-
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు ● ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బరంపురం: ‘‘ప్రజల సంక్షేమమే నా ధ్యేయం.. వారంతా సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను’’ అని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న గంజాం జిల్లా బరంపురం నగరం సమీపంలోని గోపాల్పూర్ నియోజకవర్గం పరిధి కొనిసి గ్రామంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ భారీ బహిరంగ సభను గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తూ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచుతున్నారని చెప్పారు. ఒడిశా అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజకీయ రంగంలో పెద్దపీఠ వేశామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం గడిచిన 21 ఏళ్ల పాలనలో విద్య, వైద్యం, తాగు, సాగునీరు, రహదారుల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా గంజాం జిల్లాలోని ఎన్ఏసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని బస్తీవాసులకు ‘భూమి అధికారి’పట్టాల పంపిణీ పథకం ప్రారంభించి భూములు లేని నిరుపేదలకు పట్టాలు అందజేసినట్లు వివరించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. 21 ఏళ్ల బీజేడీ ప్రభుత్వ పాలనలో వందకుపైగా ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను సంతోషంగా ఉంచామని సీఎం నవీన్ చెప్పారు. బస్తీ వాసులు పొందిన భూమి హక్కు పట్టాల ద్వారా బ్యాంకు రుణాలు ఇచ్చామన్నారు. పిల్లల చదువులకు రుణాలతో ఉన్నత విద్య అభ్యసించేందుకు సహకరించినట్టు పేర్కొన్నారు. సభలో పాల్గొన్న రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఉషాదేవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి ప్రపంచ హాకీ కప్పు చాంపియన్ ట్రోఫీని ఇక్కడ ప్రారంభించి ప్రపంచ దేశాల్లో ఒడిశా రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచారని చెప్పారు. గోపాల్పూర్ బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ పండా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి మన్ననలు పొందారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేడీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను శంఖం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులందరూ పిలుపునిచ్చారు. ఐటీ మంత్రి ఉషాదేవి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి విక్రమ్ కేశరి ఆరక్తో పాటు గంజాం గంజాం జిల్లాలోని 12 మంది బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నాయకులు, భారీగా ప్రజలు పాల్గొన్నారు. -
బీజేడీ తరపున ఓలివుడ్ సినీతారల ప్రచారం
పర్లాకిమిడి: పర్లాకిమిడి బీజేడీ అభ్యర్థి రూపేష్ పాణిగ్రాహికి మద్దతుగా ఓలివుడ్ సినీ హీరో బాబు శేన్, అభినేత్రి ఎలినా సామంత్రాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒడియా సినీతారలు బాబుసేన్, ఎలినా సామంత్రాయ్లు రాంనగర్ హైటెక్ ప్లాజా నుంచి సుభాష్ నగర్, కుంభారీ వీధి, రైల్వే ష్టేషన్ రోడ్డు, రాజగురు వీధి, కటిక వీధి, రాజవీధి మీదుగా అనేక వార్డుల్లో రోడ్ షో చేపట్టారు. సంతపేట వద్ద మహిళలు పెద్ద ఎత్తున తమ అభిమాన నటీనటులను చూడటానికి ఉత్సాహాం చూపించారు. బీజేడీ యువజన నాయకులు బ్రజేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో బీజేడీ సీనియర్ నాయకులు బసంత్ దాస్, కౌన్సిలరు జ్యోతిర్మయి దాస్ తదితరులు పాల్గొన్నారు. -
3 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ పోలీసులు 3 క్వింటాళ్ల 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో మాఫియా అడవిలో దాచినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందటంతో బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ ఆదేశం మేరకు.. సబ్ ఇన్స్పెక్టర్ అనిత నాయిక్ నేతృత్వంలో పోలీస్ టీమ్ బొయిపరిగుడ సమితి మంత్రిఅంబ సమీప గొలారిగుడ గ్రామంపై దాడి జరిపారు. పోలీసులు వస్తున్నారని ముందుగా తెలిసిన గంజాయి మాఫియా గంజాయి బస్తాలను సమీప అడవిలో దాచివేసి పరారయ్యారు. పోలీసులు అడవిలో కూడా గాలించగా దాచిన గంజాయి బస్తాలు గుర్తించారు. గంజాయి బస్తాలను బొయిపరిగుడ పోలీసు స్టేషన్కు గురువారం తీసుకువచ్చి తూకం వేసినట్లు పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ వెల్లడించారు. బీజేడీతోనే మహిళా సాధికారత జయపురం: మిషన్ శక్తి ద్వారా మహిళా సాధికారతకు సీఎం నవీన పట్నాయక్ నేతృత్వంలో బీజేడీ ప్రభుత్వం గత 24 ఏళ్లుగా పలు పథకాలు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని రాష్ట్ర బీజేడీ మహిళా నాయకురాలు మీరా పొరిడ అన్నారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో బొరిగుమ్మ సమితి కుములి బీజేడీ నిర్వహించిన మహిళా సమారోహంలో మీరా పొరిడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బీజేడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్ర ప్రగతి, మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్న నవీన పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని, అందరూ శంఖం గుర్తుపై ఓటు వేసి బీజేడీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కుములి సంత తోట నుంచి ప్రారంభమైన ర్యాలీ దుర్గా మండపానికి చేరింది. ఈ సమావేశంలో జయపురం నియోజకవర్గంలో బీజేడీ అభ్యర్థి డాక్టర్ ఇందిరా నందో, కొరాపుట్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేడీ అభ్యర్థి కౌశల్య హికాక, జిల్లా బీజేడీ మహిళా విభాగ అధ్యక్షురాలు తులసీ కిరసానితోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి ● బీజేడీ పాలనలో రాష్ట్రం అథోగతి ● ఛత్తీష్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ జయపురం: కొట్పాడ్ విదానసభ నియోజకవర్గం కుంధ్రాలో బీజేపీ విజయ సంకల్ప సమావేశం గురువారం నిర్వహించారు. శాస్త్రి మైధానంలో జరిగిన ఈ సంకల్ప సమావేశానికి ఛత్తిగఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్పాడ్ నియోజకవర్గంలో కార్మికులకు పనులు లభించకపోవటంతో ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ఒలక బోస్తుందని దుయ్యబట్టారు. బీజేడీ తన 25 ఏళ్ల పాలనలో రైతుల పంట భూములకు సాగునీరు సమకూర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నవరంగపూర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బలభధ్ర మఝి, కొట్పాడ్ బీజేపీ అభ్యర్థి రుపు భొత్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుమంత ప్రధాన్, ఛత్తిష్గడ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చూద్దాం రండి..!
చందన యాత్ర ..భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని వార్షిక రథయాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ యాత్ర కోసం 3 కొత్త రథాల నిర్మాణం ఏటా అక్షయ తృతీయ తిథి పురస్కరించుకుని ప్రారంభించడం ఆచారం. అదే రోజున స్వామివారి చందన యాత్ర ప్రారంభమవుతుంది. పూరి నరేంద్ర సరోవరంలో స్వామి నావికా విహారం చేయడం చందన యాత్ర విశిష్టత. ఈ యాత్ర రెండు విడతల్లో జరుగుతుంది. సమగ్రంగా 42 రోజులు కొనసాగుతుంది. తొలి 21 రోజులు వెలుపల చందన యాత్ర, మిగిలిన 21 రోజుల లోపలి చందన యాత్రగా నిర్వహిస్తారు. ఈ మేరకు సన్నాహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. శ్రీమందిరం కార్యాలయం ఆవరణలో కొత్త రథాల నిర్మాణ శాల సిద్ధమవుతోంది. ఈ ప్రాంగణానికి విడతలవారీగా దుంగలు చేరాయి. నరేంద్ర సరోవరం ముస్తాబు పవిత్ర చందన యాత్ర పురస్కరించుకుని నరేంద్ర సరోవరం ముస్తాబు అవుతోంది. మరోవైపు సరోవరంలో ముంచి ఉంచిన నావలను సురక్షితంగా వెలుపలకు తీసి కొత్తగా రంగులు అద్ది శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. చందన వేదిక ఆకర్షణీయమైన రంగుల కళతో రూపుదిద్దుకుంటుంది. ఏడాది పొడవునా నరేంద్ర సరోవరంలో మునిగి ఉన్న భద్ర, నంద, వైజయంతి నావలను భొయి వర్గం సేవకులు బయటకు తీసి, ఈ ఏడాది చందన యాత్రకు సిద్ధం చేస్తున్నారు. ఈ నావలపై ఉత్సవమూర్తులు అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులపాటు నిరవధికంగా నావికా విహారం చేస్తారు. ఈ సందర్భంగా నిత్యం సంధ్య వేళలో శ్రీమందిరం నుంచి పల్లకిలో బయటకు వచ్చిన ఉత్సవమూర్తులు బొడొ దండొ గుండా నరేంద్ర సరోవరం తీరానికి చేరుతాయి. దారి పొడవునా స్వామికి ధూపదీప నైవేద్యాదులు సమర్పిస్తారు. పలుచోట్ల పంక్తి భోగం నివేదించడం ఆచారంగా కొనసాగుతోంది. చలువ పందిరి సిద్ధం వేసవి తాపం నుంచి రథ తయారీ కార్మికులకు రక్షణ కల్పించేందుకు చలువ పందిరి ఏర్పాటు చేస్తున్నారు. దీని ఛాయలో రథాల తయారీ పనులు కొనసాగుతాయి. చందన యాత్ర కోసం స్వామి ఊరేగింపుగా తరలి వెళ్లే మార్గంలో అక్కడక్కడ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణాల్లో స్వామికి భక్తులు పంక్తి భోగం నివేదిస్తారు. అంచెలంచెలుగా చేరుతున్న దుంగలు యాత్ర కోసం రథాల తయారీకి అవసరమైన దుంగలు నిర్మాణ శాల ప్రాంగణానికి తరలి వస్తున్నాయి. ఇప్పటివరకు 4 విడతల్లో కలప దుంగలు చేరాయి. గతేడాది సేకరించిన దుంగల్లో 53 దుంగలు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది రథాల తయారీకి సమగ్రంగా 812 దుంగలు అవసరం ఉంటుంది. విడతలవారీగా 152 దుంగలు రథ నిర్మాణ శాల ప్రాంగణానికి చేరుకోగా 33 దుంగలు కలప మిల్లుకు చేరాయి. అక్షయ తృతీయ కార్యక్రమాలు ఖరారు అక్షయ తృతీయ సందర్భంగా శ్రీమందిరంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల వేళలను ఖరారు చేశారు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు దేవస్థానం తలుపులు తెరుస్తారు. చందన యాత్ర కోసం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉత్సవమూర్తులకు పల్లకిలో ఊరేగింపునకు సన్నాహాలు చేస్తారు. సాయంత్రం 4 గంటలకు చందన యాత్ర కోసం స్వామి ఆజ్ఞామాల చేరడంతో శ్రీమందిరం నుంచి నరేంద్ర సరోవరంకి పల్లకిలో ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభిస్తారు. సేవా సబ్ కమిటీ ప్రతిపాదన మేరకు 36 నియోగుల సంఘం ఈ కార్యక్రమాల ఆచరణకు అంగీకారం తెలిపింది. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి సీఏవో వీర విక్రమ యాదవ్ అధ్యక్షతన స్థానిక నీలాద్రి భక్త నివాస్లో జరిగిన సమావేశంలో ఉత్సవాల కార్యక్రమాలు ఖరారు చేశారు. సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి, రాత్రి 10 గంటలకు మైలమ్, 10.30 గంటలకు చందన సేవ, రాత్రి 11.30 గంటలకు బొడొ సింగారొ అలంకరణ, భోగ నివేదన చేస్తారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఏకాంత సేవ జరుగుతుందని తెలిపారు. అలాగే ఈనెల 15న నీలాద్రి మహోదయ అష్టమి, 22న నృసింహ జయంతి, 29న శ్రవణ మకర నక్షత్ర భంవురి యాత్ర ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. నేడు అక్షయ తృతీయ ప్రారంభమవ్వనున్న శ్రీజగన్నాథుని చందన యాత్ర నేటి నుంచి రథ నిర్మాణాలకు శ్రీకారం రథాల తయారీకి అంకురార్పణ అక్షయ తృతీయ పురస్కరించుకుని శుక్రవారం నుంచి శ్రీజగన్నాథుని వార్షిక యాత్ర కోసం రథాల తయారీకి అంకురార్పణ చేస్తారు. దీనికోసం సిద్ధం చేసిన రథ తయారీ శాల ప్రాంగణంలో ప్రత్యేక పూజాదులు నిర్వహించి రథాల తయారీ పనులకు శ్రీకారం చుడతారు. శ్రీ మందిరం రత్నవేదిక నుంచి మూల విరాటుల ఆజ్ఞామాలలు చేరిన తర్వాత నిర్మాణ శాలలో ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. అనంతరం మహరణ వర్గం సేవకులు రథాల తయారీ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. 3 రథాల కోసం ముందస్తుగా ఎంపిక చేసిన ప్రత్యేక దుంగలను పూజ కోసం సిద్ధం చేస్తారు. శ్రీమందిరం నుంచి ఒక్కో రథం కోసం వేర్వేరుగా ఆజ్ఞామాలల్ని తీసుకొచ్చి బంగారు గొడ్డలితో లాంచనగా చీల్చడంతో రథాల తయారీ పనులు ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ఒక్కో రథానికి ఒక్కో ప్రధాన వడ్రంగి (మహరణ సేవాయత్) ఈ పూజలో ప్రత్యేకంగా పాల్గొంటారు. రథాల తయారీ ఆద్యంతాలు ఈ ముగ్గురు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. -
యువతిపై అత్యాచారం
బరంపురం: ఒక యువతిపై అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బరంపురం ఎస్పీ డా.సర్థక్ సడంగి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 5వ తేదీ రాత్రి బీఎన్పూర్ పోలీసుస్టేషన్ పరిధి కొత్త బస్టాండ్లో రాత్రి 9 గంటల సమయంలో ఉన్నటువంటి యువతిని, రితున్ దాస్ అనే యువకుడు హిల్పట్నాలో ఉన్న తన రూమ్కి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అనంతరం ఫోన్ ద్వారా తన ఫ్రెండ్స్ను పిలిచి మరలా యువతిపై వారితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో జరిగిన అఘాయిత్యంపై బాధిత యువతి బీఎన్పూర్ పోలీసుస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దారుణానికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి బరంపురం సర్కిల్ జైలుకి తరలించారు. అరైస్టెనవారిలో రితున్ దాస్, రుద్రాజెన్నా, అభినాష్ పొలై, అకాష్ నాయక్, సమీత్ పాణిగ్రాహి, గోకుల్ బిహారిల ఉన్నట్లు నిర్ధారించారు. నిందితులను కఠినంగా శిక్షించాలి యువతిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బరంపురం ఎస్పీ కార్యాలయం ఎదురుగా బీజేపీ మహిళా మోర్చా సభ్యులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మీనతి సాహు మాట్లాడుతూ అత్యాచారానికి సంబంధించిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదన్నారు. అనంతరం ఎస్పీ డా.సర్థక్ సడంగికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో జిల్లాకు చెందిన బీజేపీ మహిళా మోర్చ నాయకులు పాల్గొన్నారు.● ఆరుగురు నిందితులు అరెస్టు -
స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల పరిశీలన
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి డిపాజిట్ చేసే కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికలు పరిశీలకులు శేఖర్ విద్యార్థి, దిగంబర్ ప్రధాన్లు గురువారం పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక, ఇతర అధికారులతో చర్చించారు. సజావుగా ఎన్నికల ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా, జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అదనపు ఎస్పీ ప్రేమ్కాజల్ పాల్గొన్నారు. -
దువ్వాడకు శిష్టకరణాల మద్దతు
టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి శిష్టకరణం సామాజికవర్గ ప్రతినిధులు మద్దతు పలికారు. శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ, ప్రతినిధులు పోలిమహంతి ఉమామహేశ్వరరావు, అంపలాం వసంత్కుమార్, జి.ఆర్.జి.నాయుడు తదితరులు గురువారం దువ్వాడ శ్రీనివాస్ను మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో శిష్టకరణాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చారని, ఆ తరువాత ఆయన తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. -
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
భువనేశ్వర్: స్పైస్జెట్ విమానయాన సంస్థకు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. ముందస్తు సమాచారం లేకుండా విమానం దారి మల్లించి గమ్యం చేర్చడంలో చోటు చేసుకున్న జాప్యంతో తలెత్తిన పరిణామాల వివరణతో బాధిత వినియోగదారుడు న్యాయ సంస్థను ఆశ్రయించాడు. ఈ అసౌకర్యం పూర్వాపరాల్ని పరిశీలించిన మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం.. స్పైస్జెట్ విమానయాన సంస్థకు రూ.60 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఝార్సుగుడ మాజీ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డీపీఓ) నిర్మల్ మహాపాత్రో స్పైస్జెట్ విమానయాన సంస్థ సేవల్లో లోపాలున్నాయని ఆరోపిస్తూ జిల్లా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరంలో వ్యాజ్యం దాఖలు చేశారు. అసౌకర్యానికి అనుబంధంగా సమాచార హక్కు చట్టం కింద లభ్యమైన వివరాల్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకువెళ్లారు. నిర్మల్ మహాపాత్రో 2021 సంవత్సరం నవంబర్ నెలలో స్పైస్జెట్లో టిక్కెట్లు బుక్ చేసుకుని కుటుంబంతో కలిసి అస్సాం పర్యటనకు వెళ్లారు. వారి తిరుగు ప్రయాణంలో విమానం సుమారు 3 గంటలు ఆలస్యంగా గమ్యం చేరింది. బాగ్డోగ్రా నుంచి బయల్దేరిన స్పైస్జెట్ విమానం కోల్కత్తాకు సాయంత్రం 6.30 గంటలకు చేరాల్సి ఉండగా రాత్రి 9.30 గంటలకు చేరింది. దీనిపై ఆరా తీయగా గౌహతికి దారి మళ్లించడంతో ఈ జాప్యం అనివార్యమైనట్లు గుర్తించారు. ఈ మేరకు ముందస్తు సమాచారం లేకుండా ప్రయాణంలో అసౌకర్యం కల్పించడంతో కోల్కత్తా నుంచి ఝార్సుగుడాకు వెళ్లాల్సిన రైలు తప్పిపోయినట్లు వివరించారు. దీంతో టాక్సీని అద్దెకు తీసుకుని సుదూర ఝార్సుగడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడంతో తన కుటుంబీకులు అనారోగ్యానికి గురైనట్లు ఆరోపించారు. ఈ పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసిందని జిల్లా వినియోగదారుల ఫోరంకు అనుబంధ సాక్ష్యాధారాలతో రుజువు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయ సంస్థ సమన్వయ లోపం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి రూ.50 వేలు, కేసు నమోదులో దరఖాస్తుదారుడు చేసిన ఖర్చుకు రూ.10 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. స్థానిక రాజ్భవన్లో ఆయన రాత్రి బస చేస్తారు. ఈ సందర్భంగా నగరంలో జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో దృష్ట్యా కమిషనరేట్ పోలీసులు వాహనాల రాకపోకలపై మార్గదర్శకాలు జారీ చేశారు. శుక్రవారం మాస్టర్ క్యాంటీన్ కూడలి నుంచి వాణీ విహార్ వరకు రెండు కిలో మీటర్ల మేర జనపథ్ రోడ్లో ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించనున్నారు. ఐదేళ్లలో మోదీకి ఇది రెండో రోడ్ షో. పటిష్టమైన భద్రత దీని కోసం 55 ప్లాటూన్ల పోలీసు బలగాల్ని మోహరించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రధాని రోడ్ షో కోసం ఐదుగురు డీసీపీ హోదా అధికారులు, పది మంది అదనపు డీసీపీలు, 27 మంది ఏసీపీలు, 41 మంది ఇన్స్పెక్టర్లు, 180 మంది సబ్ఇన్స్పెక్టర్లను మోహరిస్తారు. రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. మూడు యూనిట్ల ప్రత్యేక వ్యూహాత్మక విభాగం (ఎస్టీయూ)తో పోలీసు సిబ్బంది సాధారణ దుస్తులలో పరిస్థితి పట్ల నిఘా వేస్తారు. వాహనాల రవాణా పురస్కరించుకుని శాంతిభద్రతల నిర్వహణకు అనుకూలంగా చోదకులకు ఇబ్బంది కలగకుండా జారీ చేసిన నియంత్రణ మార్గదర్శకాల్లో కమిషనరేట్ పోలీసులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై కొన్ని ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాస్టర్ క్యాంటీన్ నుంచి వాణి విహార్ వైపు వాహనాల రాకపోకలను నివారించే దిశలో దారి మళ్లిస్తారు. సాధారణ ప్రజల సౌకర్యార్థం జనపథ్ రహదారిపై వాహనాల రాకపోకలు ఇతర కార్యకలాపాలు లేకుండా సీల్ చేస్తారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రోడ్ షో ముగిసే వరకు జనపథ్ రహదారిపై..మాస్టర్ క్యాంటీన్ నుంచి వాణి విహార్ వరకు వాహనాలకు అనుమతి లేదు. వీధులు, సందులు గుండా వచ్చే వాహనాల రవాణాకు జనపథ్కు ఇరువైపుల మాస్టర్ క్యాంటీన్ నుంచి వాణి విహార్ వరకు జనపథ్ రహదారిని వినియోగించుకోవడానికి అనుమతించరు. తదనుగుణంగా వాహనదారులు తమ రూట్ను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఆంక్షలు విధించిన పోలీసులు -
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడాలను తగ్గించేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ ఎస్. భాస్కరరావు తెలిపారు. సమాజంలో రుగ్మతలను తలెత్తకుండా ఉండాలంటే సీ్త్ర, పురుష నిష్పత్తి సమానంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లింగ నిర్ధారణను అరికట్టాలని, వీటికి పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉప అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భస్థ పిండ పక్రియ చట్టం – 1994 అమలుపై చర్చించారు. ప్రొగ్రాం అధికారులు స్కానింగ్ సెంటర్లను విధిగా తనిఖీ చేయాలని సూచించారు. ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పనసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె. రాణి, డీఐఓ డాక్టర్ రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, ఘోషా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణశుభశ్రీ, డాక్టర్ సుజాతదేవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మి , నేచర్ సంస్థ ప్రతినిధి కృష్ణారావు, డెమో చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
ఓటింగ్ శాతం పెంచాలి
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అనుబంధ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా గురువారం ఉదయం సైక్లోథాన్ నిర్వహించారు. ఖుర్ధా జిల్లా అధికార యంత్రాగం, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీఆర్పీఎఫ్ వెండింగ్ జోన్ నుండి మహాత్మా గాంధీ పార్క్ వరకు ఏకామ్ర కానన్, జయదేవ్ విహార్ కూడలి, కళింగ హాస్పిటల్ ఛక్ వీధుల గుండా నిర్వహించిన సైక్లోథాన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఔత్సాహిక యువతీ, యువకులు పాల్గొన్నారు. బీఎంసీ కమిషనర్, పోలీస్ కమీషనర్, ఖుర్దా కలెక్టర్ ప్రత్యక్ష పాల్గొని వారిని ప్రోత్సహించారు. -
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ బిజయ్ మహపాత్రోభువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల తలెత్తిన రుబెల్లా సంక్రమణ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో దీని బారిన పడకుండా గర్భిణులు జాగ్రత్త వహించాలని రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ బిజయ్ మహపాత్రో హెచ్చరించారు. నవరంగపూర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు బాలురు రుబెల్లా బారిన పడినట్లు అధికారికంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. గర్భిణులకు దద్దుర్లు లేదా జ్వరం వచ్చినా తక్షణమే రుబెల్లా వైరస్ నిర్ధారణ వైద్య పరీక్షలను తప్పనిసరిగా చేయించుకునేందుకు వైద్య వర్గాలను సంప్రదించాలని డాక్టర్ బిజయ్ మహపాత్రో సూచించారు. ముఖ్యంగా శిశువుకు వైరస్ సంక్రమించే అవకాశం ఉన్నందున గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలలో ఇది ప్రాణాంతకం కానప్పటికీ గర్భిణులకు ఈ వైరస్ సోకితే తమ పిల్లలలో పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్తో పాటు గుండె జబ్బులు, కంటిశుక్లం, కొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే పరిస్థితి అదుపులో ఉన్నందున భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై నిఘా వేసేందుకు ఆరోగ్య శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్టీ)ను రంగంలోకి దింపింది. మీజిల్స్ మరియు రుబెల్లా (ఎమ్ఆర్) ఇమ్యునైజేషన్ డ్రైవ్ను రాష్ట్రంలో మిషన్ మోడ్లో చేపట్టారు. చిన్నారుల్లోనే వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆరోగ్య సేవా బృందాలు వారిపై దృష్టి సారించాయని తెలిపారు. నవరంగపూర్ జిల్లాలో నొందాహండి, తెంతులిఖుంటికి చెందిన ఇద్దరు పిల్లల్లో రుబెల్లా కనుగొనబడింది. ఏప్రిల్ 29న ఈ జిల్లా రెండు మండలాల్లో 5 మంది వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రానికి (ఆర్ఎంఆర్సీ) పంపించారు. ఈ పరీక్షల్లో ఏడాది బాలుడికి, ఎనిమిదేళ్ల బాలుడికి రుబెల్లా పాజిటివ్గా తేలింది. -
ఉమ్మరకోట్ సొంతం!
విభిన్న సంస్కృతుల సంగమం.. ● ఎక్కువసార్లు గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు ● ఆ స్థానంలో పాగా వేసిన బీజేడీ పార్టీ ● ఈసారి పట్టం కట్టేది ఎవరికో? ● ఉమ్మరకోట్ (ఎస్టీ) నియోజకవర్గం ముఖచిత్రం జయపురం: ఛత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులో నక్సల్ ప్రభావిత నవరంగపూర్ జిల్లాలో ఉన్న ఉమ్మరకోట్ అసెంబ్లీ స్థానానిది ప్రత్యేక స్థానం. విభిన్న సంస్కృతుల సంగమం దీని సొంతం. గతంలో కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. అయితే బెంగాలీ శరణార్థులకు ఈ ప్రాంతంలో పునరావాసం కల్పించిన తరువాత వెల్లువెత్తిన నిరసనలు, భూ వివాదాలు ఆదివాసీ, శరణార్థ బెంగాలీ సంప్రదాయ ప్రజల మధ్య విభేదాలకు దారితీశాయి. దీంతో కాంగ్రెస్ హవా తగ్గి బీజేడీ పగా వేసింది. ముఖ్యంగా ఆనాటి పాలకులు ఆదివాసీలు అనాధిగా సాగు చేసుకుంటున్న భూముల్లో శరణార్థులకు స్థానం కల్పించటంతో సమస్య తలెత్తింది. ఆ సమయంలో యువనేత జగబందు మఝి ఆదివాసీలకు, స్థానిక దళితులకు అండగా నిలచారు. దళిత సమాజ్ పేరుతో వారి హక్కుల కోసం ఉద్యమం చేపట్టారు. బెంగాలీ శరణార్థులు, ఆదివాసీల మధ్య భూ తగాదాలు, హత్యలు, గృహ దహన సంఘటనలు కొంతకాలం ఆ ప్రాంతాన్ని భయం గుప్పిట్లో ఉంచాయి. జగబందు మఝిపై ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అయితే అదే సమయంలో ఉమ్మరకోట్లో పట్టు సాధించేందుకు బీజేపీ పార్టీ అధిష్టానం జగబందు మఝిని తమ వైపు తిప్పుకుంది. ఆయనపై ఉన్నకేసులు రద్దు చేస్తామన్న హామీ సైతం ఇచ్చింది. దీంతో అతను ఆ పార్టీలో చేరారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే అప్పటికే మల్కన్గిరి జిల్లాలో పునరావాసం కల్పించబడిన బెంగాలీ శరణార్థులు తమ కష్టాలను రాష్ట్ర విధానసభలో ప్రస్తావించేందుకు తమ వ్యక్తిని పంపాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగారు. 1995, 2000 ఎన్నికలలో మల్కన్గిరి నుంచి విధానసభకు బీజేపీ అభ్యర్థిగా ఎన్నికై న బెంగాలీ శరణార్థ నేత అరవింద డాళీ 2000లో ఆనాటి బీజేడీ–బీజేపీ మిశ్రమ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అతడి ప్రభావం ఉమ్మరకోట్ బెంగాలీ శరణార్థులపై పడింది. అప్పటికే సమస్యలతో అట్టుడుకుతున్న ఉమ్మరకోట్లో బీజేపీ శరణార్థుల్లో పట్టు సాధించింది. 2004లో బీజేపీ తన అభ్యర్థి ధర్మ గోండ్ను బరిలో దింపింది. బెంగాలీ నేత అరవింద డాళీ ప్రభావంతో ఉమ్మరకోట్ బెంగాలీలు బీజేపీకి మూకుమ్మడిగా ఓటు వేసి అతడిని గెలిపించారు. ఈ పరిణామం చూసిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీ 2009 ఎన్నికల్లో దళిత నేత జగబందు మఝిని పోటీబరిలో దింపింది. మఝి 14,171 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి ధర్మ గోండ్ను ఓడించి బీజేడీకి స్థానం కల్పించారు. అయితే 2011 సెప్టెంబర్ 24వ తేదీన రాయఘర్ సమితి గోన గ్రామ సంతలో ప్రజలకు భూమి పట్టాలు పంచుతున్న సమయంలో మావోయిస్టులుగా భావించబడిన కొందరు జగబందు మఝిపై తుపాకీలతో కాల్పులు జరిపారు. ఆ ఘటనలో జగబందు మఝితో పాటు అతడి అంగరక్షకుడు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మరకోట్ నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది. ఈ స్థానం నుంచిఅవిభక్త కొరాపుట్ జిల్లాలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు రాధాకృష్ణ బిశ్వాసరాయ్, సదాశివ త్రిపాఠీ, రబిసింగ్ మఝిలు గెలుపొందారు. అంతే కాకుండా ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన పరమ పూజారి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లాలో మొదటి మహిళా మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, ఉత్కళ కాంగ్రెస్ రెండుసార్లు, జనతా పార్టీ, జనతాదళ్ ఒక్కోసారి, బీజేపీ రెండు సార్లు గెలుపొందాయి. 1957లో ఏర్పాటైన ఉమ్మరకోట్ నియోజకవర్గంలో ఉమ్మరకోట్, ఝోరిగాం పోలీసు స్టేషన్ ప్రాంతాలు ఉండేవి. అప్పుడు జనరల్ స్థానంగా ఉండే ఉమ్మర్కోట్ 1967 నాటికి ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 1957లో ఈ స్థానం నుంచి అవిభక్త కొరాపుట్ జిల్లాలో కొరాపుట్ గాంధీగా పిలిచే స్వాతంత్య్ర సమర యోధుడు రాధాకృష్ణ బిశ్వాసరాయ్ గెలుపొందగా 1961 మరో స్వాతంత్ర యోధుడు సదాశివ త్రిపాఠీ విజయం సాధించారు. వీరిరువురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలుపొందారు. 1967 ఎన్నికల్లో మరో స్వాతంత్య్ర యోధుడు రబిసింగ్ మఝి కాంగ్రెస్ నుంచే విజయం సాధించారు. తరువాత ఆయన ఉత్కళ కాంగ్రెస్లో చేరి 1971, 1974 ఆ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం రబిసింగ్ మఝి 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విధానసభలో నాలుగోసారి కాలు పెట్టారు. తరువాత జరిగిన నియోజకవర్గాల విభజనలో ఉమ్మరకోట్ నియోజకవర్గంలో ఉమ్మరకోట్ ఎన్ఏసీ, రాయిఘర్ సమితి, ఉమ్మరకోట సమితిలో కురుసి, బెహడ, కొపేన, బకోడ, ముర్తమ, బెజ, సునాబెడ, సెమల గ్రామ పంచాయతీలతో ఏర్పాటు చేశారు. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పరమ పూజారి విజయం పొందారు. 1985 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన ఆమె 1990 ఎన్నిల్లో ఓటమి చెందారు. ఆ ఎన్నికలో గురువార మఝి జనతాదళ్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 1995, 2000లలో జరిగిన ఎన్నికల్లో మరోసారి పరమ పూజారి విజయాలు సాధించారు. 2004 ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బీజేపీ కై వసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మ గోండ్ విజయం పొందారు. అయితే 2009లో జరిగిన ఎన్నికలో దళిత నేత జగబందు మఝి బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది బీజేపీ, కాంగ్రెస్లకు చెక్ పెట్టారు. అతడి హత్య అనంతరం 2014లో జగబందు మఝి అనుచరుడు సుభాష్ గోండ్ బీజేడీ అభ్యర్థిగా బరిలో దిగి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జితేంధ్ర గోండ్పై 10,522 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. బీజేడీ అభ్యర్థి సుభాష్ గోండ్కు 50,500 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ్ధజితేంద్రకు 39,978 ఓట్లు వచ్చాయి. 2009లో విజయం సాధించిన బీజేపీకి కేవలం 21,351 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నిత్యానంద గోండ్ పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థి నిత్యానంద గోండ్ 59,895 ఓట్లు పొంది తన సమీప బీజేడీ అభ్యర్థి సుభాష్ గోండ్పై 9,922 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సుభాష్ గోండ్కు 49,973 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జసోద గోండ్కు 32,343 ఓట్లు వచ్చాయి. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలో ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీజేడీ అభ్యర్థుల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ తరఫున సనరాజ్ గోండ్, బీజేడీ అభ్యర్థిగా నవీన నాయక్, బీజేపీ అభ్యర్థిగా నిత్యానంద గోండ్ తలపడుతున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి. -
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
మల్కన్గిరి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వివిధ వర్గాల పింఛన్లను పెంచుతామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమాంత్ విశ్వశర్మ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంపీవీ–82 గ్రామంలో బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మల్కన్గిరిలో గెలిపించడతోపాటు ఒడిశాలో పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పాఠశాలలో బెంగాళీ ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. అలాగే దివ్యాంగుల పింఛన్ను 2,100 రూపాయలను 3,100 రూపాయలకు, వృద్ధుల పింఛన్ను రూ. 3,000 చేస్తామన్నారు. సుభద్ర యోజన పథకంలో ప్రతి మహిళకు రూ. 50 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కమలం గుర్తుపై ఓటువేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో మల్కన్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిమయి చంద్రపాల్, నవరంగ్పూర్ ఎంపీ అభ్యర్థి బోలభద్ర మాఝి, మల్కన్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డోంబురు సీసా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హేమాంత్ విశ్వశర్మ -
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్న ఎస్వీఎస్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బెటాలియన్ కమాండెంట్ గౌతమిషాలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్టుల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆరు నుంచి పదోతరగతి వరకు బోధించేందుకు బయాలజీ, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో రెండు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తుతో పాటు బయోడేటా, విద్యార్హత పత్రాలను జత చేసి పాఠశాలలో అందజేయాలని కోరారు. ఇంకా మరింత సమాచారం కోసం ప్రధానోపాధ్యాయుడు టి.అప్పారావు (సెల్: 95731 84185)ను సంప్రదించాలన్నారు. -
ఆయన పీఎం అయితే నేను ఎమ్మెల్యే కాలేనా?
పూరీ (ఒడిశా): ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఒడిశాకు చెందిన ఓ ఛాయ్వాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. టీ అమ్ముతూ జీవనం గడుపుతున్న 26 ఏళ్ల సుకాంత ఘడాయ్ పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.కరీంపూర్ గ్రామానికి చెందిన ఘడాయ్ తనకు స్థిర, చర ఆస్తులు ఏమీ లేవని తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘడాయ్ తనకు ప్రధాని నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని, ఆయన ప్రధాని కాగలిగితే, తోటి ఛాయ్వాలా అయిన తాను ఎమ్మెల్యే కాలేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే లంచాల సంస్కృతిని అరికట్టి నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని, అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడాన్ని పరిష్కరిస్తానని తన ప్రణాళికను ప్రకటించారు. తాను సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సుకాంత ఘడాయ్ చెబుతన్నారు.కాగా బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీజేడీ అభ్యర్థి ఉమాకాంత సామంతరాయ్, బీజేపీకి చెందిన ఉపాస్నా మహపాత్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రభాను మోహపాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 25న పోలింగ్ జరగనుంది. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్షిప్ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
ఏనుగుల గుంపు సంచారం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ అటవీ రేంజ్ పరిధి పొట్టంగిపొదొరొ, బొడొడెంగిలెలి అటవీ ప్రాంతాల్లో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ గ్రామాల్లోని పనస, మామిడి, పసుపు, అల్లం పంటలను ఏనుగులు మంగళవారం ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేంజర్ చందన్ గొమాంగో ఆదేశాల మేరకు అటవీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి పరీక్షించగా నాలుగు ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలిసింది. ఏనుగులను తరిమేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామస్తులు రాత్రి సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. దీంతొ ఏ క్షణంలొ ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురవుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీ: బాలిక మృతి
రాయగడ: ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చందిలి పొలీస్స్టేషన్ పరిధి కొత్తపేట–కొధొమల్లిగాం ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. కొంధొమల్లిగాం గ్రామానికి చెందిన లిప్సా దలాయ్ (12) దుర్మరణం చెందింది. విద్యార్థిని లిప్సా దలాయ్ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కొత్తపేట–కొంధొమల్లిగాం ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బీజేడీ విజయం ఖాయం
● బీజేపీ కుతంత్రాలు పనిచేయవు ● పార్టీ 5టీ చైర్మన్ వి.కె.పాండ్యన్ భువనేశ్వర్: రానున్న ఎన్నికల్లో బిజూ జనతా దళ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఆ పార్టీ వ్యూహకర్త, 5టీ చైర్మన్ వి.కె.పాండ్యన్ బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఎన్నికల తర్వాత చీలిక సూత్రంతో బీజేడీలో వైరి భావాల్ని భారతీయ జనతా పార్టీ ప్రేరేపిస్తోందని భవిష్యత్ కుతంత్రం గూర్చి వివరించారు. అతి తక్కువగా 60 శాసన సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోందన్నారు. ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీ ధ్యేయం కాదని, రాష్ట్రంలో 50 నుంచి 60 సీట్లు గెలవడం కోసం ఆరాటపడుతుందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో ఇతర పార్టీలతో చేసిన విధంగా వారు బిజూ జనతా దళ్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. ఇది వారు అంతర్గతంగా పన్నుతున్న వ్యూహమన్నారు. బీజేపీ జాతీయ నాయకులు వరుసగా 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేశారని, వారి ప్రచారం ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్ను ఎక్కువగా విశ్వసించారన్నారు. ప్రత్యర్థులకు రాష్ట్ర ప్రజలు గతంలో తగిన సమాధానం ఇచ్చారన్నారు. ఓ వైపు నవీన్ పట్నాయక్ ... మరోవైపు విపక్షాల భారీ సైన్యం ఉందని, ఈసారి కూడా అవే ఫలితాలు ఉంటాయన్నారు. జూన్ 9న వరుసగా 6వ సారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది మంది చొప్పున లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన పార్టీకి 9వ సంఖ్య ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. ఇది మూఢనమ్మకం కాదు, గ్రంథాల ఆధారంగా, హిందూ మతంలో 9కి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీరు గూగుల్ చేయవచ్చని సూచించారు. ఈ ప్రయత్నం నవీన్ పట్నాయక్కు మరింత బలంగా ఆశీర్వదించి పట్టం కడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న ఒడిశాలో జరిగే తొలి రౌండ్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. అలాగే తన బలం మరింత మెరుగుపరుచుకోనుందన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్తో పోరు జోరుగా ఉంటుందని, కలహండిలో 2 నుంచి 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కొంత ఉనికిని చాటుకుంటుందన్నారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు అపారమైన విశ్వాసం, అమితమైన ప్రేమ ఉన్నందున గంజాంలో ఏకపక్ష పోరుకు సాక్షిగా బీజేడీ నిలుస్తుందన్నారు. సమగ్రంగా రాష్ట్రంలో జరగనున్న నాలుగు రౌండ్లలో బీజేడీ క్లీన్ స్వీప్ చేస్తుందని జోష్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 బిజూ జనతా దళ్ ప్రచారానికి నవీన్ పట్నాయక్ నాయకత్వం వహిస్తున్నారని, మేమంతా అతని జట్టులో ఉన్నామని, ఒడిశాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి పోరాడుతున్నామన్నారు. కొందరు ముందంజలో, ఇంకొందరు మధ్యలో, మరికొందరు వెనుకవైపు ఉంటూ సార్వత్రిక ఎన్నికల ఆటలో ఆద్యంతం ధీటైన పోటీకి నిలిచి తుది ఫలితాల్లో విజేతగా నిలుస్తామని తెలిపారు. ఈ ఆటలో అట్టడుగు కార్యకర్తతో సహా ప్రతి ఆటగాడు ముఖ్యమేనని పేర్కొన్నారు. -
కలెక్టర్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం
● పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ అధికార పార్టీ బిజేడీ అభ్యర్థికి కోమ్ముకాస్తూ ఈ ఎన్నికల్లో పక్షపాతి వైఖరి అవలంభిస్తున్నారని, దీనిపై ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని పర్లాకిమిడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాశీనగర్లో బీజేడీ పార్టీ అభ్యర్థితో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి జాకబ్ గోమాంగో తిరుగుతుండటంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయనను జిల్లా పంచాయతీ కార్యాలయానికి తరలించారన్నారు. జాకబ్ గోమాంగో గుమ్మా బ్లాక్ అధ్యక్షురాలు సునేమీ గోమాంగో భర్త కావడంతో కలెక్టర్ అనుకూలంగా మార్చుకున్నారన్నారు. గుసాని సమితి పాటికోట పంచాయతీ సెక్రటరీ అడపా వెంకటరావు కూడా బహిరంగంగా బీజేడీ అఽభ్యర్థితో కలిసి ప్రచారం చేస్తున్నా.. కలెక్టర్ ఎటువంటి ఎన్నికల క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పర్లాకిమిడిలో పలువురు డీలర్లు జమ్మిదార్ పట్నాయక్ తదితరులు ఎన్నికల్లో బీజేడీ తరఫున బహిరంగంగా ప్రచారం చేస్తున్నారన్నారు. మంగళవారం గజపతి స్టేడియానికి అనధికారంగా ఒక హెలికాప్టర్తో డబ్బు సంచులు వచ్చినట్టు సమాచారం ఉందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయవాది, బీజేపీ ప్రతినిధి పృధ్వీరాజ్ చౌహాన్, ఛిత్రి సింహాద్రి పాల్గొన్నారు. -
13 పింక్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
జయపురం: ఈ నెల 13 వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జయపురం మున్సిపాలిటీ పరిధిలో మహిళల కోసం 13 పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జయపురంలో 90 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పింక్ పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళలు మాత్రం ఓటు వేస్తారని మున్సిపాలిటీ కార్యనిర్వాహక శాఖ అధికారి సిద్ధార్థ పట్నాయక్ బుధవారం వెల్లడించారు. ఈ కేంద్రాల్లో మహిళా సివిల్ అధికారులు, ఉద్యోగులు మాత్రమే ప్రిసైడింగ్, పోలింగ్ సిబ్బందిగా వ్యవహరిస్తారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు అన్ని పోలింగ్ బూత్లను శుభ్రపరచి అవసరమైన సౌకర్యాలు పరిశీలిస్తామని తెలిపారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బూత్ను ఏర్పాటు చేశామన్నారు. అప్పర్ కొలాబ్ ఇరిగేషన్ కాలనీలో గల ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు బూత్లు, పాయిక వీధి ప్రభుత్వ మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రెండు బూత్లు, ప్రభుత్వ సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో రెండు బూత్లు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మూడు, మహారాణిపేట ప్రాథమిక పాఠశాలలో ఒకటి పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరు పర్యావరణ అనుకూల బూత్లను ఏర్పాటు చేశామని, వాటిలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో ఒకటి, జయనగర్ ప్రాథమిక సేవా కేంద్రంలో మూడు, జేఈఎల్సీ హైస్కూల్ సెంటర్లో రెండు బూత్లు ఉంటాయన్నారు. పట్టణంలో గల అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. -
ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జయపురం: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుదవారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయ జూనియర్ రెడ్క్రాస్ జయపురం శాఖ నిర్వహించిన ఈ ఉత్సవానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత వహించారు. ఈ ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవంలో జూనియర్ రెడ్క్రాస్ అధికారి యజ్ఞేశ్వర పండ ముఖ్య వక్తగా పాల్గొని రెడ్క్రాస్ పితామహుడు హెనరీ డునాండ్ జీవనాన్ని, రెడ్క్రాస్ ఏర్పాటు ప్రధాన లక్ష్యాలను తెలియజేశారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో నిస్సహాయులకు, ప్రకృతి విపత్తులలో బాధితులకు అందిస్తున్న సేవలను వివరించారు. జూనియర్ రెడ్క్రాస్ పరామర్శదాత శుభలక్ష్మీ సాహు మాట్లాడుతూ జూనియర్ రెడ్క్రాస్, రెడ్క్రాస్ల ప్రధాన లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హరిహర చరడి, సొంబురు జాని, డుంబురు జాని, క్షీరసింధు సాహు, మహావీర ప్రధాన్ తదితరులు ప్రసంగించారు. పాఠశాల ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెడ్క్రాస్ పితామహుడు హెనరీ డునాండ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి కాలేజ్లో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అటవి సంరక్షణాధికారి మన్సున్ ఖేముండు హాజరయ్యారు. ఈ రెడ్క్రాస్ సంస్థ ఎంతోమంది ప్రాణాలు కాపడిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, మల్కన్గిరి కాలేజ్ ప్రిన్సిపాల్ లింగరాజ్ మిశ్రో, ఆశోక్ సోడాంగి, తదితరులు పాల్గొన్నారు. -
మూడుకు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇప్పటివరకు 3 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ధ్రువీకరించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 786 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. విచారణ, సంయుక్త విచారణ మరియు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా మూడు మరణాలు నిర్ధారించబడ్డాయి. మరో 17 కేసులు పరిశీలనలో ఉన్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ కుమార్ మహాపాత్రో తెలిపారు. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గడంతో పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement