breaking news
Orissa
-
నాగావళి నదిలో యువకుడు గల్లంతు
రాయగడ: నాగావళి నదిలో స్నానం కోసం దిగిన యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి స్థానిక గురుంగుడ గ్రామానికి చెందిన బుడు శ్రీను (37)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గురుంగుడ గ్రామానికి చెందిన శ్రీను సోమవారం సాయంత్రం సమీపంలోని నాగావళి నదికి స్నానానికని వెళ్లాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అది గమనించని అతడు నీటిలో దిగగా అదుపుతప్పి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి గురుంగుడ నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు నదిలో గాలించినప్పటికీ ఆచూకీ కనిపించలేదు. జూదశాలపై పోలీసుల దాడులు జయపురం: జయపురం పట్టణ, సదర్ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రాతాలలో జోరుగా సాగుతున్న పేకాట అడ్డాలపై ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 20 మంది పేకాటదారులను అరెస్టు చేశారు. ఆయా దాడులలో పెద్ద మొత్తంలో డబ్బు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక సౌరా వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసి 79 వేల ఒక వంద రూపాయలను సీజ్ చేసినట్లు మంగళవారం వెల్లడించారు. అలాగే జయపురం సదర్ పోలీసులు పంపుణి గ్రామంలో త్రినాథ్ మందిరం సమీపంలో నిర్వహిస్తున్న పేకాటపై దాడి జరిపి 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 వేల 110 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రాత్రి సమయం కావడంతో కొంతమంది పరారైనట్టు పోలీసు అధికారి వెల్లడించారు. అరెస్టు అయిన జూదగాళ్లకు నోటీసులు జారీ చేసి విడిచి పెట్టినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ చెప్పారు. ఇది ఇలాఉండగా ఒడిశాలో కార్తీక పూర్ణిమను జూదాల పూర్ణిమంగా పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రతి చోట జూదం ఆడటం పరిపాటి. జూదాల పూర్ణమ సందర్భంగా జూదాలు ఆడే వారిపై దాడులు చేయటం భావ్యం కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మజ్జిగౌరి మందిరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పనులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా పార్కు నుంచి ప్రధాన ముఖద్వారం వరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఆయా ప్రాంతంలోని తాత్కాలిక దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రెండేళ్ల వ్యవధి కాలంలో డీపీఆర్ ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మందిరం సూపరింటెండెంట్ జానకీ వల్లభ్ , ఇంజినీర్ వెంకట్ తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని వసతులతో మందిరం ప్రాంగణంలో అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో గజలక్ష్మి, కుమార పౌర్ణమి పూజలు
జయపురం: జయపురంలో గజలక్ష్మి, కుమార పూర్ణిమ పూజలు ఆడంబరంగా సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. రఘునాథ్ మందిర కూడలిలో ఏర్పాటు చేసిన పెండాల్లో ప్రతిష్టించిన గజలక్ష్మీదేవి విగ్రహానికి వేద పండితులు కృష్ణదాస్, శుభాంశు త్రిపాఠీలు వైదిక నియమ నిష్టలతో పూజలు చేసి ఆరంభించి ఐదు రోజులు జరగనున్న గజలక్ష్మి పూజలకు శ్రీకారం చుట్టారు. గజలక్ష్మి పూజలు నిర్వహించే ఐదు రోజులు ప్రతి రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని పూజా కమిటీ అధ్యక్షులు దేవేంద్ర బాహిణీపతి వెల్లడించారు. అలాగే గజలక్ష్మి పూజలతో పాటు కుమార పూర్ణిమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పూజల అనంతరం స్థానిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్కళ సంస్తృతిలో కుమార పూర్ణిమ మహత్తు, ప్రాధాన్యలను వివరించారు. కార్తీక పూర్ణిమను అవివాహత యువతులు భక్తితో ఆదర్శ వంతుడైన భర్త కొరకు పూజలు జరుపుకుంటారని వివరించారు. రాత్రి చంద్రుడుని చూసి కార్తికేయునికి పూజలు చేయాలన్నారు. అనంతరం స్థానిక కళాకారుల సంబలపురి డాన్స్లతో పాటు పలు జానపద, శాసీ్త్రయ నృత్యాలు ప్రేక్షకులను అలరింప చేశాయి. జయపురం మున్నిపల్ చైర్మన్ నరేంద్రకుమార్, మహంతిబాబులి రథ్, రాజకిశోర్ దాస్, బాబు పాత్రో పాల్గగ్నారు. పూజల్లో, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించేందుకు అధికసంఖ్యలో జనం తరలివచ్చారు. కొరాపుట్: గజలక్ష్మీ పెండాల్స్ను బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి మంగళవారం సందర్శించారు. నబరంగ్పూర్, కొసాగుమ్డ, నందాహండి సమితుల్లో గజలక్ష్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాలలో ఇటీవల మృతి చెందిన పలువురి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
కాల్పుల కలకలం
పర్లాకిమిడి: బరంపురంలోని బ్రహ్మనగర్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. సోమవారం రాత్రి 10 గంటల సమంయలో సీనియర్ న్యాయవాది, బీజేపీ గంజాం జిల్లా అధికార ప్రతినిధి పిత్తాబాస్ పండాను గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి అతి సమీపంలో రైఫిల్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే పిత్తాబాస్ మృతి చెందినట్టు బరంపురం ఎస్పీ ఎం.సరవనా వివేక్ వెల్లడించారు. పిత్తాబాస్ పండా బయటకు వెళ్లి తిరిగి బ్రహ్మనగర్లో తన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే బరంపురం ఎం.కె.సి.జి.మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పాయింట్ రేంజ్లో కాల్చడంతో వెన్నముక దెబ్బతిన్నదని, ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడని డాక్టర్ సుదీవ దాస్ తెలిపారు. విషయం తెలుసుకున్న గంజాం జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. పిత్తాబాస్ను ఎవరు.. ఎందుకు చంపారన్న విషయమై స్పష్టత రాలేదు. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం వేట ప్రారంభించారు. మంత్రుల సంతాపం.. పిత్తాబాస్ పండా హత్య విషయం తెలుసుకున్న రాష్ట్ర ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహాన్ సామల్, రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులా నంద మల్లిక్, బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలియజేశారు. పండా కుటుంబసభ్యులను ధైర్యం చెప్పారు. పండా మరణం తీరని లోటని గంజాం జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. పిత్తాబాస్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను వెంటనే పట్టుకోవాలని గంజాం జిల్లా ఎస్పీ సరవనా వివేక్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ఆదేశించారు. -
విజిలెన్స్ వలలో ఇంజినీర్
● రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం జయపురం: లంచం తీసుకుంటూ జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితికి చెందిన ప్రభుత్వ ఇంజినీర్ లంభోదర నాయిక్ జయపురం విజిలెన్స్ అధికారుల వలలో పడ్డారు. ఒక కాంట్రాక్టర్కు బిల్లు పాస్ చేసేందుకు రూ. 20 వేలు ఇంజినీర్ డిమాండ్ చేశారు. దీంతో ఆయన విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సలహా మేరకు కాంట్రాక్టర్ ఆ డబ్బు ఇంజినీర్కు ఇస్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది దాడి జరిపి అతడిని రెడ్ హేండెడ్గా పట్టుకున్నారు. విజిలెన్స్ విభాగ అధికారుల సమాచారం ప్రకారం.. కుంద్ర సమితిలో గ్రామాభివృద్ధి రోడ్డు కుంద్ర శ్మశానం వరకు రూ. ఆరు లక్షల టెండర్ పనిని కాంట్రాక్టర్ ప్రఫుల్ల స్వైన్కు లభించింది. ఆ పని బిల్లు చేసేందుకు ప్రభుత్వ ఇంజనీర్ లంభోదర నాయిక్ కాంట్రాక్టర్ను 20 వేల రూపాయలు లంచంగా అడిగారు. ఈ విషయం ప్రఫుల్ల స్వైన్ జయపురం విజిలెన్స్ ఎస్పీ కార్యాలయంలో తెలిపాడు. విజిలెన్స్ అధికారుల సూచన మేరకు ఆదివారం సాయంత్రం స్వైయ్ డబ్బు తీసుకు వెళ్లి ఇంజినీర్కు అందజేశారు.అప్పటికే వేచి ఉన్న విజిలెన్స టీమ్ దాడి జరిపి డబ్బు సీజ్ చేసి ఇంజినీర్ను అరెస్టు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్రకుమార్ పండ ఆదేశం ప్రకారం.. డీఎస్పీ సదానంద పాణి, అజయ ప్రదాన్, సూర్యమణి టక్రి, ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాశ నాయిక్, సంతోషి బారిక్, సంజయ ప్రధాన్, అమీన్ గౌరీ చంద్ర బాగ్, గగణ బిహారీ పండ, సుజిత్ కుమార్ నాయిక్, ఏఎస్సై దిలీప్ కుమార్ భుయ, కేశవ గరులు దాడిలో పాల్గొన్నారు. 2021లో లంభోదర్ నాయిక్ కుంద్ర సమితిలో ఇంజినీర్గా నియమితులయ్యారు. అనంతరం ఆయనను బొయిపరిగుడ సమితికి బదిలీ చేశారు.దసరా పండుగకు ముందుగా స్వైన్ కుంద్ర సమితికి పిప్యుటేషన్పై వచ్చారు. గతంలో కూడా అతనిపై ఒక విజిలెన్స్ కేసు ఉన్నట్లు తెలిసింది. -
ఉత్సాహంగా..
ఉల్లాసంగా.. జిల్లాలోని గుణుపూర్లో బాలల శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య, సంగీత పోటీలు అలరించాయి. జబర్గుడ, బాలనికేతన్, లిమామడ ప్రాంతాలోని సేవా సమాజంలో వంద మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా శిశు సురక్ష సమితి యూనిట్ అధికారి సీహెచ్ మహాదేవ్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులను ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు నిర్వహిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు మనోజ్ జెన్న, శివప్రసాద్ దాస్, సత్యనారాయణ జెన్నాలు, ఒడిశా నృత్య కళాకారుడు సుస్మిత పండ, గురు దిలీప్ చౌధరి, సాగరిక రాజ్గురులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. –రాయగడ -
బస్సు ఢీకొని అక్కాచెల్లెళ్లు మృత్యువాత
కొరాపుట్: బస్సు ఢీకొన్న ఠటనలో అక్కాచెల్లెళ్లు మృత్యువాతపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కట్ర అంబ గ్రామానికి చెందిన పితవాస్ ముదలి తన భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్పై వెళ్తుండగా..కొరాపుట్ నుంచి రాయగడ వైపు వస్తున్న ప్రైవేటు బస్సు దశమంత్పూర్ సమితి పంచడ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై అక్కాచెల్లెళ్లు భవానీ ముదలి (6), కవితా ముదలి (9) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులను స్థానికులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను మునిగుడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకేపూర్ ప్రాంతానికి చెందిన సుజిత్ కొరకొరియా, అజయ్ బాగ్, మునిగుడకు చెందిన పింటు టకరి, ప్రమోద్, అమ్రాన్ భత్రలు ఉన్నారు. మునిగుడ ఎస్డీపీవో సంతోషిణి ఓరం, ఐఐసీ సౌదామణి బెహరలు ఈ మేరకు మంగళవారం నాడు మునిగుడ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
ఫోన్ ఇవ్వలేదని పదేళ్ల బాలిక ఆత్మహత్య
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి గోవిందపల్లి పంచాయతీ డేప్సాహి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వనందుకు పదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ కిర్సనీ కుమార్తె స్థానిక గోవిందపల్లి పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. తన తండ్రి మొబైల్ ఫోన్లో తరచూ ఆత్మహత్యల వీడియోలు చూస్తుండేది. దీనిని గమనించిన తండ్రి ఫోన్ ఇవ్వడం మానేశాడు. ఈ క్రమంలో సోమవారం తండ్రికి ఫోన్ అడిగింది. అందుకు నిరాకరించడంతో ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటి తర్వాత భోజనం కోసం తల్లి పిలవగా బాలిక ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించిం ది. వెంటనే బాలికను కిందకు దించి మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మత్తిలి పోలీస్ ఐఐసీ దీపాంజాలి ప్రదాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట నష్టంపై సమీక్ష
పర్లాకిమిడి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, రాగులు, జొన్న పంటలు నాశనమయ్యాయి. జిల్లాలో నాలుగు సమితి కేంద్రాలు గుమ్మా, నువాగడ, రాయఘడ, మోహనా, గుసానిలో జరిగిన పంటనష్టంపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ మధుమిత సమీక్షించారు. గుసాని, గుమ్మా, సమితి కేంద్రాలను సందర్శించారు. గుమ్మా బీడీఓ దులారాం మరాండీ, తహసీల్దార్ శరత్ శోబోరో, బీఈఓ, ఇతర అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అధిక వర్షాలకు వంతెనలు, రోడ్లు, కల్వర్టులు నష్టమయ్యాయి. గజపతిలో రూ.80 కోట్ల నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా తెలియజేశారు. -
సీజేఐపై దాడికి యత్నం దురదృష్టకరం
శ్రీకాకుళం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్పై దాడికి యత్నించడం దురదృష్టకరమని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద మానవహారం మంగళవారం నిర్వహించారు. ఆయా సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, కంఠ వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. సీజేఐపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు బడే కామరాజు, ముంజేటి కృష్ణ, బాడాన దేవభూషణరావు, రౌతు శంకరరావు, ఎంఏ రఫీ, మహిబుల్లా ఖాన్లతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ట దామోదరరావు, ఉపాధ్యక్షుడు సీతరాజు, ప్రతినిధులు బి.మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, చలపతిరావు, డి.రాజ్ కుమార్లు మాట్లాడుతూ సీజేఐ గవాయ్పై దాడి యత్నాన్ని ఖండించారు. ఈ ఘటన న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, నాగరిక సమాజంలో దాడులకి స్థానం లేదన్నారు. కార్యక్రమంలో దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ నాయకులు వైశ్యరాజు మోహన్, నటుకుల మోహన్, యజ్జల గురుమూర్తి, అర్జి కోటి, పురుషో త్తం రాంబాబు, సంతు, అర్జి ఈశ్వరరావు, కొయిలా పు విజయ్, కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, విజయ్, అఖిల్, రాము, మజ్జి గౌతమ్, రాహుల్, హేమంత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
కవిటి: మండలంలోని సహలాలపుట్టుగలో ఈనెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసు వివరాలను కవిటి పోలీసులు మంగళవారం ఆలస్యంగా మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొనియా సురేష్ ప్రధాన్(25) ఈనెల 1వ తేదీన తన జీడితోటలో జీడిచెట్టుకు టవల్తో ఉరివేసుకుని వేలాడుతుండడంతో అతని అక్క కె.పద్మ చూసింది. వెంటనే గ్రామస్తులు కవిటి పోలీసులకు తెలిపారు. దీంతో 2వ తేదీ ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ విషయం ఎందుకు ఇన్ని రోజులు మీడియాకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. తాను బందోబస్తు డ్యూటీకి వెళ్లిపోయినందువల్ల ఆలస్యం జరిగిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర రైల్వే గేటు సమీపంలో ట్రాక్పై పడి ఒక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందారు. వ్యక్తిపై నుంచి ట్రైన్ వెళ్లడంతో శరీరభాగాలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీనిని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు. మందస: లగేజీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. తంగరపుట్టి గ్రామానికి చెందిన సవర విజయ్(25) సోమవారం మందస వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా రాయికోల గ్రామం వద్ద లగేజీ ఆటో ఢీకొంది. దీంతో తీవ్రగాయాలుపాలైన యువకుడిని వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణస్థలం: మండలంలోని జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబటి యర్రయ్య (47) పడవ బోల్తాపడి మృతి చెందారు. జేఆర్పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. అంబటి యర్రయ్యతో పాటు మరో ముగ్గురు వాసుపల్లి పోతయ్య, దుమ్ము అప్పన్న, సూరాడ లక్ష్మణలు సముద్రంలో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఒడ్డుకు వస్తున్న సమయంలో భారీ కెరటాలకు పడవ బోల్తా పడి నలుగురూ సముద్రంలో పడిపోయారు. వారిలో దురదృష్టవశాత్తు అంబటి యర్రయ్య సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. మిగతా ముగ్గురు ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నారు. మృతుడికి భార్య యర్రమ్మ, ఇద్దరు కుమారుడు, కూతురు ఉన్నారు. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బీజేపీ పాలనలో దళితులకు రక్షణ కరువు
రాయగడ: అడ్డతోవలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత వర్గాలకు రక్షణ కరువు అవుతుందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, న్యాయవాది మానస్ కుమార్ మల్లిక్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో దళిత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందలేని ఎంతో మంది ఆదివాసీలు ఉపాధిని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి అక్కడి యాజమానుల నిరంకుశత్వానికి బలవుతున్నారన్నారు. పారిశ్రామకంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో కూడా ఉపాధి అవకాశాలు కరువుతుండటం విచారకరమన్నారు. ఓట్ల దొంగతనం.. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అడ్డదారిలోనే అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీఎం ప్యాడ్ టాంపరింగ్కు పాల్పడటంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై తన పోరాటం కొనసాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు ఇప్పటికై నా తెలుసుకొని ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ.. అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం వాటి మాట ప్రస్తావనకై నా తీసుకురావడం లేదని ఆరోపించారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలో కూడా చెప్పుకొదగ్గ అభివృద్ధిని ఒడిశా రాష్ట్రం సాధించలేదని ఏద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అప్పల స్వామి కడ్రక, డీసీసీ మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం
కవిటి: వైఎస్సార్సీపీలో పార్టీ కోసం పనిచేసేవారికి సరైన ప్రాధాన్యం లభిస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని కొత్తపుట్టుగలో ఉన్న ఆయన నివాసంలో కవిటి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఎమ్మెల్సీగా శ్రీకాకు ళం జిల్లాతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించిన తీరును నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ.. శాసన మండలి సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించే అవకాశం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలనే దక్కిందని తెలియజేశారు. ఆయన ఆశయాల మేరకు ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కుసుంపురం గ్రామానికి చెందిన బెంతు సామాజిక నాయకుడు శివ బిసాయి మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల్లో తమ బెంతు ఒరియా ల సమస్యలను ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. కడియాల ప్రకాష్ మాట్లాడుతూ.. పరిపూర్ణమైన అవగాహనతోనే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారని కొనియాడారు. నియోజకవర్గంలోని రోగులు పడుతున్న అవస్థలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఉద్యోగాలు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న ఉద్దానం ఉద్యోగుల బాధలు, జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లేందుకు పౌరులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పాండవ శేఖర్, పీఎం తిలక్, పూడి నేతాజీ, బెందాళం జయప్రకాశ్, గోపయ్య, మురళి, బర్ల నాగభూషణం, కృష్ణారావు, నూతలపాటి బాబురావు, వై.అశోక్, రవి, నారాయణ స్వామి, బర్ల నాగు, కాయ భీమసేన్, దువ్వు కృష్ణారెడ్డి, పాండవ శేఖర్, పిరియా కృష్ణారావు, చందాన పూర్ణచంద్రుడు, దుద్ది ధర్మారావు, పాతిన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి పరిధిలో గల తలపంగ, పురుణాసాహి, నువాసాహి, మహాదీమ్, తదితర అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగవుతుందన్న సమాచారం మేరకు జిల్లా పోలీసులు, అబ్కారీ, అటవీ శాఖలకు చెందిన అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ మేరకు విస్తృతంగా దాడులను నిర్వహిస్తోంది. బస్సులో కత్తితో వీరంగం భువనేశ్వర్ : పూరీ జిల్లా కొణాస్ బింధాన్ చౌరస్తా వద్ద లక్ష్మీ ప్రైవేటు బస్సులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కత్తితో దాడికి పాల్పడటంతో ఏడుగురికి గాయాలయ్యాయి. మొదట కత్తితో ఒక వ్యక్తిపై దాడి చేశాడు. తోటి ప్రయాణికులు అడ్డుకోవడంతో వారిపైనా కత్తి ఝులిపించి గాయపరిచాడు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. హరసపడా నుంచి సుకొలొ వస్తున్న మో బస్సులో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కొణాస్ స్టేషన్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు కొణాస్ బింధాన్కు చెందిన తపన్ భోయిగా గుర్తించారు. కటక్లో కర్ఫ్యూ ఎత్తివేత భువనేశ్వర్: కటక్ నగరంలో అల్లర్లు చెలరేగడంతో 36 గంటలు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. కర్ఫ్యూ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో దాదాపు 50 ప్లాటూన్ల పోలీసు బలగాలు మోహరించడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందన్నారు. అయితే, పుకార్లు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా స్థిరపడే వరకు భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని తెలిపారు. బాల్య వివాహం అడ్డగింత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో చితపారి పంచాయతీలో బాల్య వివాహాన్ని జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది మంగళవారం అడ్డుకున్నారు. బలిమెల పోలీసులకు బాల్య వివాహాం జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెంటనే జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారి నారాయణ దాస్కు సమాచారం ఇచ్చారు. నారాయణదాస్ తన సిబ్బందితో చితపరి గ్రామానికి వెళ్లారు. అదు దోర అనే వ్యక్తి తన కుమారుడికి బాలికతో వివాహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పెళ్లి కుమారుడికి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను మల్కన్గిరి బాలల ఆశ్రమ గృహానికి తరలించారు. ఈ మేరకు పెళ్లి కుమారుడు, కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో ఎరువుల పంపిణీపై ‘ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ’ శీర్షికతో సాక్షి పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ ఒక ప్రకటనలో స్పందించారు. కళ్లేపల్లి గ్రామంలోని 196 మంది రైతులకు డీసీఎంఎస్ ద్వారా 333 యూరియా బస్తాలు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. వాటిని రైతుసేవ కేంద్రం ద్వారా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, అక్కడ వైఫై పని చేయకపోవడంతో ఎదురుగా ఉన్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి నుంచి వైఫై కనెక్షన్ తీసుకొని తర్వాత రైతుసేవ కేంద్రం నుంచే ఎరువులు పంపిణీ చేశామన్నారు. సాంకేతిక కారణం వలనే ఇలా చేసినట్లు తెలియజేశారు. హిరమండలం: పశువుల అక్రమ రవాణాను హిరమండలం పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం హిరమండలంలో ఎస్ఐ వెంకటేష్ వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండంతో పట్టుకున్నారు. కొత్తూరు మండలం బలద సంతలో కొని అలమండ తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో కొత్తవలసకు చెందిన జనార్ధనరావు, గణపతిరావులపై కేసు నమోదు చేశారు. బొలేరో వాహనాన్ని సీజ్ చేశామని, ఎనిమిది పశువులను గుర్ల గోశాలకు తరలించామని ఎస్ఐ వెల్లడించారు. -
గజలక్ష్మి పూజలు ప్రారంభం
రాయగడ: గజలక్ష్మీదేవి పూజలు ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూకాలనీలో 30 ఏళ్లుగా ఈ పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేశారు. గజలక్ష్మి అమ్మవారికి మంగళవారం నుంచి భక్తులు ప్రత్యేక పూజలను చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆవాహన, ప్రాణ ప్రతిష్ట పూజలు జరిగాయి. మంగళవారం నుంచి 17 తేదీ వరకు పూజలను నిర్వహిస్తున్నట్లు పూజా కమిటీ అధ్యక్షుడు సంతోస్ కుమార్ పాత్రో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా స్థానిక ఆర్కే నగర్, సబ్ కలెక్టర్ కూడలి వద్ద గజలక్ష్మి పూజలు ప్రారంభమయ్యాయి. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: స్థానిక గాంధీ జంక్షన్ ఒడియా మంగళి వీధి వద్ద మంగళవారం నుంచి గజలక్ష్మి పూజలను ప్రారంభించారు. కార్తీక మాసంలో గజలక్ష్మి పూజలు, దర్శనం వల్ల పుణ్యం లభిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈనెల 19 వరకూ పూజలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని పాత పోస్టుఫీస్ వీధిలో గత 26 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న గజలక్ష్మిదేవి ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా చేయడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గౌరీ పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. -
షాకింగ్ వీడియో.. మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి
జాజ్పూర్: ఒడిశాలోని జాబ్పూర్ జిల్లా కాంతియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఖరస్రోత నదిలో ఓ మొసలి.. మహిళను లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న సౌదామిని (57)ని ఒక ముసలి లాక్కెళ్లడంతో గ్రామంలో కలకలం రేగింది. మహిళను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారు. గల్లంతైన మహిళ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సోమవారం( అక్టోబర్ 6) సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె బట్టలు ఉతికేందుకు ఖరస్రోత నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట స్నానం చేస్తుండగా ఓ మొసలి ఆమెను ఒక్కసారిగా నదిలోకి లాక్కెళ్లింది. అయితే ఓ వంతెనపై వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్రామస్తులు ఆ మొసలిని వెంబడించి ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమెను కాపాడలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025 -
భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి
రాయగడ: గౌరీపౌర్ణమి సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్థానిక కండ్రవీధి, జగన్నాథ మందిరం వెనుక, మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న నందన్న పూజల్లో భాగంగా శివపార్వతులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు గౌరీదేవీ వ్రతం చేశారు. పండ్లు, ఫలాలు, చీరలు, గాజులను శివపార్వతులకు సమర్పించారు. మొక్కులను తీర్చుకున్నారు. హత్య చేస్తామంటూ బెదిరింపులు! రాయగడ: జిల్లాలోని పద్మపూర్ తోలోసాహి ప్రాంతానికి చెందిన భైరవ సాహు అనే వ్యక్తిని గత ఏప్రిల్ 21వ తేదీన చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణతో కొందరు గ్రామస్తులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అందుకు సంబంధించి కొందరు గ్రామస్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే జైలు నుంచి తిరిగి వచ్చిన నిందితులు తమను ఎలాగైన హత్య చేస్తామని బెదిరిస్తున్నారని భైరవ సాహు కుటుంబీకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు వినతుల స్వీకరణలో భాగంగా బాధిత కుటుంబీకులు ఈ మేరకు కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన భైరవ సాహు భార్య సంజు సాహు, కొడుకు జితు సాహు, కూతురు రస్మి సాహు తదితర కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలసి తమ గోడును విన్నవించుకున్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ దీనిపై దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు మెళియాపుట్టి: మండలంలోని గంగరాజపురం గ్రామానికి చెందిన యువకుడు గూడపు చంటి(29) విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని మున్నాజెన్నా అనే వ్యక్తి ఇంటిపై చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఉండడంతో ఒడిశాలోని జంగాలపాడు గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు మృతుడు చంటిని ఆ కొమ్మలు తొలగించడానికి సాయంగా రమ్మన్నాడు. దీంతో విద్యుత్ సరఫరా ఉండగానే చెట్టు కొమ్మలను చంటి తొలగిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క దమయంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు కొద్దికాలం క్రితమే మృతి చెందారు. అతడు విజయవాడలోని ఒక ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ కార్మికునిగా పనిచేసేవాడు. ఇటీవల వినాయక చవితికి గ్రామానికి వచ్చాడు. మంగళవారం విజయవాడ బయల్దేరి వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: మండలంలోని గొల్ల కంచిలి నుంచి కంచిలి వెళ్లేమార్గంలో మఠం చెరువు సమీపంలో రైల్వేట్రాక్పై సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని పలాస జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. ప్రమాదంలో మృతుని ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతుడి శరీరంపై ఆరెంజ్, తెలుపు రంగు కలిగిన గడుల తువ్వాలు మాత్రమే ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 94406 27567, 99891 36143 నంబర్లను సంప్రదించాలని కోరారు. తప్పిన పెను ప్రమాదం జి.సిగడాం: మండలంలోని మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ తీగ తెగిపడిన సమయంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన బాడిత కనకలక్ష్మికి చెందిన ఆవుకు విద్యుత్ తీగ తగలడంతో మృత్యువాత పడింది. ఇదే సమయంలో కనక లక్ష్మికి సైతం విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయింది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై కర్రలతో విద్యుత్ తీగను తొలగించారు. అనంతరం ఆమెను హుటాహూటిన రాజాం అస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ మానంపేట మీదుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యవసాయ కోసం ఏర్పాటు చేసిన లైన్లు మార్చాలని కోరుతున్నారు. -
ఏడు సమితుల పరిధిలో ఆది కర్మయోగి కార్యక్రమాలు
పర్లాకిమిడి: వికసితభారత్త్, వికసిత్ జిల్లా విజన్–2030 లక్ష్యంగా గజపతి జిల్లాలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాలను ఏడు సమితి కేంద్రాలు, 435 గ్రామాలలో 8,700 మంది ఆదిసాథీలతో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ మధుమిత వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. గిరిజన, ఆదివాసీ ప్రజలకు మౌలిక సమస్యలు, విద్య, వైద్య, రవాణా, తాగునీరు, అంగన్వాడీ, పోషక ఆహారం, స్వయం ఉపాధికి పథక రచన చేస్తున్నామని అన్నారు. ఇదోక నూతన ప్రక్రియ అని, ప్రముఖ ఆదివాసీ మహిళ బిర్షా ముండా 140 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంప్రదాయ గ్రామాలు వికాసానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం ప్రవేశపెట్టారని కలెక్టర్ అన్నారు. దేశంలో 30 రాష్ట్రాలు, 550 జిల్లాలు, 300 కంటే ఎక్కువ సమితి కేంద్రాల్లో, ఒక లక్ష గ్రామాలు 2030 లోగా వికసిత్ భారత్గా తీర్చిదిద్దడానికి నడుం కట్టారని అన్నారు. గజపతి జిల్లాలో ఏడు సమితి కేంద్రాలు, 435 గ్రామాల్లో ఐదు సామాజిక సేవాకేంద్రాలు నిర్మిస్తున్నామని అన్నారు. దీనికోసం జిల్లాలో 8,700 మంద ఆదిసాథీలను నియమించామని కలెక్టర్ అన్నారు. సెప్టెంబర్ 27 నుంచి గాంధీ జయంతి వరకూ ఆదికర్మయోగి అభియాన్ ప్రోగ్రెస్ను తెలియజేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్వో కె.నాగరాజు, ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి అంఽశుమాన్ మహాపాత్రో పాల్గొన్నారు. -
కార్తీక పూజలకు సన్నాహాలు
● భద్రత చర్యలపై పూరీ జిల్లా ఎస్పీ ఆదేశాలు భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో కార్తీక మాసం పవిత్ర పూజాదులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నెల రోజులపాటు కార్తీక వ్రతం ఆచరిస్తారు. ప్రధానంగా వితంతు మహిళలు నిష్టతో పూజలు చేస్తారు. రాష్ట్రంలో సుదూర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వ్రత దీక్ష చేపట్టిన మహిళలు తరలి వస్తారు. వీరి కోసం పూరీ శ్రీమందిరం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత వసతి, జగన్నాథుని మహా ప్రసాదం, ప్రత్యేక దర్శన సౌకర్యం, వసతి నుంచి దేవస్థానం రాకపోకలకు ప్రత్యేక రవాణా, వసతి సముదాయంలో ఆరోగ్య సేవలు వంటి సుదపాయాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పట్ల పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ సన్నాహాలపై పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ముందస్తుగా సమీక్షించారు. అనుబంధ అధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. కొండను ఢీకొట్టిన లారీ రాయగడ: విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్కు బొగ్గు లోడతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కొండను ఢీ కొంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలవ్వగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలోని జంఝావతి నదిపై గల బ్రిడ్జి మలుపులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవరును అక్కడ ఉన్నవారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ద్విచక్ర వాహన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు జయపురం: ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. జయపురం సబ్డివిజన్ బొయిపరగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ రౌత్గుడ గ్రామ ప్రాంతంలో ఆదివాయం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. రౌత్గుడ వాసి మితున్ జెన మల విసర్జన కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో బొయిపరిగుడ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టారు. దీంతో జెనతోపాటు ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమీపంలో ఉన్నవారు క్షతగాత్రులను బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం జయపురం ఫూల్బెడ గ్రామ ప్రాంతంలోగల కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 11న నువాపడా ఉప ఎన్నిక భువనేశ్వర్: నవంబర్ 11న నువాపడా శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. 13న నువాపడా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రచురిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు దాఖలుకు గడువు కేటాయించారు. గడువు లోగా దాఖలైన నామినేషన్ దస్తావేజులు అక్టోబర్ 22న పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. పోటీ నుంచి వైదొలిగేందుకు అక్టోబర్ 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ మధుమిత పాల్గొని వినతులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్ఓ కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, తహసీల్దార్ నారాయణ బెహరా, సబ్ కలెక్టర్ అనుప్ పండా పాల్గొన్నారు. కెరండి, సిద్ధమణుగు, పర్లాకిమిడి పురపాలక, రాణిపేట గ్రామ పంచాయతీల నుంచి 57 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 37, గ్రామ సమస్యలకు సంబంధించినవి 21 ఉన్నాయి. వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రాయగడలో.. రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సొమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొన్నారు. 55 వినతులను స్వీకరించారు. ఇందులో 47 వ్యక్తిగతమైనవి, మరో 8 గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఏడుగురుకి ఆరోగ్య సమస్యలకు సంబంధించి రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ. 25 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, డీఎఫ్ఓ అన్నా సాహెబ్ ఆహోలే, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, జిల్లా ముఖ్యవైధ్యాధికారి సరోజినిదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష
నరసన్నపేట: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో సారవకోట మండలం బుడితికి చెందిన కొర్ల శివకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500ల జరిమానాను నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి విధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం యాతపేటకు చెందిన సోడి పైడిరాజు ద్విచక్ర వాహనం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేయగా చోరీకి గురైంది. ఈ మేరకు ఈ ఏడాది మే 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కొర్ల శివను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జిషీట్ పోలీసులు వేయగా, నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి విచారణ చేపట్టారు. సోమవారం కొర్ల శివను దొంగగా నిర్ధారించి జైలుశిక్ష ఖరారు చేశారు. కేసులో ఏపీపీగా శాంతి సంతోషి వ్యవహరించారు. ఈ మేరకు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆత్మహత్య చేసుకొని మహిళ మృతి పలాస: మందస మండలం మఖరజోల గ్రామ పంచాయతీ పరిధి అల్లిమెరక కాలనీలో నివాసముంటున్న కొండ కురమ్మ (22) సోమవారం పలాస మండలం రంగోయి గేటు సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కురమ్మ తల్లి గాది పద్మ, కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురమ్మ భర్త చంద్రశేఖర్ కత్తర్కు వలస కూలీగా గతేడాది వెళ్లాడు. కురమ్మకు కడుపులో నొప్పి ఉంది. ఇటీవల సోంపేట మండలం జురాబంద గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లింది. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. కన్నవారి ఇంటి నుంచి వచ్చిన కురమ్మ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. లేడీ రౌడీ షీటర్పై ఎస్పీకి ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్: సరుబుజ్జిలి మండలంలోని మూలసవలాపురానికి చెందిన లేడీ రౌడీషీటర్, ఆమె అనుచరులపై అదే గ్రామానికి చెందిన కొంతమంది ఎస్పీ మహేశ్వరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. దందాలు, రౌడీయిజం, సారా, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, భూ, ఇళ్ల స్థలాల కబ్జాలు జిల్లా నలుమూలలు చేస్తూ గ్రామ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న జామి రమేష్ తరపున మధ్యవర్తి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నది ఈమె అనుచరులేనన్నారు. అర్ధరాత్రి ఇంటి యజమాని తంగుడు ఉపేంద్ర ఇంట్లో చొరబడి దౌర్జన్యానికి పాల్పడేందుకు యత్నించగా.. స్థానికులు దేహశుద్ధి చేయడంతో వెనుదిరిగారని తెలిపారు. అనేక పోలీస్స్టేషన్లలో వీరిపై కేసులున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో కె.ధనుంజయ, జి.మోహనరావు, ఎస్.వసంత్కుమార్, జి.శ్రీధర్ మరో 30 మందికి పైగా ఉన్నారు. కాగా వీరు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అవతలి వర్గం వాళ్లూ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే టౌన్ డీఎస్పీ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, జె.ఆర్.పురం సీఐ అవతారం ఎస్పీని కలిసేందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. -
వన్యప్రాణులను కాపాడుకోవాలి
రాయగడ: వన్యప్రాణులు అంతరించి పోతున్నాయని వీటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని జిల్లా అటవీ శాఖ అధికారి అన్నా సాహేబ్ అహోలే అన్నారు. జాతీయ వన్య ప్రాణుల వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల్లో ఉండే వన్యప్రాణుల జాతి అంతరించి పోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొంతమంది స్వార్ధపరులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వన్యప్రాణులను వేటాడి హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అడవుల్లోని పచ్చని చెట్లు నరికి వేస్తుండటంతో వన్యప్రాణులు జనార్యంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ అశోక్ కుమార్ ప్రధాన్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ఽమధ్య పోటీలను నిర్వహించారు. విజేతల వివరాలు జలచర ప్రాణులకు సంబంధించి నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సీనియర్ విభాగంలో తపస్విని కడ్రక ప్రథమ బహుమతిని గెలుచుకోగా సామిరాణి గౌడో ద్వితీయ, పొరిస్మిత బిడిక తృతీయ బహుమతులను గెలుపొందారు. జూనియర్ విభాగంలో స్మృతి బెహర, బిందీయ సబర్, అభ్యాస్ ప్రధాన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు అటవీ శాఖ అధికారి అహోలే బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రాయగడ రేంజర్ కామేశ్వర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ యాత్రికునికి ఘన స్వాగతం
జయపురం: అఖిల భారత్ అంతా సైకిల్ యాత్ర జరుపుతూ జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ చేరిన తమిళనాడుకు చెందిన ఆటో డ్రైవర్ అబబుల్లా సాలిమ్ షేఖ్కు బొయిపరిగుడ ఆటో డ్రైవర్ల మహా సంఘం సోమవారం ఘన స్వాగతం పలికింది. అబబుల్లాసాలీమ్ షేఖ్ మాట్లాడుతూ.. దేశంలో డ్రైవర్ల సురక్ష, గుర్తింపు కోసం తాను సైకిల్ యాత్ర చేపట్టానని వెల్లడించారు. దేశంలో డ్రైవర్లను సమైఖ్యపరచేందుకు తాను కృషి చేస్తానన్నారు. డ్రైవర్ల సమస్యలను కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ లక్ష్యంతో తాను ఆగస్టు 16వ తేదీన సైకిల్ యాత్ర తమిళనాడులో ప్రారంభించానన్నారు. ఇంతవరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీష్గఢ్ రాష్ట్రాలలో సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని బొయిపరిగుడ వచ్చినట్లు తెలిపారు. తాను దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ సైకిల్ యాత్ర జరుపుతానని, తన సైకిల్ యాత్రలో ప్రభుత్వాల వద్ద మూడు డిమాండ్లు ఉంచుతున్నానన్నారు. ప్రమాద బీమా క్లైమ్ వెంటనే చెల్లించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపై రెండు లక్షల రుణంతో పాటు సబ్సిడీ సౌకర్యం కల్పించాలని, నిరుపేద డ్రైవర్ల పిల్లలు చదువుకునేందుకు అన్ని ఉచిత సౌకర్యాలు కల్పించి, వారి విద్యాప్రగతికి నూతన పథకం అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా అతడిని బొయిపరిగుడ ఆటో మహా సంఘ కార్యకర్తలు కలిసి అతడి ఆశయాన్ని కొనియాడారు. -
మాకు అదే పనేంటి..?
● జేఆర్పురం సీఐ అవతారం సమాధానం వైరల్ రణస్థలం: భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి కె.కిరణ్కుమార్ శ్రీకాకుళం వైపు నుంచి ఎచ్చెర్ల జాతీయ రహదారి మీదుగా వ్యాన్లో ఆవుల ఆక్రమ రవాణా జరుగుతోందని జేఆర్పురం సీఐ అవతారంనకు కాల్ చేయగా మాకు ఇప్పుడు అదే పనేంటి అని సీఐ మాట్లాడిన కాల్ రికార్డింగ్ను భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సోషల్ మీడియాలో సోమవారం వైరల్ చేశారు. కాల్ రికార్డులో ఉన్న సారంశం ప్రకారం ఫోన్ చేసిన వ్యక్తికి స్పందించిన సీఐ అవతారం మాట్లాడుతూ హలో ఎవరూ చెప్పండి అన్నారు. అవతల వ్యక్తి.. సార్ ఆవుల వ్యాన్ ఒకటి వస్తుందని అనగానే మాకు అదే పనేంటి ఇప్పుడు అని ఫోన్ కట్ చేశారు. దీనిపై సీఐ ఎం.అవతారం వివరణ కోరగా.. సాధారణంగా కంట్రోల్ రూమ్కు కాల్ చేయాలన్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్పేటలో రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే.. తెల్లవారిజామున 4 గంటలకు ఫోన్ చేసి ఆవులు వ్యాన్ వస్తుందని అన్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉన్నా ఫోన్ లిప్ట్ చేశాను. జేఆర్పురం పోలీసులు పట్టుకుని చెక్ చేశారు. ఆ పశువులు అలమండ సంతకు రైతులు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. -
కటక్ నగరంలో కర్ఫ్యూ
భువనేశ్వర్: కటక్ మహా నగరంలో శాంతిభద్రతల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నగరంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించారు. దేవీ నవరాత్రులు ముగింపు పురస్కరించుకుని అనుపు ఊరేగింపులో చెలరేగిన వివాదాల వైపరీత్యం తాండవిస్తుంది. సోదరభావంతో కుల, మతాలకు అతీతంగా నగరంలో ప్రజలంతా కలిసి మెలిసి అన్యోన్యంగా ఏటా జరుపుకునే దుర్గా పూజలు ఈ ఏడాది ఆందోళనకరంగా మారడం విచారకరం. కటక్ నగరం సోదర భావం సంప్రదాయాన్ని పరిరక్షించడంలో నగర వాసులంతా సహకరించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ వైబీ ఖురానియా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసులు శాంతిభద్రతలను కాపాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే సమాచారాన్ని నమ్మవద్దని, పోలీస్ వెబ్సైట్లోని సమాచారాన్ని మాత్రమే నమ్మండని విజ్ఞప్తి చేశారు. సాంఘిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం, ప్రసారాల నివారణ దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. దీంతో పరిస్థితి ఆశించిన మేరకు అదుపులోకి రాకపోవడంతో నగర వ్యాప్తంగా 13 పోలీసు ఠాణాల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేసినట్లు స్పష్టం చేశారు. 36 గంటల పాటు కర్ఫ్యూ నిరవధికంగా కొనసాగుతుందని జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎస్. దేవదత్త సింగ్ తెలిపారు. కర్ఫ్యూ అమలు ప్రాంతాలు నగర వ్యాప్తంగా 13 పోలీసు ఠాణాల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఆయా ప్రాంతాల్లో 36 గంటల పాటు కర్ఫ్యూ నిరవధికంగా కొనసాగుతుంది. దర్ఘా బజార్ పోలీస్ స్టేషన్, మంగళ్బాగ్, కంటోన్మెంట్, పూరీ ఘాట్ పోలీస్ స్టేషన్, లాల్బాగ్, బిడానాసి, మర్కత్ నగర్, సీడీఏ ఫేజ్ – 2, సదర్ పోలీస్ స్టేషన్, మాల్ గోదాం, బాదంబాడి, జగత్పూర్, బొయాలిస్ మౌజా ప్రాంతాలు కర్ఫ్యూలో ఉన్నాయి. వైద్య, అవసరమైన సేవలకు కరూ్ఫ్య్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కటక్ నగరంలో కర్ఫ్యూ నిబంధనలో భాగంగా పెట్రోల్ పంపులు, బస్సులు, దుకాణాలు, బజార్లు, కటక్ గిడ్డంగులు మూసివేశారు. నగరం వైపు అమొ బస్సు (సిటీ బస్సు) సేవల్ని నిలిపి వేశారు. నగరంలో ప్రధాన బస్టాండ్ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల రవాణా, జాతీయ రహదారిపై సాధారణ రవాణా, వైద్య సౌకర్యాలు యథాతథంగా పని చేస్తాయి. ప్రస్తుతానికి మంగళ వారం ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరిస్థితి పురోగతి ఆధారంగా కర్ఫ్యూ సడలింపు, తొలగింపు లేదా పొడిగింపు ఆధారపడి ఉంటుందని నగర పోలీసు కమిషనరేటు తెలిపింది. -
విద్యార్థుల ఆరోగ్యమే భవిష్యత్కు పునాది
కంచిలి/సోంపేట/మందస/టెక్కలి: విద్యార్థుల ఆరోగ్యం, ఆహార భద్రతే దేశ భవిష్యత్కు పునాది అని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం పలు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, చౌక ధరల దుకాణాలను ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సక్రమంగా నా ణ్యమైన భోజనం అందుతుందో లేదోనని తెలుసుకున్నారు. సోంపేట మండలంలోని వాడపాలేం వసతి గృహంలో విద్యార్థులకు వారానికి రెండు గుడ్లు అందజేస్తున్నారని విద్యార్థులు తెలపడంతో.. ఇన్చార్జి వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు అందజేయమని వెనుకబడిన తరగతుల జిల్లా సంక్షేమాధికారి బి.అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. వనతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు విద్యార్థులకు ఇచ్చే గుడ్ల సైజ్ ఉండాలని స్పష్టం చేశారు. స్టాక్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు డీఎస్ఓ సూర్యప్రకాశ్, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల శాఖాధికారి పి.చిన్నమ్మి తదితరులు ఉన్నారు. -
పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్మనోహరనాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకి దూరం చేసే విధానాలు ప్రభుత్వం విడనాడాలని కోరారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని విన్నవించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం, మెడికల్ కాలేజీల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, ఎస్.వి.రమణ మాదిగ, మహిబుల్లా ఖాన్, అమిరుల్లా బేగ్, రౌతు శంకరరావు, బాడాప దేవభూషణరావు, గుండబాల మోహన్, ఎంఏ బేగ్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, వైశ్యరాజు మోహన్, గద్దెబోయిన కృష్ణారావు, నీలాపు ముకుందరావు, నల్లబారిక శ్రీను, పెయ్యల చంటి, అబ్బాస్, సింకు రమణ, అరిబారిక రాజు, నేతల అప్పారావు, కొత్తూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల అప్రమత్తతతో నష్ట నివారణ
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 104 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులంతా అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి నష్టంజరగలేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. ప్లాస్టిక్ను నిషేధించేందుకు.. అధికారులంతా స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొని రావాలన్నారు. తుఫాన్ల గూర్చి ముందుగానే సమాచారం ఉంటుందని, మూడు రోజులు ముందుగానే సమాచారం తెలియజేస్తే అందరూ జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిని ఆదేశించారు. వ్యాపారులు హాజరవ్వాలి జీఎస్టీ 2.0పై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జీఎస్టీ ఎగ్జిబిషన్కు అధికారులతో పాటు వ్యాపారులు హాజరవ్వాలని కోరారు. వ్యవసాయ పనిముట్లు, మెడికల్ ఇన్సూరెన్సు, నోట్బుక్స్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా శాఖల అధికారులు షెడ్యూల్ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వినతుల స్వీకరణ పీజీఆర్ఎస్లో భాగంగా మొత్తం 104 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ – 28, మున్సిపల్ కార్పొరేషన్ – 16, పంచాయతీ రాజ్ – 15, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – 8, ఏపీఈపీడీసీఎల్ – 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ – 4, హౌసింగ్ – 3, వాటర్ రిసోర్సెస్ – 3, పౌర సరఫరాల శాఖ – 2, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ – 2, వ్యవసాయ శాఖ – 2, ప్రజా రవాణా శాఖ – 2, విభిన్న ప్రతిభావంతులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సాంఘిక సంక్షేమ శాఖ, రూరల్ డవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు, మెడికల్ ఎడ్యుకేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) ఆవరణలో జనరల్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని, దీని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని శ్రీకాకుళం స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బోర గోపి, ముకుందరావులు కోరారు. ● గుజరాతీపేటలోని లక్ష్మీ టాకీస్ వెనుకనున్న ప్రాంతంలో ఎక్కువగా మురుగు నీరు రోడ్లుపైనే ఉంటోందని, కాలువలు ఏర్పాటు చేయాలని వి.కాళీప్రసాద్, జి.కృష్ణారావు తదితరులు కోరారు. ● పాలకొండ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు బుడితి అప్పలనాయుడు తదితరులు విన్నవించారు. ● ఎచ్చెర్ల సీడీపీవో పాపినాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావుపై జేసీ విచారణ చేసి 15 రోజులు కావస్తున్నా ఐసీడీఎస్ పీవో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బాలామృతం ట్రాన్సుపోర్టు కాంటాక్టర్ పైడి వెంకటరమణ రెండోసారి ఫిర్యాదు చేశారు. ● రణస్థలం మండలంలోని తెప్పలవలస గ్రామానికి చెందిన మేడూరి సత్యనారాయణమూర్తి తనకు వారసత్వంగా సక్రమించిన గ్రామకంఠం భూమిని 15 సంవత్సరాల క్రితం తన కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆ భూమిని కొంతమంది వ్యక్తులు వీఆర్వో ధ్రువపత్రంతో అక్రమంగా వేరేవారికి అమ్మివేశారని, అందువలన తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గ్రామం కంఠం భూమి క్రయవిక్రయాలకు వీఆర్వో ధ్రువపత్రం చెల్లదని, అయినా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ వద్ద వాపోయారు. -
లక్ష్మీ ఇందిర పండాకు ఘనంగా నివాళులు
జయపురం: సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో సేవలు అందించిన జయపురం మహిళ లక్ష్మీ ఇందిర పండాకు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. సోమవారం లక్ష్మీ ఇందిర పండా వర్ధంతి సందర్భంగా పట్టణంలో 26 వ జాతీయ రహదారి లక్ష్మీపండ జంక్షన్లో గల ఆమె నిలువెత్తు ప్రతిమకు పూజ్య పూజ సంసంద్ సభ్యులు నివాళులు అర్పిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ లక్ష్మీ ఇందిరా పండ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఇంజినీర్ కేదారనాథ్ బెహరా మాట్లాడుతూ నేతాజీ ఇండియన్ ఆర్మీలో సేనాపతిగా ఆమె సాగించిన పోరాటం చిరస్మరణీయం అని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆమె విగ్రహానికి పాలకులు సముచిత గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి జరిపేందుకు వీరత్వంతో పోరాడిన లక్ష్మీ ఇందిర పండాకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయపురం పూజ్య పూజ సంసద్ కార్యదర్శి, తపన్ త్రిపాఠీ, కేషియర్ భైరవ సాహుతో పాటు సమాజ సేవి ప్రమోద్ కుమార్ రౌళో, పాత్రికేయులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణనాథ్ పట్నాయక్ నిబద్ధత స్ఫూర్తిదాయకం: గవర్నర్
భువనేశ్వర్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత ప్రాణనాథ్ పట్నాయక్ 55వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక జయదేవ్ భవన్లో రాష్ట్ర ప్రణనాథ్ స్మారక కమిటీ నిర్వహించిన స్మారక కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ఆయనను ఒక దార్శనికుడిగా అభివర్ణించారు, ఆయన ఆదర్శాలు, న్యాయం, సమానత్వం, సామాజిక సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. ప్రాణనాథ్ పట్నాయక్ నిర్భయ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు, మార్గదర్శక సోషలిస్ట్, రాజకీయ ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త, రచయిత, విద్యావేత్త, ప్రజలకు అంకితభావంతో కూడిన సేవకుడు అని కొనియాడారు. భారత దేశం రాజకీయ స్వేచ్ఛను సాధించినప్పటికీ పేదరిక నిర్మూలన, అసమానతలను తొలగించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడం వంటి సవాళ్లు ముఖ్యమైనవిగా ఉన్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో, ప్రాణనాథ్ పట్నాయక్ ఆదర్శాలు మన ప్రయత్నాలకు మార్గదర్శక వెలుగుగా పనిచేస్తాయన్నారు. విద్యను అందరికీ హక్కుగా, రాజకీయాలను సేవ యొక్క విధిగా, నాయకత్వం ప్రజలతో పాటు వారి పోరాటాలలో నడవడిగా ప్రాణనాథ్ పట్నాయక్ భావించారని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారిలో రాష్ట్ర న్యాయ, అబ్కారీ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, లోక్ సేవక్ మండల్ జాతీయ ఉపాధ్యక్షుడు దీపక్ మాలవ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు, సంబాద్ మరియు అమొ ఒడిశా వ్యవస్థాపక చైర్మన్ సౌమ్య రంజన్ పట్నాయక్ మరియు కిట్, కిస్ మరియు కిమ్స్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత ఉన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ గంగాబడ పంచాయతీ ముంతవీధిలో విద్యుత్ ఘాతంలో బారిక్ శోబోరో (45) రైతు మృతి చెందగా, మరో వ్యక్తి నరేంద్ర శోబోరో విద్యుత్ షాక్తో పర్లాకిమిడి మెడికల్లో చికిత్స పొందుతున్నాడు. గారబంద ఎస్ఐ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గంగాబడ పంచాయతీ ముంత వీధికి చెందిన బారిక్ శోబోరో పొలానికి సాగునీరు పెట్టడానికి వెళుతుండగా ఆదివారం మోటారు పంపు సర్వీసు వైరు ఒక ఎదురు కర్రకు వేలాడుతుండగా దాన్ని ముట్టుకున్న బారిక్ శోబోరో విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. వెంటనే బారిక్ శోబోరోను కోయిపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తరలించి ప్రథమ చికిత్స చేశారు. అయితే అప్పటికే బారిక్ మృతి చెందాడు. అతనితో వచ్చిన నరేంద్ర శోబోరోను పర్లాకిమిడి కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆయన బతికి బయటపడ్డాడు. రాయగడ బీడీఓ సంతోష్ కుమార్ బారిక్ మృతుడు బారిక్ శోబోరో కుటుంబానికి రూ.20 వేలు తక్షణ సాయం చేశారు. -
జేకేపూర్లో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు
రాయగడ: పారిశ్రామిక కేంద్రం జేకేపూర్లో గత నెల 28వ తేదీన ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా జేకేపేపర్ మిల్ పరిశ్రమ యజమాన్యం నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా కేదార్నాథ్ మందిరం తరహా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు పెండాల్ వద్ద సెల్పీలు తీసుకుని ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్లలో పెట్టుకుని ఆనందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కిస్ట్రాలో టీవీ ఛానల్ గాయనీ గాయకులు హాజరై జనాలను ఉర్రూతలూగించగా ప్రముఖ గాయకులు, ఇండియన్ ఆడిల్ శ్రీనివాస్ ధామిశెట్టి, అదితి భార్గవరాజులు తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చే భక్తులను, ప్రేక్షకులను సాదరంగా ఆహ్వానిస్తుండటం విశేషం. ఇదిలాఉండగా ఉత్సవ మైదానంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారంతో ఉత్సవాలు ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. -
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. ఒడిశాలో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
భువనేశ్వర్: ఒడిశాలో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కటక్లో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.వివరాల ప్రకారం.. మత సామరస్యం విషయంలో వెయ్యి సంవత్సరాల ప్రశాంత చరిత్ర కలిగిన ఒడిశాలోని కటక్లో హింస చెలరేగింది. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య తొలిసారిగా హింస చెలరేగింది. దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్న దుర్గా మాత నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, పైకప్పుల నుంచి రాళ్లు, గాజు సీసాలు పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులని తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.କଟକ ରେ ଦୁର୍ଗା ମା ଙ୍କ ଭସାଣି ରେ ଡିସିପି ଙ୍କୁ ପଥର ମାଢ଼❗ ମାନ୍ୟବର @odisha_police ଙ୍କୁ ଅନୁରୋଧ ଏ ସିସିଟିଭି ଫୁଟେଜ କୁ ଯାଞ୍ଚ କରି ଅସାମାଜିକ ଯୁବକ ଙ୍କୁ ତୁରନ୍ତ ଗିରଫ କରି ଆଇନ ଅନୁଯାଇ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରନ୍ତୁ |@dcp_cuttack @CuttackDM @CMO_Odisha @homeodisha @PrithivirajBJP @IPR_Odisha pic.twitter.com/crxfy4iudA— Nrusingha Behera 🇮🇳 (@NrusinghaOdisha) October 5, 2025 వీహెచ్పీ ర్యాలీతో మళ్లీ ఉద్రిక్తతలు..కటక్లో ఆంక్షలు ఉన్నప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం 12 గంటల బంద్కు వీహెచ్పీ పిలుపునిచ్చింది. ఘర్షణకు అధికారం యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆరోపించింది.Results of communal violence in Cuttack. #Cuttack #DurgaPuja pic.twitter.com/pOpbwkOL23— Suraj Sureka (@surajsureka9) October 5, 2025ఇంటర్నెట్ నిలిపివేత..కటక్లో హింస, ఉద్రిక్తతలు పెరగడంతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కటక్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే 42 మౌజా పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దర్గా బజార్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచారు. స్థానిక పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని కూడా మోహరించారు. -
ఐటీఐ ఉత్తమ ఉత్తీర్ణులకు ప్రధాని సత్కారం
భువనేశ్వర్: వృత్తి విద్యా (ఐటీఐ) కోర్సులో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు విద్యార్థులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ స్థాయి మేటి విద్యార్థులుగా ప్రత్యేక బహుమానాలు అందుకున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి వీరివురికి జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్లో 2025 జాతీయ స్థాయి టాపర్ అవార్డుతో కంధమల్ జిల్లా ఫుల్బాణి ప్రభుత్వ ఐటీఐ నుండి ప్రమోద్ దళపతి, గంజాం జిల్లా హింజిలికట్ ఐటీఐ ప్రభుత్వ పూర్వ విద్యార్థి, ఎన్ఎస్టీఐ భువనేశ్వర్ విద్యార్థి జితేంద్ర ప్రధాన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రత్యేక బహుమానం పొందారు. -
వంతెన కొట్టుకుపోయినా పట్టని అధికారులు
పర్లాకిమిడి: తీవ్ర వర్షాలకు గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ అశ్రియగడ, బురిడి గ్రామ పంచాయతీలకు కలుపుతూ ఉన్న వంతెన కూలి పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ గుమ్మా బ్లాక్ బీడీవో, తహసీల్దార్ అశ్రియగడ గ్రామాన్ని సందర్శించలేదు. గుమ్మా సమితి కేంద్రానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న అశ్రియగడలో వరదలకు వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం అశ్రియగడను సందర్శించి ప్రజలతో మాట్లాడి, అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరుకు ఫోన్ చేసి ఆదేశించారు. -
బయటపడిన కారు, శవం
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి వద్ద నాలుగు రోజుల కిందట భారీ వర్షాలకు కలియాతుట్ట నదిలో ఒక కారు కొట్టుకుపోయింది. నదిలో వరద నీరు తగ్గడంతో కారును అగ్నిమాపక దళం బయటకు తీసింది. అందులో వ్యక్తి శవం లభ్యమైంది. కారులో ఇరుక్కుని మృతిచెందిన వ్యక్తి ప్రతాప్ పండా (50) గా ఆర్.ఉదయగిరి ఎస్ఐ సందీప్ హేంబ్రం తెలియజేశారు. దసరా నాడు ప్రతాప్ పండా ఆర్.ఉదయగిరికి దగ్గరలో ఉన్న తరబా గ్రామంలో తన దుకాణం పూజ కోసం వెళ్లి కారుతో సహా కొట్టుకుపోయాడు. ఆయన ఆచూకీ కోసం వెదకగా ఈ రోజు నదిలో వరద నీరు తగ్గటంతో కారుతో సహా దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు. -
బస్సు, ట్రక్ ఢీ ఒకరు మృతి
● 20 మందికి గాయాలు కొరాపుట్: ప్రైవేటు బస్సు, ట్రక్ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. నబరంగ్పూర్ జిల్లా సరిహద్దులో జాతీయ రహదారి–26పై పపడాహండి సమితి కేంద్రానికి చివర్లో అంపానీ ఘాట్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవానీపట్న నుంచి నబరంగ్పూర్ వైపు బస్సు వస్తుండగా.. ఇదే సమయంలో ట్రక్ పపడాహండి నుంచి భవానీ పట్న వైపు వెళ్తుంది. ఘాట్లో మలుపు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రక్ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పపడాహండి, అంపానీల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పపడాహండి, నబరంగ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతి చెందిన ట్రక్ డ్రైవర్ పశ్చిమ బంగా వాసి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
ఇలా కట్టారు..అలా కూలింది..
● కాలువ పనుల్లో బయటపడిన డొల్లతనం ● కానరాని అధికారుల పర్యవేక్షణ టెక్కలి: కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పది కాలాల పాటు ఉండాల్సిన నిర్మాణాలు రోజుల వ్యవధిలోనే కూలిపోతున్నాయి. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో మండపొలం కాలనీ వద్ద పాత జాతీయ రహదారికి ఆనుకుని చేపడుతున్న మురుగు నీటి కాలువ నిర్మాణంలో నాణ్యత లేని పనుల డొల్లతనం బయటపడింది. సుమారు రూ.1.98 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఈ కాలువ నిర్మాణం చేపడుతున్నారు. ఓవైపు పనులు చేస్తుండగానే మరో వైపు కాలువ గోడలు కూలిపోతున్నాయి. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు ఈ పనులు చేస్తుండడంతో అధికారులు తమకేమీ పట్టనట్లుగా కనీసం పర్యవేక్షణ చేయడం మానేశారు. దీంతో కాలువ పనులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉత్సాహంగా స్కూల్గేమ్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్గేమ్స్ ఎంపిక పోటీల ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఎంపికలు చేపట్టారు. ఐదురోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు 12 క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. హాకీ ఎంపికలు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో, వెయిట్లిఫ్టింగ్– పెద్దపాడులో, రెజ్లింగ్– పెద్దపాడులో, ఆర్చరీ– రాజ్కుమార్ అకాడమీ శ్రీకాకుళంలో, రగ్బీ, నెట్బాల్, రోప్స్కిప్పింగ్, షూటింగ్బాల్ ఎంపికలు– టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, టేబుల్టెన్నిస్– శాంతినగర్కాలనీలో డీఎస్ఏ ఇండోర్ స్టేడియం, యోగా– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం, లాన్టెన్నీస్– శ్రీకాకుళం ఆర్ట్స్కాలేజ్ టెన్నిస్ అకాడమీలో, కరాటే ఎంపికలు శ్రీకాకుళం మహాలక్ష్మినగర్కాలనీలోని శ్రీచైతన్య స్కూల్ వేదికగా ఎంపికలను పూర్తిచేశారు. త్వరలో తుది జట్ల జాబితాను ప్రకటిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు పర్యవేక్షించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సలహాదారు పి.సుందరరావు, ఆయా క్రీడాంశాల సెలక్టర్లు, పీడీ, పీఈటీలు ఎంపికలను నిర్వహించారు. యోగా క్రీడాకారుల ఎంపికలు నరసన్నపేట: స్కూల్ గేమ్స్లో సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో యోగా పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ సలహాదారు కె.రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో సత్యవరం స్కూల్ నుంచి బి.జస్వంత్, బి.రాజ్వణి, ఆర్. రమేష్లు ఎంపికయ్యారని ఎంఈఓ శాంతారావు తెలిపారు. పీఈటీలు జ్యోతీ రాణి, లక్ష్మణరావు పాల్గొన్నారు. టెక్కలి: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా జట్లు ఎంపికలను ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. అండర్ –14, 17, 19 విభాగాల్లో బాల బాలికలకు నెట్బాల్, రగ్బీ, రోప్ స్కిప్పింగ్, షూటింగ్ బాల్ తదితర విభాగాల్లో జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. 95 పాఠశాలల నుంచి 650 మంది విద్యార్థులు హాజరయ్యారు. టెక్కలి డివిజన్ ఇన్చార్జి బి.నారాయణరావు, పీడీలు కె.కె.రామిరెడ్డి, ఎస్.లక్ష్మణరావు, ఎస్.కృష్ణారావు, ఎన్.నాగరాజు, పి.వెంకటరమణ, డి.లక్ష్మినారాయణ, అలివేణి, నర్మద పర్యవేక్షించారు. -
దాతృత్వం..
కొరాపుట్: హోటల్ ప్రారంభం సందర్భంగా అనాథ పిల్లలకు విందు ఇచ్చి యజమాని దాతృత్వం చాటుకున్నారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జగన్నాథ మందిరం సమీపంలో గల పూజా హోటల్ పునః ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో ఈ హోటల్ దగ్ధమైంది. హోటల్ ప్రారంభం సందర్భంగా మజ్జి గుడలోని దీన దయాల్ బాలికా ఆశ్రమం, సింధిగుడలోని ఉత్కళ బాలాశ్రమం, పట్టణంలోని మున్సిపల్ స్వీపర్ కాలనీకి చెందిన సుమారు 200 మంది పిల్లలకు భోజనం పెట్టారు. హోటల్ యజమాని బిభూతి భూషణ్ లెంక బాలలకు స్వాగతం పలికారు. పిల్లలకు నచ్చిన మిఠాయిలు, ఐస్ క్రీంలు, టిఫిన్, బిర్యానీ పెట్టారు. బ్యాగ్లు, విద్యా సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం పిల్లలందరినీ వారి ఆశ్రమాలకు సొంత ఖర్చులతో బిభూతి భూషణ్ లెంక పంపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి స్వయంగా బాలలకు కావాల్సిన వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నబరంగ్పూర్ మున్సిపల్ చైర్మన్ కును నాయక్, సీనియర్ న్యాయవాది జడేశ్వర్ ఖడంగా, కౌన్సిలర్ ఎ.సతీష్ పాల్గొన్నారు. -
సమితి అధ్యక్షురాలిపై అవిశ్వాస తీర్మానం
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర పంచాయతీ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పొరజ పదవికి రాజీనామా చేసినా.. ముందుగా సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆమైపె వచ్చిన అవిశ్వాస తీర్మానంపై అధికారులు ఓటింగ్ నిర్వహించారు. రాజేశ్వరి పొరజపై సర్పంచ్లు సమితి సభ్యులు పలు ఆరోపణలు చేసి ఆమైపె అవిశ్వాస తీర్మానం తీసుకు వచ్చారు. ఆమె ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయినా ఆమైపె వచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరిపారు. కుంద్రా తహసీల్దార్, మరుయు మెజిస్ట్రేట్ బినోద్ కుమార్ నాయక్ నేతృత్వంలో పంచాయతీ సమావేశం నిర్వహించారు. అధ్యక్షురాలిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఎన్నికల నియమం ప్రకారం అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో అవిశ్వాస తీర్మానాన్ని సమర్దిస్తూ 28 మంది ఓటు చేయగా.. వ్యతిరేకిస్తూ ఒక్క ఓటు కూడా పడలేదని అధికారి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించిన అధికారులు ఓట్లు బ్యాలెట్ బాక్స్లో పెట్టి సీజ్ చేశారు. అధ్యక్షురాలు రాజీనామా చేయటంతో అధ్యక్ష ఎన్నికలు జరిగినంత వరకు ఉపాధ్యక్షుడు తురణ సేన్ బిశాయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని ఎన్నికల అధికారి తహసీల్దార్ తెలియజేశారు. ఎన్నిక ఫలితాలు వెల్లడి కాగానే ప్రజాప్రతినిధుల్లో, బీజేడీ శ్రేణల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మఝి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాధావినోదిని సామంతరాయ్, కుంద్ర బ్లాక్ బీజేడీ అధ్యక్షుడు బృంధావన మల్లిక్, జయపురం శాసన సభ నియోజకవర్గం బీజేడీ నేత ధర్మేంద్ర అధికారి పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు సదస్సు బహిష్కరణ
● హాజరు కాని ఉద్దానం రైతులు ● సహకరించాలని ఎమ్మెల్యే వేడుకోలు పలాస: పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస మండలాల ఉద్దానం ప్రాంతంలో తలపెట్టిన కార్గో ఎయిర్పోర్టును ఉద్దానం ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సంబంధిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఎయిర్పోర్టు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవగాహన అంటూ ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఉద్దాన ప్రాంత రైతులు బహిష్కరించారు. ముందురోజే గ్రామ సచివాలయాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రప్పించి ఎయిర్పోర్టుకు అనుకూలంగా మాట్లాడించుకున్నారు. ఎయిర్ పోర్టు చాలా అవసరం అంటూ, ఉద్దానం అభివృద్ధి చెందాలంటే తాము భూములు ఇవ్వడానికి సిద్ధమేనని, అయితే ప్రజల్లో, రైతుల్లో నష్ట పరిహారం విషయమై సందేహాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎకరా భూమికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా మాట్లాడుతూ ప్రజా సంఘాల నాయకులు రకరకాల రంగుల జెండాలతో ఎక్కడి నుంచో వచ్చి రెచ్చగొడుతున్నారని, పర్యావరణ కాలుష్యం అంటున్నారని, అసలు ఎయిర్పోర్టు వద్దంటున్నారని, వారికి అభివృద్ధి అంటే అక్కర్లేదని, వారి ఇళ్ల ముందు మురుగు కాలువలను శుభ్రం చేయరని పరుష పదజాలంతో మాట్లాడారు. ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నానని, ఎయిర్పోర్టుకు సహకరించాలని కోరారు. ఎయిర్ పోర్టుతో మేలే.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు వల్ల ఉద్దానం ప్రజలకు మేరు జరుగుతుందన్నారు. ఉద్దానం రూపురేఖలు మారుతాయన్నారు. చాలా మందికి అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక్క అడుగూ ముందుకు పడదని, రేపటి నుంచి గ్రామాల్లోకి అధికారులు వస్తారని వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎ.పి.స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీఓ జి.వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు తహశీల్దార్లు పాల్గొన్నారు. -
నేటి నుంచి నందన్న ఉత్సవాలు
పర్లాకిమిడి: జిల్లాలోని నందన్మ ఉత్సవాలకు గ్రామీణులు సన్నద్ధం అవుతున్నారు. దీపావళి వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ గ్రామంలో ఇంటింటికీ వచ్చే నందన్నకు కాలుకడిగి ఆశ్వీరదం అందుకుంటారు. పర్లాకిమిడితోపాటు కాశీనగర్, గుసాని ప్రాంతాల్లో ఈ పండగ నిర్వహిస్తారు. మార్కెట్లో పండ్లు, కొబ్బరికాయలు, అరటి పండ్లు, తోరణాలు అధిక ధరలు పలికాయి. చిత్రకార వీధిలో నందమ్మలు తయారుచేసే కళాకార కుటుంబాలు ఈఏడు నందన్మ విగ్రహాలు ఆర్డర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమ, మంగళవార్లో తగులు, మిగులుతో ఈ పండగ చేసుకుంటున్నట్టు భక్తులు తెలిపారు. ఒక నందన్నను రూ.2500, వినాయకునితో కలిసి ఉన్న నందన్న రూ.3500లకు అమ్ముతున్నట్టు కటికవీధిలో ఒక కళాకారిణి తెలియజేశారు. -
అమ్మో.. మెమో!
● జిల్లా వైద్యారోగ్య శాఖలో గ్రూపుల గోల ● వరుస మెమోలు జారీ చేస్తున్న ఓ అధికారి ● ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులకు 20కి పైగా మెమోలు జారీ అరసవల్లి : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఇప్పుడు కొత్తగా వర్గపోరు ఎక్కువైంది. మాట్లాడితే మెమో అన్న చందంగా ‘పరిపాలన’ సాగుతోంది. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉన్న రెండు సీట్ల మధ్య అంతర్గత పోరు.. పలు రకాల వివాదాలకు కేంద్రమవుతోంది. ఇక అవినీతి విషయంలో ఏకంగా డీఎంహెచ్వో బాలమురళీకృష్ణ ఏసీబీకి చిక్కగా.. అక్రమాల్లో కార్యాలయ సూపరింటెండెంట్ భాస్కర్కుమార్ విధుల నుంచి సస్పెండయ్యారు. ఇలా ఈ కార్యాలయంలోని కీలక స్థానాలకు పెద్ద ఎత్తున అవినీతి మరకలంటాయి. రెండు మూడు నెలలుగా సూపరింటెండెంట్ భాస్కర్కుమార్కు, కార్యాలయ పరిపాలనాధికారి బాబూరావు మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇరు కీలక ఉద్యోగులకు సన్నిహితుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. సూపరింటెండెంట్ సస్పెన్షన్ తర్వాత ఆయన వర్గానికి చెందిన పలువురు ఉద్యోగులకు మెమోల రూపంలో చర్యలు వెంటాడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే క్రమశిక్షణ చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి. రెండు నెలల్లో 20 మెమోలు...! జిల్లా వైద్యారోగ్య శాఖలో మెమోల జారీ ఎక్కువయ్యింది. ఇటీవల ఏఎన్ఎంల (సచివాలయం) బదిలీల్లో బాగా జేబులు నింపుకొన్న ఓ అధికారి అంతా తానై వ్యవహరించడంతో పాటు అడ్డొచ్చినా.. అడ్డు చెప్పినా క్రమశిక్షణ చర్యలే అంటూ వ్యవహారం నడుపుతున్నారనే చర్చ జోరందుకుంది. రెండు మూడు నెలల్లోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సబార్డినేట్, టైపిస్టు నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు సుమారు 45 మంది వరకు విధుల్లో ఉన్నారు. వీరంతా పరిపాలనా విభాగ సూచనల మేరకు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొంత కాలంగా సాగుతున్న వర్గ పోరులో భాగంగా సుమారు ఏడుగురు ఉద్యోగులకు చర్యల్లో భాగంగా 20 వరకు మెమోలు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ భవాని ప్రసాద్కు మూడు, సీనియర్ అసిస్టెంట్ ప్రశాంత్కుమార్కు మూడు, సీనియర్ అసిస్టెంట్ చంద్రమౌళీశ్వరరావుకు రెండు, టైపిస్టు ఎస్.రామచంద్రరావుకు రెండు, టైపిస్టు ఎం.జగదీష్కు నాలుగు, సీనియర్ అసిస్టెంట్ విజయ సుందరీమణి (గీతాంజలి)కి మూడు, జూనియర్ అసిస్టెంట్ బి.రామచంద్రరావుకు రెండు చొప్పున మెమోలు వరుసగా జారీ చేశారు. వరుసగా మూడు మెమోలు జారీ చేస్తే చార్జి మెమో ఫ్రేమ్ చేసే అవకాశాలున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయే ప్రమాదముందని బాధిత ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వరుస వ్యవహారాలతో డీఎంహెచ్వో కార్యాలయంలో మెమోల గోలపై చర్చ జిల్లా వ్యాప్తమైంది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మెమోలను ఇచ్చారో.. లేక వర్గపోరులో బలిపశువులను చేస్తున్నారో అన్న చర్చ కూడా సాగుతోంది. ఉన్నతాధికారులు జిల్లా కార్యాలయంలో ‘పరిపాలన’పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు బహిర్గతమవుతాయని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం -
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్గా మోహన్సాయినాథ్
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025 పోటీలకు టెక్నికల్ అఫీషియల్ (లైన్ జడ్జి)గా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు మోహన్సాయినాథ్ నియామకమయ్యారు. ఈ పోటీలు అసోంలోని గౌహతి వేదికగా ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన అంతర్జాతీయ క్వాలిఫైడ్ రిఫరీ, శ్రీకాకుళం జిల్లా బాడ్మింటన్ సీఈఓ సంపతిరావు సూరిబాబు కుమారుడు. తండ్రీకొడుకు లు ఇద్దరూ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్లగా నియామకం కావడం విశేషం. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. -
రాకపోకలు బంద్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా సమితి మలాస్ పదర్ గ్రామ పంచాయతీ భలియగుడలో ఇటీవల విజయదశమి రోజు కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారి మోహనా– బోడోగోడో రోడ్డుకు అనుసంధానం కరియంబు జంక్షన్ వద్ద కల్వర్టు కూలింది. మూడు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు కూలిపోవడంతో పంట భూములు వరదనీటితో నిండిపోయి ఽజొన్న, మొక్కజొన్న, ఽవరి, రాగు పంటలు నాశనం అయ్యాయి. ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు, మోహనా బ్లాక్ అభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. అధికారులు మలాస్ పదర్, భలియగుడ గ్రామాలను సందర్శించలేదని ప్రజలు చెబుతున్నారు. మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ మధుమిత భలియాగుడ సందర్శించినప్పుడు పేదలకు పి.ఎం. యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికై నా మలాస్ పదర్ గ్రామ పంచాయతీలో భలియా గుడలో ప్రజలు కష్టాలు వినాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రూ.లక్ష పలికిన లడ్డూ
వజ్రపుకొత్తూరు: కొండవూరులో వేద సరస్వతీ దేవి 28వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ పాట రూ.100500 పలికింది. శనివారం రాత్రి నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన కోనారి రాజశేఖర్ లడ్డూను కై వసం చేసుకున్నారు. దేవీ వస్త్రాన్ని రూ.17001లకు లండ నరేష్ దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. టీ–10 భారత్ జట్టుకు ఈశ్వర్రెడ్డి ఎంపిక టెక్కలి రూరల్: అంతర్జాతీయ స్థాయి సెకండ్ ఏషియన్ టీ–10 ఇండియా క్రికెట్ జట్టుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన మూగి ఈశ్వర్రెడ్డి ఎంపికై నట్లు అసోషియేషన్ ప్రతినిధులు సుకుమార్, రాంబాబు ఆదివారం తెలిపారు. థాయిలాండ్లో పోటీలు జరుగుతాయని, సుమారు రూ.లక్షా 50వేలు ఖర్చు అవు తుందని ఈశ్వరరెడ్డి చెప్పారు. తనది పేద కుటుంబమని, దాతలు సహకరించాలని, వివరాలకు 9493740222 సంప్రదించాలని కోరారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి ఇచ్ఛాపురం రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు త్రినాథ్(55) ఇతర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య వరలక్ష్మీ, పెళ్లీడుకొచ్చిన కుమార్తె శారద ఉంది. ఆదివారం విశాఖపట్నంలో కూలి పనుల కోసం బయల్దేరిన త్రినాథ్ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో బెర్హంపూర్–విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాం మధ్య పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో సీహెచ్సీకి తరలించగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కార్యాచరణలో భాగస్వామ్యం వహించే ఉద్యోగులను పాలకులు చిన్నచూపు చూడటం తగదన్నారు. డీఏలు సకాలంలో విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగులకు ఇటీవలే డీఏ ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్లుగా డీఏలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ నాయకులు పి.ప్రభాకరరావు, ఎం.సన్యాసిరావు, పి.రామకృష్ణ, రాజేశ్వర రావు, జి.శ్రీనివాసరావు, జి.తిరుమలరావు, సీహెచ్ జగన్, రామచంద్రరావు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి కంచిలి: సూదిపుట్టుగ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు శనివారం రాత్రి దాడిచేశారు. గ్రామానికి చెందిన ప్రేమ్ దొళాయి అనే వ్యక్తికి చెందిన ఇంటి టెర్రస్పై రేకుల గదిలో కోతముక్కల పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు సిబ్బందితో వెళ్లారు. ప్రేమ్ దొళాయితోపాటు మరో 12 మందిని అదుపులోకి తీసుకున్మనారు. వీరి వద్ద నుంచి రూ.92,960 నగదు, 13 మొబైల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
ముగిసిన వేడుక
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025రావణ దహనంతో ..జయపురం: జయపురం దసరా ఉత్సవ కమిటీ వారి దసర ఉత్సవాలు శనివారం రాత్రి రావన దహనం కార్యక్రమంతో ముగిశాయి. దసరా నాడు పట్టణంలో కుండపోత వాన కురవడంతో రావణ దహనం జరగలేదు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచాలు, మిన్నంటిన తారా జువ్వల పేలుళ్లతో పట్టణం ప్రకాశించింది. స్థానిక దసరా పొడియాలో జరిగిన దసరా ముగింపు వేడుకలను వేలాది మంది ప్రజలు ఆస్వాదించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొరాపుట్ ఎస్పీ రోహిత్ కుమార్ బర్మ పాల్గొన్నారు. రోహిత్ వర్మ, దసర ఉత్సవ కమిటీ తారాప్రసాద్ బాహిణీపతిలు రావణ బొమ్మకు కలిపిన వైరు ముట్టించి రావణ దహనం చేశారు. అనంతరం దసరా ముగింపు సభ జరిగింది. కమిటీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ సభలో దసర స్మరణిక అపరాజిత–2025 పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. అలాగనే పరిశోధకుడు, రచయిత డాక్టర్ పరేష్ రథ్ కలం నుంచి వెలవడిన ‘మెమోరీ ఆఫ్ జయపురం దసరా’ ఆంగ్ల పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ’అపరాజిత–2025’ పుస్తక సంపాదక కమిటీ సభ్యులు జయపురం సాహిత్య పరిషత్ మాజీ అద్యక్షులు డాక్టర్ సురేష్ దాస్, సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, డాక్టర్ పరేష్ రథ్,నవకృష్ణ రథ్ లను ప్రశంసాపత్రాలు, మెమొంటాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. రావణుడి బొమ్మను స్థానిక కళాకారుడు పద్మనాభ చౌదురి తయారు చేశారని పేర్కొన్నారు. ముగింపు వేడుకల్లో గౌరవ అతిథిగా జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్, జయపురం పంచాయతీ సమితి బీడీఓ శక్తి మహాపాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీపతి, జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహారంజన్ బిశాయి తదితరులు పాల్గొన్నారు. -
పరారైన ఖైదీలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం
భువనేశ్వర్: కటక్ జిల్లా చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన విషయం తెలిసిందే. వీరివురి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం రూ. 50 వేల నగదు పురస్కారం ప్రకటించింది. శుక్రవారం చౌద్వార్ జైలు ప్రహరీ దూకి పారిపోయిన ఇద్దరు ఖైదీల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన అనుభవజ్ఞులైన అధికారులను ఈ బృందంలోకి తీసుకున్నారు. చౌద్వార్ జైలు రోడ్డు నుంచి చరబటియా వరకు దారి పొడవునా ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. చరబటియా, నెర్గుండి, టంగి మరియు కటక్ నగరంలోని రైల్వే స్టేషన్లలో పోలీసులు భద్రతను పెంచారు. పారిపోయిన ఖైదీలను పట్టుకోవడానికి ఈ ప్రదేశాలలో రాత్రిపూట తనిఖీలు కొనసాగిస్తున్నారు. చెరువులో మునిగి ఏడేళ్ల బాలుడు మృతి మల్కన్గిరి: చెరువులో మునిగి ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం పంచాయతీ యం.వి.74 గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబులి డాంగీ కుమారుడు ఆయుష్ డాంగీ (7) తోటి పిల్లలతో ఆడుకుంటూ చెరువు వైపు వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో వెంట ఉన్న పిల్లల కేకలు విన్న స్థానికులు వచ్చి ఆయుష్ డాంగీని బయటకుతీసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసిన పోలీసు ఐఐసీ ముకుందో మేళ్క ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహేన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. చెరువులో పడి ఒక వ్యక్తి గల్లంతు జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి గువులి గ్రామంలోని చెరువులో పడి ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన చూసిన వారు వెంటనే కొట్పాడ్ అగ్ని మాపక విభాగ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గల్లంతయిన వ్యక్తి కోసం గాలించారు. గల్లంతయిన వ్యక్తి కొట్పాడ్ సమితి అసన గ్రామానికి చెందిన కెమెరాజ్ పూజారిగా స్థానికులు అనుమానిస్తున్నారు. నాలుగు కాళ్ల కోడి జయపురం: బొరిగుమ్మ సమితి కొశాగుడ గ్రామంలో గల మెగా ఫౌల్ట్రిలో ఒక కోళ్ల ఫారంలో ఒక కోడికి నాలుగు కాళ్లు కనిపించాయి. నాలుగు దినాల కిందట చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కోళ్ల లోడు కొశాగుడలో కోళ్ల ఫారానికి వచ్చింది. కోళ్లు అన్లోడ్ అయి ట్రక్కు వెళ్లిపోయింది. కోళ్లు అమ్ముతున్న సమయంలో వాటిలో ఒక కోడికి నాలుగు కాళ్లు ఉండటం కనిపించింది. రెండు సాధారణ కాళ్లతో పాటు చిన్నగా మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో ఈ కోడిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రద్దు చేసిన పరీక్షల నివేదికను సమర్పించాలి భువనేశ్వర్: రద్దు చేసిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల సమగ్ర వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష రద్దు నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. భారీ స్థాయిలో మోసం చోటు చేసుకోవడంతో రద్దు అనివార్యం అయినట్లు తేటతెల్లం అయింది. ఇటీవల కాలంలో తరచూ ఉద్యోగ నియామకాల పరీక్షలు రద్దు అవుతున్నట్లు విపక్షం ప్రభుత్వంపై వేలెత్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వ అన్ని నియామక బోర్డులు, కమిషన్లు రద్దు చేసిన పరీక్షల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గత ఏడాది (2024) జూన్ నుంచి నేటి వరకు రద్దు చేయబడిన ఉద్యోగ నియామకాల పరీక్ష నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. తక్షణమే ఈ నివేదికను సిద్ధం చేసి ఈ–మెయిల్ చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. -
ట్రక్ను ఢీకొన్న బైక్లు.. ముగ్గురు మృతి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి సమితి కోత్తమిట పంచాయతీ తంగగూఢ గ్రామం వద్ద శనివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్ను రెండు బైక్లు ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్ బ్రేక్డౌన్ కావడంతో రహదారి ఒడ్డున నిలిచిపోయింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వర్షం పడుతుండగా బైక్ వచ్చి ట్రక్ను ఢీకొంది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఒకరు మృతి చెందారు. మరికొంత సమయానికి మరో బైక్పై మల్కన్గిరి సమితి సింద్రీమాల గ్రామానికి చేందిన భీమ్ ఖీలో, సుక ఖీలో వస్తూ ట్రక్ను ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆదివారం భీమ్ ఖీలో మృతదేహంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మల్కన్గిరి ఐఐసీ రీగాన్ కీండో సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. ట్రక్ను తొలగించకపోవడం వల్లనే ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఐఐసీ మాట్లాడుతూ ట్రక్లో ఇనుప సామాన్లు ఉండడం వల్ల తొలగించడం కష్టమైందని తెలిపారు. మృతదేహాలను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
దుర్గా పూజ ప్రభలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం: ముఖ్యమంత్రి
భువనేశ్వర్: దసరా సందర్భంగా దుర్గా పూజా మండపాల్లో ధగేలుమనిపించే ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా కటక్ మహా నగరం దీనికి ప్రసిద్ధి చెందింది. బంగారం, వెండి వంటి విలువైన హంగులతో దుర్గా మాతకు అలంకరణలో ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఈ రంగంలో కటక్ మహా నగరం శతాబ్దాల చరిత్ర మూటగట్టుకుంది. ఆయా నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు సమగ్రంగా 1,085 దుర్గా ప్రభలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఖరారు చేశారు. దీని వ్యయ ప్రణాళిక రూ. 7 కోట్ల 1 లక్ష 40 వేల రూపాలుగా ప్రకటించారు. దుర్గా మండపాలపై శోభిల్లే ప్రభల్ని 3 వర్గాలుగా విభజించి ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు. చారిత్రాత్మక వారసత్వం, 75 ఏళ్ల పైబడిన చరిత్ర, 50 ఏళ్లు పైబడి నిరవధికంగా కొనసాగుతున్న ప్రభల అలంకరణ పూజా మండపాలుగా విభజించారు. చారిత్రాత్మక వారసత్వం కలిగిన 215 ప్రభలకు 2 కోట్ల 17 లక్షల రూపాయలు, 75 ఏళ్ల చరిత్ర కలిగిన 197 ప్రభలకు 1 కోటి 47 లక్షల రూపాయలు, 50 ఏళ్లు పైబడిన 673 ప్రభలకు 3 కోట్ల 36 లక్షల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. -
ఓట్ చోర్ గద్ది చడో పాదయాత్ర
జయపురం: మహాత్మా గాంధీ జయంతి నాడు అవిభక్త కొరాపుట్ మల్కన్గిరి జిల్లా మోటు నుంచి ప్రారంభించిన ‘ఓట్ చోర్ గద్ది చడో’ పాదయాత్ర శనివారం మధ్యాహ్నాం జయపురం చేరింది. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ దాస్, విధానసభలో కాంగ్రెస్ నేత, పొటగి ఎమ్మెల్యే రామ చంద్ర కడమ్, పీసీసీ ఉపాధ్యక్షులు సంతోష్ సింగ్ సాలుజ, పీసీసీ మాజీ ఉపాధ్యక్షులు నీరజ శంకర్, మాజీ ఎమ్మెల్యే భుజబల మఝి, రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు శుభేందు మహంతి, మీడియా సెల్ అధ్యక్షులు అరవింద దాస్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ చంద్ర మహంతి, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్ తదితరులు శనివారం మధ్యాహ్నం జయపురం చేరగా వారికి స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షీ బాహిణి పతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, లక్ష్మీపూర్ ఎమ్మెల్యేలతో పాటు అనేకమంది జిల్లా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షులు భక్త చరణ దాస్కు పూల మాలలతో స్వాగతం పలికారు. ‘ఓట్ చోర్ గద్ది చడో’ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. నేతలు డీసీసీ భవనానికి చేరుకొని అక్కడ ఉన్న మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో భక్త చరణ దాస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు చేసి ఓట్లు దొంగిలిచి అధికారం చేపట్టారని దుయ్యబట్టారు.ఉభయ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల అరికట్టటంలో బీజేపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ కుతంత్రాలను, ఓట్ల చోరీ సంఘటనలను వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ మల్కనగిరి జిల్లా మోటు నుంచి గాంధీ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత రాహుల్ గాంధీ సూచనతో రాష్ట్రంలోని 314 సమితిలలో ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుపుతున్నామన్నారు. రోజుకు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల సంతకాల సేకరణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. ఓట్ చోర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని అన్నారు. కొరాపుట్ జిల్లాలో లక్ష సంతకాలు చేయించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓట్ చోర్ గద్ది చడో సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. -
అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం
● వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు ధ్వజం ● నేడు పెద్దిపాలెంలో ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. -
మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాలా ఆస్పత్రుల్లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు నోటీసు బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పలుచోట్ల అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వాటిని సీజ్ చేయని పక్షంలో పోరాటం తప్పదన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు రవి, ఎ.వసంతరావు, ముచ్చ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతగూటికి అంతర్యామి గోమాంగో
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మాజీ చైర్మన్, స్పెషల్ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అంతర్యామి గోమాంగో శనివారం బరంపురం ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఆయన తొలుత బీజేపీలో అనేక ఏళ్లు పనిచేసి రాయఘడ బ్లాక్ చైర్మన్గా గెలుపొందారు. తర్వాత బీజేపీ చేరి ఆయన భార్య పూర్ణబాసి నాయక్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోహనా ఎస్టీ నియోజక వర్గం నుంచి బీజేడీ నుండి పోటీ చేయించారు. అయితే గత 2024 ఎన్నికల్లో పూర్ణబాసి నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి దాశరథి గోమాంగో చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆమె రాయఘడ బ్లాక్చైర్మన్గా గెలుపొందారు. అంతర్యామి గోమాంగో తిరిగి బీజేపీలో చేరడంతో పార్టీలో కొంతమందికి మింగుడు పడటం లేదు. అంతర్యామి గోమాంగో బీజేపీలోకి రాకుండా ఆయనకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి లేఖలు రాశారు. అయితే ఆయనకు రాష్ట్ర మంత్రి బిభూతీ జన్నా, బరంపురం ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన తిరిగి సొంతగూటికి చేరడం సులువైంది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి పాంగాం పంచాయతీ పెద్దగూఢ గ్రామం క్రాస్ వద్ద చెరువులో తేలియాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం ుధయం గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో మాత్తిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ దీపాంజాలి ప్రధాన్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మల్కన్గిరి అగ్నిమాపిక కేంద్రం సిబ్బంది సాయంతో మృతదేహన్ని బయటకు తీశారు. అయితే స్థానికులు ఏవరు కూడా మృతదేహాన్ని గురించలేదు. మృతదేహన్ని 72 గంటలు తమ సమక్షంలో ఉంచిన తరువాత ఎవరూ రాకపోతే తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుత్తం మృతదేహన్ని మత్తిలి ఆరోగ్య కేంద్రంలోని మార్చురీలో ఉంచారు. కారు,బైక్ ఢీకొని నలుగురికి గాయాలు మల్కన్గిరి: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ సఘటన మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి.31 గ్రామం వద్ద రోజు శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తితోపాటు కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో కలిమెల ఆరోగ్య కేంద్రానికి స్థానికులు తరలించారు. అయితే క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదసి చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ ముకుందో మేళ్క తెలిపారు. వాహనం ఢీకొని వృద్ధుడి మృతి రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పాత పోలీస్స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీకి చెందిన బరాటం ప్రసాదరావు (68) రణస్థలం మండలంలోని కోష్టలో పాన్షాప్ నడుపుతూ అక్కడే నివాసముంటున్న కుమారుడు శ్రీనివాసరావు వద్దకు బయలుదేరాడు. శనివారం ఉదయం రణస్థలంలో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సోషల్ మీడియాలో ఫొటో చూసి కుమారుడు, బంధువులు గుర్తుపట్టి రిమ్స్కు చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి ఈశ్వరరావు (48) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల సత్యనారాయణ ప్రవర్తనలో తేడా రావడంతో కుమార్తె, కుమారుడు నిలదీశారు. కోపోద్రుక్తుడైనా ఈశ్వరరావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును శుక్రవారం తాగాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతదేహన్ని రిమ్స్కు తరలించారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయితో వ్యక్తి అరెస్టు టెక్కలి రూరల్: టెక్కలి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టెక్కలి ఎస్ఐ రాము తెలిపారు. బీహార్కు చెందిన ఎండీ స్వామన్ 640 గ్రాము ల గంజాయి తీసుకుని ట్రైన్లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా టాస్క్ఫోర్స్ సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హిజ్రాల దారిదోపిడీ నరసన్నపేట: ఉర్లాం–నడగాం మధ్య ఆర్అండ్బీ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కొందరు హిజ్రాలు కారులో వచ్చి దారిదోపిడీకి పాల్పడ్డారు. నడగాంకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ దొంపాక ఆనంద రమణ మెడలో బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. ఉర్లాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నడగాం రైల్వేగేటు దాటిన తర్వాత రోడ్డుపై కాచి ఉన్న ఐదుగురు హిజ్రాలు వాహనాన్ని ఆపి డబ్బులు అడిగారని ఆనంద రమణ తెలిపారు. ఇవ్వకపోవడంతో మెడలో తులంన్నర బంగారు చైన్ లాక్కెళ్లిపోయారని, ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
విలయానికి నలుగురు బలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఈనెల 2న ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రాయగడ బ్లాక్ మర్లబ పంచాయతీ పెక్కట గ్రామంలో తండ్రీకొడుకులు కార్తీక్ శోబోరో, రాజిక్ శోబోరో బండరాళ్లు, బురదలో కూరుకుపోయి మరణించగా మరో ఇద్దరు గిరిజనులు కనబడకుండా పోవడంతో వారు కూడా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మూడు రోజులుగా వారి మృతదేహాలు వెతుకుతున్నా, ఇంతవరకూ ఓడ్రాఫ్ సిబ్బందికి దొరకలేదు. అలాగే ఆర్.ఉదయగిరి బ్లాక్ బస్త్రి గుడలో త్రినాథ్ నాయక్(45) బండరాళ్ల కింద పడిపోవడంతో కనిపించకుండాపోయాడని అధికారులు నిర్ధారించారు. పది అడుగుల మేరకు బురద, కొండరాళ్లు కప్పివేయడంతో ఓడ్రాఫ్ సిబ్బందికి, పోలీసులకు ఇంతవరకూ దొరకలేదు. ఆర్.ఉదయగిరి బీడీఓ లారీమాన్ ఖర్సల్ శనివారం బస్త్రిగుడ గ్రామం సందర్శించారు. కొండ చరియలు విరిగి పడి ఉన్న ప్రాంతం అతి భయానకంగా పొగతో కప్పి ఉండటం గమనించారు. కనిపించకుండాపోయిన త్రినాథ్ నాయక్ కుటుంబానికి బీడీఓ రూ. 20 వేల తక్షణ సహాయం అందజేశారు. బరంపురం ఎంపీ డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి మృతుల కుటుంబాలని పరామర్శించారు. మోహన బ్లాక్లో కనిపించకుండా పోయిన లక్ష్మణ్ మల్లిక్ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.20 వేలు అంద జేశారు. మోహన బ్లాక్లో బందగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మల్లిక్(40) చనిపోవడంతో వారి ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వమే వారి బాగోగులు, ఉన్నత విద్యకోసం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎంపీ ప్రదీప్ పాణిగ్రాహి మోహన, ఆర్.ఉదయగిరి, రాయఘడ సమితి కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్ని సందర్శించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయగడ బ్లాక్లో కొండ చరియలు విరిగి పడిన సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో ఇద్దరు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతామన్నారు. -
దుకాణాల్లో చోరీ
కంచిలి: మకరాంపురం గ్రామ సచివాలయం సమీపంలో మూడు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. మీనాక్షి జిరాక్స్, బుక్ స్టోర్లో రూ.3వేలు నగదు, శ్రీ భూలోకమాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్లో సుమారు రూ.10వేలు నగదు, టార్చిలైట్లను పట్టుకుపోయారు. కూరగాయలు షాపు తాళాలు పగులగొట్టినా ఎటువంటి చోరీ జరగలేదు. బాధితులు కంచిలి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో హెచ్సీ జె.రూప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డివైడర్ను ఢీకొట్టిన బైక్ హిరమండలం: గొట్టా బ్యారేజి వద్ద కొరసవాడ గ్రామానికి చెందిన ఏడురి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంతో వెళ్తూ అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. శనివారం సుభలయ నుంచి స్వగ్రామం కొరసవాడకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి బాధితుడిని ఆటోలో హిరమండలం పీహెచ్సీ తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో రిమ్స్కు తరలించారు. -
దుర్గమ్మా..చల్లగా చూడమ్మా..
అమలపాడులో ఘటాల ఉత్సవం అమలపాడు గ్రామం భక్త జనసంద్రమైంది. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దుర్గమ్మతల్లి ఘటాల ఉత్సవానికి అశేష జనవాహిన తరలి రావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాహిమాం దేవీ.. పాహిమాం.. అంటూ భక్తుల శరణు ఘోషతో సాగిన ఘటాల ఊరేగింపులో మేళతాళాలు, పగటి వేషాలు, కాళీమాత వేషధారణలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ దుర్గాదేవీ లేబర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలోల 108 మంది మహిళలు ఎరుపు వస్త్రధారణలో ఊరేగింపుగా దుర్గామాత పూజా మందిరానికి చేరుకున్నారు. అక్కడ నుంచి అసిరిపోలమ్మ తల్లి అమ్మవారి ముర్రాటలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ దున్న రత్నం బాలరాజు, కారాడ గిరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దున్న లోకనాధం, దుర్గా దేవి లేబర్ కమిటీ నాయకులు ఇరోతు అప్పన్న, దున్న రాజులు, వి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. – వజ్రపుకొత్తూరు -
స్కూల్గేమ్స్.. మలివిడత పోరుకు రెఢీ
శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిద క్రీడాంశాల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే సాఫ్ట్బాల్, ఫుట్బాల్, ఉషూ, బాక్సింగ్ నాలుగు క్రీడాంశాల్లో ఎంపికలు ముగియగా.. మిగిలిన క్రీడాంశాలకు ఎంపిక పోటీలను పాఠశాలలకు ముందస్తు దసరా సెలవును ప్రకటించడంతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో కొన్ని మినహా మెజారిటీ సెలక్షన్స్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్దేశిత షెడ్యూల్ను జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు, కార్యదర్శి బీవీ రమణ సంయుక్తంగా వెల్లడించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.తవిటయ్య, మొజ్జాడ వెంకటరమణ పిలుపునిచ్చారు, ఐదు రోజుల షెడ్యూల్ ఇది.. తొలిరోజు 5న: హాకీ (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్), వెయిట్లిఫ్టింగ్ (పెద్దపాడు), రెజ్లింగ్ (పెద్దపాడు), ఆర్చరీ (రాజ్కుమార్ అకాడమీ శ్రీకాకుళం), రగ్బీ, నెట్బాల్, రోప్ స్కిప్పింగ్, షూటింగ్బాల్ (టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం), టేబుల్టెన్నిస్ (శాంతినగర్కాలనీలో డీఎస్ఏ ఇండోర్ స్టేడియం), యోగా (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం), లాన్టెన్నిస్ (శ్రీకాకుళం ఆర్ట్స్కాలేజ్ టెన్నీస్ అకాడమీ). కరాటే (శ్రీకాకుళం మహాలక్ష్మినగర్కాలనీలోని శ్రీచైతన్య స్కూల్). 6న: అథ్లెటిక్స్ (కోడిరామ్మూర్తి స్టేడియం శ్రీకాకుళం), త్రోబాల్ (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్), అండర్–14, 17 చెస్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల). 7న: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్ బాలురుకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానం), క్రికెట్ (ఆర్ట్స్కాలేజ్), బాల్బాడ్మింటన్ (ఆర్ట్స్కాలేజ్), అండర్–19 చెస్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల). 8న: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ బాలికలకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానం), స్విమ్మింగ్ (శాంతినగర్కాలనీలో డీఎస్ఏ స్విమ్మింగ్ ఫూల్), తైక్వాండో, ఫెన్సింగ్ (శ్రీకాకుళం టౌన్ హాల్), బాస్కెట్బాల్, సెపక్తక్ర (ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం శ్రీకాకుళం), బేస్బాల్ (కేఆర్ స్టేడియం శ్రీకాకుళం) 9న: హ్యాండ్బాల్ (జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం, ఆమదాలవలస మండలం). జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలకు సంబంధించి మలివిడత షెడ్యూల్ను ప్రకటించాం. అండర్–14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన మైదానంలో ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలు తీసుకురావాలి. – బడి వెంకటరమణ, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ స్కూల్గేమ్స్ అనేవి విద్యార్థులకు వరమనే చెప్పాలి. క్రీడాకారులు గుర్తింపు పొందేది, తయార్యేది స్కూల్గేమ్స్ నుంచే. ఎంపికల్లో ప్రతిభ కనబర్చి జిల్లా జట్లకు ఎంపికయితే రాష్ట్రపోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలబాలికలంతా సద్వినియోగం చేసుకోవాలి. – మొజ్జాడ వెంకటరమణ, జిల్లా పీడీ–పీఈటీ సంఘ ప్రధాన కార్యదర్శి నేటి నుంచి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు మొదలు ఐదు రోజుల పాటు వివిధ విభాగాల్లో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధికారులు -
తేనెటీగల దాడి
● ఆరుగురికి తీవ్రగాయాలుజయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీ లకమలియగుడ గ్రామానికి చెందిన డుము శాంత దసరా సెలవుల్లో తన భార్య, ముగ్గురు కుమారులను బాగరంగిణిగుడ గ్రామంలోని అత్తవారింట్లో విడిచి వచ్చాడు. పిల్లలకు సెలవులు పూర్తి కావొస్తుండడంతో వారిని తీసుకొచ్చేందుకు శుక్రవారం డుము శాంత బాగరంగిణిగుడ గ్రామానికి వెళ్లాడు. అనంతరం భార్యా, పిల్లలతో శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో హటగుడ గ్రామ కూడలి వద్ద అకస్మాత్తుగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. అది చూచిన డుము శాంత బైక్ విడిచి భార్యా, పిల్లలతో సమీప మొక్కజొన్న తోటలోనికి పారిపోయారు. వారు భయంతో హాహాకారాలు చేశారు. వారి ఆర్తనాదాలు విన్న సమీపంలో పశువులు మేపుతున్న కొంతమంది వారి వద్దకు వస్తుండగా వారిపైన కూడా తేనెటీగలు దాడి జరిపాయి. తేనెటీగల దాడిలో డుము శాంత కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు వచ్చి తేనెటీగల దాడిలో గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్కు చేర్చారు. హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
కొరాపుట్: ఎదురెదురు వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో దంపతులు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రం నుంచి ఉమ్మర్కోట్ మార్గంలో తారాగాం వద్ద జాతీయ రహదారిపై రెండు బైక్లు ఢీకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ మందిర్ రోడ్డులో మున్సిపల్ స్వీపర్ కాలనీకి చెందిన ముకుంద జానీ (35), అతని భార్య నందేయ్ జానీ (26)లు తమ పిల్లలతో కలిసి పపడాహండిలో దసరా వేడుకలు చూడడానికి వెళ్లారు. ఇదే సమయంలో ఎదురుగా మరో బైక్ శరవేగంగా వచ్చి వీరిని ఢీ కొంది. దీంతో ఘటనా స్థలంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. అయితే ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయట పడ్డారు. పపడాహండి, నబరంగ్పూర్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాలను నబరంగ్పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
కుంద్ర సమితి అధ్యక్షురాలి రాజీనామా
జయపురం: సబ్ డివిజన్ కుంధ్రా పంచాయతీ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పొరజ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను ఆమె జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డికి శనివారం అందజేశారు. అలాగనే రాజీనామా లేఖ ప్రతిని కుంధ్ర బీడీవో పి.మనస్మితకు కూడా అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పంచాయతీ సమితి అధ్యక్షురాలైన తాను గత నాలుగేళ్లలో సమర్దవంతంగా విధులు నిర్వర్తించానని తెలిపారు. అయితే వ్యక్తిగత కారణాల వలన పదవీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేనని తెలుపుతూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా సమితిలోని కాంగ్రెస్ మద్దతుదారులైన కొంతమంది సర్పంచ్లు, సమితి సభ్యులు ఆమైపె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు సర్పంచ్లు, ముగ్గురు సమితి సభ్యులతో పాటు 40 మంది కార్యకర్తలు పార్టీని విడిచారు. అనంతరం సమితిలోని 32 మంది సమితి సభ్యులు, సర్పంచ్లు సమితి ఆమైపె పలు ఆరోపణలు చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో అధికారులు ఓటింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె రాజీనామా చేయడం గమనార్హం. -
అనుపు ఉత్సవంలో ఘర్షణ
● ఆరుగురికి గాయాలు ● ఆరుగురు అరెస్టు భువనేశ్వర్: కటక్ నగరంలో ప్రతిష్టాత్మక దుర్గా పూజల నిమజ్జనం ఊరేగింపులో అకస్మాత్తుగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో అమ్మవారి ఊరేగింపు మధ్యలో ఆగింది. ఊరేగింపు సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఈ పరిస్థితి నెలకొంది. నడి రోడ్డు మీద దేవీ ఊరేగింపు వాహనాలను నిలిపి వేశారు. రాత్రి అంతా ఇదే పరిస్థితి కొనసాగింది. దర్ఘా బజార్ ప్రాంతంలో జరిగిన వర్గ ఘర్షణలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీ ఈ దాడిలో గాయపడ్డారు. రాళ్ల దాడిలో డీసీపీ కన్ను ప్రాంతం గాయపడి తీవ్ర రక్తస్రావమైంది. ఝంజిర్ మంగళ పూజా కమిటీ ఊరేగింపులో వర్గ ఘర్షణ చోటు చేసుకుంది. డీజే ధ్వనుల్ని వ్యతిరేకిస్తూ మొదలైన నిరసన రాళ్ల దాడికి దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో గాజు సీసాలు రువ్వుకున్నారు. ఆకస్మిక ఉద్రిక్తత నియంత్రణ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిమ్ సాహి వద్ద ఉద్రిక్తతతో దేవీగొడొ వైపు వెళ్లే ఊరేగింపులు రోడ్డుపై నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి అంతా కటక్ రౌస్ పట్న దుర్గా ఊరేగింపు నిమ్ సాహి వద్ద నిలిచిపోయింది. దర్గఘ బజార్ అణుపు ఉత్సవం ఘర్షణ ఘటనలో ఆరుగురు నిందితులను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోను పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కటక్ నగరం అదనపు పోలీసు కమిషనర్ నరసింహ భోలా తెలిపారు. -
శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
● ఇసుక వాహనాలను వెళ్లనీయమని గ్రామస్తుల హెచ్చరికజయపురం: జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి బాగ్దెరి గ్రామ పంచాయతీ డొంగరపల్లి–కొట్రగుడ మధ్య రోడ్డును శ్రమదానంతో గ్రామస్తులు నిర్మించుకున్నారు. ఈ రోడ్డుపై ఇసుకతో వెళ్లే వాహనాలను అనుమతించబోమని జిల్లా దురువ జనజాతి మహిళ మహాసంఘం హెచ్చరించింది. శనివారం దురువ మహిళా మహా సంఘం నేతృత్వంలో ప్రజలు కుంధ్ర పోలీస్స్టేషన్ అధికారిని కలిశారు. శ్రమదానంతో రోడ్డును ఏర్పాటు చేసుకున్నామని.. దీనిపై ఇసుక వాహనాలను అనుమతించబోమని..దీనికి సహకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 2020 అక్టోబర్ నెలలో డొంగరపల్లి నుంచి కొట్రగుడ గ్రామం వరకు 13 వందల మీటర్ల పొడవు రోడ్డును తామంతా శ్రమదానంతో నిర్మించు కున్నామని వెల్లడించారు. ఆ రోడ్డు పైనుంచి కొట్పాడ్ సమితిలో ఆరు గ్రామాలకు రోడ్డు ఉండేది కాదని వారు వెల్లడించారు. చతుర్ల గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే కొలాబ్ నది దాటి వెళ్లాల్సి ఉండేదని.. వర్షా కాలంలో 80 కిలో మీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉండేదని వివరించారు. అందుచేత ఆరు గ్రామాల ప్రజల రాకపోకలకు రోడ్డు నిర్మించాలని తాము అనేకసార్లు అధికారులను వేడుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆరు గ్రామాల ప్రజలంతా శ్రమదానంతో రోడ్డును నిర్మించుకున్నామన్నారు. తరువాత ఆ మార్గంలో అంబులెన్స్లు, పీడీఎస్ సరుకులు, తదితర ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరేందుకు అవకాశం కలిగిందని వెల్లడించారు. రోడ్డు నిర్మాణం తరువాత కాట్రగుడ వాసులు జగబందు హరిజన్, సొముదు ముదులి, లిక ముదులి, జొగ దురువ మొదలగు వారు కొలాబ్ నదిలో ఇసుకను జేసీబీలతో తవ్వి లక్షలాది రూపాయల విలువైన ఇసుకను వాహనాల్లో తరలించటం వలన తాము శ్రమదానంతో వేసిన రోడ్డు పాడవుతున్నదన్నారు. అందుచేత ఆ మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలు జరిపేందుకు తాము అనుమతించమని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఆ మార్గంలో ఇసుక వాహనాలను అడ్డుకుంటామని స్పష్టం చేయటంతో గత నెల 24వ తేదీన ఐదుగురు వ్యక్తులు వచ్చి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకొనేందుకు జరిగిన సమావేశంలో శ్రమదానంతో నిర్మించిన రోడ్డుకై న డబ్బును సంఘ సభ్యులు స్వాహా చేశారని అసత్య ఆరోపణలు చేశారని వారు వెల్లడించారు. ప్రభుత్వ నియమం ప్రకారం టెండర్ పాడకుండా ఇసుకు మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రమదానంతో వేసిన రోడ్డుపై వెళ్లే ఇసుక వాహనాల నుంచి డబ్బు వసూలు చేసినట్టు చేసిన ఆరోపణకు ఆధారాలు చూపాలని వారు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. పోలీసు అధికారులను కలిసిన వారిలో రొయిమతి దురువ, సావిత్రి దురువ, జయంతి దురువ, చక్రవతి దురువ, బాసు దురువ, మనోజ్ దురువ, భగత్ దురువ, లక్ష్మీ దురువ, భాబే దురువ, బొనసింగి దురువతో పాటు అనేక గ్రామాల ప్రజలు ఉన్నారు. -
సందడిగా దుర్గమ్మ నిమజ్జనోత్సవం
రాయగడ: స్థానిక పోలీస్ కాలనీలో అష్టమి నుంచి విజయదశమి వరకు కొనసాగిన దుర్గా అమ్మవారి పూజలు ముగిశాయి. శుక్రవారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సదరు సమితి సమీపంలోని హలువ ప్రాంతంలో ఉన్న నాగావళి నదిలో నిమజ్జనం చేసారు. కార్యక్రమంలొ పోలీసు సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.ఓపీఆర్బీ అత్యవసర సమావేశం భువనేశ్వర్: ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ సుశాంత్ కుమార్ నాథ్ అధ్యక్షతన శనివారం అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర పోలీసు సబ్ ఇన్స్పెక్టరు రాత పరీక్ష మోసాల సంఘటన నేపథ్యంలో ఈ సమావేశం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం వివరాలు స్పష్టం కాకున్నా ఈ సంఘటనపై ఒక కేసు నమోదు చేశారు. రాష్ట్ర క్రైం శాఖ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత బోర్డు తదుపరి చర్యలను ప్రకటిస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు రాత పరీక్ష సన్నాహాల్లో నిమగ్నం కావాలని ఓపీఆర్బీ అధ్యక్షుడు సుశాంత్ కుమార్ నాథ్ తెలిపారు.డీజీపీ అభినందనలు భువనేశ్వర్: శుక్రవారం కటక్లో జరిగిన ప్రసిద్ధ దుర్గా పూజ అనుపు ఊరేగింపులో గాయపడిన కటక్ నగర డీసీపీ ఖిలారి రిషికేశ్ను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊరేగింపు శాంతియుతంగా జరిగేలా చూడటంలో డీసీపీ అంకితభావాన్ని డీజీపీ అభినందించారు.రత్నప్రభకు దర్యాప్తు బాధ్యత ● ఎస్ పోస్టుల కుంభకోణం భువనేశ్వర్: సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష మోసం సంఘటనపై క్రైమ్ శాఖ డీఎస్పీ రత్నప్రభ శతపతికి దర్యాప్తు బాధ్యత అప్పగించారు. గంజాం జిల్లా గొలంతరా పోలీస్ ఠాణాలో నమోదైన అన్ని కేసులను ఆమె దర్యాప్తు చేస్తారు. క్రైమ్ శాఖ పోలీసు సూపరింటెండెంట్ అనిల్ బెవురియా పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మోసం సంఘటనలో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 2 దళారులను కోర్టులో ప్రవేశపెట్టారు. క్రైమ్ శాఖ డిజిటల్ సమాచారం సేకరించడంలో నిమగ్నమై ఉంది. పంచ్సాఫ్ట్ కంపెనీ యజమాని శంకర్ పృష్టి ఈ మోసం వెనుక ప్రధాన సూత్రధారిగా సందేహిస్తున్నారు. గతంలో, 114 మంది అభ్యర్థులు, ముగ్గురు దళారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాగావళిలో యువకుడి మృతి రాయగడ: నాగావళిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందిన ఘటన సదరు సమితి పరిధి కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపేటలోని రెల్లివీధికి చెందిన సింహాద్రి మినియాక (14) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం స్నానానికని సమీపంలోని నాగావళి నదిలో దిగాడు. అయితే నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో కొట్టుకుపోయాడు. హతీపర్ వద్ద అతని మృతదేహం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఢిల్లీ చేరారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కొత్తగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీర్ఘ కాలంగా మోహన్ చరణ్ మాఝి కొలువు విస్తరణ ఊగిసలాడుతోంది. ఇదిలా ఉండగా అతి త్వరలో నువా పడా ఉప ఎన్నిక జరగనుంది. మోహన్ చరణ్ మాఝి సర్కారుకు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్కు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో తొలి సారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రత్యక్ష ఎన్నిక కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. విపక్షాలు అంతే ధీటుగా ఈ స్థానం కై వసం చేసుకునేందుకు వ్యూహ రచనల్లో తలమునకలై ఉన్నాయి. నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నిక దగ్గర పడుతుంది. నాలుగు సార్లు బిజూ జనతా దళ్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజేంద్ర ఢొలొకియా అకాల మరణం కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఇది భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలో విజయంతో ఈ స్థానం కై వసం చేసుకోవడంలో అధికార బారతీయ జనతా పార్టీ, విపక్షం బిజూ జనతా దళ్, కాంగ్రెసు ఎవరి తరహాలో వారు పదునైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. అధికార, విపక్షాలు యువతరంతో బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తుండగా కాంగ్రెసు అనుభవజ్ఞుడైన అభ్యర్థితో పూర్వ వైభవానికి కొత్త ఊపిరి పోయాలని యోచిస్తుంది. ఉప రాష్ట్రపతికి అభినందనలు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ పథకాలు తదితర దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఉప రాష్ట్రపతికి ’ఒడిశా విజన్ 2036 – 2047 పుస్తకం అందజేశారు. నువాపడా ఉప ఎన్నికకు వ్యూహరచన మంత్రి మండలి విస్తరణ సంప్రదింపులు -
చినుకు.. వణుకు
పర్లాకిమిడి: భారీ వర్షాలకు గజపతి జిల్లా చివురుటాకులా వణికింది. బుధవారం, గురువారం కురిసిన భారీ వర్షాలకు రాయగఢ, మోహన, నువాగడ, మహేంద్రగడ, గుమ్మలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో విజయ దశమి నాడు కురిసిన వర్షం తిత్లీ తుఫాను మరపించింది. రాయఘడ బ్లాక్ పెక్కట గ్రామం మౌలసాయి వద్ద కొండ చరియలు విరిగిపడటంతో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న తండ్రీకొడుకులు రజికా శోబోరో (35), తండ్రి కార్తీక్ శోబోరో (65) కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు ఇంతవరకూ దొరకలేదు. ఆర్.ఉదయగిరి బ్లాక్లో బస్త్రిగుడ వద్ద కొండ చరియలు విరిగి పడటంతో త్రినాథ నాయక్ (50) మృతి చెందారు. ఆర్.ఉదయగిరి బదిశల ఘాట్ వద్ద గురువారం కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారి 326ఎ ధ్వంసమైంది. మోహన బ్లాక్లో నడిబోందో నల్లా ఉప్పొంగడంతో జాతీయ రహదారి (326ఎ) పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అటు రాయగడ, మోహన, పర్లాకిమిడికి వెళ్లే వాహనాలు బంద్ అయ్యాయి. మోహనలో ఎడతెరిపి వర్షాలకు బందగుడ గ్రామానికి చెందిన లక్షణ్ నాయక్ (40) లుడ్రునల్లాలో కొట్టుకుపోయాడు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఓడ్రాఫ్ సిబ్బంది బయటకు తీసినట్టు ఎస్పీ జె.ఎన్.పండా తెలియజేశారు. రాయఘడ బ్లాక్ మహేంద్రగడ–బురుఖాత్ పాస్ వద్ద కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో గత రాత్రి మహేంద్రగిరికి వెళ్లిన టూరిస్టులు 22 మంది చిక్కుకున్నారు. గురువారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతీ జెన్నా ముఖ్యమంత్రి మోహాన్ మఝి ఆదేశాల మేరకు బురుఖాత్ పాస్కు హుటాహుటిన చేరుకుని జేసీబీలతో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బండరాళ్లను పక్కకు తీసి రోడ్డు క్లియర్ చేశారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన టూరిస్టులు మహేంద్రం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గుమ్మబ్లాక్ సెరంగో, అజయగడ వద్ద కొండచరియలు విరిగి పడటంతో రోడ్డు బ్లాక్ అయ్యింది. అలాగే ఖోజురిపద నుండి నువాగడ బ్లాక్ రోడ్డులో అశురపహాడ్ నల్లా ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అఽతివృష్టి కారణంగా నువాగడ శివాలయం వద్ద నువాగడ– గుణుపురం రోడ్డు కూడా కొట్టుకుపోయింది. అధిక వర్షాల వల్ల రోడ్లు, భవనాల శాఖకు వందల కోట్ల నష్టం వాటిల్లగా, గ్రామీణ రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో నష్టం రూ.కోట్లలో వాటిల్లినట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి బిభూతీ జెన్నా విలేకరులతో తెలిపారు. -
తడిచిముద్దయిన కొరాపుట్
కొరాపుట్: భారీ వర్షాలకు కొరాపుట్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. గురు, శుక్రవారాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. కొరాపుట్–రాయగడ మార్గంలో బంగ్లాగుడ వద్ద వరద నీరు రోడ్డెక్కింది. దాంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి. మరో వైపు సిమిలిగుడ వద్ద విశాఖ పట్నం మార్గంలో కూడా వర్షం నీరు రోడ్డు మీద ప్రవహించింది. కొరాపుట్ సమీపంలో డుమ్రి పుట రాళ్లు, మట్టి రైల్వే ట్రాక్ మీద పడ్డాయి. దాంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైల్వే విభాగ అత్యవసర పునరుద్ధరణ తర్వాత రైళ్లు నడుపుతున్నారు. కొలాబ్ రిజర్వాయర్ నీరు ప్రమాద సూచిక వద్దకు చేరడంతో గేట్లు తెరిచారు. సిమిలిగుడ సమితిలో వర్షం నీరు పోటెత్తింది. సిమిలిగుడ సమితిలో వర్షపు నీటికి పాడైన పొలాలు -
రాయగడ జలమయం
రాయగడ: బుధవారం ఏకధాటిగా కురిసిన వానకు రాయగడ నీటమునిగింది. స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద కొండచరియలు విరిగి పడిపోవడంతో ట్రాక్ ముక్కలైంది. దీంతో రాయగడ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగిల్ లైన్ మీదుగా రైళ్ల రాకపోకలు సాగించారు. సమాచారం తెలుసుకున్న డీఆర్ఎం అమితాబ్ సింఘాల్, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాయగడ మీదుగా విశాఖపట్నం ఇటు రాయిపూర్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్ మరమ్మతు పనులతో పాటు కొండచరియలు తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాదిపదికన జరిగింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. సదరు సమితి పిప్పలగుడ గ్రామంలో చంద్రమండంగికి చెందిన ఇల్లు కూలిపోయింది. గుణుపూర్లో అరటి, వరి తదితర పంటలు నీట మునిగాయి. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ప్రహరీ వర్షాలకు కుప్పకూలింది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక జిల్లాలోని గుణుపూర్లో బుధవారం పర్యటించారు. వర్షం వల్ల కలిగే నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొతొ ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి గురువారం గుణుపూర్లో పర్యటించారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలు కలియదిరిగారు. తెగిన రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. -
శ్రీమందిరంలో కార్తీక సేవలు ప్రారంభం
● రాధా దామోదర అలంకరణ ● ఈ నెల 7 నుంచి కార్తీక వ్రతం భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానంలో కార్తీక మాసం ప్రత్యేక సేవాదులు ప్రారంభించారు. శుక్రవారం పవిత్ర అశ్విని శుక్ల పక్ష ఏకాదశి తిథి పాపాంకుశ ఏకాదశి నుండి కార్తీక శుక్ల దశమి వరకు ఈ సేవలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా రత్న వేదికపై శ్రీ మందిరంలో దేవతా త్రయానికి రాయ్ దామోదర అలంకరణ నిర్వహిస్తారు. నిత్యం ప్రాతః శుద్ధి (ఒబొకాసొ) వెంబడి మూల విరాట్లకు రత్న సింహాసనంపై రాధా దామోదర అలంకరణ లేదా రాయ్ దామోదర అలంకరణ చేస్తారు. మరో వైపు కార్తీక వ్రతం, బాల ధూపం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాలు నిరవధికంగా నెల రోజులపాటు కొనసాగుతాయి. కార్తీక మాసంలో శ్రీ జగన్నాథుడిని (విష్ణువు) దామోదరుడిగా పూజిస్తారు. ఈ సందర్భంగా చేసే అలంకరణను రాధా దామోదర అలంకరణగా పేర్కొంటారు. శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద కుమార్ పాఢి అధ్యక్షతన జరిగిన ఛొత్తీషా నియోగుల సమావేశంలో కార్తీక మాసం ప్రత్యేక సేవాదుల కార్యక్రమాలు ఖరారు చేశారు. ఈ సమావేశంలో నిర్ణయం మేరకు నిత్యం ఉదయం 4 గంటలకు ప్రధాన దేవస్థానం ద్వారం తలుపులు తెరిచి నిత్య సేవలు ఆరంభిస్తారని తెలిపారు. కార్తీకంతో వరుస దర్శనం వాయిదా పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ మందిరం భక్తుల తాకడితో కిటకిటలాడుతుంది. ప్రత్యేక సేవాదులు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా శ్రీ మందిరంలో మూల విరాటుల వరుస దర్శనం వ్యవస్థని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు శ్రీ మందిరం సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఆలయం లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు యోచిస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు ప్రభావితం కాకుండా ఈ వర్గం భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. దీని కోసం ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలు (ఎస్ఓపీ) రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా జగన్నాథ ఆలయ పోలీసులపై (జేటీపీ) ఫోన్ల వాడకంపై ఆంక్షలు ఖరారు చేసిన తర్వాత ఆలయ సేవకులు మొబైలు ఫోనుల వినియోగంపై ఆంక్షలు జారీ చేస్తారు. ప్రతి బుధవారం ఒక సమన్వయ కమిటీ సమావేశమై శ్రీ మందిరం నిత్య దైనందిన కార్యకలాపాల్లో వివిధ వర్గాల పని తీరులో క్రమశిక్షణని సమీక్షిస్తారని సీఏఓ తెలిపారు. -
జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
● ఆచూకీ తెలిపిన వారికి రూ. 50,000 నగదు పురస్కారం ● ఉన్నత స్థాయి దర్యాప్తు భువనేశ్వర్: కటక్ జిల్లా చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. ఇది రాష్ట్రంలో అతి పెద్ద కారాగారం. కరడు దేరిన నేరస్తులను ఖైదీలుగా నిర్బంధిస్తారు. గురువారం రాత్రి జైలు గోడ దూకి ఖైదీలు ఉడాయించారు. రాష్ట్రంలో జైలు భద్రత ప్రశ్నార్థకమైంది. పారిపోయిన ఇద్దరు ఖైదీలు బీహార్ ప్రాంతీయులు. వారిలో మధుకాంత్ కుమార్, రాజా సహాణి బిహారీ బందిపోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరివురు పాణికొయిలిలో ఆభరణాల దుకాణం దోపిడీలో నిందితులు. దోపిడి సందర్భంగా వారు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తిని కూడా చంపారు. ఈ నేపథ్యంలో వీరివురి వ్యతిరేకంగా దోపిడీ, హత్య ఆరోపణలపై కేసులు నమోదు చేసి ఈ జైలులో పెట్టారు. ఖైదీలను అరెస్టు చేయడానికి కటక్ జోన్–1 ఏసీపీ, చౌద్వార్ పోలీస్ ఠాణా అధికారి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు కటక్ రేంజ్ డీఐజీ ఆదేశాలు మేరకు ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. జైలు డీఐజీ ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. ఆమెతో చౌద్వార్ ఠాణా ఇనస్పెక్టర్ ఇన్చార్జి ఉన్నారు. సైంటిఫిక్ బృందం మరియు స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం చేరుకుని పరిశీలన చేస్తుంది. చౌద్వార్ ఠాణా పోలీసులు దర్యాప్తు కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వార్డర్లు సస్పెండ్ ఖైదీలు పరారీ సంఘటన పురస్కరించుకుని ఇద్దరు వార్డర్లను సస్పెండ్ చేశారు. వీరిలో ఒకరు చీఫ్ వార్డెన్. పారిపోయిన ఖైదీలు కంబళ్లు చించి తాళ్లుగా పేముకుని గోడ దూకి పారిపోయినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్లు జైలు డీజీ సుశాంత్ నాథ్ తెలిపారు. ఆచూకీ తెలిపితే రూ. 50,000 చౌద్వార్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీల గురించి విశ్వసనీయ సమాచారం ఇచ్చిన వారికి రూ. 50,000 నగదు పురస్కారం ప్రకటించారు. చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి తప్పించుకున్న విచారణ అధీన ఇద్దరు ఖైదీలను గుర్తించడంలో మరియు పట్టుకోవడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజా సహాణి బీహారు రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా ముఫ్సిల్ ఠాణా లోహియా గ్రామస్తుడు కాగా మధుకాంత కుమార్ బీహారు రాష్ట్రం సొరొణొ జిల్లా గౌర్ ఠాణా రామ్పూర్ గ్రామస్తుడుగా వివరాలు జారీ చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. సమాచారం తెలిస్తే సహాయక పోలీసు కమిషనరు 9437148161, చౌద్వార్ ఠాణా ఇన్స్పెక్టర్కు 9338025119కు సమాచారం అందించాలన్నారు. -
కొండచిలువ హల్ చల్
రాయగడ: సదరు సమితి మల్లిగాంలోని ఓ హోటల్ ముందు కొండచిలువ హల్చల్ చేసింది. వర్షాల కారణంగా హోటల్ను మూసివేశారు. సమీపంలోని తుప్పల్లో నుంచి వచ్చిన కొండచిలువ హోటల్లోని బెంచికింద ఉండిపోయింది. గురువారం తెరిచేందుకు వెళ్లిన యజమానికి బెంచి కింద పాము కనిపించడంతో భయంతో పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్ ప్రదీప్ కుమార్ సేనాపతికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఆయన పామును పట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. లక్ష్మి ఇక లేదు భువనేశ్వర్: పూరీ స్వర్గ్ ద్వారం శ్మశాన వాటికలో అంత్యక్రియల దశలో మేలుకొని కళ్లు తెరిచిన 86 ఏళ్ల పి.లక్ష్మి శాశ్వతంగా కళ్ళు మూశారు. గత నెల 15న ఈ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అది మొదలుకొని ఆమె పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ బుధవారం రాత్రి ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇద్దరికి ఎక్స్గ్రేషియా ప్రకటన పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రెండురోజులుగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన ఆర్.ఉదయగిరి సమితి బస్త్రిగుడ గ్రామానికి చెందిన త్రినాథ నాయక్, మోహనా సమితి మెరాపల్లి గ్రామ పంచాయతీ వాసి లక్ష్మణ్ నాయక్ల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ మధుమిత తెలియజేశారు. మోటు నుంచి కాంగ్రెస్ నేతల పాదయాత్ర మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు ముగీ పాయింట్ నుంచి గురువారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ పాదయాత్ర ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మోటు ముగీ పాయింట్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రజలతో పలు అంశాలపై చర్చించారు. పాదయాత్ర మోటు నుంచి మల్కన్గిరి వరకు సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర యువ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కృష్ణచంద్ర మహంతి, మల్కన్గిరి కాంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు, మాజి అధ్యక్షుడు గోవింద పాత్రో, చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో తదితరులు పాల్గొన్నారు. -
87 మంది పండిట్లకు పదోన్నతులు
శ్రీకాకుళం: జిల్లాలో పనిచేస్తున్న 87 మంది పండిట్లకు పదోన్నతులు కల్పిస్తూ డీఈవో రవిబా బు బుధవారం ఉత్తర్వులు అందజేశారు. వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే ఇకపై వీరంతా స్కూల్ అసిస్టెంట్లుగా కొనసాగుతారు. ‘పదోన్నతులకు నోచుకోని పండిట్లు’ పేరి ట ఐదు రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పండిత సంఘాల నాయకులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్పందించారు. రాష్ట్రస్థాయిలో అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పండితుల పదోన్నతుల సమస్యను తక్షణం పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 65 మంది తెలుగు, 18 మంది ఒరియా, నలుగురు హిందీ పండిట్లకు పదోన్నతు లు లభించాయి. బుధవారం డీఈవో కార్యాలయంలో పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారు. పదో న్నతులు కల్పించడం పట్ల భాషా ఉపాధ్యాయ సంస్థ నాయకులు పిసిని వసంతరావ, రంగనాయకు లు, ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
మహాత్మునికి ఘనంగా నివాళి
–పర్లాకిమిడి: జిల్లాస్థాయి గాంధీజీ వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న నిర్మలా శెఠి –పర్లాకిమిడి:విజేతలైన విద్యార్థులతో పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి జయపురం: గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రబినారాయణ నందో తదితరులు రాయగడ: గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఏడీఎం నాయక్, పక్కనే కలెక్టర్ కులకర్ణి జయపురం: మహాత్మా గాంధీ చిరస్మరణీయులని.. ఆయన దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహానీయుడని వక్తలు అన్నారు. కొరాపుట్ జిల్లా వెనుకబడ్డ వర్గాల కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హసన్ మదాని ఆధ్వర్యంలో జాతిపిత గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జన్మదినోత్సం సందర్భంగా స్థానిక కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనంలో కార్యక్రమం నిర్వహించారు. గాంధీ, శాస్త్రిల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హసన్ మదాని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ నిర్వహించిన భూమికను వివరించారు. అలాగే ప్రధానమంత్రిగా శాస్త్రిజీ దేశానికి అందించిన నిస్వార్ధ సేవలు గుర్తు చేశారు. నేటి యువత గాంధీ, శాస్త్రిలు నచిచిన బాటలో పయనించి సమాజానికి సేవలు అందించాలని పిలుపు నిచ్చారు. రాయగడ: స్థానిక గాంధీ పార్కులో మహాత్మగాంధీ జయంతిని గురువారం జిల్లా యంత్రాంగం ఘనంగా జరుపుకుంది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, ఏడీఎం నవీన్ చంద్ర నాయక్, జిల్లా పౌరసంబంధాశాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, విద్యావేత్త డీకే మహాంతి తదితర ప్రముఖులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం సర్వమత ధర్మాలకు చెందిన గ్రంథాలను ఆయా మతగురువులు చదివి వినిపించారు. బీజేడీపాద యాత్ర జయపురం: గాంధీ జయంతి సందర్భంగా జయపురం విధాన సభ నియోజకవర్గం బీజేపీ నాయకులు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్ముని నిర్వహించిన భూమికను ప్రశంసిస్తూ పాదయాత్రం ప్రారంభించింది. రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రబినారాయణ నందో నాయకత్వంలో వందలాదిమంది శ్రేణులు పాల్గొన్నాయి. ముందుగా జయపురం శాసనసభ నియోజకవర్గంలో జయపురం సమితి అంబాగుడ గ్రామ పంచాయతీ అంబాగుడలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర బీజేపీ జనసంపర్క అభిజాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాద యాత్రలో మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు గాంఽధీ జయంతిని జన సంపర్క అభిజాన్గా పాటిస్తున్నామని వెల్లడించారు. కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక కార్యదర్శి దుర్గా ప్రసాద్ మిశ్ర, సీనియర్ నేత, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్నారథ్), కొరాపుట్ జిల్లా పరిషత్ మాజీ సభ్యులు బి.బాలంకిరావు, బొరిగుమ్మ సమితి సీనియర్ నాయకుడు నాగరాజు దొర, సీనియర్ నేతలు శివ పట్నాయక్, సత్యదాన్ మహానందియ, టున రథ్, లింగ రాజ్ పాత్రో, పింటు పాల్గొన్నారు. పర్లాకిమిడి: జాతీపిత మహాత్మాగాంధీ, శాంతిదూత లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను పర్లాకిమిడి గాంధీ స్మారక ప్రాథమిక అప్పర్గ్రేడ్ పాఠశాలలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. తొలుత గాంధీ జంక్షన్, గ్రంథాలయం వద్ద గాంధీ విగ్రహానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలాశెఠి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ స్మారక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా విశ్రాంత తహసీల్దార్ పూర్ణచంద్ర మహాపాత్రో, ముఖ్యవక్తగా బిచిత్రానంద బెబర్తా, ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర ప్రధాన్, డీపీఆర్వో ప్రదిప్త గురుమయి విచ్చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలో విజేతలైన విద్యార్థులకు పురపాలక అధ్యక్షురాలు నిర్మతా శెఠి బహుమతి ప్రదానం చేశారు. -
సోమన్ వాంగ్చుంగ్ను విడిచి పెట్టాలి
● కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ జయపురం: జిల్లా కమ్యూనిస్టు పార్టీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా 26వ జాతీయ రహదారి.. జయపురం ప్రధాన జంక్షన్లో ఆ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ గాంధేయ వాది, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విద్యావేత్త, పర్యావరణ ప్రేమికులు, వైజ్ఞానికులు వాంగ్చుంగ్ను విడిచి పెట్టాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. 2019లో జమ్మూ కశ్మీర్ 370 సెక్షన్ను కేంద్రంలో బీజేపీ ఎత్తి వేయటం, ఎన్నికల వాగ్దానంలో లేహ్ లదక్, కార్గిల్లకు పూర్తి రాజ్యాంగహోదా కల్గిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోనికి వచ్చిన తరువాత వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంచిందని ఆరోపించారు. ఆ ప్రాంతాల వారికి పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీలకు ఇస్తున్న అధికారాలను వర్తింప చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ మహంతి కోరారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శ రామకృష్ణ దాస్, నేతలు నంద కుమార్, హరికృష్ణ జాని పాల్గొన్నారు. -
నదిలో దూకాడు.. రక్షించాక పరారయ్యాడు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ నీళ్ల ట్యాంకు సమీప నాగావళి నదిలో ఓ యువకుడు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీరా అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి రక్షించాక అక్కడి నుంచి కుటుంబీకులతో పరారయ్యాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు, ఒకటో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గార మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన బాకి రమణకు ఇద్దరు కుమారులు గణేష్, రాజు(24). గణేష్ హైదరాబాద్లోని కంపెనీలో పనిచేస్తుండగా.. రాజు బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో గొడవ జరిగిందని, సూసైడ్ నోట్ రాసి బయటకు వచ్చేసినట్లు అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి నగరంలోని దమ్మలవీధి సమీపంలో కొంతమందితో కలసి యువకుడు సాయంత్రం వరకు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. రాత్రి అయ్యాక రాజు తన సోదరుడైన గణేష్కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో వెంటనే ఫైర్సర్వీస్కు, ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా నదిలో యువకుడు దూకేశాడు. ఘటనా స్థలికి డీఎస్పీ.. వరదముంపుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్న ఎస్పీ ఆదేశాలతో అప్పటికప్పుడే డీఎస్పీ వివేకానంద సైతం ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే ఏడీఎఫ్వో శ్రీనుబాబు రెస్క్యూ సిబ్బందిని నదిలో బోట్లో పంపించారు. నదిలో ఓ మూ లన ఉన్న చెట్టుకొమ్మకు వేలాడి ఉన్న యువకుని వద్దకు చేరుకున్న సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు తెచ్చారు. చీకటిమయం కావడంతో అప్పటికే అక్క డికి చేరుకున్న రాజు కుటుంబీకులు ముగ్గురు తుప్ప ల మధ్య నుంచి తీసుకెళ్లి బండిపై వెళ్లిపోయారు. దీనిపై రూరల్సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ యువకుడు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు
మల్కన్గిరి: విజయదశమి సందర్భంగా దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో గురువారం పూజలు చేశారు. మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని దండకారణ్య పూజ మండపంలో బెంగాలీ మహిళలు ఘనంగా ఽసిందూర్ ఖేలాను ఆడి సందడి చేశారు. దుర్గాపూజల్లో అమ్మవారికి సిందూర్ సమర్పించారు. అనంతరం ఒకరిపై ఒకరు సిందూర్ను పోసుకొని అమ్మవారి ఎదుట నాట్యం చేశారు. హోమపూజలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని నక్టిమ్మా అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రులు చేసిన భక్తులు చివరి రోజైన గురువారం అమ్మవారికి హోమ పూజలు చేశారు. తొమ్మిది రోజులు స్థానిక పురోహితురాలు లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీక్షబూనిన స్వాములు పూజల్లో పాల్గొన్నారు. జయపురం: కుండపోత వర్షంలో సైతం దుర్గాదేవికి భక్తులు పూజలు చేశారు. ఆలయాల్లో, మండపాల్లో, గృహాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. . మా భగవతి మందిరం నుంచి అందంగా అలంకరించిన పల్లకీలో మా భగవతి, మా విజయ బయలు దేరగా మాదక్షిణ కాళీ, మా బసంత మయిలు కలసి అందమైన పల్లకీల్లో ఊరేగింపుగా రాజనగర్ కూడలి నుంచి ముందుకు సాగాయి. రాజ కోట నుంచి కనకదుర్గ పల్లకీ కూడా వాటితో బయలు దేరింది. ఊరేగింపులో పట్టణంలో వివిధ దుర్గా మండపాల్లో ప్రతిష్టించిన దుర్గాదేవి ప్రతిమలను చిత్ర విచిత్ర వేషదారులతో బాణసంచా కాల్చుతూ ప్రధాన ర్యాలీలో కలిశాయి. అర్ధరాత్రి రెండు గంటల వరకు సాగిన దసరా ర్యాలీలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ముందుగా జరిగిన సభలో సాంస్కృతిక ప్రదర్శనలు , ప్రముఖులకు సత్కారాలు చేశారు. దసరా ఉత్సవాలలో యువరాజు విశ్వంబర చంద్ర చూడ్ దేవ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. -
ఘనంగా దుర్గాదేవికి పూజలు
పర్లాకిమిడి: దసరా శరన్నవరాత్రి వేడుకలు గురువారంతో వైభవంగా ముగిశాయి. చివరి రోజున పర్లాకిమిడిలో పలు కూడళ్లలో ప్రతిష్టించిన చేసిన దుర్గామాత విగ్రహాలను ఊరేగిస్తూ సమీపం చెరువులు, సాగరాల్లో నిమజ్జనం చేశారు. పెద్ద బ్రాహ్మణ వీధి, హైస్కూల్ జంక్షన్, కటిక వీధి, చిత్రకారవీధి, తెలుగు చాకలి వీధి వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత ఆడంబరంగా ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి చేశారు. దుర్గామాతాలకు భక్తులుహారతులిచ్చి.. టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని సాగనంపారు. సీతా సాగరం వద్ద దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవాలను పూర్తి చేశారు. పెండ్రాని దేవికి ప్రత్యేక పూజలు.. జయపురం: దసరా ఉత్సవాలకు పేరున్న పెండ్రాని గ్రామ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. నవరంగపూర్ జిల్లా ఉమ్మర్కోట్ పెండ్రాని గ్రామం నుంచి వచ్చిన పెండ్రాని దేవికే పట్టణ ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వడం ఆనవాయితీ. రాజుల కాలం నుంచి జయపురం దసరాలో పలు గ్రామ దేవతలో లాఠీలతో పాటు పెండ్రాణి దేవి లాఠీలు పాల్గొంటున్నాయి. ఈసారి కూడా పెండ్రాని దేవి ప్రతినిధిలుగా తీసుకొచ్చిన లాఠీలకు వేలాదిమంది భక్తులు పూజలు చేశారు. పెండ్రాని దేవితో దిశారీలు పలు లాఠీలు, భాజా భజంత్రీలతో వచ్చారు. వారికి దేవదాయ విభాగం వారు ఆశ్రయం, వంటలు చేసుకోనేందు బియ్యం తదితర సౌకర్యాలు సమకూర్చారు. దసరా ఉత్సవాలలో అవిభక్త కొరాపుట్లో పలు గ్రామాల నుంచి 60 కి పైగా గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నట్లు దేవాలయ విభాగ అధికారులు వెల్లడించారు. -
దుర్గాపూజలో అపశృతి..
● కటక్లో భారీ వర్షం ● పందిరి కూలి ముగ్గురికి గాయాలు భువనేశ్వర్: దుర్గాపూజలకు ప్రసిద్ధి చెందిన కటక్నగరంలో భారీ వర్షాలు దసరా ఉత్సవాలను దెబ్బతీశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. కాలేజ్ స్క్వేర్, రాజా బగిచా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదం సమయంలో కాలేజ్ స్క్వేర్ ప్రాంతంలో ఎవరూ గాయపడలేదు. రాజా బగిచాలో పూజలు జరుగుతుండగా ప్రమాదం సంబంవించింది. పూజా మండపం పైకప్పు కూలడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని వైద్య కేంద్రంలో చేర్చారు. భారీ వర్షం కారణంగా కటక్ నగరంలో పలుచోట్ల విద్యుత్తు సరఫరా, తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడింది. -
ప్రిన్సిపాల్ జితేంద్రనాథ్కు ఘనంగా వీడ్కోలు
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్రగజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్రనాథ్ పట్నాయక్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రొఫెసర్లు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు తెలిపారు. గత అయిదేళ్లలో కళాశాలలో అనేక విభాగాల్లో పోస్టుల భర్తీకి బరంపురం విశ్వ విద్యాలయానిక సిఫారసు చేశారు. అంతేకాక పలువురుకి కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్లను నియమించేందుకు పట్నాయక్ విశేషంగా కృషి చేశారు. పచ్చదనం కోసం కళాశాల ఆవరణలో అనేక మొక్కలను నాటించారు. ఆయనకు కన్వీనరు రధాకాంత భుయ్యాన్, డాక్టర్ ఎం.రహమాన్ తదితరులు కేక్ను కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
పిడుగుపాటుకు పశువుల మృతి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో రుపుణి గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఐదు పశువులు మృత్యువాతపడ్డాయి. భీమ మండంగి, గుబేయ పలకలకు చెందిన పశువులు మేతకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చేసుకుంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. కేఎన్కే సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆటోలొ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కండ్రవీధికి చెందిన ఇప్పిలి గౌరిగా గుర్తించారు. ఇంకా కేసు నమోదు కాలేదు. -
పురిటిగూడలో పత్రికొమ్మల పండుగ
పర్లాకిమిడి: కాశీనగర్ సమతి పురిటిగూడ గ్రామంలో దసరా వేడుకలు సందర్భంగా రైతులు పత్రికొమ్మల పండుగను బుధవారం జరుపుకున్నారు. పత్రికొమ్మలను అమ్మవారి మందిరానికి తీసుకువచ్చి అక్కడ కోళ్లు, మేక పోతులను బలిచ్చి ఆ రక్తాన్ని పత్రికోమ్మలకు తడుపుతారు. దీనిని పత్రికొమ్మల దసరా అని పిలుస్తారు. ఆ కొమ్మలను పంటపొలాల్లో నాటుతారు. ఆకులకు ఉన్న రక్తంతో పొలంలో కీటకాలు నాశనం అవుతాయని, పంటలు బాగా పండుతయని అన్నదాతల విశ్వాసం. పత్రికొమ్మల దసరా వేడుకల్లో బీజేపీ నాయకులు రోక్కం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఐదు వందల కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ పంచాయతీ పర్కన్మాల అటవీప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన గంజాయిని మంగళవారం రాత్రి బలిమెల పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అడవిలో ఉన్న గంజాయి గురించి బలిమెల ఐఐసీ దీరాజ్ పట్నాయక్కు విశ్వాసనీయవర్గాల నుంచి ఫోన్ సమాచారం వచ్చింది. దీంతో తన సిబ్బందితో మంగళవారం రాత్రి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి ముఠా పరారైంది. ఓ చోట ఉన్న 20 బస్తాలను స్వాధీనం చేసుకొని పరిశీలించగా వాటిలో భారీగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వీటిని పోలీస్స్టేషన్ తరలించారు. బుధవారం ఉదయం తూకం వేయగా 500 కిలోలు ఉందని.. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని ఐఐసీ దీరాజ్ పట్నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి గంజాయి అక్రమ రవాణాలో పాత్రదారులను గుర్తిస్తామన్నారు. కారు దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు రాయగడ: జిల్లాలోని గుడారి పోలీసులు మంగళవారం కారు దొంగతనం కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలోని టుబుని గ్రామానికి చెందిన జష్య పాలక అనే వ్యక్తి తన సొంత కారును టుబుని ఆస్పత్రి సమీపంలో పార్కింగ్ చేసి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చి చూడగా కారు కనిపించకపోవడంతో చోరీ జరిగి ఉంటుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి గుణుపూర్ కోర్టుకు తరలించారు. ఫుట్బాల్ టోర్నీ విజేతగా సోలిన్ సాకర్ జట్టు పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో సెప్టెంబర్ 28 నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా సోలిన్ సాకర్ జట్టు నిలిచింది. ఫైనల్ పోరులో బ్లూ టైటాన్ జట్టుపై విజయం సాధించింది. అంతర్జాతీయ క్రీడాకారుడు కిషోర్చంద్ర రథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. పోటీలను ఆదిత్యకార్జి, పవన్ పట్నాయిక్, ఆదిత్య బెహరా పర్యవేక్షించారు. -
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ దశాబ్దాలుగా నేటికీ అనేక ఇళ్లల్లో భక్తులు పలు రకాల బొమ్మల్ని సందేశాత్మకంగా కొలువుదీర్చుతున్నారు. వివిధ రకాల బొమ్మతో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్నారు. బొమ్మల నడుమ కొలువుదీరిన దుర్గా మాతకు నిత్యం ఆరాధించి పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. కొలువు సందర్శనకు విచ్చేసే ముత్తయిదువలకు తాంబూలం సమర్పించి శుభం కలగాలని దేవిని వేడుకుంటున్నారు. కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో తెలుగింటి బొమ్మల కొలువు దసరా సంబరాల్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఈ ఏడాది కటక్ నగరంలో వి.రాజేశ్వరి, సీహెచ్ కుసుమ భువనేశ్వర్లో భానుమతి బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. విజయ దశమితో వీరు ఏర్పాటు చేసిన కొలువుని ముగిస్తారు. వీరంతా పూర్వీకుల నుంచి అలవరచుకున్న ఆచారం ప్రకారం ఏటా క్రమం తప్పకుండా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుండడం విశేషం. మిగిలిన ప్రాంతాల్లోనూ బొమ్మల కొలువులతో సందడి నెలకొంది. – భువనేశ్వర్ -
అదరహో..!
భువనేశ్వర్ నగరంలో ఎక్కడిక్కడ అబ్బురపరిచే పూజా మంటపాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, ధార్మిక, పుణ్య క్షేత్రాల్ని ప్రతిబింబించేలా నిలువెత్తు తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక వీఎస్ఎస్ నగర్ దుర్గా పూజ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుని రథం నందిఘోష్ నమూనాతో దుర్గా పూజా తోరణం తీర్చిదిద్దారు. రసూల్ఘడ్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ దేవ భూమి క్షేత్రం రూపొందించారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీసు కమిషనరేటు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. – భువనేశ్వర్ -
శాసనసభలో అవగాహనతో మాట్లాడాలి
సారవకోట: శాసనసభలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అవగాహన లేకుండా మాట్లాడారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. బుధవారం సారవకోటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలని చెప్పుకుంటున్న వారు బీసీ–ఏకి చెందిన వడ్డి కులస్తులని, వారి కోసం గతంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిశోధన సంస్థ అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని తెలిపారు. అది తెలుసుకోకుండా శాసనసభలో అవగాహన రాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ఓట్లు కోసం నకిలీ బెంతు ఒరియాల కోసం శాసనసభలో మాట్లాడటం విచారకరమన్నారు. జిల్లాలో ఆదివాసీలకు అవసరమైన ఐటీడీఏ లేదని, నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో సుమారు వెయ్యి మంది శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై శాసనసభలో మాట్లాడం లేదన్నారు. ఆయనతో పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు జన్ని దాలయ్య, బొమ్మాళి కృష్ణ, బాలరాజు, నాగయ్య, రంగారావు తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీమేన్ మృతి
నరసన్నపేట: మండలంలోని జమ్ము కూడలి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాల రవి (35) మృతి చెందారు. విశాఖ నుంచి తాతయ్య ఊరు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే రవి మృతి చెందాడు. స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న రవి దసరా పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రవికి భార్య భారతి, తలిదండ్రులు నరసయ్య, కామాక్షమ్మ ఉన్నారు. నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనం
భువనేశ్వర్ : పూరీలో జగన్నాథుడు విజయదశమి సందర్భంగా గురువారం స్వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి కొలువు దీరిన శ్రీ మందిరం రత్న వేదికపై ప్రత్యేక సందర్భాల్లో దేవతా త్రయం బంగారు అలంకరణలో దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో అశ్విని శుక్ల పక్ష దశమి తిథి దసరా సందర్భంగా జగన్నాథుడు బంగారు శోభతో రాజ రాజేశ్వర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్య దైనందిన ప్రాథమిక ఉపచారాలు ముగిసిన తర్వాత జగన్నాథుడు, సోదరి దేవీ సుభద్రని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. వ్యక్తిపై దాడి సారవకోట : కిడిమి పంచాయతీ బుడ్డయ్యపేటకు చెందిన పిల్లా పున్నయ్యపై జమచక్రం గ్రామానికి చెందిన మెండ ఆదినారాయణ దాడికి పాల్పడ్డాడు. మంగళవారం మేకల మేత విషయంలో జరిగిన తగాదాలో ఆదినారాయణ తనపై దాడి చేసి గాయపర్చినట్లు పున్నయ్య బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ కృష్ణారావు కేసు నమోదు చేశారు. బాధితుడు ప్రస్తుతం జిల్లా సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎచ్చెర్ల : ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు 2025 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 3, 4 తేదీల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య బుధవారం తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీఎస్టీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రెండు రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, చేనేత శాఖల అధికారులు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జీఎస్టీ నోడల్ అధికారి స్వప్నదేవి తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు వర్శిటీ విద్యార్థులు ఎచ్చెర్ల : కర్ణాటకలోని బెల్గామి వద్ద రాణీ చిన్నమ్మ వర్శిటీలో ఈ నెల 4 నుంచి 7 వరకు జరగనున్న సౌత్ జోన్ అంతర్ వర్శిటీ పురుషుల కబడ్డీ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక బీఆర్ఏయూ జట్టు బుధవారం పయమయ్యింది. జట్టుకు కోచ్గా ఎం.గణేష్ వ్యవహరించనున్నారు. పోటీల్లో రాణించి విజయం సాధించాలని వ్యాయామ విభాగ అధ్యాపకులు శ్రీనివాసరావు, భాస్కరరావు ఆకాంక్షించారు. మెట్ల పైనుంచి జారిపడి వ్యక్తి మృతి జలుమూరు: తలతరియా పంచాయతీకి చెందిన దండుపాటి గడ్డయ్య(55) ఇంటి మెట్ల పైనుంచి జారిపడి బుధవారం మృతి చెందాడు. గడ్డయ్య గత నెల 16న ఇంటి నుంచి డాబాపైకి మెట్లు ఎక్కుతూ జారిపడ్డాడు. తల,శరీర భాగాలకు గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు మృతుడి సోదరుడు అప్పయ్య తెలిపారు. గడ్డయ్యకు భార్య యశోద, కుమారుడు రామన్న ఉన్నారు. అప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు. జీసీడీఓగా మాధవి శ్రీకాకుళం : జిల్లా సమగ్ర శిక్షలో సెక్టోరియల్ పోస్టుల్లో ఒకటైన జీసీడీఓగా చదువుల మాధవి నియమితులయ్యారు. మంగళవారం ఉత్తర్వులు వెలువడగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈమె సారవకోట మండలం పిడిమి ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఈమె భర్త జల్లేపల్లి శ్రీనివాసరావు గతంలో సమగ్ర శిక్షలో ఏఎస్ఓగా పనిచేశారు. జీసీడీఓ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. కాగా, కొద్దిరోజుల కిందట అసిస్టెంట్ జీసీడీఓగా కాకినాడకు చెందిన రమాదేవిని నియమించారు. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయింది. లేనిపోస్టులో రమాదేవిని నియమించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా జీసీడీఓ నియామకం పూర్తయిన నేపథ్యంలో అసిస్టెంట్ జీసీడీఓని కొనసాగిస్తారా ఆమెను వెనక్కు పంపిస్తారా అనేది వేచి చూడాల్సిందే. -
డిమాండ్లు నెరవేర్చాల్సిందే
● ప్రభుత్వానికి స్పష్టం చేసిన పీహెచ్సీ వైద్యులు ● జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ సన్నద్ధం చేస్తున్నాం.. క్రీడాకారులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఏకై క లక్ష్యంతోనే రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. సంఘ పెద్దల ప్రోత్సాహంతో సొంత ఖర్చులు పెట్టుకుని, రెసిడెన్షియల్ క్యాంప్లు నిర్వహించి పోటీలకు సన్నద్ధం చేస్తున్నాం. – మొజ్జాడ వెంకటరమణ, ఏపీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ కన్వీనర్మెలకువలు నేర్చుకున్నాం.. మాణిక్యపురం జెడ్పీహెచ్ స్కూల్లో టెన్త్క్లాస్ చదువుతున్నాను. జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్రపోటీల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. శిక్షణా శిబిరాల్లో మెలకువలు నేర్చుకుంటున్నాం. – సాహు కాలిదాస్, సాఫ్ట్బాల్ క్రీడాకారుడుఅరసవల్లి: గ్రామీణ వైద్యుల సమస్యలు, డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గొంతెత్తారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద జిల్లాలోని 71 పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు సామూహిక ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులకు టైం బౌండ్ ప్రమెషన్లు కల్పించాలని, జీవో 99 రద్దు చేయాలని.. ఇన్సర్వీస్ జీపీ కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50 శాతం గిరిజన భత్యాన్ని అందించాలని, చంద్రన్న సంచార చికిత్సకు రూ.5 వేలు భత్యంగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ ప్రతిష్టా శర్మ, సుధీర్, పావని, సుమప్రియ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీల్లో 73 మంది వైద్యుల నియామకం పీహెచ్సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రజారోగ్య సేవలకు అంతరాయం లేకుండా ఇతర విభాగాల నుంచి వైద్యులను డిప్యుటేషన్ ప్రాతిపదికను నియమించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో 73 మంది వైద్యులను పీహెచ్సీల్లో ప్రత్యామ్నయ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేశారు. బుధవారం నుంచే వీరంతా విధుల్లోకి వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ (జనరల్ ఆసుపత్రి)లో పనిచేస్తున్న 33 మంది వైద్యులతో పాటు డీసీహెచ్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రి (టెక్కలి), ఏరియా ఆసుపత్రి (నరసన్నపేట), కమ్యూనిటి ఆసుపత్రులకు చెందిన 40 మంది వైద్యులకు పీహెచ్సీల బాధ్యతలు అప్పగించారు. కాగా, సుదూర ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీలకు తమను పంపించడంపై పలువురు వైద్యులు మండిపడుతున్నారు. చర్యలు తప్పవు.. ఈ విషయమై డీఎంహెచ్వో డాక్టర్ అనిత మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యులంతా సమ్మెలో ఉన్నందున ప్రత్యామ్నయంగా 73 మందిని నియమించి డ్యూటి చార్ట్ కేటాయించామని చెప్పారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రోగ్రా ంలకు ఇన్చార్జి ఆఫీసర్లుగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఎవరైనా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవు. -
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
● నర్సీపట్నంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీలు ● కఠోర సాధన చేస్తున్న క్రీడాకారులు ● ఇప్పిలి, కేశవరావుపేట వేదికగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలు శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్బాల్ గేమ్లో పతకమే లక్ష్యంగా బాలబాలికలు కఠోర సాధన పూర్తి చేశారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీల్లో సత్తాచాటేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, యూత్, సీనియర్స్ ఇలా అన్ని విభాగాల్లోను హాట్ ఫేవరేట్గా బరిలో దిగుతున్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారుల అభ్యర్ధనను, దసరా సెలవులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా సాఫ్ట్బాల్ సంఘ పెద్దలు శ్రీకాకుళం రూరల్ మండలం, ఇప్పిలి జెడ్పీహెచ్స్కూల్ వేదికగా బాలికలకు, ఎచ్చెర్ల మండలం, కేశవరావుపేట జెడ్పీహెచ్స్కూల్ వేదికగా బాలురుకు శిక్షణా శిబిరాలను నిర్వహించారు. టైటిల్ సాధనే లక్ష్యంగా క్రీడాకారులకు గేమ్లో మెలకువులు అందిస్తు తీర్చిదిద్దారు. గేమ్తోపాటు ఫిట్నెస్పై కూడా దృష్టిసారిస్తున్నారు. సంఘ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
కార్మికులపై కక్ష సాధింపు తగదు
రణస్థలం: యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో 22 ఎళ్లుగా పని చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే నెపంతో తొలగించడం అన్యాయమని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. రణస్థలంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారు 50మంది కార్మికులను తొలగించడం దారుణమన్నారు. ఈ విషయమై యూబీ పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కొద్ది రోజుల్లోనే తిరిగి వేస్తామని చెప్పి నేటికి ఏడాదిన్నర అయినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ సానుభూతిపరులైన కార్మికులు మద్యం తాగినా, పరిశ్రమలో గొడవలు సృష్టించినా ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. భూగర్భ జలవరుల శాఖ అధికారుల అనుమతులు లేకుండా 500 అడుగుల లోతున 3 అడుగుల వెడల్పున బోర్లు వేసి జలాలు ఎలా తోడేస్తున్నారని, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని చెప్పారు. కలుషిత వ్యర్థ జలాలు రణస్థలం పంచాయతీలోని సీతంపేట చెరువులోనికి, బంటుపల్లి జగనన్న కాలనీ వైపు వదిలేస్తుండటంతో పంటలకు నష్టం కలుగుతోందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే బూడిద వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, రాష్ట్ర అనుబంధ విభాగం జాయింట్ సెక్రటరీ కెల్ల రామకృష్ణ, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దన్నాన హరి, బంటుపల్లి మాజీ సర్పంచ్ పాశపు ముకుందరావు, కార్మికులు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
● హిజ్రా అరెస్టు కంచిలి/పలాస: మండల కేంద్రం కంచిలిలో ఈ ఏడాది జూలై 5న రిటైర్డు లెక్చరర్ పురెళ్ల సింహాద్రి ప్రధాన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి కొంత సొత్తును రికవరీ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. 25 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురికాగా 12 తులాల ముప్పావు బంగారు ఆభరణాలు, 55.88 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ కేసులో ఐదుగురు నిందితుల్లో ఒకరైన కంచిలిలో రైల్వేస్టేషన్ వెనుకవైపు నివాసం ఉంటున్న కవిటి మండలం కవిటి పట్టణం కండ్రవీధికి చెందిన నాగుల సోనియా అనే హిజ్రా బుధవారం ఉదయం 11 గంటలకు సోంపేట వైపు నుంచి కంచిలి రైల్వేస్టేషన్ వైపు చేతిలో కవర్ పట్టుకొని వస్తోంది. పోలీసులను చూసి పారిపోతుండగా సోంపేట సీఐ బి.మంగరాజు సిబ్బంది సాయంతో పట్టుకున్నారు. ఈ క్రమంలో జూలై 5న రాత్రి బూరలు అమ్ముకొనే బాబు(భోపాల్, మధ్యప్రదేశ్), కబాడియా(ఔరంగాబాద్, మహారాష్ట్ర), సనాటా(కోట, రాజస్థాన్), టున్ని అనే నలుగురు వ్యక్తులతో కలిసి కంచిలిలోని సింహాద్రి ప్రధాన్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద 105.53 గ్రాములు బంగారు, డైమండ్ లాంగ్ నెక్లెస్(హారం), 41.57 గ్రాముల మామిడి పిందెల బంగారు చైన్, 3.88 గ్రాముల చెవి రింగులు, 55.88గ్రాముల వెండి గిన్నెలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సోంపేట సీఐతో పాటు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు, సిబ్బంది ఉన్నారు. -
రైలు టాయిలెట్లో మహిళ ప్రసవం
భువనేశ్వర్: నాగర్కోయెల్–షాలిమార్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ రైలు 6వ నంబర్ బోగిలో ఒక ప్రయాణికురాలు టాయిలెట్లో ఆడబిడ్డను ప్రసవించింది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకుంది. స్థానిక ఖుర్ధా రోడ్ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం కింద తక్షణ చర్యలు చేపట్టడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందం స్థానిక జట్నీ సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం విజయవంతమైంది. మంగళవారం ఉదయం 5 గంటలకు భార్య ప్రసవ వేదన గమనించిన భర్త రైల్వే హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో రైల్వే యంత్రాంగం తక్షణమే స్పందించి ఉదయం 6 గంటల ప్రాంతంలో గురు దేవ్ ఎక్స్ప్రెస్ రైలు ఖుర్దారోడ్ స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు చేరే సరికి అంబులెన్స్, వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచింది. మహిళా చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లిల్లీ బరువా, ఇతిశ్రీ మిశ్రా, రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుళ్లు ఎన్.స్వాతి, రీతా దాష్, బి.ఎల్. జెనా, ఒక వైద్య బృందం స్ట్రెచర్ సాయంతో టాయ్లెట్ నుంచి బాలింత, శిశువుని సురక్షితంగా కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బీహార్ ముంగేర్ జిల్లా గోబడా నివాసి చంపా దేవి (31) 12659 డౌన్ నాగర్కోఝెల్ – షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలులో షాలిమార్కు ప్రయాణిస్తోంది. మా ర్గమధ్యంలో ఆమె భర్త జితేంద్ర కుమార్ దాష్ ప్రసవ వేదన గమనించి రైల్వే శాఖ ఉద్యోగుల మద్దతుతో తల్లీబిడ్డల్ని ఆదుకోగలిగారు. ఈ సందర్భంగా అతడు రైల్వే సిబ్బంది సేవా స్ఫూర్తిని అభినందించారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందంలో ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి ప్రత్యే క అవార్డులతో అభినందించాలని తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లకీ్ష్మధర మహంతి అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
ప్రత్యేక పూజలు..
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో ఏకై క శక్తి పీఠం మా బండారు ఘరణి దేవాలయంలో తెలుగు మహిళలు పారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జ్యోతిర్మయి ఆధ్యాత్మిక సంస్థ మహిళల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో మా బండారు, మా పెండ్రాణి అమ్మవారి దేవాలయాల మధ్య పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సుమారు వంద మంది మహిళలు కాషాయ చీరలు ధరించి మంత్రాలు పఠించారు. ఇదే సమయంలో దేవాలయానికి వచ్చిన బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి మహిళలను అభినందించారు. సుమారు 15 ఏళ్లుగా జ్యోతిర్మయి మహిళలు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పారాయణం చేస్తున్నారు. మరోవైపు పపడాహండి సమితి కేంద్రంలో దసరా సందర్భంగా ఏర్పటు చేసిన పెండళ్లు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. -
8 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఇరిగేషన్ కాలనీలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో తులారామ్ హరిజన్ ఇంటి పెరట్లోకి ఎనిమిది అడుగుల కొండచిలువ చొరబడింది. దీన్ని చూసిన కుటుంబ సభ్యులు స్నేక్హైల్ప్లైన్ సభ్యుడు రాకేష్ హాల్ధార్ సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పామును అతికష్టంపై పట్టుకున్నారు. సమీపంలోని కొండల్లో నుంచి వచ్చిన కొండచిలువ కోళ్లను తినేసి ఉందని స్నేక్క్యాచర్ చెప్పారు. మంగళవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సూచనలతో తిరిగి అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టారు. -
బాహినీ ఆయుధ పూజ ప్రారంభం
● దేవీ మండపాలకు పెరిగిన భక్తుల తాకిడి పర్లాకిమిడి: స్థానిక బెబర్తా వీధిలోని శ్రీకృష్ణచంద్ర గజపతి సమరయోధుల వాహినీ దుర్గాష్టమి సందర్భంగా ఆయుధపూజను మంగళవారం ప్రారంభించారు. అప్పటి పర్లాకిమిడి మహారాజు గౌరచంద్ర గజపతి నారాయణ దేవ్ కాలం నాటి కత్తులు, డాలు, సమరయోధులు కర్ర తిప్పడం వంటి నైపుణ్య విన్యాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆష్టమి నుంచి ఈ ఆయుధాలను బయటకు తీసి పూజను ప్రారంభించి విజయదశమి రోజున బెబర్తావీధి, కటిక వీధి, చిత్రకార వీధిలో వున్న సమరయోధులు పర్లాకిమిడి పురవీధులు, మహారాజా ప్యాలస్ వద్ద విన్యాసాలు చేస్తారు. అప్పట్లో మహారాజులు ఈ విన్యాసాలు చూసి వారికి నగదు బహుమతులు అందించేవారు. కాలానుకూలంగా రాజులకాలం పోయి సమరయోధులు యుధ్ధవిన్యాసాలు గజపతి జిల్లాలో ప్రదర్శిస్తుంటారు. కాగా మంగళవారం అన్ని దేవీ పెండాళ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పోలీసులను ప్రతి జంక్షన్ వద్ద మోహరించి ట్రాఫిక్ సమస్యలేకుండా చేశారు. కటిక వీధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నఅష్టమి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
ఘనంగా దసరా ఉత్సవాలు
● రాజ భవనాలు తిలకించేందుకు పోటెత్తిన జనం జయపురం: దసరా ఉత్సవాల సందర్భంగా అందంగా అలంకరించిన జయపురం మహారాజ భవనాలను తిలకించేందుకు జనం పోటెత్తాన్నారు. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు రాజ భవనాలను సందర్శించారు. కోటలో పల మరఫిరంగులను తిలకించారు. రాజాల యుద్ధ సమయంలో శత్రువులను వధించడానికి వినియోగించే ఫిరంగులకు గుడి కట్టి పూజలు జరుపుతున్నారు. ఆ ఫిరంగులు తిలకించి ప్రజలు పూజిస్తున్నారు. సోమవారం సాయంత్రం తరువాత జయపురం రాజ కుమారుడు బిశ్వంబర చంద్ర చూడదేవ్ దసరా ఉత్సవాల్లో భాగంగా రాజులు ధరించే దుస్తులతో ప్రజలకు దర్శనం ఇచ్చారు. అతనికి ప్రత్యేక ఛత్రం(గొడుగు) పట్టి యువత ఆయనతోపాటు నడిచారు. యువ రాజుని చూసేందుకు ప్రజల పోటెత్తగా.. యువకులు అతని చుట్టూ రక్షణ వలయంగా నిలిచి ముందుకు తీసుకువెళ్లారు. -
భక్తిశ్రద్ధలతో దుర్గాష్టమి పూజలు
జయపురం: జయపురం చారిత్రాత్మక దసరా ఉత్సవాల్లో ప్రధాన దేవతల్లో ఒకరు పూర్ణఘడ్లో వేంచేసి ఉన్న మా దక్షిణ కాళీ జన్మస్థలం పనసపుట్బగరలో మంగళవారం ఘనంగా దుర్గాష్టమి పూజలు జరిగాయి. జయపురం పట్టణానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న పనసపుట్బగర గ్రామం సమీప కొండపై పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద సేవన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాళీమాత చెల్లి దుర్గా మాతకు ప్రజలు అష్టమి పూజలు జరిపి దసరా వేడుకలు జరపటం కొన్ని శతాబ్దాల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆ గ్రామంలో ముఖ్య వ్యక్తి సరోజ్ మహంతి వెల్లడించారు. రెండు వందల సంవత్సరాలకు పూర్వం గ్రామం సమీప పర్వతంపై ఇద్దరు అక్క చెల్లెల్లు దుర్గ, దక్షిణ కాళీలను అనాదిగా ఆ ప్రాంత ప్రజలు కొలుచేవారు. ఏ కారణం చేతనో జయపురం పట్టణంలో ఖడంగా కుటుంబానికి గ్రామస్తులు దక్షిణ కాళీ విగ్రహాన్ని విక్రయించారు. ఖడంగా కుటుంబం దక్షిణ కాళీ విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. కొంత కాలం తరువాత ఖడంగా కుటుంబ సభ్యులు దక్షిణ కాళీ విషయం జయపురం రాజుకు తెలియజేశారు. ఆ సమమంలో నక్కిడొంగర పర్వతంపై కోట నిర్మించి అక్కడ నుంచి జయపురం రాజులు పాలించేవారు. అందువల్ల ఆ ప్రాంతంలో (నేటి పూర్ణఘడ్) ఒక గుడిశ నిర్మించి అందులో దక్షిణ కాళీ విగ్రహాన్ని అప్పటి రాజు ప్రతిష్టించారు. అప్పటి నుంచి పూర్ణఘడ్లో మా దక్షిణ కాళీ, పనసపుట్బగరా పర్వతంపై మా దుర్గదేవి పూజలు అందుకున్నారు. పనసపుట్బగరలోగల మా దుర్గా దేవికి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. దక్షిణ కాళీ, మా దుర్గ దేవత మూర్తులకు దసరా వేడుకల్లో ఘనంగా పూజలు, ఉత్సవాలు జరుపుతూ వస్తున్నారు. మంగళవారం పనసపుట్ బగరా పర్వతంపై అంగరంగ వైభభవంగా పూజలు జరిపారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పనసపుట్ బగర గ్రామం నుంచి ఆ గ్రామ యువకులు, బాలికలు పూజా, భోగానికి సామగ్రి తీసుకువచ్చి దక్షిణ కాళీ మాతకు సమర్పించిన తరువాత దక్షిణ కాళీ ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని గ్రామస్తులు వెల్లడించారు. ఈ ఆచారం రాజుల కాలం నుండి వస్తుందని వెల్లడించారు. కాల క్రమేణా రాజుల పర్యవేక్షణంలో దక్షిణ కాళీ మందిరం అభివృద్ధి చెందినా పనసపుట్బగర పర్వతంపై ఉన్న దుర్గా మాత పీఠం అభివృద్ధికి నోచుకోక లేకపోయిందని గ్రామ పెద్దలు తెలిపారు. -
తీరంలో మృతదేహం
సంతబొమ్మాళి: పిట్టవానిపేట సముద్రతీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం కొట్టుకొచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఒకటి రెండు రోజుల కిందట సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతై ఉంటారని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు ఎచ్చెర్ల : తోటపాలెం పంచాయతీ అఖింఖాన్పేట శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినోద్కుమార్ తెలిపారు. ఘనంగా కొత్తమ్మ తల్లి మారువారం టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో మంగళవారం మారువారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముర్రాటలతో చల్లదనం చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా రూ.51 కోట్లు భారం టెక్కలి: ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం దిగ్విజయంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో నెలకు సుమారుగా రూ.51 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 6 జిల్లాల్లో 1610 బస్సులు ఉన్నాయని వాటిలో సీ్త్ర శక్తి పథకానికి 1352 బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా బస్సులు పెంచే ఆలోచన ప్రభుత్వ విధానం పై ఆధారపడి ఉంటుందని ఈడీ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఒక సారి రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేయడం కష్టతరమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లను బీఓటీ పద్ధతి ద్వారా ఆధునీ కరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఈడీ పేర్కొన్నారు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఫిట్టర్ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 154 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.1.10 కోట్ల పరిహారం అందజేస్తామ ని, సాధారణంగా మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, డీఈ రవికుమార్, డీఎం ఎం.శ్రీనివాస్ ఉన్నారు. 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు కె.భానుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం ఎన్జీఓ భవన్లో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు కాలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏటా రూ.180 కోట్లు హెల్త్కార్డుల కోసం చెల్లిస్తున్నా ఆస్పత్రులు అంగీకరించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్కుమార్, కార్యవర్గ సభ్యులు జి.రమణ బి.వెంకటేశ్వర్లు వి.సత్యనారాయణ, కుప్పిలి జగన్మోహన్, చావలి శ్రీనివాస్, వి.నవీన్కుమార్, వి.రామారావు, పి.హరిప్రసన్న, టి.శ్రీనివాసరావు, డి.రామ్మోహన్ డి.వెంకటేష్ పాల్గొన్నారు. -
రైలు టాయిలెట్లో మహిళ ప్రసవం
భువనేశ్వర్: నాగర్కోయెల్–షాలిమార్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ రైలు 6వ నంబర్ బోగిలో ఒక ప్రయాణికురాలు టాయిలెట్లో ఆడబిడ్డను ప్రసవించింది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకుంది. స్థానిక ఖుర్ధా రోడ్ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం కింద తక్షణ చర్యలు చేపట్టడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందం స్థానిక జట్నీ సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం విజయవంతమైంది. మంగళవారం ఉదయం 5 గంటలకు భార్య ప్రసవ వేదన గమనించిన భర్త రైల్వే హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో రైల్వే యంత్రాంగం తక్షణమే స్పందించి ఉదయం 6 గంటల ప్రాంతంలో గురు దేవ్ ఎక్స్ప్రెస్ రైలు ఖుర్దారోడ్ స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు చేరే సరికి అంబులెన్స్, వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచింది. మహిళా చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లిల్లీ బరువా, ఇతిశ్రీ మిశ్రా, రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుళ్లు ఎన్.స్వాతి, రీతా దాష్, బి.ఎల్. జెనా, ఒక వైద్య బృందం స్ట్రెచర్ సాయంతో టాయ్లెట్ నుంచి బాలింత, శిశువుని సురక్షితంగా కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బీహార్ ముంగేర్ జిల్లా గోబడా నివాసి చంపా దేవి (31) 12659 డౌన్ నాగర్కోఝెల్ – షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలులో షాలిమార్కు ప్రయాణిస్తోంది. మా ర్గమధ్యంలో ఆమె భర్త జితేంద్ర కుమార్ దాష్ ప్రసవ వేదన గమనించి రైల్వే శాఖ ఉద్యోగుల మద్దతుతో తల్లీబిడ్డల్ని ఆదుకోగలిగారు. ఈ సందర్భంగా అతడు రైల్వే సిబ్బంది సేవా స్ఫూర్తిని అభినందించారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందంలో ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి ప్రత్యే క అవార్డులతో అభినందించాలని తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లక్ష్మీధర మహంతి అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
అలరించిన నాటకం
రాయగడ: స్థానిక రాణిగుడ ఫారం వద్ద న్యూటౌన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మూ కొహుచి సొమోయో అనే నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆద్యంతం రసభరితంగా సాగిన ఈ నాటకం రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇమిడి ఉన్న ఈ నాటక సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సమయానికి ఎవరూ అతీతులు కారన్న ముఖ్య సందేశంతో కొనసాగిన ఈ నాటకంలో విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, బ్రజసుందర్ నాయక్, ప్రముఖ హాస్యనటుడు ప్రభాకర్ మిశ్రొ (టున్నా టన్ టన్), డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి, శివ మిశ్రొ, డాక్టర్ ద్వితీ చంద్ర సాహు, బాబులాల్ గంతాయిత్, అజిత్ కుమార్ పాణిగ్రహి, రవి సతపతి, మానస్ రొథొ, ప్రణతి పాత్రొ, భవాని మిశ్రో తదితర కళాకారులు పాల్గొన్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: రక్తదానం చేయడంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, యువత అపోహలు వీడి రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక పిలుపునిచ్చారు. సదరు సమితి జేకేపూర్లో గల టీమ్ కణ్యారాశింఖ్ అనే సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం వంటి సమాజిక సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని సూచించారు. ఈ శిబిరంలో 42 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం వారికి సంస్థ సమకూర్చిన ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పట్నాన గౌరి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తనిధి అధికారుల పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు. -
నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు
రాయగడ: నవ్వు ఆరోగ్యానికి ఎంతొ మేలు చేస్తోందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ సభ్యులు అన్నారు. ఈ మేరకు చెక్కాగుడలోని ప్రేమ్ పహాడ్ వద్ద మంగళవారం ఉదయం నిర్వహించిన నవ్వుల కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహాంతి మాట్లాడుతూ.. మన నిత్యజీవితంలో నవ్వు ఎంతో అవసరమని అన్నారు. ఎప్పుడూ ఒత్తిడితో ఉండే మనం నవ్వు వల్ల ఉపశమనం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రతిఒక్కరూ కొద్ది సమమైన నవ్వడం, నవ్వించడం వంటి కార్యక్రమాల్గో పాల్గొనాలని అన్నారు. నవ్వువల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి వివరించారు. తమ క్లబ్ మంచిలక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నా రు. అందరినీ ఆనందంగా ఉంచడం, నవ్వించడం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరిచి పలు కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి అనంతరం చర్చించారు. కార్యక్రమంలొ క్లబ్ ఉపాధ్యక్షులు ఎ.మహాంతి, సలహాదారుడు ఉదయ్ పండ పాల్గొన్నారు. -
దక్షిణకాళీ మందిరం పరిశుభ్రం
జయపురం: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రజల ఆరాధ్య దేవతల్లో ఒకరు పూర్ణఘడ్లో వేంచేసి ఉన్న దక్షిణకాళీ మందిరాన్ని ప్రతీరోజు స్థానిక శ్రీరామ సేవా కమిటీ సభ్యలు పరిశుభ్రం చేస్తున్నారు. అంతే కాకుండా ఆలయంలో మా దక్షిణకాళీకి సేవలు చేస్తున్నారు. శ్రీరామ సేవా కమిటీ కార్యదర్శి సానా జగదీస్ నేతృత్వంలో ప్రతీరోజు ఉదయం వచ్చి ఆలయాన్ని పరిసర ప్రాంతాలను పరిశుభ్ర పరుస్తున్నారు. కార్యదర్శి జగదీస్ మంగళవారం సాక్షితో మాట్లాడుతూ దక్షిణ కాళీ మందిరానికి ప్రతీరోజు వందలాది మంది భక్తులు వస్తున్నారని, భక్తులకు అసౌకర్యం కలుగ కుండా శ్రీరామ సేవా కమిటీ సభ్యులతో దసరా ఉత్సవాలు ముగిసేంత వరకు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు వచ్చి పరిశుభ్ర పరుస్తున్నామని వెల్లడించారు. భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. మంగళవారం దక్షిణ కాళీ ఆలయానికి వచ్చిన గ్రామ దేవతల లాఠీలకు శ్రీరామ సేవా కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బవిరెడ్డి రమణ, ఎ.తిరుమల రావు, ఎస్.మల్లికార్జున రావు, బి.గుప్తేశ్వర రావు, బాబూరావు, సీతారాం, పి.రవి, వి.రామారావు, పట్నాన ప్రతాప్, జి.వెంకట రమణ, జి.రమణ, జి.శ్రీలత, వి.మల్లేశ్వరి, ఎస్.రేవతి. వి.పద్మ, ఎన్.స్వాతి, పావని, జి,భవాని, పి.మాధురి, జి.శ్రీలత, పి.అరుణ పాల్గొన్నారు. -
శ్రీ మందిరం పరిసరాల్లో మద్యం దుకాణాలు నిషేధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరం పరిసరాల్లో బొడొదండొ వెంబడి 1 కిలో మీటరు పరిధిలో మద్యం దుకాణాలు, అబ్కారీ సంబంధిత వస్తువుల అమ్మకాలు ఉండవు. అంతే కాకుండా ఈ పరిధిలో మాంసాహార వస్తువుల అమ్మకాలు పరిమితం చేస్తారు. ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. కొండచిలువ హల్చల్ రాయగడ: స్థానిక గంగాగ్యారేజీ సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ హల్చల్ చేసింది. గ్యారేజీ సమీపంలో ఆగిఉన్న ఒక లారీలో కొండచిలువ ఉండటం గమనించిన అక్కడి వారు వెంటనే స్నేక్ క్యాచర్ ప్రదీప్ సేనాపతికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సేనాపతి సుమారు గంట సమయం కష్టపడి కొండచిలువను పట్టుకున్నారు. ఆరు అడుగుల పొడవుగల దీనిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దసరా కావడంతో లారీని సంబంధిత యజమాని పరిశుభ్రం చేస్తున్న సమయంలో ఛాసీస్ వద్ద దాగిఉన్న కొండచిలువ తారసపడింది. సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి రాయగడ: దసరా సమయంలో ప్రయాణికులతో రైళ్లు రద్దీగా ఉంటాయి. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు భద్రతతో పాటు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలంటే అందుకు ఎంతో అప్రమత్తత అవసరమని ఆర్పీఎఫ్ అధికారి టి.ఎస్.భంజ్ అన్నారు. జిల్లాలోని మునిగుడ రైల్వే స్టేషన్లో ఈ మేరకు ప్రయాణికులకు అవగాహన, చైతన్య కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రైళ్లు ఎక్కేదిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివిధ జాగ్రత్తలకు సంబంధించి అవగాహన కల్పించారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను పాటించడం ఆరోగ్యానికి ఎంతోమేలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి అరెస్టు మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కేంద్రంలో గౌడిగూడకు చెందిన విబుషన్ దొర, నరసింహ దొర ఇద్దరిపై మత్తిలి పోలీస్స్టేషన్లో 2018లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లకు బెయిల్పై విడుదలయ్యారు. కోర్టుకు హాజరు కావాల్సిన సమయాల్లో వారు హాజరు కాలేదు. మూడు సార్లు నోటీసులు వచ్చినా హాజరు కాలేదు. దీంతో వారికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. మంగళవారం పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాముకాటుతో విద్యార్థి మృతి జయపురం: పాముకాటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో చోటుచేసుకుంది. బొయిపరిగుడ సమితి గుప్తేశక్వర గ్రామ పంచాయతీ గోయల్కుండ గ్రామానికి చెందిన చంద్రసేన్ దురువ (13) తన కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం తమపొలంో మొక్కజొన్న కండెలు తెంచేందుకు వెళ్లారు. చంద్రసేన్ జొన్నపొత్తులు తెంచుతున్న సమయంలో విషసర్పంచ్ చేయివేలుపై కాటువేసింది. దీంతో చంద్రసేన్ పరుగున వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పగా.. వారు వెంటన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి గుణియ వద్దకు తీసుకెళ్లారు. గుణియ చికిత్స చేస్తుండగా అతడు మరణించాడు. సమాచారం అందిన రామగిరి పోలీసు పంటి ఏఎస్ఐ విష్ణు మడకామి గోయల్కుండ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూఢనమ్మకాల వల్లే చంద్రసేన్ మరణించాడని స్థానికులు చెబుతున్నారు. -
కత్తి, డాలు కోటలోకి తరలింపు
పర్లాకిమిడి: పట్టణంలోని అంకావీధిలో గల గజపతుల ఇలవేల్పు మాణికేశ్వరీ దేవికి గత 16 రోజులపాటు నిర్వహించిన దసరా వేడుకలు మూలష్టమి అయిన సోమవారంతో ముగిశాయి. గజపతుల వంశీయులు కళ్యాణి గజపతి లేకపోవడంతో రాజమందిరంలో సేవకులు, ప్రధాన అర్చకులు మేళతాళలతో అంకావీధిలోని మాణికేశ్వరీదేవి మందిరానికి వచ్చి పార్శ్వభాగంలో ఉన్న కనకదుర్గ కత్తి, డాలును ప్రధాన పూజారి రఘుపాత్రో తీసుకుని కోటలోకి వెళ్లి శాసీ్త్రయంగా పూజలు జరిపారు. తిరిగి అమ్మవారి కత్తి, డాలును మాణికేశ్వర మందిరంలో యథాస్థానంలో పెట్టారు. ఈ రాత్రికి అమ్మవారికి కోడిపుంజును బలిచేసి నైవేద్యం పెడతారు. ఆనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని గత వందేళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. పర్లాకిమిడిలో ఈ ఒక్క మాణికేశ్వర మందిరంలో మార్పులు (చేపలు), నీసు వంట అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. వచ్చే విజయదశమి వరకు కనకదుర్గ, అమ్మవారికి పూజలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు. -
ఇంటిపై కూలిన భారీ వృక్షం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి మెక్కా పంచాయతీ మఝారిగూఢ గ్రామంలో సోమవారం ఓ భారీ వృక్షం ఇంటిపై కూలిపోయింది. విజయ్ పట్నాయక్ కుటుంబ సభ్యుల తో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వేకువజామున భారీవర్షం కారణంగా పక్కనే ఉన్న చెట్టు కూలిపోయింది. సోమవారం ఉదయం మత్తిలి అగ్నిమాపిక సిబ్బందికి చేరడంతో వారువచ్చిన చెట్టును తొలగించారు. అలానే సమీపంలో అంగన్వాడీ కేంద్రంపై కూడా మరో చెట్టు పడడంతో దాని కూడా తొలగించారు. రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంఘం కార్యాలయం భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించా రు. విశాఖపట్నానికి చెందిన ఇండస్ ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో వైద్యులు హృద్రోగ, ఆర్థో పరీక్షలను వైద్య నిపుణులు హాజరయ్యారు. 80 మంది హృద్రోగ, 40 మందికి ఆర్థో పరీక్షలను చేపట్టారు. సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్, కార్యదర్శి టి. జయ రాం, కోశాధికారి వి.మురళి, సభ్యుల పర్యవేక్ష ణలో శిబిరం జరిగింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ సంఘం వైద్య శిబిరాన్ని నిర్వహించామని.. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నాహాలు చే స్తున్నామని అధ్యక్షులు అమర్నాథ్ తెలిపారు. మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు పలాస: మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు చెక్కభజన, కోలాటం, తదితర జానపద కళారూపాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు దక్కడం గొప్ప విషయమని పలాస మండలం రంగోయి గిడుగురామ్మూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు చెప్పారు. కళాపీఠం సభ్యులు తవిటినాయుడు, సాయికుమార్లు మలేషియాలో నెలరోజుల పాటు అక్కడి తెలుగువారికి జానపద కళల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల సమీప వాటర్ట్యాంక్ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యు వకుడు ఢీకొట్డాడు. ఈ నెల 27న జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నం హనుమంతువాకకు చెందిన కొత్తలంక పూర్ణచంద్రరావు తీవ్రంగా గాయపడి ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వివాహమై మూడు నెలలే.. శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో పరిపాలనావిభాగంలో కార్యాలయ అసిస్టెంట్గా ఉన్న పూర్ణచంద్రరావుకు విశాఖ యువతి పావనితో మూడు నెలల కిందట వివాహమైంది. పూర్ణచంద్రరావు కారుణ్య నియామకంలో రిమ్స్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శనివారం రిమ్స్ లో గాయాలతో పూర్ణచంద్రరావు చేరినా అక్క డి సిబ్బంది ఎందుకో గోప్యంగా ఉంచారని భార్య పావని చెప్పినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ వెల్లడించారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిచంద్ర (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. అదే సమయములో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న హరిచంద్ర పిడగు ధాటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కొత్తూరు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడు. హరిచంద్రకు భార్య అనసూయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
శాంతియుతంగా దుర్గా పూజలు
● గవర్నర్ హరిబాబు కంభంపాటి ● దుర్గా పూజా మందిరం సందర్శన భువనేశ్వర్: దుర్గాదేవి పూజోత్సవాలకు పేరొందిన కటక్ నగరంలో జోబ్రా ప్రాంతంలో రజత ప్రభ దే వీ పూజా మండపాన్ని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబా బు కంభంపాటి ప్రారంభించారు. ఆయనతో ప్రథ మ మహిళ జయశ్రీ కంభంపాటి పాల్గొని దుర్గా దేవి కి అఖండ దీపారాధన చేశారు. కటక్ నగర వారసత్వ చేతిపనుల వెండి ప్రభల సంప్రదాయం ప్రపంచ ప్రఖ్యాతకు ప్రేరణగా గవర్నర్ ప్రశంసించారు. నగరంలో పూజాదులు శాంతియుతంగా, ఆనందంగా ముగియాలని గవర్నర్ దంపతులు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ దంపతులకు పూజా నిర్వాహక కమిటీ సభ్యులు స్వాగతించారు. వారు మేధ ఏర్పాట్లు, కళాత్మకత గురించి వివరించారు. గవర్నర్, ప్రథమ మహిళకు బారాబటి ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌస్, చౌద్వార్ నియోజకవవర్గం ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్, కటక్ నగర పాలక సంస్థ సీఎంసీ మేయర్ సుభాష్ చంద్ర సింగ్, జిల్లా యంత్రాంగం అధికారులు స్వాగతం పలికారు. -
హార్డ్వేర్ షాపు దగ్ధం
కొత్తూరు : కొత్తూరులోని బత్తిలి రోడ్డులో ఇరాజీ కిమారామ్కు చెందిన కమల హార్డ్వేర్ షాపులో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని కొత్తూరు అగ్ని ప్రమాక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ శంకరరావు సిబ్బందితో వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంజిన్ మోటార్ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. విషయాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహన్రావుకు తెలియజేయడంతో వెంటనే పాలకొండ, ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రాల ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హార్డ్వేర్షాపుతో పాటు పక్కనే ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ మందులు షాపులోకి మంటలు చెలరేగడంతో అక్కడ కూడా సుమారు రూ.ఏడు లక్షల విలువైన మందులు పాడయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కొత్తూరులో వేకువజామున ఘటన సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది -
9 నాగుపాములు, కొండచిలువ పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎం.వి.8 గ్రామంలో సోమవారం తొమ్మిది నాగుపాములు, ఒక కొండచిలువను జిల్లా స్నేక్ హెల్ప్లైన్ సభ్యుడు శరత్ మాఝి పట్టుకున్నారు. కొద్దిరోజులుగా గ్రామంలో పాములు సంచరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చీకటి పటితే బయట తిరగలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు స్పందించి పాములను పట్టించారు. సీసాల్లో బంధించిన పాములను ఎంవీ 11 గ్రామ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వంతెన కూలి రాకపోకలకు అంతరాయం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి ఆండ్రాపల్లి–పనాస్పూట్ పంచాయతీల ప్రధాన రహదారిపై ఉన్న వంతెన జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. దీంతో రెండు గిరిజన గ్రామ పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను నాసిరకంగా నిర్మించడంతోనే కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కూలిన వంతెనను నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు విద్యుత్ విభాగ కార్యాలయం ముట్టడి జయపురం: గత పది దినాలుగా తమ గ్రామానికి విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నామని జయపురం సమితి బొయిపరిగుడ సమితి బొదాగుడ పంచాయతీ మాలిగుడ ప్రజలు సోమవారం విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. బొయిపరిగుడలో గల విద్యుత్ విభాగ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు తమ గ్రామానికి గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేదని, ఈ విషయం సంబంధిత అధికారులకు ఎన్ని పర్యాయాలు తెలిపినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పోలీసులు వచ్చి సమాధాన పరచడంతో శాంతించారు. ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం వార్షికోత్సవం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎక్స్బోర్డ్ పాఠశాలలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం 14వ వార్షికోత్సవం సందర్భంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షుడు ప్రకాష్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో డబ్బీరు కేశవరావు భార్య డబ్బీరు భాగ్యలక్ష్మి, సింగమహంతి రామచంద్ర పట్నాయిక్ కుమారుడు ఎస్.దుర్గా పట్నాయక్ ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు ప్రకాష్ పట్నాయక్, దుర్యోధన్ పాత్రో, నారాయణ్దాస్ తదితరులను సన్మానించారు. -
పాత్రికేయునిపై తుపాకి దాడి
భువనేశ్వర్: కటక్ జిల్లా బొడొంబా ప్రాంతంలో పా త్రికేయునిపై ఆగంతకులు తుపాకీ గురి పెట్టారు. ఈ దాడిలో అతని భుజం, వేళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. నువాపడా గ్రామంలో ఆదివారం రాత్రి దుండగులు బాధితుని ఇంటిలోకి చొరబడి కాల్పు లు జరిపారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణలో రిపోర్టర్ మనోజ్ నాయక్ బాధితునిగా గుర్తించారు. పాత కక్షలతో ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకుని నిందితుడిని బొడొంబా ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహనా బ్లాక్ గరడమా పంచాయతీ నుంచి గంభారీ గ్రామానికి ట్రాక్టర్ ద్వారా రేషన్ బియ్యం తీసుకెళ్తుండగా.. డెప్పగుడ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టరులో ఉన్న కూలీలు, డ్రైవర్తో సహా పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బ్రాహ్మణిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన చికి త్స నిమిత్తం మోహనా మెడికల్కు తరలించా రు. మోహనా పోలీసులు దీనిపై ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాయామంతో గుండె చప్పుడు పదిలం: హైటెక్
భువనేశ్వర్: క్రమబద్ధమైన వ్యాయామం ఆరోగ్యవంతమైన గుండెకు భద్రత కల్పిస్తుందని, ఈత, సైక్లింగ్, నడక వంటి సాధారణ అలవాట్లలతో గుండె చప్పుడు సురక్షితంగా ఉంటుందని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా స్థానిక హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ నుంచి జీజీపీ కా లనీ వరకు సోమవారం వాకథాన్ నిర్వహించారు. హైటెక్ వర్గం కార్డియాలజీ విభాగం ప్రముఖుడు డాక్టర్ రితేష్ ఆచార్య, సీటీవీఏ నిపుణుడు డాక్టర్ శ్వేతా దాస్, సీఈఓ జ్యోతిర్మయ్ పండా, విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాలు ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, నడకకు ప్రాధాన్యత కల్పించడం గుండె నిరంతర చప్పుడుకు హామీపూర్వక ఆచరణగా వాకథాన్లో పాల్గొన్న హృద్రోగ వైద్య, చికిత్స నిపుణులు తెలిపారు. హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైటెక్ గ్రూప్ మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు సమతుల్య పౌష్టిక ఆహారంతో దైనందిన శారీరిక వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. -
శ్రీ మందిరం శిఖరాన డ్రోన్ చక్కర్లు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని మందిరం భద్రతా సర్వత్రా ఆందోళనకరంగా మారుతోంది. శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్. ఈ పరిసరాల్లో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ పని చేస్తుందని జిల్లా భద్రత, రక్షణ వర్గాలు తరచూ ప్రకటిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఇలా ఉండగా ఎప్పటికప్పుడు శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్లు చక్కర్లు కొడుతూ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్నాయి. ఇలాంటి సంఘటన ఆదివారం రాత్రి పునరావృతమైంది. దాదాపు పావు గంట (15 నిమిషాలలు) పాటు ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యం దృష్టికి వచ్చింది. శ్రీ మందిరం ప్రాకారం లోపల ఆనంద్ బజార్, స్నాన మండపం ప్రాంగణాల మీదుగా డ్రోన్ సంచారం కలవరపరిచింది. డ్రోన్ ఎక్కడి నుంచి నియంత్రిస్తున్నారో స్పష్టం కాలేదు. ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో సాధారణంగా వారాంతంలో నో–ఫ్లై జోన్లో తరచుగా డ్రోన్లు, విమానాల సంచారం తారసపడుతోంది. -
రమేశ్ హాల్బాకు ఘనంగా నివాళి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాకు చెందిన వీర జవాన్ రమేశ్ హాల్బా స్మృతి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు . జిల్లాకు చెందిన రమేశ్ హాల్బా 2007లో సీఆర్పీఎఫ్లో సిపాయిగా చేరి 2009లో జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో 29/9/2009 లో వీర మరణం పొందారు. 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలోని ఆయన విగ్రహం వద్ద సోమవారం స్మృతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరంగ్పూర్ 12 వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ కమాండర్ రాజీవ్ కుమార్ వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మంత్రివర్గం ఆమోదం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన లోక్ సేవా భవన్ సమావేశం హాల్లో సోమవారం మంత్రివర్గం సమావేశమైంది. మూడు విభాగాలకు సంబంధించి నాలుగు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజాపనుల శాఖ, పాఠశాలలు– సామూహిక విద్యాశాఖ నుంచి ఒక్కోటి చొప్పున, కార్మిక–ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం శాఖ నుంచి 2 చొప్పున మొత్తం నాలుగు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. కార్మిక చట్టాల సవరణలు, కొత్త విద్యా పథకం, కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి పీఠం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉన్నాయి. ఒడిశా దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1956 కార్ఖానాల చట్టం, 1948 సవరణలను మంత్రి మండలి ఆమోదించింది. దీనిప్రకారం రోజువారీ పని గంటలను తొమ్మి ది నుంచి 10 గంటలకు పెంచారు. వారం రోజుల గరిష్ట పరిమితి 48 గంటలుగానే కొనసాగుతుందని ప్రకటించారు. తాజా సవరణల ప్రకారం నిర్ధారిత పరిమితికి మించి పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టై మ్ వేతనాలు లభిస్తాయని ముఖ్యమంత్రితెలిపారు. మహిళా ఉద్యోగులు రాత్రి పూట విధుల్లో పాల్గొ నేందుకు వీలు కల్పించే మైలురాయి నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు లిఖితపూర్వక అనుమతిని సమర్పిస్తే, వారి భద్రతను నిర్ధారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రివర్గం అభ యం ఇచ్చింది. ‘ఒడిశాలో కార్మిక సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాలు, మతపరమైన పర్యాటకా న్ని బలోపేతం చేయడంలో ఈ నాలుగు ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకుని దైనందిన జీవ నంలో అనేక మంది ప్రజల శ్రేయస్సును నిర్ధారిస్తా యని ముఖ్యమంత్రి అన్నారు. కార్మిక చట్టాల సవరణలు.. మంత్రివర్గం తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే సంస్థలకు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈ ఎస్ఐ) చట్టం– 1948 సవరణలు వర్తిస్తాయి. గోదాబరీష్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకం ఆమోదం.. విద్యా హక్కు చట్టం, 2009కి అనుగుణంగా విద్యా రంగంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడా నికి గోదాబరిష్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకా న్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి పంచాయతీ లో కనీసం ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. అంచెలంచెలుగా ఈ నిర్ణయం వాస్తవ కార్యాచరణకు మార్గదర్శకాల్ని మంత్రివర్గం ఖరారు చేసింది. తొలి దశలో రాగల 3 సంవత్సరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 2,200 ఆదర్శ పాఠశాలలను నిర్మిస్తారు. ప్రతి పాఠశాలకు రూ.5 కోట్లకు పైగా నిధులు మంజూరవుతాయి. తొలి దశ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు ఈ పథకం కార్యాచరణ విస్తరిస్తారు. తరణి మాత ఆలయం అభివృద్ధి.. కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి మాత ఆల యం పార్శ్వ ప్రాకారం సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి వర్గం రూ.226 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది. 69 ఎకరా విస్తీర్ణంలో అభివృద్ధి పనుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన భక్తులకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 246 మందికి సౌకర్యాలతో కూడిన యా త్రికుల సత్రము మరియు సామూహిక సమావేశాల కోసం 500 సీట్ల హాల్ నిర్మాణం తదితర ప్రణాళికలను మంత్రి మండలి నిర్ధారించింది. ●దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1956లో సంస్కరణలు.. ●ఈ చట్టం 20, అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే సంస్థలకు వర్తిస్తుంది. ●రోజువారీ పని గంటలు 9 నుంచి 10 గంటలకు పెంపుదల. ●నిర్విరామంగా పని షిఫ్టుల నిడివి 6 గంటలకు పొడిగింపు. ●త్రైమాసిక ఓవర్ టైమ్ పరిమితిని 50 నుంచి 144 గంటలకు విస్తరణ. ●రోజుకు 10 గంటలు, వారానికి 48 గంటలు మించి పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైమ్ కింద రెట్టింపు వేతనాలు మంజూరు. ●సవరించిన చట్టం అధీనంలో సంస్థలు నిత్యం రాత్రింబవళ్లు సంవత్సరంలో 365 రోజులు పనిచేయడానికి అనుమతి. ●దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఒడియాలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం అనివార్యం. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రాయగడ: కుంకుమ పూజల్లో మహిళలు పర్లాకిమిడి: పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉప్పలాడ, రాణిపేట రోడ్డులో 132/33 కె.వీ లైను, గజపతి స్టేడియం వద్ద రాయగడ సర్కిల్ విద్యుత్ కేవీ లైన్ ఘనంగా నిర్వహిస్తున్నారు. అష్టమి నుంచి విజయ దశమి వరకూ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక మంది ప్రజలు సాయంత్రం పూట అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాయగడ: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం స్థానిక అటానమస్ కళాశాల, ఎస్బీఐ కూడలి, పోలీస్ మండపాల్లో అమ్మవార్లు కొలువుదీరారు. ఈ సందర్భగా ఆవాహన, షోడోపచార, హోమం తదితర పూజల అనంతరం ప్రాణప్రతిష్ట చేశారు. రాణిగుడఫారం వద్ద అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరిగాయి. సరస్వతీ దేవిగా.. రాయగడ: దసర శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం స్థానిక కస్తూరీ నగర్లో గల శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో లక్ష్మీ అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మావుడూరు కిశోర్ ఆధ్వర్యంలో పిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలాజీనగర్లో గల కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో కొలువై ఉన్న రాజ్యలక్ష్మి దేవిని సరస్వతీ రూపంలో అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజసౌధంలో.. జయపురం: దసరా సందర్భంగా జయపురం రాజ సౌధాలు ధగధగా మెరిసిపోతున్నాయి. రాజ కోటలో గల రాజుల కులదైవం కనక దుర్గా దేవిని దర్శించేందుకు, అందంగా తీర్చి దిద్దిన రాజ సౌధాలను ప్రజలు తిలకించేందుకు రాజ కోట ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచారు. జయపురం యువరాజు విశ్వేశ్వర చంద్ర చూడ్ దేవ్ తమ కులదైవం కనకదుర్గా దేవికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. శరన్నవరాత్రి కళ అదరగొట్టిన గజపతి విద్యార్థులు -
హాస్టల్ విద్యార్థి మృతి
● ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలుకొరాపుట్: హాస్టల్ విద్యార్థి మృతితో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సబ్ డివిజన్ రాయిఘర్ సమితి తురిడి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న మంగళ సింగ్ గొండో (12) మృతి చెందాడు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైనా వార్డెన్ పట్టించుకోకపోవడంతో అచేతన స్థితికి వెళ్లిపోయాడు. తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ఆర్ఎంపీ వైద్యునికి చూపించడంతో అప్పటికే పరిస్థితి విషమించింది. వెంటనే హఠబరండి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉమ్మర్కోట్ డివిజన్ ఆస్పత్రికి తరలించేటప్పటికే విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి అనారోగ్య విషయం తల్లిదండ్రులకు తెలియజేయకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర ప్రాథమిక విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గ పరిధిలోనిది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి సమితి విద్యాధికారి కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఘటన జరిగిన హాస్టల్లో రాత్రి పూట ప్యూన్ తప్ప ఎవరూ ఉండరని విద్యార్థులు పేర్కొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుబాష్ గొండొ తదితరులు ఆందోళనకు దిగారు. చివరకు ఉన్నతాధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేయించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ఆకట్టుకుంటున్న ‘పూరీ’ పెండల్
కొరాపుట్: పూరీ దివ్యధాం నమూనాలో నబరంగ్పూర్ జిల్లా పపడాహండిలో ఏర్పాటు చేసిన దసరా పెండల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏటా అవిభక్త కొరాపుట్ జిల్లాలలో అత్యంత ఖరీదైన దసరా పెండల్స్ ఏర్పాటు చేస్తుంటారు. కోల్కతా శిల్పులను రప్పించి నిర్మిస్తారు. వీటిని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. పది కిలోల గంజాయి స్వాధీనం రాయగడ: జిల్లాలోని బిసంకటక్ అబ్కారీ శాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుట్రాగుడ కూడలిలో దాడులు నిర్వహించారు. పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వారిలో బలరాం పూజారి, స్వరలీ పాత్రొ ఉన్నారు. ఫుల్బాణి జిల్లా బలిగుడకు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా వీరు పట్టుబడ్డారు. శుభేందుకు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు పర్లాకిమిడి: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని భువనేశ్వర్లోని జయదేవ్ భవన్లో ఒడిషా పర్యాటక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్లాకిమిడి మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ మాస్టర్ శుభేందు మోహన్ సేనాపతికి ఉత్తమ కొరియాగ్రాఫర్ అవార్డు లభించింది. ప్రపంచ టూరిజం దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర శాసనసభ స్పీకర్, కార్యదర్శి సురమా పాఢి చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అకుంఠిత దీక్షతో చేసిన కృషికి ఫలితం లభించిందని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అభినందించారు. ఈ సందర్భంగా శుభేందును పర్లాకిమిడిలో పలు నృత్య సంస్థలైన పదామృత న్యత్య అకాడమీ, జగన్నాథ డ్యాన్సు అకాడమీ నిర్వాహకులు అభినందించారు.రక్తదాన శిబిరానికి విశేష స్పందన జయపురం: జయపురంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి నూతన ప్రార్థన మందిరంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా హాజరై 25 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జయపురం సబ్ డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్బ్యాంక్ టెక్నీషియన్లు అభయ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ల ఆశీర్వాదం కోసం..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రుపక్ తురుక్ ఆ పార్టీ సీనియర్ల అశీర్వాదం తీసుకొనే యాత్ర ప్రారంభించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కుందిలి గ్రామంలో సంత వద్ద నివాసం ఉంటున్న మాజీ ఎంపీ జయరాం పంగి నివాసానికి వెళ్లి అతన్ని కలిశారు. పంగి సానుకూలంగా స్పందించి రుపక్ని సాధారంగా ఆహ్వానించి తన పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయని అభయమిచ్చారు. రుపక్ వెంట మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో కేవలం కొరాపుట్ ఎంపీ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో ఉంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడింట కాంగ్రెస్ గెలుపొందింది. ఈ జిల్లాలోని పొట్టంగి ఎమ్మెల్యే రాం చంద్ర ఖడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్కు కంచుకోట వంటి కొరాపుట్ జిల్లాలో ఎంతో మంది సీనియర్లని కాదని యువకుడు రుపక్ తురుక్కి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం గమనార్హం. -
‘మాస్టర్ మైండ్’ ప్రభ అరెస్ట్
● మరో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు కూడా.. అల్లిపురం (విశాఖ): కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను మహారాణిపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మహారాణిపేట పోలీస్స్టేషన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ దివాకర్ యాదవ్ ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గోమంగి గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ అలియాస్ ప్రభ గంజాయి స్మగ్లింగ్లో ప్రధాన సూత్రధారి. అతను ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి.. గోమంగి నాని బాబు, లోచలి కుమారస్వామి అనే ఇద్దరు యువకుల సహకారంతో సరఫరా చేయిస్తున్నాడు. ప్రభకు గంజాయి రవాణాలో అపార అనుభవం ఉంది. తన ఎత్తుగడలు ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తూ.. మాస్టర్మైండ్గా మారాడు. కాగా.. పాత నేరస్తుల నుంచి సేకరించిన సమాచారం, ప్రభ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శనివారం సాయంత్రం వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్ద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో టూటౌన్, పెందుర్తి, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పోలీస్ స్టేషన్లతో పాటు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లలోనూ గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. లోచలి కుమారస్వామి, గోమంగి నాని బాబులపై కూడా విశాఖ రైల్వే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ దివాకర్ యాదవ్, హెడ్ కానిస్టేబుళ్లు సురేష్, నంద కిశోర్, కానిస్టేబుల్ నాగేంద్రలను సీపీ, డీసీపీ–1, ఈస్ట్ ఏసీపీ అభినందించారు. భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిద్దాం జయపురం: దసమంతపూర్లో విప్లవ వీరుడు సహిద్ భగత్ సింగ్ జయంతిని ఆదివారం నిర్వహించారు. అఖిల భారత యువ సంఘం కొరాపుట్ జిల్లా శాఖ అధ్యక్షుడు కుమార్ జాని నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాని మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు భగత్ సింగ్ ధైర్య సాహసాలతో పోరాటం చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరిబందు నాయక్, సత్య పొరజ, భానుమతి, బొబిత ముదులి, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వమే మేలు
భువనేశ్వర్: వివాదాస్పద పరిస్థితుల్లో న్యాయమైన, స్నేహపూర్వక, శాశ్వత పరిష్కారాలకు మధ్యవర్తిత్వమే అత్యున్నత మార్గమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ద్వితీయ జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం – 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిమిత వ్యక్తులు, వర్గాల మధ్య పరిమితం కావలసిన వివాదాలు కోర్టు వరకు పోకుండా గుట్టుగా పరిష్కరించుకుని సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడానికి మధ్యవర్తిత్వం ముఖ్యమైన సాధనమని పేర్కొన్నారు. కోర్టుల్లో వివాదాలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా సంబంధాలను మెరుగుపరిచి పునరుద్ధరించే చక్కని సంస్కరణ ప్రక్రియగా అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా పలు న్యాయ స్థానాల్లో 4 కోట్లకు పైగా కేసులు మగ్గుతున్నాయని, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి మధ్యవర్తిత్వం అనివార్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వ చట్టం – 2023 చట్టబద్ధమైన అమలుతో ఆచరణకు నోచుకోవడం భారత న్యాయవ్యవస్థలో మైలురాయి దశగా నిలిచిపోయిందన్నారు. బలహీన వర్గాలకు, సమ్మిళితత్వం, న్యాయబద్ధత, ప్రజా విశ్వాసాన్ని నిర్ధారించడంలో ఈ ఆచరణ ప్రయోజనాత్మక చర్యగా కొనసాగాలని పిలుపునిచ్చారు. ● భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అత్యంత వేగవంతమైన వివాద పరిష్కార వేదికగా, ఊపందుకుంటున్న వ్యవస్థగా పేర్కొన్నారు. వాదోపవాదాలతో కూడిన ఇరుపక్షాల మధ్య గెలుపు, ఓటమి అతీతంగా సంభాషణ, అవగాహన, పరస్పర సహకారంతో వివాద పరిష్కారాలకు పూర్తి అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకు పలు అనుభవపూర్వక చారిత్రాత్మక సంఘటనలు అద్దం పడుతున్నాయని చెప్పారు. ● భారతదేశ రాజకీయ, సామాజిక అనుభవాలకు మధ్యవర్తిత్వం కొత్తేమీ కాదన్నారు. మధ్యవర్తిత్వ చట్టం, 2023 కింద అధికారిక క్రోడీకరణకు ముందే మన ప్రక్రియలలో అంతర్భాగంగా కీలక పాత్ర పోషించిందన్నారు. ● ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి మాట్లాడుతూ పలు న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కోట్లాది కేసుల విచారణతో న్యాయమూర్తులు, న్యాయవాదులు సతమతమై అపారమైన ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం చక్కని పరిష్కారం అందిస్తుందన్నారు. ఈ చర్యతో కోర్టులపైనా ఒత్తిడి తగ్గి ప్రజలు త్వరగా, సులభంగా న్యాయం పొందుతారని చెప్పారు. మధ్యవర్తిత్వం సంబంధాల పునరుద్ధరణతో కుటుంబాలు, వ్యాపారాలు, సామాజిక వర్గాల్లో సామరస్యాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ● ఒరిస్సా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టాండన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ప్రోత్సహించి సమాజంలో ఉనికిని నిర్ధారించుకుని వేగవంతమైన వివాద పరిష్కార మాధ్యమంగా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుందన్నారు. ● సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం శాశ్వత పరిష్కారాలను పెంపొందిస్తుందన్నారు. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ అన్ని జాతీయ న్యాయ పాఠశాలల్లో మధ్యవర్తిత్వంపై పూర్తి స్థాయి కోర్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య, ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానస్ రంజన్ పాఠక్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానిక చక్కటి వేదిక జాతీయ మధ్యవర్తిత్వ సమావేశంలో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -
● చండీ రూపంలో అమ్మవారు
రాయగడ: దసర శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు చండీ రూపంలో ఆదివారం భక్తులకు దర్శనం ఇచ్చారు. స్థానిక కస్తూరీనగర్లోని సత్యనారాయణ ఆలయం ప్రాంగణంలో లక్ష్మీ అమ్మవారిని చండీరూపంలో అలంకరించారు. అర్చకులు మావుడూరు కిశోర్ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. స్థానిక రాణిగుడ ఫారంలో అమ్మవారి పూజల్లో భాగంగా దీపాలంకరణ ఆకర్షించింది. అదేవిధంగా ఎరుపురంగు గల ఢలియాలతో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రులు సందర్భంగా మజ్జిగౌరి అమ్మవారు సునాబేసొలు దర్శనం ఇస్తుండటంతో ఆదివారం తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో మందిరం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. -
దసరా సెలవులకు ఇంటికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలొ విద్యార్థి దుర్మరణం ● స్వల్ప గాయాలతో బయటపడిన సోదరుడురాయగడ : పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకురుగుడ కూడలిలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాసీపూర్ సమితి సింధూరఘాటి పంచాయతీ డెరకొన గ్రామానికి చెందిన రాహుల్ నాయక్ (14) పెనికొన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ప్రకటించడంతో సోదరుడు లోచన్ నాయక్తో కలిసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. బాకురుగుడ వద్ద ఎదురుగా వస్తున్న లారీని అదుపుతప్పి ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న రాహుల్ కిందపడ్డాడు. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం కిందపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లోచన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒడిశాకు వరాల జల్లు
భువనేశ్వర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర రైల్వే రంగానికి వరాల జల్లు కురిపించారు. ఝార్సుగుడలో శనివారం అట్టహాసంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.1,700 కోట్ల పైబడి విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్ దేవ్, కేంద్ర మంత్రి జుయెల్ ఓరాం, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్కుమార్ పూజారి తదితరులు పాల్గొన్నారు. అమృత్భారత్ ప్రారంభం.. గుజరాత్లోని సూరత్ (ఉధ్నా), రాష్ట్రంలో గంజాం జిల్లా బరంపురం మధ్య అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలుసేవలను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ప్రధానంగా ఇరు రాష్ట్రాల్లో కార్మిక వర్గాలకు ఈ రైలు సేవలు దోహదపడతాయని గంజాం జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు తర్వాత బరంపురం రైల్వే రంగంలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంటోంది. అందుకు తార్కాణంగా గుజరాత్, గంజాం జిల్లా మధ్య ప్రత్యక్ష అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. బరంపురం – సూరత్ (ఉధ్నా) అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలతో రాష్ట్రంలో గంజాం, రాయగడ, కలహండి, బొలంగీరు, నువాపడా, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఛత్తీస్గడ్లో మహాసముంద్, రాయ్పూర్, దుర్గ్, మహారాష్ట్రలో గోండియా, నాగ్పూర్, వార్దా, అమరావతి, అకోలా, బుల్ధానా, జలగాంవ్, ధూలే, నందర్బార్, గుజరాత్లో సూరత్ జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ●రూ. 273 కోట్లు వ్యయ ప్రణాళికతో సంబల్పూర్, సర్లా మధ్య రైలు ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణం సర్లా స్టేషన్ వద్ద రద్దీని తొలగించి రద్దీగా ఉండే సంబల్పూర్ – ఝార్సుగుడ మార్గంలో రైళ్ల నిరంతర కదలికతో బొగ్గు, ఖనిజ, పారిశ్రామిక సరుకు రవాణాకు మార్గం సుగమం చేయనుందని, పారిశ్రామిక విస్తరణతో ముడిపడిన ఆర్థిక పురోగతి గణనీయంగా ఊపందుకుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ● కొరాపుట్ – బైగూడ మార్గంలో రూ. 481 కోట్ల వ్యయంతో 34 కిలోమీటర్ల పొడవున డబ్లింగు ప్రాజెక్టుని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మార్గంలో ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపును సులభతరం అవుతుంది. కొరాపుట్ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది. ● మనబార్ – కొరాపుట్ – గోరాపూర్ మార్గంలో రైలు మార్గం రెట్టింపు రూ. 955 కోట్ల విలువైన 82 కిలోమీటర్ల పొడవైన డబ్లింగు ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుతో బైలాడిల్లా గనులు, దేశ వ్యాప్తంగా ఉక్కు కార్ఖానాలకు ఇనుప ఖనిజం రవాణా వేగవంతమై బహుముఖ అభివృద్ధికి దోహదపడుతుంది. కొరాపుట్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) జిల్లాల్లో ప్రయాణికుల, సరుకు రవాణా రంగంలో రైలు సేవలు మెరుగుపడతాయి. -
మందుగుండు సామగ్రి స్వాధీనం
కొరాపుట్: అక్రమంగా నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని నబరంగ్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్ఐ గణేష్ పట్నాయక్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. బి.సూరజ్, వి.ఉమాశంకరరావు, కె.శ్రీధర్లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మందుగుండు సామగ్రిని సీజ్ చేశామన్నారు. ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు కొరాపుట్ : కేవుటి వీధిలో జరుగుతున్న పేకాట శిబిరంపై నబరంగ్పూర్ పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి రూ.35,260 నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్సాహంగా క్విజ్ పోటీలు రాయగడ : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాయగడ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. చదువుతో పాటు సామాజియ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి, జిల్లా పర్యాటక శాఖ అధికారి మనోజ్కుమార్ నాహక్ పాల్గొన్నారు. మహిళపై దాడి రాయగడ: గుర్తు తెలియని ఇద్దరు దుండగులు మహిళపై దాడి చేసి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెతాడును తెంపుకొని వెళ్లిపోయిన ఘటన శనివారం స్థానిక మజ్జివీధి కూడలిలొ చోటు చేసుకుంది. కేసీసీబీ రోడ్డు సమీపంలో నివసిస్తున్న నారంశెట్టి జగదాంబ ఉదయం మజ్జివీధి సమీపంలోని కిరాణా దుకాణానికి పాలు ప్యాకెట్ కొనేందుకు వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు దుండగులు ముందుగా మజ్జివీధి కూడలిలో కాపుకాసి ఆమెను అనుసరించి వెనుక నుంచి కర్రతో ఆమె తలపై గాయపరిచి కిందపడిన తరువాత మెడలోని పుస్తెల తాడును తెంపుకువెళ్లిపొయారు. గాయాలతో పడిపోయి ఉన్న ఆమెను చూసిన స్థానికులు కుటుంబీకులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం సదరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పట్టపగలే ఇటువంటి దొంగతనాలు చోటు చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటీఈటీకి 2,259 మంది హాజరు రాయగడ: రాష్ట్ర మాధ్యమిక విద్యా పరిషత్ శనివారం నిర్వహించిన ఒడిశా టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఓటీఈటీ)కు రాయగడ జిల్లా నుంచి 2259 మంది అభ్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లాలో 2365 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 106 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో పేపర్–1కి 41 మంది, పేపర్–2కు 65 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించిన మొదటి పరీక్షలు ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది జూలై 20న జరిగిన ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ కావడంతో రద్దు చేసిన విషయం తెలిసిందే. -
మహిళా కళాశాలలో ఆరోగ్య శిబిరం
పర్లాకిమిడి: స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నారీ ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని శిబిరాన్ని అధ్యక్షురాలు డాక్టర్ రీనా సాహు ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ అధికారులు శనివారం నిర్వహించారు. స్వస్థ్య నారీ..స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో విశ్రాంత అధ్యక్షురాలు డాక్టర్ భారతీ పాణిగ్రాహి, జిల్లా మెడికల్ శాఖ తరఫున వి.లక్ష్మీకుమారి పట్నాయక్, సంతోషీకుమారీ జెన్నా తదితరులు విద్యార్థినులకు రక్తపరీక్షలు జరిపారు. కార్యక్రమాన్ని రెడ్క్రాస్ అధికారి, క్రిష్ణ చంద్ర గజపతి కళాశాల అధ్యాపకులు కృష్ణచంద్ర పండిట్ పర్యవేక్షించగా, మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పాలన భేష్
భువనేశ్వర్: ఒక రోజు రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని శనివారం ఝార్సుగుడలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పట్ల గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రధానికి స్వాగతం పలికారు. వీరివురి పట్ల ప్రధాని ఆత్మీయతను ప్రదర్శించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర గవర్నర్ పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన చేరదీయడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇదే ప్రేరణతో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రజాభిమాన నేతగా మన్ననలు పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రభుత్వం సరికొత్త చరిత్రని ఆవిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నింటా ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. మోహన్ చరణ్ మాఝీ ప్రజాభిమాన (లోకప్రియ), నిబద్ధతతో కష్టపడి పనిచేసే (కర్మథ) ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. విపక్షంపై నో కామెంట్.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం బిజూ జనతా దళ్ నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తూ కించపరుస్తుండగా ఝార్సుగుడ బహిరంగ సభా కార్యక్రమంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ పట్ల స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శస్త్రచికిత్స సందర్భంగా ఆప్యాయంగా పరామర్శించి బాగోగుల్ని పర్యవేక్షించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పాలన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య బేదాభిప్రాయాలు భగ్గుమంటున్న తరుణంలో ప్రధాన మంత్రి బిజూ జనతా దళ్ పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాతనం చాటుకున్నారు. మరో వైపు ప్రధాన మంత్రి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీ తంత్రంతో దేశాన్ని నిలువునా కొల్లగొట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
మిషన్ శక్తి సిబ్బంది ధర్నా
పర్లాకిమిడి: మిషన్ శక్తి కమ్యూనిటీ సపోర్టు సిబ్బంది ఽసి.ఆర్.పి, ఎం.బి.కె, కృషిమిత్ర, ప్రాణమిత్ర, బ్యాంకు మిత్ర, క్యాడర్ల కింద సేవలు అందిస్తున్న మహిళా సంఘం సభ్యులు శనివారం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిషన్ శక్తి సంఘం అధ్యక్షురాలు సంయుక్తా ప్రధాన్ మాట్లాడుతూ మహిళా కార్యకర్తలకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర మిషన్ శక్తి సంఘం ఆదేశాల మేరకు ఆరు రోజులుగా రాయఘడ బ్లాక్ ఎదుట ధర్నా చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. మిషన్ శక్తి సపోర్టు సిబ్బందికి ఆరు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్యకర్తల జీతం బ్యాంకు ఖాతాల్లో జమ చేసి, ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం రాయగడ బి.డి.ఓ. సుశాంత్ కుమార్ ప్రధాన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన స్పందిస్తూ మిషన్ శక్తి విభాగం నుంచి జీతభత్యాల విషయమై ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. -
39 కిలోల గంజాయి పట్టివేత
పర్లాకిమిడి: ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన వేర్వేరు దాడుల్లో 39 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్.ఉదయగిరి బ్లాక్ మర్లబ గ్రామం వద్ద పోలీసులు దాడులు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు బోలేరో వాహనంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మూడు బస్తాల్లోఉన్న 39 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వారిలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం హుగీ జిల్లాకు చెందిన కమల్ ఉద్దీనీ, మోహానా బ్లాక్ శికులిపదర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అబ్కారీ శాఖ సదర్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ పటేల్ తెలియజేశారు. మరో గంజాయి కేసును ఆర్.ఉదయగిరి పరిసర గ్రామం వద్ద మహామ్మద్ సంసద్ అన్సారీ వాహనం కోసం ఎదురుచూస్తుండగా మొబైల్ అబ్కారీ టీంకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ఒక బ్యాగులో తరలించేందుకు ఉంచిన గంజాయితో పట్టుబడినట్టు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ మొన్ను ఆయాల్ తెలిపారు. నిందితులు ముగ్గుర్ని శనివారం జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. దాడుల్లో ఎకై ్సజ్ శాఖ మొబైల్ ఎస్సై కె.బాలజీరావు, ఏఎస్సైలు నీలాంబర్ నాయక్, బిజయానంద బెహారా ఉన్నారు. కలిమెల సమితిలో 40 కిలోలు.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి 40 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. బేజాంగ్వాడ రహదారి కలువ వద్ద శుక్రవారం రాత్రి కలిమెల ఎకై ్సజ్ పోలీసు ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ సామల్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ పికాప్ వాహనం అతివేగంగా రవడంతో దాన్ని అపి ప్రశ్నించగా అందులో ఉన్నవారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అనూమానంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. రెండు బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి అరెస్టు చేసి కలిమెల ఎకై ్సజ్ పోలీసుస్టేషన్కు తరలించారు. శనివారం పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 40 కిలోలు ఉందని.. దీని విలువ రూ. 3.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో మోటు గ్రామ మాజీ సర్పంచ్ మున్న సోడి, పుసుగూఢ గ్రామానికి చెందిన ఆశిష్ సాల్బాం ఉన్నారన్నారు. వీరిపై కేసునమోదు చేసి కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు -
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్పై వర్క్షాప్
జయపురం: తర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ సభాగృహంలో వర్క్షాప్ నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్త్లుకు మార్కెటింగ్ సౌకర్యం, జాతీయ సహకార డెవలప్మెంట్ కార్పొరేషన్, సహకార సమితిల ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ ణణాలు సౌకర్యం సమకూర్చటం పైన చర్చించారు. క్షేత్ర స్థాయి నుంచి రైతులకు సహకార బ్యాంక్లు సేవలు చేర్చేందుకు అక్టోబర్ నుంచి జిల్లాలో మరో రెండు బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డ్ సీడీఎం ఎస్.కె.తలుక్దార్ వెల్లడించారు. వర్క్షాపులో కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి, కొరాపుట్ సహకార సంస్థల డిప్యూటీ డైరెక్టర్ మోనిక రాయ్, కార్యదర్శి హరిశ్చంద్ర బొనాగడి, నాబార్డ్ డీజీఎం దేవేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. -
నూతన డీసీసీ అధ్యక్షులకు అభినందనలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో నూతనంగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుల నియామకంపై అభినందనలు వెల్లువెత్తాయి. కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు రూపక్ తురుక్ని జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు రామచంద్ర ఖడం శనివారం అభినందించారు. నబరంగ్పూర్ జిల్లా నుంచి జిల్లా పరిషత్ సభ్యురాలు డాక్టర్ లిఫికా మజ్జి డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమె మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జి కుమార్తె. నబరంగ్పూర్ జిల్లాలో 26 జెడ్పీ స్థానాలకు లిఫికా ఒక్కరే కాంగ్రెస్ నుంచి గెలిపొందారు. ఈ విడత రెండు జిల్లాల్లో యువతకే అధ్యక్ష పదవులు దక్కాయి. వీరిద్దరి ఎంపీక వెనుక కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ముద్ర ఉందని కాంగ్రెస్ అభిమానులు పేర్కొంటున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధరణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు గోవింద పాత్రో అధ్యక్షతన నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావును శనివారం సత్కరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. -
కూలిన సేవా పేపరుమిల్లు బెల్ట్
జయపురం: జయపురం గగణాపూర్లోని సేవా పేపరుమిల్లు బొగ్గు రావాణా చేసే బెల్ట్(కన్వేయర్ బెల్ట్) కూలిపడింది. రెండు రోజుల కిందట జరిగిన సంఘటన శనివారం వెలుగులోనికి వచ్చింది. కన్వేయర్ బెల్టు సుమారు 40 అడుగుల పైనుంచి పడిందని.. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేక పోవటంతో పెను ప్రమాదం తప్పింది. సేవా పేపరుమిల్లులో గత 14 నెలలుగా ఉత్పత్తి ఆగిపోయిందని అందువలన మిల్లు మూతపడటంతో మిల్లు రక్షణ పర్యవేక్షణ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేపరుమిల్లు కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి ఆరోపించారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చర్ గత కొన్నేళ్లుగా శిధిలావస్తలో ఉందని యాజమాన్యం దృష్టికేంఽధ్రీకరించలేదని ఆయన ఆరోపించారు. 2020 ఆగస్టు 8 వ తేదీన కురిసిన కుండ పోత వర్షాల కారణంగా మిల్లులో పెద్ద పైకప్పు కూలిపడిందని ఆయన గుర్తు చేసారు. మిల్లు ఇలా శిధిల మౌతున్నా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్య బట్టారు. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా చెల్లించటంలేదని, గత 14 నెలలుగా కార్మికులకు జీతాలో చేల్లించలేదని మహంతి ఆరోపించారు.జీతాలు లభించక పోయిన కొంతమంది జీతాలు వస్తాయన్న ఆశతో డ్యూటీకి వెలుతున్నారని ఆయన వెల్లడించారు.ఆగస్టు నెల నుండి మిల్లునడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినా నేటికీ ఆయన వాగ్దానం కార్యరూపం దాల్చలేదని మహంతి విమర్శించారు. మిల్లు థాపర్ గ్రూపు నుండి మధర్ అర్ధ , ప్రస్తుతం మరో కంపెనీ ఇలా యాజమాన్యం మారుతున్న సమస్య ఎచ్చటేసిన గొంగలి లాగనే ఉందని విమర్షించారు.ఇటువంటి పరిస్థిలతిలో రోజురోజుకు మిల్లు దుర్బళ స్థితికి చేరుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.జయపురంలో ఉన్న ఏకై క ఫ్యాక్టరీ సేవా పేపరుమిల్లు అని అధోగతి స్థితికి చేరుకుంటున్నదని.. ఇప్పటికై నా మిల్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
● 134 కేసుల్లో 106 మంది అరెస్టు ● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: సోషల్ మీడియాలో అసత్య ప్రచా రాలు చేస్తూ, మహిళలను అగౌరవపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై గట్టి నిఘా పెట్టామని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. రేంజి పరిధిలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీలతో వర్చువల్గా సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. పోస్టులు మితిమీరుతుండడంతో ప్రతీ జిల్లాలో పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక బృందాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని గుర్తించాలన్నారు. వారు పెట్టిన పోస్టు ఏ కేటగిరీకి వస్తుంది.. వారిపై ఎటువంటి చర్యలు చేపట్టార న్న అంశాలపై రోజువారి నివేదిక తనకు పంపాల ని అధికారులను ఆదేశించారు. గుర్తించిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారికి సహకరిస్తున్న వ్యక్తుల ను వ్యవస్థీకృత నేరమునకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు. 106 మంది అరెస్టు రేంజి పరిధిలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 134 మందిపై కేసులు నమోదు చేసి, 106 మందిని అరె స్టు చేశామని, 57 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ ప్రారంభమైందన్నారు. డీఎస్పీ లు వారి పరిధి స్టేషన్లలో ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అభ్యంతరకర పోస్టు లు పెడుతున్న వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరన్నది స్పష్టం చేయాలన్నారు. -
సైకో ఎవరనేది ప్రజలకు తెలుసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిండు శాసనసభలో పద్ధతి లేకుండా జేబులో చెయ్యిపెట్టుకుని, కళ్లద్దాలు నెత్తిన పెట్టుకుని సభా సంప్రదాయాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బాలకృష్ణ సైకోనా.. పద్ధతిగా ఉండే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైకోనా అనేది ప్రజలందరికి తెలుసునని మాజీ శాసన సభాపతి, శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలో శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గతంలో బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరిపిన బాలకృష్ణను కాపాడింది ఆనాటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనే హక్కు వారికి లేదన్నారు. సినీ పరిశ్రమ, సినిమా హీరోలకు జగన్మోహన్రెడ్డి అంటే చాలా అభిమానం ఉందన్నారు. కరోనా సమయంలో చిరంజీవి, సినిమా హీరోలంతా కలుస్తామని అడిగితే అన్ని రకాల మర్యాదలతో కలిసి సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించింది జగన్ అని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి సైకో అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ పూర్తిగా మెంటలైపోయాడేమేనని అనిపిస్తుందన్నారు. కరోనా నిబంధనల మేరకే ఐదుగురికి అవకాశం ఇస్తే చాలదు అంటే 10 మందికి అవకాశం కల్పించి విందు ఇచ్చి మరి మర్యాద చేశారని చెప్పారు. బాలకృష్ణ ఏ రకమైన సైకోనో నాకు బాగా తెలుసునని, టీడీపీలో చాలాకాలం ప్రయాణం చేశానన్నారు. బాలకృష్ణకు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవడ్రా.. అని నోటికొచ్చినట్లు పిచ్చోడిలా మాట్లాడతాడని అన్నారు. వైఎస్సార్ దయాదాక్షణ్యాలతో బతుకుతున్నావన్న విష యం మరిచిపోకూడదన్నారు. పవన్, చిరంజీవి ఫ్యామిలీలతో బాలకృష్ణకు ఏమైనా పొరపొచ్చాలుంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప జగన్పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. బాలకృష్ణ తీరు మార్చుకోకుంటే వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో ఉన్న గంగమ్మ తల్లి గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త ముత్తా సింహాచలం తెలిపారు. గంగమ్మ తల్లి విగ్రహం మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారు శతుమానం, మూడు గ్రాముల వెండితో ఉన్న మట్టెలను దోచుకెళ్లారని తెలిపారు. అలాగే హుండీని ఎత్తుకుపోయారన్నారు. హుండీలో రూ.20 వేల వరకూ నగదు, కొన్ని వెండి వస్తువులు ఉంటాయని వివరించారు. ప్రతిఏటా నవంబర్ నెలలో హుండీ లెక్కించి వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తామని, ఇంతలో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
వ్యాపారస్తులు ముందుకు రావాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ధరలు తగ్గించేందుకు వ్యాపారస్తులు వాలంటీర్గా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జీఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారస్తులతో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మెడికల్, ఆటోమొబైల్స్, వ్యవసాయానికి సంబంధించి యంత్రాలు, ఎరువులు, ప్యాకింగ్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్పై తగ్గింపులు వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల వద్ద డబ్బులు ఉంటే మరింతగా వ్యాపారాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు షాపుల వద్ద పాత ధరలు, కొత్త ధరల బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉన్న అనుమానాలను జీఎస్టీ నోడల్ అధికారి నివృత్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ జీఎస్టీ అధికారి చంద్రకళ, కాశీబుగ్గ, నరసన్నపేట, ఆమదాలవలస అసిస్టెంట్ జీఎస్టీ అధికారులు, బంగారం వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్, హోటల్స్, కిరాణా, ఆటోమొబైల్స్, సిమెంటు తదితరులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధుల మంజూరు
పర్లాకిమిడి: స్థానిక బృందావన్ ప్యాలస్లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జిల్లా అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా అదనపు మాజిస్ట్రేట్ ఫల్గుణి మఝి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్చార్జి పర్యాటక అధికారి అరుణ్కుమార్ త్రిపాఠి, ప్రమోద్ పాడీ, అంజనా పట్నాయక్ హాజరయ్యారు. జిల్లాలో ప్రసిద్ధ మహేంద్రగిరి, గండాహతి, గుద్ గుదా, ఖసడా జలపాతాల వద్ద ప్లాస్టిక్ కవర్లు, సీసాలు పడవేయకుండా పరిశుభ్రత పాటించాలని ఏడీఎం అన్నారు. జిల్లాలో చంద్రగిరి బౌద్ధరామాలు, బృందావన్ ప్యాలస్, గండాహతి, మహేంద్రగిరి అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే టూరిజం రిసార్టులు, నక్షత్ర హోటళ్లు నిర్మించనున్నారని పర్యాటక అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి అన్నారు. విద్యార్థులకు ‘పర్యాటకం, స్థిరమైన అభివృద్ధి’ అనే అంశంపై క్విజ్ పోటీలను నిర్వహించారు. విజేతలకు ఏడీఎం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ సిబ్బంది సుధీర్ కుమార్ హోత్త, బిచిత్రానంద బెబర్తా సహకరించారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ కి ఇన్చార్జి ఈఈ ఉన్నటువంటి తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రమోద్కు మార్ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిసింది. విశాఖపట్నంలోని ఇదే విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా పనిచేస్తున్న ఆయనను ఈనెల 1వ తేదీన ఇన్చార్జి ఈఈగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికీ.. తరచూ సెలవు పెడుతూ వస్తున్నారు. ఐదు రోజుల క్రితం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలవు పెట్టిన ప్రమోద్ కుమార్ శనివారం ప్రధాన కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై సంప్రదించగా ఆయన అందుబా టులోకి రాలేదు. డీఈఈ సిమ్మన్న వద్ద ప్రస్తా వించగా లేఖ రాసిన విషయం తెలిసిందని, అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించుకోవాల్సి ఉందని తెలిపారు. నరసన్నపేట: మండలంలోని కంబకాయకు చెంది న కెల్ల రాజారావు(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం గడ్డి మందు తాగడంతో కుటుంబసభ్యులు గమనించి నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందు తూ శనివారం ఉదయం మరణించినట్లు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సరుబుజ్జిలి మండలం చిగురువలసకు చెందిన రాజారావు కంబకాయకు చెందిన రామలక్ష్మిని వివాహం చేసుకొని ఇక్కడే ఇల్లరి కం ఉంటున్నారు. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం వీరిద్దరూ ఘర్షణ పడగా, భార్య రామలక్ష్మ రాజారావును మందలించింది. దీనిని తట్టుకోలేక రాజారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాజారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమదాలవలస: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత ముఖ్యమ ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన బెర్హంపూర్ – సూరత్ (ఉద్నా) అమృత్ భారత్ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్ భారత్ రైలు దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్నారు. శ్రీకాకుళం, పలాసలో రెండు హాల్ట్లు ఇచ్చినట్లు తెలిపారు. విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలి త్ బొహ్రా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షుడు శివ్వల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్దానం ప్రజలకు వరం పలాస: బరంపురం నుంచి సూరత్ వెళ్లే అమృత్ భారత్ రైలు ఉద్దానం ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ఖుర్ధా ఏఆర్డీఎం ప్రమోదకుమార్ బెహరా అన్నారు. పలాస రైల్వేస్టేషన్లో రైలు స్వాగత కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సూరత్, కాండ్ల, గుజరాత్, రాయపూర్, బిలాయ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, వారికి ఈ రైలు చాలా ఉపయోగమన్నారు. కార్యక్రమంలో డీసీఎం సుక్రాంబరో, పలాస రైల్వే మేనేజర్ ఎస్కే దాసు, పలాస – కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదా.. ఆదాయం డబుల్
ఝార్సుగూడ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా లూటీ జరిగిందని, జనం సొమ్మును ఆ పార్టీ దోచుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల నుంచి కూడా భారీగా పన్నులు వసూలు చేసిందని ఆరోపించారు. లూటీ సంస్కృతి నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో పర్యటించారు. రూ.50 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘అంత్యోదయ గృహ యోజన’ కింద 50 వేల మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఝార్సుగూడ్లో ‘నమో యువ సమావేశ్’లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను తొలగించడంతోపాటు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బచత్(ఆదా), డబుల్ కమాయి(ఆదాయం) కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో రూ.2 లక్షల ఆదాయంపైనా పన్ను విధించారని గుర్తుచేశారు. అప్పటి పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని చెప్పారు. ఆదాయం పెంచుకొని, డబ్బులు ఆదాయ చేసుకొనే కొత్త శకం ఇప్పుడు ఆరంభమైందన్నారు. గతంలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో రూ.25 వేల పన్నులే ఉండేవని, ఇప్పుడు ఆ పన్నులు రూ.5 వేలకు పడిపోయాయని తెలిపారు. అంటే ప్రజలకు రూ.20 వేలు ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు. VIDEO | Odisha: Addressing a public gathering in Jharsuguda, Prime Minister Narendra Modi (@narendramodi) says, "From today, we will witness a new avatar of BSNL with the launch of its Swadeshi 4G services. The expansion of IITs in different parts of the country has also begun… pic.twitter.com/VeWwbdAYlp— Press Trust of India (@PTI_News) September 27, 2025చిప్ నుంచి షిప్ దాకా... తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో రైతులు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని ప్రధానమంత్రి ఆనందం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్ కొంటే పన్ను కింద రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.40 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. వ్యవసాయ పరికారాల ధరలు భారీగా తగ్గిపోయానని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చాలన్నదే తమ ధ్యేయమని ప్రకటించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడంతో ఒడిశా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పేదరికానికి మారుపేరైన ఒడిశా ఇప్పుడు సౌభాగ్యవంతంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకతను ప్రధానమంత్రి వివరించారు. చిప్ నుంచి షిప్ దాకా అన్నింటికా మనం స్వయం సమృద్ధి సాధించాలని, అదే మన సంకల్పమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 📡LIVE Now 📡Prime Minister @narendramodi lays foundation stone, inaugurates development works in Jharsuguda, #OdishaWatch on #PIB's 📺➡️Facebook: https://t.co/ykJcYlNrjj➡️YouTube: https://t.co/RPPyBdj887https://t.co/kXZ9QMhxdE— PIB India (@PIB_India) September 27, 2025రూ.11 వేల కోట్లతో 8 ఐఐటీల విస్తరణ ఒడిశాలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇందులో టెలికమ్యూనికేషన్లు, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.11 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీల విస్తరణకు మోదీ శంకుస్థాపన చేశారు. ఐఐటీ–భువనేశ్వర్ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో నాణ్యత పెంచడానికి ‘మెరిట్’ పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా నుంచి గుజరాత్కు ప్రయాణించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. -
● ఎన్సీసీ కేడెట్లకు సత్కారం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు బాలికల ఎన్సీసీ కేడెట్లు, పీవోను శుక్రవారం అధికారులు సత్కరించారు. విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ఎన్సీసీ అధికారి సంతోషినీ ముండ, కేడెట్లు స్వాతీ జాని, నగమ నిగోర్, శక్తిశ్రీయ పట్నాయక్లు న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత స్థాయి సేవా క్యాంప్లో పాల్గొన్నారు. వీరు రాష్ట్ర రాజధానిలో మూడు నెలలు శిక్షణపొంది ఒడిశా తరఫున న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయిలో జరిగిన శిబిరంలో పాల్గొని ప్రతిభకనబర్చారు. ఈ సందర్భంగా వారిని విక్రమదేవ్ విశవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయిక్ తదితరులు అభినందించి సత్కరించారు. -
పస్తులతో జీవనం
కొన్ని రోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగ డం లేదు. తరుచూ తుఫాన్ లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ సమయంలో రోజుల తరబ డి వేట సాగకపోతుండడంతో జీవనం కష్టతరంగా ఉంటోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా వాయుగుండాలు, తుఫాన్లు వస్తుండడంతో బోట్లు, వలలు భద్రపర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. – పుక్కళ్ల తవిటయ్య, మత్స్యకారుడు, బందరువానిపేట -
పోక్సో కేసు నమోదు
కవిటి: మండలంలోని ఆర్.బెలగాం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న అభియోగంపై శావసానపుట్టుగకు చెందిన విశ్వనాథంపై పోక్సో కేసు గురువారం నమోదు చేసినట్లు కవిటి ఎస్ఐ వి.రవివర్మ శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస రూరల్: మండలంలోని తొగరాం గ్రామం వద్ద ఇసుక లారీ వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాతూరు ఇసుక ర్యాంపు నుంచి అధిక బరువుతో వచ్చిన లారీ రహదారికి అడ్డంగా ఆగిపోయింది. దీంతో ఇరువైపుల నుంచి వచ్చిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటలపాటు బస్సులు, ఆటోలతో పాటు అనేక భారీ వాహనాలు నిలిచిపోవడంతో అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ప్రాంతీయ పర్యావరణాధికారి(ఆర్ఐఓ)గా రేగ సురేష్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ /సెక్రెటరీ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య డీవీఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్ఐఓగా పనిచేసిన ప్రగడ దుర్గారావు ఈ నెలతో ఉద్యోగ విరమణ చేయనుండటంతో డీవీఈవో సురేష్కుమార్కు బాధ్యతలు అప్పగించారు. -
● క్రీడాస్ఫూర్తితో మెలగాలి
రాయగడ: క్రీడాకారులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే అందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పాటు క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్చంద్ర నాయక్ అన్నారు. స్థానిక బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాయగడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంబోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎఫ్ఒ అన్నాసాహెబ్, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్, జేకేపేపర్ మిల్ సీఎస్ఆర్ స్మతిరేఖ కొరొ, రాయగడ జిల్లా బ్యాడ్మింటన్ అసొసియేషన్ అధ్యక్షుడు హిమాంశు శేఖర్ పండియా తదితరులు పాల్గొన్నారు. -
పుస్తెల తాళ్లు చోరీ
పాతపట్నం: మండలంలోని పాశీగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో ఇంట్లోని నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు మెడల్లో నాలుగు తులాల బంగారం పుస్తెల తాళ్లు చోరీకి గురయ్యాయని ఎస్ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట గ్రామానికి చెందిన గంగు రాము, అతని భార్య గంగు లక్ష్మి అలియాస్ మీరమ్మలు గురువారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారం పుస్తెల తాడును చోరీ చేశాడు. అలాగే చంద్రపే ట గ్రామానికి చెందిన మొర్రి వెంకటరమణ, అతని భార్య మొర్రి పద్మవతిలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనూ మెడలోని రెండు తులాల బంగారం పుస్తలతాడు చోరి జరిగినట్లు తెలిపారు. రెండు చోరీలపై కేసు నమోదు చేశారు. బంగారం దుకాణంలో చోరి రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీవిజయదుర్గా బంగారు నగల దుకాణంలో శుక్రవారం మధ్యా హ్నం చోరీ జరిగింది. బంగారు వస్తువులతో పాటు గా వెండి వస్తువులను అపహరించారు. కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి కృష్ణ బుడుమూరులో బంగారం దుకాణం నడుపుతున్నాడు. షాపునకు శుక్రవారం మధ్యా హ్నం గుర్తు తెలియని ముగ్గురు మహిళలు నగలు కొనుగోలుకు చేసేందుకు వచ్చారు. యజమానిని మాటల్లో పెట్టి బేరమాడారు. అనంతరం కొనుగో లు చేయకుండానే వెనుదిరిగారు. వారు షాపు విడి చి వెళ్లగా సీసీ పుటేజీ పరిశీలించిన యాజమాని కృష్ణ చోరీ జరిగిందని గుర్తించారు. సుమారు 3 గ్రాముల బంగారం ముక్కు పుడకలు నాలుగు, 480 గ్రాముల 6 జతల వెండి పట్టీలు చోరికి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. -
‘మత్తు’బాటలో పాఠశాల విద్యార్థులు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తున్న వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి నలుగురు విద్యార్థులకు హెచ్ఎం కొలా బామనమూర్తి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇటీవల నలుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చారన్న వార్తలు మీడియాలో ప్రచురితం కావడంతో.. ఎందుకు ఇచ్చారో తెలియజేయాలని కోరడంతో రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో విద్యార్థుల వీడియోను పోస్టు చేశారు. కాగా, విద్యార్థులు తప్పుడు పనులు చేస్తే మందలించాల్సింది పోయి.. ఇలా టీసీలు ఇవ్వడం.. వీడియోను పోస్టు చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేయాలని ఉన్నత స్థాయి అధికారులను కోరారు. -
టికిరిని సమితిగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీని సమితిగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝికి ఆ ప్రాంత ప్రతినిధులు గురువారం వినతిపత్రం సమర్పించారు. కాసీపూర్ సమితిలో 24 పంచాయతీలు ఉండగా సుమారు లక్షకు పైబడి జనాభా ఉన్నారని చెప్పారు. జనాభాపరంగా అభివృద్ధి చెందుతున్న కాసీపూర్ సమితిని విభజించి టికిరి పంచాయతీని సమితిగా గుర్తిస్తే మరింత అభివృధ్ది చెందుతుందని వివరించారు. టికిరి సమితిగా ఆవిర్భవిస్తే కొడాపరి, డొంగాశిలి, కుచేయిపొదొరొ, హడిగుడ, పొడాపడి, బంకాంబ, నకిటిగుడ, శొంకరడ, దుడుకాబహాల్, గోరఖ్పూర్ పంచాయతీలు విలీనమవ్వడంతో అభివృద్ధిని సాధిస్తాయని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బిభీషన్ మాఝి తదితరులు ఉన్నారు. -
జిల్లా ఆస్పత్రిని సందర్శించిన ఎంపీ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఆస్పత్రిని నవరంగ్పూర్ పార్లమెంటు సభ్యుడు భోలభద్ర మాఝి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి బ్రోజాదాస్తో చర్చించారు. లిఫ్ట్ పని చేయడం లేదని, నీటి సమస్య ఉందని వైద్యులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. రోగుల కోసం మరికొన్ని పడకలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.హిరమండలం : వ్యవసాయ రుణాలు అందించాలని హిరమండలం మండలంలోని 50 గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ మేర కు శుక్రవారం సవర చొర్లంగిలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో డీపట్టా భూములకు బ్యాంకులు ద్వారా రుణాలు అందేవని, భూముల రీ సర్వే తర్వాత 1బీ అడంగల్ రాకపోవడంతో రుణాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1బీ ఉంటేనే రుణాలు ఇస్తాం.. రెన్యూవల్ చేస్తామ ని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వ్యవసాయ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారెక్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. పలువురి నుంచి బెయిల్ పిటీషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. పలాస: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోరీస్ అనే వ్యక్తిని గంజాయితో శుక్రవారం అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలియజేశారు. పలాస రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫామ్లో తనిఖీలు చేస్తుండగా అను మానస్పదంగా తిరుగుతూ కనిపించాడన్నారు. అతని బ్యాగ్లో తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో రాయగడలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ను స్వా ధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తూకం వేయగా 14 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీకాకళం కల్చరల్: స్థానిక రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై ఒక్కరోజు శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడు తూ ప్రథమ చికిత్స శిక్షణతో ఎంతో ప్రయో జ నం ఉందన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ కె.అని త మాట్లాడుతూ ప్రథమ చికిత్స శిక్షణ ప్రతి ఒక్కరికీ ఈ రోజుల్లో అవసరమని, ప్రాణనష్టం తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులకు ధృవపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్క్రా స్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేట సాగక.. పూట గడవక..!
గార: కడలి తల్లి కరుణిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి మత్స్యకారులది. వేట సాగితేనే కుటుంబాల పూట గడుస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు మత్స్యకారుల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారుతుండడంతో వేట సాగడం లేదు. వేట నిషేధం అనంతరం వరుసగా నాలుగు నెలల్లో ఏకంగా 27 రోజుల పాటు తుఫాన్లు, వాయుగుండాల ప్రభావం వలన వేటకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్ సంభవిస్తున్నా వాతావరణ హెచ్చరికలు ఆధారంగా అప్రమత్తత పేరుతో వేట నిలిపేయాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. కానీ ఒక్కోసారి వాతావరణ హెచ్చరికలకు విరుద్ధంగా సముద్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అందువలన ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో భృతి ఇస్తున్నట్టే.. తుఫాన్, వాయుగుండాల సమయంలో వేటకు వెళ్లకుండా అర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలోని 11 మండలాల్లో మత్స్యకారులు జీవ -
ప్రత్యేక భృతి ప్రకటించాలి
సముద్రంలో వేట సాగించేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితు ల్లో వేటకు విరామం తప్ప డం లేదు. వేట నిషేధ భృతి మాదిరిగానే వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక భృతిని ప్రకటించాలి. జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మత్స్యకార భరోసా రెండేళ్లకు ఒక ఏడాది మాత్రమే అందించారు. మరో ఏడాది భరోసా అందించి ఆదుకోవాలి. – కోనాడ నర్సింగరావు, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు -
మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన
జయపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సారా దుకాణం పెట్టాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆలిండియా ఎంఎస్ఎస్ (ఆలిఇండియా మహిళా సంస్కృతిక సంఘటన) బొయిపరిగుడ సమితి కమిటీ ఆందోళన చేపట్టింది. సారా దుకాణం ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ బొయిపరిగుడ బీడీవోకు వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు పెరిగాయని నినాదాలు చేశారు. కొరాపుట్ జిల్లా ఆలిండియా మహిళా సంస్కృతిక సంఘటన కార్యదర్శి లక్ష్మీ బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని బలవన్మరణం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఎంవీ 13 గ్రామంలో ఉంటున్న విద్యార్థిని అంకితా విశ్వస్ (21) గురువారం రాత్రి ఆత్మాహత్యకు పాల్పడింది. బృందవాన్ విశ్వస్ తన కుటుంబంతో మల్కన్గిరి సమితి ఎంవీ 13 గ్రామంలో నివసిస్తూ కుమార్తె అంకితా విశ్వస్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా. కుటుంబీ సభ్యులు మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి రక్షించగా.. గురువారం ఉదయం ఇంటికి వచ్చేశారు. అయితే గురువారం రాత్రి అంతా భోజనాలు చేసిన తరువాత నిద్రకు ఉపక్రమిస్తుండగా అంకితా విశ్వస్ తన గదిలో ఫ్యాన్కు ఉరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతుర్ని గమంచిన తండ్రి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. సమాచారం అందుకున్న మల్కన్గిరి ఐఐసీ రీగాన్కీండో ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమార్తె ఎవరినో ప్రేమించిందని.. అయితే ప్రేమించిన వ్యక్తి పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అఘాయిత్యానికి పాల్పడిందిన తండ్రి బృందావన్ పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. -
డీసీసీ అధ్యక్షుడిగా అప్పలస్వామి కడ్రక
రాయగడ: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా రాయగడ శాసనసభ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సాధారణ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కడ్రకను ఆయన అభిమానులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అడాబడిలో దొంగల హల్చల్ రాయగడ: ఓ వృద్ధురాలి చెవిదిద్దులను గుర్తు తెలియని వ్యక్తులు తెంచుకువెళ్లిన ఘటన కళ్యాణసింగుపూర్ సమితి అడాబడి గ్రామంలో చోటు చేసుకుంది. ధమునిపొంగ పంచాయతీ గుండిరిగుడ గ్రామానికి చెందిన సపాయి హికక (73) అనే వృద్ధురాలు స్టేట్బ్యాంక్కు వ్యక్తిగత లావాదేవీల కోసం గురువారం వచ్చింది. బ్యాంకు పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒడాబడి కూడలిలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు అడ్డగించి చెవిలో దిద్దులను దొంగిలించుకుని వెళ్లిపోయారు. చెవి తెగి రక్తం కారుతుండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీస్స్టేషన్లో బాధితురాఉల ఫిర్యాదు చేసింది. మనస్థాపంతో ఆత్మహత్య బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన బొమ్మాళి శిరీష (22) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరీషకు తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తుండగా ఆమె తిరస్కరిస్తూ ఉండేది. వివాహం చేసుకోనని.. తన చిన్నాన్న దగ్గర చదువుకుంటానని చెప్పేది. ఈ క్రమంలో బుధవారం భోజనాల తర్వాత పక్క ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా, ఆమె తల్లి తనకు సాయం చేయకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్లావని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్నటువంటి గడ్డిమందు తాగేసింది. తల్లి గన్నెమ్మ చూసి వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి తండ్రి రాజు, తల్లి గన్నెమ్మ, అక్క దివ్య, డిగ్రీ చదువుతున్న తమ్ముడు మని ఉన్నారు. తల్లి గన్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.ప్రవళ్లిక తెలియజేశారు.