Orissa
-
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
పెరిగిన మృతుల సంఖ్య
జయపురం: జయపురం సమితి టంకువ పంచాయతీ ధనముండ వంతెన సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదానికి గురైన వారంతా కూలి పనులు చేసుకుంటూ బతికేవారే. రోజ్గార్ పనుల్లో యంత్రాలు వినియోగిస్తుండడంతో జాబ్ కార్డులు ఉన్నా పనులు లభించని ఆ గ్రామ ప్రజలు ఆటోల్లో జయపురం పట్టణంలో కూలి పనులకు వెళ్తుంటారు. అలా వెళ్తుండగానే ప్రమాదం జరిగి లెంజ గ్రామానికి చెందిన అభి పంగి(60), గురు మఝి(18)ఆటో డ్రైవర్ లయిచన్ గొలారి(50) మరణించారు. అభి పంగి సంఘటనా స్థలం వద్దనే మరణించగా లయిచన్ గొలారీ కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్ లో ముందు మరణించారు. తర్వాత చికిత్స పొందుతూ గురు మఝి మరణించినట్లు సమాచారం. ఆటోడ్రైవర్ తండ్రి గుండెలవిసేలా రోదించారు. రెడ్క్రాస్ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.10వేలు సాయం అందజేశారు. -
చురుగ్గా జగన్నాఽథ మందిరం పునర్నిర్మాణం
పర్లాకిమిడి: పట్టణంలో శ్రీజగన్నాథ మందిరం పునర్నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీన్ని పూరీ శ్రీజగన్నాథ పుణ్యక్షేత్రం శైలిలో నిర్మిస్తున్నారు. పాత మందిరం స్థానంలో నిర్మిస్తున్న ఈ జగన్నాథ మందిరం ప్రస్తుత నిర్మాణ అంచనాలు రూ.20 కోట్లు. ఎత్తు 112 అడుగులు, వెడల్పు 70 అడుగులు ఉంటుంది. ఈ మందిరం లోపలకు వెళ్లడానికి 22 మెట్లు నిర్మిస్తున్నారు. అనుగుల్, నయాఘడ్ నుంచి వచ్చిన శిల్పులు గత రెండేళ్లుగా నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ పనులను శ్రీజగన్నాథ మందిరం కమిటీ పర్యవేక్షకులు దుర్గాప్రసాద్ పాణిగ్రాహి, యువరాణి కళ్యాణీ దేవి గజపతి ఆదేశాలతో నిర్వహిస్తున్నారు. రోజూ భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలు అందజేస్తున్నారు. దీంతో జగన్నాథ మందిరం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. గంగవంశ రాజులు హయాంలో అంకురార్పణ.. పర్లాకిమిడి జగన్నాథ మందిరం 1736 నుంచి 1771 మధ్యలో పరిపాలించిన గంగవంశం రాజులు శ్రీజగన్నాథ గజపతి నారాయణదేవ్–2 నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అప్పట్లో మొఘల్స్, మరాఠాలు, ఫ్రెంచ్, బ్రిటీష్ రాజులతో పోరాడారు. విజయనగరం ఎస్టేట్ రాజులు పూసపాటి విజయరామరాజు –2, ఖుర్దా భోయి వంశం రాజు బీర్కిశోర్ దేవ్లను ఓడించి ఈ ప్రాంతం కై వసం చేసుకున్నారు. 2013 సంవత్సరంలో పాత జగన్నాథ మందిరాన్ని పడగొట్టి కొత్త మందిరం నిర్మాణానికి స్థానిక భక్తులు నడుం కట్టారు. అయితే మందిరం పునాదులు తవ్వుతుండగా ఎక్కువ స్థాయిలో భూగర్భం నుంచి జలాలు బయటకు రావడంతో పనులు చాలాకాలం మందగించాయి. ఈ మందిరం నిర్మాణానికి భువనేశ్వర్, పూరీ నుంచి అనేక మంది పురావస్తు శాఖ నిపుణులు, ఇంజినీర్లు విచ్చేసి సలహాలు ఇచ్చారు. దీంతో రాతి శిలలు అట్టడుగు నుంచి వేసి జలాలు బయటకు రాకుండా కట్టడి చేశారు. -
బైక్ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
● తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని సుంకిడి పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ మహంతి (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ మహంతి కుమారుడు జగదీష్ ఐటీఐ చదువుతున్నాడు. జగదీష్ కొర్లాం వద్దకు బస్సులో రాగా.. కుమారుడిని తీసుకురావడానికి నర్సింగ్ సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. బుసాబద్ర పంచాయతీ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని జంతువు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నర్సింగ్ కిందపడి గాయపడ్డాడు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బుడితి సచివాలయంలో ఒకే ఒక్కడు సారవకోట: మండలంలోని బుడితి సచివాలయానికి ఎంపీడీఓ మోహన్ కుమార్ మంగళవారం ఉదయం 10.10 గంటలకు తనిఖీ చేయడానికి వచ్చారు. ఆ సమయానికి వీఆర్ఓ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శి హాజరు కాగా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. ఒక్క బుడితిలోనే కాకుండా అన్ని సచివాలయాలలో ఇదే తంతు నడుస్తుందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈనెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. -
ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నీ చాంపియన్ బొయిపరిగుడ టీమ్
జయపురం: జయపురం సమితి అంబాగుడ స్టేడియం మైదానంలో కొరాపుట్ జిల్లా ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం జరిగింది. ఈ టోర్నమెంట్లో బొయిపరిగుడ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ను జయపురం బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జయపురం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం వారు నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో జయపురం, కుంధ్ర, బొరిగుమ్మ, లక్ష్మిపూర్, బొయిపరిగుడ, లమతాపుట్ సమితుల నుంచి జట్లు పాల్గొన్నాయి. తొలి మ్యాచ్ జయపురం–కుంధ్ర టీమ్ల మధ్య జరిగింది. 10 ఓవర్లలో 62 పరుగులు చేయగా 63 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కుంధ్ర ఉపాద్యాయుల టీమ్ 4.4 ఓవర్లలో 63 పరుగులు చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్లో బొరిగుమ్మ, లక్ష్మీపూర్ టీమ్లు తలపడ్డాయి. బొరిగుమ్మ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలుపొందింది. మూడో మ్యాచ్లో లమతాపుట్, బొయిపరిగుడ టీమ్లు తలపడగా బొయిపరిగుడ టీమ్ 6.5 ఓవర్లలో 83 పరుగులు చేసి లమతాపుట్ను ఓడించింది. అనంతరం కుంధ్రా, బొయిపరిగుడ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచి కుంధ్ర టీమ్ బ్యాటింగ్ ప్రారంభించింది. కుంధ్ర టీమ్ 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. 97 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బొయిపరిగుడ టీమ్ 8 వికెట్లు కోల్పోయి తన లక్ష్యం 97 పరుగులు చేసి చాంపియన్గా నిలిచింది. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు గోపీ పట్నాయిక్, సురేంధ్ర మహాపాత్రో, ప్రాథమిక ఉపాద్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, బ్లాక్ విశ్రాంత విద్యాదికారి మానస ముఖర్జీ, కార్యదర్శి ప్రదీప్ కుమార్ మిశ్ర, ఉపాధ్యక్షుడు సదానంద సామంతరాయ్, కేషియర్ పురందర నాయిక్, తదితరులు పాల్గొన్నారు. -
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
ఎచ్చెర్ల క్యాంపస్: పంజాబ్లోని ఛండీఘడ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22 నుంచి 27 వరకు అఖిల భారత మహిళలు, పురుషుల వుషు పోటీలు జరగనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్.పావని (ప్రతిభా డిగ్రీ కళాశాల), ఎం.శిరీష (విద్యాధరి డిగ్రీ కళాశాల) ప్రాతినిధ్యం వహించనున్నారు. కోచ్గా కె.మురళీ వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులను వీసీ కె.ఆర్.రజిని, అధికారులు మంగళవారం అభినందించారు. ఇన్ఫోసిస్ స్కాలర్షిప్కు విద్యార్థి ఎంపిక టెక్కలి: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అందజేసే స్కాలర్షిప్కు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మొదటి ఏడాది సీఎస్ఈ విద్యార్థిని ఎ.హేమలత ఎంపికై నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థినికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు రూ. 4 లక్షలు ఉపకార వేతనం కింద అందజేస్తారని వివరించారు. పదో తరగతి, ఇంటర్లో సాధించిన మార్కులతో పాటు ఆర్థిక స్థోమత, ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, సీఎస్ఈ హెచ్ఓడీ వై.రమేష్, అసిస్టెంట్ హెచ్ఓడీ టి.చలపతిరావు, శాక్ ఇన్చార్జి జె.సురేష్కుమార్ అభినందించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన మినీ వ్యాన్ టెక్కలి : కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన వండాన శ్రీను టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు తన ట్రాక్టర్తో వస్తుండగా, బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. వ్యాన్ డ్రైవర్ బాదల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్కుమార్(33) ఆమదాలవలస పట్టణానికి చెందిన చిట్టీ వ్యాపారి వేధింపులు తాళలేక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతున్న సురేష్కుమార్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తండ్రి పొన్నాడ దమరకేశ్వరరావు, తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్–2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ సహా, పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
అవినీతి నిరోధక కమిటీ జిల్లా కన్వీనర్గా రాంబాబు
జయపురం: అఖిల భారత అవినీతి నిరోధక కమిటీలో జయపురానికి చెందిన ప్రముఖ కళాకారుడు, సమాజ సేవకుడు గండ్రేటి రాంబాబుకు అవకాశం దక్కింది. కొరాపుట్ జిల్లా అవినీతి నిరోధక కమిటీ కన్వీనర్గా ఆయన నియమితులయ్యారు. అఖిల భారత అవినీతి నిరోధక సంఘటన కన్వీయర్, ఒడిశా హైకోర్టు న్యాయవాది సుభ్రత కుమార్ నందో సోమవారం విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల్లో జిల్లా అంతా పర్యటించి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాంబాబుకు సుభ్రత కుమార్ నందో సూచించారు. కొరాపుట్ జిల్లాలో వివిధ ప్రభుత్వ పదవీ కాలంలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై వివరాలు సేకరించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాంబాబు మంగళవారం వెల్లడించారు. ఖోఖో క్రీడాకారిణికి అభినందనలు రాయగడ: ఇటీవల ముగిసిన ప్రపంచ ఖోఖో పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టులో సభ్యురాలుగా ఉన్న మంగాయి మఝిని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అభినందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారిణి మంగాయి మఝికి దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. ప్రపంచ ఖోఖో పోటీల్లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీకి చెందిన మంగాయి మాఝి పాల్గొని భారత్తో పాటు రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ పాల్గొన్నారు. రాయగడ బ్లాక్లో 28న జాబ్మేళా పర్లాకిమిడి: ఈనెల 28న రాయగడ బ్లాక్ చంపాపూర్ వద్ద మినీస్టేడియంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి మంగళవారం తెలిపారు. టెన్త్ ఫెయిల్ నుంచి పట్టభద్రులు, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్తోపాటు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు త్రిపాఠి తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు దాదాపు 40 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు తమ విద్యార్హల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకొని హాజరు కావాలన్నారు. -
మూలకు చేరిన నిఘా నేత్రం!
● శ్రీకూర్మం క్షేత్రంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని పాలకులు గార : విష్ణువు అవతారాల్లో రెండో అవతారం, ప్రపంచంలో ఇంకెక్కడా నిర్మించకూడదని పురాణాలు పేర్కొన్న ప్రముఖ క్షేత్రం శ్రీకూర్మం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం వద్ద నిఘా మసకబారుతోంది. గతంలో మూలవిరాట్ స్కాన్, తిరునామం పగలగొట్టడం వంటి ఘటనలు నేపథ్యంలో 2012లో హిందుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలువురు అధికారులు మారినప్పుడు సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. తర్వాత నిర్వహణ కొరవడంతో సీసీ కెమెరా వ్యవస్థ పనిచేయడం లేదు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించే మానిటర్ వ్యవస్థ పాడైపోయింది. గర్భగుడి లోపలికి, ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు గమనించేందుకు సీసీలు ఏర్పాటు చేసినప్పటికీ మానిటర్ కొద్దిరోజుల కిందట కాలిపోయింది. ఇప్పటీకీ మరమ్మతులు చేయలేదు. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఈవోకు రావివలస, పలాస గ్రూపు ఆఫ్ టెంపుల్స్తో పాటు శ్రీకూర్మనాథాలయం బాధ్యతల ఉన్నాయి. ఇక్కడ ఈవోతో మొదలుకొని అందరూ ఇన్చార్జిలే. రాత్రిపూట పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథరావు వద్ద ప్రస్తావించగా సీసీ టీవీ మానిటర్ కాలిపోవడం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. తన మొబైల్లో లింక్ ద్వారా సీసీ ఫుటేజ్ చూస్తున్నానని తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారని, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని పశుసంచార వాహన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని వాటిని ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. అదే విధంగా తమకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేయడం అనివార్యమైతే తమను పశుసంవర్ధక శాఖలో కొనసాగించాలని కోరారు. -
నువ్వలరేవులో విషాదం
కంచిలి/వజ్రపుకొత్తూరు రూరల్: కంచిలి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెహరా ధర్మారావు(31), బెహరా సన్నా అలియాస్ షణ్ముఖరావు(38) మృతిచెందడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్ను తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మారావు స్వగ్రామంలో టైలరింగ్ చేస్తుండేవాడు. అతని సహాయకుడిగా సన్నా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ రెడీమేడ్ దుస్తుల్ని కుట్టి బరంపురంలోని హోల్సేల్ వ్యాపారులకు ఆర్డర్పై అందిస్తుడేవారు. ఈ క్రమంలోనే బరంపురం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లబోదిబోమంటున్నకుటుంబాలు.. ధర్మారావుకు భార్య పూజ, కుమారుడు మున్నా, కుమార్తె వర్షిణి ఉన్నారు. సన్నాకు భార్య శృతి, మూడేళ్ల కుమారుడు రోషన్ ఉన్నారు. వీరంతా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు యువకుల మృతితో నువ్వలరేవులో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరడంతో అశృనయానాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీలు, మత్య్సకార సొసైటీ సభ్యులు, గ్రామపెద్దలు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అశ్రునయనాల మధ్య రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియలు బాధిత కుటుంబాలకు పలువురి పరామర్శ -
ఉద్దానంలో ఎలుగు సంచారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర జీడి తోటల్లో గత రెండు రోజులుగా ఎలుగు సంచరిస్తూ రైతుల కంట పడటంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉద్దాన ప్రజల జీవనాధారమైన జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు తోట పనుల్లో బిజీ బిజీగా తోటల్లోనే గడుపుతున్నారు. తోటకు కంచెలు ఏర్పాటు చేయడం, పురుగు మందులు వేయడం, తదితర పనులు చేసేందుకు తోటకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఎలుగు దాడి చేస్తుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటిని తప్పించబోయి వ్యక్తి మృతి కాశీబుగ్గ: మందస మండలం ముకుందపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మందసకు చెందిన జయరాం తన భార్యతో కలిసి స్కూటీపై వస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి రావడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జయరాం అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాయగడ: బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఎం.గొపి ఆనంద్ తన మద్దతు దారులతో పూరి శ్రీజగన్నాథుడ్ని సోమవారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి 13 మంది బరిలో ఉండగా గొపిని అధిష్టానం ఎంపిక చేయడంపై ఆయన మద్దతుదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్నాథస్వామిని దర్శించుకున్న ఆయన జిల్లాలో పార్టీ బలొపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహాకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరేలా కృషి చేస్తానని వివరించారు. స్వామి దర్శనానికి వెళ్లినవారిలో సీనియర్ నాయకుడు శివశంకర్ ఉలక, భాస్కర పండ, దేశాశీష్ పండ, పలువురు కార్యకర్తలు ఉన్నారు. బాలిక ఆత్మహత్యాయత్నం జయపురం: జయపురం సమితి బంకబిహారి గ్రామంలో ఒక బాలిక తన తల్లితో ఏదో విషయంపై గొడవ పడి సమీప అప్పర్ కొలాబ్ ఇరిగేషన్ ధనపూర్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ ప్రాంతంలో ఉన్న వారు చూసి వెంటనే ఆమెను రక్షించి కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించగా ఆమెకు ప్రమాదం తప్పిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. భైరాగిమఠం గ్రామం లో +2 చదువుతున్న పూజా హరిజన్ తన తల్లితో ఏదో విషయమై గొడవపడింది. ఇరువురి మధ్య మాటలు పెరగడంతో ఆమె ధనపూర్ శాఖా కెనాల్లో దూకేసింది. దీంతో స్థానికులు రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాంగ్రెస్లోకి బీజేడీ యువనేత కొరాపుట్: బీజేడీ పార్టీ సీనియర్ గిరిజన యువజన నాయకుడు అఖిల్ బోత్ర ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని పీసీసీ కార్యాలయంలో ప్రముఖుల సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. పీసీసీ నూతన అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ చేరిక జరిగింది. నబరంగ్పూర్ జిల్లాకి చెందిన అఖిల్ తన రాజకీయ జీవితం మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి బాటలో కొనసాగించారు. ప్రదిప్తో కలిసి కాంగ్రెస్ను వీడి బీజేడీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక ప్రదిప్ని వదలి తిరిగి మాతృ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. కలిమెల సమితిలో నీటి సమస్య మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కంగూర్కొండ గ్రామంలో వేసవి ప్రారంభానికి ముందే ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో బోరుగాని, బావిగాని లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నది నుంచి నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే వేసవి ప్రారంభం కావడంతో నదిలో కూడా నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ నీటి సరఫర విళభాగం జూనియర్ ఇంజినేర్ నిత్యానాందొ సోరాన్ను గ్రామస్తులు మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
కోట్లాది రూపాయలతో వ్యక్తి పరారీ
సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
వృద్ధులకు ఉచిత ప్రయాణం
మల్కన్గిరి నుంచి.. కొరాపుట్: అసోంలోని కామాఖ్యా, కోల్కతాలోని దక్షిణ కాళీ దర్శనాలకు వెళ్లే వృద్ధులకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించారు. ఈమేరకు మంగళ వారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో డాబుగాం ఎంఎల్ఏ మనోహర్ రంధారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. జిల్లా నుంచి 130 మంది వృద్ధులు పయనమయ్యారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో మనోజ్ కుమార్ బెహరా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.కీర్తి వాసన్ జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. ఈ జిల్లా నుంచి 167 మంది తీర్థ యాత్రలకు వెళ్తున్నారు. ఈ బస్సులన్నీ రాయగడ చేరుకుని అక్కడ నుంచి రైలులో ముందుకు సాగనున్నారు. వీరందరికీ ఉచిత రవాణా, ఆహారం, వసతితి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. తీర్థయాత్రలకు సీనియర్ సిటిజన్ల పయనం రాయగడ: దారిద్య్ర రేఖ దిగువన గల సీనియర్ సిటిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏటా సొంతఖర్చులతో తీర్థయాత్రలకు పంపిస్తోంది. బీజేపీ కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం 775 మంది సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రైలులో తీర్థయాత్రలకు పంపించింది. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఫరూల్ పట్వారి ముఖ్యఅతిథిగా హాజరై పచ్చ జెండాను ఊపి రైలును ప్రారంభించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని కొరాపుట్, రాయగడ నవరంగపూర్, మల్కన్గిరి జిల్లాలతో పాటు కలహండి, నువాపడ జిల్లాలకు చెందిన సీనియర్ సిటిజన్లు ఈ తీర్థయాత్రలు చేయనున్నారు. వీరికి ఎస్కార్ట్గా మరో 25 మందిని ప్రభుత్వం పంపించింది. వారి ఆలనాపాలన, అవసరమైనవి అందివ్వడంతో పాటు వారికి పర్యటన రోజుల్లో దిక్సూచిగా వీరు వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 31988 మంది సీనియర్ సిటిజన్లు తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చారని చెప్పారు. మంగళవారం పర్యటించిన సీనియర్ సిటిజన్లు రాయగడ నుంచి కోల్కతా–కామాక్షి వరకు పర్యటించి తిరిగి వస్తారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయగడ నుంచి బయలు దేరిన ప్రత్యేక రైలును సుందరంగా అలంకరించారు. సీనియర్ సిటిజన్లకు జిల్లా యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికింది. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా నుంచి 71 మంది వృద్ధులను తీర్థయాత్రలకు పంపనున్నారు. రెండు బస్సుల్లో బుధవారం వారిని రాయగడ పంపించి అక్కడి నుంచి ట్రైన్లో అస్సోంలోని కామాక్షి అమ్మవారి దర్శనానికి పంపించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ప్రయాణించనున్నారు. బస్సును జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి మాధవ్ పంగి, జిల్లా డీఐపీఆర్ఓ ప్రమిళా మాఝి తదితర అధికారులు పాల్గొన్నారు. -
రీ–సర్వే పనులు కచ్చితత్వంతో ఉండాలి
సీతానగరం: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూముల రీసర్వే పనులు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో నిర్వహిస్తున్న రీ–సర్వే పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. మ్యాప్లో గ్రామ భూ విస్తీర్ణం, ఇప్పటివరకు పూర్తి చేసిన సర్వే..ఇంకా చేపట్టనున్న సర్వే వివరాలను మండల సర్వేయర్ చంద్రరావును అడిగి తెలుసుకున్నారు. భూమి కొలతలు వేసేముందు రైతులకు ఫామ్నంబర్ 19 నోటీసులు ఇస్తున్నదీ లేనిది, అడంగల్లో రైతుల పేరు మీద ఉన్న భూమి విస్తీర్ణానికి కచ్చితంగా కొలతలు వేస్తున్నారా? లేదా అనే విషయాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో కచ్చితమైన హద్దులను నిర్ణయించి రైతులకు భూమిని అప్పగించాలని సూచించారు. నోటీసులు తీసుకునే ముందు అందుబాటులో లేని రైతులకు, వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేయాలని చెప్పారు. రీ–సర్వే కొలతల్లో తేడా లేకుండా రైతులు చూసుకోవాలని కోరారు. రీ–సర్వే ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తహసీల్దార్ ప్రసన్నకుమార్ను కలెక్టర్ ప్రశ్నించగా ఈనెల 26 నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కానుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 450ఎకరాలు సర్వే పూర్తి కాక మరో 430 ఎకరాల్లో రీ–సర్వే పని పూర్తి కావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఉపతహసీల్దార్ ఎ.ఉమామహేశ్వరరావు, ఈఓపీఆర్డీ కుమార్వర్మ, పంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్, వీఎస్ఏ మన్మథరావు, వీఆర్ఓ కిరణ్, సర్వేయర్ల బృందం పాల్గొన్నారు. -
జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు చేయండి
జయపురం: జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించకుంటే జయపురం బంద్ చేస్తామని మో జగన్నాథ సాగర్ ట్రస్టు నిర్ణయించింది. స్థానిక గీతా శవణం ప్రాంగణంలో మందిరంలో మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఉద్యోగులు రజనీ కాంత నాయిక్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో పునరుద్ధరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజనీ కాంత నాయిక్ చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ ప్రాధాన్యతను వివరించారు. ఆక్రమణలకు లోనవుతూ శిథిలావస్థకు చేరుకుంటున్న సాగర్ను అభివృద్ధి చేయాలన్నారు. మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పలు ఆందోళనలు జరిపినా సంబంధిత అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. జగన్నాథ్ సాగర్ పనులలో అక్రమాలు ఉన్నాయని, అందుకే సాగర్ పునరుద్ధరణ పనులను టాస్క్ ఫోస్క్ ద్వారా నిర్వహించాలని ట్రస్టు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్నాథ్ సాగర్ పనులు పూర్తికి సాగర్ పోరాట కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో పాల్గున్న పట్టణ ప్రముఖులు, మేధావుల అభిప్రాయాలు సేకరించారు. సమావేశంలో సతీష్ నంద, నిరంజన్ పాణిగ్రహి, బరిగడ చంధ్ర శేఖర్, హర మిశ్ర, రఘు త్రిపాఠీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.మనోజ్ కుమార్, హిమాంశు మహాపాత్ర, విద్యుత్ మిశ్ర, ధిరెన్ మోహణ పట్నాయిక్, సుభాష్ రౌత్, అరుణ కుమార్ భటమిశ్ర, సుధీర్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్
కళాశాలల్లో క్రీడలకు దూరం.. నేను ఆలిండియా యూనివర్సిటీ హ్యాండ్బాల్లో గోల్డ్ మెడల్ విన్నర్ని. గేమ్స్లో ఆసక్తితో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగంలో చేశాను. స్కూల్స్ వరకే పీడీ, పీఈటీలు ఉన్నారు. కాలేజీలకు పూర్తిగా పీడీలు లేరు. గత ప్రభుత్వం హయాంలో నాకు పదోన్నతి లభించింది. హెచ్ఎంగా చేరాల్సి వచ్చింది. క్రీడ లకు దూరమైపోయాను. అదే జేఎల్స్గా పదోన్నతులు కల్పించి పీడీలుగా నియమిస్తే జూనియర్ కాలేజీలు సైతం క్రీడలతో కళకళలాడుతుండేవి. –ఎమ్మెస్ చంద్రశేఖర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు మండలం శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు శిక్షకులు కావాలి. అందుకు ప్రభుత్వ స్కూళ్లలో పాఠశాల స్థాయిలో పీడీ/పీఈటీలు ఉన్నారు. పాఠశాల స్థాయి తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38 ఉంటే.. పనిచేస్తున్న పీడీలు సున్నా. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు, శిక్షకులను నియమించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా శిక్షకులు లేక నిరాశకు లోనవుతున్నారు.కొంతమంది పిల్లలు వివిధ వేదికల్లా రాణిస్తున్నా.. వారి వ్యక్తిగత ప్రతిభతోనే గుర్తింపు పొందుతున్నారు. నాలుగు గదులకే పరిమితమవుతూ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు పీఈటీలు, పీడీలు విద్యార్థులకు క్రీడల పట్ల మంచి శిక్షణ ఇస్తున్నారు. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అయితే వారి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్లో చేరేసరికి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడం. సర్కారీ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు క్రీడలు, వ్యాయామాలకు దూరమైపోతూ నిరంతనం తరగతుల గదులకే పరిమితం అవుతున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్, గంజాయి, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. అదే కాలేజీల్లో పీడీలుంటే వ్యాయామం, క్రీడలు, ఆటపాటలపట్ల ఆకర్షితులను చేస్తే మానసిక ఉల్లాసం, ఆనందం కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పదోన్నతల ప్రక్రియ.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 30 మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38 ఉన్నాయి. వీటిల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరూ లేరు. పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఎంపీఈడీ కోర్సు పూర్తి చేస్తే పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందేవారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు ఉద్యోగోన్నతులపై జూనియర్ కళాశాలలకు వెళ్లేవారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతున్నందున ఉద్యోగ పదోన్నతులు రెండు దశాబ్దాలుగా ఆగిపోయాయి. పీఈటీలంతా పాఠశాలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో పీడీలను పాఠశాలల్లో హెచ్ఎంలగా పదోన్నతులు కల్పించి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి వారి పేరిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. కానీ న్యాయస్థానాల్లో కేసులు కారణంగా జూనియర్ కాలేజీలకు పీడీలగా మాత్రం ఉద్యోగోన్నతలు పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగోన్నతుల ద్వారా ఉన్నత పాఠశాలల్లో పీడీలను జేఎల్స్ పీఈగా పదోన్నతులు కల్పించాలని పీడీ, పీఈటీల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఇంటర్ సెకెండియర్ విద్యార్ధులుజిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడీలు3863837883 ఉద్యోగోన్నతులు కల్పించాలి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామకాలను ఉద్యోగోన్నతుల ప్రక్రియ ద్వారా చేపట్టాలి. జూనియర్ కళాశాలల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. క్రీడలకు దూరమైపోతున్నారు. జూనియర్ కాలేజీల్లో పీడీల నియామకాలు జరిగితే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు జూనియర్ కాలేజీల్లో కనుమరుగవుతున్న ఫిజికల్ డైరెక్టర్లు మొత్తం 38 చోట్ల ఒక్కరూ లేని వైనం నష్టపోతున్న విద్యార్థులు పట్టించుకోని ప్రభుత్వం 0 -
విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి
ఆమదాలవలస: సొంత భూమి గల ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. జొన్నవలస రైతుసేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. అనంతరం మునగవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
అపరాలకు దక్కని మద్దతు..!
● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం ● ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● తుఫాన్ల కారణంగా వేల హెక్టార్లలో పంటకు నష్టం విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్లో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల వరి పంటతో పాటు అపరాల (పెసర, మినుము) పంటలు కూడా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉన్న పంటకు కూడా ప్రస్తుతం మద్దతు ధర రాని పరిస్థితి. మార్కెట్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర రానప్పడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేయాలి. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి సర్కార్ చెప్పింది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాసాన పోలేదు. తాజాగా అపరాలు సాగు చేసిన రైతులు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము పండించిన పెసర, మినుము చాలా వరకు పంట తీసి నూర్పులు చేసి పంట వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో పంటను తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21,931 హెక్టార్లలో అపరాలు సాగు జిల్లాలో అపరాలు 21 931 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పెసర పంట 5,909 హెక్టార్లలోను, మినుము పంట 16,011 హెక్టార్లలో సాగైంది. వీటి ద్వారా పెసర పంట 3,520 మెట్రిక్ టన్నులు, మినుము పంట 10,081 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పెసర ఎంఎస్పీ రూ.8682 పెసర పంట ఎంఎస్పీ క్వింటారూ. 8682, మినుములు ఎంఎస్పీ క్వింటాకు రూ.7400 అయితే ప్రభుత్వం అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అపరాలు విక్రయించాల్సిన పరిస్థితి. పెసలు క్వింటాకు రూ.7 వేలు, మినుములు క్వింటాకు రూ.6500 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జిల్లాలో సాగైన అపరాల్లో తుఫాన్ వల్ల చాలా వరకు పంట దెబ్బతింది. ఎకరాకి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకి క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితి. ఉన్న పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా వరకు రైతులు పంట తీసేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏకారణం చేతనో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాలి అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెఫెడ్ డీఎంకు లెటర్ రాశాం. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.డి.కి ప్రతిపాదనలు పంపిస్తాంజిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాసిన లెటర్ అందింది. జేసీ ద్వారా మార్కెఫెడ్ ఎం.డి.కి అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎన్.వెంకటేశ్వరావు, మార్కెఫెడ్ , జిల్లా మేనేజర్ -
సంతృప్తి చెందేలా వినతులకు పరిష్కారం
విజయనగరం అర్బన్: ఆర్థిక పరమైన అంశాలు, కోర్టుల నుంచి నిలిపివేయమని ఆదేశాలు వచ్చిన అంశాలు తప్ప మిగిలిన అన్ని రకాల వినతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతులకు పూర్తిస్థాయిలో కూలంకుషంగా చదివి, పిటిషనర్లతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్జీదారుల సంతృప్తే ముఖ్యమని భావించి సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, సీఎంఓ, వీఐపీ గ్రీవెన్స్సెల్లో నాలుగు రకాల వినతులు అందుతున్నాయని చెప్పారు. వాటిపై నిర్వహించిన విశ్లేషణలో సరాసరిగా ఒక్కో కుటుంబం నుంచి రెండు వినతులు వస్తున్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఏ ఒక్క వినతైనా గడువు దాటితే సంబంధిత అధికారికి చార్జ్ మోమో జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. నియోజకవర్గం వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, బుధవారం లోగా నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియపై ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, వచ్చిన వినతులకు సరైన పరిష్కారం చూపిస్తే, రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 శాతం సమస్యల పరిష్కారం జరుగుతోందని, ప్రతిరోజూ సమీక్షించడం వల్ల పెండింగ్ తగ్గిందన్నారు. రీఓపెన్ కేసులపై మండలాల వారీగా సమీక్షించి, కారణాలను తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, డిప్యుటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
నూతన విధానంతో సులభతరం..
దివ్యాంగులు పాస్లు పొందేందుకు రైల్వేశాఖ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో జిల్లా వాసులు సంబంధిత రైల్వేస్టేషన్కు ఇతరుల సాయంతో వెళ్లి అక్కడ దరఖాస్తు అందజేసేవారు. రైల్వే అధికారులు జిల్లా నుంచి వచ్చిన మొత్తాన్ని సేకరించి సంబంధిత రైల్వే సబ్డివిజన్కు పంపేవారు. అక్కడ అధికారుల ఆమోద ముద్ర పడిన తరువాత తిరిగి జిల్లాకు వచ్చేది. ఇదంతా జరగడానికి దాదాపు మూడు నెలల వరకు సమయం పట్టేది. ఈ లోగా పాస్ల కోసం దివ్యాంగులు నాలుగుసార్లు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ఇబ్బందులను గుర్తించి నూతన విధానానికి రైల్వే శాఖ నాంది పలికింది. దివ్యాంగులు తాము ఉండే ప్రాంతం నుంచే నెట్ సెంటర్, ఈ–సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ తరువాత 20 రోజుల్లోపు వారు ఆన్లైన్లో పాస్ కూడా తీసుకోవచ్చు. సమయంతో పాటు శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కె.కుమార స్వామి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎ.డి, విజయనగరం -
బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మహారాణి పేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రూమ్లను పరిశీలించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్, కూర్మానంద రావు, తహసీల్దార్ పి.సత్యవతి ఎంఈఓ, జిల్లా బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు, టూ టౌన్ ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.వ్యక్తి అరెస్ట్గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. -
ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విజయనగరం గంటస్తంభం: ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేస్తూ క్యాబినెట్ చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అయితే మొత్తం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అంతేగానీ మళ్లీ థర్డ్ పార్టీ విధానంలో కార్మికుల్ని బందీలను చేసి వారి శ్రమను కొల్లగొట్టాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోందని, రిటైర్ అయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. చివరికి వాటర్ సప్లై, నైట్ శానిటేషన్, స్ట్రీట్లైట్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా, నచ్చినట్లు విధుల నుంచి తొలగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అతి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కుదింపు, పోలవరం అమరావతి సహా రైల్వే జోన్ తదితర ప్రాధాన్యతా అంశాలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ కూటమి పెద్దలు మౌనంగా ఉండడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, నాయకులు పాపారావు, భాస్కరరావు, గురుమూర్తి, రాఘవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
రామభద్రపురం: పాస్ తీసుకోవడానికి దివ్యాంగులు పడే కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. దివ్యాంగులు ఇక నుంచి రైల్వే పాస్లను నేరుగా స్టేషన్కు వచ్చే తీసుకునే పనిలేకుండా అన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ ప్రారంభించింది.అందులోనే ఈ–టికెట్ బుక్ చేసుకునే కొత్త విధానాన్ని ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఆర్థోపెడిక్, అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగత్వం తదితర అంగవైకల్యం కలిగిన అన్ని వయసుల వారు కలిపి మొత్తం 73 వేల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వారిలో దాదాపు 45 వేల మంది రైల్వేపాస్లు పొందేందుకు అర్హులున్నట్లు అధికార సమాచారం. రైల్వే పాస్ల కోసం దివ్యాంగులు నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అన్లైన్ విధానంతో ఆ కష్టాలు తప్పనున్నాయి. ఆన్లైన్లో పాస్ జారీ ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోనే కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో జ్ట్టి ఞ://ఛీజీఠి డ్చ ుఽజ్జ్చ ుఽజీఛీ.జీ ుఽఛీజ్చీ ుఽట్చజీ .జౌఠి.జీ ుఽ వెబ్సైట్లోకి వెళ్లి పాస్కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు(యూడీ ఐడీ)మంజూరు చేస్తారు. నూతన పాస్ కావాల్సిన వారు, పాత పాస్ రెన్యువల్కు కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్సైట్ అమల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి దరఖాస్తును పరిశీలించుకోవచ్చు. ఇకపై ఆన్లైన్లో రైల్వేపాస్ జిల్లాలో 45 వేల మంది అర్హులు ఇకపై ఆన్లైన్లో పాస్ తీసుకోవడానికి రైల్వేశాఖ చర్యలు ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు -
సారాతో నలుగురి అరెస్టు
మెంటాడ: సారా తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సారా బాటిల్స్ మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర రిజార్వాయర్ వెనుక గల లోతుగెడ్డ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 20 బ్యాటిల్స్లో 40 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకుని వారిని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయండి● ట్రాన్స్కో ఎస్ఈ చలపతిరావు ● సాక్షి కథనానికి స్పందన వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను మోసగిస్తోందని మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఉచిత విద్యుత్ పధకానికి మంగళం’ అనే కధనంపై జిల్లా ట్రాన్స్కో ఈఓ చలపతిరావు స్పందించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే మండలాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈలను ఆదేశించారు. గూడ్స్ సైడింగ్ ప్రారంభందత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గందర గోళం మధ్య గూడ్స్సైడింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైల్వే మూడో లైన్ పనులతో పాటు గూడ్స్ సైడింగ్ పనులు అప్పట్లో ప్రారంభమై పూర్తి కావడంతో బొబ్బిలి గూడ్స్షెడ్ స్థానంలో కోమటిపల్లి పల్లి వద్ద మంగళవారం ప్రారంభం కావడంతో ఇంతవరకు బొబ్బిలిలో పని చేసిన కార్మికులతో పాటు వి,కృష్ణాపురం, వింధ్యవాసి, వంగర, పెదమానాపురం, పాచలవలస మరడాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్మికులు రావడంతో మధ్యాహ్నం వరకు పనులు ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ నుంచి కోమటిపల్లి ఆటోస్టాండ్ వరకు బియ్యం లారీలు ఉండడం గమనించిన పెదమానాపురం ఎస్సై కాంట్రాక్టర్తో మాట్లాడగా ఆయన కార్మికులతో తొలి రోజు 50 లారీలలో వచ్చిన బియ్యాన్ని రైలులో వేయించారు. చెరకు లారీ బోల్తారాజాం సిటీ: మండల పరిధి రాజయ్యపేట జంక్షన్ వద్ద మంగళవారం చెరుకు లారీ బోల్తా పడింది. పరిమితికి మించి లోడుతో తెర్లాం నుంచి రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద లారీ బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. రహదారి భద్రతపై ర్యాలీవిజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నబకిశోర్
పర్లాకిమిడి: గజపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రాయఘడ మాజీ చైర్మన్ నబకిశోర్ శోబోరో ఎన్నికై నట్టు బీజేపీ ఎన్నికల అధికారి ప్రదీప్ చంద్ర షడంగి ప్రకటించారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి బీజేపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన నూతన అధ్యక్షుడు నవకిశోర్ శోబోరోకు మాజీ అధ్యక్షుడు కోడూరు నారాయణరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నబకిశోర్ శోబోరో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి, బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తనపై విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మోహానా, పర్లాకిమిడి నియోజికవర్గాల్లో ఎక్కువ స్థానాలను బీజేపీ అభ్యర్థులు కై వసం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. గజపతి జిల్లాలోని మాజీ నాయకులు, యువతను కలిసి బీజేపీలో నూతన ఉత్తేజం కల్పిస్తానన్నారు. గ్రామాలు, పట్టాణాల్లో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
దొంగలుపడ్డారు..
పర్లాకిమిడి: స్థానిక ఎం.ఆర్.బోయ్స్ హైస్కూల్ జంక్షన్ (14 వార్డు) వద్ద నివాసం ఉంటున్న నర్సింగ బిశ్వాళ్ అలియాస్ కుక్కు ఇంటిలో దొంగలుపడ్డారు. మూడు తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకున్నట్లు ఆదర్శ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నర్సింగ బిశ్వాళ్ నాలుగు రోజులుగా ఇంటికి తాళం వేసి రూర్కెలాకు తన పిల్లలతో వెళ్లాడు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తాళాలు విరిగి ఉండటంతో నర్సింగ బిశ్వాళ్కు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎ.ఎస్.ఐ తపన్ కుమార్ పాడి వచ్చి దొంగతనం ఎలా జరిగిందో దర్యాప్తు చేశారు. ఇంటికి వెనుకభాగం హైస్కూల్ ప్రహరి ఉండటంతో అక్కడి నుంచే తలుపులు పగలు గోట్టి దుండగులు ఇంటి లోపలికి చోరబడి బీరువా లాకర్ ఇరగ్గోట్టి నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాచుకున్న నగదు, బంగారం పోవడంతో ఇంటి యజమాని నర్సింగ బిశ్వాళ్ కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు తులాల బంగారం, రూ.50 వేల నగదు చోరీ -
సారా ధ్వంసం
జయపురం: నాటు సారా అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని జయపురం అబ్కారి సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యక్తి జయపురం సమితి పుస్పురి గ్రామానికి చెందిన కుమ హరిజన్(46) అని అబ్కారి అధికారి సుబ్రత్ కేశర హిరన్ సోమవారం వెల్లడించారు. జయపురం సదర్ పోలీసులు, అబ్కారి సెట్లైట్ యూనిట్, అబ్కారి విభాగ సిబ్బంది కలిసి రూ.90 వేల విలువ చేసిన సారా ధ్వంసం చేసినట్లు తెలిపారు. సదర్ పోలీసులు, అబ్కారి సెట్లైట్ యూనిట్, అబ్కారి విభాగ సిబ్బంది సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జయపురం సమితి కొలాగుడ సమీప అడవిలో అక్రమంగా సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. సారా బట్టీలపై దాడి చేశారు. ఆ ప్రాంతంలో 4 బట్టీల్లో 60 లీటర్ల నాటు సారా, సారా వంటకానికి సిద్ధం చేసి ఉంచిన 1300 లీటర్ల ఇప్ప ఊట ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. బట్టీల్లో సారా వంటకానికి వినియోగించే సామగ్రిని సీజ్ చేశారు. ఆ సమయంలో ఆ మార్గంలో సారా తీసుకువెళ్తున్న కుమ హరిజన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో జయపురం అబ్కారి అధికారి సుబ్రత్ కేశర హిరన్, ఏఎస్ఐ బలరాం దాస్, సెటలైట్ యూనిట్ ఏఎస్ఐ బ్రజకిశోర్ నాయక్, సదర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నరసింహ, ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అంగన్వాడీలు సుదీర్ఘ పోరాటం చేశారని, ఆ సమయంలో కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, వారి ప్రభుత్వం ఏర్పడినా నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా 2019 నుంచి జీతాలు పెరగలేదన్నారు. దీనికితోడు యాప్లు, నూతన విధానాలతో పని భారాలు పెంచుతున్నారని వాపోయారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్. ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.జ్యోతి, జి.రాజేశ్వరి, కె.సంధ్యారాణి, అంజలీభాయ్, కృష్ణభారతి, లక్ష్మి, లక్ష్మినారాయణ, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా -
ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం
రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో ఎల్.శ్రీరాములుకు చెందిన ఖాళీ కోళ్ల ఫారం సోమవారం దగ్ధమైంది. మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రణస్థలం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రణస్థలం అగ్నిమాపకాధికారి పైల అశోక్ తెలిపారు. కాశీబుగ్గలో ఉద్రిక్తత కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడు రోడ్లు కూడలి వద్ద ఫుట్పాత్పై ఉన్న పూజా సామగ్రి షాపు తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో జేసీబీతో షాపును తొలగిస్తుండగా దుకాణదారుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి దుకాణదారులను అదుపుచేశారు. ఈ క్రమంలో షాపు యజమాని కఠారి శ్యామ్ ఒంటిపై నూనె పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని శ్యామ్ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులను కూడా పోలీసు స్టేషన్కు తరలించారు. వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం ఆమదాలవలస రూరల్: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్కుమార్ అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంభ సభ్యులు చెబుతున్నారు. చిట్టీ డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ చిట్టీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. -
శ్రీముఖలింగంలో పట్టాభిషేకం
జలుమూరు: దక్షిణ కాశిగా పేరొందిన శ్రీముఖలింగంలో సోమవారం కళింగరాజు అనంత వర్మ చోడ గంగదేవుడి 947వ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, వారాహి అమ్మవారికి కుంకమ పూజలు నిర్వహించారు. నాటి రాజు పాలన, సైనిక శక్తి, ఆలయాల అభివృద్ధి, శ్రీముఖలింగం రాజధానిగా చేసుకొని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మించిన ఆలయాలు, శాసనాలను ఒడిశా ప్రాజెక్టు అధికారి విష్ణు మోహన్ వివరించారు. నాటి కట్టడాలు విశిష్టతను కటక్ చాపర్ కో కన్వీనర్ దీపక్కుమార్ నాయక్ తెలియజేశారు. గంగదేవుడి చిత్రపటాలతో ప్రదక్షిణలు చేసి ఆలయ కార్యాలయంలో భద్రపరిచారు. కళింగ రాజ్యంతోపాటు జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన దానాలు, తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలను పీఏఎస్ కార్యదర్శి, కో కన్వినర్ మురళీధర్, తరుణ్ సింగ్లు వివరించారు. భావితరాలకు ఆనాటి రాజుల చరిత్ర తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి పాండ్రీపాణి పంచాయతీ ఎస్ఎస్డీ ప్రాథమిక విద్యాలయ ప్రాంగణంలో సోమవారం సామాజిక భద్రత, దివ్యాంగుల చైతన్యం కోసం భీమబోయి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కన్గిరి సమితి అధ్యక్షుడు గౌరీ పోడియామి హాజరయ్యారు. ఈ సందర్భంగా 460 మంది దివ్యాంగుల యూడీఐడీ కార్డుల కోసం నమోదు చేసుకున్నారు. మరో 92 మంది హితాధికారులకు బస్సు పాస్, 44 మందికి డీఆర్ఎల్ లోన్, 133 మందికి పింఛన్లు, ఆరుగురికి వీల్చైర్లు, ఒక వికలాంగ జంటకు పెళ్లి కోసం రూ.2.5 లక్షలు అందజేశారు. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ రాయగడ: మునిగుడలో రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ సోమవారం పరిశీలించారు. కుట్టుమిషన్లో శిక్షణ పొందుతున్న మహిళలను అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారితకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జయరాం పంగికి పరామర్శ కొరాపుట్: కొరాపుట్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయరాం పంగిని కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక సోమవారం పరామర్శించారు. పంగి స్వస్థలం కొరాపట్ జిల్లా పొట్టంగి సమితి కుందిలిని సందర్శించారు. పంగి కూమార్తె రాజ్యలక్ష్మి పంగి ఎముకల క్యాన్సర్ బారి పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ పంగిని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. పరామర్శలో మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ ఉన్నారు. కొరాపుట్ బీజేపీ అధ్యక్షుడికి అభినందన కొరాపుట్: బీజేపీ కొరాపుట్ జిల్లా నూతన అధ్యక్షుడు శివ ప్రసాద్ ముదలికి పలువురు అభినందనలు తెలియజేశారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఆదివాసీ నేతగా బీజేపీ వర్గాల్లో పేరున్న శివప్రఽసాద్కి తొలిసారిగా ఈ పదవి రావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధిష్టానం ప్రకటన వెలువడిన అనంతరం సోమవారం పార్టీ నాయకులు పూర్ణిమా, గౌతం సామంత్రాయ్ తదితరులు వెళ్లి అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం ఏర్పాటు రాయగడ: రాష్ట్ర అమలా సంఘం రాయగడ శాఖకు సంబంధించి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అరుణ్ కుమార్ షడంగి ఈ మేరకు కొత్త కార్యవర్గం తుది ఫలితాలను వెల్లడించారు. సంఘం అధ్యక్షుడిగా మనోజ్ రొథొ, ఉపాధ్యక్షుడిగా నారాయణ పట్టజొషి, కార్యదర్శిగా అజయ్ నాహక్, సహ కార్యదర్శిగా బబితా పండా, కోశాధికారిగా గదాధర పాత్రోలు ఎన్నికై నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ విభాగానికి చెందిన 254 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కొత్త కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగుతుంది. -
విశాఖ ఉక్కుపై బిల్లు పాస్ చేయించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి నిర్ణయం తీసుకోవాలని సమాజ వికాస సేవా సంఘం సభ్యులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో భూకుంభ కోణాలు, స్టీల్ప్లాంట్కు నాణ్యతలేని బొగ్గును సరఫరా చేసే అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పర్యావరణాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి బొడ్డేపల్లి సత్యనారాయణ, కె.గోపాల్, ఎస్.ధనుంజయ, ఎ.సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
గ్రీవెన్స్సెల్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ సమితి కిరమా పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు వినతులు వెల్లువెత్తాయి. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్, ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, డీఆర్డీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గుణనిధి నాయక్లు హాజరై 83 వినతులు స్వీకరించారు. అందులో 30 గ్రామసమస్యలు కాగా, 23 వ్యక్తిగతమైనవి. నాలుగు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఒకరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కిరమా పంచాయతీ కార్యాలయం ఆవరణలో మిషన్ శక్తి స్టాల్స్ను అధికారులు సందర్శించారు. కార్యక్రమంలో నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్, ఐ.టి.డి.ఎ. అధికారి అంశుమాన్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం గ్రీవెన్స్సెల్ను జిల్లా యంత్రాంగం నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ ఎస్పీ శ్వాతి ఎస్ కుమార్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ లాల్ మోహన్ రైత్రాయ్, డీఎఫ్వో అన్నా సాహెబ్ ఒహాలే, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండి తదితరులు పాల్గొన్నారు. మునిగుడ సమితి పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది వినతులను అందజేశారు. వీటిలో 55 వ్యక్తిగత సమస్యలు కాగా మరోనాలుగు గ్రామసమస్యలుగా గుర్తించారు. అనంతరం సమస్యల పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొవాలని అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు. -
రైల్వే ప్రయాణికుల భద్రతపై అధికారుల దృష్టి
● రాయగడలో పర్యటించిన తూర్పుకోస్తా రైల్వే జీఎం రాయగడ: రైల్వే ప్రయాణికుల భద్రతపై సంబంధిత అధికారుల దృష్టిసారించారు. ఇందుల ో భాగంగా తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజరు పరమేశ్వర్ ఫంక్వాల్ సొమవారం రాయగడలో పర్యటించారు. ఆయన వెంట రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్, విశాఖపట్నం డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు ఇతర అధికారులు ఉన్నారు. రాయగడ–విజయనగరం రైల్ మార్గంలో మధ్య భద్రత చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో జీఎం ఫంక్వాల్ చర్చించారు. రాయగడలో కొనసాగుతున్న రైల్వే డివిజన్, కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనాలు తదితరమైనవి పరిశీలించారు. అనంతరం స్థానిక రైల్వే కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలనీలో పిల్లల వినోదం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఉద్యానవనాన్ని కూడా అధికారులు పరిశీలించారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. కాలనీలో పరిశుభ్రత ఎల్లవేళలా పాటించాలని సూచించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజనల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. -
శేష వాహనంపై స్వామి ఊరేగింపు
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట సమీపంలో గల శ్రీక్షేత్ర టౌన్షిప్ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనృసింహుని ఆలయ ప్రథమ వార్షికోత్సవంతో పాటు స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రధాన ఘట్టమైన శేషవాహనంపై స్వామి ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యులు, ప్రముఖ వేద పండితులు భాస్కరాచార్యులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన శేషవాహనంపై స్వామిని ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సామూహిక వివాహాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు మందిరం ప్రాంగణంలో సామూహిక వివాహాల కార్యక్రమాలను స్వామి కల్యాణోత్సవంతో పాటు కొనసాగించారు. ఐదుగురు దంపతులకు ఉచితంగా వివాహాలు చేశారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు పాల్గొని నవవధూవరులను అభినందించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వర మందిరానికి చెందిన మహిళలు విష్ణు సహాస్రనామాలు పారాయణం చేశారు. -
పట్టపగలు చోరీచేసింది పక్కింటోడే..
శ్రీకాకుళం క్రైమ్: గత నెల 22న గార మండలం శాలిహుండంలోని ఓ పండ్లవ్యాపారి ఇంట్లో పట్టపగలు జరిగిన చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాధితుడి ఇంటి పక్కన నివాసముంటున్న ఆటోడ్రైవరే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో.. శాలిహుండం గ్రామానికి చెందిన ఉర్జాన ఆదినారాయణ, రమణమ్మలు సింగుపురం కూడలి వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఉదయం వెళ్తే రాత్రి వరకు తిరిగిరారు. గత నెల 22న ఎప్పట్లాగే ఉదయం ఏడు గంటలకు వ్యాపారానికని వెళ్లిన దంపతులు రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చేసరికి వెనుక తలుపులు తీసివున్నాయి. వాస్తవానికి దంపతులే తలుపులు వేయడం మరిచారు. రమణమ్మ తాను వేసుకున్న బంగారు గాజులు, గొలుసు బీరువాలో పెట్టడానికి తాళాలు వెతకగా కనిపించకపోవడంతో షరాబుని పిలిపించి తెరిపించింది. బీరువాలో తన ఇద్దరు కుమార్తెలకు చెందిన ఆరు తులాల గొలుసు, నాలుగు తులాల హారం, రెండున్నర తులాల నక్లెస్, రెండు తులాల వొంటిపేట గొలుసు కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే గార స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన దర్యాప్తు చేపట్టారు. స్థానికుల పనేనని గుర్తించి ఓ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. అప్పులు బెడద ఎక్కువై.. రమణమ్మ పక్కింటిలో నివాసముంటున్న జోగి రాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి వరకు తిరిగి రాని రమణమ్మ ఇల్లే దొంగతనానికి సరైనదని భావించి రెండు, మూడుసార్లు ప్రయత్నించాడు. నాలుగోసారి గత నెల 22న చోరీ చేశాడు. చోరీ సొత్తును రాజు తన ఇంటి మేడపైన హోమ్ థియేటర్ స్పీకర్ బాక్సుల్లో దాచాడు. అప్పుల వారి తాకిడి ఎక్కువైపోవడంతో ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఆరు తులాల ఆభరణాలు తనఖా పెట్టేందుకు బయల్దేరాడు. అప్పటికే రాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఇంటివద్దే అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయాన్ని బయటపెట్టాడు. ప్రతిభకు ప్రశంసలు.. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ సిహెచ్ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన, వన్టౌన్ ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుని వద్ద మొత్తం సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వీడిన శాలిహుండం చోరీ కేసు మిస్టరీ పండ్లవ్యాపారి ఇంట్లో 17 తులాలకు పైగా ఆభరణాలు మాయం చేసిన ఆటోడ్రైవర్ అరెస్టు -
ఆటో–టిప్పర్ ఢీ
జయపురం: జయపురం సమితి టంకువ పంచాయతీ ధనముండ 326 విజయవాడ– రాంచీ జాతీయ రహదారిలో వంతెన సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రయాణికుల ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అంబులెన్స్లో కొరాపుట్లోని సహిద్ లక్ష్మణ నాయిక్ ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆటోలో వస్తున్న వారంతా శ్రామికులు. వారు ప్రతి రోజూ బొయిపరిగుడ సమితి లెంజ గ్రామం నుంచి కూలి పనుల కోసం జయపురం వస్తుంటారు. సోమవారం కూడా అలాగే వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి పోలీసు సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన బొయిపరిగుడ సమితి లెంజ గ్రామ ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా ఏడుపులతో ప్రతిధ్వనించింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆగపోయింది. పోలీసులు వచ్చి రోడ్డు క్లియర్ చేశారు. ఇద్దరు దుర్మరణం మరికొందరికి గాయాలు -
బాలింకేశ్వర మందిరంలో పూజలు
రాయగడ: స్థానిక బాలింకేశ్వర మందిరంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అత్యంత పురాతనమైన ఈ మందిరాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, దాతలు కలిసి అభివృద్ధి చేశారు. ఈ 24న పునప్రతిష్టాపనోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం ముహూర్తపు పూజలు నిర్వహించారు. తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, గంజాం పండితులు నీలమాధవ త్రిపాఠి, పట్టణ ప్రముఖులు, మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అటవీ భూమి పట్టాల పంపిణీ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి కంబేఢ పంచాయతీలో సోమవారం అటవీ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు కాంబేఢ, పాత చిమాటాపల్లి పోట్రేల్ పంచాయతీలకు చెందిన వారికి పట్టాలు అందజేశారు. ప్రభుత్వం తరఫున ముందుగా ఏడు గ్రామాలకు అందజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గిరిజనుడికి పట్టాలు అందజేస్తామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. కార్యక్రమంలో కాంబేడ సర్పంచ్ రమాకాంత్ మడ్కమి, డుడుమేట్ల సర్పంచ్ ముఖుందో సోడి, ప్రోట్రేల్ సర్పంచ్ పూజ పడియామి, పారెస్టర్ మోహన్ గుడియా తదితరులు పాల్గొన్నారు. రాయగడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గోపి ఆనంద్ రాయగడ: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా న్యాయవాది గోపి ఆనంద్ నియమితులయ్యారు. మొత్తం 13 మంది ఆశావహులు తమ దరఖాస్తులను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన దేవేంద్ర మహంతికి సమర్పించగా.. పార్టీ అధిష్టానం గోపి ఆనంద్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 30 జిల్లాలకు గాను 23 జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం ఏడు జిల్లాలను పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇందులో రాయగడ ఒకటి. ఎట్టకేలకు గోపి ఆనంద్కు పదవి వరించడంతో మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శబరి కల్చరల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల సంస్కృతిని పరిరక్షించేందుకు ఏర్పాటైన శబరి కల్చరల్ కౌన్సిల్ సర్వసభ్య సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో సాహిద్ లక్ష్మణ్ నాయక్ భవన్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ,విద్యా శాఖా మంత్రి నిత్యానంద గొండో అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అక్కడ నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి చేతుల మీదుగా ప్రారంభించాలని సమావేశం ఆమోదించింది. ముఖ్యమంత్రికి అనుకూలమైన తేదీ కోసం మాట్లాడడానికి అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన ఎంపీలు,ఎంఎల్ఎలు అందరం కలసి వెళ్లి ఆహ్వానిద్దామని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణీపతి సూచించారు. 1970 లో అవిభక్త కొరాపుట్ జిల్లాల వారి కోసం రాష్ట్ర రాజధాని లో ఈ సంస్థ ఏర్పాటైంది. సమావేశంలో ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి (నబరంగ్పూర్), రఘరాం మచ్చో (కొరాపుట్), రుపుధర్ బోత్ర (కొట్ పాడ్), భ్రుగు భక్షి పాత్రో, గోదావరిష్ మహాపాత్రో, సత్య ప్రియ దాస్, మానస్ త్రిపాఠి, బంక బీహారి బిసోయి, నీలో దాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిపుణ్ ఒడిశా మేళా
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఘనంగా... మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో గల బుటిగూఢ వీధిలో ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి నిపుణ్ ఒడిశా మేళా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఏడు సమితులకు చెందిన లెర్నింగ్ మెటీరియల్ సుమారు 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి ఎస్.శ్రీనివాస ఆచారి, మత్తిలి సమితి విద్యాధికారి సుమిత్ విశ్వాస్, మల్కన్గిరి సమితి విద్యాధికారి గౌరంగ్ సాజ్జన్ పాల్గొన్నారు. జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్రా సమితి కెరామటి పంచాయతీ జబాపొదర్ యూపీ స్కూల్లో సోమవారం నిపుణ ఒడిశా మేళా కార్యక్రమం నిర్వహించారు. అసన, కెందుగుడ ప్రాంత సాధనా కేంద్రం వారు నిర్వహించిన నిపుణ ఒడిశా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కెరామటి సర్పంచ్ మాణిక్ శాంత పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యవక్తగా కొరాపుట్ జిల్లా ప్రాథమిక ఉపాద్యాయుల సంఘ కార్యదర్శి త్రినాథ్ హరిజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలిక సాక్షరత, మౌలిక సంఖ్యా జ్ఞానం, సృజనశీలతలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేళాలో 450 కి పైగా విద్యా సంబంధిత సామగ్రి ప్రదర్శించారు. ప్రతి స్కూలు నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయిని పది మంది విద్యార్థులకు నిపుణ ఒడిశా మేళాపై బోధించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా కుంధ్ర సమితి ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు త్రినాథ్ పండ, జబాపదర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ గురు, సమితి ఉపాధ్యాయుల సంఘ కార్యదర్శి కె.కృష్ణమోహనరావు, కుసుమగుడ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నయన బిశాయి, సీఆర్సీసీ రఘునాథ్ సాబత్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సుశాంత దాస్, చక్రి పాణిగ్రహి, సత్య రంజన్ నాయిక్, నారాయణ బరగమ్, సన్యాసీ మీనర బలియ, సరోజ్ మహాకుడ్, ఎస్.ఎమ్.సి లక్ష్మీ కుమార్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. న్యూస్రీల్ -
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
విజయనగరం ఫోర్ట్: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 9 పీహెచ్సీల వైద్యాధికారులు సిబ్బందితో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి వారు సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ను లబ్ధిదారులందరికీ వేసేలా చూడాలని చెప్పారు. టీబీ గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఒళ్లంతా తిమ్మిర్లుగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతో పాటు వాంతులు గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధి పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నాడీ వ్యవస్థను ఈవైరస్ దెబ్బతీస్తుందని తెలిపారు. దీంతో రోగి పక్షవాతం బారిన పడతారన్నారు. ఇది అంత ప్రమాదకరం కాదని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఎల్ఓ డాక్టర్ కె. రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుత కుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
జేఎన్టీయూ జీవీలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో రెండు రోజులు నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏక్తార్ ఎక్స్ఎక్స్వీ’ అనే అంశంపై నిర్వహించిన ఈ సింపోజియంను యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్–జి రిటైర్డ్ శాస్త్రవేత్త పి.త్రిమూర్తులు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో విజయానికి విద్య, వృత్తి నైపుణ్యాలు ముఖ్యమన్నారు. ఉన్నత ఉద్యోగాలకు, పదవుల ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం విశిష్ట అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థల సంబంధాల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజేనాగరాజు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వీఎస్ వకుళ, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు పి.శ్రీనివాసులురెడ్డి, టి.శిరీష, వివిధ కళాశాలల నుంచి హాజరైన 400 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. -
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు
జయపురం: రానున్న వేసవిలో జయపురం అటవీ డివిజన్లో అగ్ని ప్రమాదాల నుంచి అడవులను సంరక్షించేందుకు, గ్రామీణ ప్రజలను చైతన్య పరిచేందుకు అటవీ విభాగ అధికారులు సచేతన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నూతన పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. అడ వుల్లో అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలని జయపురం అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ అన్నారు. ముఖ్యంగా పోడు వ్యవసాయం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. సోమవారం జయపురం సమితి మహుళభ గ్రామంలో అటవీ విభాగం నిర్వహించిన సచేతన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను రక్షించేందుకు నూతన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రతి సంరక్షిత, ప్రతిపాదిత సంరక్షిత, గ్రామాలకు చేరువలో ఉన్న అడవుల్లో అగ్ని నిరోధక మంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జయపురం రేంజ్లో ప్రయోగాత్మకంగా ఘాట్ఘుమర్, పాత్రోపుట్, మహుళభట్లలో అగ్ని నిరోధక మంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జయపురం రేంజ్లో 30 మందితో రెండు టీమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవి కాలం 3 నెలలలో 10 మంది ఉద్యోగులను వి.ఎస్.ఎస్ లుగా నియమిస్తామన్నారు. ప్రతి అగ్ని నిరోదక మంచ్లో ముగ్గురు చొప్పున గార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ప్రతి క్షణం మంచ్ పరిధిలో అడవులపై దృష్టి సారిస్తారని వెల్లడించారు. ఈ మంచ్ల ఫలితాలు పరిగణనలోకి తీసుకుని అగ్ని నిరోధక మంచ్లను విస్తరింపజేయనునట్లు వెల్లడించారు. -
ఎండలోబడి..
రథసప్తమి వెళ్లాక.. ఎండలు మండుతున్నాయి.. రెండు నిమిషాలు బయట ఉంటేనే.. నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్దవారే ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు.. విద్యార్థులు.. ఏకధాటిగా కూర్చొన్న చోట నిలువ నీడ లేక.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పందిర నీడన ఒకేచోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురుకావడం గమనార్హం. సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. రెండేళ్ల కిందట అది కూలిపోవడంతో దానిని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నాళ్లపాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద, పందిరిలో బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు ఊరి చివరన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటుచేసిన పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అసలే ఎండలు. ఆపై ఆరుబయట చదువులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షి, పార్వతీపురం మన్యం -
జర్నలిస్టు సంఘాల నిరసన
● జర్నలిస్టుపై దాడిచేసిన టీడీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు వినతివిజయనగరం అర్బన్: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై దాడి చేసిన టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టుపై చేసిన దాడికి నిరసనగా స్థానిక కలెక్టరేట్ వద్ద గల గాంఽధీ విగ్రహం దగ్గర సోమవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విఽధినిర్వహణలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణలపై వార్త కవరేజ్ కోసం విలేకరిపై దాడి చేయడం, చంపుతానని బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించని అధికారుల పనులపై, మంత్రి కార్యక్రమాలపై ఎందుకు రాశావని అసభ్యకరమైన పదజాలంతో దూషించి భౌతిక దాడికి పాల్పడడం దారుణమని వాపోయారు. ఇకపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించిన వేణుగోపాల్ నాయుడిని కఠినంగా శిక్షించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సత్యనారాయణ, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్, ప్రజాశక్తి ప్రతినిఽధి సీహెచ్.రాము, వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డేవిడ్ రాజు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం పార్వతీపురం: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వల్ల ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విలేకరులపై దాడులు చేయడం సరికాదని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అల్లువాడ కిశోర్ పేర్కొన్నారు. ఈ మేరకు మక్కువ మండల విలేకరిపై భౌతికదాడులకు పాల్పడడంతో పాటు చంపుతానని టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు హెచ్చరించిన చర్యను ఖండిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడులకు నిరసనగా పలు నినాదాలు చేశారు. విలేకరిపై దాడి సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, విలేకరికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సంఘ సభ్యులు జిల్లా కార్యదర్శి గండి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావుతోపాటు జిల్లాలోని వివిధ పత్రిలు, మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
రైతుబజార్లో నేరుగా కూరగాయల విక్రయం●
● రైతులకు పిలుపునిచ్చిన అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ● సాక్షి కథనానికి స్పందనపార్వతీపురంటౌన్: రైతులు పండించే కూరగాయలను నేరుగా రైతుబజార్లో విక్రయించుకోవచ్చని అగ్రి ట్రేడ్–మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం సాక్షిలో ‘రైతులు లేరు..జని రారు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పంచాచారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుబజార్లో రైతులు తమ కూరగాయలను రైతులు విక్రయించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తు తం కూరగాయల పంట సీజన్ అయినందున, అధిక సంఖ్యలో దిగుబడి రావడం, తమ ప్రాంతాల్లో తగినంత గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నట్లయితే మీ పల్లె లేదా మండలాల్లోని ఉద్యానవన శాఖ అధికారులు లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను కలిసి తగిన వివరాలు ఇస్తే, జిల్లాలోఉన్న అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ శాఖ ద్వారా మీ సరుకును పార్వతీపురంలోని రైతు బజార్లో నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు ఏ విధమైన నష్టం వాటిల్లదని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సందేహాల నివృత్తి కోసం ఫోన్ 91823 61348 నంబర్ను సంప్రదించవచ్చని ప్రకటనలో వివరించారు. గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదంకొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో అందరూ ఉండగానే గ్యాస్లీకై మంటలు రావడం గమనించి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కలకు చెందిన యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఈక్రమంలో బి.అప్పలరాజు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని కొత్తవలస ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కాగా ఈ సమాచారం చెంతనే గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ కార్మాగారం యాజమాన్యానికి అందించగా కర్మాగారానికి చెందిన ఫైర్ ఇంజిన్తో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్
పార్వతీపురంటౌన్: ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్ను నిర్మిస్తున్నామని ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర ఫంక్వాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ఎఫ్ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశాఖ డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింగల్, సీఏఓ అంకుస్ గుప్త, సీనియర్ డీసీఎం కె సాందీప్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ (భువనేశ్వర్) సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్లో బయలుదేరిన ఆయన రాయగడ మీదుగా జిమిడిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం మీదుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో విజయనగరం రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. అడుగడుగునా ట్రాక్ల పరిశీలనతో పాటు మలుపులు, హెచ్చరికబోర్డులు, ట్రాక్ పాయింట్లు, ఆర్యూబీలు పర్యవేక్షి ంచారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయనాయకులు, ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించారు. అమృత్భారత్ నిధుల్లో భాగంగా ప్రయాణికులకు ప్రత్యేక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ను ప్రారంభించారు. అమృత్భారత్ స్టేషన్ అభివృద్ధిపనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చేపట్టాల్సిన పనులౖపై సూచనలు చేశారు. అమృత్ భారత్ పనులు పరిశీలించిన రైల్వే జీఎం -
జీబీఎస్పై అప్రమత్తం
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం: గులియబుల్ భారే సిండ్రోమ్ (జీబీఎస్)పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జీబీఎస్పై వైద్యశాఖ, పంచాయతీరాజ్శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు జీబీఎస్పై అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించడంతో పాటు వేడినీరు తాగడం, వేడి ఆహార పదార్ధాలను తీసుకోవాలని తెలియజేయాలన్నారు. సమావేశంలో కేఆర్ఆర్ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్తో ఎంఆర్ కళాశాల ఎంఓయూనెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయం విజయనగరం మహారాజా కళాశాలతో సోమవారం ఎంఓయూ కుదుర్చుకుంది. కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సాంబశివరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంటర్న్షిప్లు, పరిశోధన, నైపుణ్యం, తదితర అవకాశాలకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ సన్నీడయోల్, డాక్టర్ విజయ్బాబు, పుష్పలత, ఐక్యూసీ హెడ్ ప్రొఫెసర్ ఎంఎంల్ఎన్ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తావిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలోని జరిగిన డీఅర్ఎం కప్ 8వ రాష్ట్రస్థాయి ఉమెన్న్స్ సీనియర్ బాక్సింగ్ చాంపంయన్ షిప్ 2025లో విజయనగరం క్రీడాకారులు మూడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. విజేతల్లో ఎస్. షర్మిల 70 కిలోల రజత పతకం, మనోజి 75 కిలోల విభాగంలో రజత పతకం, సుమిత్ర 80 కిలోల కేటగిరిలో రజత పతకం, ఎన్.రమ్య 57 కిలోల కేటగిరిలో కాంస్య పతకం, బి.పూజిత 65 కిలో కేటగిరిలో కాంస్య పతకం, 60 కిలోల విభాగంలో వై.అనుష కాంస్య పతకం దక్కించుకున్నారు. విజేతలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు అభినందించారు. 100 లీటర్ల సారా స్వాధీనం● ● ఇద్దరిపై కేసు నమోదుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి, పులిగూడ గ్రామాల్లో సారా అమ్మకాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారాను కలిగి ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇరిడి గ్రామంలో బిడ్డిక గుండు 80 లీటర్ల సారాతో, పులిగూడ గ్రామానికి చెందిన ఊయక కిరణ్ కుమార్ 20 లీటర్ల సారాతో పట్టుబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల మండలాల్లో సారా తయారీ, విక్రయాలు, సరఫరా అరికట్టేందుకు దాడులు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. -
రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని విశాఖ–అరుకు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం పుణ్యగిరి కళాశాల వద్ద బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బద్దు మహేందర్ అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం 1.30 సమయంలో బైక్పై రోడ్డు దాటుతుండగా, విశాఖపట్నానికి చెందిన బసవబోయిన దుర్గాప్రసాద్(17) అనే యువకుడు తన మోటార్ సైకిల్పై కొత్తూరు నుంచి ఎస్.కోట వైపు వేగంగా వస్తూ మహేందర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయాల పాలవగా, తలకు గాయమైన దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీ్త్ర, పురుష నిష్పత్తిని తగ్గించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అధికంగా ఉంటున్నదని, దీనిని తగ్గించేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. జిల్లాలో ఉన్న 110 స్కానింగ్ కేంద్రాల ద్వారా రోజువారీ జరుగుతున్న స్కానింగ్ల సమచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గర్భిణులకు అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చికిత్సలకు వైద్యులు సిఫార్సు చేస్తూ పేద కుటుంబాలపై అనవసర ఆర్థికభారం మోపుతున్నారని, దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన గర్భిణులు, వారిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు ఆయా నెలల్లో జరిగే అబార్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు కూడా స్కానింగ్ సెంటర్స్ను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఎన్సీడీ పీఓఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
● ఒక్క ఉచిత విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం ● ఉచిత విద్యుత్కు తూట్లు పొడుస్తున్న కూటమి ఏడు నెలలవుతోంది ఏడు నెలల క్రితం వీరఘట్టం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉచిత విద్యుత్ మీటరు కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారని లైన్మెన్ను అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – లెంక జగదీశ్వరరావు, రైతు, నడుకూరు గ్రామం, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లావీరఘట్టం: ● పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రామకృష్ణ అనే రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. ఇంతవరకు ఆయన దరఖాస్తును పరిశీలించిన దాఖలాలు లేవు. ● అలాగే వీరఘట్టం గ్రామానికి చెందిన మంచుపల్లి గోపాలం అనే మరో రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం తన దరఖాస్తును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రైతుకు కూడా ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇలా వీరఘట్టం మండలంలో 15 మంది రైతులు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, మరో 30 మంది వీరఘట్టం ట్రాన్స్కో కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేశారు. ఇలా వీరఘట్టం మండలంలో ఇంతవరకు 45 మంది వరకు రైతులు ఉచిత విద్యుత్ వ్యవసాయ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ● ఉచిత విద్యుత్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం దశల వారీగా మంగళం పాడుతోంది. రైతులకు ఆపన్న హస్తంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.అందుకోసం పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏకంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరునే ప్రభుత్వం నిలిపి వేసింది. గతేడాది 2024 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఒక్కటి కూడా కూడా మంజూరు చేయలేదు. ఆగస్టు నెలాఖరు వరకు మంజూరు చేసిన కనెక్షన్లు కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమోదించిన వాటికే కనెక్షన్లు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు. రాష్ట్రంలో 1.50 లక్షల దరఖాస్తుల పెండింగ్.. పార్వతీపురం జిల్లాలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటీకీ వాటికి ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఇప్పటికీ 2,500లకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.వాటిని పరిష్కరించి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. కనీసం ఆ దరఖాస్తులను ఇంతవరకు పరిశీలించకపోవడం కానీ, స్క్రూట్నీ చేయకపోవడం కానీ ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 2,500మందికి పైగా రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అందనీయకుండా తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం సుమారు 1.50 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రాధాన్యతా క్రమంలో మంజూరు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గతేడాది ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేశా. మిగిలిన దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ కావాల్సిన వారు 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది పరిశీలించి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. – ఎస్.చలపతిరావు, ట్రాన్స్కో ఎస్ఈ, పార్వతీపురం మన్యం జిల్లా -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
రాయగడ: అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత అని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక రైతుల కాలనీలో గల ఫారెస్ట్ పార్క్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొంతమంది అవగాహన లోపంతో అడవులు తగుల బెడుతున్నారని అన్నారు. దీని వల్ల పర్యావరణానికి పెను ముప్పు సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని చెట్లతో ఉన్న అడవులను తగుల బెట్టడం వల్ల విలువైన ఔషధ వృక్షాలు నాశనం అవ్వడంతో పాటు పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఏ ప్రాంతంలో అయినా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 112 కు డయల్ చేస్తే శకటాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ రేంజర్ కామేశ్వర్ ఆచారి మాట్లాడుతూ ఇలాంటి తరహా అవగాహన కార్యక్రమాలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రచారం కల్పిస్తున్నారని తెలిపారు. రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, పర్యావరణవేత్త గౌరంగ చరణ్ , జిల్లా పరిషత్ సభ్యులు సంధ్యా పులక తదితరులు పాల్గొన్నారు. -
కెనాల్లో గుర్తు తెలియని యువకుని మృతదేహం
జయపురం: అప్పర్ కొలాభ్ సాగునీటి ప్రాజెక్టు ధన్పూర్ శాఖా కెనాల్లో ఆదివారం ఉదయం 35 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి జయపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్సై రాజేంద్రపంగి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కెనాల్ నుంచి బయటకు తీశారు. శవం కుళ్లిపోయింది. చనిపోయి రెండు రోజులుపైనే ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు స్థానికంగా విచారణ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రి జయపురం మార్చురీకి తరలించారు. మార్చురీలో 96 గంటలు మృతదేహాన్ని ఉంచుతామని.. ఇలోగా కుటుంబ సభ్యులు వస్తే అప్పగిస్తామని, లేకపోతే నిబంధనల ప్రకారం తరువాత చర్యలు తీసుకుంటామని జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలైయ్ వెల్లడించారు. పట్టణ పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
● ఆటలతో ఆరోగ్యం
జయపురం: ఆటలతో ఆరోగ్య సిద్ధిస్తుందని, విద్యార్థులు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొరాపుట్ జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన క్రీడా విజేతల బహుమతుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ప్రతి వారిలోనూ ప్రతిభ ఉంటుందని, దాన్ని బయటకు తీస్తే విజయం సొంతమవుతుందన్నారు. మొబైల్ చూస్తూ సమయం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా డైట్ ప్రిన్సిపాల్ రూప్చంధ్ సొరేన్, బ్లాక్ అదనపు విద్యాధికారి ప్రియంబత పాత్రో, కోఆర్డినేటర్ చంద్ర కళా బగర్త, విజ్ఞాన విభాగ అధ్యాపకులు అనంత దళపతి పాల్గొన్నారు. టీచర్లు విశ్వరంజన్ గౌఢ, ప్రభాతీ పాణిగ్రహి, హితకర చరిడి, దీపక సాహు, తనవీర్ మహమ్మద్, నిర్మల తండిక, సౌమ్యరంజన్ పట్నాయిక్, దేవేంద్ర పాడి, కె.ప్రమీల, శుభశ్మిత సాహు, రశ్మిత నాహక్, సాగరిక పాత్రో, బణిత శతపతి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి
పొందూరు : పొందూరు పరిధిలోని అలబోయినపేట మంగళకాలనీ సమీపంలో కుక్కలు మూకుమ్మడిగా చేసిన దాడి చేయడంతో ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగల శ్యామల తీవ్రంగా గాయపడింది. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న శ్యామల స్నేహితులతో కలిసి సమీపంలో పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. నాలుగు కుక్కలు వెనుక నుంచి ఒక్కసారిగా అరుస్తూ దూసుకొచ్చాయి. కుక్కల అరుపులకు పిల్లలంతా భయపడి పారిపోగా శ్యామలకు వినిపించకపోవడంతో అక్కడే ఉండిపోయింది. స్నేహితులు ఎందుకు పరుగుపెడుతున్నారో తెలుసుకునేలోగానే నాలుగు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కాళ్లు, చేతులు, పొట్టభాగంలో గాయాలయ్యాయి. ఇంతలో అటుగా వస్తున్న గ్రామస్తులు కుక్కలు తరిమి చిన్నారిని కాపాడారు. చిన్నారిని పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఉత్తరాంధ్ర మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వన్ స్టేట్ వన్ అసోసియేషన్ రాష్ట్ర అడహాక్ కమిటీ కన్వీనర్ కె.గోవిందరావు, రాష్ట్ర స్థాయి క్రియాశీలక నాయకులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు, రాజమండ్రికి చెందిన సీనియర్ మాజీ సైనికులు, న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్ హాజరయ్యారు. మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి సభ రద్దు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి సమ్మేళనం (సెరంగో) ప్లాటినాం జూబ్లీ వార్షిక వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. సోమవారంతో ముగియాల్సి ఉండగా.. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల ఆదేశాలతో ఆదివారం అర్ధాంతరంగా రద్దయ్యాయి. దీంతో గజపతి జిల్లా నుంచే కాక గుణుపురం, రాయగడ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మైనార్టీ క్రిస్టియన్లు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్లాటినాం జూబ్లీ ఎస్.బి.సి.ఎం.ఎస్. (సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి) బల్లబోడా గ్రామం దంతరిలాల చర్చి వద్ద సభ ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే గజపతి జిల్లాలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్ దళ్ వాటి అనుబంధ సంస్థలు దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి ఐదో తేదీన నిరసన ర్యాలీని జరిపి కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీలో అనేక మంది సాధుసంతువులు, హిందూ సురక్షా మంచ్ తరఫున నిరసన వ్యక్తం చేశారు. సమ్మేళనానికి వ్యతిరేకంగా హిందూ సురక్షా మంచ్ నిరసనల మధ్య బాస్టిస్టు మండలి అధినేతలకు జిల్లా యంత్రాంగం అనేక ఆంక్షలు విధించారు. మహా సమ్మేళనానికి ఫైర్ క్లియరెన్సు, వేదిక సురక్షితమైనదని ఆర్ఆండ్బీ అధికారుల వద్ద నుంచి ఎన్ఓసీ, గోహత్యకు పాల్పడటం లేదని సర్టిఫికెటు, పోలీసు బందోబస్తు తదితర సర్టిఫికెట్లు మంజూరు చేయాలని జిల్లా మేజిస్ట్రట్ ఒక లేఖ ద్వారా కోరారు. వీటిని ఎస్.బి.సి.ఎం.ఎస్ ప్రతినిధులు దాఖలు చేసి అనుమతి పొందారు. శనివారం ప్లాటినాం జుబ్లీ వేడుకలు ప్రారంభమైయ్యాయి. అయితే ఆదివారం బరంపురం డీజీ ఆదేశాల మేరకు 75వ ప్లాటినాం వేడుకలు రద్దు చేయాలని ఆదేశాలు రావడంతో అర్ధాంతరంగా ముగిశాయి. -
నరసన్నపేటలో గంజాయి కలకలం
నరసన్నపేట : నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో గంజాయి వినియోగం ఒక్కసారి బట్టబయలైంది. ఒకేసారి 9 మంది అరెస్టు కావడంతో కలకలం రేగింది. స్థానికంగా గంజాయి అమ్మకాలు, వినియోగం జరుగుతుందని గమనించిన పోలీసులు దీనిపై నిఘా వేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా చేతులు మారుతున్నట్లు అనుమానంతో ఇటీవల సోదాలు చేశారు. అప్పట్లో ఏమీ లభించలేదు. శనివారం స్థానిక వెంకటేశ్వరాలయం ఎదురుగా రాజులు చెరువు గట్టుపై ఉన్న వీధిలో పసుపుల రమణ ఇంటి వద్ద కొందరు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.66 వేల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు గంజాయిని వినియోగిస్తున్నారు. వీరిని విచారించగా మిగిలిన వారూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 9 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. స్థానిక ట్యాంకు బండ్ వీధికి చెందిన కోట ప్రతీప్, శ్రీరాంనగర్కు చెందిన లిమ్మా రాహుల్, పెద్దపేటకు చెందిన అరసవల్లి వరప్రసాద్, జగన్నాథపురానికి చెందిన దనిమిశెట్టి అజయ్, హనుమాన్నగర్కు చెందిన గొడ్డు రాఘవేంద్ర, బొంతల వీధికి చెందిన పొన్నాడ అజయ్, మేదర వీధికి చెందిన బెహరా హరి, శ్రీకాకుళం సానా వీధికి చెందిన తట్టా హేమంత్, పోలాకి గొల్లలవలసకు చెందిన దంత పునీత్లను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వీరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ● 22 కేజీలు స్వాధీనం.. 9 మంది అరెస్టు -
అధ్యక్ష పదవికి రేసులో 13 మంది
రాయగడ: జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి ఇప్పటికే 13 మంది రేసులో ఉన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఈసారి అధ్యక్ష పదవి కోసం పైరవీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సిరిగుడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న దేవేంద్ర మహంతిని శనివారం పలువురు కలిసి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ పదవికి రేసులో ఉన్నవారిలో కాళీరాం మాఝి, శివశంకర్ ఉలక, రామచంద్ర బెహర, ఎం.గోపి ఆనంద్, హలధర్ మిశ్రో, పద్మనాబ్ దాస్ (టుటు దాస్ ), వై.గణపతిరావు, మంజుల మినియాక, శ్యామసుందర్ దాస్, గుణనిధి బాగ్, హలధర్ హిమిరిక, వై.కొండబాబు, భాస్కరపండలు ఉన్నారు. అయితే ఈసారి అధిష్టానం 40 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు వారికి మాత్రమే ఈ పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. అదే జరిగితే సీనియర్ నేతలకు అవకాశం ఉండకపోవచ్చు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సరైన నాయకుడిని ఎంపికి చేసేందుకు అధిష్టానం ఆలోచన చేస్తోంది. ముగిసిన ఎన్సీసీ పరీక్షలు రాయగడ: సీ సర్టిఫికేట్ కోర్సుల కోసం ఎన్సీసీ క్యాడెట్ల మధ్య నిర్వహించిన రాత పరీక్షలు ఆదివారంతో ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పరీక్షకు హాజరయ్యారు. స్థానిక గొపబంధు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో ఆదివారం మహిళ బెటాలియన్–2 ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలకు రాయగడ, కొరాపుట్, నవరంగపూర్, గజపతి జిల్లాల నుంచి 160 మంది క్యాడెట్లు హాజరయ్యారు. ట్రాక్టర్–బైక్ ఢీకొని ఒకరు మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి పోలీసుస్టేషన్ పరిధిలో ఉండ్రుకొండ పంచాయతీ రహదారిలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బైక్ ఎదురెదురుగా ఢీకొని సుక కామరామి (25) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన పోడియ సమితి ఏరువన్పల్లి గ్రామ వాసి. తన భార్యతో కలిసి ఆదివారం ఉదయం అత్తవారింటికి వెళ్లారు. అక్కడ భార్యను వదిలి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు గాయమై చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారైపోయాడు. స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండ తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పినాంకి కొండల్లో ఎలుగు సంచారం
జయపురం: జయపురం పట్టణం అటవీ విభాగం, పారాబెడల మధ్య గల పినాంకి కొండ రిజర్వ్ ఫా రెస్టులో ఎలుగు సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయపడుతున్నారు. సమాచారం అందిన అటవీ విభాగ అధికారులు అడవిలో గాలింపు చర్యలు చేప ట్టారు. జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహర, ఎస్ఎఫ్ఓ డాక్టర్ అమిత్ కుమార్ నాయిక్, రేంజర్ సచ్చితానంద పరిడ, ఫారెస్ట్ శశాంక మహరాణ, ఫారెస్టు గార్డ్ సతీష్ కుమార్ కాళో, వన్య జంతువుల పరిరక్షణ విభాగ టీమ్ లీడర్ కృష్ణ కేశవ షొడంగి అడవిలో గాలించారు. గత 12 వ తేదీన జయపురం పట్టణం మొకాపుట్ ప్రాంతంలో ఒక ఎలుగుబంటి తిరుగుతున్న ఫొటోలు సీసీ కెమెరాలో కనిపించాయి. 13 వ తేదీన పినాంకి పర్వత ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించటం స్థానికుల కంట బడింది. ఆ విషయం తెలిసిన స్థానికులు వెంటనే అటవీ విభాగ అధికారులకు తెలియ జేశారు. దీంతో వారు గాలింపు మొదలుపెట్టారు. -
మార్చి 29న బార్ అసోసియేషన్ ఎన్నికలు
జయపురం: కొరాపుట్ జిల్లా బార్ అసోషియేషన్ (జయపురం) కార్యవర్గ ఎన్నికలు 2025–26 ఏడాదికి సంబంధించి మార్చి 29న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం మధ్యాహ్నం జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. అధ్యక్షులు త్రినాథ్ సిగ్లాల్ అధ్ూక్షతన జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీనియర్ న్యాయవాది దాసరథి పట్నాయన్కును ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల నిర్వహణపై సభ్యులకు ఈయన శిక్షణ ఇస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి ఐదు నుంచి ఏడో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎనిమిదో తేదీన నామినేషన్లు వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. తొమ్మిదో తేదీన నామినేషన్లను పరిశీలన జరుగుతుంది. స్క్రూటినీ తరువాత పదో తేదీన జాబితా ప్రకటిస్తారు. 12వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 13వ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నాలుగు ఓట్ల లెక్కిపు ప్రారంభించి విజేతలను ప్రకటిస్తారు. సన్నాహక సమావేశంలో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అలాగనే పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా జయపురంలో ప్రముఖ న్యాయవాది, అసోషియేషన్ మాజీ అధ్యక్షులు, కొరాపుట్ జిల్లా కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ సత్యనారాయణ అధికారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదన చేసింది. అలాగే జయపురంలో సర్క్యూట్ కోర్టును కనీసం నెలలో ఒక సారి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను సమావేశం కోరింది. జయపురంలో మరో ఏడీజే కోర్టు ఏర్పాటు చేయాలని, ఎన్డీపీఎస్ కేసుల విచారణ నిమిత్తం జయపురంలో ఒక ప్రత్యేక కోర్టు నెలకొల్పాలని, రాష్ట్ర కన్జ్యూమర్ సర్క్యూట్ కోర్టు నెల కొల్పాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఎన్నికల అధికారిగా నియమితులైన దాసరథి పట్నాయక్ను న్యాయవాదులు అభినందించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్యబ్రత పాఢీ, కార్యదర్శి మహేంద్ర అధికారి, సిహాయ కార్యదర్శి పి.సన్యాసిరావు, ట్రెజరర్ సహదేవ్ పట్నాయక్, బాలా రాయ్సచిన్ కుమార్ పాఢీ, డి.శేశగిరిరావు పాల్గొన్నారు. -
దోపిడీకి విఫలయత్నం
జయపురం: ఒక యువకుడిని దోచుకునేందుకు దుండగులు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఆ సంఘటనలో ఒకడిని పోలీసులు అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర తండి ఆదివారం వెల్లడించారు. ఆయన వివరణ ప్రకారం ఈ నెల 14 వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో జయపురం సమితి బంకబిజా గ్రామం రాజేంద్ర స్వయి జయపురంలో పనులు ముగించుకుని సైకిల్పై బంకబిజ గ్రామానికి వెళ్తుండగా బంకబిజ కూడలి వద్ద నలుగురు దుండగులు రాజేంద్రను అడ్డగించారు. రాజేంద్ర వద్ద గల డబ్బు ఇతర సామగ్రి ఇవ్వాలని బెదిరించారు. అంతలో గ్రామస్తులు అటుగా రావడంతో దుండగులు పారిపోయారు. అయితే వారిలో ఒకడు ప్రజలకు దొరికిపోయాడు. అతడిని సదర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు రమేష్ బెహర(54)ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. లాడ్జిలో యువకుడి మృతదేహం రాయగడ: లాడ్జిలో ఒక యువకుడి మృతదేహాన్ని జిల్లాలోని టికిరి పోలీసులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తమిళనాడు రాష్ట్రంలోని తిరిచి ప్రాంతానికి చెందిన ఎస్.అబ్దుల్ హాసన్ (32)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం లాడ్జి గదిని శుభ్రపరిచేందుకు సిబ్బంది వెళ్లగా, లాడ్జి గదిలో ఉరికి వేలాడుతూ యువకుని మృతదేహాం కనిపించింది. దీంతో మేనేజర్కు సమాచారం అందించగా వెంటనే టికిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు టికిరిలోని ఒక కర్మాగారంలో ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మారణాయుధాలు చూపి దోపిడీ జయపురం: మారణాయుధాలతో భయపెట్టి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి(పీఈఓ) నుంచి దాదాపు రూ.8.6 లక్షలు దోచుకు పోయిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. బొడిగాం పంచాయతీ పీఈఓ అర్జున పాత్రో పంచాయతీ సమితిలో లబ్ధిదారులకు ప్రతి నెల బొరిగుమ్మ సమితి కార్యాలయం నుంచి డబ్బు తీసుకువచ్చి ఇచ్చేవారు. శనివారం మధ్యాహ్నం బైక్పై డబ్బు తీసుకుని బయల్దేరారు. మార్గంలో బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి రతాలీ–బొడిగాం రోడ్డులో ఆరుగురు అర్జున్పై దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బును తీసుకెళ్లిపోయారు. సమాచారం అందిన వెంటనే బిసింగపూర్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బొడిగాం పంచాయతీ సర్పంచ్ కరుణ బొడొనాయిక్ స్థానిక ప్రజలతో అక్కడకు చేరుకున్నారు. బిసింగపూర్ పోలీసు అధికారి సూరజ్ ప్రధాన్ దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు రాయగడ: దొంగతనం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాయగడ పిట్లవీధికి చెందిన భీముడు హుయిక, కిషొర్ మండంగి, రింటు కడ్రకలు ఉన్నారు. వారి వద్ద నుంచి 1.74 లక్షల రుపాయల నగదుతో పాటు ఒక స్కూటీ, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సదరు పోలీస్ స్టేషన్ ఐఐసీ కే కే బికే కుహోరో ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీన స్థానిక న్యూకాలనీకి చెందిన టి.గౌరిశంకర్ స్కూటర్ డిక్కీలో రూ. ఎనిమిది లక్షలు ఉంచగా.. గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. -
నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
కాశీబుగ్గ: మందస పట్టణంలో కొలువైన వాసుదేవు ని 16వ బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 1744 సంవత్సరంలో నరసాపురానికి చెందిన తెలికిచెర్ల కందాడ రామాను జాచార్యస్వామి ఇక్కడ సంస్థానాచార్యులుగా ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ రా మనుజ పెద్ద జీయర్ స్వామి, గోపాలాచార్య స్వా మి శిష్యులుగా ఉండేవారు. అప్పట్లో ఇక్కడ ఉన్న వేద పాఠశాలలో పండితులు విధ్యనభ్యసించేవారు. 1950 వరకు ఆలయంలో క్రతువులు జరిగేవి. రాజు ల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆల యం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. చిన్నజీయరుస్వామి వాసుదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి తన గురువు స్మారకార్థం జీర్ణోద్ధరణ చేసేందుకు సంకల్పించి 2001 నుంచి పున:నిర్మాణ పనులను చేపట్టారు. 2009లో ఆలయాన్ని పునఃప్రతిష్టించారు. ఆలయంలో రాజుల పాలన కా లంలో ఉన్న విగ్రహాన్నే పునఃప్రతిష్టించారు. ఆలయంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ విగ్రహ నిజరూ పం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం మాదిరిగానే ఉంటుంది. బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు ● ఈ నెల 17వ తేదీ సోమవారం ఆంజనేయస్వామి అభిషేకం. ● 18న శ్రీవాసుదేవ పెరుమాళ్ అభిషేకం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, అంకురారోపణం. ● 19న గరుడపూజ, ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ. ● 20న కల్పవృక్ష వాహనము, ఎదుర్కోలు ఉత్సవం. ● 21న శ్రీ వాసుదేవ్ పెరుమాళు కల్యాణ మహోత్సవం, గరుడవాహన సేవ. ● 22న పొన్నచెట్టు వాహనము, తెప్పోత్సవం, అశ్వవాహనము ● 23న రథోత్సవ, చక్రస్నానం, ద్వాదశరాధన, శ్రీపుష్పయాగం. -
తిలోదకాలు
సర్వీస్ రూల్స్కు.. ● బీసీ సంక్షేమశాఖ రూటే సెప‘రేటు’ ● నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..ఆపై పదోన్నతులు ● ముడుపులు చెల్లిస్తే అక్రమాలన్నీ సక్రమాలే శ్రీకాకుళం పాతబస్టాండ్: బీసీ సంక్షేమ శాఖలో సర్వీస్ రూల్స్కు తిలోదకాలిస్తున్నారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఇక్కడ పదోన్నతుల వ్యవహారం సాగుతోంది. అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్)గా విధుల్లోకి చేరిన వారు, కుక్గా చేరిన వారు ఒక్క సారిగా మూడు కేడర్లు దాటి వసతి గృహ సంక్షేమాధికారిగా పదోన్నతులు పొందుతున్నారు. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు.. ఆ సర్టిఫికెట్ నకిలీదా వాస్తవమైనదా అన్నది పరిశీలించకుండానే పదోన్నతులు కట్టబెట్టేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించి ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు, అడ్డగోలుగా పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మాకొట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ●2006లో జీఓ 36 ప్రకారం 10 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారిచేసింది. అప్పటికి అర్హత ఉన్నవారి ప్రకారం 8 మందికి పదోన్నతులు కల్పించాల్సింది. అయితే ఈ జీవోని తుంగలోకి తొక్కి అధికారులే సొంత జీవోను తయారు చేసుకొని కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 25 మంది కింది స్థాయి ఉద్యోగులకు వార్డెన్లుగా (హెచ్డబ్ల్యూఓ) పదోన్నతులు కల్పించారు. ఈ ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయో..ఏ జీవో ప్రకారం పదోన్నతుల కల్పించారో వారికే ఎరుక. ఇటువంటి పదోన్నతుల పర్యవసానంగానే గతంతో ఇక్కడ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఇప్పటికీ పెన్షన్ రాలేదు. అంతేకాకుండా ఆ కేసులు కూడా తేలలేదని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆ తర్వాత డీబీసీడబ్ల్యూఓగా వచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాగరాణికి కూడా కేసుల బెడద తప్పలేదు. ● జీవో ప్రకారం పదోన్నతి పొందిన వారు మూడేళ్లలోపే బీఈడీ పూర్తి చేయాలి. అలా పూర్తి చేయకపోతే తిరిగి సబార్డినేట్ పోస్టుకి వెళ్లాలి. ఇక్కడ మాత్రం పదోన్నతి పొందడమే తప్ప ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక వేళ ఎవరైనా డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చినా అవి నిజమైనవా నకిలీవా అన్న దర్యాప్తు కూడా చేపట్టడం లేదు. ● ఏ ఉద్యోగికై నా పదోన్నతి పొందాక రెండేళ్లలోపు డిపార్ట్మెంట్ టెస్టులు రాయాలి. అంటే ఎస్ఓ–1 ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే పాత కేడర్కే రివర్ట్ చేయాల్సి ఉంది. ఆ నిబందన కూడా ఈ శాఖలో ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఇటువంటి వాటిని ఆ ఉద్యోగులకు బూచిగా చూపించి కొందరు జిల్లా స్థాయి అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖలో డబ్బులిస్తే చాలు ఉన్నతాధికారులను, ఆపై ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించడంలో కొందరు ఘనాపాటిలు ఈ శాఖలో తిష్ఠ వేశారు. ● బీసీ సంక్షేమశాఖలో ముఖ్యంగా జోన్–1లో రూల్ 16 హెచ్ నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 2008లో సీనియారిటీ లిస్ట్ ఇచ్చారని, మరలా ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని వార్డెన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రూల్ 16హెచ్ పక్కను పెట్టి సీనియారిటీ పేరిట కొత్తగా అవినీతి పదోన్నతులు పేరిట ఫైల్ను తయారుచేసి మరోసారి కలెక్టర్, ఇతర అధికారులను తప్పుతోవ పెట్టించే ప్రయత్నం ఈ శాఖలో మొదలైందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తప్పుడు పదోన్నతులు ఇవ్వడం ఈ శాఖకు అలవాటుగా మారిందని ఆ ఆద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సెటిల్డ్ సీనియారిటీ మార్చే అధికారం ఎవరికీ లేదు. 2008లో ఇచ్చిన సెటిల్డ్ సీనియార్టిని ఒక వేళ మార్పు చేయాలంటే మూడేళ్లలోపే మార్చే అధికారం ఉంటుంది. అప్పుడు చేయకుండా ఇప్పుడు మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ● లావేరులో పనిచేసిన ఓ అటెండర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో వార్డెన్గా పదోన్నతి పొందినట్లు ఆ శాఖ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆయనతో పాటు పదోన్నతి పొందిన ఇద్దరు ఉద్యోగ విరమణ పొందినా క్రమశిక్షణ చర్యలు క్రింద పెన్షన్ నిలుపుదల చేశారు. దీనిని బట్టి కొంతమందికే క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందికి మినహాయింపులు ఉంటాయనేది అర్ధం చేసుకోవచ్చు. ● ప్రధానంగా జిల్లా అధికారికి, కార్యాలయ సిబ్బందికి, అస్మదీయులకు అనుకూలంగా ఫైల్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నష్టపోయినవారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యలు, వివాదాలతో కూనరిల్లుతున్న ఈ సంక్షేమ శాఖ మరింత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ శాఖ జిల్లా కార్యాలయంలో అధిక శాతం మంది కారుణ్య నియామకం పొందినవారే. వారికి సర్వీస్ రూల్స్పై అవగాహన లేకపోవడం, అధిక వేతనంపై ఆశతో తప్పులమీద తప్పులు చేస్తున్నారని ఆ శాఖలో కొంతమంది ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. -
ఆటో బోల్తా..ఆరుగురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న ఆటో పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా, మిగిలిన ముగ్గురూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన వీరంతా ఆటోలో నిమ్మాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఎన్హెచ్ అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎన్హెచ్ పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి తగిన సహాయం అందించారు. స్తంభాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు శ్రీకాకుళం రూరల్: రాగోలు జంక్షన్ వద్ద ఆదివారం పాతపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎదరుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి ఎడమవైపు కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కానప్పటికీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ను చక్కదిద్దారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాత పెన్షన్ అమలుచేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చందనరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్లో వెలువడితే.. ఉద్యోగాలను 2005 నవంబర్లో భర్తీచేసి రెండేళ్లపాటు జాప్యం చేసింది ప్రభుత్వమేనని గుర్తించాలన్నారు. న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని, దీనివల్ల 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మేలు చేకూరుతుందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐఎఫ్ఈఏ చీఫ్ ప్యాట్రన్ కె.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(1938) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అద్యయన తరగతులు నిర్వహించారు. ఏపీటీఎఫ్ కార్యకర్తలకు ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నూతన విద్యా విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు బి.రవి, జిల్లా గౌరవ అధ్యక్షులు టెంక చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు త దితరులు పాల్గొన్నారు. ఓల్డేజ్ హోమ్లో గుర్తు తెలియని బాలిక బూర్జ: మండలంలోని పాలవలసలో సహాయమాత ఓల్డేజ్ హోమ్లో గుర్తు తెలియని బాలిక ఉందని, ఈమె వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్వాహకులు ఆదివారం బూర్జ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నరసన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అమ్మాయి గాయపడటంతో స్థానికులు కొందరు శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారని, కాళ్లు విరగడంతో కొన్ని రోజులు అక్కడే ఉంచి చికిత్స అందించారని, ఆమె ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని, కనీసం పేరు కూడా చెప్పడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిమ్స్ సిబ్బంది 2023 డిసెంబరు 31న ఓల్డేజి హోమ్లో చేర్పించారని, ఇంతవరకు బాలిక కోసం కుటుంబ సభ్యులు రాలేదని, వారి వివరాలు కనుక్కోవాలని కోరారు. కారులో మంటలు ● కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం టెక్కలి: మండలంలోని నరసింగపల్లి సమీపంలో ఆదివారం ఓ కారు నుంచి హఠాత్తుగా మంటలు రావడంతో యజమాని గమనించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన బెండి ఉదయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో పర్లాఖిమిడి వైపు వెళ్తుండగా, నరసింగపల్లి సమీపంలో రోడ్డుపై వేసిన మినుము మొక్కలు ఇంజిన్లోకి వెళ్లి రాపిడికి మంటలు వ్యాపించాయి. ముందుగా పొగలు రావడంతో గమనించిన ఉదయ్ ఒక్కసారిగా అప్రమత్తమై కారును నిలిపివేసి హుటాహుటినా కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం గ్రామస్తుల సాయంతో మంటలపై నీరు చల్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ఇంజిన్, అడుగు భాగం దెబ్బతింది. మద్యం బాటిళ్లు పట్టివేత గార: ఉత్తరాంధ్రలో పేరున్న వత్సవలస రాజులమ్మ తల్లి యాత్రలో అనధికార మద్యం వ్యాపారం జోరందుకుంది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ యాత్రకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో అనధికార మద్యం వ్యాపారం జరగ్గా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 10 బాటిళ్లు, మరొక వ్యక్తి నుంచి 15 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు ఆర్.మహేష్బాబు, బి.రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి కాశీబుగ్గ: తిరుపతి–పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. విశాఖపట్నం వద్ద రైలు ఎక్కిన 40 ఏళ్ల తప్పతాగి ఉన్నాడని, పలాస రైల్వే స్టేషన్ వచ్చేసరికి మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడి వివరాలు లభించలేదని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో మాఘమాస సందడి నెలకొంది. మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇతర జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలపై క్షీరాన్నాన్ని వండి ఆదిత్యునికి నివేదించారు. తలనీలాల మొక్కులు తీర్చుకుని ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి వేకువజామున 6 గంటల నుంచే ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో సర్వదర్శనాలకు సిద్ధం చేశారు. భక్తులకు ఎండ వేడి నుంచి రక్షణగా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో దర్శన మార్గాల్లో టెంట్లు వేయించారు.మంచినీటిని సరఫరా చేయించారు. మరుగుదొడ్లు విషయంలో మాత్రం భక్తులు అవస్థలు పడ్డారు. పలువురు అధికారులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి రావడంతో వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.8.15 లక్షలు, విరాళాలు, ప్రత్యేక పూజలు టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,08,740, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 2.25 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో ప్రకటించారు. -
ఆదాయానికి మద్యమే మార్గమంటూ..
● గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్న టీడీపీ నాయకుడు ● కపాసుకుద్ది కేంద్రంగా బెల్టులకు మద్యం సరఫరా ● మత్స్యకార గ్రామాలకు అధికంగా మద్యం పంపిణీఇచ్ఛాపురం రూరల్: కొత్త మద్యం పాలసీతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాలకు అక్రమంగా మ ద్యం తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కవిటి మండలం మత్స్యకార గ్రా మానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇలా మద్యం సరఫరా చేసిన వైనం వెలుగు చూడడంతో అతను ప్రస్తుతం పరారైపోయాడు. ఈ నాయకుడు ప్రస్తుతం మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా, రేషన్ షాపు డీలర్ ప్రతినిధిగా పరపతి సంపాదించాడు. తన వ్యాపారానికి కవిటి మండలం కపాసుకుద్ది కేంద్రంగా చేసుకుని ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి కపాసుకుద్ది, కర్రివారిపాలెం, ఇద్దివానిపాలెం, బెజ్జిపుట్టుగ, బొరివంక, కుసుంపురం, బల్లిపుట్టుగ వరకు బెల్టు షాపులను ఎంచుకొని ఇచ్ఛా పురం మండలం కొఠారీ వైన్ షాపుల వద్ద నుంచి రాత్రి సమయాల్లో సరుకును తీసుకొని పై గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం ఇచ్ఛాపురం రూరల్ పోలీసులకు సుమారు రెండు లక్షల రూపాయల మద్యం దొరకడంతో.. సరుకును తీసుకువెళ్తున్న వ్యాను డ్రైవర్ ఈ ‘బాబు’ బండారాన్ని బయటపెట్టేశాడు. దీంతో రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ నేత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికో రేటు.. గ్రామాల్లో బెల్టు షాపును నిర్వహించేందుకు గ్రామానికో రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మత్స్యకార గ్రామాల్లో రెండేసి బెల్టు షాపులు చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో బెల్టు షాపు నుంచి గ్రామానికి రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్కు ఒక రేటు, ఎకై ్సజ్ శాఖ స్టేషన్కు ఒక రేటును నెలవారీ మామూళ్లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం పాన్ షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లే అడ్డా.. గత ప్రభుత్వంలో ఎక్కడా బెల్టు షాపుల ఊసే లే దు. ఒకవేళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులు, సెబ్ అధికారులు దాడు లు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేవా రు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోని పాన్షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను ఏకంగా మినీబార్లుగా మార్చేశారు. ఇక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తూ రోజంతా మందుబాబులకు సరుకు అందిస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులు క్వార్టర్ బాటిల్కు రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. ఈ బెల్టుషాపులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. -
దివ్యాంగులను గౌరవించాలి
రాయగడ: దివ్యాంగులను మనమంతా గౌరవించాలని, అవసరమైతే వారికి అండగా నిలవాలని గంజాం జిల్లా దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. సదరు సమితి హలువా తోటలో జిల్లా దివ్యాంగుల మహాసంఘం వార్షికోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసిందని అన్నారు. అయితే అవగాహన లోపంతో కొంతమంది దివ్యాంగులు ఈ సదవకాశాలు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. హక్కులు, అధికారాల గురించి పోరాడాలని హితవు పలికారు. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి పుష్పలత దీక్షిత్, విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షులు శిశిర్ రాహుల్, కార్యదర్శి అమరేంద్ర నాథ్ ఆద్వర్యంలొ జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలొ దివ్యాంగులు పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
రాయగడ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. బిసంకటక్లోని ఒక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని జిగిడి ప్రాంతానికి చెందిన ఉమాశంకర్ మాఝి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. దీంతో అతని మాయమాటలను నమ్మిన విద్యార్థిని సైతం ప్రేమించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా దగ్గరయ్యారు. అయితే కొద్ది రోజులుగా యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిని పరిశీలించిన వైద్యులు ఆమె గర్భిణిగా నిర్ధారించారు. దీంతో పాఠశాల నిర్వాహకులు పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మోసపోయిన విద్యార్థిని వివరాలు చెప్పడంతో ఉమాశంకర్ను అరెస్టు చేశారు. దర్యాప్తులో సదరు యువకుడికి ఇదివరకే వివాహం అయినట్లు తేలింది. -
ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మృతి చెందారు. అరకబద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి(63) ఆదివారం ధర్మపురం బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ధర్మపురం–ఈదుపురం రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. పంట పొలాల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య సీతమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేసిన కృష్ణారెడ్డి మృతి పట్ల జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంపత్ని చిట్టిబాబు, నాయకులు సంతాపం తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బొబ్బిలి రూరల్: మండలంలోని చింతాడ జెడ్పీ హైస్కూల్లో ఫిజిక్స్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాయల ఈశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్వగ్రామమైన అరసాడ నుంచి శనివారం ఉదయం బైక్పై బొబ్బిలి వస్తుండగా.. కారాడ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంల ద్వారా బొబ్బిలి సీహెచ్సీకి తరలించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. క్రీడాకారుల ఎంపిక రేపు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో త్వరలో జరగనున్న సీనియర్స్ టెన్నీకాయిట్ టోర్నమెంట్లో పాల్గొనబోయే జిల్లా సీ్త్ర, పురుషుల జట్ల ఎంపికలను మంగళవారం చేపట్టనున్నట్లు జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 21 నుంచి కాకినాడ వేదికగా జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు విజయనగరం జిల్లా జట్టు తరఫున పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణను (94917 61126) సంప్రదించాలన్నారు. -
ఆప్కాస్ రద్దు ఆలోచన మానుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఘాల జేఏసీ డిమాండ్ విజయనగరం అర్బన్: ఆప్కాస్ రద్దు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మంత్రివర్గం నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేసే ఆలోచనలో ఉందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా రోస్టర్ పద్ధతి పాటించే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నియామకాలు చేపట్టడం వల్ల వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేల్ వర్తింప చేయకూడదని ఇటీవల విడుదల చేసిన జీఓ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, డి.సాయిప్రసాద్, కె.సురేష్, కె.శ్రీనివాస్, రాజేష్, ఈశ్వరరావు, పి.దుర్గారావు, బి.శ్రీనివాసరావు, మజ్జి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
కన్న కొడుకే కాలయముడు..
విజయనగరం క్రైమ్: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాజులరేగలో జరిగిన హత్య కేసు మిస్టరీని విజయనగరం టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీ రాత్రి తన భర్త సూరిబాబు మృతి చెందాడని అతని భార్య సృజన ఫిర్యాదు చేసిందన్నారు. వెంటనే ఎస్సై మురళి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. విచారణ నిమిత్తం భార్య, స్థానికులతో మాట్లాడగా మృతుడి కుమారుడిపై అనుమానం ఏర్పడిందన్నారు. వెంటనే అతడ్ని స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా.. తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవన్నారు. తండ్రి అడ్డు తొలగిస్తే ఇల్లు తనకు దక్కుతుందని భావించి నిందితుడు (పోలీసులు పేరు వెల్లడించలేదు) ఈనెల 12న తండ్రితో గొడవపడి గుండెలపై పిడి గుద్దులు గుద్దడంతో పాటు కర్రతో బలంగా బాదడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడని చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తండ్రిని హత్య చేసిన కొడుకు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
క్షయ కబళిస్తోంది..!
● టీబీ వంద రోజుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల గుర్తింపు ● రెండు నెలల్లో 401 కేసుల నిర్ధారణ ● గతేడాది డిసెంబర్ 7న జిల్లాలో ‘టీబీ వంద రోజుల కార్యక్రమం’ ప్రారంభం ● రెండు నెలల్లో 28, 800 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలుపరీక్షలు చేసుకోవాలి.. రెండు వారాలకు మించి దగ్గు , జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కఫం పరీక్ష చేసుకోవాలి. జిల్లాలో కఫం పరీక్ష కేంద్రాలు 34 ఉన్నాయి. అదేవిధంగా టీబీ యూనిట్లు 14 ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా పరీక్ష చేసి మందులు అందజేస్తారు. 28,800 మందికి పరీక్షలు.. టీబీ వంద రోజుల కార్యక్రమంలో ఇప్పటివరకు 4.38 లక్షల మందిని స్క్రీనింగ్ చేశారు. ఇందులో 28, 800 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 401 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 1411 మంది క్షయవ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. -
మా జోలికి వస్తే చంపేస్తాం...
మక్కువ: ఈ రోజు నుంచి నా జోలికి వచ్చినా.. మా నాయకులు, మినిస్టర్ గురించి రాసినా నీ ఇంటికొచ్చి చంపేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావును బెదిరించారు. పైగా ఆదివారం ఉదయం మండలంలోని వెంగంపేట – కాశీపట్నం మధ్యలో రామారావుపై దాడి కూడా చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు బెదిరించిన వాయిస్ రికార్డు అన్ని సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు తనపై దాడి చేశారంటూ ప్రజాశక్తి విలేకరి రామారావు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వెంకటరమణ వద్ద ప్రస్తావించగా.. టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు నుంచి రక్షణ కల్పించాలని విలేకరి రామారావు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున, ప్రస్తుతానికి ఫిర్యాదు స్వీకరించామని చెప్పారు. దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు దాడి చేయడాన్ని జర్నలిస్తు సంఘాలు ఖండించాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్ఎస్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సూరిబాబు, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్ నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, తదితరులు దాడిని ఖండించారు. విలేకరిని బెదిరించిన టీడీపీ మండల అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడుభౌతికదాడులు సరికాదు.. జర్నలిస్ట్లపై భౌతికదాడులు సరికాదు. విలేకరులు తప్పుడు వార్తలు రాస్తే, ప్రెస్మీట్లలో, పబ్లిక్ సమావేశాల్లో అడగడం మంచి పద్ధతి. అంతేగాని కక్షపూరితమైన చర్యలు చేపట్టడం మంచి సంస్కారం కాదు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కొంతమంది కూటమి ముఖ్య నేతలు సైతం వారికి అనుకూలంగా వార్తలు రాయడం లేదన్న కారణంతో దాడులకు తెగబడుతున్నారు. ఈ సంస్కృతి సరైంది కాదు. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం మంచి పద్ధతి కాదు.. విలేకరులు వారి వృత్తిరిత్యా వార్తలు రాస్తుంటారు. అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి.. మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి.. వాటిని రాజకీయ నాయకులు చూసి దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలే తప్ప, వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. – మావుడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు, మక్కువ -
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
పార్వతీపురం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంతో కాదని, ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను కోరారు. మై స్కూల్–మై ప్రైడ్పై హెచ్ఎం, టీచర్స్తో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెనన్స్ నిర్వహించారు. పాఠ్యాంశాలపై ప్రతి విద్యార్థి సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండాలని, ఆ విధంగా చేయడమే మై స్కూల్–మై ప్రైడ్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పదవ తరగతి చదివే విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచడం కోసం దీన్ని రూపొందించినట్లు చెప్పారు. పదవ తరగతికే పరిమితం కాకుండా మై స్కూల్–మై ప్రైడ్ ప్లస్ గా రూపొందించి అన్ని తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలలో సంపూర్ణ విజ్ఞానం కలిగేలా తీర్చిదిద్దడం, ఆటలు, వ్యాసరచన, చర్చలు, సైన్స్ ఫెయిర్స్లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సబ్జెక్టుల వారీగా ఎక్కడా టీచర్స్ కొరత లేకుండా సర్దుబాటు చేశామని, విద్యార్థులకు బోధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. తొలుత పాఠ్యంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకోవాలని, పదవ తరగతి చదువు అనంతరం ఉపాధి అవకాశాలు లభించే కోర్సులపై అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ఉప, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.