అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు అనాథ మృతదేహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని కాలేజ్రోడ్లో నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల, మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మందమర్రిలో నిస్సహాయ స్థితిలో రహదారి పక్కన ఉన్న వృద్ధురాలు(90)కు గత నెల 28 న మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచన మేరకు మేరకు ఆశ్రమంలో చోటు కల్పించారు. సదరు వృద్ధురాలు మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఎస్సై సూచన మేరకు మృతదేహాన్ని బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. అయినప్పటికీ మృతురాలికి సంబంధించి బంధువులెవరైనా ఉంటే 9701973636 నంబర్ను సంప్రదిస్తే మృతదేహం అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో వైద్యకళాశాల వినియోగిస్తుందని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ములుకాల కుమార్ తెలిపారు. -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన అగర్గూడకు చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వ్యాపారి కృష్ణ, అతడి సతీమణి వేధింపులతో రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చట్టంప్రకారం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. బెయిల్పై వచ్చిన నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పోలీసులు వెంటనే సాక్షుల స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు షరీఫ్, నవీన్, బాబాజీ, నరేశ్, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.నేడు రౌండ్టేబుల్ సమావేశంకాగజ్నగర్రూరల్: కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు(జీవో నం. 49) రద్దు చేయాలని గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్పాషా, కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
నెన్నెల: ఈ నెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం రాజేంద్రప్రసాద్ (26) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్లో బొలెరో తీసుకున్నాడు. గిరాకీ లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నానని ఇంట్లో చెప్పుకుని బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వివరించారు. -
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌటాలలో చేతికి చిక్కి.. కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి.. ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్సైకిల్ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్సైకిల్తోపాటు మొబైల్ఫోన్ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. -
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది. -
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మె స్రం సోము, హెచ్ఏలు శంకర్, వసంత్, ఏఎన్ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్కు చెందిన మణిశేఖర్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రంగినేని శ్రీనివాస్ శాంతినగర్లోని మున్సిపల్ రోడ్డుకు తన బావ అమూల్ పేరిట డోర్ నంబర్ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మున్సిపల్ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులరైజేషన్ కోసం రూ.22,900 చలాన్ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్ సుశీల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్, అమూల్ను రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్, రూరల్ సీఐలు సునీల్ కుమార్, ఫణిందర్ పాల్గొన్నారు. ఐదుగురి రిమాండ్.. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ రమేశ్ కేఆర్కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్ ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, షేక్ ఆబిద్, షేక్ ఆదిల్, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, ఆదినాథ్, అతీఖ్, సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
● కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ ● ‘సాక్షి’ ఫోన్ఇన్కు స్పందనకాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కమిషనర్ ఎల్పుల రాజేందర్ అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఓపికగా ఆయన సమాధానాలు ఇస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించనున్నామని తెలిపారు. ఇటీవల 100 వీధి దీపాలు అమర్చామని పేర్కొన్నారు. ప్రశ్న: వీధి దీపాలు లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నాం. పోచమ్మ టెంపుల్ సమీపంలో లైట్లు లేక చీకట్లో బయటికి వెళ్లలేకపోతున్నాం. ఓల్డ్ కాలనీలో కూడా వీధీదీపాలు లేవు. – మహ్మద్ సర్దార్, గుంటూరు కాలనీ/ ఆదిల్, వార్డు నం 1/ రహెమాన్, సర్సిల్క్ కాలనీ/ కౌశిక్ భట్టాచార్య, ఓల్డ్ కాలనీకమిషనర్: రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: విద్యుత్ స్తంభం ఎర్త్ వస్తోంది. వర్షాలకు ప్రమాదాలు జరగకముందే మరమ్మతు చేయించాలి. ఇంటి పైనుంచి విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. – మహ్మద్ జాక్, విజయబస్తికమిషనర్: విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: చెత్త పేరుకుపోయి అవస్థలకు గురవుతున్నాం. డ్రెయినేజీ నిండి మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. – ప్రసాద్, న్యూకాలనీకమిషనర్: మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: ఇంటి వద్ద డ్రెయినేజీ నిండడంతో మురుగు నీరంతా బావిలోకి చేరుతోంది. నీటిని కనీస అవసరాలను వినియోగించుకోలేకపోతున్నాం. – పుల్లూరి చందర్, బాలాజీనగర్కమిషనర్: నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగిస్తాం. నాలా నుంచి వచ్చే మురుగు నీరు బావిలోకి చేరకుండా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: వారానికి ఒకసారి మాత్రమే కేరళ పబ్లిక్ స్కూల్ లైన్కు చెత్తబండి వస్తుంది. చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుంది. ప్రతీరోజు చెత్తబండి వచ్చేలా చూడాలి – సలీం, వార్డు నం.10/ యుసుఫ్, వార్డు నం.9కమిషనర్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు 20 ఆటోలు ఉన్నాయి. రెండు పనిచేయడం లేదు. అయినా ప్రతీరోజు అన్ని వార్డుల్లో చెత్త సేకరిస్తున్నాం. చెత్త తీసుకెళ్లేందుకు ప్రతీరోజు వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచిస్తాం. ప్రశ్న: ఇంటి ముందు ఉన్న ఇంటి స్తంభం ఎప్పుడు విరిగి పడుతుందో తెలియడం లేదు. విరగకముందే చర్యలు చేపట్టాలి. బాలాజీనగర్ నుంచి నౌగాం బస్తికి వెళ్లే మార్గంలో ఇంటిని ఆనుకుని విద్యుత్ స్తంభం ఉంది. గాలి వీచినప్పుడు వైర్లు తగిలి మంటలు చెలరేగుతున్నాయి. ఇళ్ల వద్ద ఉన్న స్తంభాలు తొలగించాలి. – నదీం ఖాన్, నిజాముద్దీన్ కాలనీ/ సతీశ్, బాలాజీనగర్కమిషనర్: విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ప్రశ్న: తమ కాలనీలోకి వింత పురుగులు వచ్చి ఇ బ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంట్లోని కర్ర వ స్తువులు తొలుస్తున్నాయి. గతంలో కూడా ము న్సిపల్ అధికారులకు వినతి పత్రాలు అందించినా చర్యలు తీసుకోలేదు. అలాగే డ్రెయినేజీలు లేవు. వీధి దీపాలు వెలగడం లేదు. – సాగరిక, గోపాల్, కోటేశ్వర్, సాయికుమార్, కాపువాడకమిషనర్: ఎస్పీఎం మిల్లు నుంచి పురుగులు వస్తున్నట్లు గుర్తించాం. మిల్లుకు తీసుకువచ్చే కర్ర ద్వారా వచ్చే వీటి నివారణకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజీలో పూడిక తీతతోపాటు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: తమ ఇంటి నం. 1–16–429/1 వేరే వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యింది. డుప్లికేట్ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకున్నారు. మ్యుటేషన్ రద్దు చేయాలి – మహ్మద్ ముజాయిద్కమిషనర్: రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలతో తమను సంప్రదించాలి. ప్రశ్న: చిన్న వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారుతుంది. నడవడానికి కూడా వీలు పడడంలేదు. రాత్రి వేళ వీధిదీపాలు వెలగడం లేదు. – సువర్ణ, మారుతినగర్కమిషనర్: రోడ్ల మరమ్మతు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో జనరల్ ఫండ్ ద్వారా రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టనున్నాం. ప్రశ్న: ప్రధాన తాగునీటి పైపులైను లీకేజీ కావడంతో నీరంతా వృథా పోయి రోడ్డు బురదమయంగా మారుతుంది. తాగునీటి కాలుష్యమై రోగాల బారిన పడుతున్నాం. ప్రధాన నాలా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – హర్షద్, ద్వారకానగర్కమిషనర్: పైపులైన్కు మరమ్మతు చేపట్టి లీకేజీ అరికడుతాం. డ్రెయినేజీని ఆక్రమించుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.ప్రశ్న: మా కాలనీకి మంజూరైన సీసీరోడ్డు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే సీసీరోడ్డు వేసి బాధలు తీర్చాలి. – నేరేళ్ల గోపి, సంజీవయ్య కాలనీకమిషనర్: రికార్డులు పరిశీలించి సీసీరోడ్డు మంజూరైతే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. లేకుంటే రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రశ్న: ఈఎస్ఐ గేటు వద్ద చెత్త వేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇదే ప్రాంతంలో క్లీన్ చేస్తుండడంతో విపరీతమైన దుర్గంధం వస్తుంది. – కుందారపు రాజుకమిషనర్: ఈఎస్ఐ గేటు వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. మరోసారి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తే సిబ్బందిపై చర్యలు చేపడుతాం.ప్రశ్న: డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి చేరుతుంది. కనీసం నడవలేని పరిస్థితి ఉంది. డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టం చేయాలి. – ప్రసాద్, కాపువాడ/ వినయ్, రాంమందిర్ రోడ్కమిషనర్: నూతనంగా డ్రెయినేజీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. చెత్త పేరుకపోతే తమ దృష్టికి తీసుకురావాలి. ప్రశ్న: దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నాం. కాలనీల్లో ఫాగింగ్ చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. – రవీందర్, శ్రీరాంనగర్కమిషనర్: దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టడంతోపాటు బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి తొట్టీల్లో నిల్వ నీటిని ఉంచొద్దు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. -
● పెద్దపులుల ప్రవేశమార్గంలో తిరిగి పచ్చదనం ● అడవిగా రూపాంతరం చెందుతున్న పోడు భూములు ● సింగరేణి గనులపై పచ్చదనానికి యాజమాన్యం పెద్దపీట ● జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
సాక్షి, ఆసిఫాబాద్: అటవీ, డీఆర్డీఏ, సింగరేణి సంస్థలు చేపడుతున్న చర్యలతో అటవీ ప్రాంతాలు పునర్ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాలుగా ఉన్న అడవులు పచ్చదనం పరుచుకుంటున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అడవుల ఖిల్లాగా పేరుంది. అయితే చాలా అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైంది. కొంతమంది పోడు వ్యవసాయం పేరిట అడవుల ను ఆక్రమించగా.. మరికొందరు భూస్వాములు గిరిజనుల పేరుతో చెట్లు కొట్టి వ్యవసాయ భూములుగా మార్చారు. సింగరేణి బొగ్గు గనులతో కూడా అడవి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ స మతౌల్యం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రవేశమార్గంలో పచ్చదనం మహారాష్ట్రలోని తడోబా– అంధారి టైగర్ రిజర్వ్ నుంచి పులులకు సిర్పూర్(టి) అటవీ రేంజ్ పరి ధిలోని ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతం కీలకమైన ప్రవేశమార్గంగా ఉంది. ఐదేళ్ల క్రితం వరకు పోడు సాగుతో మైదానంగా మారిన అటవీ ప్రాంతాన్ని అధికారులు దట్టమైన అడవిగా మార్చారు. ఆహార, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం పులుల నివాసానికి మరింత అనుకూలంగా మారుతోంది. ఇటీవల పులులు ఇక్కడికి వచ్చినట్లుగా పగ్మార్కుల ద్వారా అధికారులు నిర్ధారించారు. పర్యవేక్షణ బృందం కదలికలను ట్రాక్ చేస్తోంది. 1000 ఎకరాల్లో చింత, జామ మొక్కలు.. గిరిజనేతర రైతులు పోడు సాగు కోసం పెద్దఎత్తున అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. అటవీ హక్కులను ఉల్లంఘించారు. అయితే కాలక్రమేణా అటవీ అధికారులు, పోలీసులు కలిసి ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రారంభంలో ప్రతిఘటించినా.. తర్వాత చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న 1000 ఎకరాల్లో ఐదేళ్లుగా అటవీశాఖ అధికారులు జామ, చింతతోపాటు ఇతర దేశీయ మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం దట్టమైన అడవిగా రూపాంతరం చెందింది. డంప్ యార్డులపై పచ్చదనం.. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తోంది. ఏటా ఏరియాల వారీగా ఖాళీ స్థలాలు, గనులు, డిపార్టుమెంట్లు, కాలనీల్లో మొక్కలు నాటుతోంది. కొత్త గనుల ఏర్పాటు, విస్తరణ పనులతో చాలా ప్రాంతాల్లో పెద్ద వృక్షాలతోపాటు కొంతమేర అటవీప్రాంతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖాళీ స్థలాలు వదలకుండా పచ్చదనం పెంపొందిస్తోంది. డీ గ్రేడ్ ఫారెస్టు భూములను అభివృద్ధి చేస్తోంది. మూసివేతకు గురైన ఓసీపీ ప్రదేశాలు, ఓబీ డంపింగ్ యార్డులపై మొక్కలు నాటి పర్యావరణ సమతౌల్యానికి దోహదపడుతోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో మూసివేతకు గురైన గనుల ప్రదేశాలు, డంపింగ్ యార్డులు అడవులను తలపిస్తున్నాయి.1700 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాంఐదేళ్లలో సుమారు 1700 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకున్నాం. ఇందులో వెయ్యి ఎకరాల్లో స్థానిక జాతుల మొక్కలను నాటాం. 2023– 24లో 200 ఎకరాలు, 2024– 25లో 500 ఎకరాలు.. ఇప్పటివరకు ఇలా మొత్తం 1000 ఎకరాలు తోటలుగా మారాయి. ఐదడుగుల ఎత్తు వరకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ ఏడాది 7.47 లక్షలకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 6 లక్షల మొక్కల వరకు నాటాం. మిగిలిన మొక్కలు ఆగస్టు నాటికి నాటుతాం. – నీరజ్కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్వోవనమహోత్సవం లక్ష్యం 51 లక్షలు.. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలోని 15 మండలాల్లో జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ, అటవీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది 35.20 లక్షల మొక్కలు నాటనున్నారు. గతేడాది 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 35 లక్షలు మొక్కలు నాటారు. ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియా పరిధిలో కై రిగూడ ఓసీపీతోపాటు ఇతర ప్రాంతాల్లోని 40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఓబీ డంపింగ్ యార్డులతోపాటు సింగరేణి ఉద్యోగుల నివాసం ఉండే కాలనీలు, రహదారుల వెంట నాటనున్నారు. -
షార్ట్సర్క్యూట్తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది. -
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేతతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్పల్లి క్యాంపస్లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు. -
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జన్కాపూర్లో జన్మన్ పథకం కింద రూ.19 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. జెడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్లో రచించిన యంగ్ మైండ్స్ టైమ్లెస్ టేల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 24 మంది విద్యార్థుల ఆలోచనలతో కథలు రాసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును అభినందించారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సహకారంతో నిర్మించిన సంచార సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభు త్వ వైద్య కళాశాల విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కేంద్ర సహా య మంత్రి బృందాన్ని శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, డీఎఫ్వో నీరజ్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతారాం, మాస్టర్ మైండ్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. -
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ఆందోళన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని బీట్బజార్కు చెందిన విశ్వనాథం అనే వ్యాపారి ఇంటి ఎదుట బుధవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన శ్రీధర్ లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, ఇతర లావాదేవీలు కొనసాగిస్తుండేవాడు. ఈక్రమంలో పలువురి వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ఐపీ పేరుతో నోటీసులు పంపుతున్నాడనే సమాచారంతో అప్పు ఇచ్చిన రైతులు ఈ నెల 8 న శ్రీధర్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. వ్యా పారి విశ్వనాథం కూడా శ్రీధర్కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. దీంతో దండేపల్లిలో ఉన్న భూమి అప్పుకింద రాయించుకున్నాడని, అట్టి భూమిని బాధితులందరికీ పంచాలని బుధవారం రైతులు విశ్వనాథం ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గోపతి సురేష్ రైతులతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. -
సింగరేణి ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీశ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.