breaking news
Orissa
-
కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025 -
కనరో భాగ్యము
● నేడే పూరీ రథయాత్ర ● సకల ఏర్పాట్లు సంసిద్ధం భువనేశ్వర్: శ్రీక్షేత్రంలో ఉత్సవ ఉత్సాహం కనిపిస్తోంది. ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపద తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో మూల విరాట్లు నవయవ్వన రూపంలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. మరో వైపు శుక్రవారం జరగనున్న యాత్ర కోసం స్వామిని తీసుకుని వెళ్లేందుకు శ్రీ మందిరం సింహ ద్వారం ముంగిటకు చేరాయి. తయారీ ప్రాంగణం నుంచి దక్షిణాభిముఖంగా మూడు కొత్త రథాలు వరుస క్రమంలో శ్రీ మందిరం ముంగిటకు చేరాయి. ఈ యాత్ర ఉభా యాత్రగా సుపరిచితం. అన్న బలభద్ర స్వామి అనుమతితో శ్రీ జగన్నాథుని రథం నందిఘోష్ ముందుగా తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరడం విశేషం. వెంబడి సోదరి దేవీ సుభద్ర రథం దర్ప దళనం బయల్దేరింది. చివరగా బలభద్ర స్వామి రథం తాళ ధ్వజం శ్రీ మందిరం వాకిలికి చేరింది. ఈ దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. నవ యవ్వన దర్శనాన్ని ఉభా యాత్రగా పేర్కొంటారు. సాయంత్రం 4.40 గంటలకు మూల విరాట్ల నుంచి ఆజ్ఞా మాలలు చేరడంతో మూడు రథాలు వరుస క్రమంలో లాగడం ప్రారంభించారు. ముందస్తు సన్నద్ధత ప్రకారం పోలీసుల భద్రత వలయాల మధ్య రథాలు సురక్షితంగా ముందుకు సాగాయి. రాత్రంతా సన్నాహాలు స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా తహతహలాడి పోయారో భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించేందుకు స్వామి అంతకంటే అధికంగా ఆరాటపడడం అద్భుతం. తెల్లారితే పరిపూర్ణ దర్శనంతో నేత్రోత్సాహం కలిగించేందుకు రాత్రి అంతా స్వామి మేలుకొని ఏకాంత సేవకు దూరమయ్యాడు. స్నాన యాత్ర నుంచి 15 రోజుల విరామం తర్వాత దేవతలు నవయువ వేషంలో భక్తులకు నవ యువకునిగా దర్శనం ఇచ్చేందుకు శ్రీ ముఖ అలంకరణ (బొనొకొ లగ్గి)లో తలమునకలయ్యాడు. ఒణొసొరొ చతుర్దశి, ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయ నియమాల ప్రకారం దత్త మహా పాత్రో సేవకులు మూల విరాట్లకు శ్రీ ముఖ సేవతో నవ యవ్వనంగా తీర్చిదిద్దారు. అనంతరం నవయువ దర్శనం సన్నాహాలు ప్రారంభించారు. రథాల పైకి వెళ్లే ముందు శ్రీ మందిరంలో ఆకర్షణీయమైన అలంకరణలో చతుర్థామూర్తులను దర్శించుకోవడం అపురూప అవకాశంగా భక్తులు భావిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ మందిరం దక్షిణ ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. తొలి గంట పరకామణి దర్శనం కల్పించారు. ఆ తర్వాత సర్వ దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు స్వల్ప అంతరాయంతో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్ర పటాల తొలగింపు భారీ స్నానంతో స్వామి అస్వస్థతకు గురి కావడంతో తెరమరుగైన 15 రోజులపాటు ప్రధాన దేవతల ప్రతీకగా దర్శనం ఇచ్చిన చిత్ర పటాల దేవుళ్లను ముందుగా తొలగించారు. చిత్ర పటాలతో పూజలందుకున్న శ్రీ జగన్నాథుని ఉత్సవ మూర్తి మదన మోహనుడు, డోల గోవిందుడు, బలభద్రుని ఉత్సవ మూర్తులు రామకృష్ణులు, నృసింహుని దక్షిణ గృహానికి తరలించారు. శ్రీ దేవి, భూదేవి ఉత్సవ మూర్తుల్ని శయ్యా గృహానికి తరలించారు. అనంతరం బలభద్ర స్వామి ప్రతీక రూపం అనంత వాసుదేవుడు, శ్రీ జగన్నాథుని ప్రతీక చిత్రపట దేవుడు అనంత నారాయణుడు, దేవీ సుభద్ర ప్రతీకగా పూజలందుకున్న భువనేశ్వరి చిత్రటాలను విమలా దేవి ఆలయం సమీపంలో మొండొణి గృహానికి తరలించారు. తెరలు తొలగడంతో చివరగా దేవతలు చికిత్స పొందిన ప్రాంగణంలో మంచం వగైరా తొలగించి కడిగి సున్నం నీరు చిమ్మి శుద్ధి చేశారు. కొఠొ సుంవాసియా సేవకులు ఈ పనుల్లో పాలుపంచుకోవడం ఆచారం. ఈ తంతు అంతా ముగిసే సరికి తెల్లారి పోవడంతో బుధవారం రాత్రి అంతా మెలకువగానే ఉండాల్సి వచ్చింది. నిర్విరామంగా భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించి నేత్రోత్సవం జరుపుకున్నాడు. నేడు రథ యాత్ర స్వామి పూర్తిగా కోలుకుని నవ యువకుని ఉత్సాహంతో యాత్ర కు సిద్ధమయ్యాడు. యాత్ర కోసం రథాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని స్వామి రాక కోసం నిరీక్షిస్తున్నాయి. స్వామి తెర మరుగున ఉన్న రోజుల్లో వేధించిన ఉక్కపోత వాతావరణం సానుకూలంగా మారింది. అదే సమయంలో వరుణ దేవుడు కరుణించే సంకేతాలు లభిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర వారం భారీ నుంచి అతి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. పూరీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఉపరితల గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు ఉంటుందని అంచనా. సింహద్వారం ముంగిటకు రథాలు రథయాత్ర కోసం మూడు రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు సురక్షితంగా చేరాయి. రథాలపైకి మూల విరాటులు తరలించేందుకు వీలుగా అమర్చాల్సిన చారుమళ్లు, రథాలు లాగేందుకు అవసరమైన తాళ్లు తదితర సామగ్రి రథాల ప్రాంగణానికి చేరాయి. రథాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.00 గంటలకు రథాల తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరిన శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం సాయంత్రం 5.40 గంటలకు, తర్వాత సాయంత్రం 5.54 గంటలకు బయల్దేరిన సుభద్ర రథం దర్ప దళనం సాయంత్రం 6.26 గంటలకు, చివరగా సాయంత్రం 6.37 గంటలకు బయల్దేరిన బలభద్రుని తాళధ్వజం రాత్రి 7.15 గంటలకు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు చేరాయి. -
ఈస్టుకోస్ట్ రైల్వే ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మిశ్ర
కొరాపుట్: ఈస్టుకోస్ట్ రైల్వే విభాగ ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మి శ్ర నియమితులయ్యారు. గురువారం ఈస్ట్కోస్ట్ రైల్వే ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ ప్రస్తుతం జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్నారు. ఇకపై నబరంగ్పూర్ జిల్లాలో ఈస్ట్కోస్ట్ రైల్వే శాఖ తరుపున అన్ని కేసులు వాదించనున్నారు. ప్రస్తుతం నబరంగ్పూర్–జయపూర్, నబరంగ్పూర్–జునాఘడ్ రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ అనేక కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కేసులు వాదించడానికి సంతోష్ని నబరంగ్పూర్ జిల్లాలో నియమించింది. యాత్రికులకు జీవిత బీమా భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తులు, యాత్రికులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పూరీ మున్సిపల్ ప్రాంతం పరిధిలో జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం పరిమితం. యాత్ర సమయంలో ప్రమాదాలు, అసహజ మరణాలు, తొక్కిసలాటలు, ఉగ్రవాద దాడులు వంటి ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సౌకర్యాన్ని సేవకులు, శ్రీ జగన్నాథ ఆలయ సిబ్బందికి విస్తరింపజేయడం విశేషం. విద్యుత్ కోతలపై నిరసన కొరాపుట్: విద్యుత్ కోతలను నిరసిస్తూ నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రం విద్యుత్ సెక్షన్ కార్యాలయం ముందు స్థానికులు గురువారం ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైన స్తంభాలు, వైర్లు మార్చాలని, ప్రతీ పంచాయతీకి ఫీడర్ ఏర్పాటు చేయాలని, స్మార్ట్ మీటర్లు తొలగించి, పాత మీటర్లు పునరుద్దరించాలని కోరారు. అలాగే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తి వేయాలని, విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకి సంఘీభావం ప్రకటిస్తూ మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి బైఠాయించారు. రథ యాత్రలో ఉచిత ఆటో సేవలు భువనేశ్వర్: పూరీ రథయాత్రలో ఉచిత ఆటో సేవల సౌకర్యం కల్పించినట్లు రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి బిభూతి జెనా తెలిపారు. యాత్రికులకు 200 ఆటోలు ఉచిత సేవలు అందిస్తాయి. దీంతో ఉచిత ఆహారం సరఫరా అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి పూరీ యాత్ర స్థలానికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసే బస్సులు నిలిపేందుకు 28 ప్రదేశాల్లో పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. హత్య కేసులో మరో ఐదుగురు నిందితులు అరెస్టు రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు ఒక హత్యకేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జుమురుగుడ గ్రామానికి చెందిన శివ సాహు, సంతోష్ సాహు, అమర్ సాహు, పింకూ సాహు, బుడుపలమలు ఉన్నారు. గతేడాది మే 21వ తేదీన జుమురుగుడ గ్రామంలో నివాసముంటున్న భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణపై గ్రామంలో కొందరు అత్యంత దారుణంగా మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో 21 మందిని పద్మపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో గజపతి జిల్లా వలస కూలీ మృతి పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ పంచాయతీ గరడమా గ్రామనివాసి మహేంద్ర బోలియార్సింగ్ (30) పని కోసం కొద్దిరోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం వెళ్లి ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ కింద పడి మృతి చెందినట్టు అడవ పోలీసు అధికారికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మహేంద్ర బోలియార్సింగ్ నుంచి ఎలాంటి సమాచారం గానీ ఫోన్ కాల్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులకు మృతి చెందినట్టు రైల్వే పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో మహేంద్ర కుటుంబసభ్యులు ఎర్నాకుళం నుంచి మృతదేహాన్ని తీసుకురావాలని బీడీఓను కోరారు. -
రథయాత్రకు త్రివిధ భద్రత
● డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ విజయవంతం ● శ్రీ జగన్నాథ ధామ్ యాప్ ప్రారంభం భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధునాతన వ్యవస్థతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జల, స్థల, వాయు మార్గాల్లో యాత్ర సమగ్ర పరిసరాలపై నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో పూరీ శ్రీ మందిరం శిఖరాన డ్రోన్ సంచారం కలవరపరుస్తోంది. యాత్ర పురస్కరించుకుని ఈ బెడద తలెత్తకుండా అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని ప్రవేశ పెట్టారు. పటిష్టమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం శక్తివంతమైన వాహనాలు తదితర సరంజామాతో నిపుణులైన సిబ్బందిని రంగంలోకి దింపారు. ఈసారి కృత్రిమ మేధస్సుని విస్తారంగా ప్రయోగిస్తున్నారు. ఏఐ అనుసంధానంతో పూరీ పట్టణ వ్యాప్త సీసీటీవీ వ్యవస్థ పర్యవేక్షణ, వాహనాల రవాణా తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. భద్రతా యంత్రాంగంతో యాత్రికులు, సాధారణ ప్రజానీకానికి ఏఐ అనుసంధానం అక్కరకు రానుంది. ఈ ఏడాది తొలి సారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా బుధవారం ఈ క్రేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. రథ యాత్ర పురస్కరించుకుని పూరీ పట్టణం వాహనాల రవాణాతో రద్దీగా తయారుకాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రద్దీ పెరుగుదలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ని జారీ చేశారు. ఈ కోడ్ని స్కాన్ చేయడంతో వాహనాల రవాణా తాజా వ్యవస్థని ప్రతి ఒక్కరూ సులువుగా తెలుసుకునేందుకు వీలు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపుల కోసం 112కు డయల్ చేయాలని పూరీ పోలీసు యంత్రాంగం ప్రకటించింది. డ్రోన్ కూల్చివేత రథయాత్రకు ప్రతిపాదించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని బుధవారం ప్రారంభించారు. ఈ వ్యవస్థ తొలి విజయాన్ని సాధించింది. శ్రీ మందిరం శిఖరం ఆకాశ మార్గంలో సంచరిస్తున్న డ్రోన్ కుప్ప కూలింది. దీన్ని పరిశీలించగా శ్రీ మందిరం దక్షిణ ద్వారం పరిసరాల్లో శ్రీ మందిరంపై చక్కర్లు కొడుతున్నట్లు తేలింది. కొత్తగా ప్రారంభించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని దీన్ని కుప్ప కూల్చింది. ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కుప్పకూలిన డ్రోన్ స్వాధీనపరచుకుని నిర్వీర్యపరిచారు. దీని ప్రయోగం పూర్వాపరాలపై విచారణ కొనసాగుతుంది. శ్రీ మందిరం ప్రాంగణనం నో ఫ్లయింగ్ జోన్ పరిధిలో ఉన్నందున డ్రోన్ వినియోగం నిషేధంగా పేర్కొన్నారు. తీర ప్రాంతంలో కోస్టు గార్డుల పహరా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో అవాంఛనీయ, అభ్యంతరకర చొరబాటులు నివారించేందుకు ఈ వ్యవస్థ రాత్రింబవళ్లు పని చేస్తుంది. సాగర తీరంలో కెరటాల్లో కొట్టుకుపోవడం వంటి సంఘటనల నివారణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన లైఫ్ గార్డుల్ని తీరంలో అనుక్షణం అందుబాటులో ఉండేలా నియమించారు. శ్రీ జగన్నాథ ధామ్ యాప్ ఈ ఏడాది యాత్ర సందర్భంగా శ్రీ జగన్నాథ ధామ్ మొబైల్ యాప్ ప్రారంభించారు. దీనిలో దర్శన వేళలు, సేవా బుకింగు, వసతి సమాచారం, ఆలయ సేవలు, నిత్య పూజాదులు, దర్శనం కోసం క్యూ తాజా పరిస్థితి, రథ యాత్ర సౌకర్యాలు, అత్యవసర సేవలు సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది. -
బీజేడీ శ్రేణుల ఆందోళన
కొరాపుట్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లోని విద్యాలయాల ఎదుట బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ పార్టీ యువజన విభాగం బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో కూడా ఆందోళనలు జరగ్గా.. సంఘీభావంగా పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఆందోళను చేపట్టారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి మాట్లాడుతూ.. అమెరికా వంటి దేశం తమ పౌరులలో మహిళలను ఒడిశా వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన దుస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొందన్నారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, తపస్ త్రిపాఠి, మంజులా మజ్జి పాల్గొన్నారు. కొరాపుట్ డీఏవీ కళాశాల మందు జరిగిన ఆందోళనలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మిత మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మున్సిపల్ చైర్మన్ లలిల్ శెఠి హాజరయ్యారు. జయపూర్లోని విక్రందేవ్ యునివర్సిటీ, డాబుగాం, ఉమ్మర్ కోట్లలో జరిగిన ఆందోళనలో బీజేడీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: స్థానిక అటానమస్ కళాశాల మెయిన్ గేట్ వద్ద బుధవారం బీజేడీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిప్పులు చెరిగాయి. బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువయ్యిందని దుమ్మెత్తి పోశాయి. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి దిష్టిబొమ్మను దహనంచేశారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేడీ యువ నాయకులు వినోద్ పొలాయ్, అవినాష్ బిసొయ్, సంతోష్ దొళాయి, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: గంజాం జిల్లా గోపాల్పూర్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన నిరసిస్తూ విపక్ష బీజేడీ ఛత్ర పరిషత్ నాయకులు బుధవారం పర్లాకిమిడి హైస్కూల్ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బీజేడీ ఛత్ర సంసద్ అధ్యక్షుడు త్రిపాఠి హెచ్చరించారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బిశ్వజిత్ త్రిపాఠి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్నాయక్, కాశీనగర్ నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు రఘురాం సాహు, గుసాని జెడ్పీ సభ్యులు శాసనం బాలరాజు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, ఎస్.గజపతిరావు, బీజేడీ యువజన నాయకులు శాసనం లింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రథాలపై నీలచక్రాల అమరిక
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోత్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
గవర్నర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి బుధవారం ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, ఇంధన రంగంలో సంస్కరణలు, వ్యవసాయ రంగం ప్రోత్సాహకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి అన్ని విభాగాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని గవర్నర్ ప్రస్తావించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు రాయగడ: స్థానిక ఉత్కళ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్ వద్ద సరస్వతి శిశు మందిరంలో బుధవారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్ విభాగంలో సొనాలి ప్రధాన్ ప్రథమ, హర్షిత హిమిరిక ద్వితీయ, సంజయ్ బాగ్ తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్ విభాగంలో ప్రజ్ఞాశ్రీ నందో ప్రథమ, శుభశ్రీ పండా ద్వితీయ, శుధాంశు బాల భర్తియా తృతీయ బహుమతులు గెలుపొందారు. కార్యక్రమంలో అసొసియేషన్ అధ్యక్షులు దయానిధి ఖడంగా, రాయగడ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శుభ్ర పండా, ఉత్కళ అల్యూమినియం కర్మాగారం కార్పొరేటర్ అండ్ పీఆర్ఓ పీతాంబర్ బెహరా తదితరులు పాల్గొన్నారు.జనావాసాల్లోకి విషసర్పాలు రాయగడ: జిల్లాలోని మునిగుడలొ కొండప్రాంతాలకు సమీపంలోని వీధుల్లో నివసిస్తున్న ప్రజలు విషసర్పాల బారిన పడి భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా విషసర్పాలు జనవాసాల్లోకి ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో పొదల్లో నుంచి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రమోద్ సాహు అనే వ్యక్తి ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడింది. దీంతో ఆ ఇంటిలోని వారు ఆందోళన చెందారు. స్నేక్స్నాచర్ ద్వారా పామును పట్టించి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమష్టి కృషితోనే వర్సిటీ అభివృద్ధి ●● వీసీ ఆచార్య కేఆర్ రజనీ ● ఘనంగా బీఆర్ఏయూ 18వ వ్యవస్థాపక దినోత్సవం ఎచ్చెర్ల: అందరి సమష్టి కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతోందని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనీ అన్నారు. వర్సిటీ 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ వెనుకబడిన ప్రాంతంలో స్థాపించిన వర్సిటీ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించుకోవాలన్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఇటీవల విడుదలైన పీఎం ఉషా నిధులను వర్సిటీ బలోపేతానికి, మౌలిక వసతులు పెంచేందుకు, నూతన నిర్మాణాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎదైనా సమస్య ఉంటే తనకు నేరుగా తెలియజేయాలన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పరీక్షలకు అబ్జర్వర్లను నియమించాలని అంటున్నారని, అయితే ఇన్విజిలేటర్ ఉండగా పరీక్షల్లో చూచిరాతలకు తావు ఉండదని పేర్కొన్నారు. తక్కువ బడ్టెట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అబ్జర్వర్లను నియమిస్తే అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. వర్సిటీతో పేదలకు ఉన్నత విద్య వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ గిరిజన, పేద వర్గాలకు ఉన్నత విద్యనందించడంలో వర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత మాట్లాడుతూ గత 17 ఏళ్లలో వర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. ప్రగతే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులు, వర్సిటీ వర్గాలు పరిపాలనా వ్యవస్థను దిగజార్చే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శిష్యుడని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వద్ద మంచి పేరు ఉందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
అక్రమ మైనింగ్ అడ్డగింత
కొరాపుట్: అక్రమ మైనింగ్ని అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి లుంగ్రి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే జిల్లా మైనింగ్ అధికారులు సిమిలిగుడ పోలీసులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల రాకను గమనించిన మైనింగ్ చేస్తున్న వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే తవ్వకాల కోసం వినియోగిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్ని అధికారులు సీజ్ చేసి సిమిలిగుడ పోలీస్స్టేషన్కి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
జాతీయ మార్కెట్లో గుర్తింపు తీసుకువస్తాం
కొరాపుట్: తరతరాలుగా కొరాపుట్ జిల్లాలో పేరెన్నిక గల ఉత్పత్తులను జాతీయ మార్కెట్ గుర్తింపు తెస్తామని జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ప్రకటించారు. బుధవారం కలక్టరేట్లో జరిగిన సమీక్షలో ప్రసంగించారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గిరిజనులు పండిస్తున్న కాలా జిర (నల్ల ధాన్యం), కొరాపుట్ కాపీ పంట, కొట్పాడ్లో గిరిజనుల నేత చీరలు ముఖ్యమైనవని అన్నారు. ప్రభుత్వ ఎంఎస్ఎంఈ విభాగంతో కలిసి వీటి మార్కెటింగ్ దేశీయ స్థాయిలో చేస్తామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరాపుట్ బ్రాండ్తోనే విక్రయాలు జరుగుతాయన్నారు. -
నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. జ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిషేకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. -
మహిళలకు రక్షణ లేదు
● వోపీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విచారం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అంశంపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు, ఫోను సంప్రదింపులకు స్పందించ లేదు. లేఖలకు ఆయన సమాధానం ఇవ్వలేదని భక్త చరణ్ దాస్ అన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయబోమని అయితే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని.. సమస్య పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతామన్నారు. –రాష్ట్రపతి దృష్టికి సమస్య.. మహిళల పట్ల అత్యాచారాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రంలో పరిస్థితిని వివరించాలని భావిస్తోంది. గంజాం జిల్లా గోపాల్పూర్, కంధమల్ జిల్లా టికాబలి, కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్ ప్రాంతాలలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలపై నిజ నిర్ధారణ కమిటీ నేరుగా వెళ్లి ఆరా తీసింది.. పర్యటన చివరి రోజున స్థానిక కాంగ్రెస్ భవనన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్ మున్సి మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు కమిటీ నిజ నిర్ధారణ నివేదికను సమర్పిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళల భద్రత కోసం సమయం లేనందున రాష్ట్రంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ఢిల్లీ స్థాయిలో లేవనేత్తుతామన్నారు. -
గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్కి ఫిర్యాదు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్కి బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల ఉద్యమ నేత ప్రపుల్ల సామంత్రాయ్ నేతృత్వంలో ఉద్యమకారులు రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ కంభంపాటి హరిబాబుకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని జొరిగాం సమితి హత్తిబెడ, రాయిఘర్ సమితి నకిటిసిమెద గ్రామాలలో గిరిజనుల నివాసాలను అధికారులు కూల్చి వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు రేగాయి. నబరంగ్పూర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠితో కలసి ప్రపుల సామంత్రాయ్ బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఎటువంటి నోటీసులు లేకుండా అటవీ ప్రాంతాలో గిరిజనుల ఇళ్లను కూల్చి వేశారని గవర్నర్కు వివరించారు. ప్రపుల్ల వెంట సర్వదల్కి చెందిన విశ్వజిత్ రాయ్, మైనింగ్ వ్యతిరేక ఉద్యమ నేత లింగరాజ్ అజాద్లు ఉన్నారు. ఉద్యమానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధం ● జూలై 7న నల్లబ్యాడ్జీలతో విధులకు.. ●14 నుంచి సమ్మెలోకి.. కొరాపుట్: సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతామని రెవెన్యూ మినిస్ట్రీయల్ ఉద్యోగులు వెల్లడించారు. ఈ విషయాన్ని నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకు బుధవారం నోటీసును అందజేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, బీమా రూ. 20 లక్షలు వర్తింపజేయాలని, ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీలు భీర్తీ చేయాలని, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూలై ఏడో తేదీ నుంచి నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు, జిల్లా అధ్యక్షుడు అశుతోష్ మహంతి, మితాలి పట్నాయక్, కై లాష్ చంద్ర దాష్ ఉన్నారు. పర్లాకిమిడిలో ఆక్రమణల తొలగింపు పర్లాకిమిడి: జగన్నాథ రథాయాత్రకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా రథాయాత్ర జరుగనున్న పర్లాకిమిడి పట్టణంలోని రాజవీధి, గుండిచామందిరం, కాలేజ్ రోడ్డు, మార్కెట్ వద్ద ప్రభుత్వ భూమిని ఆక్రమించి, డ్రైనేజీలను వదలకుండా ఆక్రమించిన చిల్లర దుకాణాలు, తోపుడు బండ్లు దుకాణాలను అధికారులు బుధవారం తొలగించారు. హైస్కూల్ జంక్షన్ వద్ద పకోడి, చిరు దుకాణాలను తొలిగించారు. మరోసారి దుకాణాలను రోడ్లపై పెట్టే వారిపై జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అనుప్ పండా హెచ్చరించారు. మార్కెట్కు ఇరువైపులా ఉన్న వాహనాలను కూడా తొలగించారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, తహసీల్దార్ నారాయణ బెహారా, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
రథం నిర్మాణానికి రూ. ఒకలక్ష విరాళం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ జగన్నాథ రథం నిర్మాణానికి జయపూర్ మహారాజు చంద్ర చుడ్ విశ్వేశ్వర్ దేవ్ రూ. లక్ష విరాళం అందజేశారు. బుధవారం నందపూర్ జగన్నాథ మందిర నిర్వాహణ కమిటీ పెద్దలకు జయపూర్ రాజ కోట వద్ద రాజ పరివార సిబ్బంది విరాళం మొత్తాన్ని అందించారు. నందపూర్ రాజధానిగా చేసుకొని సూర్య వంశీయులు పరిపాలన చేశారు. అనంతరం వీరు జయపూర్ని రాజధానిగా మార్చుకున్నారు. నాడు సూర్య వంశీయులు నందపూర్లో స్థాపించిన 17 దేవ దేవి పీఠాలను నేటికీ అక్కడ ప్రజలు కొలుస్తున్నారు. నందపూర్ కమిటీ సభ్యులు జగన్నాథ పంగి, భువనేశ్వర్ దళపతి, బుడు పూజారిలు జయపూర్ రాజమహాల్కి తరలి వచ్చారు. వీరికి రాజ మహాల్ మేనేజర్ కిషన్ కుమార్ నగదు అందజేశారు. రథాయాత్ర రోజున రథం మీద ఉండే ముగ్గురు దేవతా మూర్తులకు ఇచ్చే రాజ విందుకి రాజ ప్రతినిధి హాజరవుతారని రాజ ప్రసాదం సందేశం ఇచ్చింది. -
రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం
భువనేశ్వర్: రథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
రాయగడ: గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సమితి సభ్యులు, సర్పంచులు తమ పరిధిలో గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగు, సాగునీరుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రక, సమితి సభ్యులు, సర్పంచ్లు, ఏబీడీఓ కాళి చరణ్ మాఝి తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ధ్వజం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వివిధ సమితులు, పంచాయతీలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందజేస్తున్న నిధులు గ్రామ సభలు, పంచాయతీ ప్రతినిధుల ప్రామేయం లేకుండానే అధికారులు ఆమోదం తెలుపుతున్నారని గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, మోహనా జెడ్పీటీసీ సభ్యుడు సునీల్ కుమార్ బిషోయి, రాయఘడ సమితి అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 53వ జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత చైర్మన్ గవర తిరుపతి రావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ సి.డి.ఎం శంకర్ కెరకెటా, ఆదనపు పీడీ పృథ్వీరాజ్ మండల్ తదితరులు హాజరయ్యారు. గత జిల్లా పరిషత్ సమావేవాన్ని సమితి చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు బహిష్కరించారు. ఈసారి ఏడు సమితుల బ్లాక్ చైర్మన్లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పలు ప్రభుత్వ పథకాలైన కేంద్ర ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా పథకాలకు మండలాలకు ఎంతెంత నిధులు వె వెచ్చిస్తున్నారో తెలియజేయడం లేదని పలువురు సమితి అధ్యక్షులు ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశానకి జెడ్పీటీసీలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని మోహనా నుంచి వచ్చిన జిల్లా పరిషత్ సభ్యులు ఆరోపించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సమితి చైర్మన్లు కోరారు. -
సీఎం నివాసం ముట్టడి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారిక నివాసాన్ని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చుట్టుముట్టారు. దళితులపై అమానుష దాడులు, మహిళలపై పెరుగుతున్న దారుణాలు, శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజ్ మహల్ చక్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరినీ వ్యాన్నుల్లో తరలించారు. -
ప్రజల వద్దకు అధికారులు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు అధికారులు చేరనున్నారు. తమది ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తరచు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నరు భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రవేశపెట్టిన పలు పథకాల పట్ల అవగాహన కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అట్టడుగు స్థాయి పాలనను మెరుగుపరచడం అనివార్యంగా అధికార యంత్రాంగం గుర్తించింది. వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించడానికి ఉన్నతాధికార వర్గం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన బుధవారం వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్యదర్శులు వివిధ జిల్లాలు విస్తృతంగా సందర్శించాలని ప్రముఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ● అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఏటా జూన్, ఆగస్టు మధ్య వివిధ జిల్లాలకు క్షేత్ర పర్యటనలు చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కార్యాచరణతో వాస్తవంగా లబ్ధిదారులకు చేరుతున్న ప్రయోజనాల్ని విశ్లేషించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్శనలో అధికారులు జిల్లాల్లో కనీసం 2 నుంచి 3 రోజులు బస చేసి పంచాయతీ, మండల స్థాయిలో ప్రజా స్పందనతో పాలన తీరుని సమీక్షిస్తారు. కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించి స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన ఈ కార్యక్రమం లక్ష్యం. దీనిలో భాగంగా అధికారులు గ్రూప్ హెల్త్ సెంటర్లు, గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేస్తారు. -
నాటుసారా స్వాధీనం
మందస: మండలంలోని గుడ్డికోలా గ్రామంలో గురివారి అనే మహిళ నుంచి 40 లీటర్ల నాటుసారా పట్టుకోవడంతో పాటు, సారా తయారీకి వినియోగిస్తున్న 300 లీటర్ల బెల్లంఊటను ఎకై ్సజ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆమెను అరెస్టు చేసి సోంపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దాడుల్లో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుజాత, సిబ్బంది భాను ప్రసాద్, రమణ, వెంకటేష్, ఉమాపతి, విజయ్, మార్కరావు, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్లో తొలిసారిగా రథయాత్ర
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీలో ఈ నెల 27న జరుగనున్న రథయాత్ర కోసం జగన్నాథ రథాన్ని తయారుచేశారు. తొలిసారిగా వర్సిటీ క్యాంపస్లో రథయాత్రను నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు తెలిపారు. తొలుత వర్సిటీకాక ముందు జగన్నాథ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మ్యానేజ్మెంటు ఇంజినీరింగ్ కళాశాల ఉండేది. తదనంతరం సెంచూరియన్ వర్సిటీగా రూపాంతరం చెందింది. క్యాంపస్లో రథయాత్రను నిర్వహించనుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి నిర్మూలనపై స్పష్టమైన ప్రణాళిక ●● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: గంజాయి నిర్మూలన, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ సెంటర్లకు తరలింపుపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5న పాడేరులో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఉంటుందని తెలియజేశారు. గడిచిన 2024–25లో గంజా అక్రమ రవాణాపై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హనీష్ ఆయిల్, 478 వాహనాలను స్వాధీనం చేసుకొని 1,945 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాలు పెడుతున్నామని, 26 స్టాటిక్ చెక్పోస్టుల వద్ద 183 కేసుల్లో 11,047 కిలోల గంజాయి సీజ్ చేసి 469 మందిని అరెస్టు చేశామన్నారు. అదనంగా ఉన్న 298 డైనమిక్ చెక్పోస్టుల వద్ద 237 కేసుల్లో 21,070 కిలోల గంజాయి సీజ్ చేసి 743 మందిని అరెస్టు చేశామన్నారు. రవాణా చేసే ఎనిమిది మంది వ్యాపారుల నుంచి రూ.9.76 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, 1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరిచామన్నారు. 50 మందిపై పీడీ చట్టం, 19 మందిపై పీటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదించామన్నారు. రవాణాలో పాల్గొన్న 527 మందిని, గంజాయితోపాటు ఇతర నేరాల్లో పాల్గొన్న 348 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. 2024–25 కాలంలో 23 కేసుల్లో 40 మంది ముద్దాయిలకు న్యాయస్థానం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిందన్నారు. -
ఇరాన్పై దాడులను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఇరాన్పై అమెరికా దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్వంలో శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్ అవలంభిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి అమెరికా దాడులు విరుద్ధమని దుయ్యబట్టారు. ఇరాన్పై దాడితో క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుందని, దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై దాడులు అమెరికా స్వప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భారత్తో ఇరాన్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. ఈ దాడి ప్రపంచ శాంతి, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్.ప్రకాశరావు, ఎ.సత్యం, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, టి.తిరుపతిరావు, ఎ.లక్ష్మి, బి.సంతోష్, ఆర్.అరవింద్, ఎ.సోమశేఖర్, పి.జగ్గారావు, పి.జనార్దనరావు, ఎన్.సంతోష్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పేదల నివాసాలు కూల్చడం సరికాదు
కొరాపుట్: పేదల నివాసాలు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమా అని బీజేడీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి, మాజీమంత్రి రమేష్ చంద్ర మజ్జి ప్రశ్నించారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లోని తన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గత పది రోజుల్లో జిల్లాలో అనేక చోట్ల పేదల నివాసాలు కూల్చేయడం సరికాదన్నారు. రాయిఘర్ సమితి హత్తబెడాలో 28 మంది పేదల నివాసాలను కూల్చివేయడం దారుణమన్నారు. అదేవిధంగా ఉమ్మర్కోట్ సమితిలో పేదల దుకాణాలు, ఇళ్లు కూల్చేశారన్నారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ఆక్రమణలు తొలగించాలని ఆదేశంపర్లాకిమిడి: స్థానిక హైస్కూల్ జంక్షన్ నుంచి కాలేజీ రోడ్డు, మార్కెట్ జంక్షన్ వరకు ఉన్న దుకాణదారులు బుధవారంలోగా ఆక్రమణలు తొలగించాలని సబ్ కలెక్టర్ అనుప్ పండా ఆదేశాలు జారీ చేశారు. రథయాత్ర జరగనున్న ప్రదేశంలో గుండిచా బడి, చర్చి రోడ్డు వరకు ఉన్న ఆక్రమణలు మంగళవారం తొలగించారు. రానున్న రథయాత్రకు ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో జిల్లా సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, పురపాలక ఈవో లక్ష్మణముర్ము, ఇతర మున్సిపల్ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నారు.డ్రైనేజీ పనులు ఆపాలని వినతిపర్లాకిమిడి: స్థానిక ఎస్కేసీజీ కళాశాల హాస్టల్ వద్ద రోడ్డు విస్తరణలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆపాలని గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పర్లాకిమిడి టౌన్ రోడ్డులో భాగంగా అగ్నిమాపక దళం జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఖంజావీధి నుంచి కాలేజీ రోడ్డు జంక్షన్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆపాలని బీజేపీ నాయకులు బాలకృష్ణ పాత్రో, బబునా బెహరా, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో తదితరులు వినతిపత్రం ఎస్ఈ అభిషేక్ శెఠికి అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణిమా సాహు, ఇందిరా పట్నాయక్, ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.తిరుపతి పాణిగ్రాహికి అవార్డుపర్లాకిమిడి: రాష్ట్రంలో ప్రథమ ప్రైవేటు ఆస్పత్రి హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి భువనేశ్వర్లో టైమ్స్ హెల్త్ ఐకాన్ అవార్డును బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేతులమీదుగా అందుకున్నారు. భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ ఐకాన్ అవార్డు ఉత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హరిబాబు కంభంపాటి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో హైటెక్ గ్రూప్ గత పదేళ్లుగా ముఖ్య భూమిక పోషించిందని గవర్నర్ అభినందించారు. హైటెక్ గ్రూప్స్లో పనిచేస్తున్న డాక్టర్లు సంజయ్ కుమార్ జంగ్దీ, డా.దీపక్ కుమార్ దాస్, హైటెక్ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్ డా.అనిల్ కుమార్ పాణిగ్రాహి, హృద్రోగ నిపుణులు డీన్ ప్రొ.డాక్టర్ అక్షయ కుమార్ సాహు, ప్రొ.డా.అమ్రిత్ పట్టజోషి, సీఈవో జ్యోతిర్మయి పండా, డా.విక్రం కుమార్ సింగ్లు అవార్డులు స్వీకరించారు. -
● క్రీడాకారులకు సత్కారం
భువనేశ్వర్: జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రత్యేక నగదు పురస్కారంతో మంగళవారం సత్కరించారు. 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో సీనియర్ మహిళా వాల్ట్లో కాంస్య పతకం సాధించిన జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ను రూ.75,000లు, 38వ 9 ఏళ్లలోపు చదరంగం ఛాంపియన్ షిప్ – 2025 పోటీలో విజేతగా నిలిచిన బాల క్రీడాకారుడు సాత్విక్ స్వంయికి రూ.30,000ల నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. -
ముక్కు మూసుకొని నడవాల్సిందే..
కొరాపుట్: జయపూర్ పట్టణంలోని 20, 21 వార్డుల్లో అపారిశుద్ధ్యం విలయతాండవం చేస్తోంది. ఎక్కడచూసిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చెత్తపై వర్షం పడుతుండడం వలన దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపారిశుద్ధ్యం వలన దోమలు, ఈగల బెడద పెరిగి రోగాలబారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతినెలా సు మారు రు.73 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వ్య యానికి తగ్గ ఫలితం ఉండడం లేదు. వర్షాలు పడుతుండడంతో డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నా యి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
రాయగడ: ఒక మొబైల్ చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మూడేళ్ల జైలు శిక్షను విధించారు. అదేవిధంగా మరో రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలలు జైలు శిక్షను అనుభవించాలని వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2024 అక్టోబర్ 22వ తేదీన ఆర్యన్కుమార్ శర్మ, మరో వ్యక్తి జిల్లాలోని శశిఖాల్ పోలీస్స్టేషన్ క్యాంప్ హౌస్లో నిద్రించారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు 3 సెల్ఫోన్లు దొంగిలించారు. దీనికి సంబంధించి శశిఖాల్ పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్షయ నాగ్, మోహన్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి విచారించిన ఎస్డీజేఎం దాస్ ఐదుగురు సాక్షులను విచారించిన అనంతరం నిందితులకు శిక్షను ఖరారు చేశారు. తనిఖీలు ముమ్మరం భువనేశ్వర్: రథయాత్ర సందర్భంగా పూరీ పట్టణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా బాంబు పేలుడు తదితర విధ్వంస నిరోధక తనిఖీలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు, సాగర తీరం, వసతి సముదాయాలు, యాత్ర ప్రాంగణాలు తదితర కీలక జన సందోహిత ప్రదేశాల్లో పూరీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ● మర్యాదపూర్వక భేటీ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వీరివురు రాష్ట్ర పాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణను గవర్నర్కు వివరించినట్లు సీఎం తెలిపారు. – భువనేశ్వర్ -
కలకలం..!
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025● పూరీ ఆలయంలో దశ మూలికల మోదకం దొంగతనం ఆరోపణ ● ఫిర్యాదు చేసిన బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ ● ఘటనపై చెలరేగుతున్న దుమారం ● ఆరోపణలు అవాస్తవం: సీఏవో అరవింద కుమార్ పాఢిభువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతున్న తరుణంలో స్వామివారి చికిత్స కోసం ఏర్పాటు చేసిన దశ మూలికల మోదక దొంగతనం ఆరోపణ తీవ్ర కలకలం రేపుతోంది. బలభద్ర స్వామి మూల విరాటు బాడొగ్రాహి ప్రత్యక్షంగా శ్రీమందిరం పాలన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విచారకర ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణ అవాస్తవమని ప్రాథమిక విచారణలో తేలిందని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి తోసిపుచ్చారు. ఆయన అభిప్రాయం ఆధారంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణ పూర్తిగా అబద్ధమని, స్వీయ ప్రచారం కోసం నిరాధారమైన ఆరోపణగా వ్యాఖ్యానించారు. విచారణలో నిజం నిగ్గు తేలితే తెర వెనక వర్గాలపై చర్యలు తప్పవని బాహాటంగా హెచ్చరించారు. మరోవైపు ఘటనపై బిజూ జనతా దళ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదో విపత్కర ఘటనగా పేర్కొన్నారు. లోగడ ఇటువంటి సంఘటనల దాఖలాలు లేవన్నారు. భగవంతుని విషయంలో రాజకీయం తగదని బీజేడీ నాయకుడు లెనిన్ మహంతి హితవు పలికారు. సీసీ టీవీ రికార్డింగు వంటి అనుబంధ ఆధారాలతో ఆరోపణపై విచారణ పూర్తయితే వాస్తవం తేటతెల్లమవుతుందని శ్రీ మందిరం సీఏవో వెల్లడించారు. 70 మోదకాలు తగ్గినట్లు ఆరోపణ తెర చాటున చికిత్స పొందుతున్న మూల విరాటులకు ఆలయ ఆచారం ప్రకారం ఒణొసొరొ ఏకాదశి పురస్కరించుకుని ఈనెల 21న దశ మూలికా మోదకం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవ కోసం సరఫరా చేసిన 313 మోదకాల్లో 70 దశ మూలిక మోదకాలు తక్కువ ఉన్నట్లు బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ మహాపాత్రో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మోదకాలు దొంగిలించినట్లు ఆయన ఆరోపించారు. స్వామి సేవకు ముందు వీటిని స్పర్శించడంతో పవిత్రత లోపించినా గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవ యథాతథంగా కొనసాగించినట్లు వివరించారు. స్వామి గోప్య సేవల కోసం సరఫరా చేసే మోదకాలను లెక్కించడం జరగదు. అనుబంధ వర్గాలు అందజేసే మోదకాలను యథాతథంగా శ్రీమందిరానికి తరలించడం జరుగుతుంది. సంబంధిత సేవాయత్ల సమాచారం ఆధారంగా లాంచనంగా రికార్డు నిర్వహణ కొనసాగుతుందని శ్రీ మందిరం సీఏవో తెలిపారు. ఈ క్రమంలో సీసీటీవీ రికార్డింగ్ ఆధారంగా వాస్తవం బయటపడే అవకాశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శ్రీ జగన్నాథుని బాడొగ్రాహి వర్గాలు ఆరోపణని బలపరుస్తున్నాయి. వివాదస్పదమైన ఆరోపణపై విచారణ జరిపేందుకు శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు, డిప్యూటీ నిర్వాహకుడు మరియు ఆలయ కమాండర్ సభ్యులుగా ప్రత్యేక కమిటీని నియమించారు. విచారణ కాల పరిమితిని స్పష్టం చేయలేదు.న్యూస్రీల్ -
జవానుల బలి దానాలు జాతి మరువదు
కొరాపుట్: జవానుల బలి దానాలు జాతి మరువదని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో అన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎఫ్ సెక్టర్ హెడ్ క్వార్టర్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జవానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కరువవ్వడంతో అలజడులతో ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయితే బీఎస్ఎఫ్ జవానుల రాకతో శాంతి వాతావరణం ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. సమాజ పరిరక్షణలో జవానులు చేసిన బలి దానాలు జాతి గుండెల్లో నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన బీఎస్ఎఫ్ జవానులకు అంజలి ఘటించారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ డీఐజీ సత్యవాన్ ఖంచి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ భద్రతపై అవగాహన అవసరం
భువనేశ్వర్: సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన అవసరమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో సైబర్ భద్రత – మాదక ద్రవ్యాల వ్యసన నివారణపై ప్రజా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రసంగించారు. ఆయనతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా, క్రైమ్ బ్రాంచ్ సీఐడీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రితేష్ మహాపాత్రో ఈ అంశాలపై వివిధ రకాల వివరణాత్మక విషయాలు వివరించారు. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా మారాయన్నారు. అలాగే మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి కోలుకోవడానికి సమయం, ధైర్యం మరియు సరైన మద్దతు అవసరమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.బి.ఎస్.రాజ్పుట్, స్పెషల్ టాస్క్ఫోర్స్ డీఐజీ పినాక్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ హరిబాబు కంభంపాటి -
ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ కన్వర్టర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎనర్జీ అప్లికేషన్స్–2025 (పీఈసీటీఈఏ–2025) సదస్సు విజయవంతంగా ముగిసింది. రవాణా మరియు ఇంధన వ్యవస్థల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ భవిష్యత్తుపై విద్యావేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో చర్చించారు. ఐఐటీ (ఐఎస్ఎం) ధన్బాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుకుమార్ మిశ్రా సదస్సును ప్రారంభించారు. స్థానిక ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్ మాట్లాడుతూ.. విద్యుత్ మరియు రవాణా రంగాల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి పవర్ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే నిమగ్నం చేయడం మరియు ఇంజినీరింగ్ యొక్క సామాజిక విలువకు వారిని బహిర్గతం చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ 2027లో ఈ సదస్సును ద్వైవార్షిక కార్యక్రమంగా మార్చడానికి జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. -
పంచాయతీలుగా గుర్తించండి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి పరిధి బిజాబొండిలి, హటొశశిఖాల్ ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శివపొదొరొ బికాస్ పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ బెహర నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం మంగళవారం బీడీవో కృష్ణచంద్ర దొలొ, అదనపు తహసీల్దార్ సుబేందు సాహులకు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజాభిప్రాయాలను సేకరిస్తోందని, దీనిలో భాగంగా మునిగుడ సమితిలోని శివపదర్ పంచాయతీలో భాగమైన బిజాబొండిలి, హటొశశిఖాల్లను పంచాయతీలుగా గుర్తించగలిగితే ప్రజలు మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉందని వినతిపత్రంలో వివరించారు. జనాభాపరంగా అభివృద్ధి చెందుతున్న శివపదర్ పంచాయతీ మరింత అభివృద్ధి చెందాలంటే కొత్తగా రెండు పంచాయతీల ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో)గా సాయి కిరణ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వన మహోత్సవ వారోత్సవాల్లో అనేక ఔషధ మొక్కలు నాటుతామని తెలియజేశారు. కార్యక్ర మంలో అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మహా ప్రదర్శన కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ మహా ప్రదర్శన చేస్తుందని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి ప్రకటించారు. మంగళవారం జయపూర్ మెయిన్ రోడ్డులోని బంకు మఠం సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీన జయపూర్ పట్టణంలోని పారాబెడలో ఉన్న దసరా పొడియా అందుకు వేదిక కానుందన్నారు. కలహండి జిల్లా మీదుగా పీసీసీ ప్రెసిడెంట్ భక్త చరణ్ దాస్ వస్తారన్నారు. నబరంగ్పూర్ జిల్లా నుంచి అన్నిచోట్ల మెటార్ బైక్లు అనుసరించి జయపూర్ చేరేసరికి 5,000 బైక్ల ర్యాలీ జరుగుతుందన్నారు. కొరాపుట్, మల్కన్గిరి, నబరంగ్పూర్ జిల్లాల నుంచి సుమారు 40 వేల మందితో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ, రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ప్రకటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పవిత్ర శాంత (లక్ష్మీపూర్), మంగులు కిలో (చిత్రకొండ), మున్సిపల్ చైర్మన్లు నొరి మహంతి, శంకరరావు తదితరులు ఉన్నారు. శ్రీముఖలింగం హుండీ ఆదాయం రూ.3.32 లక్షలు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో గడిచిన 112 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3,32,883 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపా రు. పర్యవేక్షణ అధికారి ఆమదాలవలస గ్రూప్ టెంపుల్ అధికారి టి.రవితోపాటు కొమనాపల్లి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు పైడి శెట్టి వెంకటరమణ, అర్చకులు వెంకటాచలం,ధనాల స్వామి,భక్తులు పాల్గొన్నారు. డిగ్రీ 2, 4 సెమిస్టర్ల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభం ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో 2015–18 విద్యా సంవత్సరంలో సీబీఎస్ విధానంలో చదివి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి, 2019లో డిగ్రీలో చేరి ఏవైనా సబ్జెక్ట్లు ఉండిపోయిన సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించి రెండు, నాలుగు స్పెషల్డ్రైవ్ పరీక్షలను మంగళవారం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రతి రోజు జరిగే ఈ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షలను రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య పరిశీలించారు. జూలై 5న జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులు, ఎకై ్సజ్ అధికారులు, బీమా న్యాయవాదులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు పోలీసు వారి దగ్గర నుంచి రావాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ పాల్గొన్నారు. -
రథయాత్ర ఏర్పాట్లు పరిశీలన
కొరాపుట్: ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో రథయాత్ర ఏర్పాట్లను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ పరిశీలించారు. మంగళవారం పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో పర్యటించారు. విశ్వవ్యాప్త రథయాత్ర ఈనెల 27న జరగనుంది. కానీ కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా 28న జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంత సమస్య దృష్ట్యా ఇక్కడ రథయాత్రకి ప్రభుత్వమే అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. కలెక్టర్ నిర్మితమవుతున్న రథాన్ని పరిశీలించారు. ఆరోజు ప్రభుత్వం తరుపున అన్ని శాఖల అధికార యంత్రాంగం యాత్ర వద్ద మెహరించాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం కొఠియాలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించారు. -
బీజేపీ మాక్ పార్లమెంట్
కొరాపుట్: దేశంలో ఎమర్జెన్సీ పాలనని గుర్తు చేస్తూ జయపూర్ పట్టణంలోని పారాబెడా సెంటర్లో ఉన్న బాలకృష్ణ ప్యాలెస్లో బీజేపీ యువ మోర్చా విభాగం మాక్ పార్లమెంట్ మంగళవారం ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయినందున నాటి అరాచకాలు నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించామని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ప్రాథమిక విద్యామంత్రి నిత్యానంద గోండో దేశ ప్రధాని హోదాలో విద్యార్థుల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో (కొరాపుట్), రుపుదర్ బోత్ర (కోట్పాడ్), పార్టీ నాయకులు గౌతం శాంత్ర, బిశ్వ త్రిపాఠి, అభిలాష్ పండా, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
మూల విరాట్లకు శ్రీముఖ సేవ
భువనేశ్వర్: ఆషాఢ అమావాస్య చతుర్దశి జగన్నాథుని సంస్కృతిలో ప్రత్యేకమైంది. ఇది అనవసర చతుర్దశి కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం గోప్య సేవలు అందుకుంటున్న మూల విరాటులకు శ్రీముఖ సేవ నిర్వహించారు. ఏడాది పొడవునా తరచూ ఆలయ గణాంకాల ప్రకారం నిర్వహించే గోప్య సేవల్లో ఇదొకటి. ఏటా ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయం ప్రకారం బొనొకొ లగ్గి సేవ నిర్వహిస్తారు. స్నాన పూర్ణిమ నాటి భారీ స్నానం తర్వాత దేవతలు జ్వరంతో తెర చాటుకు చేరారు. అమావాస్య నాటికి 14 రోజులు పూర్తి అవుతుంది. ఈ వ్యవధిలో ఆరోగ్యం కోసం పలు విధాలుగా తైల మర్దన, లేపన పూత ఇతరేతర ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సతో మూల విరాటుల ముఖాలు మసకబారాయి. స్వామి ఆరోగ్యం కోలుకోవడంతో తెర చాటు నుంచి భక్తజనం మధ్య ప్రత్యక్షం కానున్నాడు. శ్రీముఖ అలంకరణతో భక్తుల మధ్య స్వామి ప్రత్యక్షమై నేత్రానందం ప్రసాదిస్తాడు. దైతపతి సేవకులు గోప్య సేవల్లో భాగంగా పంచమి నాడు ఫులూరి తైల మర్దన మరియు ఏకాదశి నాడు దశమూలికల మోదక సమర్పణ వంటి వైద్య విధానాల చికిత్సతో నయం చేశారు. పవిత్ర ఒణొసొరొ చతుర్దశి మరియు ఆషాఢ అమావాస్య తిథి పురస్కరించుకుని మంగళవారం శ్రీమందిరంలో చిత్రపటం ప్రతినిథి దేవుళ్లకు బొడొ సింగార ధూపం తర్వాత ఒణొసొరొ పౌరాణికం మరియు చొకొట భోగం నివేదించారు. వెంబడి దత్త మహాపాత్రో సేవకులు ఒణొసొరొ ప్రాంగణంలోనికి ప్రవేశించి శ్రీముఖ అలంకరణ పూర్తి చేశారు. అనంతరం దైతపతులు లోపలికి తదుపరి సేవలు, ఉపచారాలు కొనసాగించారు. -
అమరులైన గిరిపుత్రులకు నివాళులు
కొరాపుట్: అమరులైన గిరిపుత్రులకు దళిత్ సమాజ్ నివాళులర్పించింది. మంగళవారం సాయంత్రం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి కుమిలి గ్రామ పంచాయతీ జంధర్ గ్రామంలో స్మారక స్థూపం వద్ద సంతాపం కార్యక్రమం జరిగింది. 2001 జూన్ 24వ తేదీన అక్కడ గిరిజనులు భూ హక్కుల కోసం పోరాటం చేయగా, జరిగిన గొడవల్లో బెంగాలీ శరణార్థుల చేతిలో బన్సింగ్ గోండో, అయితర్ రవుత్ అనే గిరిజనులు మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి భూ హక్కుల కోసం దళిత్ సమాజ్ ఆవిర్భవించింది. దళిత్ సమాజ్కి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ గోండో, సుఖదేవ్ గోండో తదితరులు హాజరై నివాళుర్పించారు. -
రైతుల ఆందోళన
కొరాపుట్: పట్టణంలో జాతీయ రహదారి 26పై జిల్లా కేంద్ర ఆస్పత్రి సమీపంలో ఆర్ఎంసీ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకి దిగారు. ధాన్యాన్ని చిన్న వాహనాలతో తీసుకొస్తున్నారని వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. ధాన్యంను పెద్ద లారీల్లో తీసుకు రావాలని సూచించారు. లేకుంటే తమకు అదనపు పనిభారం పడుతోందని అధికారులు చెప్పారు. దీంతో రైతులు తమకు పెద్ద వాహనాలు లభ్యమవ్వడం లేదని వివరించారు. అయినప్పటికీ ధాన్యం తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతుల రోడ్డుకి అడ్డంగా బైఠాయించారు. రైతుల ఆకస్మిక ఆందోళనతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇలా ముందస్తు ప్రకటన లేకుండా వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దని ప్రజలు రైతులను విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి అభ్యర్థనలు పెరగడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇది తెలిసిన జిల్లాస్థాయి ఉన్నతాధికారులు వెంటనే రైతుల ధాన్యం తీసుకోవాలని ఆదేశించారు. -
శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. -
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలైనా అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలను సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసినందువలన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు(ఎఫ్.ఆర్.ఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. వేధింపులకు పాల్పడుతున్నారు కోటబొమ్మాళి మండలంలో అంగన్వాడీలపై అధికార పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత నెలలో ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను రాజకీయ కక్షలతో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన అంగన్వాడీల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమవతి, పి.లతాదేవి, కె.సుజాత, జె.కాంచన, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, పి.రమణమ్మ, వి.హైమవతి, కె.మోహిని, జ్యోతి, టి.రాజేశ్వరి, వై.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
పర్లాకిమిడి: బహుముఖ ప్రతిభాశాలి, అసాధారణ వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను స్థానిక రాజవీధిలోని విశ్వనాథ్ మండపంలో బీజేపీ శ్రేణులు సోమవారం జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నవకిశోర్ శోబోరో ముఖర్తీ చిత్రపటానికి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కేవలం 33 ఏళ్లకే కోల్కోతా వర్విటీలో ఉపకులపతిగా పనిచేశారన్నారు. అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ క్యాబినేట్లో పనిచేసిన ముఖర్జీ జమ్ము, కశ్మీర్లో ఆర్టికల్ 370 వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఛిత్రి సింహాద్రి, కాశీనగర్ నాయకులు రొక్కం రాంప్రసా ద్, ఎంపీప్రతినిధి దారపు రాజేష్ కుమార్, రొక్కం సతీష్, ఎస్.శేషగిరిరావు (గుమ్మ) పాల్గొన్నారు. గ్రీవెన్స్సెల్కు 22 వినతులు పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కిడిగాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్ సెల్కు అధిక స్పందన లభించింది. గ్రీవెన్స్కు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణాధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, కాశీనగర్ సమితి చైర్మన్ బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కాశీనగర్ సమితిలో గోరిబంద, హడ్డుబంగి, శియ్యాళి, కిడిగాం గ్రామాల నుంచి 22 వినతులు అందాయి. వాటిలో తొమ్మిది వ్యక్తిగతం, 13 గ్రామసమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కాశీనగర్ బి.డి.ఓ.డంబుధర మల్లిక్కు ఆదేశించారు. గ్రీవెన్సుకు కాశీనగర్ తాహసీల్దార్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, డీఎస్.యస్.ఓ. సంతోష్ కుమార్ నాయక్ ఉన్నారు. గోపాల్పూర్ అత్యాచారం సంఘటనపై తాఖీదులు జారీ భువనేశ్వర్: గంజాం జిల్లా గోపాల్పూర్లో మహిళా కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మరియు పోలీస్ డైరెక్టర్ జనరల్కు సోమవారం తాఖీదుల జారీ చేసింది. 2 వారాల్లోగా ఈ అధికారులు వివరణాత్మక నివేదిక దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. వెబ్ పోర్టల్ ప్రారంభంభువనేశ్వర్: రాష్ట్రంలో పిల్లల సంక్షేమం, పిల్లల పోషణ, పిల్లల రక్షణ రంగాల పని శైలి మెరుగుపరిచేందుకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, ప్రభాతి పరిడా శిశు వెబ్పోర్టల్ను సోమవారం ప్రారంభించారు. ఈ పో ర్టల్ ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహారాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ వెబ్ పోర్టల్ శిశు పౌష్టికత, చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 10 98ను సమన్వయం చేస్తుంది. మిషన్ వాత్సల్య, య శోద, దీక్ష వంటి పథకాల నవీకరించిన సమా చా రాన్ని ఈ పోర్టల్ ప్రజలకు తెలియజేస్తుంది. -
కూలిన భారీ చెట్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి మూడురోడ్ల కూడలి వద్ద ఉన్న భారీ చింత చెట్టు సోమవారం తేల్లవారి జామున ఇదురుగాలులకు పడిపోయింది. చెట్టు విద్యుత్ స్తంభంపై పడింది. సమీపంలో ఉన్న ఓ ఇంటి గోడను తాకింది. ఇంటిలో నివసిస్తున్న వారు అంతా బయటకు వచ్చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో విద్యుత్ను నిలిపివేశారు. అగ్నిమాపిక బృందానికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ అధికారి సునీల్ నాయక్ పర్యవేక్షణలో చెట్టును తొలగించారు సుమారు ఐదు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులో మునిగి మహిళ మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీసుస్టేషన్ పరిధిలో తాండబాయిలో సోమవారం గ్రామానికి చెందిన శింగేసాంధి (31) దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లింది. వర్షం వల్ల బురదగా ఉండటంతో కాలు జారి చెరువులో పడిపోయింది. ఆమె ఇంటికి ఎప్పటికీ రాకపోవడంతో భర్త గ్రామంలో ఆరా తీశాడు. ఆమె చెరువు వద్దకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. చెరువు వద్దకు వెళ్లి చూ స్తే ఆమె చీర నీటిలో తేలుతూ కనిపించింది. వెంటనే గ్రామ సర్పంచ్కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను బయటకు తీశారు. అప్పటికే మృతిచెందింది. పోలీస్ స్టేషన్ ఐఐసీ కృష్ణచంద్ర తండి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతదేహాన్ని కూటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. విజిలెన్స్ వలలో సీడీపీఓ, క్లర్క్లు రాయగడ: జిల్లాలోని బిసంకటక్ లో గల ఐసీడీఎస్ కార్యాలయంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి (సిడిపిఒ) సుశీల సబర్, క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్న రామచంద్ర పాత్రో లు సొమవారం విజిలెన్స్ వలలో చిక్కుకున్నా రు. సమితిలోని చాటికొన పంచాయతీలోని హుతేషి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న సీత వడక నుంచి రూ.80 వేలు లంచంగా తీసుకుంటూ ఉండగా విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తల నియమకానికి సంబంధించి హుతేషి గ్రామానికి చెందిన ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒకరి నుంచి వీరిద్దరూ లంచం డిమాండ్ చేశా రు. ఆమె రూ.20వేలు ఇచ్చారు. మరో రూ.80 వేల కోసం వేధించడంతో ఆమె విజిలెన్స్ను ఆశ్రయించింది. దీంతో విజిలెన్స్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన శ్రీకాకుళం: జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ సోమవారం నియామక ఉత్తర్వులు అందించారు. శ్రీనివాసరావు గత ఐదేళ్లుగా బీసీ సంఘంలో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి, పటిష్టతకు కృషి చేశారు. -
డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కొరాపుట్: తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించకపోతే ఉద్యమ బాట పడతామని ఒడిశా రెవెన్యూ మినిస్ట్రియల్ ఉద్యోగులు ప్రకటించారు. సోమవా రం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సా హు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జిల్లా స్థాయి రెవెన్యూ అధికారుల జీతాలు పెంచాలన్నారు. ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 లక్ష ల బీమా ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణ లో మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలన్నారు. కొత్త పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే జులై 7 నుంచి 11వ తేదీ వరకు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. జులై 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు లోకే శ్వర్ సాహు, ప్రసన్న కుమార్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
జయపూర్లో యువ ట్రైనీ ఓఏఎస్ల పర్యటన
కొరాపుట్: యువ ట్రైనీ ఒడిశా అడ్మిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు జయపూర్ పట్టణంలో క్షేత్ర పర్యటన చేశారు. సోమవారం మెయిన్ రోడ్డులో బంకు మఠం సమీపంలో గల బాబా సాహెబ్ కల్యాణ మండపంలో జరిగిన పీఎంఏవై, మధుబాబు పింఛన్ యోజన పథకాల లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్ల పంపిణీ కార్యాక్రమానికి హాజరయ్యారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సమావేశమయ్యారు. ఈ పర్యటనలో 20 మంది ట్రైనీ యువ అధికారులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆకవరం సస్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష బీజేడీ సభ్యులు బహిష్కరించారు. మొత్తం 28 మంది వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 15 మంది బీజేడీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ బి.సునీత హాజరుకాలేదు. పెన్షన్ విభాగంలో పని చేస్తున ఒక ఉద్యోగి కౌన్సిలర్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వివాదం జరుగుతుంది. సదరు ఉద్యోగి పట్ల చర్యలు తీసుకోవాలని బీజేడీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం పరిష్కారం కాకుండా పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల ఆగ్రహంతో బీజేడీ కౌన్సిలర్లు బహిష్కరించారు. -
రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం
రాయగడ: ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
వినతుల స్వీకరణ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో జిల్లా కలెక్టర్లు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలోని సమితి కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఇందులో 48 ఫిర్యాదుల రాగా.. వాటిలో 40 వ్యక్తిగత, 8 సామాజిక ఫిర్యాదులు ఉన్నాయి. 22 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఎస్పీ సందీప్ సంపత్ పాల్గొన్నా రు. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్లో కలెక్టర్ వి.కీర్తి వాసన్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఎస్హెచ్జీ గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మ పాల్గొన్నారు. -
సారాపై ఉక్కు పాదం మోపండి
● సీఎంకు లక్ష్మీపూర్ ఎమ్మెల్యే వినతి కొరాపుట్: సారా తయారీపై ఉక్కు పాదం మోపాల ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూ ర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత విజ్ఞప్తి చేశారు. సోమవా రం రాజధాని భువనేశ్వర్లో ముఖ్యమంత్రి మొహ న్ చరణ్ మజ్జికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎంతో సమావేశమైన స్థానిక పరిస్ధితులు వివరించారు. నాణ్యతలేని పదార్థాలతో సారా తయారు చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారన్నారు. దీనివలన వేలాది మంది గిరిజనులు అనారోగ్యంతో మరణిస్తున్నారన్నారు. గ్రామాల్లో మద్యం ఏరు లె పారుతుందన్నారు. గిరిజన మహిళల ఫిర్యాదులతో తానే స్వయంగా మద్యం తయారీ కేంద్రాలను పరిశీలించానన్నారు. పురుగులు పట్టిన పదార్థాలతో సారా తయారు చేస్తున్నారన్నారు. తనతో కలిసి వేలాది మంది గిరిజనులు మద్యంపై పోరాటాలు చేశారన్నారు. సుమారు 400 మందికి పైగా గిరిజనులపై అక్రమ కేసులు పెట్టారని ఆధారాలు చూపించారు. ఇటువంటి ప్రజా పోరాటాలు చేసే వారిపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర ఎకై ్సజ్ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారుడు ప్రకాష్ మిశ్రలతో భేటీ అయి పరిస్థితిని వివరించారు. -
మిస్ పాపులర్గా తెలుగమ్మాయికి అవార్డు
కొరాపుట్: మిస్ ఒడిశా ఇండియా–2025 పోటీల్లో మిస్ పాపులర్గా తెలుగమ్మాయికి ప్రథమ స్థానం వచ్చింది. సోమవారం భువనేశ్వర్ లైఫ్ ప్రైవేట్ హోటల్ మిస్ ఒడిశా ఇండియా 2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందాల అమ్మాయిలు పాల్గొన్నారు. ఇందులో కోరాడ సుప్రియకు మిస్ పాపులర్ విభాగంలో ప్రథమ స్థానం వచ్చింది. సుప్రియ స్వస్థలం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కేంద్రం. సుప్రియ తండ్రి కోరాడ సురేష్ది బొరిగుమ్మ. ఇక్కడే వ్యాపారం చేసేవారు. వ్యాపారరీత్యా భువనేశ్వర్లో స్థిరపడ్డారు. సుప్రియ ప్రస్తుతం పీజీ చదువుతోంది. -
శాన్ ఫ్రాన్సిస్కోలో .. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: ెసంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
పాలకుల ఆలస్యం.. గిరిజనుల లౌక్యం
కొరాపుట్: దశాబ్దాలు గడుస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు లౌక్యంతో తాత్కాలిక కర్ర వంతెన నిర్మించుకున్నారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి బద్దిగుడ గ్రామ పంచాయతీ డొక్రిపొడ–ఉద్ది పొడ గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరిగింది. వర్షాకాలం వస్తే డొక్రిపొడ నది ఉప్పొంగుతుంది. దాంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. కొరాపుట్ జిల్లాలో చివర డొక్రిపొడ నదికి అవతల ఉద్దిపొడ గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఆనుకొని మల్కన్గిరి జిల్లా ప్రారంభం అవుతుంది. గిరిజనులు రేషన్ బియ్యం, పంచాయతీ కార్యాలయ పనులు, విద్య కోసం నది దాటాలి. వర్షాకాలం వస్తే ప్రాణాలు పణంగా పెట్టి వెళ్లాలి. ఇక్కడ వంతెన నిర్మించాలని ఇరు వైపులా 20 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేక పోయింది. దాంతో గ్రామస్తులే విరాళాలు వేసుకొని నది మధ్యలో సిమ్మెంట్ స్తంభం నిర్మించారు. అనంతరం దాని మీద కర్రలు వేసి తాత్కాలిక వంతెన నిర్మించారు. ఇది పాదచారులకు అనుకూలంగా మారింది. సోమవారం నుంచి ఈ వంతెన గిరిజనుల రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంపై కొరాపుట్ జిల్లా ఆర్డీ విభాగం అధికారులు స్పందిస్తూ అక్కడ వంతెన నిర్మాణం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు వేస్తామని హామీ ఇచ్చారు. -
పురాతన మందిరం నేలమట్టం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న వందేళ్ల పురాతన గ్రామదేవత ఠకురాణి మందిరాన్ని నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాటు భక్తులు విరాళాలు సుమారు 50 లక్షల రూపాయలతో అదే స్థానంలో నూతనంగా ఠకురాణి మందిరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పాత మందిరాన్ని విరగ్గొట్టే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మితమవనుంది. ఇందులో భాగంగా అమ్మవారి గర్భగుడితో పాటు భక్తులు దర్శనం అనంతరం సేదతీరేందుకు ప్రత్యేకమైన మండపం, అలాగే అమ్మవారి పూజా సామగ్రిని భద్రపరిచే మరో గదిని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని మందిర కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రానికి తొలి స్వర్ణం భువనేశ్వర్: స్థానిక కళింగ స్టేడియంలో 78వ సీనియర్ జాతీయ జల క్రీడల చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రానికి తొలి స్వర్ణ పతకం దక్కింది. 100 మీటర్ల బటర్ఫ్లై మహిళా ఈవెంట్లో ఒడిశాకు చెందిన ఏస్ స్విమ్మర్ శ్రుతి ఉపాధ్యాయ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యేకంగా అభినందించారు. చిరిగిన జాతీయ పతాకం కొరాపుట్: కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలో ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న భారీ జాతీయ పతాకం చిరిగిపోయింది. ఇది గమనించిన వారు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మార్పించారు. వంద అడుగుల ఎత్తులో 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఏర్పాటు చేశారు. పతాకం నిర్వాహకుడు నిసాన్ పట్నయక్ మాట్లాడుతూ రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పతాకం చిరిగిందన్నారు. తాము అది గమనించే సరికే సోషల్ మీడియా వచ్చిందని, వెంటనే మార్చామని ప్రకటించారు. గణితంలో అత్యున్నత పరిశోధనలకు మద్దతు భువనేశ్వర్: నగరం శివార్లులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ సైన్సెస్ కొత్త గ్రంథాలయ భవనానికి రాష్ట్ర విజ్ఞానం, సాంకేతిక శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో సోమవారం శంకుస్థాపన చేశారు. గణితంలో అత్యున్నత పరిశోధనలను నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను అందించడానికి కట్టుబడి ఉందని, ఆయన అన్నారు. గణితంలో అధిక నాణ్యత పరిశోధనలు, పాఠశాల, కళాశాల స్థాయిలలో గణిత విద్యపట్ల ఆసక్తి ప్రేరణ, ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కొత్త గ్రంథాలయ భవనం సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశలో ఉపాధ్యాయులకు వసతి, హాస్టళ్లు, తరగతి గదులు నిర్మిస్తారు. నగరంలో 100 ఎకరాల స్థలంలో సైన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న ఐదేళ్లలో బయోటెక్నాలజీ కింద 17 ప్రధాన రంగాలలో రూ. 1113 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా విజ్ఞానం, సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్ర అరుముగం మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం గణితాన్ని మరింత పరిశోధనలకు అన్వయించాలని విద్యార్థులకు సూచించారు. రానున్న ఐదేళ్లలో అప్లైడ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్ విత్ డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటేషనల్ ఫైనాన్స్, మ్యాథమెటిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఈ సంస్థ ప్రారంభిస్తుందని ఆమె తెలియజేశారు. -
విక్రమదేవ్ వర్మ జయంతికి ఏర్పాట్లు
జయపురం: సాహితీ సామ్రాట్, జయపురం మహారాజు విక్రమదేవ్ వర్మ జయంతి ఉత్సవాలు ఈ నెల 28న అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించారు. ఒడిశా సాహిత్య అకాడమీ, జయపురం సాహిత్య పరిషత్లు సంయుక్తంగా విక్రమదేవ్ వర్మ జయంతి జరుపనున్నాయి. సోమవారం జయపురం సమితి అంబాగుడ కాళీమందిరంలో విక్రమ దేవ్ జయంతి శుభారంభం పూజలు చేశారు. అనంతరం విక్రమదేవ్ జయంతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జయపురం మోడరన్ ఇంగ్లిష్ మీడియమ్ స్కూలు, అరవింద నగర్ సరస్వతీ విద్యా మందిర్, మున్సిపాలిటీ విద్యాలయాల్లో జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మోడరన్ స్కూలు ప్రాంగణంలో జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అవిభక్త కొరాపుట్ స్థాయిలో 15 దినాలు ఉత్సవాలు జరపాలని తీర్మానించారు. విక్రమదేవ్ చరిత్ర విద్యార్థులందరికీ తెలిసేటట్టు ప్రతి పాఠశాలలో విక్రమదేవ్ వర్మపై చర్చా వేదికలు నిర్విహించాలని నిర్ణయించారు. -
ప్రజా భాగస్వామ్యం ప్రధానం
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025సంక్షేమ కార్యక్రమాల్లో..హత్యకి దారి తీసిన అక్రమ సంబంధం భువనేశ్వర్: ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆశయం నెరవేరి సాధికార సమాజం వెలుగులోకి వస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రసంగించారు. ప్రభుత్వ మద్దతుతో నడిచే సామాజిక సంక్షేమ పథకాల్లో పౌరుల నమోదు తక్కువగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ను గవర్నరు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలిచి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉదాహరణగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రోత్సహించారు. రాజ్ భవన్ ప్రాంగణం నూతన అభిషేక్ హాల్లో సామాజిక భద్రతా పథకాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత ప్రభుత్వం అనేక ప్రజా కేంద్రీకృత సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. ఈ పథకాలలో చాలా వరకు పేదలు, దుర్భలులు, అణగారిన వర్గాలకు ఆర్థిక రక్షణ, సంక్షేమ ప్రయోజనాలను విస్తరించడం లక్ష్యంగా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అర్హత ఉన్న వారిలో ఎక్కువ మంది అవగాహన లేకపోవడం వల్ల ప్రయోజనాలను పొందడం లేదు. విద్యావంతులు, ఉన్నత వర్గాలలో కూడా, పథకాల గురించి అవగాహన ఉన్నప్పటికీ చాలా మంది నమోదు చేసుకోవడం లేదన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి అనేక ప్రధాన పథకాలను గవర్నర్ సూచించారు. ప్రజలు తమ ఆర్థిక భద్రత మరియు శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కల్పించడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రచార కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియజేశారు. భారతీయ స్టేట్ బ్యాంకు రాజ్ భవన్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ సునీతా బెహరా ఈ కార్యక్రమంలో వివిధ పథకాల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ 101 మంది రాజ్ భవన్ సిబ్బంది సభ్యుల దరఖాస్తు ఫారాలను సంబంధిత పథకాలలో నమోదు కోసం భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్కు అందజేశారు. రాష్ట్ర క్రైమ్ శాఖ పోలీసు డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. బి. ఎస్ రాజ్పుట్, ప్రత్యేక టాస్క్ఫోర్సు డీఐజీ పినాక్ మిశ్రా, రాజ్ భవన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూస్రీల్ గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి -
జగన్నాథునికి అమృత అన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది. గుండిచా మందిరం నుంచి ఆరంభం -
గడ్డి తినిపించారు..
బరంపురం: పశువులను దొంగతనంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను తీవ్రంగా కొట్టి, సగం గుండు గీయించి, మోకాళ్లపై నడిపించడంతోపాటు గడ్డి తినిపించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా ధారకొటే పోలీస్స్టేషన్ పరిధిలోని ఖారిగుమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సింగిపూర్కు చెందిన బాబులా నాయక్(54), బులు నాయక్(42)లు హరియూర్ గ్రామం నుంచి ఒక ఆటోలో రెండు ఆవులు, ఆవుదూడను తీసుకువస్తున్నారు. వీరిని ఖారిగుమ్మ గ్రామానికి చెందిన ‘గో పరిరక్షకులు’కొందరు అడ్డుకున్నారు. వాటిని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని బాబులా చెప్పగా కొట్టిపారేశారు. దొంగతనం చేశారంటూ వారిపై నెపం వేశారు. రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితులు తిరస్కరించారు. దీంతో, వారిని తీవ్రంగా కొడుతూ నానా దుర్భాషలాడారు. సెలూన్కు తీసుకెళ్లి సగం జుత్తు గొరిగించారు. కిలోమీటర్ల దూరం వారిని మోకాళ్ల మీద నడిపించారు. మురుగు కాల్వలో నీటిని తాపించారు. గడ్డి తినిపించారు. కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఎస్పీ సువేందు కుమార్ పాత్ర తెలిపారు. వారు గో పరిరక్షకులు కాదు, బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు మాత్రమేనని ఆయన అన్నారు. -
తెగిన హిరాఖండ్ బోగీలు
● ప్రయాణికులు సురక్షితం ● విడిపోయిన బోగీల్లో ఈస్ట్ కోస్ట్ జీఎం కొరాపుట్: జగదల్పూర్–భువనేశ్వర్ మద్య నడిచే హిరాఖండ్ రైలుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. కొరాపుట్ జిల్లా కొట్పాడ్ నుంచి సమీప చత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్ పూర్ల మధ్య అమ్మాగుడ వద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి మిగతా బోగీలు విడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. మరో వైపు విడిపోయిన ఇంజిన్ వెనుక ఉన్న ప్రధాన వీఐపీ బోగీలో ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంకువాల్ ఉన్నట్లు సమాచారం. రైల్వే శాఖలో జీఎం స్థాయి అత్యున్నత వ్యక్తి ఉన్న బోగి ఇలా రైలు ఇంజిన్ నుంచి విడిపోవడం చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకొని జగదల్ పూర్ నుంచి రైల్వే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని బోగీలు కలిపారు. అయితే రెండోసారి కూడా బోగీలు విడిపోయాయని ప్రయాణికులు పేర్కొన్నారు. సుమారు 3 గంటల ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు హిరాఖండ్ రైలు జయపూర్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా ఆందోళన చెందారు.రెండు వర్గాల మధ్య గొడవ మల్కన్గిరి: మల్కన్గిరి సమితి కోత్తమటేర్ గ్రామంలో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరికి మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం కోత్తమటేర్ గ్రామానికి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, ఎస్పీ వినోద్ పటేల్ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. జయపూర్లో భారీ వర్షం కొరాపుట్: జయపూర్, నబరంగ్పూర్ పట్టణాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. మురుగు కాలువలు పొంగి రోడ్డు మీదకు ప్రవహించాయి. జయపూర్ మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నబరంగ్పూర్ జిల్లా కేంద్రం తడిసి ముద్దయింది. వరద నీటిలో యువకుడు గల్లంతుభువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలో వరద ఉద్ధతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో సువర్ణ రేఖ నది నీటి మట్టం ప్రమాద సంకేతం దాటి కట్టలు తెంచుకుని రహదారులపై పొంగి పొరలుతుంది. ఈ పరిస్థితుల్లో వరద నీటిలో ప్రమాదవశాతు పడిన యువకుడు గల్లంతు అయ్యాడు. బలియాపాల్ ఇకిడిపాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రకటించారు. ఒడ్రాఫ్ బృందం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. 30 నుంచి మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలు భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్ఈ) ఆధ్వర్యంలో ఒడిశా మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల పదో తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ bsoedirhaac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని బీఎస్ఈ ప్రకటించింది. -
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: భారతీయ స్టేట్ బ్యాంక్ జయపురం ప్రధాన శాఖ కార్యాలయంలో ఆదివారం బ్యాంక్ యాజమాన్యం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర పర్యవేక్షణలో జయపురం జిల్లా కేంద్ర రక్తనిధి టెక్నీషియన్లు అభయ చరణ పండా, గురు పొరజ, బి.ప్రతిభ పాత్రో, నతాయిల్ దేవీ తదితరులు 65 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 21 ఏళ్ల ఇతిశ్రీ రథ్ మొదటిసారి రక్తదానం చేసి అందరితో ప్రశంసలు అందుకుంది. ఎమ్మెల్యే బాహిణీపతి, స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ సుభాష్ చంద్ర బెహరా, తదితరులు యువతిని సన్మానించారు. జయపురం సబ్డివిజన్ రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, ఎస్బీఐ పట్టణ బ్రాంచ్ మేనేజర్ హిరణ్మయ కుమార్ పాడీ, డాక్టర్ జగదీష్ చంద్ర శెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
రోగుల అవస్థలు
పర్లాకిమిడి: స్థానిక ప్రభుత్వ హడ్క్వార్టర్ ఆసుపత్రిలో అన్ని వార్డుల్లోనూ వారంరోజుల నుంచి ఏసీలు పనిచేయక పోవడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజూ 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీనిపై జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ఎం.ఎం.ఆలీకి జిల్లా ట్రాన్స్జెండర్స్ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా కార్యదర్శి జాస్మిన్ షేక్ ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీలు బాగుచేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయని ఏసీలు -
జగన్నాథ మందిరంలో మిఠాయిల తయారీ
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీ దివ్య క్షేత్రంగా పిలవబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రానికికి పూరీ దివ్యాధాం నుంచి పాక శాస్త్ర ప్రవీణులు తరలి వచ్చారు. ఆదివారం పాక శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవారు మిఠాయి తయారీలో నిమగ్నమయ్యారు. రథా యాత్ర సమయంలో కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రంలోని మిఠాయి వంటకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని అనేక దేవాలయాలకు ప్రజలు తీసుకొని వెళ్తారు. ఈ నేపథ్యంలో కొరాపుట్ జగన్నాథ ఆలయ కమిటీ పూరీ నుండి ప్రత్యేక మిఠాయి వంటవాళ్లని పిలిపించింది. వారు ఈ యాత్ర సమయంలో స్థానిక కొరాపుట్ జగన్నాథ దేవావయ వంటవాళ్లకి దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాక దేవదేవుళ్లకి ఇష్టమైన వంటలు తయారు చేయనున్నారు. వీరు ఆరు రకాల ఖాజాలు, బాలుసా తయారీలో నిపుణులని కమిటీ పేర్కొంది. ఇప్పటికే శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ దేవాలయంలో అధునాతన పరిజ్ఞాన వస్తువులు ఉన్న వంట శాల ఉంది. నిత్యం వందలాది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు చేస్తుంటారు. రథాయాత్ర సమయంలో ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. -
● సందడే సందడి
పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్వతంలో భీమ, కుంతి, యుధిస్టర, పరఽశురామ్ కుండ్ను చూడటానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి పర్యాటకులు అధికంగా విచ్చేశారు. పర్లాకిమిడి నుంచి రాయఘడ బ్లాక్ కోయిపూర్ వరకు ఒడిశా బస్సులు వేశారు. మహేంద్రగిరిపై వరకు తారురోడ్డు వేయడంతో కార్లు, వాహనాలు పర్లాకిమిడి నుంచి గంటన్నరలో ఇక్కడికి చేరుకోవచ్చు. మహేంద్రగిరి పర్వతం వద్ద ఒకరోజు విడిది ఉండటానికి జిల్లా అటవీశాఖ కాటేజ్లు ఏర్పాటుచేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అధికంగా వస్తున్నారు. దీంతో టోల్ గేటు వద్ద ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. మహేంద్రగిరిలో పబ్లిక్ పార్టిపేషన్తో హోటళ్లు నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల పర్లాకిమిడి విచ్చేసిన రాష్ట్ర ఎకై ్సజ్, ప్రజాపన్నుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్కు పలువురు సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పర్వతాలు, తాగునీరు, షెల్టర్ ఏర్పాటుచేయడంతో శని, ఆదివారాల్లో గంజాం, భువనేశ్వర్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి పర్యాటకలు విచ్చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి పోరాటం
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయగడ జిల్లాలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు తాను సాయశక్తులా పొరాడుతానని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన పరిధిలోని వివిధ సమస్యలు, వాటిపరిష్కారం కోసం చేసిన కృషిని వెల్లడించారు. ఈ మేరకు స్థానిక తేజస్వీని హోటల్ సమావేశం హాల్లొ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ఆయా గ్రామాలకు అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. ఏడాదిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు 96 శాతం హాజరై దాదాపు 253 ప్రశ్నలు వేసినట్లు వివరించారు. పెరుగుతున్న దొంగతనాలు, దోపీడీలతో ప్రజలు భాయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల మెరుగు పరిచేందుకు ప్రభుత్వం స్థానిక రాణిగుడఫారంలో మహిళా పోలీస్ స్టేషన్ను, అదేవిధంగా సాయిప్రియనగర్, రైతుల కాలనీల్లొ పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో ఎమ్మెల్యే నిధుల్లో భాగంగా సుమారు మూడూ కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంత రహదారులు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల కోసం వెచ్చిస్తానన్నారు. ధీనావస్థలో క్రీడా సంఘాలు.. జిల్లాలోని క్రీడాకారులకు ఉత్సాహ పరిచేవిధంగా ఏర్పాటు చేస్తున్న క్రీడా సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మరిందని ఎమ్మెల్యే అన్నారు. గత 20 ఏళ్లుగా క్రికెట్ అసోసియేషన్కు ఎన్నికలు జరగలేదని అన్నారు. అధికారులు చొరవ తీసుకోకపొవడంతో క్రీడారంగం రానురాను కుంటుపడే పరిస్థితికి చేరకునే అవకాశం ఉందని.. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి క్రీడారంగం పునరుద్ధరణ కోసం కృషి చేస్తానని చెప్పారు. ఏడాది పూర్తయిన సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రొగ్రస్ రిపోర్టు సంచికను విడుదల చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండ, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ జిలకర్ర, డీసీసీ ఉపాధ్యక్షులు శంకర్షన్ మంగరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారి కృష్ణమూర్తి, సునీల్ చంద్ర పండ పాల్గొన్నారు. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక -
రథాలకు తుదిమెరుగులు
పర్లాకిమిడి: గుండిచా రథయాత్ర సమీపిస్తుండటంతో పర్లాకిమిడిలో జగన్నాథ, బలరామ, సుభద్ర రథాల పనులు పూర్తయ్యాయి. రాజవీధి జగన్నాథ రథాల వద్ద అందమైన ముగ్గులను చిత్రకారులు వేస్తున్నారు. రథాలకు బుద్దుడు, గోల్లభామలు, అనేక దేవతామూర్తుల బోమ్మలను అమర్చుతూ తుదిమెరుగులు చేపడుతున్నారు. వచ్చే బుధవారం అమావాస్య రోజు మూడు రథాలపై నీలచక్రాలు అమర్చుతారు. తదనంతరం విధియ రోజు జగన్నాధుడుని చీకటి గది నుంచి బయటకు తెచ్చి నేత్రోత్సవం జరుపుతారు. మరో వైపు రోడ్లు– భవనాల శాఖ ఆధ్వర్యంలో గుండిచా మందిరానికి మరమ్మతులు చేపడుతున్నారు. -
ఒకనాడు దాత.. నేడు దయనీయ గాథ
రూ.46 వేలు మందులకు ఖర్చవుతాయి. విశాఖ పట్నంలోని టాటా మెమోరియల్ ఆస్పత్రి నుంచి మందులు తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రాణం పోసిన బీఎస్కేవై కార్డు.. గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రవేశ పెట్టిన బిజూ స్వస్థ్య కల్యాణ యోజన (బీఎస్కేవై) ఆరోగ్య బీమా కార్డు వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందింది. ఈ కార్డు తో ప్రతి నెల మందులు తెచ్చుకునేవారు. మిగతా సమస్యలు ఎలా ఉన్న మందుల ఖర్చులు లేకపోవడంతో రమేష్ ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది. ఊపిరితీస్తున్న ఆయుష్మాన్ కార్డు రాష్ట్రంలో బీజేడి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభు త్వం వచ్చింది. వెంటనే ప్రభుత్వం బీఎస్కేవై రద్దు చేసి దాని స్థానంలో ఆయుష్మాన్ కార్డు ప్రవేశ పెట్టింది. కొత్త కార్డుతో రమేష్ కుటుంబం మందులకు వె ళ్లగా ఆయుష్మాన్ కార్డులో మందులు ఇవ్వడం కుదరదని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దాంతో ప్రతి నెల రు.46 వేలు ఎలా మందులకు తేవాలో తెలియ క ఆ కుటుంబం తీవ్ర వేదన లో మునిగిపోయింది. తరలివెళ్లిన రబినందో.. రమేష్ కుటుంబం దీనావస్థను బీజేడీకి చెందిన మాజీ మంత్రి రబినందో తెలుసుకున్నారు. వెంటనే పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని ప రామర్శించారు. తక్షణ సాయం కింద ఒక నెల మందుల ఖర్చులు రూ.46 వేలు ప్రకటించారు. రబినందో వెంట జయపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సు నీత, ఇతర బీజేడీ నాయకులు ఉన్నారు. అనంతరం రబినందో మాట్లాడుతూ రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కొరాపుట్: నాడు వందలాది కుటుంబాలకు ఇంటి స్థలాలు దానమిచ్చిన కుటుంబానికి ఆయుష్మాన్ కార్డు శాపంలా మారింది. గొప్పగా బతికిన కుటుంబం ఇప్పుడు హృదయ విదాకర స్థితిలోకి వచ్చేసింది. జయపూర్కి చెందిన ముగడ సూర్యనారాయణ దానకర్ణుడుగా పేరు గడించారు. తనకున్న ఆస్తుల్లో అత్యధికం పేదలకు పంచి పెట్టారు. ఇల్లు లేని వారి కి ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చారు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి మరీ వారికి దానం చేశారు. జాతీయ మీడియాలో సైతం ఆయన ఘనతలు ప్రచురితమయ్యాయి. నేడు అగమ్యగోచరం.. పట్టణంలో ప్రసాదరావు పేట 4వ లైన్ లో నివసిస్తున్న సూర్యనారాయణ కుమారుడు ముగడ రమే ష్కి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది. వైద్యం కోసం ఉన్న ఆస్తులు పోయి చివరకు రమేష్ కుటుంబం అద్దె ఇంటిలోకి మారింది. రోగ తీవ్రత దృష్ట్యా అతడు మందులతోనే జీవించాలి. ప్రతి నెలా – శాపంలా మారిన ఆయుష్మాన్ కార్డు – చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు -
అధికారుల పనితీరుపై అసంతృప్తి
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితిలోని అధికారుల పనితీరుపై ఆ సమితి సర్పంచ్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్పాడ్ సమితి చతర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ల సంఘ సమావేశం నిర్వహించింది. సర్పంచ్ త్రినాథ్ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితిలోని పలు సమస్యలపై చర్చించారు. కురమకోట్ నుంచి మహంతిపుట్, కొంగియగుడ నుంచి మఝిగుడ, అవళభట నుంచి కుకిడిపొదర్, దువుర్ల నుంచి సెమల, భుర్ష వరకు, ఖడగపూర్ నుంచి భలుగుడ, టెమరగుడ, ఫిటకి కుంభి నుంచి నదీఘాట్, చిత్ర నుంచి పఠాన్గుడ, ఝనికికజివా రోడ్డు వరకు అన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సమావేశంలో సర్పంచ్లు ఆరోపించారు. అధికారులు సమితి వీడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లటం లేదని, జన సునాని కార్యక్రమంలో వారు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. మండీలలో ధాన్యం క్రయవిక్రయాల సమయంలో సంంబంధిత అధికారులు అంతా ఉండాలని జిల్లా అధికారులు తెలిపినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఏఈఈ అనుచితంగా వ్యవహరించగా బాధిత భనసులి పంచాయతీ సర్పంచ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానిని మాఫీ చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను విస్మరించి కంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని, అందువలన రెండు పంచాయతీలలో అటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించటం లేదనిన్నారు. సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు దేబొ మఝి, కార్యదర్శి కమల పూజారి, సర్పంచ్లు బుదాయి మఝి, కమల చలాన్, బొనిత మఝి, పుష్ప పూజారి, సనమతి గదబ, పూర్ణ పూజారి, మనమతి పూజారి, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమందిరంలో రాజప్రసాద్ విజే
భువనేశ్వర్: పవిత్ర ఒణొసొరొ 12వ రోజు పురస్కరించుకుని ఆషాఢ కృష్ణ పక్షం ద్వాదశి తిథి ఆదివారం శ్రీ మందిరంలో రాజప్రసాద్ విజే నిర్వహించారు. దేవతల స్వస్థత సమాచారం పూరీ గజపతి మహారాజాకు గోప్య సేవకులు తెలియజేయడం రాజప్రసాద్ విజే సమగ్ర సారాంశం. ఈ సందర్భంగా మూల విరాట్ల శ్రీఅంగాల నుంచి తొలగించిన పదార్థాలను గజపతి మహా రాజాకు సమర్పించారు. కరాల కర్మ స్నాన యాత్ర మర్నాటి నుంచి శ్రీమందిరంలో మూల విరాటులు స్వస్థతతో కోలుకునేందుకు గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా సాధారణ పూజాదులు, నైవేద్యాలు నివారించి ఆయుర్వేద వైద్య విధానాలతో చికిత్స, పత్యం పదార్థాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆషాఢ కృష్ణ ప్రతిపద నుండి చతుర్థి వరకు చికిత్సలో భాగంగా దేవతల శరీర వస్త్రాలను తొలగించి కరాల కర్మను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోలుకోవడంతో దేవతా మూర్తుల శరీర భాగాలకు పూసిన కస్తూరి, గుగ్గిలం, చువా (సుగంధ ద్రవ్యం) మరియు చందనం, పట్టు పోగులు తొలగిస్తారు. ఇలా వేరు చేసిన పదార్థాలను ‘కరాళ‘ అంటారు. -
రథయాత్ర నిర్వహణ పవిత్ర బాధ్యత: సీఎం
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు స్వస్థతతో క్రమంగా యథా స్థితికి చేరుకుని దైనందిన సేవలు అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి కొద్ది రోజుల్లో స్వామి పూర్తిగా కోలుకుని యాత్రకు బయల్దేరుతాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రథయాత్రకు సంబంధించిన తుది సన్నాహక సమీక్ష సమావేశం పూరీ మున్సిపాలిటీ టౌన్ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగింది. ఆయనతో ఇద్దరు ఉప మఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్దేవ్, న్యాయ, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, సంస్కృతి శాఖల మంత్రులు, పూరీ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసన సభ సభ్యులు, పోలీసు, ఆరోగ్యం, అగ్నిమాపక మరియు పౌర శాఖల ఉన్నత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతు రథయాత్రను సజావుగా నిర్వహించడం ప్రభుత్వ విధి మాత్రమే కాదు, పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. స్వామి యాత్ర ఒడిశా సాంస్కృతిక వారసత్వానికి ఘనమైన ప్రతీకగా ఆయన అభివర్ణించారు. లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలు జగన్నాథ రథ యాత్రతో ముడిపడి ఉన్నాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు పూర్తి సమన్వయంతో పని చేసి దైవికమైన ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. యాత్ర సంబంధిత పూజాదుల్ని నిర్ధారిత వేళల్లో సకాలంలో పూర్తి చేయడంలో సేవాయత్ వర్గాలు సహృదయంతో సహకరించాలన్నారు. ఈ వర్గం ఆచారాల పవిత్రత, క్రమశిక్షణ యాత్రలో అత్యంత ప్రధానమన్నారు. రథాలు లాగే సందర్భంగా పటిష్టమైన క్రమబద్ధీకరణ, క్రమశిక్షణతో జన సందోహంపై నిఘా వేసి అవాంఛనీయ సంఘటనలను నివారించడం యాత్ర తొలి విజయంగా నిలుస్తుందని తెలిపారు. యాత్రలో భక్తులకు సదవకాశం కల్పించే దిశలో తొక్కిసలాట వంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో అతిసార ప్రబలిన విషయం తెలిసిందే. యాత్ర సమయంలో ఈ పరిస్థితి పట్ల అనుబంధ యంత్రాంగంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలుషిత ఆహారం, అసురక్షిత తాగునీటి అమ్మకాలను నిరోధించాలన్నారు. అన్ని కీలక ప్రదేశాలలో స్వచ్ఛమైన తాగునీరు, చక్కని పర్యావరణం మధ్య పరిశుభ్రమైన ఆహారం లభ్యతను నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. ఈ ఏడాది జరగనున్న రథ యాత్ర భద్రతా ప్రణాళికను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆవిష్కరించారు. యాత్ర సందర్భంగా సమగ్ర పూరీ పట్టణం 5 అంచెల భద్రతా వలయంలో ఉంటుందన్నారు. 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. యాత్ర పర్యవేక్షణ కోసం 275 కృత్రిమ మేధసు (ఏఐ) కెమెరాలు, ట్రాఫిక్ మరియు జన సమూహ నియంత్రణ కోసం డ్రోన్ నిఘా, తాజా ట్రాఫిక్ నవీకరణలు మరియు రూట్ మ్యాప్ల కోసం చాట్బాట్ యాప్. తక్షణ ప్రతిస్పందన బృందాలు, ఉగ్రవాద వ్యతిరేక బృందాలు, మైరెన్ పోలీసులు, నేవీ కోస్ట్ గార్డ్ ఉమ్మడి గస్తీ కార్యకలాపాల్లో పాల్గొంటారు. వాహనాల రాకపోకలకు అనుకూలంగా యాత్ర పరిసరాల్లో 26 చోట్ల ప్రత్యేక పార్కింగ్ జోన్లను గుర్తించారు. అంబులెన్స్లకు నిరంతరాయ రవాణా కోసం గ్రీన్ కారిడార్ నిర్ధారించారు. రథయాత్ర తుది సన్నద్ధత సమీక్ష సమావేశంరథ యాత్రకు 365 ప్రత్యేక రైళ్లు శ్రీ జగన్నాథుని రథం యాత్ర కోసం తూర్పు కోస్తా రైల్వే 365 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నం, పలాస, జగదల్పూర్ గోండియా (ఛత్తీస్గఢ్), పశ్చిమ బెంగాల్లోని సంత్రాగచ్చి (కోల్కతా) ప్రాంతాల అనుసంధానంతో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. -
అలరనాథుని దర్శించుకున్న ముఖ్యమంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం బ్రహ్మగిరిలోని అలర్నాథ్ స్వామిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు సంపన్నమైన ఒడిశా లక్ష్యాన్ని సాధించడానికి బలాన్ని ఇస్తాయన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. జంఝావతి వంతెనపై రెండు వాహనాలు ఢీ రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల జంఝావతి నది వంతెన మలుపు వద్ద ఆదివారం రెండు వాహనాలు ఢీకొన్నా యి. ఆంధ్రప్రదేశ్ నుంచి బొగ్గు లోడుతో చత్తీస్గఢ్ వైపు వెళ్తున్న టిప్పర్, వత్తాడ నుంచి రాయగడకు మరమ్మతు కోసం వెళ్తున్న పికప్ వ్యాన్లు వంతెన మలుపు వద్ద ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పికప్ వ్యాన్, టిప్పర్ డ్రైవర్లు వాహనాల నుంచి గెంతేసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే టిప్పర్లో హెల్పర్గా పనిచేస్తున్న వత్తాడ గ్రామానికి చెందిన పలక రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు వాహనాలు ఒకేసారి వెళ్తున్న సమయంలో మలుపు వద్ద టిప్పర్ అత్యంత వేగంగా నడపడంతో వెనుక నున్న వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు మలుపు వద్ద ఇరుక్కుపొయాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే కొంత సమయం రాయగడ మీదుగా ఆంధ్రవైపునకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చొరవ తీసుకుని వాహనాలను పక్కకు నెట్టించి రాకపోకలను పునరుద్ధరించారు. నవీన్ శస్త్ర చికిత్స విజయవంతం భువనేశ్వర్: రాష్ట్ర విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆరోగ్యం కోలుకుంటుంది. ముంబైలో ఆదివారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రమాకాంత పండా తెలిపారు. అందరితో సహజంగా మాటామంతీ చేస్తున్నారు. వైద్యపరమైన పరిశీలన కోసం ఆస్పత్రిలో ఉన్నారు. 5, 6 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారన్నారు. ప్రియతమ నాయకుడు త్వరగా ఆరోగ్యంతో కోలుకోవాలని బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక దీపారాధన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పూరీ జిల్లా బ్రహ్మగిరి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దాస్బర్మ ఆధ్వర్యంలో స్థానిక అలరనాథ స్వామి దేవస్థానం ఆవరణలో సామూహిక దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నవీన్ పట్నాయక్ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పర్లాకిమిడి గజపతి ప్యాలెస్కు జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు
పర్లాకిమిడి: ఒడిశా స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎనలేని కృషిచేసిన పర్లాఖిముండి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జన్మస్థలం అయిన గజపతి ప్యాలెస్ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి గుర్తించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్లాకిమిడి మహారాజా ప్యాలెస్, ఇతర స్మారక చిహ్నాలను మరమత్తులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. దీనిపై పర్లాకిమిడి న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గుండిచా ఆలయ పనులపై సమీక్ష
భువనేశ్వర్: నవ దినాత్మక యాత్రకు విచ్చేయనున్న శ్రీ జగన్నాథుని రాక కోసం గుండిచా ఆలయం నిరీక్షిస్తోంది. ఏటా రథ యాత్ర పురస్కరించుకుని స్వామి సోదర సోదరీ సమేతంగా ఈ ఆలయంలో అడపా మండపంపై కొలువు దీరుతాడు. ఈ సందర్భంగా ఆలయం పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యక్షంగా గుండిచా ఆలయాన్ని సందర్శించి సమీక్షించారు. రథ యాత్ర తుది సన్నద్ధత సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఈ మందిరం సందర్శించారు. ఆయనతో ఇరువురు ఉప ముఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్దేవ్, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సందర్శించారు. -
‘పేపర్ మిల్లు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి’
కొరాపుట్: జయపూర్లోని ఏఈఆర్పిల్ యూనిట్ సేవా పేపర్ మిల్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి రబి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వి.కీర్తి వాసన్తో పేపర్ మిల్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో రబినందో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంతవరకు నాలుగు సార్లు పేపర్ మిల్ని క్రయ విక్రయాలు జరిపారన్నారు. మిల్లో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి రుణాలు పొంది కార్మికుల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ఈ విడత పేపర్మిల్ని కొనుగోలు చేసిన ఏ సంస్థ అయినా ముందుగా కార్మికుల వేతనాలు చెల్లించాని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, అంతకు ముందు మూడు విడతలుగా వేతనాలు బాకీ ఉన్నారని, 2016 నుంచి బోనస్ పక్కన పెట్టారని, అనేక బాకీలు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వేతనాలు అందని 41 మంది కార్మికులు చనిపోయిన విషాదకర పరిస్థితి ఉందని కలెక్టర్కి వివరించారు. మరికొన్ని రోజులు ఆగితే మిల్లులో కార్మికుల ఆకలి కేకలు మరింతగా వినిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో బిల్ట్ సేవా పేపర్ మిల్ ఎంప్లాయిస్ యునియన్, బాలార్పూర్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, సీనియర్ ఉద్యమ నాయకులు ప్రమోధ్ మహంతి తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ సాత్విక్
భువనేశ్వర్: జాతీయ ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించిన తొమ్మిదేళ్ల సాత్విక్ స్వంయిను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శనివారం అభినందించారు. ఇంత చిన్న వయస్సులో అతని కృషి, పదునైన తెలివితేటలు మరియు మానసిక స్థిరత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నిరంతర ప్రోత్సాహం మరియు నిరంతర మద్దతుతో సాత్విక్ విజయానికి మార్గం సుగమం చేసిన అతని తల్లిదండ్రులు మరియు కోచ్లకు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.మాజీ సీఎం నవీన్ కోసం పూజలు పర్లాకిమిడి: రాష్ట్ర విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శస్త్ర చికిత్స కోసం నిన్న ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తమ ప్రియతమ నేత నవీన్ పట్నాయక్ ఆయురారోగ్యాలతో తిరిగి రాష్ట్రానికి తిరిగిరావాలని కోరుతూ పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, పురపాలక చైర్పర్సన్ నిర్మల శెఠి తదితరులు స్థానిక జగన్నాథ స్వామి, గ్రామదేవత నీలమణి అమ్మవారికి శనివారం పూజలు చేశారు. అలాగే స్థానిక బాప్టిస్టు చర్చిల్లో ప్రార్థనలు చేశారు. ఓంఫెడ్ పాల ధరలు పెంపు భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్) పాల ధరలను పెంచింది. ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఒక లీటరు పాల ధర రూ.2ల నుంచి రూ.4లు వరకు పెరిగింది. మునుపటి ధర కంటే రూ.2లు పెంచడంతో టోన్డ్ పాలు ఇప్పుడు లీటరుకు రూ.50లు, ప్రీమియం పాలు లీటరుకు రూ.54లు అవుతుంది. రూ.4 పెరుగుదలతో గోల్డ్ ప్రీమియం పాలు లీటరుకు రూ.56లు, గోల్డ్ ప్రీమియం+ పాలు ఇప్పుడు లీటరుకు రూ.60లకి లభిస్తాయి. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మృతుడు తెలుపు, నలుపు గీతల షర్టు, నల్లని నిక్కరు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలకు 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువకుడు ఆత్మహత్య కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సూర్యకాలనీకి చెందిన కొవిరి నూకరాజు (22) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడి కార్మికుడు నారాయణరావు రెండో కుమారుడు నూకరాజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంధాలు బలమైనవి
ఒడిశా, పశ్చిమ బెంగాల్..భువనేశ్వర్: తరతరాలుగా ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక, భాషా మరియు సాంప్రదాయ బంధాలు అత్యంత బలమైనవని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో శనివారం జరిగిన పశ్చిమ బెంగాల్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ విషయం తెలిపారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ చొరవలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పురాతన నాగరికత నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భారతదేశం పరివర్తన, పురోగతికి కేంద్రంగా పశ్చిమ బెంగాల్ను గవర్నర్ అభివర్ణించారు. ఈ రాష్ట్రానికి చెందిన సాధువు శ్రీచైతన్య, రాజా రామ్మోహన్రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, నోబెల్ గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ థెరెస్సా వంటి వారు దేశానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఒడిశాలో నివసిస్తున్న బెంగాలీ సమాజాన్ని ఆయన ప్రశంసించారు. చాలా మంది రాష్ట్రాన్ని తమ రెండో నివాసంగా మార్చుకున్నారన్నారు. ఐక్యత మరియు పరస్పర అవగాహనను పెంపొందించడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ స్థానికులు ఒడిశాలో నివసించిన వారి అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. -
నేటి నుంచే సంప్రదాయ వస్త్రధారణ అమలు
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆదేశాల మేరకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధనలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం జరిగే సూర్యనమస్కార పూజల్లో పురుషులు కచ్చితంగా పంచె, చొక్కా, మహిళలు చీర చూడీదార్ను మాత్రమే ధరించి పూజల్లో కూర్చునేలా చర్యలు చేపట్టనున్నారు. ఎలాంటి ఫ్యాషన్ దుస్తులతో దర్శనాలకు అనుమతించకుండా ఈవో ప్రసాద్ ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించినట్లుగా తెలిసింది. నేటి నుంచి అంతరాలయ దర్శనాలను సాయంత్రం 6 గంటల వరకు పొడిగింపు నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు..దీంతో భక్తులకు మరింత సౌకర్యవంతంగా అంతరాలయ దర్శనానికి వీలవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి ఎచ్చెర్ల : లావేరు మండలం అదపాక సమీపంలోని పంట పొలాల్లో విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.జగన్నాథం(35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదపాక వీఆర్వో ఎన్.వెంకటరమణ ఫిర్యాదు మేరుకు లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు హెచ్సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన
కొరాపుట్: తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని కోట్పాడ్ సమితి బబయా పంచాయతీకి చెందిన రైతులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం జయపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం మందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీ) ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ మండీలో 46 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా, ఇప్పటివరకు కేవలం 24 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. మిగతా 20 వేల క్వింటాళ్ల ధాన్యం మండీల్లో పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కొనుగోలు చేయాల్సిన అధికారులు మండీలకు రాకుండా ముఖం చాటేస్తున్నారని వాపోయారు. మరో 10 రోజుల్లో మండీలు ముగుస్తాయని వాపోయారు. అసలు బబయా మండికి అధికారులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈనెల 24వ తేదీలోపు తమ ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. లేకపోతే అదేరోజు జయపూర్ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్, సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ అన్నారు. నగరంలోని ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ క్యాడర్ క్యాంపు శనివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 158 బార్ కౌన్సిల్లు ఉన్నాయని, వాటిలో ఏఎఎఫ్ క్యాడర్ కూడా ఉందన్నారు. ఎనిమిది వేల మంది ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులున్నారని, మనమంతా ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఏఏఎఫ్ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ మూమెంట్ నడపాలంటే కఠోర దీక్ష ఉండాలని, నాయకునికి ఎటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీలను విభజించి పాలిస్తున్నాయన్నారు. ఈసారి రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీల్లో ముగ్గురు న్యాయవాదులు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు ఎవ్వరూ ఎటువంటి పదవులు ఇవ్వరని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బతికినంత కాలం అంబేడ్కర్ విధానంతో బతకాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పొన్నాడ రాము, బి.మురళీకృష్ణ, రుంకు అప్పారావు, గంజి ఆర్.ఎజ్రా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ దండాసి తదితరులు పాల్గొన్నారు. -
రథయాత్ర ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీగా పిలవబడుతున్న కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి శ్రీక్షేత్రంలో జరిగే రథయాత్ర ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. శనివారం కలెక్టర్ వి.కీర్తివాసన్, ఎస్పీ రోహిత్ వర్మలు రథాలు వద్దకు వెళ్లారు. ఈనెల 27వ తేదీన జరిగే రథయాత్రలో ఎటువంటి అసౌకర్యాలు ఉండకూడదని అదేశించారు. వర్షం పడితే మురుగు కాలువల్లో నీరు రోడ్డు మీదకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల మళ్లింపు, అత్యవసర వైద్య సదుపాయాలు ఉండాలన్నారు. శబరి శ్రీక్షేత్రం నుంచి గుండిచా మందిరం వరకు మూడు రథాలు క్షేమంగా చేరేందుకు మార్గాలు సుమగంగా ఉండాలని ఆదేశించారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి ఉన్నారు. -
గుభాళింపు
పవిత్ర యోగిని ఏకాదశిని శ్రీక్షేత్రంలో ఖొల్లి లగ్గి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు మరియు సుదర్శన మూల విరాటులకు శనివారం గంధం పూశారు. జ్యేష్ట పూర్ణిమ నుంచి దేవుళ్లు అస్వస్థతకు గురై తెరచాటున గోప్య ఉపచారాలతో క్రమంగా కోలుకున్నారు. ఖొల్లి లగ్గి ఏకాదశి నాడు జగన్నాథుడు సోదర సోదరి సమేతంగా పూర్తిగా స్వస్థత పొందడంతో చందన లేపనం చేసి తులసీ దళాలు ఇతరేతర సుగంధిత పుష్పాలతో పూజించారు. ఆరోగ్యం మరింత త్వరగా కోలుకోవాలని దశమూల మోదకాలు నివేదించారు. – భువనేశ్వర్ -
ట్రైనీ ఓఏఎస్ల క్షేత్రస్థాయి పర్యటనలు
కొరాపుట్: శిక్షణలో ఉన్న ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. శనివారం కొరాపుట్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. త్వరలో పరిపాలనా పగ్గాలు చేపట్టనున్న ఈ యువ అధికారులు గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం కొరాపుట్ కాఫీ బోర్డు సమీక్షా సమావేశం నిర్వహించారు. నందపూర్, కొరాపుట్, బొయిపరిగుడ, జయపూర్ సమితుల్లో కాఫీ పంటలు పండిస్తున్న రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. వీరికి జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ వర్మలు ధ్రువపత్రాలు అందజేశారు. -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
● ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగాపూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పంకొరాపుట్: నబరంగ్పూర్లో కుమార్తెతో కలిసి యోగాసనం వేస్తున్న బీజేపీ నాయకుడు మృత్యుంజయ్ దాస్రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, మైదానాల్లో యోగా శిబిరాల్లో భాగంగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుందని తెలియజేశారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని పేర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్భువనేశ్వర్: యోగా వేడుకల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనభువనేశ్వర్: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని సీఎం మోహన్చరణ్ మాఝీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక కళింగ స్టేడియంలో రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ రాష్ట్రస్థాయి యోగా వేడుకలు శనివారం నిర్వహించింది. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం లేదా ఆసనాలకు పరిమితం కాదన్నారు. యోగా శారీరక, మేధో, మానసిక మరియు ఆధ్యాత్మికం యొక్క ప్రత్యేకమైన సంగమమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో యోగా అంతర్భాగని తెలిపారు. పాఠశాల కార్యక్రమాలు మరియు ప్రజారోగ్య కార్యక్రమాల్లో యోగాను చేర్చడానికి ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 15,000 మంది పాల్గొన్నారు.న్యూస్రీల్ -
రథయాత్ర నిర్వహణపై సమీక్ష
మల్కన్గిరి: ఈనెల 27వ తేదీ నుంచి జూలై 5 వరకు చేపట్టనున్న రథయాత్ర నిర్వహణపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముందుగా పోలీసులు రథ చక్రాల స్థితి పరిశీలన చేయాలన్నారు. వాహనాల నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించారు. రథం లాగే సమయంలో అందుబాటులో అంబులెన్స్తో పాటు వైద్యుడు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది సైతం అందుబాటులో ఉండాలని సూచించారు. పట్టణంలోని ముఖ్యమైన చోట్ల నీటి ట్యాంకులు అందుబాటులో ఉంచాలని పీహెచ్డీ విభాగ సహాయక ఇంజినీర్కు అదేశించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులను స్వచ్ఛందంగా సేవల కోసం నియమించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శొబరో, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, తహసీల్దార్ టికును పుటా, ఐఐసీ రీగాన్కీండో, డీఐపీఆర్వో ప్రమిళా మాఝి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ కోర్టు ప్రారంభం
కొరాపుట్: జిల్లాలోని కోట్పాడ్ పట్టణంలో ఫ్యామిలీ కోర్టు సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. జయపూర్ కుటుంబ న్యాయస్థానం జడ్జి నిషిత్ నిశాంక్ కోట్పాడ్ కోర్టులో సర్క్యూట్ ఫ్యామిలీ కోర్టు సేవలు ప్రారంభించారు. ప్రతీ నెలకు రెండుసార్లు కేసులు విచారించనున్నారు. దీంతో ఇకపై కోట్పాడ్ ప్రాంతానికి చెందిన కక్షిదారులు జయపూర్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. కోర్టుకి వచ్చిన జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి పట్నాయక్, మాజీ అధ్యక్షుడు పంకజ్ పాత్రో స్వాగతం పలికారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్జయపురం: సబ్ డివిజన్ కోట్పాడ్లో గత మూడేళ్లుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం పురపాలక సంస్థ కోట్పాడ్ గాంధీ జంక్షన్ వద్ద, బిజూ పట్నాయిక్ జంక్షన్ వద్ద సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేసింది. అయితే ఆ రెండు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అప్పటినుంచి పనిచేయడం లేదని వెల్లడించారు. అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని వాపోతున్నారు. ఈ రెండు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను బాగు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు కొరాపుట్: జయపూర్లో నూతనంగా ప్రారంభించనున్న కేంద్రీయ విద్యాయలంలో లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరిగింది. శనివారం బాయ్స్ హైస్కూల్ సమీపంలోని విద్యాలయం ఆవరణలో జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి పర్యవేక్షణలో లాటరీ తీశారు. జూలై నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభమవ్వనున్నాయి. ఒకటి నుండి 5 తరగతులకు 1,009 మంది అప్లికేషన్లు ఇచ్చారు. ఒక్కొక్క తరగతికి 40 సీట్లు ఉన్నాయి. దీంతో సీట్ల కేటాయింపులో అవకతవకలు చోటుచేసుకోకూడదని అందరి ముందు లాటరీ తీశారు. కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ హరిహర పండా, కొరాపుట్ కేవీ ప్రిన్స్పాల్ సరోజ్ కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సెలవులు రద్దు భువనేశ్వర్: సువర్ణ రేఖ నది ఉప్పొంగడంతో వరద పరిస్థితి నెలకొని ఉంది. ఉధృతి క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బాలాసోర్ జిల్లా యంత్రాంగం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. సెలవులో ఉన్న ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూర్యవంశీ మయూర్ వికాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా తమ ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లరాదని ఆదేశించారు. బాలాసోర్ జిల్లా జలేశ్వర్ మండలం రాజ్ఘాట్ సమీపంలో సువర్ణ రేఖ నది ప్రమాద సంకేతం దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు గ్రామాల్లో వరద పరిస్థితులు తాండవిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో భొగరాయ్ మరియు బలియాపాల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వరద నీరు ఖొల్లాబాడియా, కుల్హా, బౌంసఖానా, కుదమాన్సింగ్, చౌదరికుద్, బలియాపాల్ వంటి గ్రామాలను ముంచెత్తింది. కొన్ని రోడ్లపై నాలుగు అడుగుల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జల దిగ్భందంలో చిక్కుకున్న ప్రాంతాలు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నాయి. భోగరై, జలేశ్వర్, బలియాపాల్ మండలాల్లోని పలు పంచాయతీలు వరద ఉన్నాయి. -
రాష్ట్రంలో సుపరిపాలన సంవత్సరం
బీజేపీ ఏడాది పాలన పూర్తి మహోత్సవ వేదికపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్ర గవర్నరు తదితర ప్రముఖులు ● ప్రధాన మంత్రి నరేంద్ర మోదీభువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో ఒడిశా సుపరిపాలన సంవత్సరం వేడుకల్ని జరుపుకుంటోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు మోహన్ చరణ్ మాఝి అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. స్థానిక జనతా మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో బీజేపీ పాలన తొలి ఏడాది పూర్తి వార్షికోత్సవ సభలో శుక్రవారం ప్రధాన మంత్రి ప్రసంగించారు. గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆయన బృందం అద్భుతమైన పనితీరును ప్రదర్శించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ దక్షత ఒడిశాలో సుపరిపాలన సంవత్సరంగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. తొలి ఏడాది పాలనలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సేవతో ప్రజా ప్రభుత్వంగా ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకోవడంపై దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒడిశా ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసి రాష్ట్రానికి మరింత ఉజ్వలమైన, జవాబుదారీ భవిష్యత్తుకు పునాది వేసిందని ఆయన ప్రోత్సహించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తుందని ప్రధాన మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వ భావి కార్యాచరణ ప్రణాళిక సంచికని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. 2036 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒడిశా ఏర్పడి శతాబ్ది పూర్తి చేసుకునే సందర్భంగా, 2047లో భారత దేశం స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తి సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రోడ్మ్యాప్ సంచిక రూపు దిద్దుకుంది. 2036 నాటికి ఒడిశాను 500 బిలియన్ల యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 1.5 ట్రిలియన్ల యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యంగా పేర్కొన్నారు. జీ 7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా అధికారిక పర్యటన తర్వాత వాషింగ్టన్కు రావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించి రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ పాలన ఏడాది పూర్తి ఉత్సవానికి హాజరైనట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. వార్షికోత్సవం ప్రాంగణం వరకు నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటితో పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. -
‘విశ్రాంతి గృహానికి స్థలమివ్వాలి’
జయపురం: దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధి చెందిన గుప్తేశ్వర్ శివ క్షేత్రంలో రాత్రులందు భక్తులు ఉండేందుకు ఒక విశ్రాంతి గృహం నిర్మించేందుకు 15 సెంట్ల స్థలం కేటాయించాలని బొయిపరిగుడ సమితి రామగిరి పంచాయతీ పూజారి పుట్, మాలిగుడ, అటల్గుడ, బదుడిపహాడ్, అంబొచందిలి, కలియజులి, మండుకఝొరణ, గదబగుడ, బాగ్ఝోల, పురాణ పాని, గెల్లాగుడ, మాలిపొదర్, జమేల్బెడ, దండకొల ఆదివాసీ యువకులు సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. వారు సబ్ కలెక్టర్కు ఒక వినతి పత్రం సమర్పించారు. గుప్తేశ్వర ప్రాంతంలో చుట్టు పక్కల గ్రామాలలో నివసించే గుప్తేశ్వరుని భక్తులు రాత్రిళ్లో గుప్తేశ్వరంలో ఉంటున్నారని, వారికి ఎలాంటి సదుపాయం లేదని, విశ్రాంతి గృహానికి స్థలం కేటాయించాలని కోరారు. -
విజయోత్సవ సభ వీక్షణం
కొరాపుట్: ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్లు సాధించిన విజయాలపై జయపూర్లో ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం జరిగింది. జయనగర్ చిల్డ్రన్ పార్క్ సమీపంలో ప్రధాని నరేంద్రమదీ రాష్ట్ర రాజధానిలో జరిగిన అధికారిక కార్యక్రమాన్ని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. స్థానికంగా ప్రభుత్వం తరఫున జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం సశ్యా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత హాజరయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇందిరా లక్ష్మీ పండా కుటుంబాన్ని ఇదే కార్యక్రమ వేదికపై యెగా క్షేమాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో జయపూర్ ప్రజలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన
మల్కన్గిరి: ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు ప్రాంతంలో మాక్డ్రిల్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ముఖ్యంగా బాదిలి, గిరకానపల్లి, మోటు, ధుంగియాపూట్ ప్రాంతాల్లో వరద ఆశ్రయ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, ఎమర్జెన్సీ అధికారి ప్రపుల్ల బేహేరా గిరకానపల్లి ఆశ్రయ కేంద్రాలను సందర్శించారు. జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి కూడా ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించే ముందు , తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచకుని ప్రజలు తమ ధన, జీవనాన్ని రక్షించుకోవడానికి, ఇతరులను సురక్షితంగా ఉంచేందుకు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండేలా అవగాహన కల్పించారు. అగ్నిమాపిక సిబ్బంది వరదలు, తుఫాన్, మెరుపులు, గర్జన, భూకంపం, పాముకాటు సంభవించే విపత్తులపై ప్రాథమిక చికిత్స, రక్షణ పద్ధతుల ప్రదర్శణ చేశారు. విపత్తు సమయంలో గ్రామస్థాయిలో ఎలర్ట్ టీమ్, రెస్క్యూ టీమ్, నష్టఅంచనా, సహయకేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. -
నేడు యోగా దినోత్సవం
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా శిబిరం శనివారం ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ తెలియజేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్, యోగా భ్యాసం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ యోగా దినోత్సవానికి పతంజలి యోగా సమితి జిల్లా ప్రభారి భిఘ్నేశ్వర్ దాస్ బృందం జిల్లాలో పర్లాకిమిడితో పాటు చంద్రగిరి, నువాగడ, గుమ్మా, ఆర్.ఉదయగిరిల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. దీనికోసం గత నెల రోజులుగా పతంజలి యోగా సమతి సభ్యులు యోగాభ్యాసాలు చేస్తున్నారన్నారు.మద్యం అరికట్టాలని ఫిర్యాదు కొరాపుట్: తమ ప్రాంతంలో మద్యం అరికట్టాలని నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్కి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కి చందాహండి సమితి మెహర్ గ్రామ పంచాయతీ బారిగుడ గ్రామస్తులు శుక్రవారం తరలివచ్చారు. తమ గ్రామంలో అక్రమ మ ద్యం తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వాపోయారు. దీనివలన విద్యా ర్థులు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తామ ఎకై ్సజ్ శాఖకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. దీనికి తగిన ఆధారాలతో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జలంధర్ మజ్జి తదితరులు ఉన్నారు. ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్టు గార: మండలంలోని సిలగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరుగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6600 స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు. కాగా, పట్టుబడిన వారిలో మండలానికి చెందిన ఒక వీఆర్వో కూడా ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం రూరల్: చాపురం పంచాయతీ రామిగెడ్డ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతుండగా 8 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.4వేలు రికవరీ చేసినట్లు చెప్పారు. జాయింట్ పట్టాదారుల విభజనకు ప్రత్యేక డ్రైవ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా వెబ్ల్యాండ్–2.0లో నమోదైన రైతులు ప్రభుత్వ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శుక్రవారం తెలిపారు. రెవెన్యూ శాఖ సాధారణంగా వసూలు చేసే రూ.500 రుసుము మినహాయించి రూ.50 నామమాత్రపు రుసుముతో జాయింట్ పట్టాల విభజ న చేసేందుకు వీలు కల్పించామని పేర్కొన్నారు. జూన్ 30లోపు గ్రామ సచివాలయాల ద్వారా దరఖా స్తు చేసుకోవాలన్నారు. భూవివరాల విభజన అనంతరం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇతర పథకాల కోసం రైతులు అర్హులుగా పరిగణిస్తారని జేసీ స్పష్టం చేశారు. ఇప్పటికే పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాయింట్ పట్టాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవలో అర్హత కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. పేద రైతులకు ఇది గొప్ప అవకాశమని, జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలోని అనివెట్టి మండపంలో కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ఓంకార్ అకాడమీ గురువు చిత్రా త్యాగరాజన్ శిష్యులు మండా వెంకట నిషాల్ శుక్రవారం భరతనాట్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ కోసం మాజీ ఎమ్మెల్యే సతీమణి వినతి
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సదన్ నాయిరక్ భార్య తిలోత్తమ నాయిక్ తనకు పింఛన్ మంజూరు చేయమని వేడుకుంటున్నారు. ఈ మేరకు కొరాపుట్ పెన్షనర్స్ అదాలత్ను ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్యే గత జనవరి నెలలో చనిపోయారు. బిజూ పట్నాయిక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990లో కొట్పాడ్ నియోజక వర్గం నుంచి నాయిక్ జనతాదల్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికై 1995 వరకు ఎమ్మెల్యే కొనసాగారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిరువురు వివాహితులు. కొట్పాడ్ సమితిలో చిత్రగుడ లో తిలోత్తమ నాయిక్ ఉంటున్నారు. భర్త పోయిన తరువాత ఆమె ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భర్త చనిపోయిన తరువాత పింఛన్ వస్తుందని ఆశించారు. కానీ భర్త సదన్ నాయిక్ పెన్షన్ బుక్లో ఆమె పేరులేక పోవటంతో సమస్య అయింది. మాజీ ఎమ్మెల్యే అయిన సదన నాయిక్ భార్యనైన తనకు పింఛన్ మంజూరు చేయాలని ఆమె ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర పెన్షన్ విభాగం వారు గురువారం కొరాపుట్లో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిసి తిలోత్తమ నాయిక్ అక్కడకు వెళ్లి లిఖిత పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన వద్దగల ఆధారాలు సమర్పించగా..అధికారులు సంతకాలు తీసుకొని రాష్ట్ర పెన్షన్ అధాలత్ విభాగానికి పంపుతామని తెలిపినట్లు ఆమె వెల్లడించారు. -
రాత్రికి రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు
భువనేశ్వర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాంగ్రెసు యువజన, విద్యార్థి వర్గాల నాయకుల్ని అరెస్టు చేసి ఠాణాలో నిర్బంధించారు. ఈ చర్యకు నిరసనగా ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి ప్రముఖులు శుక్ర వారం శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. పోలీసు చర్యల్ని తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరాహార దీక్షలో, ప్రదేశ్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ కాంగ్రెస్, పీసీసీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా నిరాహార దీక్ష చేశారు. భారత ప్రధాన మంత్రి గంజాం జిల్లా గోపాల్పూర్ గ్యాంగ్రేప్ స్థలాన్ని సందర్శించి భవిష్యత్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాదని రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాజ్పూర్ జిల్లాను సందర్శించి కలరా ప్రభావిత ప్రాంతం పరిస్థితిని ప్రధాన మంత్రి ప్రత్యక్షంగా సమీక్షించి ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దే చర్యగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రికి నిర్దిష్ట సూచనలు జారీ చేయాలని కాంగ్రెసు ప్రముఖులు కోరారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు పోలీసులు మాజీ విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు యాసిర్ నవాజ్, ఇతర యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని గురువారం రాత్రి స్థానిక రాజధాని పోలీస్ ఠాణాలో నిర్బంధించారు. -
ఆశా కార్యకర్తల సమ్మె నోటీసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు మంజూరు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయా లని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో అంతా పాల్గొనా లని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయు డు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.అనితకు సమ్మె నోటీసు అందజేశారు. పేదలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న తమకు కార్మికులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాల ని విన్నవించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. -
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్డ్రిల్
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి సత్రంగ్ గ్రామంలో వరద ప్రమాద బాధితుల పునరావాస ఆశ్రమంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్డ్రిల్ నిర్వహించారు. కొట్పాడ్ సమితి బీడీఓ సంధ్యారాణి సమరత్ అధ్యక్షతన ముందస్తు జాగ్రత్తలపై వివరించారు. ప్రజలను రక్షించేందుకు వినియోగించే యంత్ర సామగ్రి, ఇతర సామగ్రిని ప్రదర్శించారు. వాటిని ఎలా వినియోగించాలో మాక్డ్రిల్ చేసి చూపించారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీమతి సుమిత్ర దేవి త్రిపాఠీ పిఇఓలు అజిత్ కుమార్ నాయిక్, సుధాంశు రథ్, రంజిత్ నాయిక్, గణేష్ కులదీప్, రశ్మితా దాస్, మురళీ పట్నాయిక్, మమత భొత్ర తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్: ప్రకృతి విపత్తులపై శుక్రవారం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బలియా గ్రామ పంచాయతీ లోని తుఫాన్ విపత్తుల రక్షణ భవనం వద్ద మాక్డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ సిలెండర్ అగ్ని ప్ర మాదం నుంచి ఎలా తప్పించుకోవాలో చూపించా రు. సీపీఆర్పై గిరిజనులకు అవగాహన కల్పించారు. -
లక్ష్య సాధనకు విద్య కీలక మాధ్యమం: గవర్నరు
భువనేశ్వర్: యువత జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కలల్ని సాకారం చేసుకునేందుకు విద్య అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పేర్కొన్నారు. విద్య వ్యక్తిగతంగా శక్తివంతం చేయడమే కాకుండా సమగ్ర సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందని గిరిజన విద్యార్థుల్ని ఆయన ప్రోత్సహించారు. గిరిజనుల హక్కులు, వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను విద్యార్థులు అర్థం చేసుకుని అవగాహన వ్యాప్తి చేయడం ద్వారా సమాజంలోని ఇతరులు ఈ పథకాల నుంచి ప్రయోజనం పొందగలుగుతారు. గిరిజన విద్యార్థులు ఈ దిశలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అవగాహన సందర్శన పర్యటనలో భాగంగా గిరిజన విద్యార్థుల బృందం స్థానిక రాజ్ భవన్ సందర్శించింది. ఈ సందర్భంగా రాజ్ భవన్పాత అభిషేక్ హాల్లో గవర్నరు వారితో సంభాషించారు. పర్యటన పురస్కరించుకుని విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 14 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న ప్లస్ టూ, ప్లస్ త్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలకు చెందిన 72 మంది గిరిజన విద్యార్థులు రాజ్ భవన్ను సందర్శించారు. ఈ బృందంతో గవర్నర్ ముఖాముఖి సంభాషించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ తెగల కోసం ఉద్దేశించిన వివిధ సంక్షేమ పథకాల గురించి గిరిజన విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకుని వారి వర్గాలలో ఈ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ తెగలకు అందుబాటులో ఉన్న రిజర్వేషన్ శాతం గురించి విద్యార్థులకు తెలుసా అని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు, ఈ అవకాశాలను ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. -
ఎన్నికల హామీలు ఏమయ్యాయి..?
పర్లాకిమిడి: ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని వికాస్ ఉత్సవాలు చేసుకుంటున్న బీజేపీ రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. స్థానిక తెలుగు సొండివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని చిట్ఫండ్ నేరస్తులను అరెస్టు చేస్తామని చెప్పిన ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో గత ప్రభుత్వం 5 నుంచి 6 కిలోలు ధాన్యం కోత విధిస్తుండగా, ఈ ప్రభుత్వం వచ్చాక 8 నుంచి 9 కిలోల వెయిటేజ్ కోత విధిస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు అందిస్తున్న సుభద్ర పథకం కింద రూ.50 వేల వోచర్లు ఇస్తామని చెప్పి, రూ.10 వేలు అకౌంట్లో వేసి అన్ని జిల్లాల్లో వికాస్ మేళా నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ ఒడిశాలో సమగ్ర ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం చేసి 51 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు కానీ, అది ఇంతవరకూ అమలు కాలేదని దుయ్యబట్టారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ తరపున పోరాడతామని తెలియజేశారు. ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, అభిమన్యు పండా (మాజీ కౌన్సిలర్), మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాస్మిన్ షేక్, రంజితా పాణి, పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ సంజయ్ అధికారి, సంగ్రాం సాహు, బిష్ణుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
కోలుకుంటున్న జగన్నాథుడు
పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషధీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు. ● నేడు దశ మూలికల గుళికల సమర్పణభువనేశ్వర్: జ్యేష్ట పూర్ణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను -
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
సివాన్: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్లోని సివాన్ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్లోని పాటలీపుత్ర జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్లో మళ్లీ జంగిల్రాజ్ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. విపక్ష కూటమి నినాదం పరివార్కా సాత్, పరివార్కా వికాస్. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో తిరంగా యాత్ర, రోడ్షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నుంచి జనతా మైదాన్ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ నాతో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్కు రాలేనంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. -
జీ 7 ప్రముఖులకు బహుమతులుగా రాష్ట్ర కళాఖండాలు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు. జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమర్పించారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడం రఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం. -
ప్రభుత్వ అధికారిక చిహ్నాల దుర్వినియోగం
భువనేశ్వర్: రాష్ట్రంలో కలహండి ప్రాంతంలో శిక్షణ కొనసాగిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి తన వ్యక్తిగత కారుపై ప్రత్యేక లైటు, ముందు భాగంలో ఐఏఎస్ ప్రొబేషనర్ రాతతో బోర్డు అమర్చడం వివాదాస్పదమైంది. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం అనధికారిక చర్యగా పరిగణిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించింది. విభాగం అదనపు కార్యదర్శి కలహండి కలెక్టర్ను ఈ వివాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రొబేషనర్ ఏ అధికారం కింద ప్రైవేట్ వాహనంపై అలాంటి అధికారిక చిహ్నాన్ని ఉపయోగించారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. -
పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం
భువనేశ్వర్: ఇండిగో విమానం పక్షిని ఢీకొనడంతో పైలెట్ అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నింగికి ఎగిరే ముందు పక్షి ఢీకొట్టింది. భువనేశ్వర్ నుంచి కోల్కతాకు బయల్దేరే ఇండిగో విమానం 6ఈ–6101 గురువారం ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయట పడింది. పైలెట్ వెంటనే టేకాఫ్ను నిలిపి వేసి సురక్షితంగా ఉండటానికి అత్యవసర బ్రేక్లను వేశాడు. తక్షణమే విమానం పరిస్థితిని తనిఖీ చేశారు. ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ సంఘటన కారణంగా కొంతసేపు విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. భువనేశ్వర్ విమానాశ్రయం పరిసరాల్లో అడ్డంకులు: డైరెక్టర్ విమానం గాలిలో ఎగిరేందుకు, నేలపై వాలేందుకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు అడ్డంకులు ఉన్నాయని డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. ఈ మార్గంలో పెద్ద పెద్ద చెట్లు ఎదిగి ఉన్నాయి. రన్వేకి స్వల్ప దూరంలోనే అక్రమంగా నిర్మితమైన ఎత్తైన భవనాలు కూడ అడ్డంకిగా పరిణమించాయని ఆయన వివరించారు. గత నెలలో జరిగిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ (ఏఈఎంసీ) సమావేశంలో స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ కమిషనర్కు ఈ విషయం గురించి తెలియజేశారు. విమానాశ్రయంలో ఎత్తుగా ఎదిగిన చెట్లను నరికివేసి, అడ్డంకిగా నిలిచిన ఎత్తైన భవనాలను కూల్చివేయాలని విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న బీఎంసీ అధికార వర్గాలకు వివరించారు. ఈ నెల 30న మాక్ డ్రిల్ ఈ నెల 30వ తేదీన స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ జరుగుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. దీని కోసం పౌర విమానయాన డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) సూచనలు జారీ చేసింది. విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది ఈ కసరత్తులో పాల్గొంటారు. ప్రమాదం వంటి ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే దానిని ఎదుర్కొనే సన్నద్ధతపై అనుబంధ యంత్రాంగాన్ని చైతన్యపరచడం ఈ కసరత్తు లక్ష్యగా పేర్కొన్నారు. రవాణా రెట్టింపు అవుతుంది స్థానిక బీపీఐఏ విమానాశ్రయంలో విమానాల రవాణా రెట్టింపు చేసే యోచనతో యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. నింగికి ఎగరడం, నేలకు వాలడం కోసం విమానాలకు మౌలిక సదుపాయాలతో అనుకూలమైన విధానం ప్రవేశ పెట్టనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. దీనితో విమానాశ్రయం కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల నవీకరణతో రన్వే సామర్థ్యం గంటకు రెండింతలకు పెరుగుతుంది. ప్రస్తుతం గంటకు 12 విమానాల రవాణా కొనసాగుతుంది. నవీకరణతో ఈ సామర్థ్యం గంటకు 24 విమానాల వరకు పెరుగుతుంది. గతంలో విమానాలు నేలకు వాలిన తర్వాత నింగికి ఎగిరేందుకు రన్ వే గుండా వెనక్కి మలుపు తిప్పడం అనివార్యం కావడంతో ఆలస్యం జరిగేది. నవీకరణ పురస్కరించుకుని విమానాశ్రయంలో ట్రాక్లు విమానాలు వేగాన్ని తగ్గించకుండా రన్ వే నుంచి త్వరగా నిష్క్రమించడానికి వీలు కల్పిస్తారు. రూ. 48 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ఇటీవల పౌర విమానయాన డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) నుంచి వాస్తవ కార్యాచరణకు అనుమతి లభించింది. ఈ మార్పులకు సంబంధించి విస్తృత సమాచారం కోసం భారత దేశ ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ (ఏఐపీ)లో ప్రతిబింబిస్తారు. తద్వారా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు మరియు విమానయాన సంస్థలకు సమాచారం అందుతుంది. భద్రతా జాగ్రత్తల దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి అడ్డంకి పరిమితి ఉపరితలాలు (ఓఎల్ఎస్) సర్వే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన కార్యాచరణ నిర్వహణ కోసం స్థానిక పౌర సంస్థలతో కలిసి విమానాశ్రయ వర్గాలు సమన్వయంతో పని చేస్తారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న భవనాలు, చెట్ల ఎత్తును తగ్గించనున్నారు. భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని, పౌర విమానయాన నియమాలు 2025 ప్రకారం పౌర విమానయాన శాఖ సంబంధిత యజమానులకు తాఖీదు జారీ చేస్తుంది. పౌర విమానయాన అధికార వర్గాల తాఖీదు అందిన 60 రోజుల గడువు లోగా యజమాని ఇంటి ఎత్తును తగ్గించాల్సి ఉంటుంది. విమాన రవాణా మార్గానికి అడ్డుగా ఉన్న ఏదైనా చెట్టును వెంటనే నరికి వేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ఇంటి యజమాని పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి యజమాని నిర్ణీత సమయంలోపు భవనాలను కూల్చి వేసి ఎత్తు తగ్గించని పరిస్థితుల్లో విమానాశ్రయ అధికారి జిల్లా కలెక్టర్కు తెలియజేస్తారు. తదనంతరం జిల్లా కలెక్టర్ జోక్యంతో ఇల్లు, చెట్ల ఎత్తు తగ్గిస్తారు. అత్యవసర బ్రేకుతో తప్పిన ముప్పు -
జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: ఒక జాలరి అకస్మాత్తుగా లక్షాధికారి అయ్యాడు. వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకే సారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. బాలలను పనిలో పెట్టుకోకూడదు పర్లాకిమిడి: జిల్లాలో బాలలను పనిలో పెట్టుకోవడాన్ని నిషేధించాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బాల కార్మికుల నిర్మూలనపై జిల్లా కార్మిక ఉపాధి అధికారి భారతీ బెహరా అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశం గురువారం జరిగింది. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. దీనిపై జిల్లా టాస్క్ఫోర్సు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రజల్లో బాల కార్మికుల చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, డీఈవో డా.మాయాధర్ సాహు పాల్గొన్నారు. పునరావాసం కల్పించాలి జయపురం: ™èlÐ]l$MýS$ ç³#Æ>-ÐéçÜ… MýSÍ-µ…-^éÌS° ÝëŠి-f… MðS¯éÌŒæ Æøyýl$zÌZ° V>ÅÆó‡ gŒæ Ķæ$f-Ð]l*-¯]l$ Ë$, Ð]lÆý‡PÆý‡$Ï fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ MýSÌñæMýStÆŠ‡ AMýSP-Ð]lÆý‡… MýS$Ð]l*Ç ÔŸÔèæÅ-Æð‡yìlz° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. D Ðól$Æý‡MýS$ çÜ»Œæ MýSÌñæ-MýStÆŠ‡ M>Æ>Å-ÌS-Ķæ*-°MìS ÐðlãÏ yìlç³NÅsîæ MýSÌñæ-MýStÆŠ‡ ¯]l{Ñ$™èl VúyìlĶæ$MýS$ ѯ]l-†-ç³{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. V>ÅÆó‡gŒæË$ ™öÌS-W…-_¯]l ™èlÆ>Ó™èl ™èlÐ]l$ iÑ-™éË$ {ç³Ð]l*§ýl…ÌZ ç³yézĶæ$° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ™èlÐ]l$ çÜÐ]l$-çÜÅË$ AÆý‡¦… ^ólçÜ$-Mö° B§ýl$-Mø-ÐéÌS° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. ç³rt-×ê°MìS Æð‡…yýl$ Ìôæ§é Ð]lÊyýl$ MìSÌZÒ$-rÆý‡Ï §ýl*Æý‡…ÌZ ™èlÐ]l$MýS$ çܦÌS… MóSsê-Ƈ$$…^éÌS° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. ѯ]l-†-ç³{™èl… A…§ýl-gôæíܯ]l ÐéÇÌZ V>ÅÆó‡gŒæ Ķæ$f-Ð]l*-¯]l$ÌS çÜ…çœ$ A«§ýlÅ-„ýS$yýl$ ¼.M>…-™é-Æ>Ð]l#, M>Æý‡Å-§ýlÇØ í³™é…-ºÆý‡ ¯éƇ$$MŠS, MðS.¯éÆ>-Ķæ$-׿Æð‡yìlz, ^èl…{§ýl-»êVŠæ, h.}¯]l$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ఆవును రక్షించిన అగ్నిమాపక సిబ్బంది జయపురం: స్థానిక స్థానిక జైలు రోడ్డులోని ప్రాథమిక పాఠశాల పక్కననున్న మున్సిపాలిటీ కాలువలో బుధవారం సాయంత్రం ఒక ఆవు కాలుజారి పడిపోయింది. లోతైన, ఇరుకు కాలువ కావడంతో స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అతికష్టంగా స్థానికుల సహకారంతో దాదాపు రెండు గంటలు ప్రయత్నించి ఎట్టకేలకు ఆవును బయటకు తీసి రక్షించారు. దీంతో స్థానికులు సిబ్బందిని అభినందించారు. -
నేడు బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలి సారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని శుక్రవారం తొలి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యక్షంగా ప్రధాన మంత్రి ప్రసంగించనున్న జనతా మైదానం సందర్శించి ఏర్పాట్లని గురువారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయనతో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి పర్యటన కార్యక్రమాలు ●ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీపీఐఏ)చేరుతారు. ● ప్రధానమంత్రికి సంప్రదాయ రీతుల్లో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రధాన మంత్రి విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం జనతా మైదాన్ వరకు భారీ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మార్గంలో రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే అనేక ఒడియా జానపద సంగీతం, నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహక వర్గాలు తెలిపాయి. ● ఊరేగింపుతో సభా ప్రాంగణంకు చేరడంతో జనతా మైదానంలో సాయంత్రం 4.15 గంటల నుంచి 5.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రూ. 17,000 కోట్ల విలువైన కొత్త అభివృద్ధి మరియు సంక్షేమ ప్రాజెక్టుల ప్రారంభిస్తారు. రాష్ట్ర వృద్ధికి దీర్ఘకాలిక భావి ప్రణాళిక కార్యాచరణ వివరించే ఒడిశా విజన్ డాక్యుమెంట్ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. ● ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. తిరిగి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థానిక విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.50 గంటలకు న్యూ ఢిల్లీకి బయలుదేరుతారు. భారీ భద్రత బందోబస్తు ప్రధాన మంత్రి పర్యటన పురస్కరించుకుని భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), కమిషనరేట్ పోలీస్, అగ్ని మాపక దళం, రాష్ట్ర నిఘా, ఉగ్రవాద వ్యతిరేక యూనిట్లతో బహుళ వర్గాలతో భద్రతా వలయం ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు జరిగే భారీ ఊరేగింపు బాధ్యతల్ని భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో నగరాన్ని విమానాశ్రయం నుండి సభా ప్రాంగణం వరకు నో–డ్రోన్, నో–ఫ్లై జోన్గా ప్రకటించారు. వేడుకలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 60 మంది ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఓఏఎస్) అధికారులను నియమించింది. ● ప్రధాన మంత్రి రాక ప్రత్యేక ఆకర్షణ -
గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని..
గ్రామస్తుల సమస్యలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే మెళియాపుట్టి: సుమారు 1300 అడుగుల ఎత్తులో, ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామం గొట్టిపల్లి పంచాయతీ చందనగిరి గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పర్యటించారు. గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో గిరిజన గ్రామాలకు రహదారులు వేశామని గుర్తు చేశారు. చందనగిరి గ్రామానికి రహదారి, తాగునీటి సదుపాయం కల్పించడమే కాకుండా.. ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక నిధులతో ట్రాక్టర్ ద్వారా కొండపైకే రేషన్ సరుకులు అందించామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. చందనగిరి గ్రామం నుంచి రేషన్ సరుకులు తీసుకోవడానికి కాలినడకన కొండదిగి నేలబొంతు గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. నేడు గిరిజన గ్రామాలకువెళ్తే ఎక్కడచూసినా జగనన్న ఇచ్చిన తాగునీరు, రహదారులు, భవనాలు కనిపిస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. జగనన్న మళ్లీ ముఖ్యమత్రి అవుతారని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. అంతకుముందు గ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో గౌరమ్మ అనే వృధ్ధురాలు బియ్యం మూట పట్టుకుని కొండ ఎక్కుతున్న సమయంలో రెడ్డిశాంతి ఆమెను ఆటో ఎక్కించి పంపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సవర ఆదినాయుడు, సర్పంచ్ డొలిబేరు జమ్మయ్య, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ పోలాకి జయమునిరావు, కో ఆప్షన్ సభ్యుడు భాస్కరదాస్, నాయకులు బైపోతు ఉదయ్కుమార్, కరణం శశిభూషణరావు, అలికాన మాధవరావు, సవర సుభాస్, గొల్ల జనార్దన, జన్ని నాగేశ్వరరావు, పెద్దబొంతు అప్పారావు, ఢిల్లీ, సలాన చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన కొండపైకి మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గిరిశిఖర గ్రామం చందనగిరిలో పర్యటన గిరిజన మహిళలతో మాటామంతీ -
హోటళ్లపై ఆకస్మిక దాడులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్, ఫుడ్ ఇన్స్పెక్టర్ పంకొజిని బెహురీలు బుధవారం సాయంత్రం పలు హోటళ్లలో ఆకస్మిక దాడులను నిర్వహించారు. గుణుపూర్ కొత్తబస్టాండు వద్ద గల హోటళ్లలో దాడులను నిర్వహించిన అధికారులు అయా హోటళ్లలో పరిశుభ్రత లోపం, నిల్వ ఉన్న ఆహారాలను గుర్తించి జరిమానా విధించారు. వర్షాకాలం కావడంతో డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహారంలో నాణ్యత లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దాడులు చేస్తున్నామన్నారు. -
కొండను ఆక్రమించుకుంటే సహించేది లేదు
రాయగడ: విలువైన వృక్ష సంపద, ఔషధ మొక్కలను నాశనం చేసి కొండను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని బిసంకటక్ సమితి బక్సీసిరిపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బిసంకటక్ పోలీసుస్టేషన్, అటవీ శాఖ, తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలను సమర్పించారు. బక్సీసిరిపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వలాభాల కోసం గ్రామ సమీపంలోని చెట్లను నరికివేస్తున్నారని పేర్కొన్నారు. కొండపై ఉన్న వృక్ష సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పచ్చని చెట్లు, విలువైప ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కొండపై ఉన్నాయని, అదేవిధంగా అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధిని పొందే ఎంతోమంది ఈ కొండపై ఆధారపడుతున్నారని తెలియజేశారు. స్వప్రయోజనాల కోసం కొండను నాశనం చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని కొండను కాపాడాలని కోరారు. -
మేమేం చేయలేం!
జీడి పిక్కల ధరలా.. పలాస: పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఉద్దానం ప్రజల జీవనాధారమైన జీడి రైతులు కూటమి సర్కారు తీరుతో ఉసూరుమన్నారు. జీడిపిక్కల కొనుగోలు, ధరల విషయమై జీడి రైతాంగ పోరాట కమిటీ నాయకులు గురువారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్దానం జీడి రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల విషయంపై జీడి రైతాంగ కమిటీ కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, రైతు నాయకులు అంబటి రామకృష్ణ, కోనేరు రమేష్, మడ్డు రాఘవరావు, అర్లి దానేసు తదితరులు ఎమ్మెల్యేకు వివరించారు. గత ఎన్నికల సమయంలో బస్తా జీడి పిక్కలను రూ.16వేలుకు కొనుగోలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బస్తా పిక్కలు ధర రూ.13,500 ఉందని చెప్పారు. అదే ధరకు రైతులంతా తప్పని పరిస్థితిలో జీడి పిక్కలను పలాస వ్యాపారులకు అమ్ముకున్నారని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో కూడా రూ.13,500 మాత్రమే ఉందని, పెరుగుతుందని ఆశించినా రైతులకు నిరాశ తప్పలేదన్నారు. జూన్లో పెరగడం పోయి ధరలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ప్రతినిధులు ఎంత నెత్తుకొట్టుకున్నా ఈ ధరలు తమ చేతుల్లో లేవని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఒక్క మాట చెప్పి చేతులెత్తేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైతాంగ ప్రతినిధులు నిరాశతో తిరిగి వచ్చేశారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు.. జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేయాల్సిన సమయంలో పరిశ్రమలను ఎందుకు బంద్ చేశారని అటు జీడి కార్మికులతో పాటు జీడి రైతులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మార్కెట్లో జీడి పప్పు ధర ఏమాత్రం తగ్గడం లేదు. పలాస కాష్యూలేబర్ యూనియన్, పలాస కాష్యూ అసోసియేషన్ రెండు సంఘాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. గత 20 రోజులుగా జీడి కార్మికులకు ఉపాధిలేదు. ఉద్దానం ప్రాంతంలో జీడి పిక్కలు కొనడానికి జీడి వ్యాపారులు ముందుకు రావడం లేదు. వారు కొనుగోలు చేయలేకపోవడానికి వారి వద్ద తగిన డబ్బులు లేవని ఆ వ్యాపారస్తులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జీడి కార్మికులకు , అటు జీడి రైతులకు తగిన న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే శిరీష తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంపై రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ చట్టసభలు, వివిధ రూపాల్లో పోరాటాలు చేయాల్సింది పోయి ఈ విధంగా తాము ఏమీ చేయలేమని చెప్పడం సరికాదని చెబుతున్నారు. చర్చల్లో చేతులెత్తేసిన పలాస ఎమ్మెల్యే శిరీష నిరాశతో బయటకు వచ్చేసిన జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు అధికార పార్టీ తీరుపై మండిపాటు -
రబీ ధాన్యం కొనుగోలుకు సమయం పెంచాలి
జయపురం: కొరాపుట్ జిల్లా రైతుల నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేయాలని జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ కృషక మోర్చా, కొట్పాడ్ రబీ మండీ కమిటీలు ప్రతినిధులు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. గురువారం కొట్పాడ్ కృషక మోర్చా అధ్యక్షుడు సీతానాథ్ బిశ్వాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పలువురు రైతులు జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అందులో జూన్ 2 నుంచి మండీలలో రబీ ధాన్యం కొనుగులు చేస్తామని ప్రకటించిన అధికారులు.. రైతులకు టోకెన్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కొట్పాడ్లో 10వ తేదీన మండీలు ప్రారంభించారని, గత 8 దినాలలో రైతుల నుంచి ధాన్యం కొనలేదని ఆరోపించారు. ధాన్యం కొనేందుకు కలహండి, బలంగీర్ మిల్లర్లతో అగ్రిమెంట్ జరిగిందని, కానీ ఏ మిల్లరు రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనలేదని ఆరోపించారు. కొట్పాడ్లో 605 మంది రైతులు సహకార సమితిలో సభ్యులుగా చేరారన్నారు. వారిలో 181 మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారని వెల్లడించారు. 605 మంది రైతుల వద్ద 62,514 క్వింటాళ్ల ధాన్యం ఉన్నాయని, 15,868 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొన్నారన్నారు. మిగతా ధాన్యం మండీలు, ఇళ్ల వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 2 నుంచి 18వ తేదీ వరకు అంటే 17 దినాలలో 15,868 క్వింటాళ్ల దాన్యం కొన్నారని, ఇంకా 13 దినాలు మాత్రం మిగిలి ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిలో రోజుకు రెండు ట్రక్కుల రావటం కష్టంగా ఉందని, కొన్ని దినాలలో అసలు ట్రక్కులే రావటం లేదని వెల్లడించారు. ట్రక్కులు మిల్లర్ల చేతులలో ఉన్నాయన్నారు. మండీ బాధ్యతలు నిర్వహిస్తున్న సహకార సమితి, మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ కలుగజేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని అధికారులకు తెలిపినా పట్టించుకోవటంలేదని ఆరోపించారు. అధికారుల నిర్ణయం ప్రకారం ఈ నెల 30వ తేదీలోగా ఎన్ని ధాన్యం కొంటారని ప్రశ్నించారు. అందు వల్ల మరో 15 రోజులు సమయం పెంచాలని రైతులు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంజయ కుమార్ నాయక్, సుమన్ నాయక్,సీతారాం సామంతరాయ్, తదితరులు పాల్గొన్నారు. -
నయాఘడ్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
పర్లాకిమిడి: స్థానిక హైస్కూల్ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం నయాఘడ్ ఎమ్మెల్యే అరుణ్ సాహు దిష్టిబొమ్మను ట్రాన్స్జెండర్లు దహనం చేశారు. జూన్ 17న నయాగడ్ శాసనసభ్యులు అరుణ్ సాహు పూరీలో బహిరంగంగా బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి (మైచియా అని) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ట్రాన్స్జెండర్స్కు క్షమాపణలు చెప్పాలని జిల్లా కిన్నెరుల సంఘం అధ్యక్షుడు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. కిన్నెరులు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే 30 జిల్లాలల్ల సంఘంగా ఏర్పడి స్వతహాగా తమ కాళ్లపై నిలదొక్కుకుంటున్న సమయంలో శాసనసభ్యులు అరుణ్ సాహు ట్రాన్స్జెండర్స్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నయాఘడ్ ఎమ్మెల్యే అరుణ్ సాహు క్షమాపణలు చెప్పకుంటే రాస్తారోకో ఆందోళన చేపడతామని, దీనికి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుదని జాస్మిన్ షేక్ అన్నారు. ఈ ఆందోళనలో మధుబోరాడో, స్వీటీ తదితరులు పాల్గొన్నారు. -
జీతం కోసం కలెక్టర్కు దరఖాస్తు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో వివిధ 14 తెగలకు చెందిన పూజార్లు నెలవారీ వేతనం కోసం గురువారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్కు వినతి పత్రం అందజేశారు. గిరిజనులకు మూలికలతో వైద్యం కూడా చేస్తున్నామని, అయినా ప్రభుత్వం తరఫున ఎలాంటి సౌకర్యాలు దొరకడం లేదన్నారు. వికాస వాహనానికి ఘన స్వాగతం జయపురం: రాష్ట్రంలో మోహన్ చరణ్ మఝి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని పంచాయతీల్లో తిరుగుతున్న వికాస వాహనం గురువారం కుంద్ర సమితి డొంగరపంశి పంచాయతీకి చేరింది. వాహనానికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అటవీ విభాగం ద్వారా ప్రజలతో మొక్కలు నాటించారు. అనంతరం కొత్త రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఘాశీ భొత్ర, గ్రామ పంచాయతీ అధికారి, అటవీ విభాగ అధికారి, సామాజిక సురక్షా అధికారి, లేబర్ విభాగ అధికారి పాల్గొన్నారు. -
శ్రీ జగన్నాథునికి మసృణ లేపన సేవ
భువనేశ్వర్: రాజ వైద్యుల ఆధ్వర్యంలో తెర చాటున గోప్యంగా చికిత్స పొందుతున్న శ్రీ జగన్నాథుడు క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు వస్తున్నాయి. అనవసర నవమి తిథి పురస్కరించుకుని గురువారం మూల విరాటులకు మసృణ లేపన సేవతో వైద్యం కొనసాగించారు. సుభాషిత నువ్వుల నూనెలో గుగ్గిలం జోడించి మిశ్రమంగా తయారు చేసి మూల విరాట్లకు లేపనం చేయడాన్ని మసృణ లేపన సేవగా వ్యవహరిస్తారు. ఇంతకు ముందు అనవసర పంచమి నాడు మూల విరాటుల అంగాలకు ఫులురి తైల మర్దన చేసిన విషయం తెలిసిందే. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నూతన జాతీయ విద్య విధానంపై అభివృద్ధి మేళాలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్ ప్రధాన్ హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని డిగ్రీ, డిప్లమా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకంగా ఒడియా భాష, కళలు, సంస్కృతిపై దృష్టి పెట్టాలన్నారు. నూతన జాతీయ విదా విధానంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. 250 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 30 యూనిట్ల రక్తం సేకరణ పర్లాకిమిడి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో గురువారం రక్తదాన శిబిరాన్ని గజపతి జిల్లా బ్లడ్ డోనర్స్ సంఘం ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్య వైద్యాధికారి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, సీనియర్ ఫార్మాసిస్టు ఖగేశ్వర బెహరా తదితరులు హాజరయ్యాన్నారు. 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో గజపతి బ్లడ్ డోనర్స్ సంఘం అధ్యక్షుడు గవర నవీన్కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.రుషి, కె.శరత్కుమార్, క్రాంతి బెహరా, సుస్మిత, మోహినీ ప్రదాన్పాల్గొన్నారు. యోగా దినోత్సవం విజయవంతం చేయండి శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జరిగే యోగాలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అనే థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా, అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల సమన్వయకర్త గ్రేస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 19 నుంచి జిల్లాలోని 8 పాఠశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలురుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్ల గురుకులంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరో తరగతిలో 279 సీట్లు, ఏడో తరగతిలో 155 సీట్లు, ఎనిమిదో తరగతిలో 92 సీట్లు, 9వ తరగతిలో 96 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాలకు 9701736862 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేష్కుమార్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూటికుప్పల సురేష్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నాగళ్ల మురళీధర్, జిల్లా కార్యదర్శిగా కవిటి దేవరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శిగా కిల్లి కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. -
ముగిసిన అభివృద్ధి మేళా
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రం డీఎన్కే క్రీడా మైదానంలో గత వారం రోజులుగా నిర్వహించిన అభివృద్ధి మేళా గురువారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధి మేళాను నిర్వహించారు. చివరి రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బోండా, కోయి, శాంతాలి, గదబ, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య బృందాలకు జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సోభరో సర్టిఫికెట్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ దారులుకు అభినందనలు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను అభినందించారు. -
ఇంటిని తీసుకుంటే బతికేదెలా?
సారవకోట: కుమార్తెలు ఆదరించడం లేదంటూ సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శిమ్మ చిన్నమ్మి వాపోయింది. తనకు ముగ్గురు కుమార్తెలున్నా ఎవరూ ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుంచి సంక్రమించిన ఇంటిని సైతం చిన్న కుమార్తె ఆధీనంలో తీసుకుని ఇంటి నుంచి పంపించేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిపై తహశీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె తన ఇంటిని తనఖా పెట్టి రూ.3 లక్షలు అప్పు తీసుకుని చెల్లంచనందున, అప్పు ఇచ్చిన వారు ఆ ఇంటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆ ఇంటిని తీసుకుంటే తనకు నిలువు నీడ కూడా ఉండదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కలప అక్రమ రవాణా అడ్డగింత ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట, కింతలమిల్లు జంక్షన్ వద్ద విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా లారీ, బొలెరో వాహనాల్లో తరలిస్తున్న కలపను గుర్తించారు. రూ.39,405 విలువైన తొమ్మిది క్యూబిక్ మీటర్లు కలిగిన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు సతీష్కుమార్, రవిప్రసాద్, సీఐలు రామారావు, అశోక్, ఎస్ఐలు పీసీలు ఈశ్వరరావు, కన్నబాబు, లక్ష్మీనారాయణ, శేషగిరి, సాయిరాం పాల్గొన్నారు. -
రథయాత్రకు ప్రజలు సహకరించాలి
పర్లాకిమిడి: ఈ నెల 27న పర్లాకిమిడి రాజవీధిలో జరుగనున్న జగన్నాథస్వామి రథయాత్రకు సంబంధించి రెండోసారి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన జిల్లా స్వయం ఉపాధి గ్రామీణ సమావేశ మందిరంలో గురువారం ఉదయం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రథయాత్ర కమిటీ చైర్మన్ సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్పండా, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర్ కెరకెటా, తదితరులు హాజరయ్యారు. సమావేశంలో రథయాత్ర కమిటీతో కలెక్టర్ పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రథయాత్రలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. ఆంధ్ర, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే ఆటోలకు పాత ఫైర్ స్టేషన్ వద్ద పార్కింగ్ సదుపాయం, రాజవీధిలో గుండిచా బడి వెళుతున్న మార్గమధ్యంలో చిల్లర, బోమ్మల దుకాణాలు ఎత్తివేయించాలని పురపాలక ఈఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది రథయాత్రకు అధిక సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అన్నప్రసాదాలు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. మరో నాలుగు రోజుల్లో మూడు జగన్నాథ రథాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని రథయాత్ర కమిటీ సభ్యులు కలెక్టర్కు నివేదించారు. -
ప్రధాని మోదీ పర్యటన రేపు
భువనేశ్వర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకుని భారీ సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక లోక్ సేవా భవన్లో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి ఈ నెల 20న మధ్యాహ్నం 2.05 గంటలకు ఉత్తర ప్రదేశ్లోని కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.40 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతారు. అక్కడి నుంచి ప్రధాన మంత్రి నేరుగా సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి జనతా మైదాన్కు చేరుకుంటారు. అగ్నిమాపక సేవల శాఖ ఏర్పాట్లు, పత్రికా సమన్వయం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా ఆకస్మిక ప్రణాళిక, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, రోడ్డు నిర్వహణ, పారిశుద్ధ్యం, అసెంబ్లీ ప్లాట్ఫారం సెటప్, పాస్ జారీ, మీడియా ప్రచారం, వేదికల వద్ద ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలపై తదుపరి చర్చలు జరిగాయి. ఈ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి హోం శాఖ అదనపు కార్యదర్శి (ప్రోటోకాల్) పర్యవేక్షణలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన మంత్రిని స్వాగతించడానికి స్థానిక విమానాశ్రయం, రాజ్ భవన్, కళింగ స్టేడియం, జయదేవ్ విహార్, జనతా మైదాన్ వంటి కీలక ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. జనతా మైదాన్లో సభకు భారీ సంఖ్యలో జనసమూహం వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నిర్వహణ, అనుబంధ కార్యకలాపాలను క్రమబద్ధంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను ఖరారు చేశారు. స్థానిక జనతా మైదాన్ బహిరంగ స్థలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. -
అధ్వానంగా జయపూర్ రోడ్డు
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల్లోనే అతి పెద్ద పట్టణమైన జయపూర్–జయనగర్ మార్గం మురికి కూపంలా మారింది. పంచానన్ మందిరం నుంచి జగన్నాథ్ సాగర్ మీదుగా జయనగర్ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలి పోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్డు బురద మయం అవుతున్నది. ఈ ప్రాంతంలో జగన్నాథసాగర్ పూడిక తీత వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తుండడంతో ఆ మట్టి రోడ్డుపై పడుతుండడంతో అధ్వానంగా తయారవుతోంది. ఎండఉంటే వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఈ మార్గం కాదనుకుంటే క్రిష్టియన్పేట, మెయిన్ రోడ్డు మీదుగా సుమారు ఆరు కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు స్పందించి బురదను తొలగించాలని సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలకు ట్రాక్టర్పై కూలిన భారీ వృక్షం కొరాపుట్: భారీ వర్షాలకు వృక్షం నేలకూలింది. బుధవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి సెమలా గ్రామంలో భీమ్ కిర్సాని ట్రాక్టర్ మీద వృక్షం పడింది. ఆ సమయంలో మనుషులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వృక్షం కావడంతో ట్రాక్టర్ దెబ్బతింది. నందపూర్ సమితి కేంద్రం నుంచి అగ్ని మాపక బృందం వచ్చి చెట్టుని తొలగించింది. చోరీ కేసులో ఆరుగురు అరెస్టు రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలొని కంసారిగుడలో మైత్రీ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఇనుప సామగ్రీ చోరీ కేసులో ఆరుగురు నిందితులను టికిరి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సమితిలోని పహండి గ్రామానికి చెందిన బారబార బాగ్, పద్మన్ బాగ్, భీమసేన్ ఒడాది, సుదీప్ బెనియ, అజయ్ ధల్, శేఖ్ అమీరులుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం కోర్టుకు తరలించారు. కాంసారి గుడలో మైత్రీ కంపెనీ కర్మాగారం నిర్మాణం పనులను చేపట్టింది. ఇందులో భాగంగా సెంట్రింగ్ ప్లెట్లు, ఇనుప రాడ్లు తదితర సామగ్రి దొంగతనానికి గురైంది. దీంతో కంపెనీకి సంబంధించిన పీఆర్వో ఆశీష్ కుమార్ టికిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం నాడు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సనోమాటికొన కూడలిలో ఇనుప రాడ్లను బైకులపై తీసుకువెళుతున్న యువకులను పట్టుకున్నారు. వారిని విచారించగా ఇనుప సామగ్రిని తామే దొంగిలించి వేరే వారికి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో సామగ్రిని దొంగతనం చేసిన వారితోపాటు కొనుగోలు చేసిన వారిపని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. 11 అడుగుల కొండచిలువ పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీపీ 22 గ్రామంలో నివసిస్తున్న తుషార్ కాంత్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో 11 అడుగుల కొండ చిలువ హల్చల్చేసింది. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పాము కనిపించడంతో కలిమెల స్నేక్హెల్ప్ లైన్ రాకేష్ హల్దార్కు సమాచారం ఇచ్చారు. ఆయన తన సిబ్బందితో వచ్చి పామును పట్టుకున్నారు. ఉదయం అడవిలో విడిచిపెట్టారు. -
విపత్తులు ఎదుర్కొనేలా మాక్డ్రిల్
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయి టేబుల్ టాప్ అభ్యాసం, మాక్డ్రిల్ను బుధవారం ఏడీఎం, ఫాల్గుణీ మఝి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటరు సుభోధ్ నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ఎమర్జెన్సీ అధికారి జగన్నాఽథ్ పాఢి, ప్రజా ఆరోగ్యశాఖ అసిస్టెంటు ఇంజినీరు బిష్ణుప్రసాద్ అగర్వాల్, అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్ (ఫైర్) అమితాబ్ రాజ్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విపత్కర సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఏడీఎం మఝి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా బరంపురం నుంచి వచ్చిన ఓడ్రాఫ్ సిబ్బంది, జిలా అగ్నిమాపక దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. తుఫాను, వరదలు వచ్చినప్పుడు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లు తొలగించడానికి కట్టర్లు, అస్కా విద్యుత్ లాంతర్లు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఆక్సిజన్ సిలెండర్లు, జనరేటర్లు ఉపయోగించి ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలో అగ్నిమాపక దళం మ్యాక్ డ్రిల్ చేశారు. -
22 నుంచి సామూహిక సెలవులు
జయపురం: అటవీ విభాగ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టారు. మంగళవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. తమ డిమాండ్లు ఆమోదించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని అటవీ విభాగ జయపురం జోనల్ సంఘ కార్యదర్శి గౌతమ స్వైయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గౌతమ స్వైయ్ మాట్లాడుతూ గత మే నెల 24 వ తేదీన డెంకానల్ అటవీ డిబిజన్లో ప్రహ్లాద్ ప్రధాన్ పెట్రోలింగ్ చేస్తున్నారని, ఆ సమయంలో వేటగాళ్ల తూటాలకు గురై అతతడు మరణించాడని వెల్లడించారు. ప్రహ్లాద్ ప్రధాన్ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నాన్గెజిటెడ్ అటవీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకు అటవీ ఆయుక్త ఏర్పాటు చేయాలని, పోలీసులకు వలే అటవీ విభాగ సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని తాము ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని, అయితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉద్యోగులు అందరూ సామూహిక సెలవు పెట్టి అటవీ డివిజన్ కార్యాలయం ముంగిట ధర్నాలు చేస్తామన్నారు. -
తెంతులకుంటి సమితిలో ఎమ్మెల్యే పర్యటన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితిలో బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తొలిసారిగా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి తెంతుల కుంటి సమితి కేంద్రాన్ని సందర్శించారు. బీజేపీ కార్యాకర్తలు మేళతాళాలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. బీజేడీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సమితి గత ఎన్నికల్లో బీజేపీకి చిక్కింది. బీజేడీ కి చెందిన సమితి చైర్మన్ నీలాద్రి నాయక్ అవిశ్వాస తీర్మానంతో దించాలని సొంత పార్టీ నిర్ణయించింది. దీంతో ఆమె బీజేపీని ఆశ్రయించింది. కేవలం బీజేపీ ఆ సమితిలో ముగ్గురు సమితి సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ లౌక్యంతో మరికొందరు మద్దతు పలికారు. తద్వారా అవిశ్వాస తీర్మానానికి సరిపడా కోరం లేక వీగిపోయింది. చివరకు చైర్మన్ నీలాద్రి మజ్జి బయట పడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తెంతుల కుంటి సమితికి ఆహ్వానించి విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంజ దాస్, సీనియర్ నాయకులు కను దాస్, దేవదాస్ మహాంకుడో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ విఫలయత్నం
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025సీఎం నివాసం ముట్టడికి..వంశీకృష్ణ హోటల్ యజమానికి జరిమానా భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటనలు పెచ్చు మీరుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా పరిణమిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కొరవడింది. డబుల్ ఇంజిన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి వార్షికోత్సవంలో తలమునకలై ఉంది. రాష్ట్రంలో ప్రతి రోజూ 15 మందికి పైగా మహిళలు, మైనరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. రాష్ట్రంలో 64,000 మందికి పైగా మహిళలు మరియు పిల్లలు తప్పిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన మంత్రి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కెంజొహర్ ప్రాంతం హరిచందన్పూర్లో మహిళపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీశారు. మరెన్నో ఇలాంటి సిగ్గు చేటు అకృత్యాలు నిత్య కృత్యాలుగా పరిణమిస్తున్నా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనల పట్ల చీమ కుట్టినట్లు అయిన స్పందించక పోవడం విచారకరమని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జి అజయ్ కుమార్ లల్లూ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు అన్ని జాతీయ రికార్డులను బద్దలు కొట్టిన ఏకై క రాష్ట్రం ఒడిశా అని ఆయన వ్యాఖ్యానించారు. గంజాం జిల్లా గోపాల్పూర్, కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్, కటక్ జిల్లా బరాంగ్ మరియు అంగుల్ జిల్లా కనిహా మండలంలో జరిగిన భయంకరమైన మూక హత్యలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు నిరసనకారులు విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరుగుతున్నందున ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా సంబరాలు చేసుకోవడం విచారకరమని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జి విమర్శించారు. మహిళలపై దారుణాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరవధికంగా పోరాడుతుందని ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినీపతి అన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళలను ఆట బొమ్మలుగా భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతుందని అన్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ భవన్ నుంచి బయల్దేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి నివాసం ముట్టడించేందుకు బారికేడ్లను బద్దలు కొట్టి ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు సారథ్యం వహించిన ముందంజ నాయకుల్ని పోలీసులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు రామచంద్ర కదమ్, ఎమ్మెల్యేలు అశోక్ దాస్, సోఫియా ఫిరదౌసి, మహిళా కాంగ్రెసు నాయకురాలు మీనాక్షి బాహినీపతి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘెరావ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూస్రీల్ -
జంట నగరాల్లో పాఠశాలలకు సెలవు
భువనేశ్వర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని జంట నగరాలు భువనేశ్వర్, కటక్ మహానగరం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 20 శుక్రవారం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భువనేశ్వర్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సామూహిక అత్యాచారంపై ఎంపీ మండిపాటు కొరాపుట్: బ్రహ్మపుర సమీపంలోని గోపాల్ పూర్ సీ బీచ్లో సామూహిక అత్యాచారంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క మండిపడ్డారు. ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించామని చెబుతున్న అధికార బీజేపీ సాధించిందేమిటో అర్థం అవుతుందన్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. ఏడాది విజయాలు జరుపుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై ప్రకటన చేయాలన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దీనిపై తాను పార్లమెంట్లో కూడా ప్రశ్నలు లేవనెత్తానన్నారు.విపక్ష నేత నవీన్ పట్నాయక్కు అనారోగ్యం భువనేశ్వర్: రాష్ట్రంలో విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు ఆయన ఈ నెల 22న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో గర్భాశయ ఆర్థరైటిస్ చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. విపక్ష నేత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రమాకాంత్ పండా ముంబైలో అనుబంధ కార్యకలాపాలు సమన్వయం చేస్తున్నారు. జగన్నాథ స్వామి ఆశీస్సులు, రాష్ట్రంలో సోదర సోదరీమణుల శుభాకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కొనసాగించడానికి త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన సాంఘిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ అనారోగ్యం గురించి తెలిసి ఆందోళన చెందుతున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందించారు. ఆయన చికిత్స ప్రక్రియ సజావుగా పూర్తియి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం వర్ధిల్లాలని శ్రీ జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం నరసన్నపేట: లేని మద్యం స్కామ్ను చూపించి చంద్రబాబు ప్రభుత్వం అనేక మంది వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కరరావును అరెస్టు చేయడం అన్యాయమన్నా రు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకానికి చెవి రెడ్డి అరెస్టు పరాకాష్ట అని అన్నారు. ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యా లు సృష్టించి సిట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో అదుపులోనికి తీసుకున్న వరకూ చెవిరెడ్డి ఈ కేసులో నిందితుడిగా నమోదు కా లేదని, కేసులకు భయపడేది లేదని తెలిపారు. -
చేతివృత్తులకు చేయూత అందించాలి
● బీజేపీ నేతలు జగన్నాథ మహాపాత్రో, ప్రశాంత్ పాలోపర్లాకిమిడి: వికాస్ మేళాలో హస్తశిల్పి కళాకారులు, చేతి వృత్తులు, జిల్లా పరిశ్రమల శాఖ సమన్వయంతో జిల్లా ఇండస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం అవగాహన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో హస్తకళల నిగమ్ అధికారి బిభురంజన్ స్వయిని, హస్త శిల్పి అధ్యయన అధికారులు సుశీల్ కుమార్ బారుద్, ప్రియాంకా పాత్రో, బీజేపీ కృషక్ మోర్చా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ పాలో, జిల్లా సాధారణ కార్యదర్శి (బీజేపీ) జగన్నాథ మహాపాత్రో హాజరయ్యారు. ముఖ్యమంత్రి మోహాన్ మఝి ప్రభుత్వం.. జిల్లా హస్తకళాకారులు, చేతివృత్తులు వారికి చేయూతనిచ్చే విశ్వకర్మ యోజనా పథకం ద్వారా లబ్ధిపొందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను బీజేపీ శ్రేణులు కోరారు. చేతివృత్తులవారు ఈ విశ్వకర్మ యోజనా పథకం కింద శిక్షణ పొంది మూడు మాసాలైనా ఇప్పటివరకు టీఏ, డీఏ పొందలేకపోయామని శిక్షణార్థులు ఎకరువు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వ అధికారులు కూడా మారాలని జిల్లా బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో అన్నారు. హస్త శిల్పి కళాకారులు, చేతి వృత్తులు, ఆత్మనిర్భర్ భారత్పై అనేక సార్లు ప్రధాని మోడీ గురుత్వపూర్ణ ప్రసంగాలు చేశారన్నారు. అందువల్ల వారికి ఈ పథకం వర్తించాలని బీజేపీ కృషక్ మోర్చా నాయకులు ప్రశాంత్ పాలో అన్నారు. విశ్వకర్మ యోజన పథకం 18 కులాలు చేతివృత్తులు, హస్తకళాకారులకు వర్తింపజేయాలని అధికారులను కోరారు. -
పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తాం
కొరాపుట్: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అదాలత్ బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సద్భావన స్వగృహంలో నిర్వహించారు. కొరాపుట్, మల్కన్గిరి జిల్లాలకు చెందిన వారి వినతులు అధికారులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారిక బృందంతోపాటు ఇరు జిల్లాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 500 వినతులు వచ్చాయని, అందులో ప్రత్యక్షంగా 60 మంది వినతిపత్రాలతో వచ్చారని అధికారులు ప్రకటించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లా నుంచి 400 వినతులు వచ్చాయని, మరో 40 మంది నేరుగా వచ్చి ఫిర్యాదులు చేశారన్నారు. రిటైర్మెంట్ రోజునే ఫైనల్ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వైపు ఇదే శిబిరానికి కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే సదానాయక్ సతీమణి తిలోత్తమ నాయక్ వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఎమ్మెల్యే పని చేశారన్నారు. ఆయన ఇదివరకే మృతి చెందారన్నారు. తనకు పెన్షన్ రాకుండా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బ్యాంక్కు వెళ్తే ట్రెజరీకి వెళ్లమన్నారని, ట్రెజరికి వెళ్తే కలెక్టర్కు కలవమన్నారని వాపోయారు. తాను ఇదే శిబిరంలో ఫిర్యాదు చేశానన్నారు. -
ప్రతి గిరిజనుడు విద్యావంతుడు కావాలి: సీఎం
భువనేశ్వర్: రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వంలో గిరిజన సంస్కృతి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రాష్ట్ర జనాభాలో 40 శాతం దళిత, షెడ్యూల్డ్ కుల వర్గాలు. వీరి అభివృద్ధితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముడి పడి ఉంది. ప్రతి గిరిజన కుటుంబంలో విద్యావంతుల్ని ఆవిష్కరించడంతో గిరిజన సమాజ అభివృద్ధి బలం పుంజుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగించారు. ప్రతి గిరిజన వ్యక్తిని విద్యావంతునిగా మలిచేందుకు ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు. మయూర్భంజ్ జిల్లా బరిపద ప్రాంతం చౌ మైదానంలో రాష్ట్ర స్థాయి ఆదివాసీ శక్తి సమావేశం ప్రారంభం పురస్కరించుకుని ఆయన బుధవారం ప్రసంగించారు. రాష్ట్ర షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ సమావేశం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న గిరిజన వర్గాలను ఒకచోట చేర్చి సాంస్కృతిక మార్పిడి, ఐక్యతను పెంపొందించేందుకు అవకాశం కల్పించిందని ముఖ్యమంత్రి కొనియాడారు. దళిత, వెనుకబడిన వర్గాల్లో విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక స్థాయిలలో షాహిద్ మాధో సింగ్ హత్తొ ఖొర్చొ (చేతి ఖర్చులు) పథకం ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. షాహిద్ లక్ష్మణ్ నాయక్ ఆదర్శ్ ఆశ్రమ విద్యాలయ యోజన కింద రూ. 100 కోట్ల వ్యయ ప్రణాళికతో రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గిరిజన జానపదాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి చేసినందుకు వివిధ గిరిజన వర్గాల వ్యక్తులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నిత్యానంద గోండ్ (ఎస్టీ – ఎస్సీ అభివృద్ధి), రబీనారాయణ్ నాయక్ ఽ(పంచాయతీరాజ్, తాగు నీరు), డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో (గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి), గణేష్ రామ్ సింగ్ ఖుంటియా (అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు) గిరిజన సంక్షేమం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సభా కార్యక్రమానికి రాజ్య సభ సభ్యురాలు మమతా మొహంతా, బాలాసోర్ లోక్ సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి, మయూర్భంజ్ లోక్ సభ సభ్యుడు నొబొ చరణ్ మాఝీ, శాసన సభ సభ్యులు భాస్కర్ మధేయ్ (ఉదొలా), పద్మ చరణ్ హైబురు (కరంజియా), భదవ్ హంసదా (సొరొసొకొణా), ప్రకాశ్ సోరెన్ (బరిపద), జలెన్ నాయక్ (రాయిరంగపూర్), సంజలి ముర్ము (బంగిరిపొషి), సనాతన్ బిజులి (బొడొసాహి) తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
అధికారాలు సాధిస్తాం
అటవీ భూములపైరాయగడ: ఏళ్ల తరబడి ఆదివాసీలు అడవి తల్లిని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులే వీరి జీవనాధారం. ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మారడం లేదు. అడవుల్లో ఉన్న ఆదివాసీలకు అటవీ భూమి పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేక కష్టాలు పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో గల భూములను సాధించుకుని తీరుతామని సీపీఐ (ఎంఎల్) మద్దతుతో ఆదివాసీ సంఘర్స్ మోర్చ (ఎఎస్ఎం) నాయకులు అన్నారు. బుధవారం జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల జెరెడీ గ్రామ పంచాయతీలోని తొలొసికబడి గ్రామ సమీపంలో గల అడవుల్లో ఎర్రజెండాలను పాతిపెట్టారు. భూమిని ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ తీరును ఎత్తి చూపుతూ ఆదివాసీలంతా కలిసి వారి సంప్రదాయ ఆయుధాలను పట్టుకుని అటవీ భూముల్లో ఎర్రజెండాలను పాతిపెట్టారు. ఈ గ్రామంలో ప్రారంభమైన ఈ పోరాటం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ నెల 6వ తేదీన అటవీ భూములను ఆదివాసీలకు అప్పగించి వారి పేరిట పట్టాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదివాసీ సంఘర్ష మోర్చా ఆందోళన చేపట్టింది. ఈ మేరకు కొలనార తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. అధికారుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపొవడంతో అటవీ భూముల్లో ఆదివాసీలు హక్కు సాధించుకుంటారని, ఈ పోరాటం కొనసాగుతోందని సీపీఐ (ఎంఎల్), ఆదివాసీ సంఘర్ష మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. -
2036 నాటికి మారనున్న రాష్ట్ర రూపురేఖలు
● కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చరాయగడ: రానున్న 2036 ఏడాది నాటికి రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపొయే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొరాపుట్ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం మచ్చ అన్నారు. స్థానిక బిజు పట్నాయక్ ఆడిటోరియంలో బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వికసత్ ఒడిశా–వికసిత్ జిల్లా పేరిట నిర్వహించిన వర్క్షాప్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతోందన్నారు. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మాట్లాడుతూ.. వికసిత్ జిల్లాగా అభివృద్ధిని చూడాలంటే అంతా కలసికట్టుగా కృషి చేయాలని అన్నారు. లక్ష్య సాధనకు చేయిచేయి కలపాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముంతో, కటక్ రెవేన్సా కళాశాల అధ్యాపకులు కిషొర్ చంద్ర నాయక్, విద్యావేత్త డీకే మహాంతి తదితరులు ప్రసంగించి అభివృద్ధికి నాంది పలకాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చను అధికారులు సత్కరించారు. -
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: జయపురం సమితి పంపుణీ గ్రామ పంచాయతీలో లిజెండ్ 2025 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా సీనియర్ క్రీడాకారుడు నిరాకర రౌత్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఔత్సాహిక యువ క్రీడా కారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రారంభంలో మొదటి మ్యాచ్ పంపుణీ రోయల్ చాలెంజేస్, లిజెండ్ పంపుణీ–11 జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంపుణీ రోయల్ చాలెంజెస్ టీమ్ నిర్ణీత 15 ఓవర్లలో 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్ ప్రారంభించిన పంపుణీ లిజెండ్–11 టీమ్ గెలవాలన్న పట్టుదలతో ఆడి 10.5 ఓవర్లలో తన విజయ లక్ష్యం 141 పరుగులు చేసి పంపుణీ రోయల్ చాలెంజెస్ టీమ్ను ఓడించింది. లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు సుధీర్ రౌత్, సింహాచళ ప్రధాన్, రఘునాథ్ బెహర పాల్గొన్నారు.రెగ్యులర్ బీడీవో లేక ఇబ్బందులు జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో రెగ్యులర్ బీడీవో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కొంతమంది యువకులు బొయిపరిగుడ సమితి కార్యాలయానికి వచ్చి బీడీవో కార్యాలయంలో లేక పోవటంతో పనులు జరగ నిరాఽశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు పత్రికల వారితో మాట్లాడుతూ.. తాము తమ పనుల కోసం ఎన్ని పర్యాయాలు వచ్చినా బీడీవో లేక పనులు జరగడం లేదని వాపోయారు. బొయిపరిగుడ బీడీవో అభిమణ్య కవి శతపతి గత మే నెల 31వ తేదీన రిటైర్ అయ్యారని.. ఆ తరువాత బీడీవోను నియమించకపోవడంతో తమకు ఇబ్బందులు వచ్చాన్నారు. ప్రభుత్వం పర్మినెంట్ బీడీవోను నియమించకుడా జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రోకు అప్పగించినట్టు వెల్లడించారు. రెండు సమితిల బాధ్యతలు చేపట్టిన శక్తి మహాపాత్రో బొయిపరిగుడ సమితికి ఎప్పుడు వస్తారో తెలియటం లేదన్నారు. దీంతో సమితిలోని 20 గ్రామ పంచాయతీల ప్రజలు పలు పనులపై బొయిపరిగుడ వస్తూ అధికారి లేక పోవటంతో నిరాశతో వెనుతిరుగుతున్నట్టు చెప్పారు. సుమారు 80, 90 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి వస్తున్నప్పటికీ బీడీవో లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్టు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రెగ్యులర్ బీడీవోను నియమించి సమస్యను పరిష్కరించాలని కోరారు.అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం కొరాపుట్: అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కొత్త మార్కెట్ (రైతు బజార్) వెనుక వైపు కన్యకా పరమేశ్వరి దేవాలయం మార్గంలో పార్క్ గోడకి అనుకుని ఉన్న చిన్న సందులో యువకుడి (30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇదే సందులో చివరి భాగాన ఒక అనుమానాస్పద బ్యాగ్ పడి ఉంది. హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. జిల్లా కేంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రంగవల్లి తివాచీ భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం సింహ ద్వారం ముంగిట కనులు మిరమిట్లు గొలిపే భారీ రంగవల్లి తివాచీ తీర్చిదిద్దారు. రథ యాత్ర కోసం శ్రీ మందిరం నుంచి విచ్చేయనున్న జగతి నాథునికి స్వాగతం పలికేందుకు ప్రతిభావంతులైన కళాకారులు ఉత్సాహంతో దీన్ని రూపొందించారు. కళాకారులను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర్ అరవింద కుమార్ పాఢి ప్రత్యేకంగా అభినందించారు. -
జాతీయ జూడో చాంపియన్షిప్కు.. మల్కన్గిరి విద్యార్థుల ఎంపిక
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభీమాన్ ఏరియా బోడపోదర్ పంచాయతీ లాంబాసింగ్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ విద్యార్థులు రుక్నాఽథ్ సీస, రవినాథ్ జిగిడి నాయక్గూడ పాఠశాలలో చదువుతున్నారు. ఆర్థికంగా వెనుకబడినా క్రీడా ఆసక్తిని కనబర్చడంతో మల్కన్గిరి ఔమా గురుకులం, జూడో అసోసియేషన్ సభ్యులు గుర్తించారు. మల్కన్గిరి ఔమా గురుకులంలో శిక్షణ ఇచ్చారు. వీరు జాతీయ స్థాయి చాంపియన్షిప్కు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ అన్నారు. బుధవారం ఇద్దరు విద్యార్థులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. వారి ప్రయాణం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జరగనున్న జూడో పోటీల్లో పాల్గొంటారన్నారు. వీరికి జిల్లా యంత్రాంగం రెడ్ క్రాస్ నుంచి ఆర్థిక సహాయం అందజేశారు. -
డ్రైవర్ల సమస్యలపై ఎస్పీకి వినతి
రాయగడ: విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వివిధ వాహనాల డ్రైవర్లు కోరారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్ కుమార్కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఒడిశా డ్రైవర్ల మహాసంఘం రాయగడ శాఖకు చెందిన డ్రైవర్లు ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఒడిశా మెటార్ ట్రాన్స్స్పొర్ట్ డ్రైవరు అండ్ వర్కర్స్ సంక్షేమ బోర్డులో డ్రైవర్ను సభ్యునిగా చేర్పించాలన్నారు. అలాగే డ్రైవర్లపై జరుగుతున్న దాడులపై జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి తగు రక్షణ కల్పించాలని వివరించారు. డ్రైవరుగా విధులు నిర్వహించి 60 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. పార్కింగ్ చేసేందుకు నిర్ధిష్టమైన స్థలాన్ని పట్టణంలోని ప్రతీ ప్రాంతంలో ఏర్పాటు చేయా లని కోరారు. ఒడిశా డ్రైవర్ల మహాసంఘం కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ తురక్ నేతృత్వంలో డ్రైవర్లు ఈ మేరకు ఎస్పీకి విన్నవించారు. -
అత్యాచార నిందితుడు అరెస్టు
జయపురం: బాలికను అపహరించి అత్యాచారం చేసిన నేరంపై ఒక వ్యక్తిని జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. అరైస్టెన వ్యక్తి కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కక్కిరిగుమ్మ పంచాయతీ తునాపొదర్ గ్రామానికి చెందిన రాజ కందపాన్ ఉరఫ్ టుకులు, ఉరఫ్ ముకుంద అని పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని బెయిలు మంజూరవ్వకపోవడంతో జైలుకు తరలించామన్నారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురానికి చెందిన ఒక మైనర్ బాలిక 2024లో ఒక వివాహ విందుకు వెళ్లింది. అక్కడ ఆమెకు రాజకంద పాల్ పరిచయమయ్యాడు. అప్పటినుంచి వారిరువురు ఫోనులో మాట్లాడుకోవటం ప్రారంభమయింది. అయితే ఈ ఏడాది మార్చి రెండో వారంలో రాజకందపాన్ ఆ బాలికను అపహరించి తీసుకెళ్లిపోయాడు. మైనర్ బాలికను అతడు కేరళ తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు గత ఏప్రిల్ 3వ తేదీన మైనర్ బాలికను కనుగొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పుడు పరారైన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
20న ప్రెస్ యూనియన్ వార్షికోత్సవం
రాయగడ: ఈ నెల 20వ తేదీన ప్రెస్ యూనియన్ తొమ్మిదో వార్షికోత్సవం జరగనుంది. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో జరగనున్న కార్యక్రమానికి కదాంబిని మాస పత్రిక సంపాదకురాలు డాక్టర్ ఇతిరాణి సామంత ముఖ్యఅతిథిగా, కొరాపుట్ విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిఖిల్ కుమార్ గౌడ ముఖ్యవక్తగా, గౌరవఅతిథిగా అఖిల భారతీయ సాంత సమితి అధ్యక్షులు దండి స్వామి భాస్కర తీర్థలు హాజరుకానున్నట్లు యూనియన్ అధ్యక్షులు అమూల్య రత్న సాహు ,కార్యదర్శి శివాజీ దాస్లు మంగళవారం తెలిపారు. వార్షికోత్సవంలో పాల్గొనాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
30 జిల్లాలకు అతిసారం
భువనేశ్వర్: రాష్ట్రంలో అతిసారం, కలరా వ్యాప్తి అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 30 జిల్లాలను హై అలర్ట్ ప్రాంతాలుగా ప్రకటించింది. ముప్పును నియంత్రించడానికి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. జాజ్పూర్ జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 30 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్, కార్యదర్శి ఎస్.అశ్వత్థి తెలిపారు. అతిసార, కలరా తాజా స్థితిగతుల్ని సమీక్షించేందుకు ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్నాయి. వీటి కట్టడికి అత్యవసర చర్య తీసుకోవడం అనివార్యంగా పేర్కొన్నారు. 5 జిల్లాల్లో గత పది రోజుల్లో 300 కి పైగా కొత్త అతిసార రోగులు నమోదయ్యారు. ఆస్పత్రిలో చేరిన రోగులను 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివేనని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఇంటింటికీ వెళ్లి అవగాహన ప్రచారం చేస్తున్నారు. మరో 7 రోజుల పాటు ఈ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుందన్నారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో రోజువారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 14 మంది సభ్యుల కేంద్ర బృందం ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వ్యాధిని అరికట్టడానికి చర్యలను సూచిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య అధికారులు కేంద్ర బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యాప్తి ఇంకా అంటువ్యాధిగా విజృంభించలేదని పరిశీలన వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరిస్థితి విషమించకుంగా ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలతో సహా మిగిలిన 25 జిల్లాల్లో కూడ తాగు నీటి వనరులను క్రిమిరహితం చేస్తోందని ప్రకటించారు. కలరా కేసులను గుర్తించేందుకు పరీక్షించిన నమూనాల్లో కేవలం 10 శాతం మాత్రమే కలరా సంక్రమణను నిర్ధారించాయని ఆరోగ్య శాఖ కమిషనరు, కార్యదర్శి ధ్రువీకరించారు. ఆరోగ్య కార్యదర్శి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కార్యకలాపాల పరిశీలన కోసం 4 రాష్ట్ర స్థాయి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలలో సీనియర్ అధికారులు, నిపుణులు, వైద్య సిబ్బంది ఉన్నారు. తక్షణ చికిత్స, ప్రజలలో అవగాహన, సమర్థవంతమైన వ్యాధి నిర్వహణ వ్యవహారాల్లో స్థానిక ఆరోగ్య సంరక్షణ విభాగాలతో సమన్వయం పరిరక్షణ ఈ బృందాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ బృందాలు బొడొచొణ, భువన్, బంకి, ధర్మశాల , భండారి పొఖొరి సహా వివిధ ప్రాంతాలను సందర్శిస్తాయి. బీఎంసీ అప్రమత్తం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కలరా కేసులు ఖరారు కావడంతో స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ అప్రమత్తమైంది. స్వయంప్రతిపత్తి సంస్థల ఆధ్వర్యంలో వివిధ నివారణ చర్యలు చేపడుతున్నారు. తాగునీటి వనరులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు, అవసరమైతే శుద్ధి చేస్తున్నారు. గొట్టపు బావులు, ఇతరేతర తాగు నీటి మాధ్యమాలు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు నాణ్యతను తనిఖీ చేయడానికి వివిధ ఆహార, పానీయాల దుకాణాలను సందర్శిస్తున్నారు. దీనితో పాటు, కలరా గురించి ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు. -
ఆకర్షించిన సైకత మొసళ్లు
రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరో వైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. –భువనేశ్వర్/పూరీ స్వచ్ఛంద రక్తదాన శిబిరం జయపురం: సంబాద్–అమొ ఒడిశా ద్వారా స్థానిక అగ్రసేన్ భవనంలో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జయపురం రక్త బండార్ అధికారి డాక్టర్ సూర్య శేఖర మిశ్ర ముఖ్యఅతిధిగా శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వక్తలు రక్తదాతలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జయపురం రక్త బండార్ టెక్నీషియన్ అజయ కుమార్ పండ, నితినియాల్ ధాని, బి.ప్రతిభ పాత్రో తదితరుల దాతల నుండి రక్తం సేకరించారు. శిబిరంలో సంబాద్ –అమొ ఒడిశా జయపురం ప్రతినిధి తరుణ కుమార్ పాత్రో, అశోక్ కుమార్ పోలాయ్లతో పాటు సమాజ సేవి అరుణ జైన్, సంజయ్ జైన్, జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, హరిప్రియ బిశాయి,మహమ్మద్ రసూల్, శైలజ హత్త, పి.ఆనంద, రాధాకాంత దాస్, వి.సత్యనారాయణ సెట్టి, పవణ దాస్ పాల్గొన్నారు. ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి నీలాకాంబేర్ పంచాయతీకి చెందిన శైలేంద్ర మహంతి(55) అనే వ్యక్తి సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శైలేంద్ర బలిమెల డిగ్రీ కాలేజీలో ప్యూన్గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 8.30 గంటల సమయంలో చిన్న కొడుకు ఇంటికి వచ్చి తలుపు తీయగా తండ్రి ఉరికి వేలాడుతూ కన్పించాడు. దీంతో వెంటనే స్థానికుల సాయంతో బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాముకాటుతో యువకుడు మృతి రాయగడ: పాముకాటుతో యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని గుడారి సమితి పెండిలి గ్రామ పంచాయతీ దుప్పులపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు వీరేంద్ర కుమార్ సొబొరొ (16)గా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర కుమార్ గ్రామ సమీపంలోని పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పాముకాటు వేసింది. దీంతో కుటుంబీకులు అతనిని వెంటనే హస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్లో గల బొడొవీధిలో నివసిస్తున్న వేలధర్ కౌసల్య (15) పాము కాటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి అంతా భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో పాము వేలధర్ పొట్ట వద్ద కాటు వేసింది. పిల్లాడు నొప్పితో బాధ పడుతుండడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వేలధర్ మంగళవారం మృతి చెందాడు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి వేంకటేశ్వర స్వామివారి దేవాలయం 16వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడికి జిల్లాలో ఒకే ఒక్క దేవాలయం ఉంది. దీనిలో భాగంగా దేవాలయం నుంచి పుర వీధుల వెంబడి పల్లకి సేవ జరిగింది. అలాగే సాయంత్రం కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4 వేల మందికి ఉచిత అన్నప్రసాద సేవనం జరిగింది. మున్సిపల్ చైర్మన్ కును నాయక్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె.ధనుంజయ్ పట్నాయక్, సభ్యులు ఎన్.రవిరెడ్డి, టి.నందికేశ్వరరావు, పసుమర్తి ఆనందరావు, జి.చంద్రశేఖర్, నాగేశ్వర్ షావుకారు పాల్గొన్నారు. -
నేతలు దిగి వచ్చిన వేళ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలు జనాలతో కలిసిపోతున్నారు. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి వంచల గుమ్మ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ తీసుకోవడానికి ఆటోలో పంచాయతీ కార్యాలయం వచ్చారు. ఇది తెలిసి బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఆమె ఆటో వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకి రూ.3000 పింఛన్ అందజేశారు. కాంగ్రెస్కు చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మపూర్ ఎమ్మెల్యే బందుగాం సమితిలో మారుమూల గ్రామాల్లో గిరిజనుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసు కుంటున్నారు. -
మంత్రుల దృష్టికి గుణుపూర్ సమస్యలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో నెలకున్న వివిధ సమస్యలను గుణుపూర్ నవనిర్మాణ సమితికి చెందిన బృందం ఇద్దరు రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు సోమవారం బృందం సభ్యులు రాజధానికి వెళ్లి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారిలను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. గుణుపూర్లో కొత్తగా నిర్మితమవుతున్న జనగ్నాథుని మందిరం ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు సగంలో నిలిచిపోవడంతో.. దేవతా మూర్తులను సగం నిర్మాణంలో గల మందిరంలోనే ఉంచి పూజా కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని మంత్రి హరిచందన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలాఉండగా రథాయాత్ర సమయంలో భక్తుల ద్వారా వచ్చిన విరాళాలు మందిరాభివృద్ధికి వినియోగించలేకపొతున్నామని.. సరాసరి ఆదాయం దేవదాయ శాఖ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి వస్తుందని వివరించారు. సమస్యలు విన్న మంత్రి స్పందించి త్వరలో మందిరం నిర్మాణం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు దేవదాయ శాఖ కమిషనర్తో ప్రత్యేకంగా చర్చించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారిని కలిసిన బృందం గుణుపూర్లో బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి ప్రస్తావించింది. గుణుపూర్ నవనిర్మాణ సమితి అధ్యక్షులు అఓయ దాస్, కార్యదర్శి రంజిత పాడి, న్యాయవాది లాడి గొపన్న, జగన్నాధ మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు తిరుపతి మహాంతిలు మంత్రులకు కలిసిన వారిలో ఉన్నారు. -
భూముల కబ్జాపై కలెక్టర్కు ఫిర్యాదు
పర్లాకిమిడి: గుసాని సమితి తులసిపాడు గ్రామానికి పరశురాం మౌజా డాక్టర్ భంజిరి గ్రామంలో పదేళ్లుగా నివాసం ఉంటున్నారు. గిరిజనులు, పేదలు ఇళ్లను ఖాళీ చేయించి సుమారు 55 ఎకరాల భూములను కబ్జా చేశారంటూ జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు గుసాని జెడ్పీటీసీ సభ్యుడు యస్.బాలరాజు, భంజరి గ్రామస్థులు మంగళవారం ఫిర్యాదు చేశారు. డాక్టర్ భంజిరి భూములు పూర్వకాలం నుంచి మోటూరు వారి పేరుమీద ఉన్నాయి. అయితే అ భూములు రియల్ ఎస్టేట్స్, దళారులు ఏకంగా అమ్ముకోవాలని చూస్తున్నందుకు డాక్టర్ భంజిరి గ్రామస్తులు కలెక్టరేట్కు వచ్చి అధికారులను కలిశారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు తగు చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి దృష్టికి తీసుకువెళతామని గుసాని జెడ్పీటీసీ సభ్యుడు యస్.బాలరాజు విలేకరులతో అన్నారు. -
ముఖహుర్ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి
పర్లాకిమిడి: మోహానా బ్లాక్ మలాస్పదర్ గ్రామపంచాయతీలోని ముఖహుర్ పర్వతం వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఈ ముఖహుర్ పర్వతం వద్ద ఆంజనేయస్వామి, దుర్గా, శివలింగాలకు అక్కడి ప్రజలు చాలా కాలం నుంచి పూజలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఇక్కడి గిరిజనులు కోరుతున్నారు. తద్వారా తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆరు పంచాయతీల ప్రజలు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ను మంగళవారం కలిసి వినతిని అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మోహానా బీడీవో రాజీవ్ దాస్ను ఆ ప్రాంతం విశేషాలు, రోడ్డు నిర్మాణానికి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. కలెక్టర్ను కలిసిన వారిలో భలియాగుడ మాజీ జిల్లా పరిషత్ సభ్యులు రాజీవ్ మల్లిక్, హరిశ్చంద్ర మల్లిక్, పర్యాటక ప్రచారకుడు సుజ్ఞాణ్ సాగర్, గురుదేవ్ మల్లిక్, భల్లిగుడ నుంచి కలియా మల్లిక్, హోరుగుడ నుంచి సంతోష్ మల్లిక్లు ఉన్నారు. కలెక్టర్ బిజయకుమార్ దాస్కు ఆరు పంచాయతీల ప్రజల విజ్ఞప్తి -
సంప్రదాయాలను కాపాడుకుందాం
రాయగడ: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక సంస్కృతి మహిళా సంఘం ఆధ్వర్యంలో సొమవారం సాయంత్రం జరిగిన ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిళ్లని అన్నారు. మన భావితరాలకు అవి తెలిసేలా ఇటువంటి కార్యక్రమాలను మహిళా సంఘాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజో సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లొ గెలుపొందిన వారికి ముఖ్యఅతిథి నెక్కంటి బహుమతులను అందజేశారు. సంస్కృతి మహిళా సంఘం అధ్యక్షురాలు సుజాత పాలో, కార్యదర్శి సరస్వతి సాహు, కోశాధికారి సర్మిష్ట పాఢిల నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు భాస్కరరావు -
శ్రీ జగన్నాథునికి లేహ్య సేవ
భువనేశ్వర్ : స్నాన పూర్ణిమ నాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు. -
30 జిల్లాలకు అతిసారం అతిసారం వ్యాపిస్తోంది. 30 జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. –8లోu
జగన్నాథునికి లేహ్యం సేవ జగన్నాథునికి లేహ్యం సేవ ఆచారం జరిగింది. మూలికలు వినియోగించారు. –8లోuభద్రతకు ప్రాధాన్యత సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరాబొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది. -
రైతు సాధికారతే లక్ష్యం: సీఎం
భువనేశ్వర్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి సందర్భంగా పలు ప్రాంతల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ ఒడిశా బొలంగీరు జిల్లాలో మంగళవారం నిర్వహించిన కృషక్ శక్తి సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సుదీర్ఘంగా ప్రసంగించారు. అధునాతన సాంకేతిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా రైతులను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర రైతాంగం సంక్షేమానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని క్రమం తప్పకుండా వాస్తవ కార్యాచరణలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ అన్నం అభియాన్ కింద ప్రభుత్వం సంప్రదాయ ఽవంగడాలను పునరుజ్జీవింపజేసి పౌష్టికాహార సాగుని ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చొరవలో భాగంగా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు తృణ ధాన్యాల లడ్డూలను పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ ఒడిశాలో వ్యవసాయ విద్య, శిక్షణను ప్రోత్సహించడానికి బలంగీర్లో వ్యవసాయ కళాశాల, సోన్పూర్లో మత్స్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 2047 నాటికి వికసిత భారత్ జాతీయ లక్ష్యం బాటలో రాష్ట్రావతరణ శత జయంతి 2036 నాటికి సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యాచరణలో వ్యవసాయం, రైతు అభివృద్ధి సాధించడం కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యవసాయం ప్రాధాన్యతతో రైతు సోదరసోదరీమణుల ఆర్థిక సాధికారత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు అన్ని రకాల సాంకేతిక సహాయాన్ని అందుబాటులోకి తెచ్చి ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ రైతు సంక్షేమ చర్యలు రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో సాఫల్యత సాధించిన రైతులను సత్కరించి అభినందించారు. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులను పెంచడం రైతు సాధికారితపై ప్రభుత్వం నిబద్ధత స్పష్టం అవుతుందని ఈ సభలో ప్రసంగించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. ఒడిశా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లకు పండ్లను ఎగుమతి చేస్తోంది. రైతు సాధికారత కోసం ప్రభుత్వం సంకల్పించిన పథకాలు, కార్యక్రమాల సాఫల్యతకు ఇది నిదర్శనంగా ఆయన కొనియాడారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ప్రజారోగ్యం కోసం స్థానిక ఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగం బలోపేతం తొలి మెట్టుగా రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగు నీరు విభాగం మంత్రి రబీ నారాయణ్ నాయక్ ప్రసంగించారు. కార్యక్రమానికి బొలంగీర్ లోక్ సభ సభ్యురాలు సంగీత కుమారి సింగ్ దేవ్, కలెక్టర్ గౌరవ్ శివాజీ ఇసల్వార్, బర్గఢ్ లోక్ సభ సభ్యుడు ప్రదీప్ పురోహిత్, టిట్లాగడ్ నియోజక వర్గం ఎమ్మెల్యే నబీన్ కుమార్ జైన్, కంటాబంజి నియోజక వర్గం ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్, ఉత్తర ప్రాంత రెవెన్యూ కమిషనర్ సచిన్ రామచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. -
జలాశయాల్లో మృత్యు ఘోష
● మూడు రోజుల్లో ఐదుగురు బలి ● ఇంకా లభ్యం కాని బెంగళూరు ఇంజినీర్ ఆచూకీకొరాపుట్: కొరాపుట్ జిల్లాలో జలాశయాలు కోరలు చాస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు బలయ్యారు. కొరాపుట్ జిల్లా కొట్పాడ్ సమితి ముర్తా హండి గ్రామ పంచాయతీలో ప్రఖ్యాత గులిమి జల పాతంలో ఇద్దరు బాలలు గల్లంతయ్యారు. నబరంగ్పూర్ జిల్లా కొసాగుమ్మడ సమితికి చెందిన కిరణ్ మిర్గాన్ (16), అలోక్ రాజ సునా (16)లు మరో ఆరుగురు మిత్రులతో కలసి గులిమి వెళ్లారు. అక్కడ రీల్స్ తీస్తూ జలపాతంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన మిగతా మిత్రులు పెద్దలకు సమాచారం ఇచ్చారు. వెంటనే కొట్పాడ్ నుంచి అగ్ని మాపక,ఓడ్రాఫ్ దళాలు వెళ్లి జలాశయం లో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. మరో వైపు ఇదే జిల్లా లమ్తాపుట్ సమితి మాచ్ఖండ్ డుడుమా జల పాతం వద్ద గల్లంతైన బెంగళూరు యువ ఇంజినీర్ అన్వేస్ దాస్ (27) గల్లంతై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం నందపూర్ సమితి జోలాపుట్ డ్యామ్లో ఇద్దరు మైనర్లు ప్రమాదవశత్తు పడి మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. ఈ మూడు ప్రమాదాల బారిన పడ్డ వారందరూ ఆ ప్రాంతం లో నీటి అంచనా తెలియక బలైన వారే కావడం విశేషం. -
లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీలో మరోసారి ఉద్రిక్తత
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ కళాశాలలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం కళాశాలలో దశమంత్పూర్ సమితి మాలి మండాగుడ గ్రామానికి చెందిన ధను హంతాల్ (35) కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతనడికి కడుపులో నీరు తీయాలని వైద్యులు చెప్పారు. మూడు రోజులైనా నీరు తీయలేదు. దీంతో మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆరుగురు రోగులు చనిపోయారనే వివాదం ఇంకా కొనసాగుతోంది. మరో సారి మరో మృతి చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వార్డుల తలుపులు మూసివేసి వారికి నచ్చజెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. -
స్థానిక సంస్థలకు సాధికారత యోచన
● ముఖ్యమంత్రితో రాష్ట్ర ఆర్థిక సంఘం సంప్రదింపులు భువనేశ్వర్: ఆరో రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు సాధికారత కల్పించే దిశలో ఆయన సూచనలను కోరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్ర ఆర్థిక కమిషన్ వెబ్సైట్ (httpr://rfc.odirha.gov.in) ను ప్రారంభించారు. ఎన్నికై న ప్రతినిధులు, గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్లు, మేధావులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పౌర సమాజ సంస్థలు, వ్యక్తుల నుంచి సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించడానికి ఈ వెబ్సైట్ అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లో మునుపటి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక కమిషన్ల వివరాలు, అధ్యయన నివేదికలు మొదలైనవి పొందుపరిచారు. వీటిని ప్రజల సాధారణ సమాచారం కోసం పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం డాక్టర్ అరుణ్ కుమార్ పాండా అధ్యక్షతన 6వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 6వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ డాక్టర్ అరుణ్ కుమార్ పండా, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాశ్వత మిశ్రా, ఎలక్ట్రానిక్స్ – సాంకేతిక సమాచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశాల్ కుమార్ దేవ్, 6వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ అసిత్ రంజన్ మహంతి, ప్రొఫెసర్ అమరేష్ సామంత్రాయ్ మరియు డాక్టర్ బిభు ప్రసాద్ నాయక్, కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ సత్య ప్రియ రథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2026) నుంచి ఆరంభం కానున్న పంచ వర్ష ప్రణాళిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్లు) వనరుల బదిలీని కమిషన్ ప్రతిపాదించింది. -
రాష్ట్ర గవర్నర్కు ఆహ్వానం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని వార్షిక రథయాత్రకు విచ్చేయాలని కోరుతూ శ్రీమందిరం ముఖ్య నిర్వాహకుడు (సీఏవో) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రాజ్భవన్న్లో కలిసి గవర్నర్కు ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత కొరాపుట్: రిజర్వాయర్ మృతులకు పరిహారాలు ప్రభుత్వం అందజేసింది. మంగళవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి భానురు గ్రామానికి వెళ్లి రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. జోలాపుట్ రిజర్వాయర్ దలైపుట్ ఘాట్ వద్ద పుష్ప బైరాగి (15), దేవేంద్ర కిర్సాని (17)లు ప్రమాదవాశాత్తు ఆదివారం మునిగి చనిపోయారు. దీంతో వీరి కుటుంబాలకు రెడ్క్రాస్ ఆర్థిక సాయం చేసింది. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ ఆదేశాల మేరకు నందపూర్ తహసీల్ ఇన్స్పెక్టర్లు సోమనాథ్ ముదలి, పార్వతి పర్జాలు ఆర్థిక సాయం అందించారు. గంజాయి స్వాధీనం రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫారంలో గంజాయితో ఒక యువకుడు అబ్కారీ శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడు సంబల్పూర్ జిల్లాకు చెందిన మనోజ్ మాఝిగా గుర్తించారు. అతడి వద్దనుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అబ్కారీ శాఖ ఐఐసీ బిజయ్ కుమార్ బెక్, ఏఎస్ఐ మనిక్ చంద్ర గౌడో, ఆర్పీఎఫ్ పోలీస్ సరోజ్ కుమార్ బారిక్లు రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫారం నంబర్ ఒకటిలో అనుమానాస్పదంగా కనిపించిన మనోజ్కు సంబంధించిన బ్యాగులు తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. 200 సీట్లకు 1009 దరఖాస్తులు ● జయపురం కేంద్రీయ విద్యాలయంలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి జయపురం: జయపురంలో కొత్తగా ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయంలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 200 సీట్లను కేటాయించగా.. 1009 మంది దరఖాస్తు చేసుకున్నారని విద్యాలయం ప్రిన్సిపాల్ హరిహర పండ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ భవనంలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహిస్తారు. ఈ నెల రెండు నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సంబంధిత అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది ఒకటి ఐదవ తరగతి వరకు పాఠ్య బోధన ప్రారంభిస్తారు. ఒక్కో తరగతిలో 40 చొప్పున ఐదు తరగతులకు 200 సీట్లు కేటాయించారు. అయితే ఒకటో తరగతి కోసం 261 మంది, రెండో తరగతి కోసం 223, మూడో తరగతికి 216, నాలుగో తరగతికి 129, ఐదో తరగతికి 180 మంది దరఖాస్తులు పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను కొరాపుట్ జిల్లా కలెక్టర్, జయపురం సబ్కలెక్టర్లకు సమర్పిస్తామన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో సీట్లను కేటాయించి విద్యాలయంలో విద్యార్థులను చేర్చుకుంటామన్నారు. జూలై ఒకటవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. -
వైద్యుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిపై దాడి జరిగింది. దాడికి గురైన వైద్యుడు సోపన్కుమార్ డిండా తెలిపిన వివరాల మేరకు.. బాలిక ఊయల ఊగుతూ పడిపోయిందని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, ఆదివారంం సాయంత్రం 5 గంటల సమయంలో సిబ్బంది క్యాజువాలిటీలో చేర్చుకున్నారని, తాను ఆ సమయంలో 4వ అంతస్తులో ఉన్నానని, కిందకు వచ్చి చూస్తే బాలిక తల నుంచి రక్త స్రావం అవుతున్నట్లు గమనించానని చెప్పారు. వారికి చెబుతుండగానే బయట ఊరికి తీసుకుపోతామని చెప్పారని, ఓ ప్రైవేటు వాహనంలో తిరిగి 6.30కు ఇక్కడకు తెచ్చారని, బాలికకు చికిత్స చేస్తుండగా 7.15కు మృతి చెందిందని తెలిపారు. దీనిపై బాలిక తండ్రికి వివరిస్తుండగా ఆయన స్నేహితులు దాడికి దిగారని తెలిపారు. మంగళవారం మళ్లీ ఆస్పత్రికి మీదకు వచ్చారని పోలీసులను ఆశ్రయించారు. మల్కన్గిరి ఐఐసి రీగాన్ కీండో కేసు నమోదు చేశారు. -
పకడ్బందీగా రథయాత్ర
● భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష భువనేశ్వర్: ఈ నెల 27న జరగనున్న ప్రఖ్యాత పూరీ రథయాత్ర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. యాత్ర సన్నాహాలు పురస్కరించుకుని సీనియర్ పోలీసు అధికారులు అనుక్షణం చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. శ్రీ జగన్నాథుని నవ యౌవన దర్శనం, రథ యాత్ర, బహుడా (మారు) యాత్ర, స్వర్ణ అలంకరణ వంటి ప్రముఖ ఉత్సవాలు పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు పూరీకి రానుందని భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ క్రమంలో నేరాల నియంత్రించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్లను ప్రారంభించాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా హోటళ్లు, లాడ్జీలు, మఠాలు, దేవాలయాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్మికుల వసతి గహాలు, ధర్మశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మొదటిసారిగా, పట్టణ పోలీస్ స్టేషన్ లో సమన్వయ నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు పూరీ పట్టణంలో వివిధ ప్రాంతాలలో కత్రిమ మేధస్సు (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఉత్తర ఛక్, పూరీ, పూరీ – కోణార్క్ రోడ్ మరియు నగరంలోని వివిధ ప్రధాన కూడళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మొబైల్ యాప్.. ప్రజా రవాణా సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేశామని, ఇది ట్రాఫిక్ సలహా, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ జామ్లు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి తక్షణ సమాచారాన్ని అందిస్తుందని డీజీపీ వివరించారు. ఉగ్రవాద ముప్పు.. ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందనే సమాచారం అందుతున్న పరిస్థితుల్లో ఆకస్మిక విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధం చేశామని డీజీపీ తెలిపారు. సముద్రంలో భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఒడిశా పోలీస్ మారిటైమ్ స్టేషన్ వర్గాలు ఉమ్మడి పహరా వ్యవస్థ పని చేస్తుందన్నారు. ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యత.. నగరంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం రోడ్ డివైడర్, డిలినేటర్, ట్రాఫిక్ జోన్ వ్యవస్థ, నగరంలోని వివిధ ప్రదేశాలలో తగినంత పార్కింగ్ వ్యవస్థ, క్రమబద్ధమైన ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణ తదితర సమావేశంలో చర్చించారు. ముఖ్యులపై దృష్టి జగన్నాథుని రథ యాత్రకు గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు రానున్నందున ప్రత్యేక హెలిప్యాడ్, పోలీసు బలగాల వసతి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలు, బారికేడ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సమావేశంలో డైరెక్టర్ (ఇంటెలిజెన్స్) ఆర్.పి.కోచే, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(ఆధునికీకరణ) సౌమేంద్ర కుమార్ ప్రియదర్శి, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్, రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (కమ్యూనికేషన్) దయాళ్ గంగ్వార్, అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (ఎస్ఏపీ) రాజేష్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రీజియన్) ఎస్.ప్రవీణ్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) డాక్టర్ దీపక్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (బీపీఎస్ పీఏ) అనుప్ సాహు, డీఐజీ (ప్రొవిజనింగ్) చరణ్ సింగ్ మీనా, డీఐజీ (ఎస్ఐడబ్ల్యూ) డాక్టర్ కన్వర్ హబీబ్ సింగ్, డీఐజీ (ఎస్ టీఎఫ్) పినాక్ మిశ్రా, డీఐజీ (క్రైమ్ బ్రాంచ్) బి.గంగాధర్, డీఐఏజీ (పర్సనల్) కిషోర్ బానోత్, రైల్వే పోలీసు సూపరింటెండెంట్ వివేకానంద్ శర్మ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భంలో తయారీ..
స్థానిక బొడొ ఒడియా మఠం ఫులురి మూలిక ఔషధ తైలం సిద్ధం చేస్తుంది. ఈ ప్రత్యేక తైలం పలు ఔషధీయ వన మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఏడాది పొడవునా భూగర్భంలో మట్టి పాత్రలో మూత వేసుకుని భగవంతుని ఆరోగ్యం కోసం దివ్య ఔషధంగా సిద్ధం చేస్తారు. ఏటా హేరా పంచమి నాడు ఫులురి తైలం పలు వన మూలికలు ఇతరేతర ఔషధీయ విలువలతో కూడిన సుగంధ ద్రవ్యాల మేళవింపుతో భూగర్భంలో చోటు చేసుకుంటుంది. స్థానిక ఒడియా మఠం ఈ సన్నాహాల్ని ఏడాది ముందుగా ప్రారంభించి స్వామి కోసం దివ్యమైన తైలం సిద్ధం చేసి ఏటా క్రమం తప్పకుండా జగతి నాథుని గోప్య సేవకులకు అందజేస్తారు. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఫులురి వన మూలికల ఔషదీయ తైలం పూతతో మూల విరాటులు ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం పొంది మెల్లగా కోలుకుంటారు. అంచెలంచెలుగా స్వామి చికిత్సలో ప్రాచీన ఔషధీయ పదార్థాల్ని జోడించి చికిత్స చేసి మూల విరాటుల్ని యాత్రకు సిద్ధం చేస్తారు. జ్వరం అనుబంధ అస్వస్థతతో బాధపడుతున్న స్వామికి అన్న ఆహారాలు నివారించి కషాయం వంటి పత్యం నైవేద్యాలు సమర్పించి గోప్య ఉపచారాలు నిర్వహించడంలో దైతపతి సేవకులు తలమునకలయ్యారు. అతి త్వరలో స్వామి ఆరోగ్యం కోలుకుంటుందనే ఆరాటంతో శ్రమిస్తున్నారు. -
మూడు వాహనాలు స్వాధీనం
మల్కన్గిరి: ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న దొంగను మల్కన్గిరి జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎ ఈ నెల రెండో తేదీన స్థానిక ఐఎమ్ఎస్టీ పాఠశాల వద్ద నివసిస్తున్న ప్రకాష్ బర్మన్ అనే వ్యక్తికి చెందిన బైక్ చోరీకి గురైంది. దీనిపై మూడో తేదీన మల్కన్గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన స్థానిక ఎడ్యుకేషన్ కాలనీకి చెందిన భవానీ శంకర్ జేనా తన బైక్నుంచి ఇంటి ముందు పార్క్ చేయగా చోరీకి గురైంది. ఆయన కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఈ నెల రెండో తేదీ రాత్రి ఎం.వి.42 గ్రామంలో భవతోష్ విశ్వష్ అనే వ్యక్తి బైక్ ఇంటి ముందు ఉంచగా చోరీకి గురైంది. ఆయన కూడా మూడో తేదీన మల్కన్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఐఐసీ రీగాన్ కీండో పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ఇంటి ముందు ఒకవ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు నేరం అంగీకరించాడు. నిందుతునిది కలిమెల సమితి జగన్నాథ్ వీధికి చెందిన సీతల్ పైక్ అలియస్ రింకు పైక్గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఐఐసీ రీగాన్ కీండో తెలిపారు. -
గుణుపూర్లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో సొమవారం కలెక్టర్ ఫరూల్ పట్వారి గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 28 వినతులను స్వీకరించారు. ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.35 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్దీప్ కౌర్ సహాట, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం మల్కన్గిరి: కలిమెల సమితి ఎం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలో తమాన్పల్లి పంచాయతీ ఎం.వి.113 గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. అలాల్ రోజో సందర్భంగా అమాల్ మాండాల్ అనే వ్యక్తి బైక్పై భార్యపిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య కవిత అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఐఐసీ చంద్రకాంంత్ తండి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు మల్కన్గిరి: కోరుకొండ సమితి సోమనాథ్పూర్ పంచాయతీ ఎం.వి.36 గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బలిమెల నుంచి ఇంద్రావతి వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్షతగాత్రునికి సపర్యలు కొరాపుట్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సపర్యాలు చేసి మానవీయత చాటారు యువకులు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా సమీపంలో వాగ్దేవి వంతెన వద్ద ఖిల్గుడ గ్రామానికి చెందిన తిలక్ కుమార్ అనే ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఆదివారం సాయంత్రం ఢీకొట్టి వెళ్లి పోయింది. తీవ్ర రక్తస్రవంతో తిలక్ రోడ్డు పక్కన పడి ఉన్నాడు. విషయం తెలిసి పాడువకి చెందిన విశ్వనాఽథ్ మహంతి, షేక్ రహీం, శశిధర్ నాయర్, లాలులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని సమీప ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అతని వద్ద ఉన్న రూ. ఏడు వేలు నగదు, బంగారు గొలుసు, చెవి పోగులు, ఇతర బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లను భద్రపరిచి వాటిని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితుడు ముత్తుట్ ఫైనాన్స్లో పని చేస్తూ పాడువ వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకుతరలించారు. క్షతగాత్రుడుని రక్షించి మానవీయత చూపించిన పాడువ యువతను పోలీసులు అభినందించారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
పర్లాకిమిడి: బాల కార్మిక వ్యవస్థను నిర్యూలించాలని వ్యక్తలు అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బాలకార్మికుల విముక్తిపై చైతన్య పాదయాత్రను జిల్లా ఆదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో చైతన్య రథంతో పాటు, వివిధ పాఠశాలల విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో పలు కూడళ్లలో వివిధ షాపులు, ఎస్టాబ్లిస్మెంట్లలో బాలకార్మికులను పనిలో పెట్టుకోరాదని అవగాహన కల్పించారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కార్మిక శాఖ అధికారిణి భారతీ బెహారా హెచ్చరించారు. బాలకార్మికుల వ్యవ్యస్థ విముక్తి కోసం జిల్లా అంతటా చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. -
యోగాతో మెరుగైన ఆరోగ్యం
జయపురం: యోగాతో మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వక్తలు అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జయపురం అరవిందనగర్ విద్యామందిర ప్రాంగణంలో జిల్లాస్థాయి యోగా మహోత్సవ కమిటీ, జిల్లా స్థాయి యోగా నిర్వాహకుల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. శిబిరంలో యోగా శిక్షకులు జయసేన్ మహంతి, సురేష్ నందోలు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగా డేలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా మహోత్సవ కమిటీ సభ్యులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యనిర్వాహకులు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన వారందరికీ ధ్రువ పత్రాలు అందజేశారు. -
ప్రచార రథం ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు జయపూర్ పట్టణంలో మెయిన్ రోడ్డులో ప్రచార రథాన్ని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అక్కవరం స్రశ్య రెడ్డి మాఆ్లడుతూ మూడు రోజుల పాటు రథం పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. యువతరం సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి భువనేశ్వర్: యువతరం సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర సమాజ సంక్షేమం కోసం యువతరం ఉత్సాహం, శక్తి, సామర్థ్యాల్ని ప్రత్యక్షంగా ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. వివిధ విభాగాలలో ఉద్యోగాలకు అర్హత సాధించిన 964 మందికి సోమవారం ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమను తాము ప్రజల సేవకులుగా భావించి, సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అవినీతికి అతీతంగా విధులు నిర్వర్తించాలని హితవుపలికారు. -
తైలమర్దన
జగన్నాథుడికి.. ● ఐదు రోజులుగా గోప్యంగా ఉపచారాలు ● శ్రీమందిరంలో కొనసాగుతున్న సంప్రదాయాలు భువనేశ్వర్: పూరీలో శ్రీక్షేత్రం జగన్నాథ రథయాత్ర సన్నాహాలతో సందడిగా మారింది. తెరచాటున జగతినాథునికి గోప్య సేవలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. యాత్రకు సకాలంలో సిద్ధం కావాలని స్వామి, వెను వెంటనే స్వామిని కనులారా దర్శించుకోవాలని భక్తజనం ఉవ్విళ్లూరుతున్నారు. ఐదు రోజులుగా శ్రీమందిరం రత్న వేదికపై నిత్యం దర్శనం కల్పించే చతుర్థామూర్తులు చీకటి గదిలో గోప్య ఉపచారాలు పొందుతున్నారు. జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా విశేష స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథుడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు సోదరుడు బలభద్ర స్వామి, సోదరి సుభద్ర దేవి జ్వరం బారిన పడి తెరమరుగయ్యారు. ఈ క్రమంలో దేవదేవుళ్లకు దైతపతి సేవకులు గోప్యంగా పలు ఉపచారాలు అందజేస్తున్నారు.ఉపశమనం కోసం 5వ రోజున ఆచారం ప్రకారం ఫులురి మూలిక తైల మర్దన చేశారు. దీనిని శ్రీ అంగ సేవగా పేర్కొంటారు. -
అతిసార వ్యాప్తి ఆపుదాం
● ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ పిలుపు ● చైతన్య రథం ప్రారంభం భువనేశ్వర్: రాష్ట్రంలో అతిసార వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. ప్రజా చైతన్యంతో ఈ సంక్రమణకు కళ్లెం వేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అతిసార ఆపుదాం (స్టాప్ డయేరియా) నినాదంతో చైతన్య ప్రచార రథాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ సోమవారం ప్రారంభించారు. ఢెంకనాల్ జిల్లా భువన్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణ నుంచి కాషాయ పతాకం ఊపి ఈ రథాన్ని ప్రారంభిచారు. ఈ ప్రచారం జూలై నెల 31 వరకు నిరవధికంగా కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యక్షంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అతిసార నివారణ, నియంత్రణ కోసం సాధ్యమైన అన్ని చర్యలూ సకాలంలో చేపడుతున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, సంబంధిత పరికరాలు, మందులు, మౌలిక సదుపాయాలతోపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాలు, ఆరోగ్య దేవాలయాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు, మందులు అందుబాటులో ఉంచారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పని చేసే అన్ని క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, బహుళార్థసాధక ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక దశ నుంచి అతిసార వ్యాధి గుర్తింపు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అవగాహన సందేశాలు, ఓఆర్ఎస్, జింక్ మాత్రలు, ఇతర మందులకు సంబంధించిన సమాచార కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లాలని మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ అన్ని వర్గాల ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. అతిసార లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా అతిసార నివారణ కోసం హాజరైన తల్లులకు మంత్రి ఓఆర్ఎస్, జింక్ మాత్రల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఢెంకనాల్ ఎంపీ రుద్ర నారాయణ్ పాణి, పొరొజంగ్ ఎమ్మెల్యే బిభూతి ప్రధాన్, హిందోళ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్, కామాఖ్యనగర్ ఎమ్మెల్యే శత్రుఘ్న జెనా పాల్గొన్నారు. అతిసార కట్టడి సంబంధిత సమాచార సంచికను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు.