breaking news
Orissa
-
● ఘనంగా స్వర్ణోత్సవం
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1975లో 6వ తరగతి విద్యార్థులు ఆదివారం ఒక చోటికి చేరి ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల కిందట ఒకచోట చదువుకుని డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, వివిధ విభాగాలలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన ఆనాటి విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో సమావేశమయ్యారు. అపూర్వ కలయికలో వారు గత 50 ఏళ్ల నాటి తీయని జ్ఞాపకాలను, ఆనాటి ముచ్చట్లు గుర్తుచేసుకున్నారు. 50 ఏళ్ల తరువాత కలయిక వారంతా అపూర్వంగా ఆశ్వాదించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆప్యాయతను పంచుకున్నారు. అనాటి ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రతీ ఏడాది సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. -
ఉత్సాహంగా అఖిలభారత సాహిత్య పరిషత్ సమ్మేళనం
పర్లాకిమిడి: అఖిల భారత సాహిత్య పరిషత్తు, ఒడిశా అంతర్గత మహేంద్రతనయా సాహిత్య సంస్థ (గజపతి జిల్లా) శాఖ వార్షికోత్సవం, జిల్లా కవి సమ్మేళనం స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షిక ఉత్సవానికి ముఖ్యఅతిథిగా కోస్తా ప్రహారీ పూర్ణచంద్ర మాహాపాత్రో, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నారాయణ్ నాయక్, రాష్ట్ర సహాకార్యదర్శి రామకృష్ణ త్రిపాఠి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మహిళా కళాశాల అధ్యాపకరాలు డాక్టర్ కళ్యాణీ మిశ్రా, సరస్వతీ శిశు మందిర్ ప్రధాన అచార్యులు సరోజ్ పండా పాల్గొన్నారు. రాజేంద్ర కుమార రథ్ అతిథులకు స్వాగతం పలుకగా, మనోజ్ కుమార్ పట్నాయక్ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. పర్లాకిమిడి పండిత గోపినాథ నోందో ఒడిశాలో ప్రథమం శబ్దకోశం రచించారని, ఒడియా భాషను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసిన కృషి అభినందనీయమని పూర్ణచంద్ర మహాపాత్రో అన్నారు. మన మాతృభాష రక్షించుకోవాలంటే.. ఇంగ్లిషు భాష నుంచి మనం దూరంగా ఉండాలని భారతీయ సాహిత్య పరిషత్ సంపాదకులు నారాయణ్ నాయక్ అన్నారు. అలాగే ఒడియా సాహిత్యంలో అందెవేసిన డాక్టర్ రఘునాథ వోఝా పరలాఖెముండిలో భాష, సంస్కృతి, సాహిత్యం, ఒడిశా రాష్ట్ర ఆవిర్భావం కోసం పరలా మహారాజా శ్రీక్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్పై అనేక రచనలు చేశారని రామక్రిష్ణ త్రిపాఠి అన్నారు. వందేమాతరం జాతీయ గీతం రాసి 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వర్గీయ బకించంద్ర ఛటోపాధ్యాయను అవలోకనం చేసుకోవడమే కాకుండా శిశు మందిర్ విద్యార్థులంతా వందేమాతరం గీతం ఆలపించారు. -
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
● పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో నాయకులు పిలుపురాయగడ: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్ భవనంలో పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక, డీసీసీ సాధారణ కార్యదర్శి శంకర్షణ్ మంగరాజు, సీనియర్ నాయకుడు దుర్గా ప్రసాద్పండ, జీవితేశ్వరరావు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని నాయకులు అన్నా రు. మిగతా పార్టీలు వచి పొతుంటాయని అప్పలస్వామి కడ్రక వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పిలుపు మేరకు సోమవారం స్థానిక టీపీసీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు.. విద్యుత్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో మోసాలు చేస్తున్నందుకు నిరసనగా చేపడుతున్న ఆందోళనలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎంతోమంది అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, పద్మా పాంగి, సరోజ్ పాత్రో, పి.కేశురావు, రహీమ్ ఖాన్, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని కలిమెల, కోరుకొండ, చిత్రకొండ, ఖోయిర్పూట్, బలిమెల, పోడి యా, మాత్తిలి సమితుల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, నాయకులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే (మోహాన) దాశరథి గోమాంగో ముఖ్యఅతిథిగా విచ్చేసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రఘుపతి రాఘవ రాజారాం.. పాటను పాడి జాతీయ కాంగ్రెస్పార్టీ 140 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహానీయులు గాంధీ, జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను స్మరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అప్పటి జాతీయ పతాకంలో చరక వున్న జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత పండ, ఈశ్వర్ మఝి, మాజీ వైస్ చైర్మన్ (పురపాలక) సంజయ్ అధికారి, సంగ్రాం సాహు, త్రినాథ పాత్రో, పాపారావు తదితరులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయపురంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయపురం మున్సిపల్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షులు నరేంద్రకుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ నాయకత్వం, శాంతియుతంగా ఆయన సాధించిన స్వాతంత్య్రం వివరించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపింది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. కార్యక్రమంలో జయపురం బ్లాక్ అధ్యక్షులు బసంత నాయిక్, కొరాపుట్ మైనారిటీ వర్గ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హసన్ మదాని, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు చింటు రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది మదన మోహణ నాయిక్, పట్టణ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వెంకటరావు పట్నాయక్, రామ నాయిక్, కై లాస్ బిశాయి పాల్గొన్నారు. -
రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
సస్మితా మెలక అరుణ్ మిశ్ర ఆదిత్య నారాయణ నందో శిల్ప పాణి నీల మాధవ పాత్రోకొరాపుట్: బీజేడీ యువ విభాగంలో కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలకు చెందిన యువ నేతలకు ముఖ్య పదవులు లభించాయి. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జాబితా విడుదల చేశారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలకని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, నబరంగ్పూర్ జిల్లా పరిషత్ సభ్యుడు అరుణ్ మిశ్రను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జయపూర్కి చెందిన యువ నాయకురాలు శిల్పా పాణిని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మాజీ మంత్రి రబినారాయణ నందో కుమారుడు ఆధిత్య కుమార్ నందోని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నబరంగ్పూర్కి చెందిన నీల మాధవ్ పాత్రోని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు. వీరిని పార్టీ సీనియర్ నాయకులు అభినందించారు. -
భారతీయ సంస్కృతి సజీవం
● ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్భువనేశ్వర్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం పూరీ జిల్లా రఘురాజ్పూర్ వారసత్వ కళా గ్రామాన్ని సందర్శించారు. స్థానిక కళాకారులు తయారు చేసిన సున్నితమైన పట్టా చిత్రాలు, టస్సర్ వస్త్రాలు, చెక్క కళాకృతులు, ఇతర కళా ఖండాలను ఆయన ప్రత్యక్షంగా తిలకించి వారితో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్. ఎస్. గోపాలన్ ఇతర సీనియర్ అధికారులతో పాటు పాల్గొన్నారు. రఘురాజ్పూర్ కళాకారులను ప్రశంసిస్తూ వారు పట్టా చిత్ర, ఇతర కళారూపాల ద్వారా శతాబ్దాల నాటి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కథలను సజీవంగా ఉంచారని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు రఘురాజ్పూర్ను సందర్శించి ప్రత్యేకమైన కళా వారసత్వాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. రఘురాజ్పూర్లో యువ నృత్యకారులు ప్రదర్శించిన గొట్టిపువొ నృత్యం ప్రధాన ఎన్నికల కమిషనర్ను విశేషంగా ఆకట్టుకుంది. పూరీ జిల్లా తరఫున కలెక్టర్ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ కుమార్ సింగ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ను పట్టా చిత్రాలు మరియు ఇతర చేతివృత్తుల కళాఖండాలతో సత్కరించారు. భువనేశ్వర్కు తిరిగి వస్తున్నప్పుడు ఆయన ధౌళి శాంతి స్థూపాన్ని, సమీపంలోని శిలాశాసనాలను సందర్శించారు. బౌద్ధ సన్యాసుల నుంచి బౌద్ధ సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకున్నారు. శాంతి స్థూపం నుంచి కనిపించే భువనేశ్వర్ నగరం, దయా నది యొక్క సుందర దృశ్యం అత్యంత అందంగా ఉందని ఆయన వర్ణించారు. శాంతి, సామరస్యానికి భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. ధౌళి శాంతి స్థూపం నుంచి శాంతి సందేశం ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉదయగిరి కొండను, దాని పురాతన గుహలను సందర్శించారు. 2,000ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇంత అందంగా చెక్కిన గుహలను, క్లిష్టమైన రాతి పనులను సృష్టించడం గర్వకారణంగా పేర్కొన్నారు. వేల సంవత్సరాల గొప్ప సంప్రదాయాలు మరియు సంస్కృతి నేటికీ ఉదయగిరి కొండపై సజీవంగా ఉండటం చూడటం మరింత సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఆయన ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించారు, అక్కడ పురాతన కళింగ శైలి వాస్తుశిల్పం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. తన కుటుంబంతో కలిసి దేవతల ఆశీస్సులు పొందారు. -
తైక్వాండో పోటీల్లో సత్తా
● స్వర్ణం, వెండి పతాకాలు కై వసంపర్లాకిమిడి: భద్రక్ జిల్లా బిజూపట్నాయిక్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండ్ పోటీల్లో గజపతి జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారులు స్వర్ణ, వెండి, కాంస్య పతకాలు సాధించినట్టు గజపతి జిల్లా తైక్వాండ్ అకాడమీ అధ్యక్షుడు కార్తీక్ చంద్ర మహాపాత్రో తెలియజేశారు. ఈ రాష్ట్ర స్థాయి తైక్వాండ్ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. గజపతి జిల్లా నుంచి కేవలం 8 మంది పోటీల్లో పాల్గొన్నారు. స్వర్ణం, వెండి పతకాలు సాధించిన వారిలో అనుకంప మల్లిక్ (స్వర్ణం), భుబనానంద భుయ్యాన్ (వెండి), సువర్ణసాహు (స్వర్ణం), పి.సాయిస్మిత (స్వర్ణం), అనుశ్రుత మల్లిక్ (స్వర్ణం, వెండి), సాగర్ బారిక్ కాంస్య పతకం సాధించారు. -
దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి గుముక పంచాయతీ ఎం.వి.64 గ్రామంలో నివసిస్తున్న రవేంద్రమాల్లిక్ (60)పై తన అన్న తపన్ మల్లిక్తోపాటు మరికోంత మంది దాడి చేశారు. ఈ ఘటనలో రవేంద్ర తీవ్రంగా గాయపడడంతో కుటుంబసభ్యులు కలిమెల ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తీసుకున్నారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయంగా ఉండడంతో మల్కన్గిరి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే రవేంద్ర ఆరోగ్యం మరింత క్షీణించడంతో కోరాపూట్ మెడికల్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రవేంద్ర మల్లిక్, అతని అన్న తపన్ మల్లిక్ మధ్య కొంతకాలంగా భూమి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న భాగవతం ప్రవచనానికి రవేంద్ర వెల్లి తిరిగి వస్తున్న సమయంలో మరికొంతమందితో కలిసి తపన్.. రవేంద్ర మల్లిక్పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు మల్లిక్ కుటుంబ సభ్యులు కలిమెల పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయగా.. ఐఐసీ ముకుందో మేల్కా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పన పరేష్, నిరంజన్ విధాన్, రంజిత్, జగబందు, నీరద్, సుజిత్, జగదీశ్, వినయ్, సౌమన్, తపస్పై కేసు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రవేంద్ర మల్లిక్ మృతదేహన్ని కూటుంబ సభ్యులకు అప్పగించారు. -
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలో త్వరలో జరగనున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం–2025కు సంబంధించిన లోగోను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆదివారం శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమలరావు, ప్రసాద్, కీర్తి, రామకృష్ణ, రాము, మాదారపు వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ మాదిగ, విశ్వేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ కణితి సూర్యనారాయణ, ఎలయన్స్ క్లబ్ సభ్యులు జామి మన్మధరావు పాల్గొన్నారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శంభాజీ షిండే ఆదివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అంతరాలయంలో పూజలు చేయించారు. ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు స్వామి చిత్రపటం, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు బస్సు నుంచి జారిపడి వృద్ధురాలికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడాం బస్టాండ్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొనప లక్ష్మీ గాయాలపాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీ సోంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామం వచ్చేందుకు కాశీబుగ్గలో బస్ ఎక్కింది. అంతరకుడ్డ వెళ్లేందుకు చినబడాం బస్టాండ్ వద్ద దిగుతుండగా బస్సు ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీని స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆవిష్కర్ సీజన్–3 హాక్థాన్ సాంకేతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమాజ హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాటి ప్రయోజనాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్, యాప్ అభివృద్ధి, ఐఓటీ, డైటా సైన్స్ తదితర అంశాలతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఎంపికై న ప్రాజెక్టుల నిర్వాహకులకు సోమవారం బహుమతులు అందజేయనున్నారు. గోల్ షాట్బాల్ పోటీల్లో ప్రతిభ కంచిలి: తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థర్డ్ ఫెడరేషన్ కప్ గోల్ షాట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. కంచిలి మండలం జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్యామల విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రులు తరిణి–తులసి వ్యవసాయ కూలీలు. పోటీలో ప్రతిభ కనబరిచిన శ్యామలను జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, వైఎస్సార్ సీపీ నేతలు కప్పల యుగంధర్, మెండ ప్రకాశరావు, మురళి అభినందించారు. -
● అపూర్వ సమ్మేళనం
పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1992, 1993 బ్యాచ్ల విద్యార్థులు ఆదివారం కలుసుకుని ఆనందంగా గడిపారు. బెంగళూరు, చైన్నె, ఇతర దేశాలలో స్థిరపడినవారందరూ కలుసుకున్నారు. తమ జీవతంలో ఉన్నతశిఖారాలను అఽధిరోహించిన తీరును గురువులకు తెలియజేశారు. గురువులు ప్రఫుల్లచంద్ర పాణిగ్రాహి, బినోద్ చంద్ర జెన్నా, ఉపేంద్ర పండా, ప్రమిలా సాహుకార్, హరిహరదాస్, కుముదరంజన్ దాస్ (పిల్లా పండిత్)లను ఘనంగా సత్కరించుకున్నారు. పాతమధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1993 బ్యాచ్ విద్యార్థులు బి.ఎన్.ప్యాలస్లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేశారు. -
బీజేడీ రాష్ట్రశాఖ నూతన కార్యవర్గం
రాయగడ: బీజేడీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ బల్లోపేతానికి సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంల్లో ఆదివారం పార్టీ రాష్ట్రశాఖ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. యువజనతాదళ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షునిగా రాయగడకు చెందిన దేవాశీష్ ఖడంగ, బిజు ఛత్రజనతాదళ్ రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శిగా బినాయక్ పొల్లయ్లు నియమించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. కొన్నాళ్లుగా పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న దేవాశీష్, బినాయక్లు రాష్ట్ర శాఖ కార్యవర్గంలో స్థానాన్ని సంపాదించుకోవడంతో వారి అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేయడంతో పాటు వారిని అభినందించారు. ఆహార దుకాణాల్లో అధికారుల తనిఖీలు రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఆహార దుకాణాల్లో మున్సిపాలిటీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చేవారి ఆరోగ్య భద్రత దృష్ట్యా దుకాణాల్లో విక్రయించే ఆహారం, హోటళ్లలో అల్పాహారం, పాస్ట్ఫుడ్ కేంద్రాల్లో నాణ్యత లోపించకుండా ఈ తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ కార్యనిర్వాహక అఽధికారి కులదీప్కుమార్ తెలియజేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎన్ఫొర్స్మెంట్ అధికారుల సమక్షంలో హోటళ్లు, ఆహార స్టాళ్లలో వినియోగిస్తున్న నూనె, మంచినీరు, పరిశుభ్రతను పాటిస్తున్న తీరును పరిశీలించారు. సెంచూరియన్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం శని, ఆదివారాల్లో ఘనంగా జరిపారు. వర్సిటీలో పట్టభద్రులై అనేక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు కలుసుకుని అధ్యాపకుల దీవెనలు పొందారు. వారికి సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాధ్ పాఢి ఆడిటోరియంలో దుశ్వాలువ, మెమొంటోలతో సత్కరించారు. అనేక రాష్ట్రాల నుంచి పూర్వ విద్యార్థులు పర్లాకిమిడి సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్కు విచ్చేసి రెండు రోజుల పాటు తోటి విద్యార్థులతో గడపడమే కాకుండా వారి అనుభవాలను అందిపుచ్చుకున్నారు. సాయిలక్ష్మీ కాలనీలో చోరీ ● కత్తితో వృద్ధురాలిని బెదిరించి బంగారం, నగదు దోపిడీ రాయగడ: స్థానిక సాయిలక్ష్మీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సాయిలక్ష్మీ కాలనీలో నివసిస్తున్న పి.వాసు ఇంట్లో వృద్ధురాలు మాత్రమే ఉంటుందని గుర్తించిన దుండగులు లోనికి చొరబడి కత్తితో బెదిరించి మూడు తులాల బంగారు ఆభరణాలు, 70 వేల రూపాయల నగదును దోచుకున్నారు. వాసు తన సొంత లారీని మరమ్మతులు చేయించేందుకు బయటకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఆమె తల్లి ఒక్కరే ఉండగా శుక్రవారం అర్ధరాత్రి ఇంటి బయట తలుపులను విరగ్గొట్టి లోపలకు దుండగులు ప్రవేశించారు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లెక్కింపునకు సన్నాహాలు
రత్న భాండాగారం సొత్తు భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారం సొత్తు జాబితా తయారీ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. అమూల్య రత్న సంపద నిర్వహణ నేపథ్యంలో క్రమబద్ధీకరించిన నియమావళితో రత్న భాండగారం లోపల, వెలుపల రెండు వేర్వేరు అంచెల్లో భద్రపరచిన అమూల్య రత్న సంపద లెక్కలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రత్న భాండాగారం సంపదకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించే ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరబింద కుమార్ పాఢి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక రథయాత్రకు ముందు ఆలయ ఆభరణాల లెక్కింపు, జాబితాను ప్రారంభించాలని నిర్ణయించారు. కమిటీ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సీఏఓ మాట్లాడుతూ జాబితా ప్రక్రియ కోసం క్రమబద్ధమైన పారదర్శకమైన మరియు దశలవారీ ప్రక్రియను నిర్ధారించడానికి 11 పేజీల ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) తయారు చేశామన్నారు. ఆభరణాల లెక్కింపు, డాక్యుమెంటేషన్ 3 విభిన్న దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రస్తుతం తాత్కాలిక లేదా బాహ్య ఖజానాలో ఉంచిన ఆభరణాలను జాబితా చేస్తారు. దీని తర్వాత బాహ్య రత్న భాండాగారం యొక్క జాబితా, చివరగా ఆలయం యొక్క అత్యంత విలువైన, పురాతన ఆభరణాలను కలిగి ఉన్న లోపలి రత్న భాండాగారం జాబితా ఉంటుంది. ఆభరణాల వినియోగం క్రమబద్ధీకరణ, డాక్యుమెంట్ చేయడం,నిర్వహణ కోసం ఎస్ఓపీ వివరణాత్మక విధానాలతో రత్న భాండాగారం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) రూపకల్పన పూర్తయ్యింది. త్వరలో పాలక మండలి ఆమోదం కోసం దీనిని ప్రవేశ పెడతారని శ్రీ మందిరం సీఏఓ తెలిపారు. లెక్కింపు, జాబితాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
చర్చల అనంతరం ధాన్యం కొనుగోలు ప్రారంభం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సంబల్పూరి నృత్య ప్రదర్శనరాయగడ: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే జానపద నృత్యాలు దేశ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయని రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్ అన్నారు. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన ప్రాంత కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. వేదికపై ప్రదర్శించిన జానపద నృత్యాలు అలరించాయి. మ్యూజిక్ గెలాక్సీ బృందం ప్రదర్శిఽంచిన నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా సొన్పూర్ జిల్లా సాంసృతిక మండలి ద్వారా పనేలి, కొట్పాడ్ సాగర్ నృత్య బృందం ప్రదర్శించిన థింసా, నవరంగపపూర్, రాయగడ జిల్లాకు చెందిన గుడారి కళా సంసృతి సంఘం, కాసీపూర్, జేకేపూర్, రాయగడకు చెందిన మజ్జిగౌరి డ్యాన్స్ స్డూడియో బృందం ప్రదర్శిఽంచిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఉర్రూతలూగించిన రాక్స్టార్ రుకుసున గీతాలు ప్రముఖ సినీనేపథ్య గాయకుడు, రాక్స్టార్ రుకు సున పాటలు యువతను ఉర్రూతలూగించింది. చలిలో సైతం ఆయన పాటలను ఆస్వాదించిన ప్రేక్షకులు వారి నృత్యాలు, కేరింతలతో చొయితీ వేదిక ప్రాంగణం దద్దరిల్లింది. క్లాస్, మాస్ పాటలతో గాయకుడు రుకుసున అందరిని మైమరపించారు. కళాకారులకు కలెక్టర్, చొయితీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అశుతోష్ కులకర్ణి ఈ ప్రాంత లంజియా సవర కళలకు ప్రతీకమైన ఇడితాల్ చిత్రపటాలను జ్ఞాపికలుగా అందజేశారు. చివరిగా కార్యక్రమానికి హాజరైన జిల్లాలోని 11 సమితులకు చెందిన అధ్యక్షులను ఉత్సవ కమిటీ సన్మానించింది. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు ప్రసంగించారు.ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ సుజిత్ కుమార్ను సన్మానిస్తున్న కలెక్టర్ కులకర్ణి -
మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్గా మల్కన్గిరి యువతి మమత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పద్మాగిరి పంచాయతీకి చెందిన త్రిలోచన్ భూమియా కుమార్తె తమమతా భూమియా 17 ఏళ్లకే మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్గా జాతీయ స్థాయిలో నిలిచింది. ఆదివారం ఆమెకు స్థానిక బస్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ యువతి ఇటీవల రాజస్థాన్లో నిర్వహించిన జాతీయ స్థాయి మిస్ టీన్ ఫరెవర్ యూనివర్స్ పోటీలో పాల్గొంది. ఏడు వేల మందిని దాటుకుని కిరీటాన్ని సాధించింది. తనకు చిన్ననాటి నుంచి మోడలింగ్పై ఆసక్తి ఉందని, తల్లిదండ్రులు ఈ పోటీలకు పంపించారు. మమత ప్రస్తుతం మల్కన్గిరి కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం మల్కన్గిరి చేరుకోగా స్థానిక బస్టాండ్ వద్దనే ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతరం టాప్లెస్ జీప్లో ఊరేగిస్తూ ఊరికి తీసుకెళ్లారు. -
రెండు కార్లు ఢీ
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ–లమతాపుట్ ల మధ్య మర్రిపెట్ట గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున ఒక కారును కోళ్లు రవాణా చేస్తున్న వ్యాన్ ఢీకొనటంతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ఆంధ్రప్రదేశ్లో బొర్రా గుహలు సందర్శించేందుకు కొందరు కారులో వెళ్తుండగా మర్రిపెట్ట గ్రామ సమీపంలో కారుకి ఎదురుగా వస్తున్న కోళ్లు రవాణా చేస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించి క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొరకు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. 3 పులి పిల్లలు జననం భువనేశ్వర్: నందన్కానన్ జూలాజికల్ పార్క్లో శనివారం మూడేళ్ల జయశ్రీ అనే పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు వాటి లో 2 పిల్లలు మృతి చెందాయి. మిగిలిన ఒక పి ల్ల జంతు వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స పొందుతుందని కానీ ఒకటి మాత్రమే బతికిందని జూలాజికల్ పార్క్ అధికారులు ఆదివారం తెలిపారు. 101 రోజుల గర్భధారణ కాలం తర్వాత జయశ్రీ తొలి కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 17 మధ్య అమిత్ అనే పులితో జతకట్టింది. మొదటి కాన్పు కావడంతో పులికి తల్లి స్వభా వం లేక పిల్లలను చూసుకునే సామర్థ్యం కొరవడి ఈ పరిస్థితి చోటు చేసుకుందని విచారం వ్యక్తం చేశారు. మొదటి పిల్ల ఉదయం 11.55 గంటలకు జన్మించింది. జయశ్రీ దానికి శ్రద్ధ వహించకపోవడంతో జూ సిబ్బంది వెంటనే నవజాత శిశువును ఎన్సీయూకి తరలించి పశువైద్యుల నిరంతర పరిశీలనలో పర్యవేక్షిస్తున్నారు. మధ్యా హ్నం 3.34 గంటలకు జన్మించిన రెండో పులి పిల్ల పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉంది. దాన్ని నిర్వహించేటప్పుడు ఆ పులి ప్రమాదవశాత్తు దానిపైకి దొర్లడంతో గాయాలై మృతి చెందింది. సాయంత్రం 4.55 గంటలకు జన్మించిన మూడో పులి పిల్ల పుట్టిన వెంటనే తల్లి జయశ్రీ తినేసింది. ప్రస్తుతం బతికి ఉన్న ఒక్క పిల్ల జూ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 24 గంటలూ పశువైద్య సంరక్షణలో చికిత్స పొందుతుంది. ఈ జననంతో నందన్కానన్ జూలాజికల్ పార్క్లో మొత్తం పులు ల జనాభా ఇప్పుడు 29కి చేరుకుంది. వీటిలో 18 మగ పులులు, 11 ఆడ పులులు ఉన్నాయి. -
కుంధ్ర సమితిలో ధాన్యం కొనుగోలు మండీ ప్రారంభం
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి డొంగరచించి, పుప్పుగాం గ్రామాలలో శనివారం ధాన్యం కొనుగోలు మండీని అధికారులు ప్రారంభించారు. రెగ్యులేటింగ్ మార్కటింగ్ కమిటీ, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సంస్థలు లేంప్స్, సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు, మిల్లర్లు, రైతులు మండీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాధాబినోద సామంతరాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మండీని ప్రారంభించగా.. లేంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పరశురాం మహారాణ, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ ప్రదీప్ సెట్టి, రెగ్యులేటింగ్ మార్కెటింగ్ కమిటీ ధాన్య పరీక్షకులు డొంబురు శాంత, రైతు నేత రామనాథ్ భట్ పాల్గొన్నారు. ఈ రెండు మండీలలో నాలుగు వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఉత్సాహంగా సిటిజన్ కమిటీ వనభోజనాలు
జయపురం: జయపురం సిటిజన్ కమిటీ శుక్రవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా 2025 సంవత్సరం వనభోజనాలు జరుపుకుంది. జయపురం సమితి బముణిగాం గ్రామ మా శీతాలమ్మ గుడి ప్రాంగణంలో జరిగిన వనభోజన కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. సిటిజన్ సాధారణ కమిటీ కార్యదర్శి జి.వేంకట రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు భవాణి ఆచార్య, కార్యదర్శి రబినారాయణ నందో, దేవేంధ్ర బాహిణీపతి, పరమేశ్వర పాత్రోలు వనమహోత్సవాన్ని చక్కగా నిర్వహించి సభ్యులను ఆనంద పరిచారు. ఈ సందర్భంగా సిటిజన్ కమిటీ అధ్యక్షురాలు బినోదినీ శాంతపాత్రో సిటీజన్ కమిటీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. కమిటీ ని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై మరింతగా ఉద్యమించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తాను కేవలం పేరుకు మాత్రమే అధ్యక్షురాలునని సభ్యులందరి సహకారంతో విజయవంతంగా సిటిజన్ కమిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయని అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.కారు ప్రమాదంలో వ్యక్తి మృతి కొరాపుట్: కారు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం కొరాపుట్ జిల్లా మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి పుట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ఖోర (35) ప్రమాదంలో మృతి చెందాడు. మాచ్ఖండ్ సమీపంలో ఒడి 10 బి 8411 నంబర్ గల కారులో వెళ్తూ మలుపు వద్ద అదుపు తప్పి స్తంభానికి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మాచ్ఖండ్ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బాలుడు.. రాయగడ: సదరు సమితి గుమ్మ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతుడు స్థానిక గౌతంనగర్కు చెందిన సింహాచల్ నాపాడు కుమారుడు అరుణ్ నాపాడు (7)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శుక్రవారం సింహాచల్ కుటుంబీకులు కాసీపూర్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మ వద్ద ఫొటోలు తీసుకుంటున్న సమయంలో బాలుడు అరుణ్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన అరుణ్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నానికి మెరుగైన చికిత్సకు రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలోనే అరుణ్ చనిపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. అనంతరం సదరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాటు పడవ మునిగి వ్యక్తి..కొరాపుట్: నాటు పడవ మునిగి ఘటనలో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బిరాపుట్ గ్రామ పంచాయతీ లంబదురో గ్రామానికి చెందిన రామ పంగి (30) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జోలాపుట్ రిజర్వాయర్లో నాటు పడవ మీద వెళ్తుండగా అదిమునిగిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం రిజర్వాయర్లో గాలిసి రామ పంగి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గణతంత్ర పరేడ్కు ఒడిశా ఎన్సీసీ క్యాడెట్లు
భువనేశ్వర్: వచ్చే ఏడాది జరగనున్న జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 127 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 2026 జనవరి 29 వరకు న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ శిబిరం (ఆర్డిసి)లో వీరంతా పాల్గొంటారు. ఈ క్యాడెట్లు దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ మరియు ఎన్సీసీ ప్రధానమంత్రి ర్యాలీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రంలో దాదాపు 64,000 మంది ఎన్సీసీ క్యాడెట్ల నుంచి ఈ బృందాన్ని ఎంపిక చేశారు. ఎంపికై న 127 మంది క్యాడెట్లలో 80 మంది బాలురు, 47 మంది బాలికలు ఉన్నారు. వారిలో 112 మంది క్యాడెట్లు కళాశాల ఎన్సీసీ విభాగానికి చెందిన 71 మంది బాలురు మరియు 41 మంది బాలికలు, పాఠశాల ఎన్సీసీ విభాగానికి చెందిన 15 మంది క్యాడెట్లులో 9 మంది బాలురు, 6 మంది బాలికలు ఉన్నారు. 10 మంది సహాయక సిబ్బంది ఆధ్వర్యంలో వీరంతా శనివారం ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమానికి సిద్ధం కావడానికి క్యాడెట్లు బయలుదేరే ముందు నవరంగ్పూర్లో నెల రోజులపాటు ఇంటెన్సివ్ శిక్షణ పొందారు. న్యూఢిల్లీకి బయలుదేరే ముందు క్యాడెట్లు రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్తో సంభాషించారు. ఆయన వారిని ప్రోత్సహించి వారి విజయాన్ని ఆకాంక్షించారు. క్యాడెట్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ జాతీయ ఐక్యత, సమగ్రతపై ఎన్సీసీ క్యాడెట్ల క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గణతంత్ర దినోత్సవ శిబిరంలో పాల్గొనడం క్యాడెట్లకు చిరస్మరణీయమైన మరియు సుసంపన్నమైన అనుభవంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ వేదికపై ఒడిశా క్యాడెట్లు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. ఒడిశాలో ఎన్సిసి క్యాడెట్ల సంఖ్యను పెంచడానికి విభాగం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది. ప్రధానంగా ఎన్సీసీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి రాష్ట్రంలో మహిళల కోసం ఎన్సీసీ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి ఉన్నత విద్యా శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ఒడిశా ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండరు విక్రమ్ సింగ్ రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలపై వివరణాత్మక సమాచారం ప్రవేశ పెట్టి రాష్ట్రంలో ఎన్సీసీని బలోపేతం చేయడానికి ఉన్నత విద్యా విభాగం చొరవ పట్ల ఆయన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
పూరీ, కోణార్క్ దేశానికి గర్వకారణం
● ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్భువనేశ్వర్: మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం నగరానికి చేరారు. తొలి రోజు ఆయన పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో పూజలు చేసి, జగన్నాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం కోణార్క్లోని చారిత్రక సూర్య దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్ఎస్ గోపాలన్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జగన్నాథునికి నమస్కరించి ఒడియా భాషలో ఒడిశా ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా దృష్టిని ఆకట్టుకున్నారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ కుమార్కు ఆలయ అధికారులు జగన్నాథుడు, ఇతర దేవతల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ జగన్నాథుని దర్శనం అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ జగతి నాథుని దివ్య ఆశీస్సులు తన రాజ్యాంగ బాధ్యతలను మరింత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వర్తించడానికి ప్రేరేపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశా కళ, సాహిత్యం, సంస్కృతి ప్రాచీనమైనవి, విశిష్టమైనవి అని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో ఈ గొప్ప సంప్రదాయాల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయంలో పూజలు చేసిన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరప్రాంత మార్గంలో ప్రయాణించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన విలక్షణమైన కళింగ శైలి వాస్తు శిల్పంలో నిర్మించిన కోణార్క్ అసాధారణమైన శిల్ప హస్తకళ చారిత్రక ప్రాముఖ్యతపై ఆయన ముగ్ధులయ్యారు. కోణార్క్లో మాట్లాడుతూ సూర్య దేవాలయం ఒడిశా వారసత్వానికి చిహ్నం మాత్రమే కాదు, యావత్ దేశానికి గర్వకారణం మరియు గౌరవప్రదం అని పేర్కొన్నారు. ఆలయం వైభవాన్ని సూక్ష్మమైన హస్తకళను గమనిస్తే ప్రాచీన భారత దేశం సంపద, జ్ఞానం మరియు శాసీ్త్రయ పురోగతి పరంగా ఎంత సుసంపన్నంగా ఉండేదో నిజంగా అర్థం చేసుకోవచ్చన్నారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం, కోణార్క్లోని సూర్య దేవాలయం ఒడిశా యొక్క గొప్ప వారసత్వానికి, పురాతన సంప్రదాయాలకు అద్భుతమైన ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. ఈ పవిత్రమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించిన దివ్యానుభూతి తన జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పూరీ, కోణార్క్ పర్యటనలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుశాంత్ కుమార్ మిశ్రా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి గోపీనాథ్ కన్హర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ సాహు, అనామిక సింగ్, స్థానిక పరిపాలన అధికారులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
31వ తేదీ వరకూ మంచుముప్పు
● ఐఎండీ మాజీ డైరెక్టర్ శరత్ చంద్ర సాహు పర్లాకిమిడి: ఈ నెల 31వ తేదీ వరకూ పొగమంచు దట్టంగా కురస్తోందని ఐఎండీ డైరెక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. కొన్నిరోజులుగా కనిపించని పొగమంచు ప్రభావం తిరిగి శనివారం నుంచి గజపతి జిల్లా అంతటా దట్టంగా కురిసింది. పర్లాకిమిడిలో తెల్లవారు జాము నుంచి దట్టమైన పొగమంచు ఆవరించడంతో ఉదయం పది గంటల వరకూ సూర్యుడు కనపించడం లేదు. ఇక జిల్లాలోని ఏజెన్నీ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల వరకూ మంచుప్రభావం తగ్గటం లేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. గజపతి జిల్లాలోని రాయఘడ బ్లాక్లో మర్లబ, రామగిరి, ఉదయగిరి, చంద్రగిరి, మోహానా, పాతపట్నం రోడ్డు, కాశీనగర్లో పొగమంచు విపరీతంగా కురవడంతో ప్రజలు వాహాన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా ఈనెల 31వ తేదీ వరకూ దక్షిణ ఒడిశాలో పొగమంచు కురుస్తుందని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. అలాగే పశ్చిమ భారతం నుంచి చలిగాలుల ప్రభావంతో ఒడిశాకు కూడా చలి ప్రభావం ఉంటుందన్నారు. -
మేలుకొలుపు సందడి!
పర్లాకిమిడి: ధనుర్మాసం సందర్భంగా మేలుకొలుపు సందడి గ్రామాల్లో నెలకుంది. చలిని లెక్క చేయకుండా యువకులు, వృద్ధులు వేవెకువజామున మేళ తాళాలతో మేలుకొలుపు పాటలు పాడుకుంటూ కోమటి వీధి శ్రీవేంకటేశ్వర స్వామి మందిరానికి శనివారం వచ్చారు. స్థానిక ఖంజావీధి సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా మేలుకొలుపు పాటలు పాడుతూ, ప్రజలు ఇచ్చేకానుకలు, బియ్యం తీసుకుంటారు. భోగి పండుగ వరకూ సాగే మేలుకొలుపులో ముఖ్యంగా శ్రీక్రిష్ణ చైతన్య ప్రభు నిత్యాగోవిందా.. మేలుకో.. అని పాడుకుంటు భక్తులకు ధనుర్మాసంలో మేలుకొలుపుతారు. దీంతో భక్తులు ఈ పాటలు విని తెల్లారిందని లేచి నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని శ్రీవేంకటేశ్వరుని స్వామిని దర్శించుకుని తమ పొలం పనులు, వ్యాపారాలకు వెళ్లడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెలరోజుల పాటు ఒక్కోక్క వీధి పాడుకుంటూ వెళ్ళి భక్తులు ఇచ్చిన కానుకలు భీష్మ ఏకాదాశి మరుచటినాడు ఖంజా వీధిలోలోని శ్రీత్రినాథ మందిరం వద్ద అన్నదాన సంతర్పణ చేస్తామని ఖంజావీధి సాంస్కృతిక మేలుకోలుపు కమిటీ సభ్యులు తెలిపారు. మేలుకొలుపులో చిన్నారులు కూడా పాల్గొని భక్తిభావాన్ని చాటకుంటున్నారు. -
జాతీయ చాంపియన్గా దివ్యాంస మిశ్ర
జయపురం: భువనేశ్వర్లోని బుద్ధ మందిర ప్రాంగణంలో 8వ ఒడిశా సాంస్కృతిక మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన కిడ్స్ ఒలింపియాడ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ బాలుడు దివ్యాంస మిశ్ర చాంపియన్గా నిలిచారు. బొయిపరిగుడ సమితి కార్యాలయ ఏపీఓగా పనిచేస్తున్న సాగరిక పండా కుమారుడు దివ్యాంస మిశ్ర. బాలుడికి ట్రోఫీతోపాటు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. బాలుడు జయపురం ఆక్టివిటీ స్కూల్లో నర్సరీ చదుతువున్నాడు. కిడ్స్ ఒలింపియాడ్ స్థాపకులు, అధ్యక్షుడు గురుప్రసాద్ సమరేంద్ర త్రిపాఠి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విదానసభ మాజీ కార్యదర్శి సురేష్ చంద్ర మంతి, ఫకిరీ మోహణ విశ్వవిద్యాలయ విశ్రాంత కులపతి డాక్టర్ హరిహర కనుంగో, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ద్వీపాయన పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
భువనేశ్వర్: స్థానిక రవీంద్ర మండపంలో అంతర్జాతీయ ఒడిస్సీ నృత్యోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాయి. గురు కేలుచరణ్ ఒడిస్సీ పరిశోధన కేంద్రం, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక శాఖ ఉమ్మడిగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్న 5 రోజుల ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రారంహించారు. ఆయన ముఖ్య అతిథిగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఒడిస్సీ నృత్యం రాష్ట్ర కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో ఒడిస్సీ నృత్యం ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. కళా రంగంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శక్తివంతమైన మాధ్యమంగా ఒడిస్సీని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దేవ ప్రసాద్ దాష్ మాట్లాడుతూ ఒడిస్సీ నృత్యం అంతర్జాతీయ స్థాయిలో ఒడిశాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిందని అన్నారు. ఐఐటీ భువనేశ్వర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమ బీటెక్ పాఠ్యాంశాల్లో ఒడిస్సీ నృత్యాన్ని చేర్చాయని, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒడిస్సీ కేంద్రం కూడా స్థాపించబడిందని ఆయన తెలియజేశారు. ఉత్సవం ప్రారంభ సాయంత్రం గురు కేలూ చరణ్ మహాపాత్రో ఒడిస్సీ పరిశోధన కేంద్రం నృత్యకారుల మంగళ చరణం ప్రదర్శనతో ప్రారంభమైంది. జయదేవుడి గీత గోవిందం నుంచి అష్టపదిని అందంగా ప్రదర్శించిన ప్రముఖ నృత్యకారుడు గురు బిష్ణుతత్త్వ దాస్ ఒడిస్సీ కచేరీ ఈ సాయంత్రం ముఖ్యాంశంగా నిలిచింది. అర్పితా పాణి, తులిక త్రిపాఠి, ప్రశాంతి జెనా మరియు ప్రభుతోష్ పండా సోలో, తన్మయ్ సమదర్, ఫర్జానా జాస్మిన్, జి. సంజయ్, డయానా ఘోష్ యుగళగీత, సంకల్ప ఫౌండేషన్ కళాకారులు సామూహిక ఒడిస్సీ ప్రదర్శనలు ఆహ్లాదపరిచాయి. కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రి ఒడిస్సీ నృత్యం ఆధారంగా ‘ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్‘ శీర్షికతో కూడిన చిత్రకళ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రఖ్యాత కళాకారులు ఒడిస్సీపై సృష్టించిన చిత్రాలు ప్రదర్శించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఒడిస్సీ నృత్య ఉత్సవంలో దాదాపు 350 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు. వారిలో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, మలేషియా వంటి విదేశాల నుంచి దాదాపు 15 మంది ఒడిస్సీ నృత్యకారులు ఉన్నారు. దేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, చత్తీస్గఢ్ నుంచి పులువురు కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. -
సరిహద్దులో షూటింగ్ సందడి
కొరాపుట్: రాష్ట్ర సరిహద్దులో తెలుగు సినిమా నటుడు రాజా రవీంద్ర సందడి చేశారు. కొరాపుట్ జిల్లా కొట్పాడ్ సమితిలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో పాల్గన్నారు. కూతవేటు ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులో ఉత్కళ గ్రామీణ ప్రాంతంలో తెలుగు గ్రామీణ ప్రాంత సెట్లు వేసి షూటింగ్ జరుపుతున్నారు.ఇది తెలిసి జయపూర్ నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చి సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఈ చిత్ర షూటింగ్ సంక్రాంతి వరకు జరగనుంది. పేరు ఇంకా ఖరారు కాని ఈ చిత్రానికి నిర్మాతగా కొట్పాడ్కి చెందిన తెలుగు యువకుడు వివేక నంద వర్మ వ్యవహరిస్తుండగా.. దర్శకునిగా రవి కిషోర్ (మిస్టర్ సెలబ్రటీ దర్శకుడు), హీరోగా వివేక్ వర్మ, హిరోయిన్గా సంకీర్తన నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర లో సప్తగిరి పలు సీన్లలో కొట్పాడ్లో నటించారు. గతంలో కొరాపుట్ జిల్లాలో రాజమౌళీ దర్శకత్వంలో మహేష్బాబు నటించిన వారణాసి చిత్రీకరణ జరిగింది. అలాగే అనుష్క నటించిన ఘాటీ, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. -
ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేయాలి
జయపురం: ప్రజా సమస్యల పరిష్కారంపైన పార్టీ శ్రేణులు పోరాటాలు చేయాలని రాష్ట్ర కమ్యూనిస్టు కార్యవర్గ సభ్యులు, కొరాపుట్ జిల్లా పార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నేత బుద్ర బొడొనాయక్ అధ్యక్షతన జరిగిన కమ్యూనిస్టు పార్టీ శత వార్షిక ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రామకృష్ణ దాస్ మాట్లాడారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొనే స్థితి నెలకొందని, నిరుద్యోగం సమస్య ఆందోళన కలిగిస్తుందని, ధరలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజలపై అధిక భారమతున్నాయన్నారు. దేశం రాజ్యాంగం విపత్కర స్థితిని ఎదుర్కొంటోందని దీనిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో మాట్లాడారు. ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్పై నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టు నేతలు బసంత బెహరా, లయిచన్ ముదిలి, పబన్ మహురియ, తదితరులు ప్రసంగించారు. -
వాహనాలకు గ్రీన్ స్టిక్కర్ తప్పనిసరి
● రాష్ట్ర రవాణా మంత్రి బిభూతి జెనా భువనేశ్వర్: వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ దిశలో చెల్లుబాటు అయ్యే కాలుష్య ధ్రువీకరణ పత్రాలున్న వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తుందని ప్రకటించింది. త్వరలో వాహనాలకు కాలుష్య ధ్రువీకరణ ఆకుపచ్చ స్టిక్కర్ను ప్రదర్శించాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణా మంత్రి బిభూతి జెనా శనివారం ప్రకటించారు. కాలుష్య ధృవీకరణ పత్రంలేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పర్యావరణ నిబంధనలతో గాలి నాణ్యత ఏక్యూఐ, రహదారి భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 2019 సంవత్సరంలో విధించిన జరిమానాలను తిరిగి పరిశీలించే అవకాశం ఉందని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం జరిమానాలు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ స్టిక్కర్లను ప్రవేశపెట్టడం వల్ల కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాలను గుర్తించే ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. దీని వలన అధికారులకు నిబంధనలను అమలు చేయడం సులభతరం అవుతుందన్నారు. -
జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి రూ.లక్ష లేదా అంతకుమించి విలువైన పనులు, విరాళాలు సమర్పించిన దాతలు వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా ప్రత్యేకంగా తమ వివరాలను ఆధార్కార్డుతో సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దాతలు స్వయంగా లేదా వారికి చెందిన వ్యక్తులను ఆలయానికి పంపించి తమ వివరాలను నమో దు చేయించుకోవాలన్నారు. లేదంటే 63026 79236, 89789 14660, 73820 25550 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డులు, విరా ళ రశీదును పంపిస్తే ఆలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం జంక్షన్కు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒడిశా నుంచి బెంగుళూరు వెళ్తున్న ఒక కారు బోల్తా పడడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగుళూరు (కర్ణాటక) బాట్రాపురానికి చెందిన ఎన్.నవీన్ తన మిత్రులతో కలిసి ఒడిశాలోని ఆలయాల సందర్శనకు కారులో వెళ్లాడు. అనంతరం తిరిగి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చిలకపాలేం వద్ద కారు వెనుక టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ అర్జున్(27) తీవ్రంగా గాయపడడంతో.. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని శివశంకర్ కాలనీ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన ఆనెం త్రినాథరావు (74) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. మృతుడు శివశంకర్ కాలనీ కూడలి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో పాతపట్నం నుంచి కొరసవాడ వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పాతపట్నం సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. త్రినాథరావుకు భార్య ఆనెం శకుంతల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్: జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెలను లారీ ఢీకొనడంతో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గుడ్డిభద్ర కొజ్జిరియాకు చెందిన దుర్గాశి శేఖరం తన గొర్రెలను శనివారం స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో సోంపేట నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు బలరాంపురం జంక్షన్ వద్ద ఢీకొనడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, నాయకుడు దట్టి అజయ్, మురపాల ధర్మా, కర్రి పొట్టయ్యలు లారీ డ్రైవర్తో మాట్లాడి బాధితుడికి రూ.80 వేల నష్ట పరిహారం ఇప్పించారు. సంతబొమ్మాళి: మండలంలో కె.లింగుడు పంచాయతీ రెడ్డిక సున్నాపల్లి గ్రామంలోని రామాలయంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆలయ పూజారి దేవుడికి భోగంపెట్టి ఎప్పట్లాగే బయటకు వెళ్లారు. దీంతో ఎప్పటినుంచో అక్కడే స్యూటీపైన మంకీ క్యాప్ పెట్టుకొని మాటువేసి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వెంటనే ఆలయంలోకి చొరబడ్డారు. అనంతరం బంగారం, వెండి ఆభరణాలు మూటకట్టి స్యూటీపై వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఆలయ పూజారి కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. ఆభరణాల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. చోరీపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని నౌపడ ఎస్ఐ జి.నారాయణస్వామి పేర్కొన్నారు. -
భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తాం
● బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకుడు నెక్కంటిరాయగడ: సుధీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేడీ పార్టీకి ఎన్నో సేవలందించిన రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరావు కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజూ స్వాభిమాన్ మంచ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిజు స్వాభిమాన్ మంచ్ రాజకీయ పార్టీ కాదని, కేవలం ప్రజలకు సేవలందించే సంస్థగా మాత్రమే పనిచేస్తుందని అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. తనను నమ్ముకుని ఉన్న ప్రజల కోసం తాను ఎప్పుడూ ముందే ఉంటానన్నారు. ప్రజల సమస్యల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 31వ తేదీన స్థానిక తేజస్వీ మైదానంలో బంధుమిలన్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందరి సూచనలు, సలహాల మేరకు తాను భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తానని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుని ప్రజల్లోకి దూసుకెళ్తానని చెప్పారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము మద్దతు తెలిపే పార్టీని గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని వివరించారు. అయితే ఏ పార్టీలొ చేరుతారన్న విలేకరుల ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చారు. సమావేశంలో ఆయనతో పాటు మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక ఉన్నారు. -
బీజేడీ విజయానికి కృషి చేయాలి
బిజూ పట్నాయక్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి తదితరులు మల్కన్గిరి: రానున్న అన్ని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని బీజేడీ పార్టీకి చెందిన మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కమి పిలుపునించారు. పార్టీ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కన్గిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మనాస్ మడ్కమి స్థానిక లాఠియగూఢ వీధిలో ఉన్న బిజూ పట్నాయక్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మల్కన్గిరి జిలా అభివృద్ధిలో బీజేడీ కీలకపాత్ర పోషించిందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రియ నాయక్, సీనియర్ నాయకుడు గోపాల్ పండ, మున్సిపల్ చైర్మన్ మనోజ్ బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
40 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
జయపురం: ఎస్బీఐ సేవా కార్యక్రామల్లో భాగంగా జయపురంలోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్ర వారం నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది విద్యార్థినులకు సెకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ భువనేశ్వర్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.డి.రతన్ తేజ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజ సేవలో తనవంతు బాధ్యత లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 40 మందికి రూ. 2.32 లక్షల విలువైన సైకిళ్లను అందించామన్నారు. అలాగే మల్కన్గిరి ఆస్పత్రికి రూ. 9,71,982 విలువైన అంబులెన్స్ను అందించామన్నారు. -
కొరై మాజీ ఎమ్మెల్యే సంచిత మహంతి కన్నుమూశారు
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకురాలు, కొరై నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే సంచిత మహంతి (67) శుక్రవారం భువనేశ్వర్లో కన్ను మూశారు. ఆమె గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న దశలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో జాజ్పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. సంచిత మహంతి 2004 నుండి 2009 వరకు జాజ్పూర్ జిల్లా కొరై శాసన సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. శాసన సభ్యురాలిగా నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సంస్థాగత కార్యకలాపాల్లో చురుకై న పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. 2000 దశకం ఆరంభంలో జాజ్పూర్ జిల్లాలో బీజేపీ ఆవిర్భావం మొదలుకొని సంస్థాగత పటిష్టత వరకు నిరవధికంగా శ్రమించి రాష్ట్రంలో బీజేపీ ఉనికిని బలపరిచిన ముందంజ ప్రముఖుల్లో ఒకరుగా సంచిత మహంతి విశేష గుర్తింపు పొందారు. -
విజిలెన్స్ వలలో జూనియర్ ఇంజినీర్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి కార్యాలయ జూనియర్ ఇంజినీర్ నిహార్ రంజన్ సర్కార్ విజిలెన్స్ వలలో చిక్కారు. ఇతను అక్రమ అస్తులు కలిగి ఉన్నారని జయపూర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో జయపూర్ విజిలెన్స్ న్యాయమూర్తి ఆదేశాలతో వారెంట్ల ఆధారంగా శుక్రవారం ఉదయం నలుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఇతర సహయక సిబ్బంది నేతృత్వంలో మల్కన్గిరి, నవరంగ్పూర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్న నిహార్ రంజన్ ఆస్తులపై సోదాలు కొనసాగించారు. మల్కన్గిరి జిల్లా కేంద్రంలో జయనగర్ ప్రాంతంలో ఉన్న అతని మూడు అంతస్తుల నివాస భవనం, మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.పి.వి.10 గ్రామంలో ఉన్న పూర్వీకుల ఇల్లు, మల్కన్గిరి సమితి కార్యాలయంలో ఆయన గదిలో కూడా సోదాలు చేశారు. పలు చోట్ల ఉన్న ఇళ్ల స్థలాల పట్టాలు, రూ. నాలుగు లక్షల నగదు, నాలుగు పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. జూనియర్ ఇంజినీర్ నిహార్ రంజాన్ సర్కార్ జయపూర్ విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం కేసునమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. -
జాతీయ యువ ఉత్సవాలకు మల్కన్గిరి విద్యార్థిని
మల్కన్గిరి : జాతీయ స్థాయి యువ ఉత్సవంలో మల్కన్గిరి జిల్లా విద్యార్థిని విదిశా మహంతి పాల్గొననున్నారు. ఆమె మల్కన్గిరి మోడల్ డిగ్రీ కాలేజ్లో చదువుతోంది. ఈ నెల 24 నుంచి 26 వరుకు భువనేశ్వర్లో జరిగిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తారని కలెక్టర్ తెలిపారు. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి చిత్రాంగపల్లి పంచాయతీ ఎం.వి.55 గ్రామం వద్ద శుక్రవారం ఉదయం పగురకొండ రహదా రి పక్కన యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐఐసీ ముకుందో మేల్కా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కనే ద్విచక్ర వాహనం ఉండడంతో వాహ నం పైనుంచి పడిపోవడంతో చనిపోయి ఉంటాడని అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. మృతుడు ఎం.వి.55 గ్రామానికి చెందిన బిధా న్ మండల్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జయపురం: బంగ్లాదేశ్లో అల్ప సంఖ్య హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జయపురంలో హింధూ సమాజ్ ర్యాలీ నిర్వహించింది. సర్దార్ వల్లభాయి పటేల్ మార్గంలో(మైన్ రోడ్డు) భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ యూనస్ దిష్టి బొమ్మతో పట్టణంలో పలు వీధుల్లో బంగ్లాదేశ్ వ్యతిరేక నినాదాల తో ప్రదర్శనలు జరుపుకుంటూ రథొ పొడియా కు చేరుకొని అక్కడ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జరిగిన సభలో హిందూ సమాజ్ నవకృష్ణ రథ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. శ్రీకాకుళం : వచ్చే ఏడాది మార్చి 1 కల్లా నూత న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతు న్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడరాదన్నారు. విభాగాల వారీ గా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై దృష్టి సారించాలన్నారు. పర్యవేక్షణకు రోడ్ల భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) స్థాయి అధికారిని నియమించా లని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తదితరులున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమా దాల నివారణకు శాసీ్త్రయ దృక్పథంతో అడుగు లు వేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతు న్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మ రం చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య, ప్రాణనష్టం కొంత మేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమన్నారు. 2024లో 889 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవ డం వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నవభారత జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధంగా చేయా లని ఆదేశించారు. భైరవానిపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. జనవరిని రహదారి భద్రత మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. -
ఘనంగా..
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకుల పిలుపురాయగడ: బిజూ పట్నాయక్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన బీజేడీ నాయకులుపర్లాకిమిడి: హైస్కూల్ జంక్షన్ వద్ద బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రూపేష్రాయగడ: ర్యాలీలో మాజీ మంత్రి జగన్నాథ సరక తదితరులురాయగడ: బిజూ జనతాదళ్ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కొత్త బస్టాండు వద్ద గల బిజూ పట్నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ పాత్రో, అనసూయా మాఝి, జిల్లా పరిషత్ సభ్యులు ధబళేశ్వర్ నాయుడు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా స్థానిక బిజూ ఆడిటోరియానికి చేరుకున్నారు. పర్లాకిమిడిలో... బిజేడీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పర్లాకిమిడి: బిజూ జనతాదళ్ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పర్లాకిమిడిలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక హైస్కూల్ జంక్షన్ వద్ద దివంగత బీజేడీ నేత బిజూ పట్నాయక్ విగ్రహానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రేణులు నీలమ్మ గుడి వెనుక ఉన్న పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలువేసి ప్రసంగించారు. పార్టీ హయాంలో ఒడిశా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని, తిరిగి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేడీ జయకేతనం ఎగురవేస్తుందని గుసాని సమితి జిల్లా పరిషత్ సభ్యులు ఎస్.బాలరాజు అన్నారు. సమావేశంలో పురపాలక శాఖ చైర్మన్ నిర్మలా శెఠి, జెడ్పీఅధ్యక్షు లు గవర తిరుపతిరావు, కాశీనగర్ బ్లాక్ అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్నాయక్, యువజన అధ్యక్షులు శాసనం లింగరాజు పాల్గొన్నారు. కొరాపుట్: రాష్ట్రవ్యాప్తంగా బీజేడీ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా చందాహండిలో మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మజ్జిగూడ జంక్షన్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ నివాళులర్పించారు. కొరాపుట్ జిల్లాలో మాజీ ఎంపీ జిన్ను హిక్కా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పీతం పాడీ, రఘురాం పొడాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీ వందేళ్లు వర్ధిల్లుతుంది
● విభజన పుకార్లను తోసిపుచ్చిన నవీన్ పట్నాయక్ ● ఘనంగా బీజేడీ 29వ వ్యవస్థాపక దినోత్సవం భువనేశ్వర్: బిజూ జనతా దళ్ (బీజేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ శుక్రవారం తన పార్టీ లోని విభేదాల గురించి ఊహాగానాలను తీవ్రంగా తిరస్కరించారు. ఒడిశా ప్రజల రాజకీయ గొంతుక గా బీజేడీ 100 ఏళ్లు వర్ధిల్లుతుందని ఘంటాపథంగా ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఘోరంగా విఫలమైందని ఎండగట్టారు. స్థానిక శంఖ భవన్లో జరిగిన పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పదునైన విమర్శలను సంధించారు. బీజేపీ పాలన పగ్గాలు చేపట్టడంతో బీజేడీ నాయకత్వం, సంస్థాగత వ్యవహారాల్లో అవాంఛనీయ చొరవ కల్పించుకుని గందరగోళం రేపి ప్రజల్లో ఊహాగానాలకు ఊపిరి పోస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పట్నాయక్ మాట్లాడుతూ బీజేడీ విడిపోతుందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని పార్టీలు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ వాదనను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. బీజేడీ ఒకరు లేదా ఇద్దరు నాయకుల పార్టీ కాదు. ఇది ఒడిశా ప్రజల భావోద్వేగాలతో లోతైన అనుబంధంతో పెనవేసుకు పోయి న వ్యవస్థగా బలపడింది. బీజేడీ రాజకీయ ఉనికికి ఏమాత్రం ఢోకా లేదు. రానున్న 100 సంవత్సరాలు ఒడియా ప్రజల గొంతుగా గళం మారుమోగిస్తుంటుందన్నారు. చీలిక ప్రచారం బూటకం ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ప్రజల పార్టీగా ఉనికిని స్థిరపరచుకున్న బీజేడీలో చీలిక వచ్చే అవకాశం లేదని, బీజేడీ విచ్ఛిన్నం కాలేదని, భవిష్యత్తులో విచ్ఛిన్నం కాబోదని కూడా గట్టి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలం దాని సైద్ధాంతిక మూలాలు, బిజూ పట్నాయక్ వారసత్వం ద్వారా ఏర్పడిన ప్రజా సంబంధాలలో ఉందని ఆయన నొక్కి చెప్పా రు. బిజూ బాబు ఆదర్శాలపై బీజేడీ నిలుస్తుందని, ఆయన మార్గదర్శకంలో ఒడిశా ప్రజలకు నిరంత రం సేవ చేస్తూనే ఉంటుంన్నారు. పార్టీ కార్యకర్తలు సంస్థాగత క్రమశిక్షణ, ప్రజా సేవపై దృష్టి పెట్టాలని కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై దాడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై పదునైన దాడి చేయడానికి పట్నాయక్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి వాదనలను నిలదీసి పాలన వైఫల్యాలుగా ఆయన అభివర్ణించా రు. రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. కాానీ అభివృద్ధి ఎక్కడ ఉంది?‘ అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఎరువులు పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. మండీలు సకాలంలో తెరవక పోవడంతో తల్లడిల్లుతున్నారు. మిషన్ శక్తి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో యువత నిరాశకు గురవుతున్నారని ఆయన పే ర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజా రి మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపించారు. బీజేడీ హయాం స్వర్ణ యుగం 2000 నుంచి 2024 వరకు సుదీర్ఘంగా సుమారు రెండున్నర దశాబ్దాల బీజేడీ పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం. పేదరికాన్ని విజయవంతంగా ఎదుర్కొని మహిళలను శక్తివంతం చేసింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఒడిశాకు కొత్త గుర్తింపును సాధించింది. బలమైన మరియు సాధికార ఒడిశానిర్మాణంలో బీజేడీ కార్యకర్తలు ప్రస్తుత సవాళ్లను భవిష్యత్తు అవకాశాలుగా మలుచుకుని పార్టీ దీర్ఘకాల వ్యవస్థగా బలపరచాలని పిలుపునిచ్చారు. -
గవర్నర్ను కలిసిన విద్యాశాఖ మంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ శుక్రవారం లోక్ భవన్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రస్తుతస్థితి, సంబంధిత కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వైస్ చాన్స్లర్ నియామక ప్రక్రియ గురించి మంత్రి గవర్నర్కు వివరించారు. పారదర్శకత, యోగ్యత, నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణ, పాలనను బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, సంస్థాగత పనితీరు దక్షత పెంపు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో బోధన, అభ్యాస నాణ్యత సంస్కరణల గురించి మంత్రి గవర్నర్కు వివరించారు. దీనితో పాటు క్రీడలలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను చర్చించారు. -
తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
జయపురం: జనవరి నెలలోగా జిల్లాలో ఏర్పాటు చేసి మండీలలో పడి ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి రబినారాయణ నందో జిల్లా సివిల్ సప్లై అధికారిని హెచ్చరించారు. గతంలో ముందుగా తెలిపిన ప్రకారం శుక్రవారం రబినందో నేతృత్వంలో వందలాది మంది బీజేడీ కార్యక్తలు, రైతులు జిల్లా సివిల్ సప్లై అధికారి కార్యాయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులు కార్యాయంలోనికి రాకుండా కార్యాలయ ప్రధాన గేటు మూసి వేయటంతో కార్యాలయం ముందు వారంతా ధర్నా జరిపారు. కొంతసేపటి తరువాత నారాయణ నందో జిల్లాలో మండీల నిర్వహణలో అధికారుల నిర్లిప్తతపై మండి పడ్డారు. జిల్లాలో గత 11 వ తేదీన మండీలు ప్రారంభించినప్పటికీ నేటి వరకు ఒక్క కిలో ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటికై నా మండిల్లోని ధన్యాన్ని తక్షణమే ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీజేడీ నేతలు బాలారాయ్, బి.బాలంకి రావు,నారాయణ దొర,మున రథో పాల్గొన్నారు. -
బండారి సంఘం నూతన కార్యవర్గం
జయపురం: జయపురం బండారి (మంగళ్లు) సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం జరిగా యి. స్థానిక ఏనుగుల శాల ప్రాంతంలోని బండారి సంఘ కార్యాలయంలో సంఘ సలహాదారులు, న్యాయవాది బిజయరాయ్ జనాదేవ్, నిర్భీక సామంతరాయ్, సుమిత్ పట్నాయక్ల పర్యవేక్షణ లో ఎన్నిక ప్రక్రియ జరిగింది. అధ్యక్షులుగా ఎ.పోలిరాజు, ఉపాధ్యక్షులుగా కె.సంతోష్, కార్యదర్శిగా టి.మహేష్, సహాయ కార్యదర్శిగా ఎ.సత్యనారాయణ, కోశాధికారిగా వై.ప్రవీణ్, సహాయ కోశాధికారిగా లాలు బెహర, న్యాయ సలహాదారునిగా న్యాయవాది బిజయ రాజ్ జెనాదేవ్, నిర్బీక సామంతరాయ్, సుమిత్ పట్నాయక్ ఎన్నికయ్యారు. నూత న కార్యవర్గంతో న్యాయ సలహాదారు బిజయరాజ్ జనాదేవ్ ప్రతిజ్ఞ చేయించారు. నూతన కార్యవర్గ సభ్యులను బండారి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు పూలమాలలతో సత్కరించారు. -
ఫారెస్టర్ ఆస్తులు లక్ష్యంగా విజిలెన్స్ దాడులు
కొరాపుట్: ఫారెస్టర్ ఆస్తులు లక్ష్యంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నా యి. శుక్రవారం కొరాపుట్ జిల్లా ఫారె స్ట్ డివిజన్ ఫారెస్టర్ నిరంజన్ సత్పతి ఆస్తులు లక్ష్యంగా ఈ దాడులు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. కొరాపుట్ జిల్లా సిమిలిగుడలో కార్యాల యం, కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వార్టర్స్, జగత్సింగ్పూర్ లోని తల్లిదండ్రుల నివాసం, భువనేశ్వర్లోని మూడంతస్తుల సొంత భవనం, అదే ప్రాంతంలో మరో సొంత భవనంలో ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భువనేశ్వర్ లో ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి ఈ దాడులకు సెర్చ్ వారెంట్ల్ అనుమతి ఇచ్చారు. -
పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్ ప్రదానం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ పెక్కట గ్రామానికి చెందిన జోత్స్న శోబోరో (17) అనే వెయిట్లిఫ్టర్ శుక్రవారం న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అందుకుంది. ఆమెతో పాటు మరో 20 మంది కూడా రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర మహిళా, శిశు వికాస్ మంత్రి సావిత్రీ ఠాకుర్, రాష్ట్ర మహిళా,శిశువికాస్ మంత్రి అన్నపూర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారిణికి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథ సాహు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదతరులు అభినందనలు తెలిపారు. -
ిపిప్పిలిలో బాంబు దాడి
భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కొణాస్ కొలాపొదొర్ గ్రామంలో భూ వివాదం కారణంగా బాంబు దాడి జరిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.హిందువులకు సంఘీభావంగా ర్యాలీ కొరాపుట్: బంగ్లాదేశ్లో హిందువులకు సంఘీభావంగా ర్యాలీ జరిగింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా బందుగాం సమితి అలమండ గ్రామంలో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ దేశంలో హిందువులపై దాడులు అరికట్టాలని నినదించారు. అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులతో అలమండ గ్రామ వీధులు, మైయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఒడిశాలో ప్రధాన ఎన్నికల కమిషనర్● నేటి నుంచి 3 రోజుల పర్యటనభువనేశ్వర్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధికారిక రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. శనివారం నుంచి వరుసగా 3 రోజుల పాటు నిరవధికంగా పర్యటించి బూత్ స్థాయి అధికారులతో సమావేశం కానున్నారు. ఈ నెల 27 తొలి రోజు పర్యటనలో భాగంగా సీఈసీ పూరీ సందర్శించి శ్రీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమం పూర్తి కావడంతో కోణార్క్ సూర్య దేవాలయం సందర్శిస్తారు. మరుసటి రోజున (డిసెంబర్ 28) ఆయన వారసత్వ గ్రామం రఘురాజ్పూర్, ధౌలి శాంతి స్థూపం, ఖండగిరి, ఉదయగిరి గుహలు, ముక్తేశ్వర్ ఆలయం సందర్శిస్తారు. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం (ఓయూఏటీ) ఆడిటోరియంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు)తో కీలక సమావేశానికి అధ్యక్షత వహించి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్శన రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంకేతంగా పలు వర్గాలు భావిస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నవీకరణ చురుగ్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎల్ఓలతో సీఈసీ ప్రత్యక్షంగా సమావేశం కావడం ఓటర్ల జాబితా నవీకరణ క్షేత్రస్థాయి కార్యకలాపాల ప్రేరణకు సూచనగా తెలుస్తోంది. పర్లాకిమిడి: పురపాలక సంఘం పరిధిలోని ఆరో నంబర్ వార్డు సేరి రెల్లివీధిలో కాయగూరలు అమ్మే బొమ్మాళి బోడెమ్మ కూతురు ఎస్.సరస్వతి ఇల్లు శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపారు. ప్రమాదంలో ఆమె ఇంటిలో దాచుకున్న రూ. 3 లక్షల నగదు, ఇంటి పట్టా పత్రాలు, దుస్తులు కాలిపోయాయని తెలియజేసింది. సరస్వతీ ఇంటికి తగిలి విద్యుత్ శాఖ సర్వీసు వైరు సరఫరా అవుతోంది. ఎన్నో సార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదుచేసినా సంబంధిత శాఖ ఇంజినీర్లు తగు చర్యలు చేపట్టలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అగ్నిమాపక దళం ఫైర్ ఆఫీసర్ ధీరేంద్ర కుమార్ దాస్, రబీంద్ర బెహారా వెంటనే విచ్చేసి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సేరిరెల్లి వీధికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమెకు ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయానికి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ హామీ ఇచ్చారు. -
ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ పట్టణంలో జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ యూత్ లీడర్షిప్ క్యాంపును శ్రీరాం డిగ్రీ కళాశాలలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే శిబిరానికి సబ్ కలెక్టర్ అనుప్పండా, బరంపురం విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ అధికారి జవహార్ లాల్ చౌదురి, కిరణ్కుమార్, కె.సి.పండా కాశీనగర్ ఎన్ఏసీ చైర్మన్ మేడిబోయిన సుధారాణి పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు సామాజిక దృక్పథం, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు కలిగి వుండాలని జిల్లా కలెక్టర్ మునీంద్ర హానగ అన్నారు. శుక్రవారం రెండవ రోజు శిబిరంలో దేహదారుఢ్య శిక్షణాధికారి ఆర్.సి.హెచ్.బెహరా, ఎన్.బి.ఖుంటియా విద్యార్థులకు శారీరిక దృఢత్వం కోరకు అనేక క్లాసులు నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత బనపల్లి పర్యవేక్షించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్’ (ఎన్కార్డ్) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేస్తున్నామని, నవంబర్లో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి విక్రేతలపైనే కాకుండా, పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజారాణి పుండ్కర్ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. అరుదైన జంతువుల చర్మం, గోళ్లు, కొమ్ముల అక్రమ రవాణా జరిగితే సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి, వివిధ అధికారులు పాల్గొన్నారు. రైలు ఢీకొని మహిళ మృతి ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని పట్ట ణానికి చెందిన పొందూరు పార్వతి(55) అనే మహిళ మృతిచెందింది. రైల్వే స్టేషన్ సమీపంలో చిదంబరేశ్వర ఆలయం వద్ద పట్టాలు దాటుతుండగా బరంపురం నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈమె బంగ్లారోడ్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిపారు. -
బీజేపీ పాలనలో చేసింది శూన్యం
● రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరకరాయగడ: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర బీజేపీ పాలనలొ ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర మాజీమంత్రి, బీజేడీపార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక విమర్శించారు. ఆ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలొ శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇదే చివరి అవకాశమన్నారు. ప్రజలు మరెప్పుడూ వారిని సమర్ధించరని వ్యాఖ్యానించారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యకర్తలు ఎటువంటి అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేడీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడాదిన్నర పాలన గురించి ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్కు ఇప్పటికీ ప్రజల ఆదరణ ఉందని స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎస్డీసీ) మాజీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు అనసూయ మాఝి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న నవీన్ పట్నాయక్ ద్వారా ఆవిర్భావమైన బీజేడీ భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యకర్తలు సహనం కోల్పోకుండా వ్యవహరించి రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని హితవు పలికారు. బీజేడీ సీనియర్ నాయకుడు జగదీష్ పాత్రో, కిశోర్ పండ, ఽజిల్లా పరిషత్ సభ్యులు ధవలేశ్వర్ నాయుడు ప్రసంగించారు. -
స్వయం ఉపాధికి సహకరించాలి
జయపురం: స్వయం ఉపాధి పథకాలకు సహకార సంస్థలు సహకరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సభాగృహంలో ఇంటర్ నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్–2025 ప్రారంభం ఉత్సవం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా సహకార విభాగం ద్వారా, సహకార విభాగ అధికారి మోనిక రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఆర్ఎంఎ గుజరాత్ విశ్రాంత ప్రొఫెసర్ హరేకృష్ణ మిశ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్ నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 లక్ష్యం సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమానత్వం ద్వారా సహకార ఉద్యమం మంచి ప్రపంచ నిర్మాణం అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్రపాణిగ్రహి, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, తదితరులను ఆహ్వానించక పోవటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం
శ్రీకాకుళం : మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మనుస్మృతి దహనం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో గురువారం దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె.ధర్మారావు, డి.గణేష్ అధ్యక్షతన ‘సనాతన సంస్కృతి –ప్రజాస్వామ్యం‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది జహా ఆరా మాట్లాడుతూ దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక పాలకుల వ్యవస్థలో బతుకుతున్నామని.. మను సంస్కృతి రాజ్యమేలుతున్న పాలనలో ఉన్నామని చెప్పారు. చరిత్రను మతకోణంలో చూడడం సరికాదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగకపోతే రాజకీయ న్యాయం, అధికారం రాదని అంబేడ్కర్ పేర్కొన్నారని, దళిత, మైనారిటీ, పీడిత ప్రజలు మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు మిస్క కృష్ణయ్య, సన్నశెట్టి రాజశేఖర్, పేడాడ కృష్ణారావు, గొంటి గిరిధర్, కల్లేపల్లి రామ్గోపాల్, బోనెల రమేష్, పి.మోహన్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు బి.అప్పారావు, బి.వి.రమణ, నేతల అప్పారావు, దమయంతి, చిన్నికృష్ణ, యడ్ల జానకిరావు, గరికివాడు, బెలమర ప్రభాకర్, రాయి సూర్యనారాయణ, కుర్మారావు, శ్రీనివాస్, యడ్ల గోపి, రాజేశ్వరి, గోవింద్, తేజ, కళావతమ్మ, బడే కామరాజు, అనంతరావు, గణపతి, రాముడు, మహేంద్ర, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐలకు మహర్దశ
భువనేశ్వర్: రాష్ట్రంలో సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిష్టాత్మకమైన ఉత్కర్ష్ ఐటీఐ యోజనను ఆమోదించింది. దీని కింద ఎంపిక చేసిన పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐ) జోనల్ ఉత్కర్ష్ ఐటీఐలుగా అభివృద్ధి చేస్తారు. ఈ పథకం కింద 5 ప్రభుత్వ ఐటీఐలు.. పూరీ, బొలంగీర్, అంబగూడ, రాజకనిక (కేంద్రాపడా), రౌర్కెలా (సుందర్గడ్) ఆధునిక సౌకర్యాలు, అధునాతన శిక్షణ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. ఉత్కర్ష్ ఐటీఐల ప్రాముఖ్యత ఈ ఐటీఐల్లో ఆధునిక ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ అభ్యాసన ప్రాంగణాలు పునరుద్ధరించబడిన మౌలిక సదుపాయాలతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. అధునాతన శిక్షణ, అధ్యాపక అభివృద్ధి, మూల్యాంకనాలు, ఆవిష్కరణలకు జోనల్ హబ్లుగా పనిచేస్తాయి. స్వయం ఉపాధి, ఉద్యోగ నియామకాలకు మద్దతు ఇచ్చే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్, ప్లేస్మెంట్ సెల్లను మెరుగుపరుస్తాయి. ప్రాంతీయ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా శిక్షణార్థులకు సులభమైన ప్రవేశంతో కీలకమైన పారిశ్రామిక, విద్యా కేంద్రాల వ్యూహాత్మక అనుసంధానం చురుగ్గా పని చేస్తుంది. పేదలకు దుప్పట్ల పంపిణీ రాయగడ: తన కుమారుడి పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లాలోని కల్యాణ సింగుపూర్ లంబత వీధిలో నివసిస్తున్న చిన్మయ లంబట దంపతులు పేదలకు దుప్పట్లను గురువారం పంపిణీ చేశారు. గ్రామంలోని 100 మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది శీతాకాలం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పేకాట శిబిరంపై దాడి గార: శ్రీకూర్మం పంచాయతీ చింతువలస సమీప పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ సీహెచ్.గంగరాజు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన వీరి నుంచి రూ.7,320 నగదు, ఆరు సెల్ఫోన్లు, బైక్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బహిరంగంగా మద్యం తాగడం, పేకాట ఆడటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్య లు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కొరాపుట్: క్రిస్మస్ వేడుకలు గురువారం కొరాపుట్,నబరంగ్పూర్ జిల్లాల్లో ఘనంగా జరిగాయి. శతాబ్దం పైగా చరిత్ర ఉన్న జయపూర్ యువలాంజికల్ లూధరన్ చర్చి (జేఈఎల్సీ) నేతృత్వంలో పలు చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. నబరంగ్పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్రలు తెంతులకుంటి చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని జేయిఎల్సీ ప్రాంగణంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి పాల్గొన్నారు. బీజేడీ కౌన్సిలర్ నాగేంద్ర పట్నయక్తో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: క్రీస్తు జననం, క్రిస్మస్ పండగ సందర్భంగా పట్టణంలో కాలేజ్ రోడ్డులో ఉన్న పురుషోత్తం బాప్టిస్టు చర్చిలో పాస్టర్ ప్రమోద్ కుమార్ నాయక్, డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం సువార్తను, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న రోమన్ కాథలిక్ చర్చిలో ఫాదర్ అజిత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, సువార్తను వినిపించారు. జిల్లాలో గుమ్మ, కాశీనగర్, ఆర్. ఉదయగిరి, మోహానా, రామగిరి, బడపద చర్చిల్లో క్రిష్టియన్ సోదరులకు సువార్తను అందించారు. -
వాజ్పేయి పాలనా కాలం స్వర్ణయుగం
భువనేశ్వర్: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పదవీకాలం భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, సుపరిపాలన రంగాలలో ఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి గురువారం అన్నారు. దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని స్థానిక లోక్ భవన్ ప్రాంగణం అభిషేక్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గవర్నరు కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, లోక్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ బంగారు చతుర్భుజ పథకం, జాతీయ రహదారుల విస్తరణ, దేశ వ్యాప్తంగా నాలుగు వరుసల రహదారుల నిర్మాణం వంటి చారిత్రాత్మక కార్యక్రమాలతో వాజ్పేయి పేరు విడదీయరాని విధంగా ముడిపడిందన్నారు. ఈ కార్యక్రమాలు అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో వాజ్పేయి దార్శనికత ప్రతిబింబిస్తుంది. గ్రామీణ అభివృద్ధికి వాజ్పేయి చేసిన కృషి అనిర్వచనీయమని డాక్టర్ కంభంపాటి అన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్వై) గ్రామాలకు నిరంతరం అనుకూలమైన రహదారి అనుసంధానాన్ని కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో, మారుమూల ప్రాంతాల ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నదుల అనుసంధాన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక వ్యూహకర్తగా అటల్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్లో ఈయనకు సభ్యత్వం కల్పించిన సదవకాశాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డాక్టర్ కంభంపాటి, వాజ్పేయిని ఒక దార్శనిక రాజనీతిజ్ఞుడిగా, గొప్ప వక్తగా మరియు పార్టీలకు అతీతంగా గౌరవాన్ని పొందిన నాయకుడిగా అభివర్ణించారు. మాజీ ప్రధాని సమ్మిళిత అభివృద్ధి, సుపరిపాలన యొక్క శాశ్వత వారసత్వాన్ని వదిలి వెళ్లారు. అది దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉందని ఆయన అన్నారు. -
భువనేశ్వర్–కటక్–పూరీ–పారాదీప్ ఆర్థిక ప్రాంత ప్రణాళికకు ఆమోదం
భువనేశ్వర్: భువనేశ్వర్, కటక్, పూరీ, పారాదీప్లను కలుపుకొని కొత్త ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన లోక్ సేవా భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెరుగైన అనుసంధానం, మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంతంలోని నగరాలను వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. ఆర్థిక ప్రాంతంలో భాగంగా మొత్తం 645 కిలోమీటర్ల పొడవునా 3 రింగ్ రోడ్లు నిర్మిస్తారు. క్యాపిటల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కింద టంగి, సప్తసజ్య, రామేశ్వర్ మీదుగా పారాదీప్ను పూరీకి అనుసంధానిస్తూ 432 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. కటక్ జిల్లాలో జతొముండియా, త్రిసులియా మరియు ఉరాలి మీదుగా బలిపట్న, పిప్పిలి, జట్నీ, ఖుర్ధా వరకు విస్తరించి 148 కిలోమీటర్ల వెలుపలి రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తారు. అదనంగా ఖుర్ధా జిల్లాలో 65 కిలో మీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం పరిశీలిస్తున్నారు. ఇది టొమాండో, చందక, పొహలా, ధౌలికి కలుపుతుంది. కొత్త రైలు అనుసంధాన ప్రణాళిక ఈ ప్రాజెక్టులో రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఉంది. పూరీ, కోణార్క్ మధ్య 32 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రతిపాదించారు. మరో 70 కిలోమీటర్ల రైల్వే లైన్ నిమాపడా గుండా కోణార్క్ నుంచి భువనేశ్వర్ వరకు కలుపుతుంది. పరిశ్రమ మరియు పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఈ ఆర్థిక ప్రాంతం ఏర్పడటం వల్ల అనుసంధానిత ప్రాంతాలలో పారిశ్రామిక, పర్యాటక రంగాలలో గణనీయమైన వృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమర్థవంతమైన అమలును నిర్ధారించడానికి అవసరమైన చోట కొత్త విధానాలను రూపొందించాలని మరియు కొనసాగుతున్న విధానాలను సవరించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వివిధ విభాగాలను ఆదేశించారు. -
అటల్జీ ఆదర్శాలు ప్రేరణాత్మకం
భువనేశ్వర్: భారత మాజీ ప్రధాన మంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి కృషిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ వాస్తవ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసి, దేశానికి భద్రత, అభివృద్ధి, ఆత్మ గౌరవం యొక్క కొత్త కోణాన్ని జాతికి ప్రదానం చేసిన అటల్జీ ఆదర్శాలు నిరంతరం ప్రేరణాత్మకంగా వెలుగొందుతాయన్నారు. పవిత్ర జయంతి సందర్భంగా, మనం ఆయన జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ దేశం మరియు ఒడిశా యొక్క సర్వతోముఖాభివృద్ధికి అటల్జీ ఆదర్శ మార్గాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అటల్ బిహారీ వాజ్పేయి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ -
స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు వెళ్లి..
● రైలు చక్రాల కింద పడి యువకుడు మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియ సమితి క్రిస్టియన్ వీధికి చెందిన వాంతల విజయ్ రత్నం (23)అనే యువకుడు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు కిరణ్ను రైలు ఎక్కించేందుకు స్టేషన్కు వచ్చాడు. అతడిని రైలెక్కించి రైలు దిగబోతూ కాలుజారి రైలు కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయానికి మృతదేహాన్ని పొడియాకు తీసుకువచ్చారు. పండగకు రాలేనని చెప్పిన యువకుడు శవమై వచ్చాడని కుటుంబ సభ్యులు రోదించారు. -
శ్రామిక్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర
భువనేశ్వర్: ఖుర్దారోడ్ మండలం రైల్వే సిబ్బంది దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు కార్యకర్తలు పాద యాత్ర నిర్వహించారు. ఓపెన్ లైన్ శాఖ కార్యదర్శి లక్ష్మీ ధర మహంతి ఆధ్వర్యంలో పూరీ సెక్షన్ మొటోరి రైల్వే స్టేషన్ నుంచి మాలతీతిపట్పూర్ స్టేషన్ వరకు నిరవధికంగా పాద యాత్ర నిర్వహించారు. ఈ శాంతియుత ఆందోళనలో పలువురు కార్యకర్తలు పాలుపంచుకున్నారు. దిగువ స్థాయిలో సిబ్బంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార వర్గం పెడ చెవి వైఖరి ప్రదర్శించడంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు కార్యకర్తలు తెలిపారు. స్టేషను సిబ్బందికి మరుగు దొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కొరవడ్డాయి. మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేందుకు అనువైన సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. సిబ్బంది క్వార్టర్లకు సురక్షిత తాగునీరు సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు అందక పూరీ సెక్షన్లో సిబ్బంది సతమతం అవుతున్నారు. ఈ విషయమై అధికార వర్గం, కార్మిక వర్గం మధ్య 2024 సంవత్సరంలో జరిగిన కీలక పీఎన్ఎం తీర్మానాల అమలు పట్ల అనుబంధ అధికార వర్గాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఎంతమాత్రం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
జ్ఞానం మానవాళి సేవకు ఉపయోగపడాలి: గవర్నర్
భువనేశ్వర్: గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యంతో మానవాళికి సేవకు దోహదపడే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి జ్ఞానాన్ని ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. గంజాం జిల్లా బరంపురం నిస్ట్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గ్రాడ్యుయేట్లు శ్రేష్టత, సమగ్రతకు రాయబారులుగా సముపార్జించిన విద్యతో అనుసంధానించబడి ఉండాలని, సమాజానికి అర్థవంతంగా సహకరించాలని ఆయన కోరారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ సుస్థిరత, ప్రజారోగ్యం, సైబర్ భద్రత నుంచి సమతుల్య వృద్ధి వరకు ప్రస్తుత యుగం ఎదుర్కొంటున్న సవాళ్లను కరుణాత్మక సామర్థ్యం మేళవింపు నైపుణ్యత రంగరించుకోవాలని ఆకాంక్షించారు. నిజమైన నాయకత్వం వ్యక్తిగత సాధన ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో ఎవరికి వారుగా సృష్టించే సానుకూల, శాశ్వత ప్రభావం ద్వారా నిర్వచిస్తారని తెలిపారు. విజయాన్ని డిగ్రీల ద్వారా మాత్రమే కాకుండా విమర్శనాత్మక ఆలోచన, నైతిక వ్యవహారం, నిరంతర సామర్థ్యం ప్రామాణికలుగా నిలుస్తాయన్నారు. విద్య జీవిత కాలపు అభ్యాసం అంకురార్పణగా పరిగణించాలని విద్యార్థులకు గవర్నర్ ప్రబోధించారు. అధ్యక్షుడు డాక్టర్ సుకాంత్ కుమార్ మహా పాత్రో నేతృత్వంలో జాతీయ విద్యా విధానం 2020తో నిస్ట్ విశ్వవిద్యాలయం యొక్క సమన్వయాన్ని గవర్నర్ ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రసంగించిన ఇతర ప్రముఖుల్లో న్యూఢిల్లీ ఏఐసీటీఈ వైస్ చైర్మన్ అభయ్ జెరె, నిస్ట్ విశ్వ విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ సుకాంత్ కుమార్ మహా పాత్రో, వైస్ చాన్స్లర్ డాక్టర్ ప్రియదర్శన్ పాత్రో ఉన్నారు. -
ఘనంగా సుపరిపాలన దినోత్సవం
భువనేశ్వర్: మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఒడిశా సాహిత్య అకాడమీ, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం సంయుక్తంగా గురువారం శతదళ శీర్షికతో రాష్ట్ర స్థాయి కవితా పఠన కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక సంస్కృతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మందికి పైగా కవులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి రాజనీతిజ్ఞత, ఆదర్శాలు, సాహిత్య వారసత్వాన్ని స్మరించుకుంటూ కవితా నివాళులర్పించారు. రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి అంకితభావానికి సజీవ స్వరూపమన్నారు. సాహిత్య స్పృహ తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆనందాన్ని పంచుతోందన్నారు. ఒడిశాలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు అటల్ బిహారీ వాజ్పేయికి అంకితమిస్తూ కవితలు పఠించారు. ఒడిశా సాహిత్య అకాడమీ కవులను సత్కరించింది. ప్రముఖ సాహితీవేత్త హరప్రసాద్ దాస్, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం కార్యదర్శి డాక్టర్ బిజయ్ కేతన్ ఉపాధ్యాయ, ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హోతా తదితర ప్రముఖులు కవితా పఠన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం సుపరిపాలన దినోత్సవాన్ని స్థానిక మహిళా కళాశాలలో గురువారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, ఏడీఎం నిహారి రంజన్ కుహోరో, విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, న్యాయవాది భ్రజసుందర్ నాయక్, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్లు పాల్గొన్నారు. దేశంలో స్వల్పకాలం పాటు ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికీ వాజ్పేయి అవిశ్రాంత కృషి చేసారని వక్తలు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రహదారి, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఏడీఎం నిహారి రంజన్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ భారతీ చౌదరి, ప్రొఫెసర్ శాంతిలత మిశ్రా పాల్గొన్నారు. -
జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్ల వితరణ
కొరాపుట్: శబరి శ్రీ క్షేత్ర జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్లని భక్తుడు వితరణగా ఇచ్చారు. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి శ్రీ క్షేత్ర కార్యదర్శి భవానీ ఆచార్య ప్రకటించారు. బ్రహ్మపురకు చెందిన జగన్నాథ భక్తుడు సిమ్మాంచల్ మహాపాత్రో రు.50 లక్షల వ్యయం గల ఈ ఆభరణం విరాళంగా క్షేత్రానికి అందించారు. క్యాలెండర్ ఆవిష్కరణ జయపురం: స్థానిక జగన్నాథ మందిరంలో అవిభక్త కొరాపుట్ జిల్లా బ్రాహ్మణ సమాజ్ సభ్యులు 2026 సంవత్సరం క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ సభ్యులు రమేష్ చంద్ర త్రిపాఠీ, శరత్ చంద్ర ఖడగరాయ్, నవకృష్ణ రథ్, బుణు, స్వాధీన సాహు, బాలాజీ సాహు, బిజయ కుమార్ భట్, రాజకిశోర్ దాస్, భవానీ ఆచార్య, అమరేంద్ర ఖర్, మను, సన చౌదరి, తేజస్వి చౌదరి, గోవింద సాహు మొదలగు తదితరులు పాల్గొన్నారు. జయపురంలో ఫిల్మ్ ఫెస్టివల్ జయపురం: పట్టణంలో జనవరిలో జరగనున్న పుష్పుణి మహోత్సవాల్లో భాగంగా స్థానిక కరసుధా సినిమా థియేటర్లో పుషిపుణి ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా తక్కువ నిడివి కలిగిన 9 చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖ నాట్యకారుడు గోవింద చంద్ర సాహు, అవిభక్త కొరాపుట్లో మొదటిగా సినిమా ప్రొడక్షన్ చేసిన కళాకారుడు సుకాంత అధికారి, గౌరవ అతిథిగా కొరాపుటియ ఫిల్మ్ డవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర పాత్రో, కార్యదర్శి అమర మిశ్ర, కళాకారుడు రబి పాత్రో, సంగీత కళాకారుడు జి.మహేష్, కొరాపుటియ కళా, కళాకార సంస్థ అధ్యక్షుడు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధీరేన్ మోహన్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీఏ వార్షిక క్రీడోత్సవం ప్రారంభం
భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ వార్షిక క్రీడోత్సవం గురువారం ఆరంభమైంది. భువనేశ్వర్ (కేంద్ర) నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత నారాయణ జెనా, మధుసూదన నగర్ వార్డు కార్పొరేటరు ఓలీ ఓలీ అతిథులుగా పాల్గొని ఈ ఉత్సవం ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు సమితి సభ్యులకు ఈ పోటీలు నిరవధికంగా కొనసాగుతాయని సంస్థ కార్యదర్శి రాయప్రోలు సత్య సాయి తెలిపారు. నిత్యం సాయంత్రం 5.30 గంటల నుంచి సమితి ప్రాంగణంలో పలు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమితి వార్షిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలు, పురుషులకు వేర్వేరు వర్గాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు గన్నవరపు ఆనందరావు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా ఏక్ మినిట్ గీతాలాపన, చైనీస్ చక్కర్, మ్యూజికల్ బాల్, పురుషులకు హిట్టింగ్ ద బాల్ బ్లైండ్ ఫోల్డు, మ్యూజికల్ చైర్ పోటీలు, ఉభయ మహిళలు, పురుషులకు కేరమ్ బోర్డు పోటీలు కొనసాగుతాయన్నారు. మహిళా సభ్యుల క్రీడానందం -
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
టెక్కలి: మండల విద్యా శాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ (మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం టెక్కలిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.ఉపేంద్ర, ఆర్థిక కార్యదర్శిగా బి.రామ్ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి.శశిరేఖదేవి, సహాయ కార్యదర్శిగా ఆర్.సంతోష్కుమార్, గౌరవ సలహాదారుడిగా ఎస్.గౌరీశంకర్, డి.సిహెచ్.రాంబాబు, సభ్యులుగా జి.చంద్రశేఖర్, వై.లింగరాజు, ఎస్.కళ్యాణి, పి.విజయ్ తదితరులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని నినాదాలు చేశారు. బావిలో వృద్ధురాలి మృతదేహం మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఓ బావిలో వృద్ధురాలి మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి కొల్లి మాణిక్యం (67)గా గుర్తించారు. మాణిక్యం భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కుమార్తెను పెంచి పెళ్లి చేసింది. అనంతరం మతిస్థిమితం సరిగ్గా లేక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో మాణిక్యం మృతదేహాన్ని అక్క కొడుకు నక్కల కిరణ్ గురువారం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావికి స్నానానికి వెళ్లి పొరపాటున పడిపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పొందూరులో.. పొందూరు: స్థానిక నాగవంశం వీధికి చెందిన నల్లి సురేష్(40) పొందూరులోని బండార్లమ్మ చెట్టు సమీపంలోని బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ఈ నెల 22న తెల్లవారుజామున నిద్ర లేచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో గాని గురువారం స్థానిక బావిలో సురేష్ మృతదేహం తేలింది. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, మద్యం ఎక్కువగా తాగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.చెప్పారు. ప్రొసీడింగ్ పత్రాలు అందజేత శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాది చౌదరి లక్ష్మణరావు కుటుంబానికి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ద్వారా మంజూరైన వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ ప్రొసీడింగ్ పత్రాలను అతని భార్య స్వాతికి గురువారం అందజేశారు. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.9 లక్షలు విడుదలైనట్లు వారు తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ను రూ.4లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచిన తర్వాత ఇదే మొదటి క్లెయిమని, నామిని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుందని, ప్రభుత్వం నుంచి కూడా కొంత నగదు రానుందని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగి శివప్రసాద్, పెట్ట దామోదర్రావు, మాజీ అధ్యక్షుడు ఎన్.సూర్యారావు, బాలకృష్ణ చాంద్, మామిడి క్రాంతి, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగురు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి బి.ఎస్.చలం, చిన్నాల జయకుమార్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌలభ్యం కోసం ఆర్అండ్బీ శాఖ ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి దిక్సూచీ బోర్డులు దయనీయంగా మారాయి. కవిటి నుంచి ఈదుపురం వెళ్లే రోడ్డులో కేశుపురం జంక్షన్ మూడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన బోర్డు మూడు రోజుల క్రితం కిందకు జారిపడటంతో దిక్కులు తారుమారయ్యాయి. కొత్తగా వచ్చే ప్రయాణికులు తికమకపడుతున్నారు. అధికారులు స్పందించి బోర్డును సరిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్ -
రాష్ట్రంపై పొగమంచు
భువనేశ్వర్: తీవ్రమైన చలి కారణంగా రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముతుంది. పొగ మంచు దుప్పటి లోగిలిలో నింగి నేల ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో సైతం పొగ మంచు ప్రభావంతో ప్రజా జీవనం కదలిక మందగించింది. పూరీ, సుందర్గఢ్, కంధమల్, కలహండి, కొరాపుట్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలముకుంది. ఆయా ప్రాంతాల్లో దృశ్యమాన్యత దిగజారింది. గురువారం ఉదయం తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యత బాగా తగ్గడంతో జాతీయ రహదారులు, ఇతర బాటల్లో ద్విచక్ర వాహనాలు, బస్సులు వంటి భారీ మోటారు వాహనాల కదలిక నెమ్మదిగా కొనసాగుతుది. కొన్ని ప్రాంతాల్లో దృశ్యమాన్యత దూరం దాదాపు 50 మీటర్లకు తగ్గినట్లు సమాచారం. పొగ మంచు మాటున పతిత పావన పతాకం పూరీ ప్రాంతంలో అల్లంత దూరం నుంచి శ్రీ మందిరం శిఖరాన రాత్రింబవళ్లు రెపరెపలాడుతు తారసపడే పతిత పావన పతాకం దట్టమైన పొగమంచు మాటున కనుమరుగైంది. పర్యాటకులు, సందర్శకులు, యాత్రికులు గిలి కొడుతున్న చలిలో ప్రత్యేక అనుభూతి ఆస్వాదిస్తున్నారు. సుందర్గఢ్, కంధమల్, కలహండి మరియు కొరాపుట్ వంటి గిరిజన ప్రాబల్య జిల్లాల్లో పొగమంచు చాటున ప్రధాన మరియు అంతర్గత రహదారులపై సాధారణ రవాణా బిక్కు బిక్కుమని కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ అధికారుల సమాచారం ప్రకారం తక్షణ ఉపశమనం లభించే అవకాశం లేదు. రాష్ట్రం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతల్లో వచ్చే వారం వరకు పెద్దగా మారవు. ముఖ్యంగా లోతట్టు మరియు అటవీ ప్రాంతాలలో ప్రస్తుత ఒణికించే చలి రాత్రులు మరియు పొగమంచు ఉదయం నిరవధికంగా కొనసాగే అవకాశం ఉంది. -
● ముస్తాబైన చర్చిలు
చర్చిలో అలంకరణలుపర్లాకిమిడి: గజపతి జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు చర్చిలు విద్యుత్ వెలుగులతో ముస్తాబయ్యాయి. బుధవారం రాత్రి పర్లాకిమిడిలో పురుషోత్తం బాప్టిస్టు చర్చి, డోలా ట్యాంకు రోడ్డులో రోమల్ కాథలిక్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని కాథలిక్చర్చి ఫాదర్ అజిత్ నాయక్ తెలియజేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న మోహనాలో ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా వేలాది మంది బుధవారం ప్రత్యేక దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాయగడలో క్రిస్మస్ సందడి రాయగడ: రాయగడలో క్రిస్మస్ సందడి బుధవారం నుంచే ప్రారంభమయ్యింది. పట్టణంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో ధగధగ మెరుస్తున్నాయి. స్థానిక మహిళా కళాశాల వెనుక గల చర్చిని అందంగా అలంకరించారు. అలాగే యేసు జన్మవృత్తాంతాన్ని వివరించే విధంగా తీర్చిదిద్దారు. ఏసు జన్మవృత్తాంతాన్ని తెలిపే అలంకరణవేడుకలకు ముస్తాబైన చర్చి -
వీరనారాయణపూర్లో సేవా కార్యక్రమాలు
రాయగడ: సదరు సమితి కొత్తపేట పంచాయతీలోని వీరనారాయణపూర్ యూపీ స్కూల్లో స్థానిక లయన్స్ అపరాజిత క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన 90 మంది వృద్ధ మహిళలకు రగ్గులు, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. శీతాకాలం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేదలు ఇబ్బంది పడతారని భావించిన క్లబ్ సభ్యులు ఈ మేరకు సేవా కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో లయన్స్ అశ్విని దాస్, వి.భాస్కరావు, సత్యవాది పతి, టి.జయరాం, జి.రామక్రిష్ణ, రజిత కొరాడ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు తెలియజేశారు. -
మహిళ అనుమానాస్పద మృతి
● బ్యాంకు పనిపై వెళ్లి శవమైన వైనంరాయగడ: పాఠశాల మైదానంలో డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని పడేయికాని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో మహిళ మృతదేహం ఉండటాన్ని బుధవారం ఉదయం కొంతమంది గుర్తించారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు మునిగుడ సమితి అంబాధాని గ్రామానికి చెందిన ఫులమ సికక (50)గా గుర్తించారు. అయితే హత్యా లేక ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పొలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త తెలి సికక ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య సోమవారం బ్యాంకు పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైదానంలో మహిళ మృతదేహం పడిఉందని తెలియడంతో వెళ్లి చూడగా తన భార్యగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణ
● ఆలస్యంగా వచ్చిన మంత్రి బిభూతి జెన్నరాయగడ: రాష్ట్ర మాజీమంత్రి, స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణకు రాష్ట్ర గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి జెన్న సకాలంలో హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసి విగ్రహావిష్కరణకు పూనుకున్నారు. విగ్రహం ఆవిష్కరించి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నాయ కులు అక్కడ నుంచి బహిరంగ సభ జరిగే తేజస్వీ మైదానానికి తిరిగి వెళ్లారు. ఆలస్యమైనప్పటికీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలానికి వచ్చిన మంత్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తవ్వడంతో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి తిరిగి వెళ్లారు. కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి ఉలకకు స్వయా న తండ్రి అయిన స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహం ఏర్పాటుకు ఆదినుంచీ అవాంతరాలు ఏర్పడ్డాయి. ముందుగా స్థానిక గజపతి కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంపీ సప్తగిరి అన్ని సన్నాహాలు చేశారు. అనంతరం విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 24న ఉన్నట్లు ఖరారు చేశారు. అందుకు స్థానిక బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం స్పందించి విగ్రహాన్ని స్థానిక వోఎంపీ సమీపంలోని ముక్తా పార్క్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం ముక్తా పార్క్లో విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలొ సప్తగిరి ఉలక కాంగ్రెస్ నాయకులైన భక్త చరణ్ దాస్, ప్రసాద్ హరిచందన్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి అజయ్కుమార్ను ఆహ్వానించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సమయం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి జెన్న కూడా హాజరవ్వాల్సి ఉండేది. బ్యాంక్ కాలనీ నుంచి విగ్రహావిష్కరణ వేదిక వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లి చేరుకున్నారు. అయితే కార్యక్రమానికి మంత్రి జెన్న కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సకాలంలో మంత్రి హాజరుకాలేదు. సుమారు 15 నిమిషాలు మంత్రి కోసం వేచి ఉన్న కాంగ్రెస్ నాయకులు సహనం కొల్లోయారు. సకాలంలో హాజరుకావల్సింది పోయి మంత్రి తమ పార్టీ కార్యకర్తల వల్లే తమను ఇలా వేచిఉండేట్టు చేయడం ఏమాత్ర ఆమోదయోగ్యం కాదని మండిపడిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణిపై మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ నాయకులంతా కలిసి స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత మంత్రి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన్పప్పటికీ అప్పటికే విగ్రహం ఆవిష్కరించి ఉండటం చూసి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్య క్రమంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు కూడా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. -
శబరి క్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్దాస్ పూజలు
● శబరి శ్రీక్షేత్రంలో పీసీసీ చీఫ్ భక్తచరణ్ దాస్ కొరాపుట్: రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ శబరి శ్రీక్షేత్రాన్ని దర్శించుకున్నారు. బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి క్షేత్రంలో జగన్నాథ, శుభద్ర, బలభద్రలకు ప్రత్యేక పూజలు చేశారు.పీసీసీ చీఫ్కు కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్య తదితరులు స్వాగతం పలికారు.భక్తిశ్రద్ధలతో గోదాతాండవ పూజలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రోజూ నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా బుధవారం గోదా తాండవ, కృష్ణుల పూజలను భక్తి శ్రద్ధలతవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి సుప్రభాత పూజలతో పాటు అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. అలాగే తొమ్మిదో పాశురం విన్నపం పూజలను చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నగరంలో నకిలీ పోలీసుల అరెస్టు భువనేశ్వర్: స్థానిక ఖండగిరి ఠాణా పోలీసులు ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. పోలీసుల వలె నటిస్తూ ఖండగిరి ప్రాంతంలో దోపిడీకి పాల్పడ్డారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఒక నిందితుడు కేరళకు చెందినవాడు కాగా మరొకరు ఖండగిరి ప్రాంతానికి చెందిన వాడుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక రోజు పాటు నిర్వహించిన జిల్లా స్థాయి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు–2030(ఎస్ డి జి–2030) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు జిల్లా కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలు అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు దీర్ఘకాలికంగా అమలు చేస్తే అభివృద్ధి లక్ష్యాలు సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో బలిమెల కౌన్సిల్ చైర్మన్ ప్రదిప్ నాయక్, గోలక్చంధ్ర దోలాయ్, సరోజ్ కుమార్ దాస్, హిమాంశు భూషణ్ మహారాణా ఇతరులు పాల్గొన్నారు. -
రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పర్లాకిమిడి: వ్యవసాయం, రైతులు కష్టాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ గజపతి జిల్లా ప్రభారి రంజిత్ పట్నాయక్ అన్నారు. రైతుల సమస్యలపై గుసాని సమితి ఏడో మైలు జంక్షన్ వద్ద బుధవారం నిర్వహించిన సమావేశానికి నవ నిర్మాణ్ కృషక్ రాష్ట్ర కోఆర్డినేటర్ అక్షయ కుమార్, గజపతి జిల్లా రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయక్, రాష్ట్ర యువ విద్యార్థి సంఘం కో ఆర్డినేటర్ ఎం.డి.నట్వర్ అలీ, గుసాని జిల్లా పరిషత్తు సభ్యులు ఎస్.బాలరాజు, మాణిక్ పాయక్, పూర్ణ గోమాంగో, కృష్ణ నాయక్ తదితరులు హాజరయ్యారు. రైతులకు సరఫరా చేసే యూరియా బస్తా రూ.166 ఒకప్పుడు ఉండగా, అది మూడు రెట్లు రూ.800 నుంచి రూ.1000లకు ఈ ప్రభుత్వం పెంచిందన్నారు. రైతులకు మద్దతు ధర (ఎం.ఎస్.పి ) పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం సిఫారసులకు ముందుకు వచ్చిందని రంజిత్ పట్నాయక్ అన్నారు. ధాన్యం విక్రయ కేంద్రాలలో (మండీ) ధాన్యం ప్రోక్యూర్మెంట్ అధికారులు క్వింటాకు ఐదు కేజీలు కట్ చేస్తున్నారని, సంచుల డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు నెలసరి పింఛన్ డిమాండ్ నెరవేరలేదని, అందువల్ల సమీప భవిష్యత్తులో మరోసారి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ నాయకులు రంజిత్ పట్నాయక్ తెలిపారు. బహుమతుల ప్రదానం రాయగడ: స్థానిక అటానమస్ కళాశాలలో గత మూడు రోజులుగా కొనసాగిన క్రీడోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు జిల్లా కలక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ కళాశాలలో నిర్వహించిన పోటీల వివరాలను చదివి వినిపించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారికి నవీన్నాయక్ అభినందించారు. -
అవిభక్త కొరాపుట్ ప్రగతికి సహకరించండి
జయపురం: అవిభక్త కొరాపుట్తోపాటు దక్షిణ ఒడిశా సర్వాంగ ఉన్నతికి కొన్ని అభివృద్ది పనులు చేపట్లాలని, అందుకు సహకరించాలని జయపురం చాంబర్ ఆఫ్ కామర్ష్ అండ్ ఇండస్ట్రీస్ నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత బలభద్ర మఝికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. బుధవారం స్థానిక నెహ్రూనగర్ వేదికలోని చాంబర్ సభాగృహంలో జరిగిన చాంబర్ డైరెక్టర్ల సమావేశానికి నవరంగపూర్ ఎంపీ బలభద్ర మఝిని ఆహ్వానించింది. ఈ సందర్భంగా జయపురం చాంబర్ అధ్యక్షులు బి.ప్రభాకర్ కొన్ని సూచనలతో వినతి పత్రం ఎంపీకి సమర్పించారు. అవిభక్త కొరాపుట్ ప్రాంతంలో విలువైన ప్రకృతి, మానవ వనరులతో పాటు ఇంకా గుర్తించని ప్రకృతి సంపద ఉన్నాయని వెల్లడించారు. 1967లో ఏర్పడిన జయపురం చాంబర్ ఆఫ్ కామర్ష్ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలను కల్పిస్తున్నదని గుర్తు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న క్రూసికల్ డవలప్మెంట్ పనులకు సూచనలు సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంత ముఖ్యంగా దక్షిణ ఒడిశా ఉన్నతికి రైల్వే ప్లానింగ్, పాలసీ మేకింగ్ పనులు అవసరమని చెప్పారు. జయపురం–నవరంగపూర్–మల్కనగిరి రైల్వే ప్రకటించి పదేళ్లకుపైనే అయిందని, ఈ రైల్వే ప్రాజెక్టు వలన వెనుకబడిన ఆదివాసీ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక ప్రగతి, వ్యాపార ఉన్నతి జరుగుతుందన్న లక్ష్యం గల ఆ రైలు మార్గం నేటికీ కార్యరూపం దాల్చ లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్నారు. వీటిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధికి చర్యలు చేపడితే తాము పూర్తి సహకారం అందిస్తామని చాంబర్ అధ్యక్షులు ప్రభాకర్ వినతిలో వివరించారు. ఎంపీ బలభద్ర మఝి మాట్లాడుతూ.. జయపురం చాంబర్ సూచనలు కార్యరూపం దాల్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి డి.మాధవ, శశిభూషణ పట్నాయక్ తదితరులు ఉన్నారు. -
రూర్కెలాలో బినోదినీ కేన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
పర్లాకిమిడి: ఒడిశాలోని రూర్కెలా ఉన్న హైటెక్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం బినోదినీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఢెంకనాల్ ఎమ్మెల్యే, స్టాడింగ్ కమిటీ సభ్యులు, బిభూతీ భూషన్ ప్రధాన్ ప్రారంభోత్సవం చేశారు. ఈస్ట్రన్ ఒడిషాలో తొలి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ స్కానర్ సదుపాయం కూడా ఉందని చైర్మన్ (హైటెక్ మెడికల్ ఇనిస్టిట్యూట్స్) డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలియజేశారు. కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష పాణిగ్రాహి, ఫుల్భానీ ఎమ్మెల్యే ఉమాచరణ్ మల్లిక్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంధనం కోసం కాలుష్య ఽధ్రువీకరణ పత్రం వాయిదా
భువనేశ్వర్: వాహనాలకు కాలుష్య ధ్రువీకరణ పత్రం లేకుంటే అవసరమైన పెట్రోలు, డీజిల్ పంపిణీ నిలిపి వేయడం జరగుతందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలు చేస్తామని రాష్ట్ర వాణిజ్య, రవాణా విభాగం ప్రకటించింది. దీంతో వాహనదారులు కాలుష్య ధృవ పత్రాల కోసం ఎగబాకడంతో పలు చోట్ల అవాంఛనీయ పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కాలుష్య ధ్రువీకరణ పత్రాలతో ఇంధన సరఫరా నిబంధన అమలు నిరవధికంగా నెల రోజులపాటు వాయిదా వేసినట్లు విభాగం మంత్రి బిభూతి భూషణ్ జెనా బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు కొత్త నిబంధన నిరవధికంగా వాయిదా పడింది. అంత వరకు పెట్రోలు, డీజిల్ వంటి వాహన ఇంధన వినియోగదారులకు ఇబ్బంది కలిగించరాదని మంత్రి హితవు పలికారు. నెల రోజులు గడువు ముగిసే లోగా వాహన వినియోగదారులు రవాణా చట్టం నిబంధనల మేరకు వాహన సంబంధిత కాగితపత్రాలు, ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని చట్టపరమైన చర్యలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. కుష్టు రోగులకు దుప్పట్ల పంపిణీ పర్లాకిమిడి: క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక డోలా ట్యాంకు రోడ్డు మహారాజా డైమండ్ జుబిలీ కుష్టురోగుల పునరావాస కేంద్రంలో ఉంటున్న రోగులకు ఒకటో నంబరు కౌన్సిలరు అలిజింగి అమ్ములమ్మ బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కుష్టు రోగుల పునరావాసంలో ఉంటున్న 15 మంది రోగులకు ఈ దుప్పట్లు పంపిణీ చేశారు. రాయగడ: రాయగడ అటవీ శాఖ, కలహండి జిల్లా అటవీ శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన సంయుక్త దాడుల్లో రెండుపులి చర్మాలు స్వాఽధీనం చేసుకుని అందుకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలొని కాశీపూర్లోని హనుమాన్ మందిరం సమీపంలో పులి చర్మాలు విక్రయిస్తుండగా నిందితులను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కాశీపూర్ సమితి సుంగేరు గ్రామానికి చెందిన గోపి గౌడొ, గుప్తేశ్వర్ గౌడొ అమర్సింగ్గుడ గ్రామానికి చెందిన ఈశ్వర్ నాయక్, పుడుగొసిల్ గ్రామానికి చెందిన సువార్సింగ్ మాఝి, కొడికిపొదొరా గ్రామానికి చెందిన కాలు మాఝిలు ఉన్నారు. నిందితుల నుంచి పులి చర్మాలతో పాటు మూడు బైకులు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
గుణుపూర్లో ఏనుగుల హల్చల్
● భయాందోళనలో ప్రజలురాయగడ: జిల్లాలోని గుణుపూర్ అటవీ రేంజ్ పరిధిలోని ఖొయిర, ఫులోపుటి, తరమాల్, జంపాపుర్ తదితర అటవీ ప్రాంతాల్లో వారం రోజులుగా ఏనుగులు సంచరిస్తుండటంతో ఆప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండాపోతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏనుగులు ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తాయోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక ఏనుగు పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేసింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఏనుగు పాలయ్యిందని లబోదిబోమంటున్నారు. ఉదయం పూట అడవుల్లోకి వెళ్లి ఉంటున్న ఏనుగు రాత్రయ్యే సరికి పంట పొలాలు, గ్రామాల్లోకి చొరబడుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అటవీ శాఖ సిబ్బంది గ్రామస్తులతో కలిసి రాత్రి పూట చలి మంటలు వేసుకుని టార్చిలైట్లను పట్టుకుని కాపాలా కాస్తున్నారు. అయితే ఏనుగులను సంరక్షించడంతో పాటు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ తరహా చర్యలను చేపడుతున్నామని రేంజర్ గంగాధర్ మిశ్రో తెలియజేశారు. ఏనుగులు తారాసపడే సమయంలో వాటి ముందుకు వెళ్లకూడదని, సాయంత్రంలోగా పనులు ముగించుకుని ఇళ్లళ్లో ఉండాలని ప్రజలను చైతన్య పరుస్తున్నామని చెప్పారు. -
త్వరలో రత్న భాండాగారం వస్తువుల లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం (ఖజానా)లోని విలువైన వస్తువుల లెక్కింపు కొత్త సంవత్సరం జనవరి నెలలో ప్రారంభం అవుతుందని అధికారులు బుధవారం తెలిపారు. రత్న భాండాగారం వెలుపల, లోపల మిద్దెల మరమ్మతు భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న సాయంత్రం 4.30 గంటలకు శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలితో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రత్న భాండాగారంలో అమూల్య ఆభరణాలు పర్యవేక్షించే 16 మంది సభ్యుల కమిటీ ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీ) ఖరారు చేస్తుందని ఛైర్మన్ ఒరిస్సా ఉన్నత న్యాయ స్థానం విరామ న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్ తెలిపారు. బలభద్ర స్వామి, దేవీ సుభద్ర మరియు శ్రీ జగన్నాథ స్వామి ఆభరణాలు, ఇతర సంపద లెక్కించడానికి తేదీలను ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ఏఎస్ఐ మరమ్మతు పనులు సందర్భంగా దేవతల విలువైన ఆభరణాలు, వస్తువులను తాత్కాలికంగా ఆలయం లోపల స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఇప్పుడు మరమ్మతులు పూర్తయ్యాయి. రత్న సంపదని యథాతథంగా వాస్తవ స్థానాల్లో పునరుద్ధరించనున్నారు. కచ్చితత్వం, సరైన నిర్వహణను నిర్ధారించడానికి లెక్కింపు 2 రోజులు నిరవధికంగా జరుగుతుందని భావిస్తున్నారు. కమిటీ తుది తేదీలను పాలక మండలికి సమర్పిస్తుంది. ఆ తర్వాత వారు ఒడిశా ప్రభుత్వానికి ఆమోదం కోసం తీర్మానాలను పంపుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలన్ని కమిటి అనుసరిస్తుందన్నారు. జాబితా సమయంలో భక్తుల దర్శనంపై ప్రభావం పడవచ్చని తెలిపారు. -
ఫిబ్రవరి 1న ఖుర్దా రోడ్ హాఫ్ మారథాన్
రిజిస్ట్రేషన్ వివరాలు ● 21.1 కిలోమీటర్లు హాఫ్ మారథాన్ రూ. 699 ● 10 కిలోమీటర్లు పరుగు రూ. 599 ● 5 కిలోమీటర్లు ఫన్ రన్ రూ. 499 ● 2 కిలోమీటర్లు ఫ్యామిలీ రన్ రూ. 399 భువనేశ్వర్: రెండో విడత ఖుర్దా రోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్–2026 కొత్త సంవత్సరం ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఔత్సాహిక అభ్యర్థులు జనవరి 15వ తేదీ లోగా అనుబంధ వివరాలు నమోదు చేసుకోవాలని ఖుర్దా రోడ్ మండలం రైల్వే అధికారి (డీఆర్ఎమ్) అలోక్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీని ఐఐటీ భువనేశ్వర్ సహకారంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్ (ఈకోర్సా) నిర్వహిస్తుందన్నారు. ఈ క్రీడా కార్యక్రమం పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రేరేపించి శారీరక దృఢత్వానికి దోహదపడుతుందన్నారు. ఈ మారథాన్ 21.1 కిలో మీటర్లు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్లు పరుగు, 5 కిలో మీటర్లు ఫన్ రన్, 2 కిలో మీటర్లు కుటుంబ పరుగు 4 వర్గాల కింద నిర్వహిస్తారు. ఈ పరుగులో 8 సంవత్సరాల పైబడిన ఆబాలగోపాలం పాల్గొన వచ్చని తెలిపారు. 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు విభాగాలలో (పురుషులు మరియు సీ్త్రలు) విజేతలకు మొత్తం రూ. 2.32 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఈ కార్యక్రమం ఖుర్దా రోడ్లోని ఈకోర్సా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమై ముగుస్తుంది. ఐఐటీ భువనేశ్వర్ గుండా బెర్హంపురా వద్ద మలుపు తిరిగి స్టేడియంకు చేరడంతో మారథన్ ముగుస్తుందని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్ మండల వాణిజ్య అధికారి, ఖుర్దా రోడ్ మండలం క్రీడాధికారి అనిల్ కుమార్ ఎస్ మరియు మండల యాంత్రిక ఇంజినీర్ (కోచింగ్) మరియు సహాయ క్రీడాధికారి మనీష్ కుమార్ మీనా పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ – khurdasoadhafmarathon.comని సందర్శించవచ్చు లేదా నిర్వాహకులను 8455887959 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
30న ధాన్యం కొనుగోలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఈ నెల 30న పర్లాకిమిడి, కాశీనగర్, గుసాని, రాయఘడ బ్లాక్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు ధాన్యాన్ని మండీలకు తెచ్చినప్పుడు ఎండలో ఆరబెట్టి, ఎగరబోసిన ధాన్యం సంచుల్లో తేవాలని నియంత్రణ బజార్ కమిటీ (ఆర్.యం.సీ.) కార్యదర్శి రేబతి మోహన్ రౌతో అన్నారు. దీనిని రైతులందరికీ తెలియజేసేలా ప్రచార రథాన్ని కలెక్టర్ మునీంద్ర హనగ కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. సాధారణ ధాన్యం ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.3,169, గ్రేడ్–ఎ ధాన్యం క్వింటా రూ.3,189, ఇన్పుట్ సబ్సిడీతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అనుప్ పండా తెలిపారు. ఈ ప్రచార రథం జిల్లాలో కాశీనగర్, గుసాని, గుమ్మ, రాయఘడ సమితిల్లో బుధవారం నుంచి ప్రచారం చేయనుందన్నారు. నిరసన.. పర్లాకిమిడి: బంగ్లాదేశ్లో హిందువు దిప్పు చంద్రదాస్పై ఆ శీయులు దాడులు చేసి అతికిరాతకంగా తగులబెట్టడాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పర్లాకిమిడిలో బుధవారం జగన్నాథ మందిరం నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. భారత్ ఇటువంటి ఘటనలపై ఊరుకుంటే.. సమీప భవిష్యత్తులో ఇండియాలో కూడా రోహ్యింగాలు రెచ్చిపోయే అవకాశం ఉందన్నారు. హోంశాఖ తగిన చర్యలు చేపట్టి బంగ్లాదేశ్కు బుద్ధి చెప్పాలను వీహెచ్పీ ఉపాధ్యక్షుడు లోకనాథ మిశ్రా పాతబస్టాండ్ వద్ద అన్నారు. ఈ ఆందోళనలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు కై లాష్ చంద్ర గౌడో, కార్యదర్శి శ్యాంసుందర్ శోబోర్, ముఖ్య ఆర్గనైజర్ నారాయణ రైతో, మహంత రామానంద దాస్, జగన్నాఽథ్, నరేంద్ర జన్ని (గంజాం), తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు మండీ ప్రారంభం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు సేకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతుల కష్టానికి ఫలితంగా ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందన్నారు. 2025–26 ఖరీఫ్ సంవత్సరానికి అర్హత పొందిన రైతులకు ఎఫ్ఏక్యూ ప్రమాణాల సాధారణ ధాన్యానికి కనీస మద్ధతు ధర క్వింటాల్కు 2369 రూపాయలుగా నిర్ణయించడంతోపాటుఇన్పుట్ సబ్సిడీ కలిపి మొత్తం 3100 రూపాయలుగా రాష్ట్రప్రభుత్వం ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సజావుగా ధాన్యం కొనుగోలు జరిగేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయని, రైతులకు సరైన ధర అందేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. నమోదైన రైతులకు ముందస్తు సమాచారం అందించి టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. రైతుల సౌకర్యార్ధం అన్ని అనుబంధ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 68 మండీలు ఉండగా 47,770 మంది రైతులు నమోదు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. మండీ నోడల్ అధికారులు, సూపర్వైజర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
పౌర రక్షణ
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025విపత్తు నిర్వహణ..భువనేశ్వర్: అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో సన్నద్ధత, సమన్వయం, ప్రభావవంతమైన ప్రతిస్పందనను ప్రదర్శించే లక్ష్యంతో.. తూర్పు కోస్తా రైల్వే వివిధ విభాగాల నుంచి 59 మంది పౌర రక్షణ వలంటీర్ల చురుకై న భాగస్వామ్యంతో తూర్పు కోస్ట్ రైల్వే బుధవారం సమగ్ర పౌర రక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పౌర రక్షణ వలంటీర్ల అంకితభావం, క్రమశిక్షణ, వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఊహించని పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను, ఆస్తిని రక్షించడంలో పౌర రక్షణ దళాలు పోషించిన కీలక పాత్రను కొనియాడారు. విపత్తు సన్నద్ధత, ప్రతిస్పందన విధానాలను మరింత బలోపేతం చేయడానికి నిరంతర శిక్షణ, మాక్ డ్రిల్స్ మరియు ప్రజా అవగాహన కార్యక్రమాలలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. ఈ ప్రదర్శనలో తేలికపాటి, భారీ సహాయక చర్యలు, ప్రథమ చికిత్స పద్ధతుల అవలంబన ప్రదర్శించారు. వీటిలో వివిధ ప్రమాదకర తరలింపు పద్ధతులు, నిచ్చెన, తాడు రక్షణ, స్ట్రెచర్ ఆపరేషన్లు, రాపెల్లింగ్, వాల్ క్రాలింగ్, ప్రమాద డ్రాగింగ్ మెలకువలు, విద్యుత్ షాక్ నిర్వహణ, ఫైర్మ్యాన్ లిఫ్ట్, ప్రత్యక్ష అగ్నిమాపక నిర్వహణ విన్యాసాలు ప్రదర్శించారు. -
ఖనిజ సంపద దోపిడీ
● ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్రాయగడ: అపారమైన ఖనిజ సంపద గల రాష్ట్రా న్ని అధికార బీజేపీ దోచుకుని, వారి అనుయాయులకు (ప్రైవేట్ కంపెనీలకు) ధారాదత్తం చేస్తోందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ భగేల్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర ఉలక విగ్రహాష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వీ మైదానంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉలక ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భుపేష్ భగేల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఖనిజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అవసరమైతే దీనిని అడ్డుకునేలా ఆందోళనలను నిర్వహించి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. పరిశ్రమల పేరిట ఉన్న ఖనిజ సంపదను అంతా దోచుకునేందుకు వ్యూహం పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఖనిజ సంపదపై కన్ను వేసిందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పలుసార్లు ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే అది మీపై ప్రేమ ఏమాత్ర కాదని, ఆయనకు అవసరమైన ఖనిజ సంపదను దోచుకునేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చి మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై బీజేపీ ఆటలు సాగనివ్వం.. గత రెండు దశాబ్దాలకు పైబడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీకి కాలం చెల్లగా.. ఏదో అవకాశం దొరికిన బీజేపీ పనితీరును ప్రజలు బాగా గుర్తించారన్నారు. ఇకపై ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించేది లేదని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అన్నారు. బీజేడీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రం భవిష్యత్లో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్ర ఉలక ఉన్న సమయంలో పార్టీ ఒక వెలుగు వెలిగిందన్నారు. త్వరలో కాంగ్రెస్కు మంచి రోజులు రావడంతోపాటు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వారి ఆదరాభిమానాలతో గత ఎన్నికల్లో ఆరు శాసనసభ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సంపాదించుకుందన్నారు. భవిష్యత్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్, జయదేవ్ జెన్న, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, భవానీపట్నం ఎమ్మెల్యే సాగర్ దాస్, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణిపతి తదితరులు పాల్గొన్నారు. -
యువ క్రీడాకారిణి జ్యోత్స్నకు ప్రధానమంత్రి జాతీయ శిశు పురస్కారం
పర్లాకిమిడి: ప్రధానమంత్రి జాతీయ శిశు పురస్కార్ అవార్డుకు గజపతి జిల్లా రాయగడ బ్లాక్ విద్యార్థిని, యువ వెయిట్ లిఫ్టర్ జ్యోత్స్న శోబోరో ఎంపికై ంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ మునీంద్ర హానగ ప్రత్యేక అభినందన సభను ఏర్పాటుచేశారు. రాయగడ బ్లాక్ మర్లబ పంచాయతీ మారుమూల గ్రామానికి చెందిన పెక్కటో గ్రామానికి చెందిన జ్యోత్స్న శోబోరో ప్రస్తుతం భువనేశ్వర్లోని కిట్ విశ్వవిద్యాలయంలో సోషల్ సైన్సులో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. గతంలో ఖేలో ఇండియా, ఆసియన్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో 2019 రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకుంది. ఈ నెల 26న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా జాతీయ శిశు పురస్కారం అందుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ మునీంద్ర హానగ తెలియజేశారు. జ్యోత్స్న శోబోరోకు భవిష్యత్లో జిల్లా యంత్రాంగం క్రీడారంగంలో పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. గజపతి జిల్లాకు క్రీడారంగంలో వన్నెతెచ్చిన శోబోరో తండ్రి కీర్తన్ శోబోరో ఒక గిరిజన రైతు. ఆమెను న్యూ ఢిల్లీకి ప్రభుత్వ ఖర్చుతో ఈరోజు సాయంత్రం ఫ్లైట్లో పంపించనున్నారు. క్రీడాకారిణి జ్యోత్సన శోబోరోతో ఆమె తండ్రి కీర్తన్ శోబోరో, మామయ్య ఎస్కార్ట్గా వెళ్లనున్నట్లు డీసీపీయూ అరుణ్కుమార్ త్రిపాఠి తెలియజేశారు. ఆమెకు జిల్లా స్పోర్ట్స్, సబ్ కలెక్టర అనుప్పండా పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. -
చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధం
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జిల్లాస్థాయి చొయితీ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పల్లెను తలపించే విధంగా వేదికను రూపొందించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అభివృద్ధికి సంబంధించి ప్రదర్శనను ఏర్పాటు చేసే స్టాళ్లను సిద్ధం చేశారు. ఐదు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి కలశ యాత్రను నిర్వహించి వేదకి వద్దకు వెళతారు. అక్కడ జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి గొకులా నంద మల్లిక్ హాజరవుతారు. అలాగే గౌరవ అతిథిగా కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక, గుణుపూర్ ఎంఎల్ఏ సత్యతీజ్ గొమాంగో, బిసంకటక్ ఎంఎల్ఏ నీలమాధవ హికక లు హాజరవుతారని జిల్లా కలెక్టర్ ,ఉత్సవ కమిటీ అధ్యక్షులు అశుతోష్ కులకర్ణి తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్ వీడియో సందేశం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు కొనసాగే చొయితీ జిల్లా స్థాయి ఉత్సవాలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందరి సహాయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా ఉత్సవాలు విజయవంతమవ్వాలంటే అందరి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. -
తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి
● లేదంటే 26న సీఎస్వో కార్యాలయం ముట్టడి ● మాజీ మంత్రి రబినారాయణ నందో డిమాండ్జయపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ నెల 24వ తేదీలోగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, రాష్ట్ర బిజేడీ ఉపాద్యక్షులు రబినారాయణ నందో కోరారు. లేదంటే ఈ నెల 26వ తేదీన జిల్లా సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం బీజేడీ నేత బాలారాయ్ కార్యాలయం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మండీల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. జిల్లాలో గత 11వ తేదీన మండీలు ప్రాంభించిన అధికారులు టీ తాగి వెళ్లిపోయారు తప్పితే నేటి వరకు ఎక్కడా ఒక్క కేజీ ధాన్యం ఖరీదు చేయలేదని దుయ్యబట్టారు. మండీలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయటం అధికారుల నైతిక బాధ్యతన్నారు. అయితే అధికారులు బాధ్యత విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని మండీల్లో వేలాది బస్తాల ధాన్యం పడి ఉన్నాయని వివరించారు. రెండు దినాల కిందట కొరాపుట్ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని తాము కలసి కొరాపుట్ జిల్లా రైతుల సమస్యలతో పాటు మండీలలో పడిఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. మండీలలొ రైతుల ధాన్యం కొంటామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదన్నారు. దీంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో బీజేడీ నేతలు బాలారాయ్, బి.బాలంకిరావు, ఎ.శ్రీనివాసరావు, టున రథో పాల్గొన్నారు. -
ఉపాధి పేరిట మోసం!
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్కు చెందిన సుహాన ట్రస్టు, సిమ్ గ్రూప్ కంపెనీ పేరిట సంబల్పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక వ్యక్తులతో కలిసి ఆదివాసీ, హరిజన యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామని పర్లాకిమిడి కలెక్టరేట్ వద్ద యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో శిబిరం నిర్వహించారు. వారి వద్ద నుంచి రిజిష్ట్రేషన్ ఫీజుగా కొంత సొమ్మును తీసుకుని రెట్టింపు డబ్బులు ఇస్తామని, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని ప్రలోభాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆదర్శ పోలీసుస్టేషన్కు సమాచారం అందజేశారు. వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని స్వచ్ఛంద సంస్థ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆదర్శ పోలీసు స్టేషన్లో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. -
సెంచూరియన్ వర్సిటీలో రైతు దినోత్సవం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో మంగళవారం భారత మాజీ ప్రధాని డాక్టర్ చౌదురీ చరణ్సింగ్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సాగర్ మైత్రా, అగ్రోనమీ ఉన్నత విభాగం అధిపతి తన్మయ శంకర్ రైతు దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్లో నిర్వహించిన ర్యాలీలో ప్రొఫెసర్లు సుప్రదీప్ సర్కార్, వై.నంజారెడ్డి, బి.చక్రపాణి పాల్గొన్నారు. సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాలలో ఆగ్రోనమీ, అగ్రో ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవంలో రైతులకు వర్మి కంపోస్టు, డ్రాగన్ ఫ్రూట్, సీవీడ్ ఎక్స్ట్రాక్టుపై అవగాహన కల్పించి వారికి సొరకాయ విత్తనాలను అందజేశారు. రైతులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. -
కొనసాగుతున్న ధనుర్మాస పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీనివాసనుకి, గొదాదేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారామ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి హారతి, వ్రత పూజలు జరిగాయి. భక్తులు స్వామివారి వ్రతాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పర్యాటకుల ప్రాణాలు కాపాడిన లైఫ్ గార్డులు భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల కారణంగా యువకుడు మునిగిపోయాడు. తీరంలో పహరా నిర్వహిస్తున్న 4 మంది లైఫ్గార్డ్లు ఈ ప్రాణాపాయ పరిస్థితి గమనించి సముద్రంలోకి దూకి యువకుడిని రక్షించారు. బిసంకటక్లో బీఎస్పీ కార్యకర్తల సమావేశం రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో బహుజన్ సమాజ్ పార్టీ మంగళవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, సీనియర్ నాయకుడు జితు జకసికలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని బలొపేతానికి కార్యకర్తలు సహకరించాలని ఈ సందర్భంగా నాయక్ అన్నారు. సమితీ వార్లగా సమావేశాలను నిర్వహించి కార్యకర్తలను చైతన్య పరచాలని అన్నారు. భవిష్యత్లో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు. కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిమతాన్ని తెలుసుకుని అందుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తే దానికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొందరు పార్టీలో చేరారు. వారికి సాదరంగా నాయకులు ఆహ్వానించారు. బిసంకటక్కు చెందిన గౌరీప్రసాద్ పాత్రో తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.విద్యుద్ఘాతంతో లారీ డ్రైవర్ మృతి రాయగడ: విద్యుత్ షాక్తో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలోని చంద్రపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడు ప్రశాంత జెన్న (39)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్కోకి వెళితే.. చంద్రపూర్ సమితి పరిధిలోని బంధిరి నుంచి చంద్రపూర్ వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో లారీ డ్రైవరు ప్రశాంత్ మెటల్ లోడ్ ను తీసుకువస్తున్న సమయంలో లోడ్ను డాలా ఎత్తి అన్లోడింగ్ చేస్తున్న సమయంలో పైనఉన్న విద్యుత్ తీగలు లారీకి తాకడంతో విద్యుత్ ఘాతం ఏర్పడింది. దీంతో సంఘటన స్థలంలోనే ప్రశాంత్ మృతి చెందాడు. మృతునిది జిల్లాలోని గుణుపూర్ పరిధి జల్తార్ గ్రామం.కలెక్టరేట్లో గుడ్ గవర్నెన్స్పై వర్క్షాప్ పర్లాకిమిడి: స్థానిక లెక్టరేట్లో జిల్లాస్థాయి గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు సందర్భంగా ఓస్వాన్ హాలులో ‘ప్రశాసన్ గావ్ కి ఔర్’ అనే వర్క్షాపు జరిగింది. ఈ కర్మశాలలో ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అధ్యక్షత వహించారు. జిల్లాలోని అన్ని మండలస్థాయిలో ఆరోగ్యం, విద్య, శిశువికాస్, సాధరణ ప్రజా వినతులను వినడం, వాటి పరిష్కారం దిశగా అధికారులు ముందుకు సాగటంపై ఏడీఎం మఝి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గుడ్ గవర్నన్స్ ఈ నెల 25వ తేదీ వరకూ కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మిధాలీ మధుస్మితా పాఢి, కష్యప్ బెహరా సహా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహానది జల వివాదంపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం
భువనేశ్వర్: మహా నది అంతర్ రాష్ట్ర జలాల పంపిణీ సమస్యలపై అంతర్ మంత్రివర్గ కమిటీ తొలి సమావేశం ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన మంగళ వారం జలవనరుల శాఖ రాజీవ్ భవన్లో జరిగింది. సమావేశానికి మంత్రులు సురేష్ కుమార్ పూజారి, పృథ్వీరాజ్ హరిచందన్, సంపద్ చంద్ర స్వంయి, ఎమ్మెల్యేలు సరోజ్ కుమార్ ప్రధాన్, నిరంజన్ పూజారి, సోఫియా ఫిర్దౌస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, జల వనరుల శాఖ సంబంధిత అధికారులు, ఇంజినీర్లు కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడానికి సమావేశంలో పాలుపంచుకున్నారు. సమావేశంలో హీరాకుద్ ప్రాజెక్ట్, మహానది జల వివాదం చారిత్రక నేపథ్యం, మహానది జల వివాదాల ట్రైబ్యునల్ ముందు జరుగుతున్న విచారణల ప్రస్తుత స్థితి, మహానది సంబంధిత సమస్యల స్నేహపూర్వక పరిష్కార ప్రక్రియ మరియు మహానది బేసిన్కు సంబంధించిన విషయాల సమగ్ర స్థితిపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్రం యొక్క వాదనను మరింత బలోపేతం చేయడానికి, మహా నది జల సమస్యల స్నేహపూర్వక పరిష్కారం దిశగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అంతర్ మంత్రివర్గ కమిటీ తదుపరి సమావేశాన్ని కొత్త సంవత్సరం జనవరి నెలలో నిర్వహించాలని నిర్ణయించారు. -
కోరుకొండలో శాంతిచర్చలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రఖల్గూఢ, యం.వి.26 గ్రామల మధ్య గిరిజన మహిళ విషయమై గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇరు గ్రామాల మధ్య శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అధ్యక్షతన శాంతి చర్చలు మంగళవారం జరిపారు. ఈ నెల ఐదో తేదీన జరిగిన గిరిజన మహిళ హత్య నేపథ్యంలో ఇరు గ్రామాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ గ్రామాల్లో పర్యటించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు గ్రామాల ప్రజలతో చర్చలు జరిపారు. పొట్టంగి, గుణుపూర్, చిత్రకొండ ఎమ్మెల్యేలు రామచంద్ర కడాం, సత్యజీత్ గోమెంగో, మంగుఖీలో, మినాక్షీ బాహినిపతి, నిమాయ్ సర్క్ర్, మనోజ్ నాయక్, జి.శ్రీనివాస్రావు, గోవిందపాత్రో, మున్న త్రిపాఠి, భోజాబాల్ మాఝి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమాజ శ్రేయస్సులో విద్యార్థుల పాత్రకీలకం
● జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రాయగడ: సమాజ శ్రేయస్సులో విద్యార్తుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గాయత్రీనగర్లోని సరస్వతి శిశువిద్యామందిరం 33వ వార్షికోత్సావాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే సమాజ శ్రేయస్సు గురించి అవగాహన కల్పించుకోవాలన్నారు. చదువుతో పాటు వారికి సమాజ హితం గురించి ఉపాధ్యాయులు నేర్పించాలని అన్నారు. అవగాహన లోపంతో చాలామంది పక్కదారిపట్టి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రాథమిక దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్య పరచాలని ఉద్బోంధించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి పౌరులని అన్నారు. బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. విద్యాలయం కమిటీ అధ్యక్షులు మంగీలాల్ జైన్, కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహాంతి, విద్యాలయం ప్రధానోపాధ్యాయులు మనోరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అడవులను సంరక్షించాలి రాయగడ: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో అటవీ, పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో అడవుల్లో కొనసాగుతున్న అగ్ని ప్రమాదాల గురించి వివరించారు. అవగాహన రహితంతో అడవులను కాల్చివేస్తున్నారని దీనివల్ల పచ్చదనం అంతరించడంతోపాటు విలువైన వృక్ష సంపదను మనమంతా కోల్పొతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ తరహా అగ్నిప్రమాదాలను నివారించేందుకు అధికారులు అధిక శ్రద్ధతీసుకోవాలని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సచిన్ అన్నా సాహేబ్ అహూలే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. జిల్లాలోని మునిగుడ, కళ్యాణసింగుపూర్, రాయగడ సమితుల్లో అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను సంరక్షించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. అటవీ శాఖ, పోలీస్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా అడవుల సంరక్షణకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేపట్టాల్సిన చైతన్య కార్యక్రమాలపై చర్చించారు. -
150 కొత్త అంబులెన్స్ల ప్రారంభం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళవారం కళింగ స్టేడియంలో 150 అంబులెన్స్లను ప్రజా సేవకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.111 కోట్లు ఖర్చు చేసి 428 అంబులెన్స్లు సేవా రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వాటిలో తొలి విడత కింద 150 కొత్త అత్యవసర అంబులెన్స్లను (ఈఎంఏఎస్) ప్రారంభించారు. 108 అంబులెన్స్ల ద్వారా నిత్యం 5,000 మంది రోగులను రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత మెరుగుపరచడానికి పాత అంబులెన్స్లను దశలవారీగా కొత్త అంబులెన్స్లతో భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సేవను మరింత వేగవంతం చేయడానికి మరో 108 ఈఎమ్ఏఎస్ అంబులెన్స్లను కొనుగోలు చేశారు. పాత అత్యవసర వైద్య అంబులెన్స్ సర్వీస్ లేదా ఈఎమ్ఏఎస్ ఫ్లీట్తో పాటు మిగిలిన కొత్త అంబులెన్స్లను త్వరలో అంబులెన్స్ సేవలో మోహరిస్తామని ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన అంబులెన్సు వాహనాల్లో వాణిజ్య, రవాణా శాఖ అధీనంలో విమానాశ్రయాలు, ఎయిర్స్ట్రిప్లలో ఉపయోగించడానికి 5 ఏఎల్ఎస్ అంబులెన్సులను, ఝార్సుగుడ కార్డియాక్ కేర్ హాస్పిటల్ కోసం 2 ఏఎల్ఎస్ అంబులెన్స్లను ఉపయోగిస్తారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, ఏకామ్రా భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, ఆరోగ్య కమిషనర్, కార్యదర్శి అశ్వతి ఎస్, రాష్ట్ర శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ బృందా, ఆరోగ్య శాఖలోని వివిధ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పనికితగ్గ వేతనం ఇవ్వాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పనిచేస్తున్న ఆశవర్కర్లు, గావ్ కళ్యాణసమితి, మహిళా ఆరోగ్య సమితి, జేఏఎస్ (జన ఆరోగ్య సమితి) వర్కర్లకు పనికి తగ్గ వేతనం రాక ఇబ్బందులుపడుతున్నారని జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి అన్నారు. ఆమె స్థానిక బిజూ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లాస్థాయి ఆశ, గాకళ్యాణ సమితి, ఎం.ఏ.యస్., జె.ఎ.యస్. వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లాముఖ్యవైద్యాధికారి డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, ఆదనపు పీహెచ్వో డాక్టర్ రబినారాయణ దాస్, జన స్వస్థ్య అధికారి ప్రదీప్ కుమార్ మహాపాత్రో, జిల్లాపరిషత్తు ఆదనపు ఈవో ఫృధ్వీరాజ్ మండళ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ స్వస్థ్య మిషన్లో పనిచేస్తున్న ఆశవర్కర్లు, ఎంఏఎస్, జేఏఎస్, జీకేఎస్ వర్కర్లు ఎప్పటికై న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి జీతాలు పెంచుతారన్న ఆశాభావం వ్యక్తపరిచారు. అనంతరం ఆశ, గావ్ కళ్యాణసమితి, జన ఆరోగ్యసమితి వర్కర్లు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. -
జవాన్ ఈశ్వర్ తలియ విగ్రహావిష్కరణ
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖెందుగుడ గ్రామ పంచాయతీ గుడ గ్రామంలో సహిద్ జవాన్ ఈశ్వర తలియ విగ్రహాన్ని ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన జన్మస్థలం బొడొగుడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాద్ మచ్చ పాల్గొని ఈశ్వర తలియ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ ప్రసంగిస్తూ సహిద్ జవాన్ ఈశ్వర్ దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ అన్నారు. కొరాపుట్ జిల్లా వీరుల, త్యాగధనుల మట్టి అని అన్నారు. బొయిపరిగుడ సమితి తెంతులిగుమ్మ గ్రామంలో పుట్టి ఆంగ్లేయులతో పోరాడి చిరు నవ్వుతో ఉరికంబ మెక్కి ప్రాణ త్యాగం చేసిన ఆదివాసీ నేత సహిద్ లక్ష్మణ నాయిక్ దేశ స్వాతంత్య్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారని, అతడితో పాటు బొయిపరిగుడ సమితికి చెందిన అనేక మంది దేశం కోసం రక్తం చిందించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి దేశ భక్తులు పుట్టిన బొయిపరిగుడ సమితి లోమరో కలికి తురాయి సహిద్ ఈశ్వర తలియ అని ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ పడాల్, మాజీ మంత్రి పద్మిణి దియాన్, మాజీ ఎంపీ జిన్నా హికాక, బొయిపరిగుడ సమితి చైర్మన్ ప్రశాంత గుప్త, జిల్లా పరిషత్ సభ్యులు రాజేష్ మహురియ, మొణ జాని, బొయిపరిగుడ సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ, తహసీల్దార్ స్నిగ్ధ చౌధురి, ఖెందుగుడ పంచాయతీ సర్పంచ్ అభిమణ్య నాయిక్ తో పాటు పలు గ్రామాల ప్రజలు పాల్గొని సహిద్ జవాన్ ఈశ్వర్కు ఘనమైన నివాళులు అర్పించారు. -
శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల సెమినార్
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో రెండురోజులుగా సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలు, డిజిటల్ పేమెంట్స్, వ్యాపారం, నిర్వహణ, సమాజాభివృద్ధిపై సెమినార్ జరుగుతోంది. ఈ రెండు రోజుల సెమినార్ను ముఖ్యఅతిథిగా ఉన్నత విద్యా మండలి ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ నారాయణ బెహరా విచ్చేసి ప్రారంభించారు. అతిఽథి పరిచయం, స్వాగత ఉపన్యాసం కనన్బాలా పాత్రో వ్యవహరించగా, అతిథులుగా స్టార్టప్, ఇన్నోవేషన్ సెల్ (గ్లోబల్ బిజినెస్ స్కూల్, పరిశోధనకేంద్రం) డాక్టర్ ప్రబీర్ చంద్ర పాఢి, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్ర పట్నాయిక్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన మేధావులు, అర్ధశాస్త్ర పరిశోధన బోధకులు, ప్రస్తుత అంతర్జాతీయ బిజినెస్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల భారత వృద్ధి రేటు పెరుగుతుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ నారాయణ బెహరా అన్నారు. కాలంతో పాటు వ్యాపారం, విద్య, గూగుల్పే, ఫోన్పే, ఇతర సాధానాల వల్ల ప్రజల అవసరాలు సకాలంలో తీరడం కాకుండా సమయ పాలన తగ్గుతుందని అన్నారు. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల అనేకమంది ప్రజల డబ్బులు సైబర్ వలలో పడి పోగొట్టుకుంటున్నారని అన్నారు. రెండో రోజు సెమినార్లో కామర్సు విభాగం (బరంపురం విశ్వవిద్యాలయం) డాక్టర్ మహేశ్వర్ శెఠి, గంజాం జిల్లా సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ రథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ
రాయగడ: జిల్లా ఒడియా బ్రాహ్మణ మహా సమాజం ఆధ్వర్యంలో 2026వ ఏడాది వార్షిక క్యాలెండర్ను ఆ సమాజం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది మదన్ మోహన్ పాడి ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక జగన్నాథ మందిరం ప్రాంగణంలో సమాజం సభ్యులు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన వార్షిక క్యాలెండర్ని ఆవిష్కరించడంతో పాటు సమాజం తరుపున కొత్త సంవత్సరంలో నిర్వహించే భవిష్యత్ ప్రణాళిక గురించి సభ్యులతో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన స్థానిక రామకృష్ణ నగర్లో జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. కార్యక్రమంలో సమాజం కార్యదర్శి కిషోర్ పండ, సభ్యులు రంజన్ కుమార్ రథ్, రాజేష్ పాఢి తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డు అదృశ్యం భువనేశ్వర్: ఇంఫా సెక్యూరిటీ గార్డు అదృశ్యం అయ్యాడు. అతడి కోసం విశాఖపట్నంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. దేవ్గడ్ జిల్లాకు చెందిన జితేంద్రియ సాహు చౌద్వార్లోని ఇంఫాలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. చౌద్వార్ నుంచి విశాఖపట్నంకు 3 క్రోమైట్ నిండిన ట్రక్కుల రవాణాకు సాహు ఎస్కార్ట్ బాధ్యతలతో డిసెంబర్ 13న బయలుదేరాడు. డిసెంబర్ 15న విశాఖపట్నం పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. చివరిసారిగా రైల్వే స్టేషన్్ నుంచి మాట్లాడిన తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ నేపథ్యంలో చౌద్వార్ పోలీస్ ఠాణాలో అదృశ్యం కేసు నమోదు చేయబడింది. సీసీటీవీ ఫుటేజ్లను సమీక్షించి అతడు ఎలా, ఎక్కడ అదృశ్యమయ్యాడో పసిగట్టేందుకు దర్యాప్తు బృందం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆయన ఎస్కార్టు బాధ్యతలు నిర్వహించిన ట్రక్ డ్రైవర్లను దర్యాప్తు బృందం ఆరా తీసేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని విశాఖపట్నంకు పంపినట్లు ఏసీపీ అరుణ్ కుమార్ స్వంయి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 24 ఎన్ఏసీలు భువనేశ్వర్: రాష్ట్ర గృహ నిర్మాణం మరియు నగర అభివృద్ధి విభాగం 24 కొత్త నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీలు) ఏర్పాటు కోసం తుది ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ జిల్లాల్లోని 5 ఎన్ఏసీలను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేయడానికి ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 14 జిల్లాల్లో కొత్తగా 24 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీలు) ఏర్పాటు అవుతాయి. ఈ జాబితాలో పల్లొలొహడా, సిములియా, సోహెల, తిహిడి, ధుసూరి, సలేపూర్, బొడొంబా, నరసింగ్పూర్, గొందియా, జగన్నాథప్రసాద్, పత్రాపూర్, నొర్ల, జయపట్న, ఖుర్దా టంగి, బొరిగుమ్మ, బెత్తొనట్టి, బంగిరిపోషి, చిత్రడా, కప్తిపొదా, రాసగోబింద్పూర్ బీర్ మహారాజ్ పూర్ ప్రాంతాలు ఉన్నాయి. బౌధ్, గంజాం మరియు మయూరభంజ్ జిల్లాల్లో 5 మున్సిపల్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. అత్యధికంగా గంజాం జిల్లాలో 3 మిగిలిన 2 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త మున్సిపల్ సంస్థల ఏర్పాటు కోసం ముసాయిదా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో గంజాం జిల్లాలో భంజనగర్, కబి సూర్యనగర్ మరియు పొలొసొర, బౌధ్ జిల్లాలో బౌధ్గడ్, మయూరభంజ్ జిల్లాలో కరంజియా ప్రాంతాలు ఉన్నాయి. -
మజ్జిగౌరి మందిరంలో అభివృద్ధి పనుల పరిశీలన
● సౌకర్యాలపై ఆరా తీసిన దేవదాయ శాఖ కమిషనర్ రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెన్న మంగళవారం సందర్శించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి మందిరానికి మంజూరు చేసిన నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయం నిర్వాహకులు విక్రయిస్తున్న లడ్డూ, పులిహోర ప్రసాదంలో నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీతో సమావేశమై వివరాలు సేకరించారు. అలయానికి భక్తుల ద్వారా వస్తున్న కానుకలకు సంబంధించిన నగదు వివరాలు, వచ్చే ఆదాయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. అమ్మవారి హుండీ ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన ఆ మొత్తం నగదును ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయసింగి బిడిక బదులిస్తూ అమ్మవారికి కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న 16 అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు అభ్యంతరం చెప్పిన దేవదాయ శాఖ కమిషనర్ జెన్న అన్ని అకౌంట్లతో గందరగొళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నార. కేవలం అమ్మవారి పేరిట మూడు అకౌంట్లను మాత్రమే తెరిచి వాటిలో ఆదాయాన్ని నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా రద్దీ సమయంలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం చెల్లిస్తున్న మూడు వందల స్పెషల్ టికెట్టు మంజూరులొ వచ్చిన ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. ఇదేవిషయమై ట్రస్ట్ సభ్యులు, తహసీల్దార్కు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడంపై సమగ్ర స్థాయి దర్యాప్తు చేపట్టాలని అన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ ట్రస్టు సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, రాధాకాంత్ దొలాయి. అకౌంటెంట్ సంగాపు వెంకటరావు ఉన్నారు. -
ధాన్యం విక్రయ కేంద్రాలు తెరవాలని ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ధాన్యం విక్రయ కేంద్రాలు వెంటనే తెరవాలని, ధాన్యం అమ్ముకునే మండీల వద్ద వెయిట్ చార్జీల కటింగ్, చీటింగ్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమంగో రాస్తారోకో ఆందోళన చేపట్టారు. తొలుత సొండివీధి కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉపజిల్లా కారాగారం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో బరంపురం, పలాస, మోహన నుంచి విచ్చే బస్సులు, వాహనాలు గంటసేపు నిలిచిపోయాయి. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఇంతవరకూ రైతులకు న్యాయం చేకూరడం లేదని, వెంటనే మండీలు తెరిపించాలని ప్రభుత్వానికి కోరుతున్నామని డీసీసీ అధ్యక్షులు దాశరథి గొమంగో విలేకరులతో అన్నారు. అయితే జిల్లా అధికారులు డిసెంబరు 30న మండీలు తెరుస్తామని ప్రకటించినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ...అదంతా మాకు తెలియదు..జిల్లా కలెక్టర్, పౌరసరఫరాలశాఖ, ఆర్ఎంసీ, కలెక్టర్ వెంటనే పర్లాకిమిడి, మోహన, కాశీనగర్, గుసాని సమితిల్లో ధాన్యం విక్రయ కేంద్రాలు తెరిచి రైతు ఇంటి వద్ద నుండి మండీలకు తీసుకువెళ్లేవరకూ ప్రభుత్వమే ఖర్చులు భరించాలని, గోనె అంకెం సంచులు డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేయాలని ఎమ్మెల్యే దాశరథి గోమాంగో డిమాండ్ చేశారు. రాస్తారోకో ఆందోళన చేపడుతున్న కాంగ్రెస్ శ్రేణుల వద్దకు సబ్ కలెక్టర్ అనుప్ పండా వచ్చి కలెక్టర్కు రాసిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే వద్ద నుంచి స్వీకరించారు. అనంతరం రాస్తారోకో ఆందోళనను కాంగ్రెస్ పార్టీ నాయకులు విరమించారు. ఈ ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ నాయకులు బసంత పండా, అభిమన్యు పండా, కున్నామఝి, సూర్యనారాయణ పాత్రో, మోహానా, ఆర్.ఉదయగిరి నాయకులు పాల్గొన్నారు. -
విద్యతోనే సమాజ వికాసం
రాయగడ: విద్యతోనే సమాజ వికాసం సాధ్యమవుతుందని జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. సదరు సమితి పితామహల్లోని సెంచురియన్ పబ్లిక్ స్కూల్ 15వ వార్షికోత్సవాన్ని సెన్ఫెస్ట్ పేరిట మంగళవారం స్కూల్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో కాకుండా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సెంచూరియన్ విద్యాసంస్థలు అవిభక్త కొరాపుట్ జిల్లాలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు విద్యాసంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి ఆయా రంగాల్లో మెలకువలు అందించాలన్నారు. ఎంతోమంది విద్యార్థులు క్రీడా రంగంలో ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా గౌరవాన్ని నిలబెట్టారని గుర్తు చేశారు. సెంచురియన్ విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ రాజేష్ పాఢి మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేవిధంగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహిస్తున్నారన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ మహాపాత్రో వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. -
లొంగుబాటు
22 మంది మావోయిస్టులు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టులు పోలీసు కార్యాలంయలో డీజీ వై.బి.ఖురానియా సమక్షంలో మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరు వద్ద నుంచి తొమ్మిది తుపాకులు, 14 టిఫిన్బాక్స్ బాంబులు, బుల్లెట్లు, పేలుడు పదార్ధాలు, ఇతర మావోసామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీజీ వైబీ ఖురానియ మాట్లాడుతూ.. ప్రస్తుతం మావోయిస్టులు చివరి దశలో ఉన్నారన్నారు. ఇంకా ఎవరైన మావో సంస్థలో ఉంటే దళం వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా లొంగుపోయిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన 22 మందిలో ఇద్దరు ఆంధ్రా, ఒడిశా జోనల్ కమిటీ సభ్యులుగా పనిచేయగా మిగిలిన 20 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారన్నారు. లొంగిపోయిన వారినలో మావో ముఖ్యనేత లింగే మడ్కకామ్ ఉన్నారన్నారు. వీరంతా పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారన్నారు. లొంగిపోయిన మావోలపై రూ. 2.25 కోట్ల రివార్డులు ఉన్నట్టు వివరించారు. విలేకరుల మావేశంలో డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, మల్కన్గిరి ఎస్పీ వినోద్ పటేల్, బీఎస్ఎఫ్ డీఐజీ విజయ్ సిన్హా, డీఐజీ కేవీ సింగ్, ఎస్ఐడబ్ల్యూడీ డీఐజీ సంజీవ్ పాండా, యాంటీ నక్సల్ ఆపరేషన్ డీఐజీ అఖిలేశ్వర్ సింగ్, మల్కన్గిరి జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు వీరే.. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లింగే మడ్కమ్, బామన్ మడ్కం, సాక్ ముచకి, ఐత ఔలామి, కోసా కబాసి, బాటి మడ్కం, జోగి ముచకి, రీటా పోడియామి, లీగల్ సోడి, భీమ కల్ము, మాంగ్లి బంజామి, జోగాముచాచి, అడ్మే ముచాకి, ఉర్రగ్, మాదా మద్వి, ముచకి అద్మా, దేబా మద్వి, అర్జున్ మాద్వి, సాగర్ పునెమ్, సోమీ పోడియమి, అనీల్ కావాసీ తదితరులున్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సొమవారం జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుడిని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్ఛాపూర్ పంచాయతీలోని నాగజొరి గ్రామానికి చెందిన పులేన్ ప్రస్కా (23)గా గుర్తించారు. సైకిల్పై కర్రలను తీసుకువెళుతున్న యువకుడి మీదుగా ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. దీంతో సంఘటన స్థలం వద్దే ప్రస్కా మృతి చెందాడు. డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైంని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ.. మరీ అంత ఎక్కువా?
అసలు కంటే కొసరు మక్కువ అనేది నానుడి. ఒడిశా అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని ఇలాగే ఉంది. అసలు కంటే కొసరు కోసం ఎక్కువ ఖర్చు చేసి వివాదంలో చిక్కుకున్నారు. డిపార్ట్మెంట్ అవసరాల కోసం 51 కార్లు కొన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కార్లు కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కార్లకు అదనపు హంగుల కోసం వెచ్చించిన ధర దాదాపు వాహనాల రేటుకు దగ్గర ఉండడంతో వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారుల కొను గోల్మాల్ బయటపడడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.అటవీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కంపెనీకి చెందిన 51 థార్ (Thar) ఎస్యూవీలను కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు రూ.14 లక్షలు చొప్పున 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. తమ విభాగం అవసరాలకు అనుగుణంగా ఈ కార్లలో మార్పులు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేయడంతో సమస్య మొదలైంది. మొత్తం 51 వాహనాలకు అదనపు హంగులతో కలిపి రూ. 12.35 కోట్లు వ్యయం అయినట్టు అధికార పత్రాలు ధ్రువీకరించాయి. దీంతో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.నిగ్గు తేల్చాల్సిందే..బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహూ (Arun Kumar Sahoo) గత మార్చి నెలలో ఈ అంశాన్ని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. అటవీశాఖ కొనుగోలు చేసిన వాహనాలకు అయిన ఖర్చు వివరాలు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్లు కొనడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయితే, అదనపు హంగులకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా స్పందించారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిగ్గు తేల్చాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించారు. వాహనాల కొనుగోలు ప్రక్రియతో పాటు మార్పుల కోసం అయిన ఖర్చులను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.అనవసరంగా ఖర్చు చేస్తే సహించంవాహనాలకు అదనపు హంగుల కోసం పెట్టిన ఖర్చు సహేతుకమా, కాదా అనేది తేల్చేందుకే ప్రత్యేక ఆడిట్ చేయాలని ఆదేశించినట్టు మంత్రి గణేష్ రామ్ సింగ్ (Ganesh Ram Singh Khuntia) తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో కొన్ని మార్పులు చేస్తుంటారని చెప్పారు. అడవుల్లో విధులు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా వాహనాల్లో అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చుతారని తెలిపారు. అయితే అధికంగా లేదా అనవసరంగా చేసే ఎలాంటి ఖర్చునైనా తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.చదవండి: త్వరలో మోదీ 3.ఓ కేబినెట్ విస్తరణ!మార్పులు అవసరంతాము కొనుగోలు చేసిన వాహనాలకు అవసరానికి మించి ఖర్చు చేశామా, లేదా అనేది ఆడిటింగ్ తేలుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తమ శాఖ విధులకు అనుగుణంగా వాహనాలకు మార్పులు చేయడం అవసరమని వారు చెబుతున్నారు. ఫ్రంట్లైన్ సిబ్బంది పెట్రోలింగ్, దావానలం నియంత్రణ, వన్యప్రాణుల రక్షణ, కలప అక్రమ రవాణా నివారణ, పర్యాటకుల జంగిల్ సఫారీల కోసం ఈ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, సత్కోసియా టైగర్ రిజర్వ్, డెబ్రిఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సహా ఇతర ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో విధులకు ఈ కస్టమైజ్డ్ ఎస్యూవీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
33 యూనిట్లు రక్తం సేకరణ
జయపురం: స్థానిక మోటారు ఓనర్స్ అసోసియేషన్, సంబాద్–అమొ ఒడిశా సహకారంతో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక 26వ జాతీయ రహదారిలోని జయపురం మోటార్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన మేగా రక్తదాన శిబిరాన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మీణకేతన దాస్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తం ప్రమాదాలలో గాయపడిన వారికి ఎంతో అవసరం అని అన్నారు. సకాలంలో రక్తం లభించక మరణాలు సంభవిస్తున్నాయని.. అటువంటి మరణాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ రక్తదాన చేయాలని పిలుపు నిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తబాండార్ టెక్నీషియన్లు అభయ చరణ పండ, ప్రతిమ పాత్రో, గురు పొరజ మొదలగు వారు దాతల నుంచి రక్తం సేకరించారు. ఈ సందర్భంగా 33 యూనిట్ల రక్తం సేకరించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులు జి.రమేష్కుమార్, సహాయ కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్, కోశాధికారి ఎస్.రామకృష్ణ పాల్గొన్నారు. టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపికలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు తదితరులు ఈ ఎంపికలను ప్రారంభించారు. మహిళలు, పురుషుల విభాగంలో 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈనెల 27న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో కె.రఘనాథరావు, కేకే రామిరెడ్డి, తిరుపతిరావు, బసవరాజు, జగదీష్, శైలజ, ప్రశాంతి, జానకి, శ్యామలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి: మండల కేంద్రం పోలాకిలో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి పోలాకి వైపు వస్తున్న ఆటో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కనే పున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న పల్లిపేటకు చెందిన ఒక యువకుడు, వెదుళ్లవలసకు చెందిన వృద్ధురాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. హెచ్సీ రామ్జీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొందూరు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో సోమవారం ప్రవచనాలు చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. తల్లి, తండ్రి, గురువును గౌరవించినప్పుడు ఆరోగ్యకరమైన సమాజ స్థాపన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ నూతన చైర్మన్గా వాటర్ రిసోర్స్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ డోల తిరుమలరావు, కార్యదర్శిగా ఐతం కళాశాల ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నూతన కార్యవర్గ ఎన్నిక పరిశీలకులు ముని శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్ పర్యవేక్షణలో నూతన కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. -
‘ఉపాధి’ పేరు మార్చడం తగదు
మల్కన్గిరి: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం కేంద్రంలోని బీజేపీ సర్కార్కు తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పేరు మార్చే విషయంపై పనరాలోచన చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతో రాసిన లేఖను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధానకు సోమవారం అందజేశారు. ఉపాధి పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఒక బిల్లును తీసుకువచ్చి భయంకరమైన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడిందని దుయ్యబట్టారు. ఇది ఒక రాజకీయ కుట్రన్నారు. దీని లక్ష్యం ఒక చారిత్రాత్మకమైన, హక్కుల ఆధారిత ప్రజా సంక్షేమ చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తప్పించడం న్యాయం కాదన్నారు. అదనపు కలెక్టర్ను కలిసినవారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు ఇతర నేతలు ఉన్నారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గుసాని సమితిలో లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్కు నాలుగు పంచాయతీల నుంచి వినతులు వెల్లువెత్తాయి. స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ (ఇన్చార్జి) మునీంద్ర హనగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్తు అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమతి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. లావణ్యగడ, రంప, గారబంద, శోబర పంచాయతీల నుంచి మొత్తం 64 వినతులు రాగా, వాటిలో వ్యక్తిగతం 36, గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 28 ఉన్నాయి. పది మందికి వార్ధక్య, దివ్యాంగుల పింఛన్ పత్రాలు, భూ పట్టాలను జిల్లా కలెక్టర్ మునీంద్ర హనగ లబ్ధిదారులకు అందజేశారు. ఈ స్పందన కార్యక్రమానికి గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్ తహసీల్దార్ నారాయణ బెహరా, తదితరులు పాల్గొన్నారు. కలిమెల సమితిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి చింతాలవాడ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రామస్తులు అందజేసిన 82 వినతులను కలెక్టర్కు స్వీకరించారు. వాటిలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు అదేశించారు. అనంతరం గిరిజనులతో కలెక్టర్ చర్చించారు. గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఎస్పీ వినోద్ పటేల్, మల్కన్గిరి సబ్ కలెక్టర్ అశ్ని ఎ.ఎల్, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర సభోరో, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సహస్ర కలశాభిషేకం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సోమవారం సహస్ర కలశాభిషేకం, శ్రీవారి గరుడవాహాన సేవ రాసూరు గ్రామం వరకు సాగింది. ఈ కార్యక్రమాలు సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, పద్మ దంపతులు ఆధ్వర్యంలో కొనసాగాయి. విద్యావేంకటేశ్వర స్వామి శహస్ర కలశాభిషేకం పూజలను శ్రీకూర్మం ఆచార్యులు సరిసఖ్యాత మహాచార్యులు, ప్రధాన ఆలయ పూజారి ఆరవెళ్లి శేఖరాచార్యులు, ఇతర పండితులతో ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం ప్రసాద సేవనం ఏర్పాటు చేశారు. -
ప్రజల వద్దకు పాలన
రాయగడ: సదరు సమితి జింగిలి గ్రామంలో సోమవారం ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీడీఓ సుజీత్ కుమార్ మిశ్రో, తహసీల్దార్ ప్రియదర్శిణి స్వయి హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై నాటకాన్ని ప్రదర్శించారు. జిమిడిపేట ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ సుభ్రతా పండా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అధికారులకు జంగిలి గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు. గ్రామానికి చెందిన 10 మందికి ఇళ్ల పట్టాలను, మరో ఐదుగురుకి మనొరేగ జాబ్ కార్డులు, మూడు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. నలుగురుకి ఆయుస్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను అందజేశారు. ఏబీబీఓ కాలుచరణ్ నాయక్, సీడీపీఓ నళిని బైరాగి, ఏబీఈఓ బలరాం హుయిక, తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ మేధపై అవగాహన
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో సోమవారం కృత్రిమ మేధ, ఏ.ఐ.క్యూ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్వోషియెంట్) సెమినార్ను వర్చువల్గా వర్సిటీ ఉపాధ్యక్షుడు డి.ఎన్.రావు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కంప్యూటర్ సైన్సు వైజ్ఞానికులు, నిపుణులు దృశ్యశ్రవణ విధానంలో నేటి తరం కృత్రిమ మేధ, చాట్ జి.పి.టి, జెమినీ వంటి సాంకేతిక సాధనాలు అవశ్యకతపై పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ మ్యానేజిమేంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పల్లెసభ నిర్వహించకుండా చెక్డ్యాం నిర్మాణం తగదు
● ఏడీఎంకు ప్రజల ఫిర్యాదు రాయగడ: పల్లెసభ అనుమతి లేకుండా చెక్ డ్యాం నిర్మాణం కొనసాగుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్కు గ్రామస్తులు సోమవారం వినతిపత్రం ను సమర్పించారు. కొరాపుట్ జిల్లా పిపాల్పదర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుటింగగుడ, షియాలిమాల్, బారిగాన్, పిపాల్పదర్, బగ్మారి, కందుపాయ్ గ్రామాలకు చెందిన ప్రజలు, అదేవిధంగా రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి శంకరడ గ్రామ పంచాయతీలొని కరజొల, తయాపుట్, ఖాదికయోడి, కన్సారిగుడ, పుంజిగుమ్మ, శంకరడ, బార్కుతుమి గ్రామాలకు చెందిన ప్రజలు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. కాసీపూర్ సమితిలోని కన్సారిగుడలో నిర్మితం కానున్న ఆదిత్యా అల్యూమిన కంపెనీ కుటింగుడ గ్రామంలో చెక్ డ్యామ్తో పాటు పైప్లైన్ వేయడం వంటి పనులను కొనసాగిస్తున్నారు. గ్రామ సభ అనుమతి లేకుండా ఆయా పనులు ఎలా చేస్తున్నారని గ్రామస్తులు వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ తమ గ్రామాల మీదుగా పారే నదిని చెక్డ్యాం నిర్మాణం ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దీని వల్ల తమ గ్రామాలకు ఆయా నది జలాలు అందక తాగు, సాగునీటికి కరువయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ పనులను నిలిపివేయాలని కొరారు. -
రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షణ భవనాలు ప్రారంభం
జయపురం: జయపురం సమితి ఫూల్బెడ గ్రామంలో 2.9 కోట్ల రూపాయలతో నిర్మించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షణ భవన సముదాయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి సోమవారం ప్రారంభించారు. తొలుత వినాయక ప్రతిమకు పూజలు చేిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల శిక్షక్ష కేంద్రం ఏర్పాటుతో అవిభక్త కొరాపుట్లోగల రాయగడ, కొరాపుట్, నవరంగపూర్, మల్కన్గిరి జిల్లాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లే కాకుండా కలహండి, నువాపడ జిల్లాల్లో నియమితులైన వారందరూ శిక్షణ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శిక్షణ కోసం మరో ప్రాంతానికి వెళ్లే సమస్య తీరిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆన్లైన్ సేవలతో పాటు మొబైల్ యాప్ ద్వారా భూములు కొనేందుకు, అమ్మేందుకు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్, జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం, మచ్చకొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, జిల్లా ఎస్పీ రోహిత వర్మ, ఐఏఎస్ అధికారి సంతోష్ కుమార్ పాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, రెవెన్యూ సూపర్వైజర్ హరిహర శతపది పాల్గొన్నార. -
వివాహిత ఆత్మహత్య
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి భువనపల్లి పంచాయతీ గిన్నిపల్లి గ్రామంలో యోగి మాడీ (26) అనే వివాహిత సోమవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి భర్త ఎంక మాడీతో గొడవ అనంతరం అందరూ నిద్రపోయారు. ఆ సమయంలో పొలం పనుల కోసం తీసుకొచ్చిన పురుగుల మందును యోగి తాగింది. అర్ధరాత్రి వాంతులు రావడంతో గమనించిన భర్త వెంటనే ఆమెను ఎం.వి.79 ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చేందింది. ఐఐసీ చంద్రకాంత్ తండి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన జయపురం: స్థానిక దొలమండప వీధిలో వాగ్దేవి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత జయపురం శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 295 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సతీష్ రెడ్డి, ప్రసాద్ నల్లన, కె.సాయి తేజశ్విణి, ఎన్.ఎస్.సాయి అనూష, అఖిల భారత చిరంజీవి యువత ఒడిశా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా తదితరులు పాల్గొన్నారు. చెట్టు పైనుంచి జారిపడి విద్యార్థి మృతి రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి హటోమునిగుడని రామక్రిష్ణ మిషన్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందాడు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో వంశీ దిసారి (15) ప్రాణాలు కోల్పోయాడు. మిషన్ ప్రాంగణంలోని మామిడి చెట్టు పైకి ఎక్కిన వంశీ కాలుజారి కిందపడిపోయాడు. సమాచారం తెలుసుకున్న మిషన్ నిర్వాహకులు అతన్ని బిసంకటక్లోని క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ఉపాధి పథకం పేరు మార్పుపై ఆందోళన
పర్లాకిమిడి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని (మన్రేగా) కేంద్ర సర్కారు పేరు మార్పు చేయనుండడంతో గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆధ్వర్వంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఘెరావ్ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని మెయిన్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. వలస కార్మికులకు ఉపాధి పథకం ద్వారా ఏడాదికి కనీసం వంద రోజుల పనిదినాలు కల్పించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం చేశారన్నారు. దీనిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయనుండడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రస్తారోకో ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే గోమాంగో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి హాయ్, హాయ్ అని నినాదాలు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రాసిన వినతిని గజపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ మిత్తాలి మధుసూదన్ పాడికి అందజేశారు. ఈ ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, కున్నా మఝి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యనారాయణ పాత్రో, సంజయ్ అధికారి, పాపారావు, అనంత గురు, తదితరులు పాల్గోన్నారు. -
కూలీ మృతదేహానికి అంత్యక్రియలు
మల్కన్గిరి: నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి జారిపడి తీవ్రంగా గాయాలపాలై మల్కన్గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సతీష్కుమార్(22) సోమవారం మృతిచెందాడు. స్వగ్రామానికి మృతదేహం తరలించేందుకు బంధువులు రాకపోవడంతో స్థానిక సమాజ సేవకులు ముందుకొచ్చి మల్కన్గిరి శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. మల్కన్గిరి పురపాలక అధ్యక్షుడు మనోజ్కుమార్ బారిక్, వార్డు మెంబర్ గణేష్ సాహా, కుందన్కుమార్, ఎం.చంద్రరావు పర్యవేక్షించారు. -
పెరగనున్న చలి తీవ్రత
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి వాయువ్య దిశ నుంచి పొడి.. చల్లని గాలుల ప్రవాహం పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో పశ్చిమ గాలుల ఉపసంహరణ ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుతోందని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఉత్సాహంగా ముగ్గుల పోటీలు రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సేవా సమాజ్ సమీపంలోని మైదానంలో ఇడితాల్ పేరిట నిర్వహిస్తున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నర్మదా సాహు, కుడేశ్వరి నాయక్, సౌదామిణి గొమాంగొ తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. గోదాదేవికి విశేష పూజలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా సోమవారం గోదాదేవి అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. అర్చన, తిరుప్పావై ఏడవ పాశుర విన్నపం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంల్లో జరిగిన పూజల్లో భాగంగా గోదా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానిస్టేబుల్కు డీజీపీ అభినందనలు భువనేశ్వర్: కటక్ నగర పోలీసుకు చెందిన కానిస్టేబుల్ రస్మితా సాహు క్రీడా ప్రతిభను గుర్తించి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సోమవారం ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఉత్తరాఖండ్ టెహ్రీలో జరిగిన అంతర్జాతీయ ప్రెసిడెంట్ కప్ – 2025లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఒడిశా పోలీసులకు కీర్తి సాధించింది. ఈ పోటీలో రస్మితా సాహు కానోయింగ్ సి–1 1000 మీటర్ల విభాగంలో రజతం, కానోయింగ్ సి–1 500 మీటర్ల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమెను డీజీపీ సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో తంరడ్రీ కొడుకులకు గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గులిగుడ గ్రామానికి చెందిన గలియాదు బ్రేకబడ, అతని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి కుచేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గలియాదు బ్రేకబడ ద్విచక్ర వాహనంపై అంబొదల గ్రామంలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు కొడకుతో వెళ్తుండగా మునిగుడ నుంచి భవానీపట్నం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని అక్కడే విడిచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కొరాపుట్
● అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా ● పరవ్–25లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడ/కొరాపుట్: కళలు, భాష, సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా కొరాపుట్ నిలుస్తోందని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అన్నారు. కొరాపుట్లో జరుగుతున్న పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా అని, జీవన శైలి, ఆచార వ్యవహారాలు అందరినీ మైమరపిస్తుంటాయని చెప్పారు. ఎంతోమంది అమర వీరులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతి సంపదలకు నియమైన ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సహీద్ లక్ష్మణ్ నాయక్ వంటి స్వాతంత్ర సమరయోధులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. కొరాపుట్ జిల్లా కాఫీ తొటలకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రగతి చెందేలా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కొట్పాడ్లో రూపొందుతున్న చేనేత వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయని చెప్పారు. మిల్లెట్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో 71 హెక్టార్ల విస్తీర్ణంలొ మిల్లెట్లు సాగవుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులకు రు.545 కోట్లు.. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మంజూరైన నిధులతో సుమారు 86 ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మంజూరైన నిధుల్లో రూ.24 కోట్లతో 16 ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మరో రూ.521 కోట్లతో 70 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశ్రామిక ప్రగతి, రహదారులు, మిశన్ శక్తి భవనాల నిర్మాణం, అటవీ సంరక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరవ్ ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను సీఎం మాఝి ఆవిష్కరించారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ మాట్లాడుతూ కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీల భాష, సంస్కృతి, కళారంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అంబరాన్నంటిన సంబరాలు.. పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం సహీద్ లక్ష్మణ్ నాయక్ మైదానంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి మాఝి ప్రారంభించారు. ఎస్హెచ్జీ బృందాలకు చెందిన మహిళలు రూపొందించిన వస్తువులను పరిశీలించారు. వ్యవసాయ శాఖ రైతులకు చైతన్యవంతులను చేయడంతో పాటు భూసంరక్షణ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం పుష్ప ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండ, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ మచ్చ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత తదితరులు హాజరయ్యారు. విద్యుత్ అలంకరణలతో పరవ్–25 ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించారు. -
ఆకట్టుకున్న సంగీత విభావరి
పర్లాకిమిడి: అన్నమయ్య సంగీత కీర్తనలు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుందని కిరణ్మయి పాఠశాల (పాతపట్నం) తిరుపతిరావు మాస్టారు అన్నారు. స్థానిక జంగం వీధి జంక్షన్లో సింహాద్రి అప్పన్న ఫంక్షన్ హాలులో సోమవారం లలిత సంగీత పాఠశాల పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఫ్లూట్ కళాకారుడు వెల్లంకి కూర్మనాథం ఆధ్వర్యంలో సులలిత సంగీత భారతి కార్యక్రమం నిర్వహించారు. సినీ గాయనీ, విజయనగరానికి చెందిన సురభి శ్రావణి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తబలాపై బండారు రమణమూర్తి, కీబోర్డుపై మండా కామేశ్వరరావు, రమణ, వర్ధమాన కళాకారుడు నరేష్ తదితరులు సహకరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామలక్ష్మీ, లలిత సంగీత పాఠశాల అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రవి, మరువాడ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవం అదిరింది..
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లొ ఆదివారం నుంచి కొనసాగుతున్న ఇడితాల్ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. కళాకారులను ప్రోత్సాహించడంతో పాటు ఆదివాసీల భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఇడితాల్ పేరిట ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. లంజియా సవర తెగకు చెందిన ఆదివాసీల కళారంగానికి ప్రతీకగా నిలిచే ఇడితాల్ చిత్రపటాన్ని ఈ సందర్భంగా గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగోకు అందించి సన్మానించారు. కళారంగంలో గొమాంగో హిడెన్ టాలెంట్ పేరిట ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన గిరిధర్ గొమాంగో కళారంగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని సబ్ కలెక్టర్ దిల్లిప్ కొనియాడారు. అనంతరం వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ కుహరో ప్రారంభించారు. కార్యక్రమంలొ గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో, మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివగౌడో పాల్గొన్నారు. -
పశువుల కంటైనర్ బోల్తా
జయపురం: చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న ఒక కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న దాదాపు 40 పశువులు దుర్మరణం చెందాయి. ఈ సంఘటన శనివారం రాత్రి జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి కుమరగాం గ్రామ సమీపంలో జరిగింది. ఆ కంటైనర్లో 50 పశువులు రవాణ చేస్తున్నారని, వాటిలో 40 మరణించగా 10 పశువులు జీవించి ఉన్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు. నేటి ఉదయం కొంత మంది స్వయం సేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కంటైనర్లో చిక్కుకొని ఉన్న 10 పశువులను వారు అతికష్టంతో బయటకు తీసి రక్షించారు. సమాచారం అందుకున్న కొట్పాడ్ తహసీల్దార్ ట్వింకిల్ సెట్టి, కొట్పాడ్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మరణించిన పశువులను ట్రాక్టర్ ద్వారా సమీప అడవిలో ఒక చోటికి చేర్చి వాటిపై తెల్లని కొత్త బట్టలు కప్పి పూడ్చి పెట్టారు. చట్ట వ్యతిరేకంగా పశువులను ఇతర రాష్ట్రానికి తీసుకువెళ్తున్న వ్యక్తులను, డ్రైవర్ని అరెస్టు చేయాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వైభవంగా ..రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఇడితాల్ ఉత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్నాథ మందిరం నుంచి ఆదివాసీ మేళ తాళాలతో, సంప్రదాయ వాయిద్యాలతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాల నడుమ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలు గుణుపూర్ సేవాసమాజ్ సమీపంలోని మైదానంలో నిర్వహిస్తారు. ప్రారంభోత్సవాల్లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి జగన్నాథ మందిరంలో నిలిపారు. అనంతరం అక్కడ నుంచి కలశ యాత్ర ప్రారంభమయ్యింది. సబ్ కలక్టర్ (గుణుపూర్) దుదూల్ అభిషేక్ దిల్లిప్, మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్చైర్మన్ శివ నారాయణ గౌడో, గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజ పండ, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో తదితరులు కలశ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా సబ్ కలెక్టర్ వాయిద్యాలను వాయిస్తూ.. నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం వేదిక వద్ద జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో సబ్కలెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలను ప్రతిఏడాది గుణుపూర్లో ఇడితాల్ పేరిట నిర్వహిస్తుండటం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ ప్రాంతంలోని లంజియా సవర కళలను ఇడితాల్గా పిలుస్తుంటారు కాబట్టి వారి సంప్రదాయాన్ని గౌరవించి ఈ ఉత్సవాలను ఇడితాల్గా గుర్తించి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా దివ్యదర్శన్ వారి స్టాల్ను ఏర్పాటు చేశారు. -
ఘన సత్కారం
పర్లాకిమిడి: దక్షిణ ఒడిశాలో విశిష్ట యువ గాయకుడు డాక్టర్ చందన్ గంతాయత్ను ఒడిశా సంగీత నాటక అకాడమీ ద్వారా కవిచంద్ర కాళీచరణ్ పట్నాయక్ యువప్రతిభా అవార్డు అందుకున్న సందర్భంగా పర్లాకిమిడి క్రియేటివ్ ఆర్ట్స్, పేరొందిన సంస్కృతిక సంస్థ భక్తి నైవేద్యంతో కలిసి సత్కరించారు. ఈ సత్కార సభ స్థానిక కరణం వీధిలో లక్ష్మీనర్సింహ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సత్కార సభకు జిల్లా సాంస్కృతికశాఖ అధికారి అర్చనా మంగరాజ్, సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, నాటకరంగం కళాకారుడు ఆదర్శ దాస్, నృసింహా చరణ్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ చందన్ గంతాయత్ రాయగడ జిల్లా గుణుపురం వాసి అయినా గంజాం జిల్లాలో డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. సంగీత సాధనలో అనేక కార్యక్రమాల్లో డాక్టర్ చందన్ గంతాయత్ పర్లాకిమిడి కళాకారులకు సుపరిచితుడే అని క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షుడు నృసింహా చరణ్ పట్నాయక్ అన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
రాయగడ: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్ర పశుసంవర్ధక, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ అన్నారు. కొరాపుట్లో ఆదివారం జరిగిన పరబ్–25 కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం స్థానిక ప్రేమ్ పహాడ్ను సందర్శించారు. సుమారు కిలోమీటరు దూరం గల ప్రేమ్ పహాడ్ చుట్టూ నడకను కొనసాగించిన ఆయన అనంతరం అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్, పట్టణ ప్రముఖులు ఆయనతో పలు సమస్యలు చెప్పుకున్నారు. ప్రేమ్ పహాడ్కు ఎంతొ మంది వాకింగ్ కోసం వస్తుంటారని వాకర్స్ క్లబ్కు చెందిన బ్రజసుందర్ నాయక్, సత్యవాది పతి తదితరులు వివరించారు. ప్రేమ్ పహాడ్ను సుందరీకరణ చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, పహాడ్ మీద యోగా గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి మల్లిక్ వెంటనే కలెక్టర్ అశుతొష్ కులకర్ణికి ఫోన్ చేసి ఈ ప్రేమ్ పహాడ్ అభివృద్ధికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్లును సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభాతి పరిడ దృష్టికి తీసుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక రంగంగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆయన ఒక టీ దుకాణంలో కూర్చుని టీ తాగారు. అక్కడ ఉన్న జనాన్ని పిలిచి మరీ రాయగడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్, బీజేడీ హయాంలో రాయగడ జిల్లా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడపై ప్రత్యేక దృష్టిని సారించారని మంత్రి మల్లిక్ అన్నారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బ్రజసుందర్ నాయక్ మాట్లాడుతూ మంత్రి ఆకస్మికంగా ప్రజల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకోవడం ఇదే మొదటి సారని అన్నారు. -
వైజ్ఞానిక రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం
రాయగడ: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులను ప్రోత్సాహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అన్నారు. అందుకు ఇటువంటి తరహా సైన్స్ ప్రదర్శనలు దోహద పడతాయని ఆకాంక్షించారు. ఆధునిక యుగంలో అడుగులు వేస్తున్న మనం అందుకు అనుగుణంగా ముందుకు సాగాలంటే అందుకు శ్రద్ధతోపాటు ఏకాగ్రత ఎంతో అవసరమని అన్నారు. ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని.. దానిని వెలుగు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, పాఠశాల ప్రధానొపాధ్యాయురాలు సునీత భొయ్, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ సూపర్వైజర్ దీపక్ కుమార్ బెహర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 11 సమితుల నుంచి 70 పాఠశాలలకు చెందిన 143 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. -
అదుపుతప్పిన మినీ బస్సులు
● 17 మంది ప్రయాణికులకు గాయాలు పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్రగిరి పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న రెండు మినీ బస్సులు కొండ దిగుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి పల్టీ కోట్టాయి. 17 మందికి గాయాలయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. గారబంద పోలీసు అధికారి ప్రఽషాంత్ కుమార్ నిషిక తెలియజేసిన వివరాల మేరకు.. ఖుర్దా, డెంకనాల్ నుంచి రెండు మినీ టూరిస్టు బస్సుల్లో మహేంద్రగిరి పర్వత్వానికి బయలుదేరారు. అక్కడ మందిరాలు దర్శించుకుని తిరిగి బుర్ఖాత్ పాస్ వస్తుండగా ఒక బస్సు బ్రేకులు ఫెయిలయ్యి అదుపుతప్పి రోడ్డు పక్క తిరగబడింది. వెనుక నుంచి వస్తున్న మరో టూరిస్టు బస్సు అదే స్థలం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న కోయిపూర్ వద్ద ప్రాథమిక చికిత్స చేశారు. సంఘటనా స్థలానికి గారబంద పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత కుమార్ నిషిక సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఖోజురిపద సీహెచ్సీ అంబులెన్స్లో పంపించారు. కేసును గారబంద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
రాయగడ: బీజేడీ పార్టీలో కీలకపాత్ర పొషించే స్థానిక రైతుల కాలనీకి చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సమక్షంలో వారంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. బీజేడీకి రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఉన్న వారంతా ఇతర పార్టీలకు వలస పోతున్నారు. తాజాగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఇదే తరహా బీజేడీ (రాయగడ) పార్టీకి సేవలందిస్తున్న యువత కూడా ఆ పార్టీకి దూరమవుతుండటం చూస్తే జిల్లాలో ఆ పార్టీ ఉనికి కొల్పొతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. గత ఎన్నికల్లో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. తుబాటి రాము, వేణు, అరవింద్, మనోజ్, సంతోష్, మహేష్ తదితరులు కాంగ్రెస్లో చేరిన వారిలో ఉన్నారు. -
ఘనంగా సరస్వతి శిశు విద్యామందిర్ వార్షికోత్సవం
పర్లాకిమిడి: సరస్వతి శిశు విద్యా మందిర్లో చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సుసంప్రదాయం ప్రతీక అని ఏడీఎం, ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగా అన్నారు. ఒడిశాలో ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం, ఏ1 గ్రేడ్లు సాధిస్తున్న ఏకై క విద్యాలయం సరస్వతి శిశు విద్యామందిర్ అని అన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ ముఖ్యఅతిథిగా విచ్చేసి సోండివీధి సమీపంలో ఉన్న సరస్వతి శిశు విద్యామందిర్ 36 వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వార్షికోత్సవానికి పోలీసు విభాగం మాజీ సూపరింటెండెంట్ సుభాష్చంద్ర జమాదార్, ఎత్తిపోతల శాఖ, అసిస్టెంటు ఇంజినీరు మనోజ్ కుమార్ చౌదరి, ఉపప్రధాన అచార్యులు సంతోష్ పాడి, విద్యాలయం కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వివిధ క్రీడా పోటీలలో విజయం సాధించినవారికి బహుమతులను ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఆచార్యులు సరోజ్ కుమార్ పండా ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పురస్కారం అందజేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితికి చెందిన సుక్దేవ్, రుక్మిణి జంటకు శనివారం భూవనేశ్వర్లో కనక న్యూస్, సంబాద్ దినపత్రిక తరఫున పురస్కారం అందజేశారు. ఈ జంట 2003 నుంచి కలిమెల దళంలో చేరారు . వీరు ప్రేమించుకోని దళం వదిలి 2014లో వివాహం చేసుకున్నారు. సమితిలో ఉంటూ ఎందరో మావోలను జనజీవనంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత్తం సుక్దేవ్ కలిమెల ల్యాంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజాలకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ జంటకు కనక న్యూస్ మేకర్ 2025 కార్యక్రమంలో భాగంగా పురస్కారన్ని అందజేశారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రైతుబజారు వద్ద ఉన్న చేపల మార్కెట్లో తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ బలరామకృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలు ఉండటంతో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాటాలను కార్యాలయానికి తీసుకెళ్లి నిర్వాహకులకు జరిమానా విధించినట్లు చెప్పారు. -
కాలి బూడిదైన పదెకరాల పంట
జయపురం: పది ఎకరాల్లో పండిన ధాన్యం చేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. జయపురంసబ్డివిజన్ బొయిపరిగుడ సమితి ఖిలోగుడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఖిలోగుడ గ్రామంలో శివ నాయిక్ తనకున్న 10 ఎకరాల పొలంలో ధాన్యం పండించారు. పంట కోసి కళ్లంలో కుప్ప వేశాడు. అయితే సోమవారం అకస్మత్తుగా కుప్పలకు నిప్పు అంటుకుని మంటలు విస్తరించాయి. మంటలు ఆర్పేందుకు అక్కడి రైతులు ప్రయత్నించారు. అంతే కాకుండా వారు బొయిపరిగుడ అగ్ని మాపక విభాగానికి ఫోన్ చేశారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి స్థానికుల సహకారంతో మంటలు ఆర్పారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ఆ కళ్లంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు ఉన్నాయి అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇతర ధాన్యం చేను కుప్పలకు మంటలు విస్తరించకుండా ఆర్పారు. అతిథి గృహం నుంచి మృత దేహం స్వాధీనం భువనేశ్వర్: స్థానిక మైత్రి విహార్ ఠాణా పోలీసులు నాల్కో చౌక్లోని అతిథి గృహం నుంచి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముక్కు నుంచి నురగ, నోటి నుంచి రక్తం రావడంతో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 20వ తేదీన అతడి భార్య ధౌలీ పోలీస్ ఠాణాలో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 19వ తేదీన ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చిట్ట చివరి సారిగా ఫోన్ చేసినట్లు పోలీసులకు వివరించింది. ఆమె ఒక యువతి పేరుతో హత్య ఫిర్యాదు నమోదైంది. సీసీటీవీని తనిఖీ చేసి యువతిని అదుపులోకి నిజాన్ని వెలుగులోకి తెస్తామని పోలీసు దర్యాప్తు బృందం అభయం ఇచ్చింది. భక్తిశ్రద్ధలతో ధనుర్మాస వ్రతాలు రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలతో పాటు వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్వామి వారికి సుప్రభాత సేవలతో పాటు విశేష అలంకరణ, హోమం, అర్చనలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేవించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరునికి పూలు, తులసీ దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చిలికా సరస్సులో మునిగి పర్యాటకుడు మృతి భువనేశ్వర్: పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతం సతొపొడా సందర్శనకు వెళ్లిన పర్యాటకుడు చిలికా సరసులో మునిగిపోయాడు. చిలికా నది ముఖద్వారంలో ఈత కొడుతూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. బఘొముండా తీరంలో గాలించి అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రాయగడలో వైఎస్ జగన్ జన్మదినోత్సవం రాయగడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాలను స్థానిక డైలీ మార్కెట్లో ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎస్.సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొంతమంది పేదలకు అన్నదానం చేయడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బాణసంచాలు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. -
తీగ లాగితే పిస్టల్ బయటకొచ్చింది!
● సీతారత్నం హత్య కేసు దర్యాప్తులో కీలకమలుపు ● పిస్టల్తో సంబంధమున్న ఐదుగురు అరెసు్ట శ్రీకాకుళం క్రైమ్ : నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42) హత్యకేసు మరో కీలక కేసుకు క్లూ అందించింది. సీతారత్నంను కారులో ఎక్కించుకుని ఎచ్చెర్ల కేశవరావుపేట సమీపంలో ఈ నెల 2న హత్య చేసిన నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ వద్ద పిస్టల్ ఉందన్న సమాచారం విచారణ సమయంలో పోలీసులకు తెలిసింది. ఆ పిస్టల్ ఎలా వచ్చింది.. ఎక్కడ దాచావ్ అన్న కోణంలో విచారించగా మరో ఐదుగురు నిందితుల సమాచారం పోలీసులకు చిక్కింది. నిందితులైన పంచిరెడ్డి కై లాస్(బొంతలకోడూరు), అలబాన మణి (గుజరాతీపేట), కలగ ఉమామహేశ్వరరావు (పెద్దపాడు), పూర్ణాన ప్రశాంత్కుమార్ (కోటబొమ్మాళి మండలం నారాయణవలస), దండాసి కార్తీక్ (ఎల్ బీఎస్ కాలనీ, శ్రీకాకుళం)లను అరెస్టు చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ను విచారిస్తున్నప్పుడే.. సీతారత్నం హత్య కేసులో ప్రశాంత్ను డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంలు విచారణ చేస్తున్నపుడు పిస్టల్ ఉందన్న సమాచారం తెలియడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమేనని, ఆ పిస్టల్ నగరంలోని ఎల్బీఎస్కాలనీకి చెందిన దండాసి కార్తీక్కు రూ. 17 వేలకు అమ్మినట్లు చెప్పాడు. ఇదే విషయం ఎస్పీకి తెలియడంతో మరింత లోతుగా దర్యాప్తు చేయమని డీఎస్పీకి ఆదేశించారు. కార్తీక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో తనతో పాటు మరికొందరున్నారని చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫరీద్పేటలో టీడీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన సత్తారు గోపి రెండేళ్లక్రితం బొంతలకోడూరుకు చెందిన పంచిరెడ్డి కై లాస్తో కలసి నేరాలు చేసేందుకు ఒడిశా రాష్ట్రం బరంపురంలో సంతోష్ అనే వ్యక్తి వద్దరూ.90 వేలు పెట్టి పిస్టల్ను, 3 రౌండ్లను కొనుగోలు చేశాడని నిర్ధారించారు. అదే పిస్టల్ను పంచిరెడ్డి కై లాస్ వద్ద తాజా హత్యకేసులో నిందితుడైన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ కొంతమొత్తానికి కొన్నట్లు చెప్పారు. తర్వాత కార్తీక్కు రూ.17 వేలకు అమ్మిన సంగతి తెలిసిందే. పిస్టల్ మళ్లీ అడగడంతో.. కార్తీక్ వద్ద ఉన్న పిస్టల్ను పంచిరెడ్డి కై లాస్, మణి, ఉమామహేశ్వరరావు, పూర్ణాన ప్రశాంత్కుమార్లు మళ్లీ అడగడంతో తండేవలస ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో పిస్ట్ల్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని, అదే సమయంలో రూరల్ ఎస్ఐ రాము తమ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నారన్నారు. అసలు ఆ పిస్టల్ ఎందుకు కొన్నారు.. ఏ నేరం చేయడానికి కొన్నారు.. ఎవరు ఆర్థిక సహాయం చేశారన్నదానిపై దర్యాప్తు చేసి పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐ, ఇతర బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పిస్టల్, మూడు రౌండ్ల మాక్టిన్ -
హంతకుడిని పట్టించిన వాట్సాప్ కాల్
● కేశవరావుపేట వద్ద మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ ● నిందితుడు సంతపేటకు చెందిన ప్రశాంత్గా గుర్తింపు ● వివాహేతర సంబంధమే కారణం శ్రీకాకుళం క్రైమ్ : హత్య కేసులో నిందితుడిని వాట్సాప్ కాల్స్ పట్టించాయి. అదే హంతకున్ని పోలీసులు విచారిస్తున్నప్పుడు మరో కీలక కేసుకు క్లూ లభించింది. ఈ నెల 3న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట హైవే వద్ద బయటపడిన మహిళ మృతదేహం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరానికి చెందిన గురుగుబెల్లి సీతారత్నం (42)ను కేశవరావుపేట వద్ద హత్య చేసి హైవే మీద పడేసింది నరసన్నపేట సంతపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్ (32)గా పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రెండేళ్లుగా పరిచయం.. సీతారత్నంకు నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్కుమార్తో రెండేళ్లక్రితం పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రశాంత్ మొదట్లో పెయింటర్గాను తర్వాతి కాలంలో సొంతంగా ఆటో నడుపుకుంటూ ఓ కారు కూడా కొన్నాడు. ఈ నెల 2న ప్రశాంత్కు సీతారత్నం కలిసి కారులో సింహద్వారం నుంచి కొత్తరోడ్డువైపు సర్వీసురోడ్డులో వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆగారు. తనకు రూ.50 వేలు కావాలని, ఇవ్వకపోతే తన విషయాన్ని భార్యకు చెప్పేస్తానని సీతారత్నం బెదిరించింది. దీంతో సీతారత్నం వల్ల ఎప్పటికై నా ప్రమాదమేనని భావించి కారును ఎచ్లెర్ల వైపు తీసుకొచ్చి జనసంచారం లేని చోట కారు ఆపాడు. సీతరాత్నం చీర చెంగు, పుస్తెల తాడుతో మెడను బిగించి చంపేశాడు. అదేమార్గంలో రెండు మూడు చోట్ల శవాన్ని పడేద్దామన్నా కుదరకపోవడంతో కింతలి మిల్లు జంక్షన్కు వచ్చే సర్వీసురోడ్డు పక్కన శవాన్ని పడేసి, పుస్తెల తాడు, ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్తో పరారయ్యాడు. వాట్సాప్ కాల్సే పట్టించాయి.. 3న మృతదేహం బయటపడటం, పోలీసులు సీతా రత్నం కుటుంబీకుల వాంగ్మూలంతో గుర్తించడం.. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలోని సీఐ ఎం.అవతారం తమ బృందంతో దర్యాప్తు చేపట్టి మృతురాలి వాట్సాప్కాల్స్ మాట్లాడిన నంబర్లను గుర్తించారు. హత్య జరిగిన సమయానికి ముందుగా, కొద్ది రోజులుగా ఎక్కువగా మాట్లాడింది ప్రశాంత్ నంబర్ అని తేలడం.. అడ్రస్ నరసన్నపేట అని ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల్లో కారునెంబరును గుర్తించి నిందితుడు ప్రశాంత్గా నిర్ధారించారు. ప్రశాంత్ చిన్నతనంలోనే ద్విచక్రవాహనాన్ని దొంగిలించి జువైనల్ హోమ్కు వెళ్లాడని ఎస్పీ తెలిపారు. పట్టుకున్నారిలా.. సీఐ అవతారానికి వచ్చిన సమాచారంతో జర్జాం కూడలిలో దాబా వద్ద కారులో ఉన్న ప్రశాంత్ను ఎస్ఐ, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. అతని వద్ద రోల్డ్ గోల్డ్ చైను, బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారం, ఎచ్చెర్ల పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
జీసీడీ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం
రాయగడ: స్థానిక జీసీడీ వాకర్స్క్లబ్కు నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. క్లబ్ అధ్యక్షులుగా జగన్నాధ సాహు, ఉపాధ్యక్షులుగా వివేకానంద సాహు, జామి రాజ, కార్యదర్శిగా ముచ్చి రవి, సహాయ కార్యదర్శిగా కింతలి సురేష్, పొలి వాకర్స్గా గుడ్ల నెహ్రూ, కోశాధికారిగా సుభాష్ చంద్ర బారిక్లు నియమితులయ్యారు. జీసీడీ మైదానంలో ఆదివారం ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో క్లబ్ వ్యవస్థాపకులు సురేంద్ర సాహు, మాజీ అధ్యక్షులు చిన్నారి విజయ్ మోహన్, మనోజ్ రథ్, దీపక్ పృష్టి, అజిత్ కుమార్ సుబుద్ధి పాల్గొన్నారు. కొత్త ఏడాది నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తుందని సభ్యులు తెలిపారు. -
ఖుర్దా రోడ్లో సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025
భువనేశ్వర్: ఫిట్ ఇండియా చొరవలో భాగంగా, ఖుర్దా రోడ్లోని తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా) ఆదివారం సండే ఆన్ సైకిల్–సైక్లోథాన్ 2025 నిర్వహించింది. మండల రైల్వే అధికారులు పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు, సాధారణ ప్రజలలో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ అవగాహన ప్రోత్సాహం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఖుర్దా రోడ్ రైల్వే మండలం సీనియర్ వాణిజ్య అధికారి, క్రీడాధికారి అనిల్ కుమార్, ఎస్ సమక్షంలో అదనపు మండల రైల్వే అధికారి సుభ్రో జ్యోతి మండల్ ఈ సైక్లోథాన్ను ప్రారంభించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన రవాణా విధానాల పట్ల రైల్వేల నిబద్దతకు ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్నారు. -
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్రెడ్డి
గార : ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని శాంతా బయోటిక్ అధినేత పద్మభూ షణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఎన్ఆర్ఐ తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్, సంప్రదాయం డైరెక్టర్ స్వాతిసోమనాథ్, పి.సుగుణాకరరావు ఉన్నారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరా వు, అర్చకులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ ప్రధా న రహదారిపై కొత్తకోటవారి వీధి జంక్షన్ వద్ద ఆదివారం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం తప్పించబోయి డివైడర్పై ఉన్న విగ్రహం దిమ్మను ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యా యి. ఆటో పొందూరు మండలం లోలుగు నుంచి సరుబుజ్జలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెళియాపుట్టి: గొప్పిలి గ్రామంలో రైతు పిట్ట శంకరరావుకు చెందిన వరి కుప్ప కాలిపోయింది. ఆదివారం సాయంత్రం పక్కపొలంలో గడ్డికాల్చడానికి రైతు మంటపెట్టడంతో నిప్పురాజుకుంది. పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చినా పొలాల్లోకి వాహనం వెళ్లడానికి వీలు కాలేదు. గ్రామస్తులు నిప్పు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో 50 సెంట్లకు సంబంధించి సుమారు 13 బస్తాల ధాన్యం కాలిపోయింది. పలాస: కోసంగిపురం జంక్షన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన రాజేంద్ర సబార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు కాశీబుగ్గు ఎస్ఐ ఆర్.నరసింహమూర్తి తెలిపారు. 10.795కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హక్కుల పరిరక్షణ కు పోరాటాలు తప్పనిసరని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపుని చ్చారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభల సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని డైమండ్ పార్క్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఆదివారం నిర్వహించారు. లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం తప్పదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, నాయకులు టి.తిరుపతిరావు, సీహెచ్ గోవిందరావు, శేషు, టి.ముత్యాలరా వు, డి.కిరణ్, వై.సూర్యనారాయణ, బి.అప్పలరాజు, లబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు. సోంపేట: క్రీడలతో పోటీతత్వం పెరుగుతుంద ని సోంపేట ఎస్ఐ వి.లోవరాజు అన్నారు. స్థానిక ధ్యాన్చంద్ స్కేటర్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం స్కేటింగ్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. విజేతలకు ఎస్ఐ చేతు ల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు టి.వెంకటరమణ, టి.ప్రణీత్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుఽలు ఎ.షణ్ముఖరావు, బి.చంద్రావతి పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్గే మ్స్ అండర్–17 బాలికల క్రికెట్ పోటీల్లో విజేతలై తిరిగిరావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీవీ రమణ ఆకాంక్షించారు. విజయవాడలో ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల జట్టు ఆదివారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. -
సెంచూరియన్ వర్సిటీలో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో శ్రీవిద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామివారి మంగళాశాసనం, విశ్వక్షేనారాధన, వాసుదేవ పూర్ణావహాం, సుదర్శన కుంభ ప్రతిష్ట, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం, నిత్యపూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను పర్లాకిమిడికి చెందిన పండితులు అనుమంచిపళ్లి రాజగోపాలాచారి, ఆచారత్వంను సరిసఖ్యాత మమాచార్యులు (శ్రీకూర్మం), అర్చకులు ఆరవెల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు దంపతులు, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మంగళవారం వరకూ క్యాంపస్లో జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలియజేశారు. -
ఏడుగురు విద్యార్థులు సస్పెండ్
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల ప్రాంతంలో ఉన్న నవోదయ విద్యాలయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యాలయంలో శనివారం ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 11వ తరగతి విద్యార్థులు ఘర్షణ చేసిన విద్యార్థులను పిలిచి కొట్టారు. వారికి కేర్ టేకర్ విశ్వజీత్ సర్కార్ సహకరించి మరింతగా కొట్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం పాఠశాల ప్రిన్సిపాల్ రాము రాచాకు తెలియడంతో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించారు. దీనిలో భాగంగా విద్యార్థులను కొట్టిన ఏడుగురు 11వ తరగతి విద్యార్థులను సస్పెండ్ చేశారు. అలాగే కేర్ టేకర్ విశ్వజీత్ను విధుల నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలియజేశారు. -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
జయపురం: జయపురంలో అమాయకులను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన కాటుగాళ్లు మరో ఇద్దరినీ మోసం చేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. జయపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గొడియదొబాసాహిలోకి చెందిన దేబాశిష్ నాయిక్కు ఈనెల 16 తేదీన ఒక కాల్ వచ్చింది. తాము బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి, తాము వాట్సాప్కు పంపించిన ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలని సూచించారు. దీంతో అతడు డౌన్లోడ్ చేశాడు. అనంతరం అనుమానం వచ్చి తర్వాత రోజు తన బ్యాంక్ అకౌంట్ను చెక్ చేయగా, అతడి అకౌంట్ నుంచి రూ.99,970లు మాయమయ్యాయి. వెంటనే అతడు 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. బహుమతి పేరుతో బోల్తా పట్టణానికి చెందిన బీకే పాత్రో సైతం సైబర్ ఉచ్చులో చిక్కుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతడికి గత నెల 30వ తేదీన ఒక కాల్ వచ్చింది. అకౌంట్ బాగా నిర్వహిస్తున్న కారణంగా బ్యాంక్ నుంచి రూ.40 వేలు బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.7,139లు చెల్లించాలని తెలిపారు. అలాగే కొన్ని రోజుల తర్వాత అతడికి మరో ఫోను వచ్చింది. తన బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఫోటో తీసి పంపమని చెప్పారు. అతడు అలాగే చేయడంతో అకౌంట్ నుంచి రూ.7,139లు కట్ అయ్యాయి. మరలా 2027 తర్వాత డబ్బు కట్ చేస్తామని మెసేజ్ వచ్చింది. తనకు ఏ డబ్బు రాకుండా ఎందుకు తన ఖాతా నుంచి డబ్బులు కట్ చేస్తున్నారనే అనుమానంతో జయపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
కోట్పాడ్లో సినిమా షూటింగ్
కొరాపుట్: జిల్లాలోని కోట్పాడ్ పట్టణంలో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎటువంటి హంగామా లేకుండా కోట్పాడ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. కోట్పాడ్కి చెందిన వివేకనంద వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ స్వస్థలంలో షూటింగ్ చేయిస్తున్నారు. ఈ సినిమాకి వరప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోగా వివేక్ వర్మ, హీరోయిన్గా సంకీర్తన, మరో ముఖ్యపాత్రలో కామెడియన్ సప్తగిరి నటిస్తున్నారు. షూటింగ్ను చూసేందుకు సమీప తెలుగు ప్రజలు తరలి వెళ్తున్నారు. మరో 15 రోజులు కోట్పాడ్ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. ఈనెల 25వ తేదీ నుండి భారీ సన్నివేశాల షూటింగ్ జరపనున్నారు.రైతుకు పరిహారం అందజేత జయపురం: ఈనెల 17వ తేదీన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి చికాపూర్ పంచాయతీ డొంగధార గ్రామంలోని ఒక కల్లంలో 4 ఎకరాల్లో పండిన ధాన్యం కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్ద చౌదరి, చికాపూర్ పంచాయతీ సర్పంచ్ రాజు ఖిళో కలిసి గ్రామానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. దీంతో బాధిత రైతు రమేష్ గొలారికి పరిహారంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు. రక్తదాన శిబిరం జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంద్రలోని అరవింద శిక్షా నికేతన్ ప్రాంగణంలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా దాతల నుంచి 33 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన సభ్యుడు యజ్ఞేశ్వర పండ మాట్లాడుతూ రక్తదానం మహత్తర దానమని, మనం ఇచ్చే ప్రతి రక్తపుబొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులను కాపాడుతుందన్నారు. అనంతరం జిల్లా జూనియర్ రెడ్క్రాస్ సాధన సభ్యుడు రాధాశ్యామ్ సాహు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ, కొరాపుట్ జిల్లా సాధన సభ్యుడు జ్యోతీ రంజన్ నంద తదితరులు పాల్గొన్నారు.కోరుకొండ ఐఐసీగా విజయ్కుమార్ మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి నూతన ఐఐసీగా ఆర్.విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఐఐసీ హిమాంశు శేఖర్ బారిక్ను మల్కన్గిరి ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. అందరి సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని విజయ్కుమార్ తెలియజేశారు.ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణశ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
కోత కోసిన వరిపంట దగ్ధం
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి నువగూడ పంచాయతీ ఆర్ఎస్సీ 11 గ్రామంలో కోతకోసిన వంటపంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నలుగురు రైతులు కోత కోసిన పంటను నూర్పు చేసేందుకు ఒక దగ్గర ఉంచారు. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. దీంతో సుబా తామరబువ, మంగళా మల్లిక్, బలరాంహంతాల్, నారాయణ్ ఖిల్కు భారీ నష్టం వచ్చింది. విషయం తెలుసుకున్న చిత్రకొండ అగ్నిమాపక బృందం వచ్చి మంటలను అదుపు చేశారు. అలానే రెవెన్యూ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు. త్వరలో నష్ట పరిహారం అందజేస్తామన్నారు. -
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● ముగిసిన సైన్స్ ఎగ్జిబిషన్మల్కన్గిరిలోని ఉన్నత పాఠశాల అవరణలో జరుగుతున్న రెండు రోజుల సైన్స్ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మాట్లాడుతూ.. ఇటువంటి పోటీల్లో పాల్గొంటే విద్యార్థుల మేధాశక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. మొత్తం 7 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి మంజులత బోయి, మల్కన్గిరి సమితి విద్యాశాఖ అధికారి భగీర్థి బెహరా తదితరులు పాల్గొన్నారు. – మల్కన్గిరి -
ఎయిర్పోర్టుని విస్తరిస్తాం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలోని జయపూర్లో ఉన్న ఎయిర్పోర్టుని విస్తరిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి ప్రకటించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పరబ్ మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025లో శనివారం ప్రసంగించారు. జయపూర్ ఎయిర్పోర్టు విస్తరణ చేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాగా వరుసగా రెండు రోజులుగా పరబ్ కవరేజీ చేస్తున్న మీడియాను పోలీసులు నియంత్రిస్తుండడంతో పాత్రికేయులు ఆందోళనకి దిగారు. దీంతో వారికి అధికారులు సర్ది చెప్పారు. మరోవైపు పాత్రికేయులు సౌమ్య రంజన్, సీహెచ్ భగవతి ఆచారీలు పెన్సిల్ ద్వారా మంత్రి సురేష్ పూజారి చిత్రం గీసి బహుకరించారు. గిరిజనుల సమస్యలపై బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సస్మితా మెలక మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రూపుధర్ బోత్ర, కలెక్టర్ సత్యవాన్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలి
జయపురం: జయపురం ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్న రెవెన్యూ డివిజన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్పెషల్ సర్క్యూట్ హౌస్ ఏర్పాటు చేయాలని జయపురం వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం వికాస్ మంచ్ తరపున మంచ్ సాధారణ కార్యదర్శి నబకృష్ణ చౌదరి మంత్రి సురేష్ చంద్ర పూజారిని కొరాపుట్లో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కమిషన్ కార్యాలయం ఈ ప్రాంతానికి దూరంలో ఉందని, దీనివలన కార్యాలయానికి వచ్చేందుకు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్త చేశారు. అవిభక్త కొరాపుట్ జిల్లాకు కేంద్ర బిందువైన జయపురంలో ఏర్పాటు చేస్తే రెవెన్యూ సంబంధిత విషయాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు ఉన్నారు. -
పరిసరాల శుభ్రత పాటించాలి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ అన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికులు తినుబండారాలు, వాటర్బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో మాత్రమే వేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎం.హాటకేశ్వరరావు, టీఐ–3 ఆచారి, గోవిందరాజులు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, గోవింద్, సిబ్బంది పాల్గొన్నారు. -
సృజన్ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వ విద్యాలయంలో సృజన్ 4.0 పేరిట వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లి ఏఐసీటీఈ అసిస్టెంట్ డైరెక్టర్ (భారత ప్రభుత్వం) డాక్టర్ దీపన్ కుమార్ సాహు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలోని మెగా ఆడిటోరియం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశోధన, ఆధునిక ఆలోచనలతో ఏదైనా ముందుకు సాగుతుందని, అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్కు చెందిన ఐడాస్ టెక్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరక్టర్ కొలూరి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఎల్లవేళలా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు చంద్రధ్వజ్ పండ, డైరక్టర్ జగదీష్ పండ, రిజిస్ట్రార్ ఏవీఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయాలను కాపాడదాం
శ్రీకాకుళం రూరల్ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● రోడ్డు నిర్మించాలని ఆందోళన
గజపతి జిల్లా గుసాని సమితి పాటికోట నుంచి చందనకోలా గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ స్థానికులు శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో పర్లాకిమిడి – ఆర్.ఉదయగిరి, మోహనా 326ఏ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కనీసం అంబులెన్స్ కూడా వెళ్లక అవస్థలు పడుతున్నామని వాపోయారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు వెళ్లి అందోళనకారులతో మాట్లాడారు. సమస్యపై మాట్లాడేందుకు 10 రోజుల గడువు కోరారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. – పర్లాకిమిడి -
గ్రిగ్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : బడివానిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 18, 19 తేదీల్లో అల్లినగరం ఉన్నత పాఠశాల వేదిక జరిగిన నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ పోటీల్లో స్పోర్ట్స్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారని పాఠశాల పీడీ ఆనంద్ శనివారం తెలిపారు. సూరాడ లక్షణ్ 100 మీటర్లు పరుగు, హైజంప్, లాంగ్జంప్, 400 రిలేలో బంగారు పతకాలు సాధించి వ్యక్తిగత చాంపియన్షిప్ కై వసం చేసుకున్నాడని చెప్పారు. మైలపల్లి పోలీసు త్రిపుల్ జంప్లో బంగారు, కాంస్య పతకాలు, ఉప్పాడ ఆది 1500 మీటర్ల పరుగు, త్రిపుల్ జంప్లో రజత పతకాలు, బాలికల విభాగంలో సీహెచ్ చంద్రకళ బంగారు పతకం, రెండు వెండి పతకాలు, ఉప్పాడ స్వప్న రెండు వెండి పతకాలు, మూగి చందు బంగారు, కాంస్య పతకాలు సాధించినట్లు వివరించారు. వీరిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. బ్యాడ్మింటన్ పోటీల్లో.. జి.సిగడాం: నియోజకవర్గ స్థాయిలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. బ్యాడ్మింటన్లో విజేతలుగా నిలిచారు. వీరిని సర్పంచ్ పున్నాన సోనియా, ఎంపీటీసీ మక్క శ్రీలత, హెచ్ఎం ఎస్.భానుమూర్తి, వి.రవికుమార్, బి.వెంకటేష్ శనివారం అభినందించారు. కొచ్చెర్ల విద్యార్థులకు అభినందనలు రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయిలో అల్లినగరంలో జరిగిన గ్రిగ్స్ పోటీల్లో కొచ్చెర్ల హైస్కూల్ విద్యార్థుర్ధులు సత్తా చాటారు. సీనియర్ గర్ల్స్ కోకో, టెన్నికాయిట్, ప్రథమ స్థానంలో నిలవగా జూనియర్ గర్ల్స్ విభాగంలో టెన్నికాయిట్ ద్వితీయ స్థానం సాధించారు. అథ్లెటిక్స్ 100 మీటర్లు, 400 మీటర్లు షాట్ పుట్లో ప్రథమ స్థానం సాథించారు. వీరిని హెచ్ఎం తిరుపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. -
మత్తుతో జీవితం చిత్తు
ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు. ఇంధన పొదుపుతోనే భవిష్యత్ ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆవరణలో శనివారం ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పల్స్ పోలియో తప్పనిసరి గార: ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు కచ్చితంగా వేయాలని గార పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా అన్నారు. ఆదివారం జరగనున్న పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి శనివారం గారలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. 22న నెట్బాల్ ఎంపికలు టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. వివరాలకు 8500007272 నంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ‘ముస్తాబు’ గార: విద్యాశాఖలో నూతనంగా ముస్తాబు కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీధర్ శాలిహుండం కేజీబీవీలో శనివారం ప్రారంభించారు. విద్యార్థినులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిసారించాలన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ఆర్.సత్యన్నారాయణ, మండల ఇంజినీర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ముస్తాబు కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షులు చౌదరి అవినాష్ హాజరై ముస్తాబు కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త యశోదలక్ష్మీ, ప్రధానాచార్యులు పి.పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్యకు సైకిల్ యాత్ర
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో టెంపరీ కాలనీకి చెందిన సునాధర్ ఖరా అనే వృద్ధుడు స్వగ్రామం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. ఇదివరకు ఈయన పూరీ శ్రీమందిరానికి ఇలాగే సైకిల్పై వెళ్లడం జరిగింది. ఆయనకు గ్రామస్తు లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ప్రయాణం దాదాపు 2 వేల కిలోమీటర్లు సాగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటుపర్లాకిమిడి: పట్టణంలో ట్రాఫిక్, నేరాల నియంత్రణకు జిల్లా ఫారెస్టు జంక్షన్ నుంచి పాతకోర్టు జంక్షన్ వరకు 23 చోట్ల 60 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం రూ.28 లక్షలతో కెమారాలు ఏర్పాటు చేసి, నిర్వహణను పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్కు ఎస్పీ జ్యోతింద్ర పండా అప్పగించారు. నూతన సంవంత్సరం నుంచి వీటి పనితీరు ప్రారంభమవ్వనుందని తెలియజేశారు. గంజాయి స్వాధీనం పర్లాకిమిడి: జిల్లాలోని అడవ పోలీసులు 26 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలాఘాట్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక కారును తనిఖీ చేయడంతో గంజాయి బస్తా బయటపడింది. అందులో 26 కిలోల గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి మోహనా కోర్టుకు తరలించినట్లు ఐఐసీ సుబ్రాంత్ పండా తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రాయగడ: చందిలి పోలీస్స్టేషన్ పరిధి డొంగరపడ నాగావళి వంతెనపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. మృతుడు సదరు సమితి అలుబడి పంచాయతీలోని సనొకొసపాడు గ్రామానికి చెందిన అజిత్ జిలకర (17)గా గుర్తించారు. అదేవిధంగా గాయాలు తగిలిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన జితు జిలకరగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనొకొసబడి గ్రామానికి చెందిన జితు, అజిత్లు కొత్త దుస్తులు కొనేందుకు ఒక ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వీరు డొంగరపడ నాగావళి నది బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి జేకేపూర్ నుంచి పేపర్ లోడ్తో రాయిపూర్ వైపు వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైకు డ్రైవింగ్ చేస్తున్న అజిత్ జిలకర లారీ చక్రం కింద పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైకు వెనుక కూర్చున్న జితు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు
ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్పాల్, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్చార్జ్ పీడీ ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
డోర్ డెలివరీ సేవలు వినియోగించుకోవాలి
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కాంప్లెక్స్లోని పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 84 పట్టణాలకు డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం–1వ డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్కుమార్, స్టేషన్ మేనేజర్ మీసాల ప్రసాదరావు, సెక్యూరిటీ సిబ్బంది రామారావు, పార్సిల్ కౌంటర్ సూపర్వైజర్ రాజేష్, కౌంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
సగం కాలిన మృతదేహం స్వాధీనం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబోదల పోలీస్స్టేషన్ పరిధి కుముడాబలి గ్రామంలో సగం కాలిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు చందనతుల డొంగారి (68)గా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా చందనతుల ఒక్కడే తన ఇంట్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడి వద్దనున్న బంగారం, నగదును దుండగులు తీసుకున్న అనంతరం, అతనిని కాల్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కలహండి జిల్లా ఎస్పీ దేవరకొండ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సెలవులపై ఉండడంతో ఇన్చార్జి ఎస్పీగా నాగరాజు వ్యవహరిస్తున్నారు. -
పాఠశాలలో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి పొలమ పంచాయతీ పొడబట్టి గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాఠశాల తలుపులను విరగ్గొట్టి అందులోకి చొరబడ్డాయి. విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని చెల్లాచెదురు చేశాయి. పాఠశాలలోని టేబుల్స్, బెంచీలను విరగ్గొట్టి వీరంగాన్ని సృష్టించాయి. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మూడు ఏనుగులు పాఠశాలలో చొరబడి సామగ్రి ధ్వంసం చేసినట్లు పాఠశాల హెచ్ఎం హలధర్ కౌసల్యకు సమాచారం అందించారు. విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా ఈ సమితి పరిధిలోని పర్శాలి, పొలమ, బుడాగుడ తదితర ప్రాంతాల్లోని ఏనుగులు హల్చల్ సృష్టిస్తున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు. -
నవ్వుపై విద్యార్థులకు శిక్షణ
రాయగడ: స్థానిక ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా గురువు డాక్టర్ బాబూరావు మహాంతి స్థానిక కస్తూరీనగర్లోని బాల్వాడి పాఠశాల విద్యార్థులకు నవ్వుపై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నవ్వుతో ఆరోగ్యంతో పాటు మంచి స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చని అన్నారు. నవ్వువల్ల అలసట వంటివి మటుమాయం అయ్యి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు సహకరిస్తుందని అన్నారు. ప్రతీ విద్యార్థి రోజులో కొంతసేపు తమకు ఇష్టమైన స్నేహితులతో కలసి కాసేపు నవ్వే విధంగా సమయాన్ని కేటాయించాలని అన్నారు. రోజూ క్రమం తప్పకుండా పాటిస్తే వారి దైనందిన చర్యలో భాగమై వారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలరన్నారు. శిక్షణ కార్యక్రమంలో బాల్వడి పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి మాట్లాడుతూ.. చదువుతో పాటు ఇటువంటి ఉల్లాసాన్నిచ్చే కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించే ఇటువంటి తరహా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం విద్యార్థులు నవ్వుతూ కాసేపు గడిపారు. షార్ట్ సర్క్యూట్తో వ్యక్తి మృతి మల్కన్గిరి: షార్ట్ సర్క్యూట్తో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి సోమనాధ్పూర్ పంచాయతీ ఖారిగూఢ గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగు చూడగా.. దినేశ్ లామ్త (28) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కట్టెలు తీసుకురావడానికి దినేశ్ గురువారం మధ్యాహ్నం సమీపంలో అడవికి వెళ్లారు. అయితే చీకటిపడినప్పటికీ ఇంటికీ రాకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు గ్రామంలో, అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం స్థానికంగా ఓ మహిళ చెప్పిన ఆధారాల మేరకు అడవిలో గాలించగా ఓ చెట్టు వద్ద విద్యుత్ తీగకు తగిలి షాక్తో మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న కోరుకొండ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశేష అలంకరణలో గోదాదేవిరాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం గోదాదేవికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానార్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి సుప్రభాత పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
వ్యాన్ బీభత్సం
● మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసంకొరాపుట్: కొరాపుట్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు సాగింది. దీంతో రోడ్డుపై ఉన్న జనం భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు వ్యాన్పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నగదుతో వస్తున్న ఏటీఎం వ్యాన్ ఎగిరి రోడ్డుకి అడ్డంగా పడింది. అందులో అప్పటికే నిండుగా నగదు ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నగదును పోలీస్ వ్యాన్లో సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. గాయపడిన పది మందిని ఆస్పత్రికి తరలించారు. -
రెడ్క్రాస్ సేవలు విస్తృతం చేయాలి
● శిక్షణ శిబిరం ప్రారంభంలో వక్తలుజయపురం: రెడ్క్రాస్ సేవలు విస్తృతం చేయాలని వక్తలు అన్నారు. జయపురం సబ్డివిజన్ కుంద్రాలో శ్రీఅరవింద శిక్షా నికేతన్ వారు జిల్లాస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ అధ్యాయనం, శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా విద్యాధికారి, జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అథ్యక్షులు కరుణాకర్ భుయె అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా రాష్ట్ర జూనియర్ రెడ్ క్రాస్ సాధనకర్మి యజ్ఞేశ్వర పండ, గౌరవ అతిథిగా కుంధ్ర సమితి బీడీవో పి.మనస్మిత, కొరాపుట్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రకళా బగర్ది, విశ్రాంత శారీరక శిక్షణాధికారి బి.ప్రచరణ పండ, కుంధ్ర బ్లాక్ విద్యాధికారి రఘునాథ్ పంగి పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథి కరుణాకర భుయె రెడ్క్రాస్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహరాణ అతిథులకు స్వాగతం పలికి శిబిరం ప్రాధాన్యాన్ని వివరించారు. జిల్లా సాధన కార్యకర్త జ్యోతిరంజన్ నంద అతిథిులను పరిచయం చేశారు. శారీరక క్రీడా శిక్షణ అధికారి లలాటేందు పూజారి మాట్లాడుతూ.. సమాజ సేవలో జూనియర్ రెడ్ క్రాస్ కేడర్ నిర్వహిస్తున్న భూమికను కొనియాడారు. శ్రీఅరవింద శిక్షా నికేతన్, కుంధ్ర ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి సెట్టి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. రెడ్క్రాస్ ఆవిర్భావం, దాని ప్రధాన లక్ష్యం, నీతి నియమాలు, సమాజ సేవలపై అవగాహన కల్పించారు. అగ్ని మాపక సిబ్బంది హాజరై అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి, మంటలను ఎలా ఆర్పాలి, ప్రజలను, ప్రజాధానాన్ని ఎలా రక్షించాలో మాక్ డ్రిల్ ద్వారా చూపారు. ఫైర్ విధాగ అధికారి సరోజ్ కుమార్ బుతియ, సిబ్బంది రుద్రప్రసాద్ బారిక్, రామకృష్ణ గౌఢ, శ్యామలాల్ గోండ్, సుశాంత కుమార్ పండా, అజయ హరిజన్ పాల్గొన్నారు. -
బీఎస్పీలోకి జెడ్పీ మాజీ అధ్యక్షుడు గంగాధర్
రాయగడ: జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల బహుజన్ సమాజ్ పార్టీ తీర్థాన్ని తీసుకున్నారు. ఢిల్లీలోని ఆపార్టీ కార్యాలయంలో బీఎస్పీ అధినేత మాయావతి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో రాయగడ జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీజేడీలో కీలక పాత్ర పొషిస్తున్న గంగాధర్ పువ్వల గత సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొద్ది నెలలు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని బీఎస్పీలో చేరినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితు జకసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ కుమార్ నాయక్లు ఢిల్లీ వెళ్లి అధినేత్రి మాయావతితో గంగాధర్ పువ్వలను పరిచయం చేసిన అనంతరం పార్టీలో చేరినట్లు తెలిసింది. ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా పువ్వల తెలిపారు. -
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ, జాతీయ ఆవిష్కార్ అభియాన్ పథకం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జయపురం విక్రమదేవ్ కాలేజ్ ప్రొఫెసర్ లోకేశ్ హాజరై ప్రదర్శనలను తిలకించారు. జిల్లాకు చెందిన జాతీయ బాల శాస్త్రవేత అవార్డు గ్రహీత, లలితా ఖీలో తన అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణను వేదికపై వినిపించి తోటి బాలలకు ప్రేరణనిచ్చారు. జిల్లాలోని 7 సమితులకు చెందిన మొత్తం 49 శాసీ్త్రయ ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో చోటు దక్కించుకున్నాయి. అందులో ఏడు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు సందీప్త కుమార్దాస్, సనాతన్దాస్, సంజీవ్కుమార్ వైద్య, దేవరాజ్ శేఠి, నిరంజన్ మహరణా, వాసుదేవ్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ఎలుగు దాడిలో వృద్ధునికి గాయాలు
రాయగడ: ఎలుగుబంటి దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు గురైన వ్యక్తి కందురు ప్రస్కాగా గుర్తించారు. ఈ ఘటన కొలనార సమితి పాయికోపొడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడిన కందురు ప్రస్కాను చికిత్స కోసం స్థానిక క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించారు. తన సొంత పొలానికి వెళుతున్న సమయంలో సమీప అడవుల నుంచి రెండు ఎలుగులు వచ్చి ఆకస్మికంగా అతనిపై దాడి చేశాయి. దాడిలో కందురుకు తల, చేతులకు గాయాలయ్యాయి. అగ్నివీర్కు ఎన్సీసీ క్యాడెట్లు ● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్తో పాటు అనేకమంది ఎన్సీసీ–బీ సర్టిఫి కెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శైలజకు అవార్డు శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ తరపున లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆదిభట్ల శైలజ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుపై జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మాజీ సైనికులు, సైనిక వితంతువులకు ఆమె చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా సేవలు అందిస్తున్న బైరి మురళీ కూడా అవార్డు అందుకున్నారు. అలాగే ఇటీవల వీర మరణం పొందిన బైరి గ్రామానికి చెందిన జవాన్ వెంపటాపు రాజు భార్య రూ.50,000ల చెక్కు అందుకున్నారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర సైనిక డిపార్ట్మెంట్ సంచాలకుడు విశ్రాంత బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈక్యూ ఫర్ పీస్తో బీఆర్ఏయూ ఎంవోయూ ఎచ్చెర్ల: ఆన్లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు. మహిళ అదృశ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
పర్లాకిమిడి: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, గజపతి జిల్లా ప్రభారిగా నియమించిన విశ్వేశ్వర టుడు అన్నారు. శుక్రవారం గజపతిజిల్లాలో పర్యటించారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో సాక్షితో మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో వచ్చే పంచాయతీ ఎన్నికలకు పార్టీ మండలాధ్యక్షులతో పార్టీ పటిష్టతపై సమీక్ష జరపనున్నట్టు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2024) జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తక్కువ మెజార్టీతో అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. వాటిపై కూడా చర్చించి తిరిగి జిల్లాలో పార్టీ పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన సవరకంజావీధిలో బీజేపీ కార్యాలయంలో మోహనా, పర్లాకిమిడి నియోజికవర్గాల మండలాధ్యక్షులతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో, మోహనా అభ్యర్థి ప్రసన్న కుమార్ మల్లిక్, పార్టీ సాధారణ కార్యదర్శి జగన్నాఽథ మహాపాత్రో హాజరయ్యారు. విశ్వేశ్వర టుడును కోడూరు నారాయణ రావు సత్కరించారు. ఈ పార్టీ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గేదెల శ్రీధర్నాయుడు, ప్రశాంత్, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, మాజీ చైర్మన్ నృసింహా చరణ్ పట్నాయక్, పార్టీ మహిళా మోర్చా నాయకురాలు అరుణిమా సాహు తదితరులు పాల్గొన్నారు. -
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
● రేపు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ● కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఎంపికలు ● రాణిస్తే నేరుగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికశ్రీకాకుళం న్యూకాలనీ: క్రాస్ కంట్రీ ఎంపికల పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరగనున్న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ(దూరపు పరుగు) ఎంపిక పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సెలక్షన్ కమిటీని, టెక్నికల్ అఫీషియల్స్ను నియమించారు. శనివారం సాయంత్రం తుది మెరుగులు దిద్దనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 నుంచి 500 మంది అథ్లెట్లు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. నాలుగు వయో విభాగాల్లో పోరు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో జరగనున్నాయి. అండర్–16, 18, 20, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. అండర్–16 నుంచి అండర్–20 మధ్య మూడు వయో విభాగాలకు 2012 జనవరి 24 నుంచి 2006 జనవరి 25 మధ్య జన్మించినవారు అర్హులుగా నిర్ణయించారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగానికి 2006 జనవరి 24వ తేదీలోపు జన్మించినవారు అర్హులని సెలక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు(9441570361)ను సంప్రదించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తిలు తెలిపారు. ఎంపికై తే రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ ఎంపికై న అథ్లెట్లను రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. కాకినాడ వేదికగా ఈనెల 24వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నారు. ఇక్కడ రాణించినవారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. కేఆర్ స్టేడియంలో జరిగే ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు గ్రౌండ్కు చేరుకోవాలి. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాస్ కంట్రీ అథ్లెట్స్కు ఇదొక గొప్ప అవకాశం. జిల్లాస్థాయి ఎంపికలను క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికవ్వాలి. అక్కడ రాణిస్తే జాతీయ పోటీలకు ఎంపిక కావచ్చు. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు


