breaking news
Orissa
-
దళిత ఓటర్ల పేర్లు తొలగించొద్దు
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో జిల్లాలోని అర్హులైన దళిత ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ దళిత సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున సర్ ప్రక్రియలో అవసరమైన పత్రాలు సమర్పించడం, దరఖాస్తులు నింపడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక కారణాలు, పత్రాల లోపాల పేరుతో అర్హులైన దళిత ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాలు, దళితవాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ అధికారులు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులకు ఇంటి వద్దే సేవలు అందించి వారి దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
రెండేళ్ల పాలనపై మేధావుల సదస్సు
రాయగడ: కేంద్రంలో బీజేపీ పాలనకు 12 ఏళ్లు, రాష్ట్రంలో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక తేజస్వీని హోటల్లో మేధావుల సదస్సు, చర్చాగోష్టిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపీ ఆనంద్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఝి హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం జిల్లాలోని పలు రంగాలకు చెందిన మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాయగడ సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యాటక రంగ ప్రోత్సాహం, రహదారులు, ఇతర మౌలిక వసతుల విస్తరణపై నిర్మాణాత్మక సూచనలు చేశారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం గురించి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, బసంత కుమార్ ఉలక, కోరాడ రజిత, ఎస్డీసీ వైస్ చైర్పర్సన్ మంజులా మినియాక, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దుస్మంత్ కుమార్ మహంతి, సీనియర్ పాత్రికేయుడు అమూల్య రత్నసాహు, బాదల్ థా, సెంచురియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాడి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా 20వ జాతీయ గణన దినోత్సవం
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, నిధుల మంజూరుకు సెన్సస్ అవసరమని, తద్వారా పలు పథకాలకు రూపకల్పన జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ, ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో అన్నారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 20వ జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ప్రారంభించారు. భారతీయ గణాంకాల పితామహుడు పి.సి.మహాలనోబిస్ జన్మదినం పురస్కరించుకుని జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకుంటారని ఏడీఎం ఫల్గుణి మఝి అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖాలకు వెన్నెముక అయిన గణాంకాలు, ప్రకృతి వైపరీత్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, గుడ్ గవర్నెన్స్, ఐ.ఎం.ఎఫ్ నిధులు, నీతి అయోగ్ వంటివి దేశంలో అభివృద్ధి పథంలో నడపాలంటే గణాంకాల నివేదిక సమకూర్చడం అవసరమని ఎస్.కె.సి.జి కళాశాల అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ ప్రియబ్రత శతపతి అన్నారు. స్టాటిస్టిక్స్పై పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్, మానిటరింగ్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్ రౌత్, జిల్లా ముఖ్యవ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా కళాశాలలో జాతీయ గణాంకాల దినోత్సవంపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రియబ్రత శతపతి అందజేశారు. -
గజపతి జిల్లాలో పెరిగిన మామిడి పండ్ల ధర
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నేల పనస పండ్లు, మామిడి పండ్లు పంట చివరి దశకు చేరుకుంది. జిల్లాలో రామగిరి ప్రాంతం సిందిబా, జిరంగో, మండలసాయి, గుమ్మ, సెరంగో ప్రాంతంలో పండుతున్న నేల పనస పండ్లు ప్రస్తుతం ధరలేక రోడ్డుపైన చిరువ్యాపారులు పారబోస్తున్నారు. అలాగే మామిడి పండ్లు ఈ ఏడాది కాశీనగర్, గుమ్మ, గుసాని, రాయఘడ బ్లాక్లలో విపరీతంగా పంట దిగుబడి రావడంతో వంద రూపాయలకు నాలుగు, ఐదు కిలోలు అమ్మారు. ప్రస్తుతం పంట చివరి దశకు రావడంతో మామిడి పండ్లు ధర రూ. 100లకు కిలోన్నర లెక్కన అమ్మకాలు సాగిస్తున్నారు. అలాగే నేల పనస దిగుబడి ప్రస్తుతం ఎక్కువగా రావడంతో పండు ఒకటి రూ.10, రూ.5లు చొప్పున అమ్మారు. కొనుగోలుదారులు రాకపోవడంతో సాయంత్రం అయితే రోడ్డున పారబోస్తున్నారు. అయితే అతి రుచి కలిగిన క్వీన్ నేల పనస రకం మాత్రం డజను రూ.480 లు చొప్పున అమ్ముతున్నారు. క్వీన్ రకం నేల పనస భువనేశ్వర్, విశాఖపట్నంకు ఎగుమతి అవ్వడం వల్ల రైతులు ఈ పంట పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా శోభారాణి (సీడీపీఓ గార), ప్రధాన కార్యదర్శిగా ఉమాజానకి (సీడీపీఓ కొత్తూరు), కోశాధికారిగా ఎం.రాజేశ్వరి, (సీడీపీఓ ఇచ్చాపురం), వైస్ ప్రెసిడెంట్లుగా శోభారాణి, పాపునాయుడు, జాయింట్ సెక్రటరీగా మణెమ్మ, అనురాధ, కార్యవర్గ సభ్యులుగా గీత, బీవీ లక్ష్మి, రూపలత, వంశీ ప్రియా తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్జీజీవో సంఘ పట్టణ అధ్యక్షుడు బొచ్చ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ జేఏసీ జాయింట్ సెక్రెటరీ విద్య తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో వెనుకబడిన బీఎల్ఓలు పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు మాత్రమే స్వయంగా పంపిణీ చేసి తిరిగి వారే సేకరించాలని స్పష్టం చేశారు. ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ఫారాల డిజిటలైజేషన్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక సహాయకుడిని, ఓటర్లను గుర్తించడంలో తోడ్పాటునందించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగవావాడీ సిబ్బందిని ప్రతి బీఎల్ఓకు సహాయకులుగా కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ జానకి తదితరులు పాల్గొన్నారు. -
ఏకాంత గదికి జగన్నాథుడు
భువనేశ్వర్: దేవ స్నాన పూర్ణిమ సందర్భంగా 108 కలశాల సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటితో చేసిన భారీ స్నానం తర్వాత అస్వస్థతకు గురై దేవతా మూర్తులకు జ్వరం వస్తుందని నమ్ముతారు. చికిత్స కోసం సోమ వారం రాత్రి నుంచి మూల విరాట్లకు తెరమరుగు చేశారు. ఏకాంత గదిలో శ్రీ జగన్నాథుడు విశ్రాంతి పొందుతూ సుమారు 15 రోజుల పాటు గోప్యంగా వైద్య సేవలు పొందుతాడు. ఈ కాలంలో భక్తులకు మూల విరాటుల దర్శనం అనుమతించరు. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీమందిరంలో దర్శనం మూసి వేయడంతో భక్తులు దర్శనం కోసం బ్రహ్మగిరిలోని అలార్నాథ్ ఆలయానికి తరలి వెళ్తున్నారు. పూరీకి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని ఈ చిన్న ఆలయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీస్తుశకం 1610 లో శ్రీ చైతన్య మహాప్రభు తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు శ్రీ జగన్నాథుడు సాక్షత్కరించడంతో అలార్ నాథ్ పేరుతో నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు. శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుడు తెరమరుగైన సమయంలో అలార్నాథ స్వామిని ఒక్క రోజు దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా 365 రోజుల పాటు జగన్నాథ స్వామిని దర్శించడం వల్ల లభించే పుణ్యానికి సమానం అని నమ్ముతారు. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవిల మధ్య నల్ల గ్రానైట్తో చతుర్భుజ నారాయణుని రూపంలో అలార్ నాథ స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ కాలంలో స్వామికి ప్రత్యేకమైన ఖిరీ భోగాన్ని సమర్పిస్తారు. పాలతో చేసే ఈ తీపి నైవేద్యానికి భక్తులలో విపరీతమైన గిరాకీ ఉంటుంది. రద్దీ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రత, సులభ దర్శనం కల్పించేందుకు 7 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. 50కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శ్రీ మందిరంలో మూల విరాట్లు తెర మరుగు కావడంతో చిత్ర పటాలు దర్శనం ఇస్తున్నాయి. రత్న వేదికపై బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునికి ప్రతి రూపాలుగా వేర్వేరుగా 3 చిత్ర పటాల్ని దర్శనం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పొట్టా చిత్రాలుగా పేర్కొంటారు. సింహ ద్వారం ఆవరణలో కుడ్య ప్రతిమ పతిత పావనుని స్థానంలో కూడ పొట్టా చిత్ర రూపంలో భక్తులకు దర్శనం ప్రాప్తిస్తుంది. స్వామి ఆరోగ్యం కోలుకునేంత వరకు ఈ చిత్ర పటాల దర్శనమే ప్రాప్తిస్తుంది. భక్తులను తరింపజేస్తున్న అలార్ నాథ స్వామి -
బాధిత రైతుల సమావేశం
జయపురం: జయపురం నుంచి బొయిపరిగుడ మీదుగా మల్కన్గిరికి వేయనున్న రైల్వేలైన్ వలన భూములు కోల్పోయిన బాధితులు బొయిపరిగుడ సమితి దశమంతపూర్ గ్రామ పంచాయితీ హఠపొదర్ గ్రామంలో మంగళవారం సమావేశమయ్యారు. వారంతా ప్రభుత్వం భూ ములకు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే రైల్వే భూసేకరణ చట్టం 2022–23 నోటిఫికేషన్ ప్రకారం రైతుల భూములకు నిర్ణయించిన ధరపై తీవ్ర అంసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక ఎకరా ధర కోట్లలో ఉందని, అందువలన ఆ ధర చెల్లించాలన్నారు. అలాగే భూములు ఇచ్చిన రైతు కుటుంబంలో ఒక సభ్యుడికి వారి చదువును బట్టి తగిన ఉద్యోగం రైల్వే డిపార్టుమెంట్లో కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక రాయగడ: లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. స్థానిక లయన్స్ క్లబ్ సమవేశ మందిరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబురావు మహంతి, కార్యదర్శిగా దాశరథి రాజ్గురు, కోశాధికారిగా ప్రభాకర్లు నియమితులయ్యారు. కొత్తగా కొలువు దీరిన కార్యవర్గాన్ని లయన్స్ సీనియర్ సభ్యుడు డాక్టర్ దుఖిశ్యామ్ దాస్, డిస్టెట్ గవర్నర్ అశ్వినికుమార్ దాస్, వి భాస్కరరావు, టి జయరాం, శుశ్రిత దాస్ తదితరులు అభినందించారు. క్లబ్ తరుపున భవిష్యత్లో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి అధ్యక్షుడు బాబురావు మహంతి వివరించారు. విధి నిర్వహణలో అస్వస్థతతో ఉద్యోగి మృతి భువనేశ్వర్: విధి నిర్వహణలో తలమునకలై ఉండగా ఆకస్మిక అస్వస్థతకు గురైన సిబ్బంది మృతి చెందాడు. తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండల ఆస్పత్రిలో పని చేస్తున్న 58 ఏళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్ నృసింహ చరణ్ మహంతి (చిన్నా) కన్ను మూశారు. విధి నిర్వహణలో ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. తోటి సిబ్బంది మృతిపై విచారం వ్యక్తమైంది. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు కార్యకర్తలు ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు. రథయాత్రకు ఓఏఎస్ అధికారుల నియామకం భువనేశ్వర్: పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర పటిష్ట నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఓఏఎస్ అధికారులను నియమించింది. వారికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలతో ప్రత్యేక బాధ్యతలను కేటాయించింది. ఇంతకు ముందు యాత్ర నిర్వహణ కోసం 43 మంది ఓఏఎస్ అధికారులను నియమించిన విషయం తెలిసిందే. బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల కారాగారం పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహన బ్లాక్ పిండికి వద్ద ఒక యువకుడు రాజేంద్ర జన్ని(26) బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానాను విధిస్తూ మంగళవారం జిల్లా అదనపు సెషన్సు జడ్జి హరి ప్రసాద్ తీర్పునిచ్చారు. 2024 ఫిబ్రవరి 10న నిందితుడు బాలికను మోహన బ్లాక్ చాందిపుట్ నుంచి ఎత్తుకెళ్లి పిండిక అటవీ ప్రాంతంలో కోల్డు డ్రింక్లో మత్తు పదార్థం కలిపి లైంగికదాడికి పాల్పడడంతో ఆమె ప్రమాదకర స్థితికి వెళ్లిపోయింది. సంఘటన వివరాలు తెలుసుకున్న ఆమె తండ్రి చాందిపుట్ సంత నుండి వచ్చి మోహన పోలీసుష్టేషన్లో నిందితుడు రాజేంద్ర జన్నిపై కేసు పెట్టారు. ఈ కేసును మంగళవారం జిల్లా కోర్టులో హియరింగ్ జరుపగా నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో ఏడేళ్ల జైలు శిక్ష, రూ.యాభై వేల జరిమానా విధించారు. కేసును ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం.పృథ్వీరాజ్ వాదించగా సీనియర్ క్యాడర్ పి.పి. రాజేష్ కుమార్ మిశ్రా సమాచారం విలేకరులకు అందజేశారు. -
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ స్టేషన్ల డిజిటలైజేషన్ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద 131 పోలింగ్ స్టేషన్కు సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్ యజమానులతో మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 30 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు నగర సహాయ టౌన్ ప్లానర్ జానకి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, బీఎల్ఓలు పాల్గొన్నారు. జె.భైరిపురంలో చైన్స్నాచింగ్ కంచిలి : జె.భైరిపురంలో సోమవారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలు బల్ల సావిత్రి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామంలో మెయిన్రోడ్డు పక్కన ఉన్న చెరువుకు వెళ్లింది. అదే సమయంలో ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్పై వచ్చి వృద్ధురాలి మెడలో ధరించిన ఒకటిన్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. దుండగుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా బైక్పై ఒడిశా వైపు పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ పి. పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేవలకు సత్కారం మెళియాపుట్టి: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంపీడీఓ ఎన్.పి.పండా అన్నారు. మెళియాపుట్టి మండల పరిషత్ ఏవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాజేశ్వరమ్మను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ఎస్.మోహనరావు, బైపోతు ఉదయ్కుమార్, ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వార్షిక కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ ఎచ్చెర్ల : సెర్ప్ ఆదేశాల మేరకు జిల్లాలోని 19 మండలాల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై లావేరు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడికి పంపించడం, మహిళల అక్షరాస్యత, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, భూసార పరీక్షలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణ డీపీఎం మోహనరావు, ఏపీఎం భాగ్యలత, ఎల్సీ బసవరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు డైరీల వితరణ కంచిలి: మండలంలోని పురుషోత్తపురం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 75 మంది విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన జయంతి నాగేశ్వరరావు దంపతులు డైరీలను వితరణగా ఇచ్చారు. వీటిని పాఠశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎస్.శివరాంప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ చాణక్య, పాఠశాల హెచ్ఎం సింహభట్ల శారద, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొట్ట గీత, ఉపాధ్యాయులు నల్లాన రవి, భార్గవి, సీఆర్ఎంటీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహచర విద్యార్థుల ఆపన్నహస్తం కవిటి: మండలంలోని రాజపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సాయం ప్రశంసనీయమైనదని శ్రీ శయన కుల సంఘం పెద్దలు అన్నారు. రాజపురం బాలుర ఉన్నత పాఠశాలలో 1998లో పదో తరగతి చదువుకున్న ఆనింగి లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి తనతో పాటు చదువుకున్న విద్యార్థులు విరాళంగా సేకరించిన రూ.50 వేల నగదుతో పాటు మృతుడి కుమార్తె చదువు కోసం రూ.2,000లు అలాగే నిత్యావసర సరుకులు మంగళవారం అందజేసి ఔదార్యం చాటుకున్నారు. -
వ్యాన్ ఢీకొని ముగ్గురికి గాయాలు
● వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం శ్రీకాకుళం క్రైమ్ : మద్యం మత్తులో ఉన్న లగేజీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముగ్గురి గాయాలకు కారణమయ్యాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం మండలం రాయిపాడుకు చెందిన వృద్ధుడు యట్రాజుల తవుడు ఏఎస్ఎన్కాలనీలో నిర్మిస్తున్న ఓ ఇంటికి తాపీ పనికి మంగళవారం ఉదయం వెళ్లాడు.. మధ్యాహ్నం బలగ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో తమ గ్రామానికి చెందిన ఫంక్షన్ జరుగుతుండటంతో భోజనానికని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తరోడ్డు నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వైపు వస్తున్న లగేజీ వ్యాను డ్రైవర్ నారు మురళి (ఆమదాలవలస మండలం దూసి) మద్యం మత్తులో వృద్ధుడిని ఢీకొట్టాడు. అంతేకాక కాంప్లెక్సు వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులు సాధు గణేష్, మాధవిలను ఢీకొట్టాడు. అందరూ గాయపడటంతో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. పీఎన్ కాలనీలో.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ మహిళ గాయపడింది. ట్రాఫిక్ ఏఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎన్కాలనీలో కర్రి స్వాతి తన భర్త సంతోష్కుమార్తో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో తన బంధువైన ఉదయ్కుమార్తో నవభారత్ జంక్షన్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లావేరుకు చెందిన ప్రగఢ గోపి తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. మహిళకు గాయాలవ్వడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. దంపతులకు గాయాలు రణస్థలం: లావేరు మండలం బొంతుపేట జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న దంపతులు నడుపూరి సురేష్, రాజకుమారిలకు బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం తరలించారు. లావేరుకు చెందిన సురేష్ బైక్పై శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని 108 సిబ్బంది ఈశ్వరరావు, చిన్నా తెలిపారు. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
జయపురం: పట్టణ పోలీసులు పేకాటరాయుళ్ల ముఠాను పట్టుకున్నారు. పేకాట శిబిరంపై దాడిచేసి 15 మందిని జూదగాళ్లను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిట్టల్ తెలిపారు. ఈ మేరకు జయపురం పట్టణ పోలీసుస్టేషన్ సభాగృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని పారాబెడ, జీరు పటాన్ లైన్లో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే పోలీసు టీమ్ ఆ ప్రాంతానికి వెళ్లి దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. దాడి సమయంలో పేకాడుతున్న 15 మందిని పట్టుకున్నామన్నారు. అలాగే రూ.3.50 లక్షల నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 15 సెల్ఫోన్లు, 10 సీల్డ్ పేక దస్తాలు, 52 లూజ్ పేక ముక్కలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ఉన్నత చదువులకు ఆర్థిక సాయం
సంతబొమ్మాళి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మ తల్లి యూత్ హెల్పింగ్ హార్ట్స్ సేవా సొసైటీ సభ్యులు ఉన్నత చదువులకు ఆర్థిక సాయం మంగళవారం అందజేశారు. మండలంలోని పాత మేఘవరం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని బైపల్లి రవణమ్మ ఉన్నత చదువులు పేదరికంతో నిలిచిపోయాయి. విద్యార్థిని తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఇక చదువులకు స్వస్తి చెప్పాలని అనుకున్నారు. దీనిపై రెయ్యమ్మ తల్లి యూత్ హెల్పింగ్ హార్ట్స్ సేవా సొసైటీ సభ్యులు స్పందించారు. ఉన్నత చదువులు సాగించడానికి రూ.10 వేలు నగదు, రూ.2 వేలు విలువ కలిగిన పుస్తకాలు అందజేశారు. భవిష్యత్లో తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు మద్దతు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 నుంచి జరగనున్న తొలి విడత ఉద్యమాలకు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సహకార శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు పి.జానకిరామ్ తదితరులు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బి.వి.వి.ఎన్.రాజును కలిశారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ దామోదర్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అరుణకుమారి, ఏపీ సహకార శాఖ సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సి.ఎస్.ఈ.విద్యార్థి ఎండ శివచరణ్ జూన్ 27, 28వ తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో అండర్–23 విభాగంలో 72 కేజీల గ్రీకోరోమన్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు వి.ఎం.ఎం.సాయినాథ్రెడ్డి, కె.దుర్గా శ్రీనివాసరావు, పి.దుర్గాప్రసాద్రాజు, డి.వెంకటరావు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, జె.హరీష్లు శివచరణ్ను అభినందించారు. జూలై 10, 11వ తేదీలలో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లోనూ పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, జి.టి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్కిరణ్, ఎస్వీఎస్ సునీల్కుమార్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..!
పోలాకి: రాకాసి అలలను దాటుకుంటూ నడిసముద్రంలో వేట సాగించి తమ జీవననావను ముందుకు సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో వారి కుటుంబ పోషణకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా సొమ్ములు కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయని అర్హులైన లబ్ధిదారులు చెబుతున్నారు. పోలాకి మండలం అంపలాం పంచాయతీ రాజారాంపురంలో కొన్ని లక్షల రూపాయల వేటగాళ్ల సొమ్ములు మేతగాళ్లు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిలదీశారనే నెపంతో గ్రామానికి చెందిన 24 మంది అర్హులైన మత్స్యకారులకు పథకం వర్తింపజేయకుండా కొర్రీలు పెడుతున్నారు. దీనిపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఫిర్యాదు వెనక్కుతీసుకోవాలని బాధితులు ఒత్తిడి చేశారని, సదరు నేతల నుంచి తమకు హాని జరిగే అవకాశం ఉందని బాధితులు తాజాగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇదీ పరిస్థితి.. మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలో డమ్మీలే ఎక్కువగా ఉన్నారని, కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో రాకపోవటంతో మొత్తం గుట్టు బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. రాజారాంపురం తీరం నుంచి రిజిస్టర్ కాబడిన బోట్లపై సముద్రంలోకి వేటకు వెళ్లినట్లు వచ్చిన లబ్ధిదారుల జాబితాలో తీరప్రాంతానికి సంబంధం లేని గ్రామాల వ్యక్తుల పేర్లు సైతం ఉన్నాయని ఆధారాలతో సహా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. రాజారాంపురం తీరంలో 84 బోట్లు, 75 తెప్పలు రిజిస్టర్ కాబడి ఉంటే అందులో ఎన్నిబోట్లు, ఎన్ని తెప్పలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పథకం ఏమేరకు పక్కదారి పట్టిందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ఒక బోటుకు ఆరుగురు, తెప్పకు ముగ్గురు చొప్పున 728 మంది క్రూమెంబర్లు(కలాసీలు)గా అంపలాం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 687 మందిని అర్హులుగా గుర్తించారు. రాజారాంపురం తీరం నుంచి వేటసాగితే అంతే స్థాయిలో ప్రొడక్టివిటీ కూడా ఉండాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే జిల్లాలో ప్రతిచోటా దాదాపు ఇలాంటి వ్యవహారమే ఉందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. మత్స్యకార భరోసా అందించే వేటగాళ్ల జాబితాకు, మన మత్స్యకారులు నిజంగా కష్టపడి వేటసాగించి తీసుకువచ్చే ప్రొడక్టివిటీ లెక్కలకు ఎక్కడా సరిపోలటం లేదు. రాజారాంపురం విషయానికి వస్తే బాధితులుగా చెప్పబడుతున్న 24 మందిలో కొంతమంది మత్స్యకారేతర కుటుంబాల వ్యక్తులు ఉన్నారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్న మాట. ఇక్కడ ఇప్పటికే సొమ్ములు అందుకున్న 704 మందిలో అందరూ మత్స్యకారులేనా అంటే అక్కడా సమాధానం కుదరటంలేదు. సరికదా.. సదరు జాబితాలో నాన్ లోకల్ వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. మత్స్యకార భరోసా కోసం సముద్రంలో వేటసాగించే తీరప్రాంత వ్యక్తులు అందరూ అర్హులే తప్ప ఎక్కడా మత్స్యకారులు మాత్రమే ఉండాలని లేదని అర్హులైన బాధితులు చెబుతున్నారు. తుప్పల్లో తెప్పలు..జాబితాలో పేర్లు.. రాజారాంపురం తీరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏళ్ల తరబడి ముళ్లపొదలు, తుమ్మతుప్పల్లో చెదలు పట్టిపోయిన బోట్లకు కూడా రంగులేసి రిజిస్టర్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.1.37 కోట్లు మత్స్యకార భరోసా సొమ్ము అంపలాం సచివాలయం పరిధిలో అందితే అందులో సగానికిపైగా డమ్మీజాబితా ఖాతాల్లోకే చేరాయని తెలుస్తోంది. ఈ పథకమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డీజిల్ బిల్లు సైతం ఇలాంటి వేటకెళ్లని బోట్లు పేరుతో రాయితీ దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అర్హులు కోరుతున్నారు. మత్స్యకార భరోసాలో డమ్మీ లబ్ధిదారులు లక్షల రూపాయలు నొక్కేశారని అర్హుల ఆవేదన ఇదే విషయమై నిలదీశారని రాజారాంపురంలో 24 మంది పై కక్షసాధింపు న్యాయం చేయాలని కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు -
ప్రజాసంక్షేమమే ధ్యేయం
కొరాపుట్: ప్రజాసంక్షేమమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ అన్నారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాల్లో జరిగిన సీనియర్ సిటిజన్ల సమావేశంలో ప్రసంగించారు. గత 12 ఏళ్లలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రెండేళ్లలో రాష్ట్రంలో మోహన్ చరణ్ మజ్జి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. సుభద్ర పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం, ధాన్యానికి రూ.3,200 మద్దతు ధర, విద్యా, ఉపాధి రంగాలలో అభివృద్ధి, నబరంగ్పూర్–జయపూర్ రైల్వే లైన్ నిర్మాణం, నబంగ్పూర్ జిల్లాలో మెడికల్ కలేజీకి శంకుస్థాపన వంటి విషయాలను వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ బలభద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజ దాస్, రమేష్ సాహు, తదితరులు ప్రసంగించారు. -
పట్టుబడిన దారిదోపిడీ దొంగలు
శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన దారిదోపిడీ కేసులో నిందితులను రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు వివరాలను మంగళవారం టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్ఐ సురేష్ విలేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసైన శ్రీకాకుళం నగరానికి చెందిన కొంకాన వెంకటనారాయణ, పడిపాటి నితిన్రెడ్డి, కొల్లు విజయ్కుమార్లు సులువుగా డబ్బులు సంపదించాలని దారిదోపిడీల మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఖాజీపేటకు చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం పట్టణం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఈ ముగ్గురూ కలిసి దాడిచేశారు. అతని జేబులో రూ.20వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వీరిలో ఇద్దరు పట్టుబడగా, విజయ్కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.7500 నగదు, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు తామాడ పాపుడమ్మ (105) మంగళవారం మృతి చెందారు. ఈమె 1973లో సర్పంచ్గా పనిచేశారు. ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త పోలినాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సరస్వతమ్మ వైఎస్సార్ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలు అందించారు. ఈమె మృతి పట్ల తాజా మాజీ సర్పంచ్ బత్తిని సృజన లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు సంతాపం తెలియజేశారు. పక్కాగా ఎస్ఐఆర్ చేపట్టాలి కంచిలి: ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని తహసీల్దార్ ఎన్.రమేష్కుమార్ సూచించారు. మండలంలోని ఎస్ఆర్సీపురం, బురదపాడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్యుమరేషన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును మంగళవారం పరిశీలించారు. ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని బీఎల్వోలను ఆదేశించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్రెస్ మెటీరియల్కు విరాళం కంచిలి: మండల కేంద్రం కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్న 35 మంది విద్యార్థులకు డ్రెస్ మెటీరియల్ కొనుగోలు కోసం గుప్తదాత రూ.30 వేలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఎస్.చాణిక్య, పీడీ శారదలు ధన్యవాదాలు తెలిపారు. -
నిబద్ధతతో పనిచేయాలి: గవర్నర్
భువనేశ్వర్: ప్రజోపయోగ పాలనపై నిబద్ధత పౌరులు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేలా చేస్తుందని గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి యువ అధికారులకు ప్రబోధించారు. ఒడిశా రెవెన్యూ సర్వీస్ (ఓఆర్ఎస్) ప్రొబేషనర్లతో లోక్ భవన్లో ఏర్పాటు చేసిన సంభాషణ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరినీ అవగాహన పరిచి ప్రోత్సహించడం ఓఆర్ఎస్ రంగంలో ఉన్నతమైన సంతృప్తిని మిగుల్చుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో అర్థవంతమైన సేవలకు జ్ఞానం, అనుభవంతో వృత్తి విలువలతో ముందుకు సాగాలని గవర్నర్ యువ అధికారులను అభినందించారు. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
గార: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది శ్రీకూర్మం పంచాయతీ వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మణరావు (46) గత కొన్నేళ్లు గా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం చెరువులో పడి చనిపోతానని చెప్పి బయటకు వెళ్లడంతో గ్రామస్తులు వెతికి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని సత్రం వద్ద భద్రం పంతులు మేడ మీద మునగ చెట్టు కు తన తువ్వాలుతో ఉరివేసుకున్నాడు. పనిమనిషి మేడమీదకు వెళ్లే సమయంలో చూసి కు టుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్. గంగరాజు తెలిపారు. జి.సిగడాం: కప్ప..కప్ప నీలాలు, కండవ నిండా వర్షాలు, కురవాలి వానదేవుడా, వానమ్మ వానమ్మా ఒక్క సారి వచ్చిపోవమ్మా.. రైతుల కష్టాలు తీర్చేవా రావమ్మా.. అంటూ మండల పరిధిలోని వెలగాడ, గొలుసుపూడిపేట గ్రా మాల్లో రైతులు, యువకులు, విద్యావంతులు కప్పయాత్ర చేశారు. కప్పను కావిడిలో ఊరేగిస్తూ ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, బిందెలతో నీరు తెచ్చి పూజలు చేశారు. పాతపట్నం: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో నిందితుడికి సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు పాతపట్నం సీఐ ఎన్.సన్యాసినాయుడు మీడియాకు సోమవా రం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాపు గోపాలపురం గ్రామానికి చెందిన బూసి శ్రీనివాసరావు పాతపట్నం సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. తన దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో తన తల్లిదండ్రులైన బూసి రామారావు, తల్లి బూసి భగవతమ్మలు తరచూ జోక్యం చేసుకుంటూ, తన భార్య కల్యాణికి వత్తాసు పలుకుతున్నారనే ఆగ్రహంతో 2022 సంవత్సరం జూన్ 7వ తేదీ అర్ధరాత్రి కాపుగోపాలపురంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని హతమార్చాడు. మృతుల కోడలు బూసి బృందారణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఎం.వినోద్బాబు కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.జగన్నాయకులు వాదనలు వినిపించారు. నిందితుడిపై అభియోగాలు రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, అదనంగా రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలలు సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తెలిపారని సీఐ తెలిజేశారు. రణస్థలం: మండలంలోని జేఆర్పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస బైక్ చోరీల దొంగలను జేఆర్పురం సర్కిల్ పరిధి పోలీసులు పట్టుకున్నారని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రణస్థలం పరిధిలో 6 ద్విచక్ర వాహనాలు, లావేరులో 1, జి.సిగడాంలో 1 మొత్తం 8 ద్విచక్ర వాహనాలు, లావేరులో ఒక వ్యవసాయ మోటారు ఇటీవల కాలంలో దొంగిలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. జే.ఆర్.పురం, సీతంవలస పరిధిలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు మైనర్లు కాగా.. ఒక వ్యక్తి లావేరు మండలంలోని బుడతవలస గ్రామానికి చెందిన కుప్పిలి హరిగా పేర్కొన్నారు. మైనర్లులంతా లావేరు మండలంలోని ఒక గ్రామానికి చెందినవారే. అలాగే ఈ బైకులు కొనుగోలు చేసిన ఇనుప తుక్కు దుకాణం నిర్వాహకుడు అదపాక గ్రామానికి చెందిన బెజ్జిపురపు వెంకట నాయుడును ఆరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి ఐదు బైకులు, ఒక వ్యవసాయ మోటారు రికవరీ చేశారు. మిగతా మూడు బైకులు తుక్కుకు అమ్మేశారు. సమావేశంలో జేఆర్పురం, లావేరు, జి.సిగడాం ఎస్లు ఎస్.చిరంజీవి, కె.అప్పలసూరి, సందీప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె.కిరణ్ కుమార్, ఎం.జోగారావు, లావేరు కానిస్టేబుల్ లక్ష్మణరావు, హేమంత్, ఎచ్చెర్ల కానిస్టేబుల్ రవి కుమార్ తదితరులు ఉన్నారు. -
దర్శన విన్యాసాలు
భువనేశ్వర్: పవిత్ర స్నాన యాత్రలో ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని నిలువెత్తు నిజ రూప దర్శనంతో తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో భక్తజనులు తరలి వచ్చారు. బొడొ దండొ ప్రాంగణం జన సంద్రంగా మారింది. జై జగన్నాథ్ భక్త నినాదంతో పరిసరాలు మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. ఆబాలగోపాలం స్వామి దర్శనం కోసం పరితపించి తరించారు. అత్యంత చేరువలో స్వామి ప్రత్యక్షం కావడంతో భక్తి భావోద్వేగాలు ధార్మిక భావాలకు అద్దం పట్టాయి. శాసీ్త్రయ నృత్య భంగిమల ఉల్లాసం, భజన, సంకీర్తనల ఆలాపన వీనుల విందు స్నాన యాత్రలో ఆధ్యాత్మిక చింతనకు ప్రేరణగా నిలిచాయి. ఉపశమన సేవలు నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ, విపత్కర పరిస్థితుల నిర్వహణలో తలమునకలయ్యే పోలీసు, అగ్ని మాపక దళం వంటి ప్రత్యేక వర్గాలు స్వామి దర్శనంలో నిస్సహాయులకు సాయం చేశారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అశేష భక్త జనానికి చన్నీటి సించనంతో కొత్త ఊపిరి పోయడంలో అగ్ని మాపక దళం చక్కటి సేవల్ని అందజేసింది. -
మజ్జిగౌరి అమ్మవారి హుండీ ఆదాయం రు.1.22 కోట్లు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాద్యదైవం మజ్జిగౌరి అమ్మవారికి భక్తులు దానం చేసే హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మందిరం పరిచాలన కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, సభ్యులు ఆర్కే దలాయి, దేవేంద్ర బెహర, ఎండోమెంట్ కమిషన్ ఇన్స్పెక్టర్ పుష్పిత బెహర, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమక్షంలో మందిరం గర్భగుడి లోపల, మందిరం ప్రాంగణంలో ఉన్న మొత్తం 9 హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. స్థానికంగా గల వివిధ సేవా సంస్థలకు చెందిన మహిళలు లెక్కింపులొ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. నగదు రూపంలో వచ్చే హుండీ ఆదాయం 1,22,29,623, బంగారం 32 గ్రాములు, వెండి 1.300 కిలోలు వచ్చింది. విదేశీ కరెన్సీలు కూడా అమ్మవారి హుండీలో రావడం విశేషం. గత జనవరి 19వ తేదీన నిర్వహించిన హుండీల లెక్కింపులో రూ.కోటి 5 లక్షల 52 వేల 845 నగదు, 30 గ్రాముల బంగారం, 2.150 కిలోల వెండి లభించింది. ఈ సారి సేకరించిన నగదు, విలువైన విరాళాల లెక్కింపు పూర్తయిన అనంతరం మజ్జిగౌరి ట్రస్టు పేరుతో ఉన్న ఒడిశా గ్రామీణ బ్యాంకు ఖాతాలొ జమ చేయనున్నట్లు మందిరం పరిచాలన కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రాంతీయ మేనేజరు దేవేష్ రంజన్ ధర్, రాయగడ శాఖ మేనేజర్ విజయ్ కుమార్ బారిక్, బాజార్ శాఖ మేనేజర్ ప్రజ్ఞా రంజన్ రథ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 47 వినతుల స్వీకరణ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి చేడంగా పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 47 వినతులను గిరిజనుల నుంచి స్వీకరించారు. భూ, రహదారి, తదితర సమస్యలపై వినతులు అందాయి. పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అబివృద్ధి శాఖ అధికారి దశరాథి సరబు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు . -
టెన్త్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు
పర్లాకిమిడి: పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో మేధాభృతి సమ్మాన్ పురస్కారాల వితరణ సభ సోమవారం జరిగింది. ఏటా ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి ఈ ఉపకారవేతనాలు దాతలు అందజేస్తున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పదకొండు మంది విద్యార్థులకు సామినేని ఆవార్డు, ఉదయ్ కుమార్ హోత్తా ఆవార్డు, కీ.శే.మహేష్ పాఢి, రాజేంద్రనాథ్ పాఢి, రమా పాఢి, డి.సూరప్పడు మాస్టారు, మనోరమా స్మృతి అవార్డుల కింద రూ. 3500, రూ.2000, రూ.1000, రూ.300 లెక్కన ప్రభుత్వ మహారాజా బాలుర ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అందజేశారు. -
రూ.7.02 లక్షలు బాధిత సంస్థకు అప్పగింత
రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని బెల్హర్కు చెందిన ఓ సంస్థ సాంకేతిక గూడ్స్, యూరియా సరఫరాదారులమని నమ్మబలికి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి రూ.7.02 లక్షలను కొల్పొయింది. ఆన్లైన్ వేదిక ద్వారా జరిగిన ఈ మోసంపై సంస్థ ఫిర్యాదు చేయడంతో ఝార్సుగుడ సైబర్ పోలీసులు వెంటనే స్పందించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సిఆర్పి ) ద్వారా తక్షణ చర్యలు చేపట్టి, సంబంధిత బ్యాంకులతో సమన్వయం సాధించారు. మోసగాళ్ల ఖాతాల్లోకి వెల్లిన మొత్తం నగదును స్తంభింపజేసి 100 శాతం మొత్తాన్ని బాధిత సంస్థకు విజయవంతంగా తిరిగి అందజేశారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాఘవేంద్ర మాట్లాడుతూ వ్యాపార సంస్థలు, ప్రజలు ఆన్లైన్లో సరఫరాదారుల వివరాలను పూర్తిగా ధృవీకరించిన తరువాత ముందస్తు చెల్లింపులు చేయాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్కు ఫోన్చేసి ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. వేగంగా ఫిర్యాదు చేస్తేనే మోసపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. -
ఇద్దరు అరెస్ట్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రసాద్ జువెలర్స్లో 2021లో 700 గ్రాముల బంగారు ఆభరాణాలను దొంగలించిన కేసులో సోమవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిశారు. ప్రసాద్ జువెలర్స్కు ఇద్దరు వ్యక్తులు వచ్చి నగలు చూసి కొనుగోలు చేస్తామన్నారు. నగలు చూపిస్తున్న సమయంలో జువెలర్స్ షాప్ యజమాని సుభాష్ పటేల్కు దేవుని ప్రసాదమని చెప్పి అందులో మత్తు మందు కలిపారు. అది తిన్న యజమాని, సిబ్బంది సృహ కోల్పాయారు. నగలు దోచుకోని నిందితులు పారారయ్యారు. యజమాని సుభాష్ మల్కన్గిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా 6 ఏళ్లు గడిచింది. మల్కన్గిరి ఆదర్శ పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా ఆంధ్రా ప్రదేశ్లో గుంటూరుకు చెందిన మదాసు జాన్ అలియాస్ జగదీష్, ఇంటూరి అరుణ అలియాస్ అర్చనలను గుర్తించారు. వీరి కోసం గాలించి కన్యకూమారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసు బృందం అక్కడికి వెళ్లి శనివారం వారిని పట్టుకున్నారు. ఇద్దరిని సోమవారం మల్కన్గిరి తీసుకువచ్చి ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట హాజరుపరిచారు. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి 200 గ్రాముల కలిగించిన బంగారం, రెండు ఫిస్టళ్లు, ఆరు బులేట్స్, బైక్, లాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. -
వినతుల స్వీకరణకు అనూహ్య స్పందన
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాలోని బిసంకటక్ సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 100 వినతులను ఆయన స్వీకరించారు. స్వీకరించిన వినతుల్లో 84 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 14 గ్రామ సమస్యలు కాగా మరో ఇద్దరికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్వీకరించిన గ్రామసమస్యల్లో అవాస్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల పట్టాలు, రహదారుల నిర్మాణం, అంగన్వాడీ భవనాల ఏర్పాటు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలొ గునుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లీప్, జిల్లా ముఖ్యవైద్యాఽధికారి డాక్టర్ నాగేంద్ర నాథ్ మహాపాత్రో, అటవీశాఖ అధికారి అన్నాసాహెబ్ అహాలే పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలు
ముగిసిన వేంకటేశ్వర స్వామి ● ఆకట్టుకున్న ప్రధాన ఘట్టాలురాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో ఈ నెల 24వ తేదీన నుంచి ప్రారంభమైన మందిరం వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో అత్యంత ఘనంగా ముగిశాయి. చక్రస్నానం, విశ్వక్షేణ పూజలు, కొట్నాల దంచడం వంటి విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మందిరం ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ముగింపు ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యులతో పాటు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య విశ్వక్షేణ పూజలను నిర్వహించారు. మందిరం ఉత్సవాలకు విఘ్నాలు తొలగి సక్రమంగా పూర్యయ్యాయని సూచించే ఈ పూజలను అత్యంత శాస్ట్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కొట్నాలు దంచడం కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ధ్వజారోహణం, ఉంజల్సేవ, శ్రీనివాస కల్యాణం, సుదర్శన హోమం, వివిధ వాహనాల సేవలు, ప్రత్యేక పూజలు విజయవంతంగా నిర్వహించినట్టు మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు చంద్రమౌళి కుముంధాన్, కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్లు వెల్లడించారు. చివరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. బ్రహ్మ్మోత్సవాల విజయవంతంగా నిర్వహిచిన మందిర కమిటీ సభ్యులు, అర్చకులు, సేవాదారులు, దాతలు, భక్తులు అందించిన సహాకారాన్ని పరిచాలన కమిటీ అభినందించింది.గోవిందా.. గోవిందా నామస్మరణాల మధ్య స్వామివారికి వీడ్కోలు పలికారు. -
డిగ్రీ ప్రారంభించాలని విద్యార్థుల ఆందోళన
జయపురం: జయపురం మహారాజు సామ్రాట్ విక్రమదేవ్ వర్మ స్థాపించిక జయపురం విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో డిగ్రీ క్లాసులు తెరవాలని ఆ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. దక్షిణ ఒడిశాలో అనేక మంది నిరుపేద విద్యార్థులు +2 తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చదివేందుకు సుదూర ఖలికొట్, భువనేశ్వర్ లకు వెళ్లలేకపోతున్నారని ఇదివరకే ఇక్కడి వారు సర్కారుకు విన్నవించారు. డిగ్రీ కళాశాల నిమిత్తం గుర్తించిన స్థలాన్ని 2026–27 విద్యాసంవత్సరంలో అప్పగించాలని కోరారు. కాలేజీలో అంతర్జాతీయ స్థాయి చారు కళా ప్రదర్శన కోసం గ్యాలరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు తొలగించాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మద్దతు తెలిపారు. తాను ఎన్నాళ్ల నుంచో కళాశాలలో డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని, కళాశాల ప్లాటినమ్ జూబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని, అందుకు రూ.15 లక్షలు మంజూరు చేయించానని వెల్లడించారు. -
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
జయపురం: కేశవ ప్రభాత్ జయపురం వారిచే స్థానిక సూర్యమహల్ ప్రాంగణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయపురం స్వయం సేవక్ సంఘం పట్టణ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా భగవత్ ధ్వజానికి ప్రణామమిల్లిన తరువాత సత్య బిశాయి సంఘ ప్రార్ధనా గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యవక్త విష్ణుప్రసాద్ సాహు ఛత్రపది శివాజీ జీవితం, ఆదర్శం, సాహసం, సుపరిపాలన, హిందూస్వరాజ్య స్థాపనలో ఆయన నిర్వహించిన భూమిక, అందించిన సేవలు గురించి వివరించారు. సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ, స్వాభిమానం, దేశ సేవా భావాన్ని బలోపేతం చేయాలని స్వయం సేవక్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వయం సేవక్ సంఘ సభ్యులు సామూహిక సంగీతాలాపణలు, వ్యక్తిగత గీతాలాపనలు, వివిధ శారీరక విన్యాసాలు, వైదిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ దేశ సమైఖ్యతకు, సంస్కృతిక రక్షణ, సమాస సేవకు అంకితమౌతామని ప్రతిజ్ఞ చేశారు. -
వివాదాస్పదం
భువనేశ్వర్: చతుర్థామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీ జగన్నాథుని దేవ స్థానంలో భగవంతుని సమక్షంలో అందరూ సమానులే అన్న సంస్కృతి బలంగా ఆచరణలో కొనసాగుతుంది. రథ యాత్ర వంటి ప్రముఖ ఉత్సవాల సందర్భాల్లో ఈ ఆచారం పటిష్టంగా అమలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం 2016 సంవత్సరంలో దర్శన నియమావళి అమలు చేసింది. ఈ నియమావళి ప్రకారం స్నాన మండపంపై కొలువు దీరిన మూల విరాటులకు దూరం నుంచి దర్శించుకోవలసి ఉంది. దీని కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కంచె ఆవలి నుంచి ఎవరైనా దర్శించుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన శ్రీ జగన్నాథుని స్నాన యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి స్నాన మండపంపై మూల విరాటుల స్పర్శతో దర్శించుకున్నట్లు ఆరోపణ. జగతి నాథుని స్నాన సన్నాహాలు జరుగుతున్న తరుణంలో స్వామికి వెన్ను చూపి భగవంతుని దర్శనంతో తరించేందుకు తరలి వచ్చిన అశేష భక్తజనానికి అభివాదం చేయడం అపచారంగా పెదవి విరిచారు. ఈ చర్య భగవంతుని సమక్షంలో అంతా సమానులే అన్న సనాతన ధర్మం విలువలు నీరుగారి పోయాయని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.చెట్టును ఢీకొట్టిన బైక్ ● ఒకరి మృతి మల్కన్గిరి: చెట్టును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా పోడియా సమితి ధర్మాపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకోగా.. బిమాల్ రాజ్ (30) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్ది బిమాల్ రాజ్ ధర్మాపల్లి గ్రామానికి చెందిన బిమాల్ రాజ్ పోడియా ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. నైట్ డ్యూటీ కోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో చీకటి కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి తరువాత అటుగా వచ్చి న వారు చూసి రక్తపు మాడుగులో పడివున్న బి మాల్ను పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోడియా పోలీసు ఐఐసీ సంతోష్ కుమార్ మా ఝి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసునమోదు చేవారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం కలిమెల ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రాయగడ: రాయగడ నుంచి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు అక్రమంగా గంజాయి తరలించేందుకు సన్నహాలు చేసిన నిందితుడిని జిఆర్పి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు గుంటూరుకు చెందిన పోలాపు కృష్ణగా గుర్తించారు. అతని నుంచి 3.500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. జిఆర్పి డీఎస్పీ ప్రభాత్ కుమార్ త్రిపాఠి ఆదేశానుసారం ఐఐసీ వినయ్ కుమార్ మిర్జ్, ఎస్ఐ సంతోష్ కుమార్ పరిడ, ఏఎస్ఐ మానిక్ చంద్ర గౌడొలు స్థానిక రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫారం వద్ద అనుమానస్పదంగా కనిపించే పోలాపు కృష్ణ వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగు లో గంజాయి లభ్యమైంది. రాయగడ నుంచి గుంటూరుకు గంజాయిని తరలిస్తున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. -
మొక్కల సంరక్షణకు చర్యలు
జయపురం: మొక్కల సంరక్షణకు జయపురం సోషియల్ ఎన్విరల్మెంటల్, ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది వనమహోత్సవ కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు పూనుకుంది. సీవా గత ఏడాది జయపురం సమితి గగణాపూర్ ఉద్యాన వనంలో నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డి, పనికిరాని మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. అలాగే మొక్కలకు గార్డులను ఏర్పాటు చేసి సస్యరక్షణ చర్యలను సోమవారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో 15 మంది సీవా కార్యకర్తలతో పాటు ఎకంబా గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవా కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ఏడాది వనమహోత్సవంలో తమ సంస్థ గగణాపూర్ ప్రాంతంలో 2,100 వివిధ రకాల మొక్కలు నాటిందన్నారు. వాటిలో 1700 మొక్కలు జీవించి ఉన్నాయని చెప్పారు. మిగతావి తగిన యాజమాన్యం లేక చనిపోయాయని వెల్లడించారు. ఇక నుంచి మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొక్కలు చెట్లుగా ఎదిగేందుకు అవసరమైన ఎరువులతో పాటు క్రిమిసంహరణ మందులు వేసి సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. -
ఘనంగా విక్రమ దేవ్ వర్మ జయంతి
కళా, చారు కళా కళాశాలలో మహారాజ్ విక్రమదేవ్ వర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కళాశాలలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విక్రమ్ కళా, చారు కళా మహావిద్యాలయ ప్రిన్సిపాల్ యుధిష్టర్ మల్లిక్ అధ్యక్షతన జరిగిన జయంత్యుత్సవంలో ఉపాధ్యక్షుడు సాహితీ వేత్త డాక్టర్ సుధాంశు శేఖర మహాపాత్ర ప్రసంగిస్తూ మహారాజ్ విక్రమదేవ్ వర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. జయపురం సాహితీ సంస్థ పూజ్య పూజ సంసద్ వారు మహారాజ విక్రమదేవ్ వర్మ 158 వ జయంతిని ఘనంగా జరిపారు. స్థానిక విక్రమదేవ్ వర్మ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల విక్రమదేవ్ కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉత్కళ సమ్మిళినీ కొరాపుట్ యూనిట్ జయపురం వారు మహారాజ్ రాజర్షి విక్రమదేవ్ వర్మ జయంతి సందర్బంగా ఆయన ప్రతిమకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జయపురం సాహితీ పరిషథ్, ఒడిశా సాహిత్య ఎకాడమీలు సంయుక్తంగా జయపురంలో నివాళులు అర్పించారు.జయపురం: జయపురం మహారాజు రాజర్షి విక్రమదేవ్ వర్మ 158 వ జయంతి వేడుకలను స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ మహేశ్వర చంద్ర నాయిక్ అతిథులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీజీసీ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో రాజర్షి విక్రమదేవ్ వర్మ విద్యా ప్రగతికి అందించిన సేవలను వివరించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్త లక్ష్మీకాంత పాఢీ మాట్లాడుతూ రాజర్షి విక్రమదేవ్ వర్మ జీవనం, సాహిత్యం, విద్యారంగానికి అందించిన సేవలు వివరించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నేషనల్ అల్యూమిన లిమిటెడ్(నల్కో) కార్యనిర్వాహక డైరెక్టర్ అమరేంధ్ర కుమార్ మిశ్ర ప్రసంగిస్తూ విద్యపై విక్రమదేవ్ వర్మ దూరదృష్టి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆయన సేవలు గుర్తు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విక్రమదేవ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ హృషికేష్ శనాపతి తన ప్రసంగంలో విక్రమదేవ్ ఆశయాలు నేరవేర్చేందుకు విద్య, పరిశోధన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు మరింతగా బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు. పలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో.. విక్రమదేవ్ వర్మ విద్యా ప్రధాత అని బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ సామ్రాట్ అని పలువురు వక్తలు కొనియాడారు. సాహితీ సామ్రాట్ విక్రమదేవ్ వర్మ 158 వ జయంతి సందర్బంగా జయపురం పట్టణంలో పలు సంస్థలు విద్యాలయాలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. స్థానిక విక్రమ -
ఏవోబీలో మావో డంప్ స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి గుంటాబేడ, కదంగూఢ గ్రామాల అటటీ ప్రాంతంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీవీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించడం కోసం శనివారం అడవుల్లోకి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున వస్తున్న సమయంలో డంప్ వారికి తారసపడింది. దీంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీలు, వాకీటాకీలు, ఇతర వస్తువులు ఉన్నట్టు గుర్తించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో ఎస్పీ వినోద్ పటేల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ డంప్ను భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకొని మావోలు దాచినట్టు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన డండ్లో రెండు ఎస్ఎల్ఆర్ తుపాకీలు, రెండు నాటు తుపాకీలు, ఒక మ్యాగజైన్ లేని పిస్టల్ (అమెరికా తయ్యారీ), ఒక 303 బారెల్ గన్, రెండు కేజీల ఐఈడీ ఒకటి, ఐదు కిలోల ఐఈడీ ఒకటి, ఒక కై ్లమోర్ గన్, ఐదు బుల్లెట్లు, ఏడు వాకీటాకీలు, మూడు వాకీటాకీల చార్జర్లు, మూడు వాకీటాకీ బ్యాటరీలు, రెండు వాకీ యాంటీనాలు, వైర్తో ఎంసీపీ స్విచ్ నాలుగు మీటర్లు, లోహపు పైపులు ఐదు, కరెంట్ వైరు, చార్జర్, కొంతమందుగుండ సామగ్రి, 45 పెన్డ్రైవ్లు, ఒక హర్డ్డిస్క్, పవర్బ్యాంక్, ముబైల్ బ్యాటరీ, 80 లీటర్ల డ్రమ్, మందుల కిట్, కీబోర్డ్, పది మీటర్ల జీఐ పైపు, గొడుగులు, విప్లవ సాహిత్యం ఉన్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెలలో రెండు మావోయిస్టుల డంప్లను స్వాధీనం చేసుకోవడం జవాన్లు సాధించిన విజయంగా చెప్పారు. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా కెడార్ మావోయిస్టులకు చెందినదిగా గుర్తించామన్నారు. ఎస్పీ వినోద్ పటేల్, అలాగే జవాన్లు, కేంద్ర హోమ్శాఖ విధించిన తేదీ నాటికి జిల్లాను మావో రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. -
ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై ఏఐ నిఘా
భువనేశ్వర్: ట్రాఫిక్ నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అమలు కానుంది. నగర ప్రాంతాల్లో ప్రధానంగా జంట నగరాల్లో అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో కటక్ నగరంలో ఎంపిక చేసిన కీలక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచడానికి ఈ వ్యవస్థ పటిష్టంగా దోహదపడుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భువనేశ్వర్ కంట్రోల్ రూమ్ నుండి కెమెరా వ్యవస్థ ద్వారా నేరుగా ఇ–చలాన్ జారీ చేస్తారు. పోలీసులు ఇకపై సంప్రదాయ రీతిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలను తీయాల్సిన అవసరం లేదు. అధునాతన ఏఐ కెమెరాలు ఉల్లంఘన దృశ్యాలను తక్షణమే బంధించి వాస్తవ వేళ, తేదీ, స్టాంప్తో సంబంధిత వాహన చోదకుని మొబైల్ ఫోనుకు ఎస్ఎంఎస్ ప్రసారం చేసి ఇ–చలాన్ జారీ చేస్తుంది. కటక్ నగరంలో 22 అత్యంత రద్దీ ప్రాంతాలైన మధుపట్న, బాదంబాడి, రాణీ హాట్, కాలేజ్ స్క్వేర్, ఓఎంపీ, సతీ చౌరా, బజ్రక్ బాటి, బక్సీ బజార్, ఎస్పీ ఆఫీస్ ఛక్, బెల్ వ్యూ చక్, ప్రెస్ చక్, జోబ్రా బ్యారేజ్ మొదలైన కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త వ్యవస్థ అంచెలంచెలుగా నెల రోజుల్లో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. -
గజపతి జిల్లాలో పల్స్పోలియోకు అనూహ్య స్పందన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో, ఎం.సి.హెచ్ మెటర్నరీ ఆస్పత్రిలో పోలియో– 2026 కార్యక్రమాన్ని జిల్లా ముఖ్యవైద్యాధికారి, పబ్లిక్ హెల్త్ అధికారి మంజురాణీ జెన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,070 పోలియో బూత్లలో మూడు రోజుల పాటు 66,363 మంది శిశువులకు పోలియో చుక్కలమందు వేయడానికి లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పలువురు 0 నుండి 5 ఏళ్ళ చంటిపిల్లలకు పోలియో చుక్కలు వేసి సీడీఎంవో మంజురాణీ జెన్నా ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంవో డాక్టర్ శంతును కుమార్ పాఢి, డీపీఎం సరితా మహాపాత్రో, డి.ఎం.ఆర్.సి.హెచ్.ఎం ప్రణతీ సాహు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్వామి స్నాన యాత్ర ఉత్సాహం
భువనేశ్వర్: సోదర సోదరీ సమేతంగా శ్రీ జగన్నాథుడు ఆచారబద్ధమైన స్నానం కోసం సంప్రదాయబద్ధంగా సోమవారం స్నాన మండపాన్ని సందర్శించనున్నారు. శ్రీ మందిరం సుదీర్ఘ మేఘనాథ్ ప్రహరి ప్రాంగణంలో స్నాన మండపం రంగులు హద్దుకుని ముస్తాబు అవుతుంది. దైతపతి సేవకులు ఆలయంలోకి ప్రవేశించేయడంతో ప్రాథమిక క్రతువులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. పవిత్రమైన స్నాన యాత్ర సందర్భంగా, ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి తరలిరావడం ప్రారంభించారు. భక్తుల పోటు క్రమంగా పుంజుకుంటోంది. శ్రీ క్షేత్రం భక్తుల తాకిడితో కళకళలాడుతుంది. పూరీ పోలీసులు యాత్రికుల సౌలభ్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరంలో మరియు చుట్టుపక్కల తగినంత భద్రతా బలగాలను మోహరించారు. నేటి స్నాన యాత్ర కాలక్రమం పవిత్ర జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని ఏటా తరహాలో సోమవారం శ్రీ క్షేత్రంలో శ్రీ జగన్నాథుని స్నాన యాత్ర జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చివరి దశలో మెరుగులు దిద్దుకుంటున్నాయి. తండోపతండాలుగా తరలి వచ్చే యాత్రికులకు సులభ దర్శనం కల్పించడంతో స్నాన యాత్ర క్రతువుల్ని సకాలంలో క్రమ పద్ధతిలో పూర్తి చేయాలని యంత్రాంగం కృషి చేస్తుంది. సోమవారం ఉదయం 5 గంటలకు రత్న వేదిక నుంచి మూల విరాటుల్ని వరుస క్రమంలో స్నాన మండపానికి తరలించడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ ఉదయం 7 గంటలు సరికి పూర్తి చేయాలని ఖరారు చేశారు. స్నాన మండపంపై దేవతా మూర్తులు ఆసీనులు కావడంతో జగతి నాథుని అభిషేకం కోసం పవిత్ర జలాన్ని కలశాల్లో తరలిస్తారు. మద్యాహ్నం 12 గంటలకు ఈ సన్నాహం ఆరంభించి 2 గంటలు సరికి అభిషేకం ఆరంభించేందుకు నిర్ధారించారు. అశేష భక్త జనం మధ్య భారీ స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథుడు గజాననుని రూపంలో భక్తులకు అపురూప దర్శనం ప్రసాదించడం స్నాన యాత్ర ప్రాధాన్యత. రాఘవ దాస్ మఠం, గోపాల తీర్థ మఠం వర్గాలు సిద్ధం చేసిన గజానన అలంకరణ సరంజామా తరలించి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అలంకరణ పూర్తి చేస్తారు. అలంకరణ అనంతరం స్నాన మండపంపై అనుబంధ సేవాదులు ముగించి సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిరవధికంగా 2 గంటల పాటు భక్తులకు సర్వ దర్శనం సౌకర్యానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ మందిరం సింహ ద్వారం గుండా లోనికి ప్రవేశించి స్నాన మండపంపై గజానన రూపధారణలో కొలువైన శ్రీ జగన్నాథుని సోదరసోదరీ సమేతంగా దర్శించుకుని శ్రీ మందిరం లోపల నుంచి మిగిలిన 3 ద్వారాల గుండా వెలుపలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసి రద్దీ నియంత్రణకు మార్గం సుగమం చేశారు. -
గొంతు కోసి వృద్ధుని హత్య
జయపురం: రాత్రి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుని గొంతు కోసి హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ అమానుష హత్యాకాండ జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి చిపాకూర్ పంచాయతీ సమితి కావుకుండ గ్రామంలో జరిగింది. హత్య చేసిన వ్యక్తి ఆ గ్రామంలో లక్ష్మణ గొలారి(65) అని పోలీసు అధికారి వెల్లడించారు. గొలారి తన ఇంటి ముంగిట మంచంపై పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో వృద్ధుని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఉదయం గొలారి ఇంటివారు లేచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మణ గొలారి చూచి బోరు మన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందారు. మృతుడి కుమారుడు రుతి గొలారి బొయిపరిగుడ పోలీసు సేష్టన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ టీమ్తో పాటు పోలీసు డాగ్ ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో హహత్యకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించినటు్ల్ పోలీసులు వెల్లడించారు. -
పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి
కొరాపుట్: పిడుగు పాటుకి తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ డివిజన్ రాయిఘర్ సమితి ముండాబెడా గ్రామ పంచాయతీ నినాష్పనీ గ్రామంలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఇదే సమయంలో పువ్వులు కోయడానికి తల్లి దైమతి ముదలి (60), కుమార్తె చంపా ముదలి (30) వెళ్లారు. ఇదే సమయంలో వర్షం నుంచి రక్షించుకోవడానికి సమీప వృక్షం కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగు పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునే సరికే వారిద్దరు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేడు మజ్జిగౌరి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు సోమవారం చేపట్టనున్నట్లు ఆలయ పరిచాలన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి తహసీల్దార్, ఎండొమెంట్ ఇన్స్పెక్టర్, మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మందిరం సూపరింటెండెంట్ల సమక్షంలో హుండీలను తెరుస్తారు. అనంతరం లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతారు. పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య జరిగే ఈ లెక్కింపులో సహకరించేందుకు శ్రీకళ్యాణవేంకటేశ్వర మందిరం సేవా కమిటీ సభ్యులు, సాయి సేవా సమితి సభ్యులు పాల్గొంటారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సుమారు 11 గంటల సమయం పడుతుంది. అనంతరం పూర్తి వివరాలను కమిటి తెలియజేస్తుందని పేర్కొన్నారు. పునః మూల్యాంకనంతో టాపర్లలో స్థానం భువనేశ్వర్: జవాబు పత్రాల పునః మూల్యాంకనం అనంతరం కటక్లోని సాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన ఒక విద్యార్థిని కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) ఈ ఏడాది నిర్వహించిన 12వ తరగతి బోర్డ్ పరీక్షలో ప్రాంతీయ టాపర్లలో ఒకరిగా నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన హ్యుమానిటీస్ విభాగం విద్యార్థిని సౌమిలి మైత్రా పునః మూల్యాంకనం తర్వాత 99.2 శాతం మార్కులు సాధించి ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ప్రాంతీయ పరిధిలో టాపర్లలో స్థానం సంపాదించి సంచలనం రేపింది. సౌమిలి విజయం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనం. ఇది తోటి విద్యార్థులను విద్యాపరంగా ఉన్నత ప్రమాణాలను సాధించడానికి ప్రేరేపిస్తుందని సర్వత్రా ప్రశంసలు అందుకుంది. 22 కింగ్ కోబ్రా పిల్లలు లభ్యం కొరాపుట్: ఒకే చోట 22 కింగ్ కోబ్రా పిల్లలు లభ్యం అయ్యాయి. కొరాపుట్ జిల్లా సునాబెడా పట్టణంలో టైప్ సీ కాలనీలో స్థానికులు పాము పిల్లల కదలికలు గమనించారు. వెంటనే అగ్ని మాపక, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. వారు నేర్పుగా ఆ ప్రాంతం గాలించగా 22 పాము పిల్లలు సేకరించారు. వాటిని నేర్పుగా ఒక బకెట్ లో వేసి భద్ర పరిచారు. అటవీ శాఖ సిబ్బంది వాటిని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడతామని ప్రకటించారు. -
మోహిని అవతారంలో శ్రీవారి దర్శనం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణవేంకటేశ్వర మందిరంలో జరుగుతున్న మందిర వార్షికోత్సవంతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి మోహిని అవతారంల్లో స్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. రంగురంగుల పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులు, మంగళ వాయిద్యాల నడుమ మందిర ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు మందిరానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షీర సాగర మథన సమయంలో అమృతాన్ని దేవతలకు అందించేందుకు మహావిష్ణువు ధరించిన మోహిని అవతారాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శేష వాహనం, గజవాహనంపై స్వామి వారు ఊరేగించారు. మందిరం సేవా కమిటీకి చెందిన మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అంతకుముందు స్వామి వారి సన్నిధిలో శాత్తుమురై పూజలను వేదపండితులు నిర్వహించారు. అలాగే హయగ్రీవ హోమం చేపట్టారు. కార్యక్రమాల్లో మందిర పరిచాలన కమిటీ అధ్యక్షులు చంద్రమౌలి కుముంధాన్ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
రాయగడ: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకుని విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ద్యమీ ఒడిశా అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమం స్థానిక గొవింద చంద్ర దేవ్ ఉన్నతపాఠశాల మైదానంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ దేవేష్ రంజన్ ధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ముఖ్యవక్తగా సీనియర్ పరిశ్రమల అధికారి సవ్యసాచి సాహు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ రంగం పాత్రను వివరించారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
పర్లాకిమిడి: స్థానిక జంగంవీధి జంక్షన్ వద్ద గత ఎస్ఎ కల్యాణ మండపంలో గురువాణీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆథ్మాత్మిక ప్రవచనాలను అల్యాన వినయ్కుమార్ రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం గజేంద్ర మోక్ష్యాన్ని వినయ కుమార్ వివరించారు. భాగవతంలో కొన్ని అంశాలు సామాజిక స్థితిగతులను పోల్చుతూ దివ్యంగా ప్రవచనాలు చెప్పారు. అంధ్రప్రదేశ్, ఒడిశాలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేశారు. ప్రవచనాలు వినడానికి వచ్చిన వారికి పాతపట్నం మండలం కాపు గోపాలపురం గ్రామానికి సంజీవ రామదాసు ప్రసాద సేవనం కల్పించారు. ప్రవచనాలు చెబుతున్న వినయకుమార్ -
చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్లో నాన్ క్యాడర్ ప్రాసిక్యూటర్ల పరిచయం, పునశ్చరణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయాలయం, హోంశాఖ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమంలో ఆర్.ఉదయగిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్సు డిప్యూటీ డైరెక్టరేట్ అజిత్ పట్నాయక్, జిల్లా న్యాయలయం సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, ఎం.పృథ్వీరాజ్ తదితరులు హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రోసిడ్యూర్ కోడ్ బి.ఎన్.ఎస్., బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూలషంగా చదివి తదనంతరం కేసులను విచారించాలని అజిత్ పట్నాయక్ అన్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు అధికారి రాజేష్ కుమార్ సాహు కూడా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొత్త చట్టాలు అనుసరించి ఫోరెన్సిక్, క్రిమినల్ సెక్షన్లను తెలుసుకుని కేసులను దర్యాప్తు చేయాలన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల సందడి
అరసవల్లి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు సజావుగా జరిగేలా ఏర్పాటు చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టికెట్ల భక్తులకు అంతరాలయ దర్శనం చేయించారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఫ్యాన్లు పని చేయకపోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు, క్యూలైన్లలో సెల్ఫోన్లు చెకింగ్ పాయింట్ల వద్ద గంటల తరబడి వేచివుండడంతో దర్శనాలు ఆలస్యం కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, కొబ్బరి కాయలు కొట్టిన చోట అదనపు వసూళ్లు జరిగాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకే పాయింట్ వద్ద చెప్పుల కలెక్షన్ ఉండటంతో భక్తులకు పాట్లు తప్పలేదు. ఆదిత్యుని సన్నిధిలో అసోం చీఫ్ సెక్రటరీ.. అరసవల్లి సూర్యనారాయణ స్వామిని జిల్లాకు చెందిన అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
మద్యానికి మరొకటి..
ఒంటి మీద వస్త్రం నిలవనంత మత్తు.. ఎదురుగా వాహనం కనిపించనంత నిషా.. ఎంత ఘోరం జరిగిందో గుర్తు పట్టలేనంత మైకం.. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలికొంది. డ్రైవర్ నెత్తికెక్కిన మత్తు, అతివేగానికి ఫలితంగా మూడు కుటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి. పొద్దున్నే సామాన్లు కొని సాయంత్రానికి అమ్మేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్న ఆడ పడుచుల ప్రయాణం నడిరోడ్డుపైనే ఆగిపోయింది. కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో లగేజీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. నుజ్జునుజ్జు అయిన ఆటో కవిటి: ఉద్దానం ప్రాంతంలో పండే కొబ్బరి కాయ లు, పనస పండ్లు, అరటికాయలు, మునగ వంటి ఉత్పత్తుల్ని ఇక్కడ కొనుగోలు చేసి వాటిని బరంపురం మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవడం వారికి జీవనోపాధి. అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయల్దేరారు. సాయంత్రానికి అన్నీ అమ్మేసి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు మహిళలకు ఇదే చివరి రోజైంది. మద్యం మత్తులో లారీని నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వారి జీవితాల్ని గాలిలో కలిపేసింది. కంచిలి మండలం ఆదివారం సంత నుంచి లగేజీ ఆటోలో వెళుతున్న ముగ్గురు మహిళలు కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం గుజ్జుపుట్టుగకు చెందిన మురపాల పార్వతి(50), రాపాకపుట్టుగ కు చెందిన నర్తు పద్మమ్మ (60), ఇచ్ఛాపురం పట్టణం అమీన్సాహేబ్పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52)తో పాటు మరికొందరు మఖరాంపురం జంక్షన్ వద్ద సంతకు వెళ్లేందుకు ఆదివారం లగేజీ ఆటోపై బయల్దేరారు. మఖరాంపురం జంక్షన్లో సరుకు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యా రు. సరిగ్గా జమేదారుపుట్టుగ జంక్షన్కు వచ్చేసరికి ఆటోను రోడ్డు పక్కగా నిలిపారు. అయితే అదే సమయానికి వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ ఈ ఆటో ను అమాంతం ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకుపో యి విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వారిలో రాపాకపుట్టుగకు చెందిన నర్తు ఎర్రయ్య, బరంపురానికి చెందిన బొడ్డు కేశవులు, రాపాకపుట్టుగకు చెందిన మామిడి మోహినమ్మ, కామాక్షి ఉన్నారు. వీరిలో మోహినమ్మ, కామాక్షి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి చూసి అందరూ విస్మయం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ఒంటిపై తువ్వాలు నిలవడం లేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆయా కుటుంబాల వారికి విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తమకు అన్నం పెట్టే చేతులు ఇక లేవని కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో నర్తు పద్మమ్మకు భర్త బాబయ్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మురపాల పార్వతికి భర్త ఢిల్లీరావు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మద్దిలి తరిణమ్మకు భర్త దాలయ్య, కొడుకు, కూతురు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్ధనరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ భంజారౌత్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ వెళ్లి పరామర్శించారు. జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళల దుర్మరణం నలుగురికి గాయాలు మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ -
జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యం
● ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు అందిస్తానని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం వార్షిక ఉత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. వార్షికోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, సబ్డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు తదితరులు విచ్చేశారు. ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్రనాథ్ పాడీ అధ్యక్షత వహించారు. వార్షిక పట్టికను కార్యదర్శి సరోజ్ బీర్ చదివి వినిపించారు. గౌరవ అతిథిగా హాజరైన ప్రగతివాది ఒడియా పత్రిక ముఖ్యసంపాదకులు విరూపాక్ష త్రిపాఠి మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులకు నెలసరి పింఛన్, అక్రిడియేషన్, భద్రత, మృతిచెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై నవంబర్లో ఒడిశా అసెంబ్లీ ఎదుట ఆందోళన జరుపుతామన్నారు. గజపతి జిల్లాలో చాలా రోజుల తరువాత ఎస్.డి.పి.ఓ రాకేష్ కుమార్ సాహు (ఆర్.ఉదయగిరి) ఐ.పి.ఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణాను అరికట్టి అనేక మందిని అదుపులోకి తీసుకున్నారని ఉత్కళ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ద్విజేంద్ర నాథ్ పాడీ అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం రాకేష్ కుమార్ సాహును ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్.డి.పి.ఓ రాకేష్ కుమార్ సాహు మాట్లాడుతూ..గజపతి జిల్లాకు తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణాను ఎలా అరికట్టాలి, గజపతి అంటే గంజాయి జిల్లా అనే అపవాదును ఎలా రూపుమాపాలన్న అంశంతో పనిచేశానన్నారు. త్వరలోనే గజపతి జిల్లా ప్రజలకు శుభవార్త చెబుతానన్నారు. అనంతరం కొత్తగా ఉత్కళ జర్నలిస్టుల సంఘంలో చేరిన సభ్యులకు ఐడీ కార్డులను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అందజేశారు. -
ఆ రెండు చుక్కలే శ్రీరామరక్ష
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి: పోలియో నిర్మూలన లక్ష్యంగా వరుస గా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో మారుమూల ప్రాంతంలో చిన్నారికి కూడా పోలియో డ్రాప్స్ ఇచ్చేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ఆదివారం స్థానిక నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేడ్కర్ భవన్ వద్ద పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ కె.అనితతో కలి సి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 వయస్సు గల చిన్నారులు 1,80,879 మందికి తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, ఈ మేరకు కొండ ప్రాంతాలతో పాటు వలసదారుల పిల్లలకు కూడా ఈ డ్రాప్స్ వేయించాలన్నారు. ఈ రెండు చుక్కలే భవిష్యత్కు శ్రీరామరక్ష అని అన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ జి ల్లాలో మొత్తం 30 మండలాల్లో అన్ని మారు మూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ పోలియో డ్రాప్స్ వేయించేలా మొబైల్ బృందాలను నియ మించామన్నారు. మొత్తం 1096 పోలియో బూత్లలో మొత్తం 7430 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. -
మినీ ట్రక్కు ఢీకొని బాలిక మృతి
కొరాపుట్: మినీ ట్రక్కు ఢీకొని బాలిక మృతి చెందిన విషాధకర ఘటన జరిగింది. ఆది వారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పాత బస్టాండ్ వద్ద జొరిగాం సమితి డొంగ్రిగుడ గ్రామానికి చెందిన మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి రోడ్డుపై నడుస్తుంది. ఇంతలో మినీ ట్రక్కు వేగంగా వచ్చి బాలికని ఢీ కొంది. గాయాలపాలైన బాలికను ఓ ఆటో డ్రైవర్ వెంటనే తన ఆటోలో ఉమ్మర్కోట్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రక్కు డైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష రాయగడ: బనహార్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన కేవలం 367 రోజుల్లొనే న్యాయ స్థానం తీర్పును వెలువరించి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జిల్లా ఎస్పీ జిఆర్ రాఘవేంద్ర పర్యవేక్షణలో బనహార్పల్లి పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించారు. దీంతో కేసు ఏడాదిలోపే విచారణ పూర్తయ్యి నిందితుడికి శిక్ష ఖరారైంది. 2025 బనహార్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో నిందితుడు అజయ్ సింగ్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అభియోగాలు రుజువు కావడంతో కోర్టు అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు రూ.50వేల జరిమానా విధించింది. బాధిత చిన్నారికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ.8 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. శ్రీముఖలింగంలో ఘనంగా మైనాకోత్సవం జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో ఆదివారం స్వామికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతి పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామివారి గృహాన్ని దహనం చేస్తాడు. కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా పరగణిస్తారు. పాలీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం ఎచ్చెర్ల: ఏపీ పాలీసెట్–2026 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వెబ్ ఆప్షన్లు నమోదు సమయంలో ఉపయోగించే మొబైల్ నంబర్ తప్పనిసరిగా అభ్యర్థి లేదా వారి తల్లిదండ్రు లది ఉండాలి. ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకసారి వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని తిరిగి మార్చడం, తెరవడం సాధ్యం కాదు. హెల్ప్లైన్ సెంటర్లో కూడా ఓపెన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని ఆప్షన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్ర మే ఫ్రీజ్ చేయాలి. వెబ్ ఆప్షన్లు నమోదు చేయ డానికి ముందు కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో ఒక కాగితంపై ముందుగా రాసుకుని అనంతరం అదే క్రమంలో వెబ్సైట్లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లో మార్పు అవసరమైతే అభ్యర్థి సంబంధిత హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి సెట్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. పునరావాస కాలనీలో పనులు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం పునరావాస కాలనీలో పంచాయతీ అధికారులు పనులు చేపట్టారు. ‘ఎవరికి చెప్పినా ఏం లాభం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సెలవు రోజు అయినా పనులను చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుతురు తెచ్చారు. నిల్వ ఉన్న మురికినీటిని మళ్లించారు. గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పునరావాస కాలనీలో 13 సెంట్లు కేటాయించామని తహసీల్దార్ హేమసుందర్రావు తెలిపారు. -
యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో యువ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు కల్పించి, అనేక రాయితీలు ఇవ్వాలని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు పలువురికి ఉపాధి లభిస్తుందని సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజు అన్నారు. అంతర్జాతీయ జిల్లా సూక్ష్మ, మధ్య, బృహత్తర ఎంటర్ప్రైజర్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ఆర్శెఠ్టి భవనంలో ‘ఉద్యామీ ఒడిశా, జిల్లా సూక్ష్మ, బృహాత్తర, మధ్యమ ఎంటర్ప్రైజెస్’ ఐదు రోజుల వర్క్షాపును జిల్లా ఉద్యావనశాఖ, డిప్యూటీ డైరెక్టర్ జుస్మంత బెహరా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ అధికారి రబీంద్రకుమార్ అధెక్, జిల్లా పారిశ్రామిక శాఖ జి.ఎం.బిభురంజన్ స్వయిని, మిషన్ శక్తి ఓ.ఎల్.ఎం టిమోన్ బరా, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంకు మ్యానేజర్ ఆశిత్ కుమార్ జెన్నా, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. జిల్లా పారిశ్రామిక శాఖ జి.ఎం బిభూ రంజన్ స్వయిని మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో 76 క్యాష్యూ ఇండస్ట్రీలు, 14 గ్రానైట్ పరిశ్రమలు, గుసాని సమితిలో కోస్టల్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్, మరో 60 కుటీర పరిశ్రమలు ఉన్నాయన్నారు. గజపతిజిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న తర్వాత అనాసపనస, చింతపండు, మామిడి, పనస పంట సాగుచేస్తున్నారని, జిల్లాలో కోల్డు స్టోరేజీ లేకపోవడం వల్ల శ్రీకాకుళంలో ఉన్న కోల్డు గిడ్డంగులకు ఇక్కడి నిల్వలు ఉంచుతున్నారని సిసిడి సంస్థ అధినేత ఎ.జగన్నాథ రాజు అన్నారు. గజపతి జిల్లాలో కొత్తగా డ్రాగన్ ఫ్రూట్, ఖోఖో, లిచ్చి ఉద్యానవనాలను గిరిజన రైతులు పండిస్తున్నారు. -
ఉద్యోగం నుంచి తొలగింపు
మోసం చేసిన ప్రియుడు..భువనేశ్వర్: ప్రేమ వ్యవహారంలో నమ్మించి మోసం చేసిన ప్రియుడికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వైద్య విద్యార్థిని చంద్రిక మృతి కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆమోదంతో ఈ మేరకు చర్యలు చేపట్టడం సంచలనం రేపింది. వైద్య విద్యార్థిని చంద్రికా హేంబ్రమ్, ఓఏఎస్ ట్రెయినీ (ఓటీఏఎస్) అధికారి అయిన భీమ్సేన్ టుడు ప్రేమికులు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడంతో కథ అడ్డంగా తిరిగింది. ఆమె నల్లని ఛాయపై కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వేధించినట్లు ఆరోపణ. ఇంతలో మరో యువతితో ప్రేమ వ్యవహారం బయటపడడంతో చంద్రిక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చంద్రిక మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఓఏఎస్ ట్రైనీ (ఓటీఏఎస్) అధికారి అయిన భీమ్సేన్ టుడుని ఓఏఎస్ శిక్షణ సమయంలో పోలీసులు అరెస్టు చేసి న్యాయ స్థానం అనుమతితో సుదీర్ఘంగా విచారణ కొనసాగించడంతో చట్టపరమైన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాస్వతంగా తొలగించారు. భవిష్యత్లో అతడిని మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడిగా పరిగణించరు. అరెస్టు తర్వాత భీమ్సేన్ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల అతడిని రిమాండ్లోకి తీసుకుని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. క్రిమినల్ కేసులో నిరవధికంగా 48 గంటలకు పైగా పోలీసుల అదుపులో ఉన్నందుకు చట్టం ప్రకారం అతడిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు. భీమ్సేన్ను 2 రోజుల రిమాండ్కు తీసుకునేందుకు కటక్ ప్రథమ శ్రేణి జుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు (జేఎంఎఫ్సీ) అనుమతించింది. త్రికోణ ప్రేమ కారణంగా చంద్రిక మరణం సంభవించిందని పోలీసులు తెలిపారు. ప్రియుడు భీమ్సేన్ను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తు ప్రక్రియను ముమ్మరం చేశారు. డిజిటల్ సాక్ష్యాల ఆధారంతో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని కటక్ డీసీపీ తెలిపారు. భీమ్సేన్ రెండో ప్రియురాలిని త్వరలో విచారించడం జరుగుతుందన్నారు. -
వైభవంగా వెంకటేశ్వరుని కల్యాణోత్సవం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణవెంకటేశ్వర మందిరం 32వ వార్షికోత్సవాలతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగో రొజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా స్వామి వారి పూజలు కొనసాగుతున్నాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో మందిర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపొయింది..బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన ఊంజల్ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శ్రీదేవి–భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం మందిరానికి సమీపంలోని కల్యాణ మండపంలో అత్యంతభవంగా జరిగింది. మందిర ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం రమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివ్య కల్యాణాన్ని తిలకించిన భక్తులు స్వామి వారి అనుగ్రహంతో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే మందిరంలో ప్రత్యేక వ్రతాలు, సుదర్శన హోమం, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. హోమంలొ పాల్గొన్న భక్తులు కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బ్రహోత్సవాల సందర్భంగా మందిరం ప్రాంగణంలో చిన్నారుల భరతనాట్యం అందరినీ ఆకర్షించింది. ఉత్సవాలను తిలకించేందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరావు దంపతులు ప్రత్యేక అతిథిగా వెళ్లారు. స్వామి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మందిరం పరిచాల కమిటీ అధ్యక్షులు చంద్రమౌలి కుముంధాన్ , కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు రాంజీ ఆచార్యులు నెక్కంటికి శాలువాను కప్పి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
త్వరలో కొత్త చలన చిత్ర విధానం: సీఎం
ఉత్తమ చిత్రం: పుష్కర, మై స్వీట్ హౌస్ వైఫ్ ఉత్తమ దర్శకుడు: పినాకి సింగ్ (మై స్వీట్ హౌస్ వైఫ్) ఉత్తమ ప్రధాన నటుడు: హరిహర్ మహా పాత్రో (ధో రే బాబు ధో) ఉత్తమ ప్రధాన నటి: నైనా దాష్ తివారీ (మై స్వీట్ హౌస్ వైఫ్), సుప్రియా నాయక్ (పుష్కర) ఉత్తమ సహాయ నటుడు: చౌధురి జయప్రకాష్ దాస్ (ఫాల్గుణ చైత్ర) ఉత్తమ సహాయ నటి: సూర్యమయి మహా పాత్రో (డెలివరీ బాయ్) ఉత్తమ విలన్: చౌధురి వికాస్ దాస్ (కటక్ – శేషొ రు ఆరొంభొ) ఉత్తమ విలన్ నటి: పింకీ ప్రధాన్ (ధో రే బాబు ధో) ఉత్తమ హాస్య నటుడు: సంతోష్ కుమార్ కండి (శాంతి అపార్ట్మెంట్) ఉత్తమ బాల నటి: అహియా నంద (శాంతి అపార్ట్మెంట్) ఉత్తమ కథా రచయిత: పినాకి శ్రీచందన్ (నియతి) ఉత్తమ స్క్రీన్ ప్లే: ప్రణవ్ ప్రసన్న రథ్ (ఫాల్గుణ చైత్ర) ఉత్తమ సంభాషణల రచయిత: భరద్వాజ్ పండా (మ్యాన్ మ్యూజియం) ఉత్తమ సంగీత దర్శకుడు: శరత్ నాయక్ (మాన్ మ్యూజియం) ఉత్తమ గీత రచయిత: డాక్టర్ నమిందా నాయక్ (మో మట్టి మో పంయి బాసచందన్, మహర్షి) ఉత్తమ నేపథ్య గాయకుడు: విష్ణు మోహన్ కొబి (మో మట్టి మో పంయి బాస చందన్, మహర్షి) ఉత్తమ నేపథ్య గాయకుడు: అంతర చక్రవర్తి (ఆరే మేగొ ఆ, మ్యాన్ మ్యూజియం) ఉత్తమ ఛాయాగ్రహణం: రుద్రకాంత్ సింగ్ (మై స్వీట్ హౌస్ వైఫ్) ఉత్తమ ఎడిటింగ్: రష్మీ రంజన్ దాస్ (ఏ ఆకాష్ తొలే) ఉత్తమ కళా దర్శకుడు: కళింగ కేశరి నాయక్ (పుష్కర) ఉత్తమ నృత్య సమన్వయకర్త: మంటు జెనా (డెలివరీ బాయ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: రాజ్ కిషోర్ జెనా (లవ్ ఇన్ లండన్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వాసిదియా తబస్సుమ్ (ఫల్గుణ్ చైత్ర) ఉత్తమ వినోద చిత్రం: రాకేష్ కుమార్ జెనా (మలయగిరి–కహానీ చచిత్ర) ఉత్తమ పిల్లల చిత్రం: డాక్టర్ త్రిలోచన ఖుంటియా (ఫులొ ఫుటి మొహొకిలా) ఉత్తమ ప్రామాణిక చిత్రం: సుప్రభ సాహు (మో బొవ్ మో గాంవ్) ఉత్తమ విద్యా చిత్రం: నీనా మహా పాత్రో (మై నేషనల్ ఫ్లాగ్) స్వతంత్ర జ్యూరీ అవార్డు: సంపికా దాస్ (ఏఈ ఆకాష్ మాల) ఉత్తమ ఒడియా సినిమా పుస్తకం: అమితాబ్ ఖిలార్ (మోలోగ్రాఫ్) ఉత్తమ చిత్రం: ఆశ్రమ్ ఉత్తమ దర్శకుడు: అశోక్ పతి (పాబర్) ఉత్తమ ప్రధాన నటుడు: తన్మయ్ మహంతి (బాబూసాన్) – పబర్ ఉత్తమ ప్రధాన నటి: దేవయాని దేఘురియా (భాగియా వారిజా) ఉత్తమ సహాయ నటుడు: సుకాంత రథ్ (త్రికన్య) ఉత్తమ సహాయ నటి: లిప్సా మిశ్రా (కెమితి ఏ సొంపొర్కొ) ఉత్తమ నటుడు: హర్ రాత్ (భూత్) ఉత్తమ నటి: ఉసాసి మిశ్రా (కెమితి ఏ సొంపొర్కొ) ఉత్తమ హాస్య నటుడు: జీవన్ పండా (అదృశ్య) ఉత్తమ బాల నటుడు: లతాసా పుహాన్ (తుమొ బినా) ఉత్తమ కథా రచయిత: అజయ్ మహా పాత్రో (భూత్) ఉత్తమ స్క్రీన్ ప్లే: చిన్మయ్ కుమార్ దాస్ (పరబ్) ఉత్తమ సంభాషణ రచయిత: విజయ దాస్ (సింధూర) ఉత్తమ సంగీత దర్శకుడు: దివ్యజిత్ సాహు (పరబ్) ఉత్తమ గీత రచయిత: దుర్గా మాధవ్ పండా (మో బొరొదాత అతియ కర్మ) ఉత్తమ ప్రధాన గాయని: రూపకా కుమార్ పరిడా (ఆశ్రమ్) ఉత్తమ నేపథ్య గాయని: అర్పిత చౌధురి (చంద్ర వంశీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: మానస్ కుమార్ మిశ్రా (భాగియా భారీజా) ఉత్తమ ఎడిటింగ్: చంద్ర శేఖర్ మిశ్రా (ఆశ్రమ్) ఉత్తమ సౌండ్ రికార్డింగ్: తుషార్ జెనా (రంగసూర్) ఉత్తమ కళా దర్శకుడు: కళింగ నాయక్ (రంగాసుర) ఉత్తమ నృత్య సమన్వయకర్త: గిరీష్ మహంతి (ఐ లవ్ యు 2.0) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నమింద దాస్ (ఐ లవ్ యు 2.0) బెస్ట్ అప్పియరెన్స్ ఎడిటర్: తపన్ నాయక్ (అజీర్ రేవతి) ఉత్తమ వినోదాత్మక చిత్రం: కర్మ ఉత్తమ పిల్లల చిత్రం: పింకీ ప్రధాన్ (అనుభవ) ఉత్తమ ప్రామాణిక చిత్రం: సంతోష్ పండా (దండ్ రెహే, కహానీ కొహే – బహునా కందొ) ఉత్తమ విద్యా చిత్రం: బిరంచి నారాయణ్ పండా (సింధూర) ప్రత్యేక జ్యూరీ అవార్డు: సోనా మల్లిక్ (అభా) మరియు హరిహర్ మహా పాత్రో (భాగియా వారిజ) ఉత్తమ ఒడియా సినిమా పుస్తకం: రంజన్ కుమార్ రథ్ (ఒడియా సినిమా పరిణామం)35వ రాష్ట్ర చలన చిత్ర అవార్డులు36వ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు -
స్నాన యాత్రకు శ్రీక్షేత్రం సిద్ధం
● దైతపతుల ప్రవేశం ● రేపు స్నాన యాత్ర ● 79 ప్లాటూన్ల పోలీసుల మోహరింపుభువనేశ్వర్: దేవ స్నాన పూర్ణిమ దగ్గర పడుతుంది. జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని ఏటా మూల విరాట్లకు బహిరంగ స్నాన వేదికపై జలాభిషేకం నిర్వహించడం ఈ యాత్ర విశిష్టత. పూరీ శ్రీ జగన్నాథ స్వామి వార్షిక రథ యాత్ర ఆది ఘట్టంగా ఈ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి, సుదర్శనుడి స్నాన యాత్రకు సంబంధించిన సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. దైతపతుల రంగ ప్రవేశం జగతి నాథుని సేవల్లో దైతపతులది కీలక స్థానం. మూల విరాటుల గోప్య సేవలకు ఈ వర్గం ప్రాతినిథ్యం వహిస్తుంది. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్నాన యాత్ర, రథ యాత్ర వంటి కీలక యాత్రలు, ఉత్సవాలకు మూల విరాటులుని సిద్ధం చేస్తారు. రత్న వేదికపై మూల విరాటుల బాగోగుల్ని ఈ వర్గం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. ముందస్తు సన్నాహాలు దేవ స్నాన పూర్ణిమ ఉత్సవానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 29న జరగనున్న స్నాన యాత్ర ఏర్పాట్లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. దైతపతులు శ్రీ మందిరం లోనికి ప్రవేశించారు. బొడొ సింగార్ అలంకరణ తర్వాత పొహుడొ (విరామం) హారతి నిర్వహిస్తారు. మూల విరాట్ల భద్రత కీలకం రత్న వేదికపై నుంచి మూల విరాట్లు శ్రీ మందిరం మేఘనాథ్ ప్రహరి ప్రాంగణం ఆరు బయట విస్తరించి ఉన్న బహిరంగ స్నాన మండపానికి తరలి వస్తా యి. ఈ క్రమంలో మూల విరాటులకు ఏమాత్రం భంగం కలగకుండా అత్యంత జాగరూకతతో ప్రధాన విగ్రహాల్ని తరలించే పనుల్ని దైతపతి సేవాయత్ వర్గం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో రత్న వేదికపై నుంచి మూల విరాటులను సురక్షితంగా కిందకు దించే ముందుకు దారు విగ్రహాల ముఖాలు చెక్కుచెదరకుండా భద్రత కల్పిస్తారు. అనంతరం ఒక్కో విగ్రహాన్ని భద్రంగా తరలించేందుకు బాహు కాంటాలు అమర్చుతారు. ఈ సన్నాహాలు జరుగుతుండగా వేదికపై నుంచి కిందకు దించేందుకు వీలుగా చారుమళ్లను అమర్చుతారు. సాయంకాల ధూపం తర్వాత ఈ పనులు ప్రారంభించడం ఆచారం. ఈ సమగ్ర సన్నాహాల్ని దైతపతులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సోమవారం జరగనున్న స్నాన యాత్ర నేపథ్యంలో శనివారం నుంచి ఈ పనుల్ని ప్రారంభించారు. ఇది మొదలుకొని వార్షిక రథ యాత్ర చిట్ట చివరి ఘట్టం నీలాద్రి విజే వరకు జరిగే ప్రక్రియని దైతపతులు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారు. అరుదైన దర్శనం ఈ యాత్రలో మూల విరాట్లు ప్రత్యేక వస్త్రఽ దారణలో అరుదైన గజానన (హత్తి) అలంకరణలో అశేష భక్త జనానికి దర్శనం కల్పించడం విశేషం. ఈ అలంకరణ సరంజామా స్థానిక రాఘవ దాస్ మఠం ఏర్పాటు చేస్తుంది. అలంకరణ కార్యకలాపాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. పటిష్టమైన భద్రత యాత్ర ఆద్యంతాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. దేవ స్నాన పూర్ణిమ సందర్భంగా భద్రత, ట్రాఫిక్, జనసందోహ నియంత్రణ ఏర్పాట్లను సెంట్రల్ రేంజ్ ఐజీపీ డాక్టర్ సత్యజిత్ నాయక్, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు ప్రతీక్ సింగ్ సమీక్షించారు. పూరీ పట్టణ వ్యాప్తంగా 79 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లలో పోలీసు సూపరింటెండెంట్, కమాండెంట్ స్థాయి 15 మంది అధికారులు, 30 మంది డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, సబ్ ఇనస్పెక్టర్, సహాయ సబ్ ఇనస్పెక్టర్ స్థాయి సుమారు 340 మంది అధికారులు ఉంటారు. సీసీటీవీ నిఘా నగర వ్యాప్తంగా దాదాపు 200 సీసీటీవీ కెమెరాలు కన్నేసి ఉంటాయి. అదే సమయంలో మఫ్టీ సిబ్బంది, పైకప్పు భద్రతా బృందాలను కూడా మోహరిస్తారు. రత్న వేదికపై నుంచి మూల విరాటుల వరుస క్రమ తరలింపు (పొహొండి), దర్శనం సందర్భంగా జన సందోహం నిర్వహణ, వాహనాల రవాణా నియంత్రణ పట్ల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్నాన యాత్ర సమయంలో దేవతా విగ్రహాలకు అవసరం అయ్యే సుమారు 300 కిలో గ్రాముల బరువైన ప్రత్యేక సంప్రదాయ పట్టు వస్త్రాలు బాసుంగ పట్టొ అఠొగొడొ తిగిరియా నుంచి చేరినట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల కదలిక క్రమబద్ధీకరణ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్ర, సుదర్శనుల స్నాన యాత్రకు మారు మూల ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. యాత్రికుల రాకపోకలను నియంత్రించేందుకు శ్రీ జగన్నాథ ఆలయ కార్యాలయం నుంచి మార్కెట్ చక్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పహండి కోసం టికెట్లు ఉన్న భక్తులను ఆలయ దక్షిణ ద్వారం ద్వారా లోపలికి అనుమతిస్తారు. సాధారణ భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి దర్శనం కోసం స్నాన మండపానికి చేరి మూల విరాటులను దర్శించుకుని మిగిలిన మూడు ద్వారాల ద్వారా బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు బొడొ దండొ నుంచి స్నాన మండపంపై దేవతా మూర్తులను దర్శించుకోగలరు. అయితే ఉత్సవ ఊరేగింపు సమయంలో బొడొ దండొ వెంబడి మార్గ మధ్యంలో నిలబడటాన్ని అధికారులు నిషేధించారు. -
హైటెక్ గ్రూప్నకు విశిష్ట పురస్కారం
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష గుర్తింపు సాధించిన హై టెక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కు ప్రతిష్టాత్మక టైమ్స్ హెల్త్ ఐకాన్స్ ఒడిశా 2026 సత్కారం లభించింది. ఈ సందర్భంగా హై టెక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ ట్రస్టీ, గ్రూప్ సీఈఓ సురేష్ కుమార్ పాణిగ్రాహికి మెడికల్ విజనరీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ హలో ఎకై ్సట్మెంట్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను సురేష్ కుమార్ పాణిగ్రాహికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు. హై టెక్ మెడికల్ కార్డియాలజీ విభాగం రోగ నిర్ధారణ, చికిత్స, శస్త్ర చికిత్స, రోగి సంరక్షణ రంగాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కార్డియాలజీ (గుండె జబ్బులు) విభాగం రాష్ట్రంలో అగ్ర శ్రేణి ఆస్పత్రిగా అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును హై టెక్ మేనేజింగ్ ట్రస్టీ, గ్రూప్ సీఈఓ సురేష్ పాణిగ్రాహితో డాక్టర్ శ్వేతా దాస్, డాక్టర్ రితేష్ ఆచార్య, మెడికల్ సహాయ అధ్యాపకుడు డాక్టర్ సీతారాం మహా పాత్రో అందుకున్నారు. -
231 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన నషా ముక్త అభిజాన్ కార్యక్రమంలో భాగంగా ఝార్సుగుడ జిల్లా బడ్మాల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 231 కిలోల 810 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అంత ర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాకు గట్టి ఎదురు దెబ్బకొట్టారు. జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున స్టేట్ హైవే–10లొ ఖేరువాల్ వంతెన సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఎర్టిగా కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులను చూసి వేంగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటాడిన పోలీసులు కొద్ది దూరంలో వాహనం టైరు పగిలిపోవడంతో ఒక నిందితుడు చిక్కాడు. మరో వ్యక్తి పరారాయ్యాడు. అనంతరం ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా 231.810 కిలోల గంజాయి లభ్యమైంది. ప్రాధమిక విచారణలో ఈ గంజాయిని బౌధ్ జిల్లా నుంచి సేకరించి మధ్యప్రదేశ్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను తప్పుదొవ పట్టించేందుకు వాహనానికి అసలు నంబరు ప్లేట్ తొలగించి ఒడిశా రిజిస్ట్రేషన నంబర్ను అమర్చినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఈ కేసులో మధ్యప్రదేశ్లోని షహడొల్ జిల్లాకు చెందిన అంకిత్ శర్మ అలియాస్ చొటును అరెస్టు చేసి టోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి గంజాయి రవాణాకు వినియోగించే కారుతో పాటు రెండు మధ్యప్రదేశ్ నంబర్ ప్లేట్లు, బీమా పత్రాలు, ఒక డెబిట్ కార్డు, మోబైల్ ఫోన్, నగదు 1530 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలొ ఉన్న మరో నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దుర్మరణం
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియం సమీపంలో ఇండియన్ పెట్రోలియం బంకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం శనివారం జరిగింది. ఉపాధ్యాయుడు అర్ధత్రాణ పండా (60)నడుచుకుని వెళుతుండగా వెనుక నుంచి ఓ యువకుడు స్పీడుగా వచ్చి బైక్తో గుద్దటంతో అక్కడికక్కడే అర్ధత్రాణ పండా మృతి చెందాడు. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. బైక్లో పుడ్డుని గ్రామం నుంచి పర్లాకిమిడి వస్తున్న యవకుడు ఎస్.కిరణ్స్వీడుగా వచ్చి టీచర్ అర్ధత్రాణ పండాను గుద్దడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అర్ధత్రాణ పండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కిరణ్ను అరెస్టు చేసి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు అరెస్టు
జయపురం: నాటుసారా అమ్మవద్దని, తాగవద్దని హితవు చెప్పిన వార్డు మెంబర్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి ఒంటి గంటన్నర సమయంలో జయపురం సమితి ఖుడప గ్రామం పంచాయతీ వార్డు సభ్యుడు కృష్ణ హరిజన్, అతడి సోదరుడు ప్రహ్లాద హరిజన్, కుమారుడు పద్మణ హరిజన్లు ఖుడప గ్రామంలో జరిగిన మా గంగమ దేయి వార్షిక ఉత్సవం సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ నాటకాలను తిలకించి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆ సమయంలో ఖుడప గ్రామంలోని ఓ వీధిలో నాటుసారా అమ్ముతున్న వారిని, సారా తాగుతున్న వారిని వారించారు. సారా అమ్మవద్దని, తాగవద్దని చెప్పినందుకు వారంతా ఆగ్రహించి వార్డు మెంబర్, అతడి కుంటుంబ సభ్యులపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. దాడిచేసే వారిని పట్టుకొనేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పరారీ అయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన సదర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు అయిన త్రిపాఠీ గౌడ, శ్యామ గౌడ, భగవాన్ భొత్రను కోర్టులో హాజరుపరిచారు. వారికి బైలు నిరాకరించిన కోర్టు 14 రోజులు రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు. -
కొరాపుట్ డీఐపీఆర్ఓ మృతికి సంతాపం
జయపురం: కొరాపుట్ జిల్లా సమాచార ప్రజాసంబంధాల అధికారి స్వరాజ్ శిశా అకాల మృతికి జయపురం మీడియా ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జయపురంలో శనివారం జరిగిన సంతాప సభలో శిశా మరణం దురదృష్టకరమని నివాళులు అర్పించారు. ఆయన మంచి అధికారి అని జిల్లాలో మీడియ ప్రతినిధులకు అండగా ఉండేవారని గుర్తు చేసు కున్నారు. చెడు వ్యసనాలతో జీవితాలు నాశనం జయపురం: చెడు వ్యసనాలతో జీవితాలు నాశనం అవుతాయని జయపురం అబ్కారీ విభాగ అధికారులు, సిబ్బంది అన్నారు. అంతర్జాతీయ నిషా నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అబ్కారీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కోర్టు కూడలి వద్దకు చేరింది. యువత తాగుడుకు అలవాటు పడి తమ జీవితాలను నష్ట పోతున్నారని, ఈ నిషా నుంచి యువత ముక్తి పొంది శాంతి జీవనం గడపాలని ఉద్భోదించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు అబ్కారీ సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఐ జయంతిలాల్ పాండే, అబ్కారీ ఇన్స్పెక్టర్ అజయ్ నాయక్, జయపురం అబ్కారీ విభాగ అధికారి సుబ్రత కిశోర్ హిరన్, బొరిగుమ్మ అబ్కారి అధికారి నీలాద్రి బిహారి మిశ్ర, కొట్పాడ్ అబ్కారీ అధికారి బలరాం దాస్, అబ్ ఇన్స్పెక్టర్ సోను సెట్టియ, తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మహోన్నత సేవశ్రీకాకుళం కల్చరల్: మానవతా సేవే మహోన్నత సేవ అనే రెడ్క్రాస్ సిద్ధాంతాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సర్వసభ్య సమావేశం, పురస్కారాల ప్రదానోత్సవం శనివారం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, వైద్యులు, రక్తదాతలు, దాతలు, సేవా సంస్థలు అందిస్తున్న విశేష సహకారాన్ని అభినందించారు. అంతర్జాతీయ మానవ హక్కుల మండలి కార్యదర్శి ఎం.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో రెడ్క్రాస్ సంస్థ పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడారు. -
అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పట్టణం నుంచి హైదరాబాద్కు అక్రమంగా 14 పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బలిమెల పోలీసులు శనివారం ఉదయం పట్టుకున్నారు. ఈ పశువులను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను విచారించగా వికాష్ ఖీలో, ఆర్జున్ ఖీలోగా తెలిసింది. వారిపై అక్రమ రవాణా కేసును నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పశువుల్లో నాలుగు ఎద్దులు, ఒక దూడ, 9 ఆవులు ఉన్నాయి. వీటిని కోరుకొండ పశువైద్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండటంతో మల్కన్గిరి పశు సంరక్షణ కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించినట్లు బలిమెల ఎస్ఐ దేవదత్తు మల్లిక్ తెలిపారు. సారా పట్టివేతపర్లాకిమిడి: కాశీనగర్ సింగిపురం గ్రామంలో ఆదర్శ పోలీసు ష్టేషన్ సిబ్బంది శనివారం దాడులు జరిపి వంద లీటర్ల వంట సారా, 600 లీటర్ల ఇప్పసారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. గ్రామంలో రైల్వే ట్రాకు వద్ద గోతులు తవ్వి వంటసారా తయారు చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. వీటిలో టైర్లు, ఫినాయిల్, విప్పపువ్వు, బెల్లం కలిసి తయారుచేసి అమ్ముతున్నట్టు పోలీసులు తెలియజేశారు. సారా తాగితే అనేక జబ్బులు వస్తాయని ఐఐసీ ప్రశాంత్ భూపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. స్కూటీని ఢీకొట్టిన వ్యాన్.. మల్కన్గిరి: మల్కన్గిరి పట్టణంలోని బలిమెల కూడలి సిగ్నల్ వద్ద స్కూటీని నిలిపి ఓ దుకాణానికి జిల్లా అదనపు ట్రెజరీ అధికారి ధర్మేంద్ర శబర్ వెళ్లారు. ఆ సమయంలో అతి వేగంగా వెనుక నుంచి ఓ వ్యాన్ వచ్చి స్కూటీని ఢీకొట్టి 10 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. వ్యాన్ బియ్యం లోడ్తో జయపురం వైపు వెళ్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కారణం. వెంటనే మల్కన్గిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పారారయ్యారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి పర్లాకిమిడి: బాధితులు కోర్టుల్లో న్యాయం కోసం అనేక ఏళ్ళు వేచి చూస్తుంటారు, అలాంటి క్రిమినల్ కేసుల్లో పోలీసుశాఖ నిబధ్ధతో కూలషంగా విచారణ జరిపి, సాక్షాలు పోందుపరిచి నిందితులకు శిక్ష పడేలా చూడాలని.. అప్పుడే మీకు ప్రభుత్వం ఇచ్చిన పదవి సద్వినియోగం అవుతుందని జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహాంతి అన్నారు. జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహాంతి శనివారం నాన్ కేడర్ ప్రాసిక్యూటర్ల కోసం పరిచయ మరియు పునశ్చరణ శిక్షణా కార్యక్రమంను ఆయన జిల్లా కలెక్టరేట్లో కాన్ఫరెన్సు హాలులో ప్రారంభించారు. ఈ రెండురోజుల శిక్షణా కార్యక్రమానికి డిప్యూటీ డైరక్టరేట్ (ప్రాసిక్యూషన్సు) అజిత్కుమార్ పట్నాయిక్, సీనియర్ ఆడ్వకేటు రాజేంద్ర ప్రసాద్సాహు, జిల్లా ఆదనపు మాజిస్ట్రేటు ఫల్గునీ మఝి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, ఎకై ్సయిజు సూపరింటెండెంటు ప్రదీప్ కుమార్ సాహు, సబ్డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, డాక్టర్ సంతును పాఢి, ఏ.సి.ఎఫ్. బ్రహ్మానంద సాహు, ఇతర నూతనంగా నియమితులైన జి.పి., పి.పి.లు హాజరయ్యారు. ఈ శిక్షణా శిబిరంలో భారతీయ శిక్షాస్మృతిలో వివిధ కొత్త చట్టాలు, సవరణలు వాటి ప్రభావం, అలాగే పాత, క్రొత్త చట్టాల మధ్య తూలనాత్మక అధ్యయనం మరియు కోర్టు ముందు ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఎలా సిధ్ధం చేయావచ్చో అన్నఅంశంపై చర్చించారు. నేటి కర్మశాలకు సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అధ్యక్షత వహించగా, అనేక మంది నాన్ క్యేడర్ పి.పి.లు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరం న్యాయశాఖ డైరెక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలో జరిగినది. -
● యాత్రకు సన్నద్ధత
భువనేశ్వర్: అశేష జన సందోహం మధ్య జరిగే శ్రీ జగన్నాథుని రథ యాత్రలో అపశృతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు భారీ కసరత్తు చేస్తోంది. శ్రీ మందిరం పాలక వర్గం, పూరీ జిల్లా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ, సహకార, సమన్వయంతో యాత్రని దిగ్విజయం చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. యాత్ర దగ్గర పడుతున్న కొద్దీ అనుబంధ వర్గాల అప్రమత్తతని అనుక్షణం సమీక్షిస్తున్నారు. ప్రధానంగా రథాలు కదిలే సమయంలో ఊపిరాడని పరిస్థితులు వంటి విపత్కర పరిస్థితుల పట్ల సత్వర స్పందన అత్యంత కీలకం. అత్యవసర పరిస్థితులలో త్వరిత ప్రతిస్పందన, రక్షణ, సమన్వయ చర్యల పట్ల అనుబంధ వర్గాలకు ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. మాక్ డ్రిల్ ద్వారా రథ యాత్ర సమయంలో అకస్మాత్తుగా తలెత్తే అత్యవసర పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన సన్నద్ధతను సమీక్షించారు. -
ఛాయాగ్రాహకుడు దిలీప్ రాయ్ ఇక లేరు
భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు దిలీప్ రాయ్ ఇక లేరు. ఆయనకు 72 ఏళ్ల వయసు. శుక్రవారం రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల గుండె పోటు కారణంగా మెదడులో రక్త ప్రసరణ ఆగిపోవడంతో చికిత్స కోసం ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పూరీ స్వర్గ్ ద్వార్ లో జరుగుతాయని కుటుంబీకుల సమాచారం. ఓలీవుడ్లో విషాద ఛాయలు దిలీప్ రాయ్ 1954 జూలై 27న కటక్లో జన్మించారు. 80వ దశకంలో ప్రముఖ దర్శకుడు మన్మోహన్ మహా పాత్రో మార్గదర్శకత్వంలో సినిమాటోగ్రాఫర్గా ఎదిగారు. బెంగళూరులోని ఎఫ్టీఐ నుండి సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. త్రిసంధ్య, బాజే భంవుషీ నాచే ఘుంగుర్, భాగ్య హాతే డోరీ, సునా సిద్ధ, జీవా సాథీ, విధిషేర్ బిధాన్, ఐత్ దునియా, ఫొల్షహరన్, చకభానూరి లక్ష్మణ రేఖ, చిన్ని మొదలైన 80కి పైగా ఒడియా చిత్రాలకు పని చేశారు. ఆయన కొన్ని ఛత్తీస్గఢీ చిత్రాలకు కెమెరామెన్గా కూడా పని చేశారు. ఆయన దూరదర్శన్కు కూడా పని చేశారు. ఆయన మరణం ఓలీవుడ్లో విషాద ఛాయలను నింపింది. -
శ్రీ జగన్నాథుని దర్శనం తాత్కాలికంగా నిలిపివేత
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని స్నాన యాత్ర సన్నాహాల్లో భాగంగా స్వామి దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి శనివారం తెలిపారు. జ్యేష్ట శుక్ల పూర్ణిమ పురస్కరించుకుని జరగనున్న స్నాన యాత్ర సన్నాహాలు శనివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీ మందిరంలో స్వామి దర్శనం లభ్యం కాదని సీఏఓ వివరించారు. ఒడిశా కాంగ్రెస్ ఇన్చార్జిగా లాల్ జీ దేశాయ్ భువనేశ్వర్: జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన కీలకమైన సంస్థాగత మార్పుల్లో భాగంగా ఒడిశాకు కొత్త ఏఐసీసీ ఇన్చార్జిగా సీనియర్ నాయకుడు లాల్ జీ దేశాయ్ నియమితులు అయ్యారు. కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడిగా వ్యవహరించిన లాల్ జీ దేశాయ్ ఒడిశా ఏఐసీసీ ఇన్చార్జి బాధ్యతల నుంచి అజయ్ కుమార్ లల్లు స్థానంలో నియమితులయ్యారు. ఈ నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమోదం తెలిపారని పేర్కొంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలో 2000 సంవత్సరం నుండి అధికారానికి దూరంగా ఉన్న పార్టీని పునరుజ్జీవింపజేయడం, భవిష్యత్ ఎన్నికల కోసం సన్నద్ధతను పటిష్టం చేయడంపై కాంగ్రెస్ దృష్టి సారిస్తున్న తరుణంలో లాల్ జీ దేశాయ్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. విజిలెన్స్ వలలో పశు సంవర్ధక శాఖ ఇన్స్పెక్టర్ కొరాపుట్: విజిలెన్స్ వలలో పశు సంవర్ధక శాఖ ఇన్స్పెక్టర్ చిక్కుకున్నారు. నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితికి చెందిన పశు సంవర్ధక శాఖ ఇన్స్పెక్టర్ ప్రఫుల్ల హల్దార్ రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కామధేను పథకం కింద ఒక లబ్ధిదారునికి ఆవులు కొన్నందుకు సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది. ఈ నిధులు మంజూరు చేయడానికి హల్ధర్ రు.80 వేలు డిమాండ్ చేశారు. దాంతో బాదితుడు విజిలెన్స్ శాఖని సంప్రదించాడు. వారిచ్చిన నగదును బాధితుడు హల్ధర్ కి అందించాడు. వెంటనే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని విజిలెన్స్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. హల్ధర్ ఇంటిలో సోదాలు జరుపగా లెక్కలు లేని రు.8 లక్షలు నగదు సీజ్ చేశారు. గుమ్మ ఘాటీలో ట్రాలర్ బోల్తా ● 13 గంటలు రాకపొకలు బంద్ రాయగడ: సదరు సమితి పరిధిలోని గుమ్మ ఘాట్ వద్ద పైపులతో వెళ్తున్న ఒక ట్రాలర్ అదుపుతప్పి బోల్తా పడటంతొ జాతీయ రహదారి–326పై రాకపోకలు 13 గంటలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కారణంగా రహదారికి ఇరువైపులా వందలాది బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు అడవి, ఘాట్ ప్రాంతంలో రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం.. పైపులలోడ్తొ ట్రాలర్ రాయగడ నుంచి కొరాపుట్ వైపు వెళ్తుండగా అర్ధరాత్రి సమయంలో ఘాట్ మలుపు వద్ద డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడింది. దీంతో భారీ ట్రాలర్ రహదారిని పూర్తిగా కప్పేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపొయాయి. రాయగడ మీదుగా కొరాపుట్, నవరంగపూర్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు ఇటు టికిరి, కాసీపూర్ ప్రాంతాలకు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గుమ్మఘాటీ మలుపులో ఇటువంటి తరహా ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం సాధారణమైపోయింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ ప్రమాదాలు తగ్గేలా రహదారి విస్తరణ, ప్రమాదకర మలుపుల సవరణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, భద్రత చర్యలు చేపట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొవాలని ప్రభుత్వాన్ని, జాతీయ రహదారి అధికారులను ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
మృత్తిక సంరక్షణపై శిక్షణ
జయపురం: జయపురం సమితి ఫూల్బెడలో గల ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రంలో జలం, మృత్తిక సంరక్షణ, యాజమాన్యం పై నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరం నేడు ముగిసింది. ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం, జయపురం వారు బిజూ పట్నాయిక్ మెడికల్ ప్లాంట్ గార్డెన్ రీసెర్చ్ కేంద్రంలో నిర్వహించిన ఈ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో కొరాపుట్, సెమిలిగుడ, నందపూర్, పొట్టంగి సమితుల నుంచి 50 మందికి పైగా వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న రైతులు పాల్గొన్నారు. శిబిరంలో స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ ఈ కార్యక్రమం లక్ష్యాలను, ఉద్దేశాలను రైతుకు క్షుణ్ణంగా వివరించారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్సిటీ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ ఫ్రఫుల్ల కుమార్ పండ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన పంటలకు ఆధారమైన భూమి స్వరూపం, రిమోట్ సెన్సింగ్లపై రైతులకు వివరించారు. స్వామినాథన్ సంస్థ కోఆర్డినేటర్ నిరంజన్ గౌడ మట్టి, నీరు సంరక్షణలో చెక్డ్యామ్, చెరువుల, బండరాళ్ల పాత్రపై శిబిరంలో పాల్గొన్న రైతులకు వివరించారు. అలాగే సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ్ లెంక వర్షపు నీరు సంరక్షణ, భూగర్భ జళాల పరిరక్షణలపై రైతులతో చర్చించారు. అనంతరం వ్యవసాయానికి సారవంతమైన భూమి, సాగునీరు అత్యంత ఆధారమైనవని వాటిపై రైతులకు అవగాహణ కలిగించేందుకు కార్యక్రమం నిర్వహించామని వెల్లడిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో సంస్థ ఉద్యోగులు దిలీప్ కుమార్ సుబుద్ది, దీప్తి సాహు, సంతోష్ కుమార్ సాహు, గోపీ గొల్లారి తదితరులు పాల్గొన్నారు. -
రథయాత్రకు తాళ్లు సిద్ధం
భువనేశ్వర్: త్వరలో ప్రారంభం కానున్న పూరీ శ్రీ జగన్నాథ స్వామి యాత్ర కోసం రథాల తాళ్లు పూరీకి చేరాయి. 8 అంగుళాల వెడల్పు, 220 అడుగులు లేదా 67 మీటర్ల పొడవున్న ఈ తాళ్లు పూరీలోని వీర్ ప్రతాప్పూర్లో ఉన్న ఒడిశా సహకార పీచు కార్పొరేషన్ సరఫరా చేసింది. ఆలయ కార్యాలయానికి చేరిన రథాల తాళ్లను ఆలయ సీనియర్ సూపరింటెండెంట్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సురక్షితమైన ప్రదేశంలో భద్ర పరిచేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు. పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో రథయాత్ర కోసం జగన్నాథ, బలరామ, సుభద్ర రథాల పనులు వేగవంతం అయ్యాయి. వచ్చే నెల పదో తేదీకి కొత్త రథాల పనులు పూర్తి చేయడా నికి ఎక్కువ మంది వడ్రంగులను నియమించామని, అటవీ శాఖ రథాలకు కావాల్సిన కలప ను కూడా సమకూర్చినట్టు రథయాత్ర కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్ ఉన్నారు. నిరంజన్ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం అర్బన్ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర శాసన సభా సంఘాలు ఏర్పాటు
భువనేశ్వర్: శాసన సభ స్పీకర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సభా సంఘాలు ఏర్పాటు చేసింది. 10 స్థాయీ కమిటీలతో సహా 35కు పైగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నాయకురాలు ప్రమీలా మల్లిక్కు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి అధ్యక్షత వహించే బాధ్యతను అప్పగించారు. ఇతర కమిటీలలో పలువురు ఎమ్మెల్యేలకు స్థానాలు కల్పించారు. ప్రమీలా మల్లిక్ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో రామచంద్ర కదమ్, అరుణ్ కుమార్ సాహు, గణేశ్వర్ బెహరా, సనాతన్ బిసి వంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయ నారాయణ్ మిశ్రా అధ్యక్షతన ఏర్పా టైన ప్రివిలేజెస్ కమిటీలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు. స్పీకర్ 10 స్థాయీ కమిటీలను ప్రకటించారు. 2026–27 సంవత్సరానికి ఆయా స్థాయీ కమిటీలకు శివ్ మహా పాత్రో, సంతోష్ ఖటువా, బాబూ సింగ్, బిభూతి ప్రధాన్, రామచంద్ర కదమ్, సనాతన్ మోక్ష, ఎమ్మెల్యే రణేంద్ర ప్రతాప్ స్వంయి ఛైర్మన్గా నియమితులయ్యారు. ఆకాష్ దాస్ నాయక్ గ్రంథాలయ కమిటీ చైర్మన్గా నియమితులు అయ్యారు. ఈ కమిటీలో సస్పెండ్ అయిన 11 మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. గుణుపూర్లో భారీ అగ్ని ప్రమాదంరాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి డంబసర గ్రామ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.40 లక్షలకు పైగా కిరాణా సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ మంటలతో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. డంబసర సమీపంలోని కె.గురునాథ్రావు అనే వ్యక్తికి చెందిన దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్మకుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆయనకు సమాచారం అందించారు. అనంతరం పద్మపూర్, గుణుపూర్లకు చెందిన అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట దుకాణం షట్టరును తెరవలేకపోయారు. అనంతరం జేసీబీ సాయంతో షట్టరును పగులగొట్టి లోపలికి నీటిని చిమ్మి మంటలను పూర్తిగా అర్పేశారు. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. -
సీనియర్ జర్నలిస్ట్ శరత్ దాస్ కన్నుమూత
భువనేశ్వర్: సీనియర్ జర్నలిస్ట్ శరత్ దాస్ (83) స్థాని క ప్రైవేట్ ఆస్పత్రిలో చికి త్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు. ఆయన ఒడిశా మీడియా వర్గాలలో సుప్రసిద్ధ, గౌరవనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒడిశా బ్యూరో చీఫ్గా పని చేశారు. తన విశ్వసనీయమైన, ప్రభావవంతమైన రిపోర్టింగ్తో ప్రత్యేకత చాటుకున్నారు. తన వృత్తి జీవితంలో పలువురు యువ విలేకరులకు మార్గదర్శకత్వం వహించి, ఒడిశాలో ఆంగ్ల, జాతీయ స్థాయి జర్నలిజానికి గణనీయమైన కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహోద్యోగులు, మీడియా నిపుణులు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయం పట్ల ఆయనకున్న వృత్తి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. రాయగడ: జిల్లాలొని కళ్యాణసింగుపూర్ సమితి కొత్తగూడ గ్రామంలోని కుంభారివీధిలో విషపూరిత పుట్టగొడుగులు తిని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. అడవిలో నుంచి తీసుకువచ్చిన గుర్తు తెలియని పుట్టగొడుగులను ఇంట్లో పెద్దలు లేని సమయంలో చూసి చిన్నారులు వండి తిన్న అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. అస్వఽస్థతకు గురైన చిన్నారులను వెంటనే కళ్యాణసింగుపూర్ ఆర్యోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
ఆనందం..‘ఆహ్లాద్’కరం
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఆహ్లాద్–2కే26 కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కార్యక్రమాల కో ఆర్డినేటర్ డి.యుగంధర్ నేతృత్వంలో జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ముగింపు సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, వర్ధమాన సినీ నటి రాశీసింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, కళాత్మక అభిరుచులు, వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ కళాశాలలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు డైరెక్టర్ వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన ఆహ్లాద్ కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. -
మహా నదిలో సర్ప విగ్రహాలు లభ్యం
భువనేశ్వర్: కటక్లోని ఓగల్పూర్ ప్రాంతంలో మహానదిలో వందలాది నాగ విగ్రహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో భక్తి, ఉత్సాహ వాతావర ణం నెలకొంది. స్థానిక యువకులు ఆ విగ్రహాలను వెలికి తీసి, పూజల కోసం ఒక శివాలయంలో ప్రతి ష్టించారు. ఈ విగ్రహాల మూలం స్పష్టంగా తెలియనప్పటికీ వాటిని దొంగిలించి ఉంటారని లేదా మతపరమైన కారణాల వల్ల విసర్జించి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఓగల్పూర్కు చెందిన కొందరు యువకులు మహా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వారి కాళ్లకు, చేతులకు ఏదో గట్టి వస్తువు తగిలింది. వారు ఉత్సాహంగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాన్ని ఎత్తడానికి తమతో ఉన్న మరో ఆరుగురు స్నేహితులను పిలిచారు. మొదట 3 నుంచి 4 అడుగుల పెద్ద నాగ మూర్తి ఒకటి లభ్యమైంది. ఆ తర్వా త అక్కడ సుమారు 100 చిన్న నాగ మూర్తులు దొరికాయి. ఆ విగ్రహాలను ఒడ్డుకు తరలించి ధూప, దీపాదులతో పూజార్చనలు చేశారు. అనంత రం వాటిని ఓగల్పూర్ సంభేశ్వర్ దేవ్ శివాలయానికి తరలించారు. ఎవరో ఈ విగ్రహాలను దొంగి లించి మహా నదిలో రువ్వేసి ఉంటారని భావిస్తున్నా రు. శివాలయంలో భద్ర పరిచిన నాగ మూర్తులను భవిష్యత్లో ఆలయ కమిటీకి అప్పగిస్తామని యువకులు తెలిపారు. -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
రాయగడ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జియా హుల్ హక్ అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో లక్ష్యం ఉంటుందని, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవ్వడమే కాకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు కూడా అన్యాయం చేస్తోందని విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, వారికి తగిన ఫలితం అందకపోతే వారి పరిస్థిఽతి ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 24, 25, 26 తేదీల్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై అన్నిచోట్ల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు శంకర్షన్ మంగరాజ్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నిఖిల్ పట్నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
శ్రీకాకుళం కల్చరల్ : హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కార్మికులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
పాఠ్య పుస్తకాల్లో దోషాలు
● ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన కమిటీభువనేశ్వర్: పాఠశాల పాఠ్యపుస్తకాలలోని లోపాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి తన నివేదికను సమర్పించింది. ముఖ్యమంత్రి నిర్దేశించిన ఏడు రోజుల గడువులోగా అభివృద్ధి కమిషనర్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికను ఆయనకు అందజేసింది. తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అనేక తప్పులు కనుగొనడంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు, ఏజెన్సీలను గుర్తించి, ఏడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలోని ఈ కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠ్యపుస్తకాల తయారీ, సమీక్ష, ప్రచురణ సమయంలో జరిగిన పొరపాట్లకు బాధ్యులైన అధికారులు, సంస్థలను గుర్తించడం, అలాగే ఆ తప్పులు ఎలా జరిగాయో పరిశీలించడం ఈ కమిటీకి అప్పగించిన బాధ్యత నేపథ్యంలో కమిటీ నివేదికని ముఖ్యమంత్రికి దాఖలు చేసింది. తదుపరి పరిశీలన కోసం ఈ నివేదికను ముఖ్యమంత్రికి పరిశీలిస్తున్నారు. దోష పూరిత పాఠ్యపుస్తకాల ఉపసంహరణకు ప్రభుత్వ ఉత్తర్వులు 1 నుంచి 8 తరగతుల పాఠ్య పుస్తకాల్లో బయటపడిన తప్పుల వెనుక కుట్ర ఉంది. ముద్రణ దోషాలున్న పుస్తకాలు అన్నింటినీ వెనక్కి పంపించేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం ఈ పొరపాటును తీవ్రంగా పరిగణించింది. గతంలోనూ తప్పులు జరిగాయి. కానీ ఈ సారి వాటి సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. పాఠ్యాంశాల రూపకల్పన, పరిశీలన నుంచి ముద్రణ వరకు సమగ్ర ప్రక్రియను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉంది. పాఠ్య పుస్తకాల్లో తప్పులపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికని పరిశీలించి ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హెచ్చరించారు. దోషులను గుర్తించి ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు పంపిణీ చేసిన తప్పులతడక పాఠ్యపుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకుంటాం. కొత్త ప్రతులను ముద్రించి తిరిగి పంపిణీ చేస్తాం. కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే దోషుల నుంచి ముద్రణ ఖర్చులను వసూలు చేస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు నివేదిక చేతికి అందినందున, పాఠ్యపుస్తకంలోని తప్పులకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలు ప్రారంభించే ముందు ప్రభుత్వం దానిలోని అంశాలను పరిశీలిస్తున్నారు. -
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
పర్లాకిమిడి: మొహర్రం పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం నుంచి ముస్లింలకు కొత్త లూనార్ క్యాలండర్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది జూన్ 16 నుంచి ముస్లిం కొత్త సంవంత్సరాది క్యాలండర్ను ప్రారంభించారు. మొహర్రం సందర్భంగా నూతన దుస్తులు ధరించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. స్థానిక ఉప్పరవీధిలోని జుమ్మా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. జయపురంలో.. జయపురం: మొహర్రంను జయపురంలో ముస్లింలు సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. ప్రధానంగా షియా ముస్లింలో వందలాది మంది మహిళలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు శోభాయాత్ర లోపాల్గున్నారు. సంప్రదాయ బద్ధంగా నల్లని దుస్తులతో శుభాయాత్రలో పాల్గొన్నారు. -
విద్యాశాఖ మంత్రి స్వస్థలంలో ఆందోళన
కొరాపుట్: రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో స్వస్థలం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లో ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆందోళన చేసింది. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కి దిక్సూచి వంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణని విద్యాశాఖ గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ముద్రణలో అనేక తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఖజానాకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ పుస్తకాలు పనికి రాకుండా పోయాయి. విద్యా మంత్రి అవినీతి పెరగడంతోనే ఈ అక్రమ ఒప్పందం జరిగిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీకి చెందిన విద్యార్థి, యువజన విభాగాలు తమ ఆందోళన కొనసాగిస్తాయని ప్రకటించారు. ఈ ఆందోళన నిత్యానంద గొండో రాజీనామా వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఉమ్మర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మజ్జి, విద్యా మంత్రి నిత్యానంద గొండో, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంఎల్ఎలు సదాశివ ప్రదాని, సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ సభ్యుడు రంజన్ గొమాంగో అకాల మరణం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఏ–జోన్ జిల్లా పరిషత్ సభ్యుడుగా విధులు నిర్వహిస్తున్న రంజన్ గొమాంగో (45) శుక్రవారం అకాల మరణం చెందారు. కొద్ది నెలలుగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలియజేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు . ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రంజన్ గొమాంగో మృతికి పలువురు సంతాపాన్ని ప్రకటించారు.కొరాపుట్ డీఐపీఆర్వో మృతి కొరాపుట్: జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి (డీఐపీఆర్వో) స్వరాజ్ సిసా (42) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వరాజ్ శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు. అయితే అప్పటికే స్వరాజ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంత్యక్రియలు కోసం స్వస్థలం కుమిలి ప్రాంతానికి తరలించారు. ఈయన మృతిపై పాత్రికేయులు నివాళులర్పించారు. రైల్వేస్టేషన్ను పరిశీలించిన డీఆర్ఎంపర్లాకిమిడి: ఈస్టుకోస్టు రైల్వే డివిజన్, విశాఖపట్నం నుంచి ఒడిశాలో రాయఘడ రైల్వేడివిజన్ ప్రత్యేకంగా ఏర్పడిన తరువాత తొలిసారిగా రాయగడ రైల్వే డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ శుక్రవారం గుణుపురం, పర్లాకిమిడి సేష్టన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. భారత్ అమృత్ స్టేషన్ల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో పర్లాకిమిడి వచ్చినట్టు చెప్పారు. గుణుపురం, పూరీ, విశాఖపట్నం నుంచి గుణుపురం ప్యాసింజర్ రైలు కొన్నిరోజులుగా ఆలస్యంగా (రెండు, మూడు గంటలు) ఇక్కడికి చేరుతున్నాయని.. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ నౌపడ నుంచి గుణుపురానికి సింగల్ లైన్, చిన్న స్టేషన్లలో గేట్లు సిగ్నలింగ్ సరిగ్గా లేనందున ఆలస్యం అవుతుందన్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే పర్లాకిమిడి, గుణుపురం నుంచి ఇక్కడి రైల్వేలైన్ రాయగడ డివిజన్ తెరువళ్లికి ఎప్పుడు కలుపుతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తెరువళ్లికి రైల్ లైన్ పొడిగింపునకు టెండర్లు పిలిచామన్నారు. సర్వే పనులు పూర్తయ్యినట్టు తెలియజేశారు. భూసేకరణ పూర్తయిన తరువాత రైల్వే లైను పొడిగింపు జరుగుతుందని అన్నారు. తెరువెళ్లికి రైల్వే లైను పోడిగింపుతో రాయపూర్, భిలాయికి కనెక్టు అవుతోందన్నారు. బూటకపు ఐఏఎస్ అధికారి అరెస్టు భువనేశ్వర్: తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న బూటకపు ఐఏఎస్ అధికారిని షహీద్ నగర్ ఠాణా పోలీసులు శుక్ర వారం అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.నాటుసారాతో ముగ్గురు అరెస్టు జయపురం: చట్ట విరుద్ధంగా నాటుసారా అమ్ముతున్న ముగ్గురుని అరెస్టు చేసినట్లు జయపురం ఎకై ్సజ్ అధికారి సుబ్రత్ కేశరి హరిన్ తెలిపారు. అరైస్టెనవారిలో జయపురం సమితి టంకువ పంచాయతీ ఝింకురిగుడ గ్రామానికి చెందిన హరి పొర, ఘివురి, రాణిపుట్ గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గిరిపై కేసులు నమోదు చేశారు. -
అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లు
జయపురం: జయపురం సమితి కార్యాలయంలో అధికారులు ముఖ్యమంత్రి జీవికా మిషన్ పథకంలో అంతర్భాగమైన ‘వికాశ ధారా ఒడిశా సారా’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా 20 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లు ఉచితంగా అందజేశారు. అలాగే ఏడుగురు కార్మికులకు శ్రామిక కార్డులు, 20 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ కార్డులు, మరో 20 మంది మహిళలకు ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కార్డులను ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో మాట్లాడుతూ.. రెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేశారు. కార్యక్రమంలో జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, జిల్లా పరిషత్ సభ్యుడు తిరుపతి పట్నాయిక్, జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు స్వాతి హత్త, సీడీపీవో అంజన్ సండ, బిజయ కుమార్ నందో తదితరులు పాల్గొన్నారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ పర్లాకిమిడి: మహిళల స్వయం ఉపాధికి గజపతి జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో టైలరింగ్ శిక్షణలో భాగంగా 35 మంది మహిళలకు నెలరోజులపాటు శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలోని మోహనా, ఆర్.ఉదయగిరి, రాయఘడ, నువాగడ, గుసాని, పర్లాకిమిడి నుంచి 35 మంది మహిళలు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ పొందుతున్నట్లు డొమైన్ స్కిల్ ట్రైనర్ ఎ.బాలామణి అచారి తెలియజేశారు. వీరిని వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 8 నుంచి జూలై 8 వరకు ఆర్.శెట్టి భవనంలో మహిళలు టైలరింగ్లో శిక్షణ పొందిన అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేసి, తగిన ఆర్థిక సహకారం యూనియన్ బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు యూనియన్ బ్యాంకు ఆర్శెట్టి డైరక్టర్ తెలియజేశారు. బాలాసోర్లో పట్టపగలు వ్యాపారవేత్త కాల్చివేత భువనేశ్వర్: బాలాసోర్లో గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యాపారవేత్తకు తుపాకీ గురి పెట్టి కాల్చి చంపారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అరడ్ బజార్లోని 2వ నంబరు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కార్ యాక్సెసరీస్ వ్యాపారమైన ఫ్రీడమ్ ఫ్యాషన్ యజమాని ఎస్. కె. హమీద్గా గుర్తించారు. ఎస్. కె. హమీద్ తల, ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి హమీద్ తన కారు దిగుతుండగా గురి పెట్టి అతనిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. స్థానికులు హమీద్ను బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిశీలనలో సీసీటీవీ ఫుటేజ్ కాల్పులకు ముందు నల్ల ముసుగు తొడిగిన ఇద్దరు వ్యక్తులు బాధితుడిని వెంబడిస్తున్నట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఈ కాల్పుల ఘటన జరిగిందని బాలాసోర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రత్యూష్ దివాకర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి బాధితుడిపై కాల్పులు జరిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2 వేర్వేరు తుపాకులను ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తోందని ఎస్పీ అన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శాసీ్త్రయ బృందం సుమారు 8 ఖాళీ తూటాల కేసింగ్లను స్వాధీనం చేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం, పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ఒక ప్రత్యేక బృందంతో 4 బందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. మొహర్రం వేడుకల దృష్ట్యా పోలీసులు బాలాసోర్ పట్టణంలో గస్తీని పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. -
గుమ్మ సమీపంలో దారి దోపిడీ
రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తొలగుమ్మ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడి వద్ద గల నగదు, మొబైల్ ఫోను దోచుకెళ్లారు. దుండగులు కారులో వేగంగా అక్కడి నుండి పారిపోతుండగా రోడ్డువైపుగా వస్తున్న చిన్నారిని ఢీకొట్టారు. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. గ్రామాల్లో తిరిగి చిన్నచిన్న వస్తువులను విక్రయించి జీవనోపాధి పొందే ఒక చిరువ్యాపారి ఎప్పటిలా వెళుతుండగా తొలగుమ్మ వద్ద కారులో వస్తున్న కొంత మంది దుండగులు అడ్డగించి అతనిపై దాడి చేసి అతని వద్ద గల నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్నారు. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక చిన్నారి ని ఢీకొట్టిన కారు అదుపుతప్పి రోడ్డు పక్క బోల్తా పడిపోయింది. అనంతరం దుండగులు కారును అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘డ్రగ్స్కు అలవాటు పడితే అధోగతే’
పర్లాకిమిడి: మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, సమాజంలో వారి ఉనికి కోల్పోతారని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దయామయ పాఢి అన్నారు. స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ శాఖ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక మహారాజాబాలుర ఉన్నత పాఠశాల నుంచి ఒక సచేతన ర్యాలీని కలెక్టర్ వరకూ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ట్రాన్స్జెండర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రీతి ధారా నాయక్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బి.కె.సుజాత సబ్ డివిజనల్ సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి లక్కోజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అతిగా తాగుడు వల్ల ఒడిషా పాపులర్ సినీ గాయకుడు హిమాంశు శేఖర్ అతి తక్కువ వయస్సులోనే మృతిచెందాడని, అలాగే తాగుడుకు బానిసై సొంత తల్లిని కొట్టి డబ్బులు తీసుకుని దుర్ఘటనకు గురైన ఘటనను కూడా దయామయ పాఢి తన ప్రసంగంలో తెలియజేశారు. అందువల్ల మాదక ద్రవ్యాలు, తాగుడు వల్ల సమాజంలో అనేక నేరాలకు కూడా దారి తీస్తుందని ఆయన అన్నారు. అనంతరం తాగుడు, జూదం, గంజాయికి అలవాటు పడినవారి జీవనవిధానంపై చిన్న రూపకాలు ప్రదర్శించారు. -
‘ఇంతాలిగూడపై వేధింపులు సరికాదు’
రాయగడ: కల్యాణసింగుపూర్ గొడవకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశానుసారం కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో గురువారం నాడు ఒక బృందం సమితిలోని ఇంతాలిగుడ గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎంపీ సప్తగిరి సమావేశమై అసలు విషయానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో గల పురుషులను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి అరెస్టు చేసి తీసుకుపోతున్నారని మహిళలు ఆరోపించారు. అసలు ఘటనకు సంబంధం లేని వారిని కూడా పోలీసులు అనుమానించి వారిని తీసుకు వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలతో ఏం చేయాలో తెలీని స్థితిలో ఉన్నామని గ్రామానికి చెందిన రజిని ఉలక అన్నారు. మరో రెండు రోజుల్లో తన భర్తను పోలీసులు విడిచిపెట్టకపోతే తాను తన పిల్లలతో కలసి పోలీస్ స్టేషన్ వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతానని అన్నారు. తమకు వేరే గత్యంతరం లేదని, ఇప్పటికై న పోలీసులు దయతలచి తన భర్తను విడిచిపెట్టాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో అసలు పుకార్లు సృష్టించిన దండపొదొరొ గ్రామస్తులను విడిచి పోలీసులు ఇంతాలిగుడ గ్రామ ప్రజలను అరెస్టుల పేరిట వేధించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అయితే నిందితులను తప్పకుండా శిక్షించాలని, కానీ అమాయకులు కూడా పోలీసుల బారిన పడి ఇబ్బందులకు గురవ్వడం విచారకరమని అన్నారు. ఇదే విషయాన్ని తాను సమగ్ర నివేదికను పీసీసీ అధ్యక్షునికి సమర్పించి గ్రామస్తులకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. పుకార్లు విని మోసపోవద్దు.. అవిభక్త కొరాపుట్ జిల్లాలొ ఇదివరకు ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని, శాంతికి ప్రతీకగా నిలిచే రాయగడ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునకగా మారిందన్నారు. ఈ నిజ నిర్ధారణ బృందంలో ఉలక తొపాటు బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీలో చేరిన సుజాత రౌత్ కార్తికేయన్
భువనేశ్వర్: మాజీ ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ కార్తికేయన్ బిజూ జనతా దళ్ (బీజేడీ)లో చేరారు. గురువారం శంఖ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో బీజేడీ నాయకులు సుజాతకు ఘన స్వాగతం పలికారు. బీజేడీ అధ్యక్షుడు, శాసన సభ విపక్ష నేత నవీన్ పట్నాయక్ సమక్షంలో లాంఛనంగా చేరారు. నవీన్ పట్నాయక్ పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తాను సుజాత పార్టీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. తాను ఒక సాధారణ కార్యకర్తలా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో పార్టీ, రాష్ట్రం కోసం పనిచేస్తానన్నారు. అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పార్టీకి నాయ కత్వం వహిస్తానని ప్రకటించారు. బిజూ జనతా దళ్ తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సుజాత ఒకప్పటి బీజేడీ నాయకుడు వీకే పాండియన్ భార్య. ఆమె కాలికట్ తొలి మహిళా కలెక్టర్. క్షేత్రస్థాయి నుంచి మహిళలను పైకి తీసుకురావడం, ఎస్ఎస్జీని ఎస్ఎంఈగా మార్చడం, ఈ–కామర్స్ ద్వారా గృహిణులకు వ్యాపారాలు కల్పించడం వంటి ఎన్నో పనులు ఆమె చేశారు. సుజాత రౌత్ నేరుగా నాయకత్వ పాత్రలోకి ప్రవేశించకుండా, పార్టీ పని ద్వారా సంస్థలో తన స్థానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. -
అమానుషం
భువనేశ్వర్: సమాజంలో నానాటికీ మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. బిడ్డల కులాంతర వివాహంతో వెలివేత కారణంగా వృద్ధ మహిళ మరణానంతరం అంతిమ యాత్రకు చేయూత ఇచ్చేందుకు ఇరుగు పొరుగు నిర్దాక్షిణ్యంగా నిరాకరించారు. మృతురాలి కుటుంబీకులు ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో వృద్ధ మహిళ అంతిమ యాత్ర సైకిల్పై నిర్వహించారు. ఈ అమానుష సంఘటన గురువారం వెలుగు చూసింది. పశ్చిమ ఒడిశా బర్గఢ్ జిల్లా పాయికమల్ మండలం కొంటపొడా గ్రామంలో ఇలాంటి హృదయ విదారక సంఘటన సభ్య సమాజానికి సిగ్గు చేటుగా నిలిచింది. కొంటపొడా గ్రామస్తురాలు జయంతి బొచ్ఛా అనే వృద్ధురాలు మరణించారు. తన బిడ్డలు కులాంతర వివాహం చేసుకోవడంతో వారిని కులం నుంచి వెలివేసిన కారణంగా కులస్తులు మృత దేహాన్ని మోయడానికి నిరాకరించారు. దీంతో మృతురాలి కోడలు యజ్ఞాసిని బొచ్ఛా, మనవడు శుభం బొచ్ఛా, మనవరాలు శివాని బొచ్ఛా మృత దేహాన్ని సైకిల్పై శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల జాడ కొరవడడం మరింత హృదయవిదారకంగా మారింది. దుఃఖ సమయంలో ఒక నిరుపేద, నిస్సహాయ కుటుంబానికి శవం తరలించేందుకు వాహనం వంటి ప్రాథమిక సేవని కూడా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయలేకపోవడం ప్రజా పాలన వ్యవస్థను నిలదీసింది. సైకిల్పై అంతిమ యాత్ర -
పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు
● రథ యాత్రలో టోల్ ఫీజు మినహాయింపు భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర సందర్భంగా భక్తులకు సులభమైన రవాణా సేవలను అందించేందుకు రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని ప్రకటించారు. యాత్రలో భాగంగా జరిగే శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర రోజుల్లో పూరీ టోల్ వసూళ్లు నిలిపివేస్తారు. పిప్పిలి టోల్ ప్లాజా వద్ద బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ లేదా వాణిజ్య వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. స్థానిక ఆర్టీఓ–1 కార్యాలయంలో రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి రోజూ పూరీకి సుమారు 200 ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా రథ యాత్ర సమయంలో ఇతర మార్గాల్లో తిరిగే మరో 200 బస్సులకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక అనుమతులను శ్రీ గుండిచా యాత్ర, బహుడ యాత్ర, స్వర్ణ అలంకార దర్శనం కోసం పరిమితం చేశారు. ఈ విధంగా సుమారు 400 ప్రైవేట్ బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు. దీనితో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) మరియు సీఆర్యూటీ బస్సు సర్వీసులను పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. బస్సులో ఏ ప్రయాణికుడైనా అస్వస్థతకు గురైతే తక్షణ సహాయం అందించేందుకు అన్ని బస్సులలో ప్రథమ చికిత్స కిట్లను ఉంచాలని నిర్ణయించారు. ప్రధాన బస్ టెర్మినళ్లు, బస్ స్టాపులు, బస్సుల్లో ప్రయాణికుల కోసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేస్తారు. రథ యాత్ర సమయంలో పూరీ, తలొబొణియా, రాష్ట్ర రవాణా ప్రధాన కార్యాలయంలో రాత్రింబవళ్లు పని చేసే సమాచార కేంద్రం, కంట్రోల్ ఏర్పాటు చేస్తారు. దీని కోసం ఒక ప్రత్యేక నంబర్ను జారీ చేస్తారు. మరో టోల్–ఫ్రీ నంబర్ కూడా పనిచేస్తుంది. ఇ–రిక్షా సౌకర్యం ప్రయాణికుల సౌకర్యానికి తలొబొణియా ప్రాంతంలో త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నారు. దీనితో పాటు ఉచితంగా వండిన ఆహారాన్ని అందిస్తారు. అదే విధంగా అవసరాన్ని బట్టి మాలతీపట్టుపూర్లో ఏర్పాట్లు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సులకు ఈ ప్రాంతంలో ఆగేలా ఏర్పాట్లు చేసి అక్కడి నుండి భక్తుల కోసం ఉచిత షటిల్ సర్వీసును అందిస్తారు. అదే విధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తలొబొణియా, ఇతర ప్రధాన పార్కింగ్ ప్రాంతాల నుంచి ఉచిత ఇ–రిక్షా సౌకర్యాలను కల్పిస్తారు. ఇందు కోసం 450 ఇ–రిక్షాలను నిర్వహిస్తారు. చార్జీల వసూలుపై నిఘా ప్రతి బస్సులో చార్జీల పట్టికలను ప్రదర్శించడం తప్పనిసరి చేశారు. రవాణా శాఖ, బస్సు యజమానుల సంఘంతో కలిసి పూరీలోని ఆటో రిక్షాల ఛార్జీలపై కూడా నిశితంగా పర్యవేక్షిస్తుంది. ప్రయాణికులు ఎలాంటి దోపిడీకి గురికాకుండా చూడటం ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భువనేశ్వర్–పూరీ రహదారిపై తగినన్ని క్రేన్లు, అంబులెన్సులు మోహరిస్తారు. ఇందుకోసం పోలీసు శాఖ, ఆరోగ్య శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో తక్షణ చికిత్స అందేలా చూస్తారు. అదేవిధంగా, భువనేశ్వర్ – పూరీ, పూరీ – కోణార్క్ జాతీయ రహదారులపై ఏదైనా వాహనం పాడైతే, తక్షణ మరమ్మతు సేవలను అందించాలని వాహన తయారీదారులు, డీలర్లను కోరారు. వాహన తయారీదారులు, డీలర్లు కొన్ని కీలక ప్రదేశాలలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. సమావేశానికి జంట నగరాలు భువనేశ్వర్, కటక్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీ, పూరీ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్, రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్టీఏ) అధికారులు, బస్సు యజమానుల సంఘం కార్యకర్తలు, ఓఎస్ఆర్టీసీ, సీఆర్యూటీ ప్రతినిధులు హాజరయ్యారు. పూరీ జిల్లా మేజిస్ట్రేట్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. -
నిధుల కాజేతే లక్ష్యం..!
ఇలా ఒత్తిళ్లు..! కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రామాల్లో చేయాల్సిన పనుల జాబితాలను నేతలే సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పలువురు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక పనికి ఒకరిద్దరూ కాకుండా ఏకంగా కూటమిలోని నలుగురు, ఐదుగురు చొప్పున పోటీపడటంతో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నిధులను ఎలాగైనా స్వాహా చేయాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు, ఒత్తిళ్లుకు అధికారులు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పనుల పేరుతో నిధులు కాజేసే ప్లాన్ గ్రామాల్లో మురుగు నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు ఇలాంటి చిన్నపాటి పనులు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అవసరం లేని పనులను కూడా అత్యవసరంగా చూపించి నిధులు ఖర్చుచేసే మార్గాలు వెదుకుతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేయకనే బిల్లు గురించి చర్చలు మొదలయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ ప్రజల అవసరాలకంటే నేతలకు లబ్ధి కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హిరమండలం: పంచాయతీల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ఏదో రూపంలో బయటకు తీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామాల అవసరాలకు వినియోగించాల్సిన నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. ఏప్రిల్తో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందని భావించినప్పటికీ.. పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. నేరుగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పనులు మంజూరు చేయించుకోవాలనే ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీలు, ప్రత్యేక అధికారుల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త పనులకు అనుమతులు, బిల్లుల చెల్లింపులు, నిధుల బదిలీల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కొందరు కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో, వాటిపై సరికొత్త వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. -
ఉత్త కోతలే..!
ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ 2 కూటమి ప్రభుత్వ వైఫల్యం ఈ రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తిచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సగానికి పైగా పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తిచేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే వైఫల్యం ఉంటుందా..? – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం హిరమండలం: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. బీఆర్ఆర్ వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం.. ఇలా ఏ పథకాన్ని కూడా రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో జిల్లాకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యం దెబ్బతినేలా ఉంది. ఇదీ జరిగింది... వంశధార ఫేజ్–2 రిజర్వాయర్కు నేరడి బ్యారేజీ నిర్మాణం కీలకం. దీనికోసం ఒడిశాతో జల వివాదం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో వ్యవహరించారు. ఈ మేరకు అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. వంశధార నదిలో హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడానికి నిర్ణయించారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార జలాశయంలోకి చేర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఇందుకుగాను రూ.176.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.140.17 కోట్లకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా పనులు ప్రారంభించారు. రెండేళ్లలో సగానికిపైగా పనులు పూర్తి చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందే తప్ప.. పనులు మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదలలో తాత్సారం కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎత్తిపోతల పథకానికిగాను విద్యుత్ సబ్స్టేషన్ అవసరం. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. గత నెలలో ఏపీ ట్రాన్స్కోకు సబ్స్టేషన్ నిర్మాణానికిగాను రూ.9.18 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా సబ్స్టేషన్ పనులు మొదలుకాలేదు. 132 కేవీ విద్యుత్ లైన్లు సారవకోట, పాతపట్నం, హిరమండలం నుంచి మొత్తం 75 టవర్లు ఏర్పాటు చేసి సబ్స్టేషన్కు అనుసంధానం చేయాలి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూములను గుర్తించాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సబ్స్టేషన్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రకటనలకే పరిమిత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2026 ఖరీఫ్నకు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమినిస్తే వచ్చే ఏడాది ఖరీఫ్నకు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి రిజర్వాయర్లో నీటిని స్థిరీకరిస్తే.. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద ఉన్న 5 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. ఆపై ఉద్దానం ప్రాజెక్టుకు 1.12 టీఎంసీల తాగునీరు అందించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ ఈ పనులు చేయలేం. కానీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకంలో ఎడతెగని జాప్యం విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రచార ఆర్భాటంతోనే గడిపేసిన కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్లో వంశధార నీరు లేనట్టే -
శివకుమార్ను కఠినంగా శిక్షించాలి
పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో జయరాం, రాజారావు, శివకుమార్ అనేవారు ముగ్గురు అన్నదమ్ములు. వీరికి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి మూడున్నర ఎకరాలను సమానంగా పంచుకుందామని రెండోవాడు రాజారావు ప్రతిపాదించారు. ఈ విషయంపై అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో పోలీసుస్టేషన్, గ్రామ పెద్దల వరకు వెళ్లింది. రాజారావుకు వారసత్వం వాటా ఇవ్వడానికి మిగతా ఇద్దరు ఇష్టపడకపోవడంతో ఆయన మానసికంగా బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో గ్రామ పెద్దలు ముగ్గురికి ఆస్తిని సమానంగా పంచారు. అయితే వారికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి మిగతా ఇద్దరు అన్నదమ్ములు అడ్డుతగిలారు. దీంతో రాజారావు భార్య ఊర్వశి కోర్టును ఆశ్రయించింది. వారికి కోర్టు నోటీసులు రావడంతో కక్ష గట్టిన శివకుమార్ ఒక రోజు ఇంట్లో ఉన్న ఊర్వశిని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
జూలై 11, 12 తేదీల్లో సాహితీ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావులతో కలిసి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ప్రసిద్ధ కవులు, రచయితలతో పాటు యువకులు, వర్దమాన రచయితలు సుమారు 300 మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలు కుదించే నిర్ణయాన్ని మార్చుకోవాలి
పలాస: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో వాటిని కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్కు మార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూదికొండ కాలనీలోని పీడీఎస్యూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో 8, 9, 10 తరగతులను కుదించి, వారిని సమీప పాఠశాలలకు పంపించాలనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివల్ల ఆర్థిక భారం వలన ఇతర పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేక మధ్యలో చదువుకు స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వంటమనిషి, వాచ్మెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. -
ఆటోను ఢీకొన్న కారు
మందస: మండలంలోని మకరజోల సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డ్రవర్కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్రకే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని కాలిజియేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరు, ఫలితాలు, అడ్మిషన్ల తీరు గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడును అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ జి.రాజశేఖర్, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, డాక్టర్ రామకృష్ణ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి శ్రీకాకుళం పాతబస్టాండ్: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీలో ప్రమాదం ● యువకుడు మృతి సారవకోట: మండలంలోని గోవర్ధనపురం రెవెన్యూ పరిధి అనవీర్ గ్రానైట్ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు జె.శ్రీకాంత్ రెడ్డి (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రానైట్ క్వారీలో ఎప్పటిలాగే బుధవారం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న రాయి నీడలో సేద తీరేందుకు కూర్చున్నాడు. అయితే అదే రాయి ప్రమాదవశాత్తు ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఒడిశాలోని గంజాం జిల్లా నరసింగపూర్గా గుర్తించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ అనిల్ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారావు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆదర్శనీయం ● తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. -
తవ్వారు.. వదిలేశారు..!
కొత్తూరు: కూటమి ప్రభుత్వంలో హడావుడిగా నాయకులు రోడ్ల పనులను ప్రారంభించి.. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయల గ్రామం నుంచి ఎర్రటిగూడ వరకు రోడ్డు పనులు మంజూరు చేశారు. దీంట్లో భాగంగా పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు ఊరు చెరువు గట్టుపై నుంచి వెళ్లాల్సి ఉండడంతో చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణం కోసం మూడు నెలల క్రితం గాడిని తవ్వారు. అయితే అనంతరం గోడ నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాడిలో నీరు చేరుతోంది. ఫలితంగా చెరువు గట్టు బలహీనపడింది. ఈ చెరువు కొండల దిగువ భాగాన ఉన్నందున చిన్నపాటి వర్షాలకు చెరువులోకి నీరు చేరడం వలన గాడిలో నీరు ఎక్కువవుతోంది. దీంతో గట్టు పలుచోట్ల బలహీనపడడంతో కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ గట్టు కూలిపోయినట్లయితే చెరువులో నీరు పొలాల్లోకి చేరుతుంది. ఫలితంగా మొలక దశలో ఉన్న వరినారు, వరి వెదలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గాడి తవ్వడం వలన రోడ్డు మీద మట్టి నిండిపోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసే సమయంలో ఈ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రోడ్డు పనుల కోసం చెరువు గట్టు తవ్వేశారు. అయితే సకాలంలో పూర్తి చేయకపోవడంతో గట్టు పూర్తిగా బలహీనపడింది. పలుచోట్ల బీటలు వారింది. వర్షాలకు చెరువులో ఎక్కువ నీరు చేరినట్లయితే చెరువు గట్టు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి నీరుచేరే ప్రమాదం ఉంది. తవ్విన గాడి పూడ్చకపోతే ఈ ఏడాది పంట చేతికొచ్చే అవకాశం లేదు. – రాగాల సులోచన, ఆయకట్టు రైతు, రాయల గ్రామం -
విజిలెన్స్ వలలో ఆర్డీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
రాయగడ: బిల్లు చెల్లింపులు జరిపించేందుకు కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రాయగడ గ్రామీణాభివృద్ధి శాఖ (ఆర్డీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్ అధికారులకు మంగళవారం రాత్రి పట్టుబట్డారు. బిల్లు ఆమోదం కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో బాధిత కాంట్రాక్టర్ విజిలెన్స్ శాఖను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ ఇంజినీర్ నివాసంలో లంచం మొత్తాన్ని అందజేస్తుండగా రాయగడ విజిలెన్స్ డీఎస్పీ సూర్యకాంతి టక్రి, అభయ ప్రధాన్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం దాడి చేశారు. రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తులపై అనుమానాల నేపథ్యంలో నయాగడ్ జిల్లాకిల్లా ప్రాంతంలోని ఆయన నివాసం, భువనేశ్వర్, ఇతర ప్రదేశాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉన్న ప్రసన్నకుమార్ పట్నాయక్ విజిలెన్స్కు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. -
ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి బంద్
● రాయగడ ప్రధాన ఆస్పత్రిలో రెండు ప్లాంట్లలో నిలిచిన ఉత్పత్తి ● రోగుల్లో తీవ్ర ఆందోళన రాయగడ : కొవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి కేర్స్, ముఖ్యమంత్రి కేర్స్ నిధులతో రాయగడ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో రోగులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2021 అక్టోబరు 7న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలోఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు పైప్లైన్ల ద్వారా నిరంతర ఆక్సిజన్ సరఫరా చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రెండు ప్లాంట్లలోనూ ఉత్పత్తి నిలిచిపొవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆక్సిజన్ సిలిండర్లను, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇటీవల జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. రోగి సంక్షేమ సమితి నిధులను వినియోగించి మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్ మేనేజర్లు, ఒక సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి దుస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే సందర్శన.. విషయం వెలుగులోకి రావడంతో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక మంగళవారం సందర్శించారు. ఏడీఎం (మెడికల్)తో కలిసి ఆక్సిజన్ ప్లాంట్ల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను తనిఖీ చేశారు. 24 పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 20 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రోగుల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకుని ఆక్సిజన్ ప్లాంట్లను తిరిగి పనిచేసేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సాంకేతిక లోపమే కారణమా.. డీఎంఓ, డీహెచ్హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం రాత్రి పది గంటల నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అయితే ఆస్పత్రిలో సుమారు 20 రోజుల అవసరాలకు సరిపడే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నందున సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. భువనేశ్వర్ నుంచి సాంకేతిక నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు పూర్తి చేసిన వెంటనే ప్లాంట్ పూర్వ స్థితికి చేరుతుందన్నారు. -
ఘనంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర మందిరం 32వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిర ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేణ ఆరాధన, పుణ్యాహావచనం, పరిషత్, రుత్విక్ వరుణ, రక్షాసూత్రధారణ, మత్సంగ్రహణం, వాస్తు యోగీశ్వర పూజలు జరిగాయి. మందిరం పరిశీలన కమిటి అధ్యక్షులు చంద్రమౌళి కుముంధాన్, కార్యదర్శి శ్రీనివాస్ కుముంధాన్, సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు, కొత్తకొట గౌరీశంకర్ పాల్గొన్నారు. నేటి పూజా కార్యక్రమాల వివరాలు ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాత్తుమురై, అంకురారొహణం, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, మూర్తి కుంభరాధన, పతాక ధ్వజ ప్రతిష్టాపనలు, గరుడధ్వజారోహణం, ఉదయం తొమ్మిది గంటలకు శ్రీసత్యానారాయణ స్వామి వ్రతములు, సాయంత్రం ఐదు గంటలకు ఎదుర్కోలోత్సవం, 5.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి ఎనిమిది గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం, విశేష హోమాలు, నీరజన మంత్రపుష్పములు, ప్రసాద సేవన కార్యక్రమాలు కొనసాగుతాయి. -
హెల్ప్ డెస్క్ ప్రారంభం
కొరాపుట్: కాలేజీల ప్రాంగణాల వద్ద ప్రతిపక్ష బీజేడీ పార్టీ హెల్ప్ డెస్క్లు ప్రారంభమయ్యాయి. కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో ప్లస్ 2, ప్లస్ 3 విభాగాలకు బోధనా తరగతులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా విద్యార్థులు కళాశాలలకు చేరుకుంటున్నారు. వీరికి పట్టణాల్లో పరిస్థితులు, తరగతులు, ముఖ్య విభాగాలపై అవగాహన అంతగా ఉండదు. అటువంటి వారికి అవగాహన కల్పించడానికి బీజేడీ యువ, విద్యార్థి విభాగాలు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డి.ఎ.వి కళాశాల ఎదుట జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక ఈ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, తదితరులు పాల్గొన్నారు. -
బాకై ్సట్ డంపింగ్ యార్డు మాకొద్దు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి దహిఖాల్ గ్రామ సమీపంలో బహుళజాతి సంస్థ వేదాంత అల్యూమినా కంపెనీ ప్రతిపాదించిన బాకై ్సట్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. యార్డు ఏర్పాటుతో ప్రజల జీవనం, ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఈ నెల 5 నుంచి హటొ దొహిఖాల్లో వద్ద శాంతియుత రిలే నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక శిబిరాన్ని సందర్శించి నిరసనకారులతో చర్చించారు. వారి సమస్యలు, డిమాండ్లను విన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరిగే శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ డంపింగ్ కార్యకలాపాల వల్ల భారీ వాహనాల రాకపోకలు పెరిగి ధూళి, వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజల జీవనోపాధి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రతిపాదిత బాకై ్సట్ డంపింగ్ ప్రాజెక్టును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గాప్రసాద్ పండా, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్షన్ మంగరాజ్, సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు నీలాంబర్ బిభార్, ఎంపీ ప్రతినిధి నీలాంబర్ బెహరా, యువ కాంగ్రెస్ నాయకుడు బాదల్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
గజపతి వికాసమే ధ్యేయం
● రాష్ట్ర న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ● జిల్లా కేంద్రంలో వికసిత్ ఒడిశా సమ్మేళనంపర్లాకిమిడి: గజపతి జిల్లాలో రోడ్లు, భవనాలు, పర్యాటక కేంద్రాలు, విద్య, వైద్యం వికాసానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అబ్కారీ, న్యాయ, ప్రజాపనుల శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం మందిరంలో వికసిత్ ఒడిశా సమ్మేళనం ‘వికాస్ ధారా, ఒడిశా సారా..’ కార్యక్రమం ప్రారంభించారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహనా శాసన సభ్యుడు దాశరథి గొమాంగో, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఎస్పీ మీనా, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డీఎఫ్ఓ నాగరాజు, డీపీఓ ప్రకాష్రావు, ఎస్.డి.సీ.చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజపతి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అదే సమయంలో కలెక్టర్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టులకు నిధులు మంజూరు.. గజపతి జిల్లాలో రూ.2.09 కోట్లతో గండాహాతి, గుద్గురా, మంకడాడియా జలపాతాలు అభివృద్ధి చేస్తామని, పర్లాకిమిడి గుణుపురం, రాయగడ, తెలువళ్ళి రైల్వేలైను పొడిగిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల డిమాండ్ మేరకు పర్లాకిమిడి నుంచి గుమ్మగెడ్డ వరకూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లతో టెండర్లు పిలిచామని చెప్పారు.స్థానిక శ్రీజగన్నాథ మందిరం పునరుద్ధరణ పనులకు రూ.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని, కృష్ణచంద్ర గజపతి కళాశాలకు విశ్వవిద్యాలయం హోదా కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పలువురు ప్రతినిధులను సత్కరించిన అనంతరం ఎస్.కె.సి.జీ.కళాశాలలో వికాస్రో ధారా, ఒడిషా సారా స్టాల్స్ను ఎమ్మెల్యేలు దాశరథి గొమాంగో, రూపేష్ పాణిగ్రాహిలు ప్రారంభించారు. -
ఆకలితో అలమటిస్తున్నా పింఛన్లు ఇవ్వరా?
కొరాపుట్: పేదలు పింఛన్లు అందక ఆకలితో చనిపోతున్నా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి బాధ్యత లేకుండాపోయిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు. బుధవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో ఆర్థిక రాజధాని వంటి గంజాంలో సావిత్రి దొర (66) అనే వృద్ధురాలు నెలవారీ పింఛన్ అందక ఆకలితో మృతిచెందడం బాధాకరమన్నారు. నబరంగ్పూర్ జిల్లాలో మూడు నెలలుగా పేదలకు పెన్షన్లు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మూడు నెలల పెన్షన్ 15 రోజులలో పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చి గడువు ముగిసినా ఫలితం లేకపోయిందన్నారు. నబరంగ్పూర్ జిల్లాలో 1656 మంది దివ్యాంగులకు పింఛన్ అందడం లేదన్నారు. కేవలం వెయ్యి రూపాయలతో జీవనం సాగించే దివ్యాంగులు ఆ డబ్బులు కూడా అందక విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17,130 మంది వితంతువులు తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఎక్కడైనా పింఛన్దారులలో మృతి చెందితే ఆ స్థానంలో మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. ఎన్ఎస్ఏపీ పథకం కింద అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలన్న నిబంధన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పపడాహండి సమితిలో పద్మన్ బిసోయి విధి నిర్వాహణలో చనిపోతే నేటికీ ప్రభుత్వ పరంగా సాయం అందలేదన్నారు. దాంతో అతని భార్య బబితా బిసోయి వృద్ధాప్య పెన్షన్ రు.1000పై ఆధారపడి జీవిస్తోందన్నారు. ఆ పెన్షన్ కూడా మూడు నెలలుగా అందడం లేదన్నారు. వారం రోజుల్లోగా ఆమెకు న్యాయం జరగకపోతే కలెక్టర్ నివాసం ముందు ఆందోళన చేస్తామని ప్రదీప్ మజ్జి హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి, బీజేడీ నాయకులు భీమో పూజారి, ప్రమోద్ రథ్, లల్లూ త్రిపాఠి, నాగేంద్ర పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో విస్తరిస్తున్న సారా వ్యతిరేక ఉద్యమం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం క్రమేనా గ్రామాలకు విస్తరిస్తుంది. ఒక్కొక్క పల్లెలో జరుగుతున్న పరిణామా లు పరిశీలిస్తున్న గిరిజన మహిళలు తమ గ్రామాల్లోనూ అమలు చేయాలంటూ ఉద్యమ బాట పడుతున్నారు. పపడాహండి సమితిలో పలు గ్రామాలలో సారా విక్రయ దుకాణాలపై మహిళలు సామూహికంగా దాడులు చేస్తున్నారు. సారా ప్యాకెట్లను రోడ్లపై విసిరేసి ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు బీహారి మద్య తయారీ కేంద్రాల నుంచి తమ గ్రామాలకు సారా రాకుండా పహారా కాస్తున్నారు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు వ్యాన్లు, ఆటోలలో మహిళలు తరలివస్తున్నారు. అయితే అటువంటి వాహనాలపై ఆర్టీఓ సిబ్బంది భారీ జరిమానాలు విధిస్తుండటం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మండిపడ్డారు. హెల్ప్డెస్క్లపై వివాదం జయపురం: పట్టణంలోని విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో హెల్ప్ డస్క్ల ఏర్పాటుపై బీజేపీ, బీజేడీ విద్యార్థి సంఘాల నేతల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వర్సిటీలో యూజీ, పీజీలలో ప్రవేశించే విద్యార్థులకు సహాయం చేసేందుకు ఏబీవీపీ విద్యార్థులు, బీజేడీ విద్యార్థులు హెల్ప్ డస్క్లు(సహాయక కేంద్రాలు) నెలకొల్పటం వివాదాస్పదమైంది. విద్యార్థుల మధ్య వివాదానికి కారణమైన హెల్ప్ డస్క్లను తొలగించేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ వచ్చి ఉభయ వర్గాల మధ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఒక దశలో రిజిస్ట్రార్తో ఏబీవీపీ జయపురం నేత జ్యోతీ రంజన్ పాణిగ్రహి వాగ్వాదానికి దిగారు. రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారు, ఈ వివాదం పరిష్కరించటం మీ వల్ల కాదు, వైస్ చాన్సలర్ను పిలవండి అని నిలదీయటంతో వివాదం పెరిగి పరిస్థితి జఠిలమైంది. సకాలంలో పోలీసులు వచ్చి ఉభయవర్గాలకు సమాధానపరిచారు. రాయగడ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ కార్యక్రమంలో జిల్లా విశేష విజయాన్ని సాధించింది. జిల్లాలో సేకరించిన ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంలో అధికారులు పూర్తిగా సఫలీకృతులయ్యారని జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణి ప్రసంశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాష్ట్రంలోనే రెండో జిల్లాగా రాయగడ నిలవడం అందరి కృషి పలితమేనన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మే 30 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభమైందని వివరించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంటి పనులు సక్రమంగా నిర్వహించడంతోనే ఈ ఫలితం దక్కిందన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 895 మంది బీఎల్ఓలు విధులు నిర్వహించారన్నారు. 7,14,500 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారన్నారు. సేకరించిన అన్ని ఫారాలను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడంతోపాటు వాటి ధ్రువీకరణ ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల శాఖ సక్రమ నిర్వహణతో పాటు బీఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో జూలై 5 నుంచి ఆగష్టు 4వ తేదీ వరకు ఓటరు జాబితాపై దావాలు, అభ్యంతరాలు, స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను సెప్టెంబర్ 2వ తేదీ నాటికి పరిష్కరించి, సెప్టెంబర్ 6వ తేదీన ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపొవడంతో ఆందొళన చేపట్టారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2023 నవంబర్ నుంచి వేతనాలు సకాలంలో అందడం లేదని, ప్రస్తుతం వరుసగా మూడు నెలల జీతాలు బకాయిలు ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందిన వారంతా వివరించారు. ఈ విషయమై పలుసార్లు జిల్లా యంత్రాంగం, ఔట్సోర్సింగ్ సంస్ధ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపొయారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు జిల్లా ప్రధాన వైద్యాధికారికి మసోసారి వినతిపత్రం సమర్పించి వెంటనే బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 57 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
● నబరంగపూర్లో మహిళల ఆందోళన ● కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల ముట్టడినబరంగ్పూర్ కలెక్టరేట్ వైపు ఆందోళనగా వెళ్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు కొరాపుట్ : సంపూర్త మద్య నిషేధం కోరుతూ వేలాది మంది మహిళలు మంగళవారం నబరంగ్పూర్లో ఆందోళనకు దిగారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ముట్టడించారు. మహిళలు తమ సంప్రదాయ ఆయుధాలు, కర్రలతో ర్యాలీగా వచ్చి మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా నినదించారు. గత కొన్ని రోజులుగా పపడాహండి సమితి మైదల్పూర్ ప్రాంతంలో బీహారీ మద్యం తాగి గిరిజన యువకులు పెద్ద ఎత్తున్న చనిపోతున్నారు. దాంతో ఆ ప్రాంత మహిళలు బీహారి మద్యం, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం గిరిజన మహిళలపై కేసులు పెట్టింది. విషయం తెలుసుకున్న మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ఘరో మహిళా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసి వేశారు. ఈ ఉద్యమం మరలా ప్రారంభం కావడంతో ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దాంతో మహిళలు ఆయుధాలతో సహా ర్యాలీ చేపట్టారు. తొలుత కలెక్టరేట్ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మహిళలతో చర్చలు జరిపారు. అక్రమ దేశీ తయారీ మద్యం బట్టీలు, దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా మహిళలు ఆయుధాలతో రావడంతో పోలీసులు వారిని శాంతింపజేశారు. ఎస్పీ పార్దవ్ కశ్యప్ బయటకు వచ్చి మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే నిరసనలో పాల్గొన్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కొందమాల్ జిల్లాలో గిరిజన ప్రజల డిమాండ్పై జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం కొనసాగుతుందన్నారు. అదే విధంగా షెడ్యూల్డ్ జిల్లా నబరంగ్పూర్లో కూడా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ రెండేళ్లలో జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదన్నారు. నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతరాయగడ: దేశంలో 12 ఏళ్లు, రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకుని విజయపరంపరగా ముందుకు అడుగులు వేస్తున్న బీజేపీ ప్రజల ఆదరణాభిమానాలను మరింత సమీకృతం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు యాళ్ల కొండబాబు అన్నారు. పార్టీ విజయోత్సవాలను సదరు సమితి బాయిసింగ్ పంచాయతీలొ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కొసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజల దరికి చేరేలా అంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కలిగించడంతో పాటు అభివృద్ధి ఒడిశా, సమృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. అనంతరం అంత్యోదయ గృహాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండబాబుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న పార్టీశ్రేణులు -
రాయగడలో జిల్లాస్థాయి జనకల్యాణ మేళా
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో మంగళవారం జనకల్యాణ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలతో అనుసంధానించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. జన కల్యాణ మేళాలో వీధి వ్యాపారులను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలు, ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధన్, జనధన్ యోజన, మాతృ వందన యోజన తదితర మొత్తం ఎనిమిది ముఖ్య సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా 123 మంది కొత్త వీధి వ్యాపారులను గుర్తించారు. తాజాగా రుణాలు మంజూరైన ఇద్దరు వ్యాపారులకు చెక్కులు అందజేశారు. అలాగే మరో పది మంది కొత్తవీధి వ్యాపారులను సన్మానించారు. వీధి వ్యాపారుల నైపుణ్యాభివృద్ధి, సురక్షిత ఆహార విక్రయాలను ప్రొత్సాహించే లక్ష్యంతో ఆహర భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
నాల్కో టౌన్షిప్లో కీచకపర్వం
కొరాపుట్ : కొరాపుట్ జిల్లా దమంజోడిలో భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో)లో ఓ మహిళపై కీచక పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 18న ఓ ఉద్యోగి కుటుంబానికి చెందిన మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భయంతో కేకలు వేయడంతో వారు పారిపోయారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు దమంజోడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం ఉదయం నాల్కో ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నాల్కో టౌన్షిప్ వద్ద ప్రతి రోజూ బయట వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భద్రత పెంచాలని, అనుమానితులను ఈ ప్రాంతంలోకి అనుమతించవద్దని, రోడ్లపై లైటింగ్ పెంచాలని, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాల్కో హెచ్ఆర్ విభాగానికి అందజేశారు. -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు
కొరాపుట్: జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం బీజేపీ నాయకులు నిర్వహించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మజ్జి గుడలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం శ్యాం ప్రసాద్ కన్న కలలను రాష్ట్ర ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానంద గొండో గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాల్గొన్నారు. ● ఝార్సుగుడలో మొబైల్ హ్యాండోవర్ మేళా రాయగడ: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫొన్లను గుర్తించి వాటిని అసలు యజమానులకు తిరిగి అందించే లక్ష్యంతో ఝార్సుగుడ పోలీసులు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలొ నాలుగో విడత మొబైల్ హ్యాండోవర్ మేళాను నిర్వహించారు. ఆపరేషన్ నేత్ర కింద చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ విడతలో మొత్తం 55 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అప్పగించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర పాల్గొని మోబైల్ యజమానులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు నిర్వహించిన మూడు విడతల మోబలై హ్యాండోవర్ మేళాల్లో 269 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సంబంధిత వ్యక్తులకు అందించినట్లు వివరించారు. నాలుగో విడతలో లక్ష్మణ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్యధికంగా 13 మోబైల్ ఫోన్లు, ఝార్సుగుడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఫోన్లను రికవరీ చేయగా మిగిలిన ఫోన్లు బ్రజరాజ్నగర్, బడ్మాల్, ఓరియంట్, బెల్పహార్, బన్హార్పాలి, లపైకెరా, కొలాబిరా, రెంగాలి, ఎయిర్పొర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తించబడ్డాయని తెలిపారు. ఇదిలాఉండగా మోబైల్ ఫోన్లు పోయినా లేదా చొరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. -
రైల్వే నిర్వాసితులకు రూ. 153 కోట్ల పరిహారం పంపిణీ
కొరాపుట్: నబరంగ్పూర్–జయపూర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులుగా మారినవారికి పరిహారం పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రాధమిక విద్య, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో మూడో విడత కార్యక్రమంలో భాగంగా 144 మందికి 153 కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. నందాహండి తాహసీల్ పరిధిలో భూములు కోల్పోయిన వారికి ఈ విడత పరిహారాలు అందాయి. ఈ ప్రాంతంలో 108 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. కార్యక్రమంలో పాల్గొన్న నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి మాట్లాడుతూ.. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రం రైల్వే అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. 460 కిలోమీటర్ల పొడవుతో జునాఘడ్–నబరంగ్పూర్, నబరంగ్పూర్–జయపూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రచలం నిర్మాణం దేశంలో రెండవ అతి పెద్ద రైల్వే నిర్మాణంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఎంపీ బలబద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంఎల్ఎ గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ పాల్గొన్నారు. -
ముమ్మరంగా యువతిపై దాడి కేసు దర్యాప్తు
● ఇప్పటికే 24 మంది అరెస్టు ● పరారీలో ఉన్నవారి గురించి గాలింపు రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో ఓ యువతిపై జరిగిన దాడికి సంబంధించిన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనను అత్యంత సున్నితమైన రెడ్ ప్లాగ్ కేసుగా గుర్తించి క్రైం బ్రాంచ్కు చెందిన మహిళా, శిశు నేరాల విభాగం పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తును పరివేక్షిస్తున్న ఏడీజే ఎస్. పైనీ సోమవారం భువనేశ్వర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనలో పాల్గొన్న ఒక్క నిందితుడ్ని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠినతరమైన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఒడిశా ప్రతీకకు మచ్చ కళ్యాణసింగుపూర్లో జరిగిన ఘటన రాష్ట్రం, సమాజం సిగ్గుపడేలా చేసిందని ఏడీజే సైనీ వ్యాఖ్యానించారు. ఒడిశా ఇలాంటి ఘటనలు జరిగే రాష్ట్రం కాదని అన్నారు. అయితే ఇటువంటి తరహా ఘటనలు భవిష్యత్లో పునరావృత్తం కాకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతుందని ఆకాంక్షించారు. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తమవంతు ప్రయత్నాన్ని చేయాలని పిలుపునిచ్చారు. బాధితురాలిని ప్రమాదం నుంచి రక్షించిన వ్యక్తికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బాధితురాలికి రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టు విచారణను పర్యవేక్షిస్తాం ఈ కేసు దర్యాప్తు మాత్రమే కాకుండా, కోర్టులో విచారణ జరిగే దశలో కూడా పోలీస్ శాఖ పర్యవేక్షణ కొనసాగుతోందని సైనీ వెల్లడించారు. నిందితులకు గరిష్ట శిక్షలు పడేలా పటిష్టమైన ఆధారాలను సమర్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన సామాజిక సంస్థ యువతిపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోరాటం కుటుంబం అనే సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుబ్రత్ కుమార్ దాస్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్వయంగా జోక్యం చేసుకుని ఒడిశాకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంపించాలని కోరారు. అదేవిధంగా బాధితురాలికి తగిన పరిహారం అందించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిటిషన్లో రాయగడ కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, హోం సెక్రటరీ, ముఖ్యమంత్రి, గవర్నర్లను కూడా పక్షాలుగా చేర్చినట్లు సమాచారం. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి పిల్లల అపహరణ అనుమానంతోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరిపై కూడా దాడులు చేయడం తగదని పోలీసులు కోరుతున్నారు. ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఏడీజీ సైనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులు, అనుమానాల ఆధారంగా మూకదాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు యువతిపై అమానుష దాడికి సంబంఽధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఎస్పీ రాజ్ ప్రసాద్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని, దాడి సమయంలో ఉన్న వారిని కలిసి వివరాలు సేకరించారు. అలాగే ఘటన జరిగిన సమయంలో పోలీసుల పాత్ర ఎలా ఉండేది, ఎంతవరకు స్పందించారు అనే విషయాలను ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఇంతాలిగుడ గ్రామానికి వెళ్లిన ఎస్పీ ఆ గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన మాటలను,వివరాలను సేకరించారు. -
రాష్ట్రాభివృద్ధే సర్కారు లక్ష్యం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కార్యాలయం ప్రాంగణంలో సోమవారం కేంద్ర ప్రభుత్వానికి 12 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికాస్ ధారా.. ఒడిశా సా రా’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శా ఖల సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ప్రయో జనాలను పంపిణీ చేశారు. సమితి అధ్యక్షుడు విఘ్న కిర్సాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమితి అభివృద్ధి అధికారి అర్పిత మహంతి, అతిథులు కలిసి గిరిజనులకు భూ పట్టాలు, పింఛన్లు మంజూరు పత్రాలు, అంత్యోదయ గృహ పథకం కింద ఇళ్ల కేటాయింపు, అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు, చేపల పెంపకం కోసం లబ్ధిదారులకు ఆర్థిక సహయం అందజేశారు. మిషన్శక్తి మహిళ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను అధికారులు సందర్శించారు. సమితి అదనపు అభి వృద్ధిశాఖ అధికారి కార్తిక్ నాయక్, ఖోయిర్పూట్ సర్పంచ్ దైమతి గోల్పేదా, దుష్మంత్ బెహరా పాల్గొన్నారు. -
పోక్సోపై అవగాహన
పర్లాకిమిడి: జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధికారి, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశానుసారం గుసాని సమితి గురండి గ్రామంలో ఉన్న శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో సోమవారం పోక్సో, కిశోర న్యాయం, సీపీసీ, పోక్సోలో చట్టం అనుసారం బాధితులకు నష్టపరిహారం ఎలా లభిస్తుంది అనే విషయంపై డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమర్ రౌళో అవగాహన కల్పించారు. ఆయనతో పాటు జిల్లా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్కుమార్ మిశ్రా కూడా పోక్సో కేసులో బాధితులకు న్యాయం చేయగలిగేలా చట్టాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ న్యాయ సేవా ప్రాధికరణ సదస్సులో గురండి అసిస్టెంటు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఎన్.విమల్, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అలాగే మహిళా స్వశక్తీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు కూడా ప్రజలకు వివరించారు. -
● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..
పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక బ్రాందీషాపు వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. -
ఊర్వశిది హత్యే
● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుసోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి. దాడిచేసి హత్య నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు. -
యువతిపై దాడి అమానుషం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లొ దొంగ తనం అనుమానంతో ఓ యువతిపై జరిగిన దారు ణదాడిని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంతదారుణమైనదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదన్నారు. ఘటనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులైన వారిపై నిష్పాక్షికంగా, కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజే ఎస్పీ స్వయంగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని వివరించారు. ఇదిలాఉండగా తాను ఆదివాసీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ చట్టం అందరికీ సమానమనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. నిర్ధోషులను వేధించకుండా, అసలు నిందితులను గుర్తించి త్వరితగతిన శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విస్కృత కార్యక్రమాలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
అంగన్వాడీ వర్కర్లకు సెల్ఫోన్ల అందజేత
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. గుసాని సమితిలో పలు పంచాయితీల నుంచి 32 అభియోగాలు రాగా, అందులో వ్యక్తిగతం 18, గ్రామ సమస్యలకు సంబంధించినవి 14 ఉన్నాయి. వీటన్నిటినీ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అదేశించారు. గుసానిసమితి కార్యాలయం వద్ద పది మంది వృద్దులకు మధుబాబు పింఛన్లను, పది మంది అంగన్వాడీ వర్కర్లకు సెల్ఫోన్లను అందజేశారు. రైతులకు మట్టి పరీక్ష కార్డులును అందించారు. గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, బీడీవో గౌరచంద్ర పట్నాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జయపురం: రాష్ట్రంలో సీఎం మోహణ చంద్ర మఝి నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని కొట్పాట్ బీజేపీ ఎమ్మెల్యే రూపు బొత్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయ సభాగృహంలో ‘వికాశర ధార, ఒడిశా సారా’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రూపు భోత్ర ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల బీజేపీ పాలనలో అనేక అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత, గౌరవం ఇచ్చిందన్నారు. బొరిగుమ్మ సమితి అధ్యక్షురాలు దీప్తి మయీ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే ప్రతినిధి అశోక్ కుమార్ గంతాయిత్, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి శ్రీనివాస రావు, బీడీఓ సుకాంత కుమార్ పట్నాయక్, సీడీపీఓ లక్ష్మీప్రియ మఝి, తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయ గ్రూపు మహిళలు, ఆరోగ్య, శిశు సంక్షేమ విభాగాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఒడిశా జీవికా మిషన్ తరఫున మహిళలకు సహాయ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒడిశా జీవిక మిషన్ అధికారి దేవేంద్ర పండా, జీపీడీఓ స్వాగతిక గోపాల్, బీఎస్ఎస్ఓ చంద్రికా ఖండేల్కర్, తదితరులు పాల్గొన్నారు. -
కేసులు ఎత్తివేయాలని డిమాండ్
రాయగడ: జిల్లాలొని కల్యాణసింగుపూర్ సమితి పర్సాలి పంచాయతీ కార్యాలయం సమీపంలో నియమగిరి ప్రాంతానికి చెందిన డొంగిరియా కొంధొ తెగకు చెందిన ఆదివాసీలు భారీ సమావేశాన్ని నిర్వహించారు. జల్–జంగల్–జమీన్ (నీరు ,అడవి, భూమి) అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఆదివాసీ నాయకులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న డొంగిరియా యువకులు మాట్లాడుతూ అడవులు, భూములు, ప్రకృతి సంపదల రక్షణ కొసం ఉద్యమిస్తున్న ఆదివాసీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా నియమగిరి సురక్షా సమితి కన్వినర్ లొద్ద సికక పేరుపై వారెంట్, నోటీసు జారీ చేయడంతో పాటు ఆయన ఆస్తులను జప్తు చేయమని కళ్యాణసింగుపూర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల కారణంగా నియమగిరి ప్రాంత ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. నిమయగిరి అడవులే నా అసలైన ఆస్తి నియమగిరి కొండలు, అడవులు, నీరు, గాలి, వన్యప్రాణులు ,ప్రకృతి సంపద పరిరక్షణే తన అసలైన ఆస్తులని డొంగిరియా కొందొ ఆదిమతెగకు చెందిన నాయకుడు లొద్ద సికక అన్నారు. తన ఇంటిలో కేవలం కొసల మండియా (రాగులు) కందులు, జునుములు, వంటి సంప్రదాయ ధాన్యాలే ఉన్నయని, అవసరమైతే అధికారులు తన ఇంటిని తనిఖీ చేయవచ్చని, అందుకు తను పూర్తి సహకారం ఉంటుందని వివరించారు. నియమగిరి అడవులు, కొండలు, భూములు డొంగిరియా కొంధొల జీవనాధారాలని అన్నారు. అవి వారి సంసృతి, సంప్రదాయాలతో విడదీయరాని బంధమని అన్నారు. ఈ ప్రాంత రక్షణ కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఉద్యమకారులపై వివిధ రకాల ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. పోలీసు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ సమావేశంలో మాట్లాడిన కొందరు ప్రముఖులు నిరపరాధ డొంగిరియా కొంధొలపై అనవసర పోలీసు చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీల రాజ్యంగబద్ధ హక్కులు, అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నాయకులపై వేధింపులు, కేసులు కొనసాగితే భవిష్యత్లొ భారీస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టి రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. సమావేశం ద్వారా నియమగిరి ప్రాంత ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కొసం పొరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే సంకేతాలు ఇచ్చారు. -
కలిమెల గ్రీవెన్స్లో 32 వినతులు స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మల్లావారం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్క్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 వినతులను అధికారులు స్వీకరించి కొన్నింటి అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి పరిష్కరిచాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజనుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి అధికారి దశరాఽథి సరబు, కలిమెల సమితి ఉద్యోగులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అరెస్టులు
రాయగడ: కల్యాణ సింగుపూర్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నెల 16 వ తేది అర్ధరాత్రి ఢిల్లీలోని ఆజాద్పూర్ ప్రాంతానికి చెందిన అర్పిత సుతారియా, గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన సుమన్ ఝా అనే ఇద్దరు యువతీ, యువకులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పిల్లలు ఎత్తుకెళ్లేవారంటూ గ్రామస్తులు అనుమానించి వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా ఆమెను వివస్త్రను చేసి దాడి చేయడం కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ యువతి వస్త్రాలను చించివేయడం వంటి చర్యలకు తీవ్రంగా స్పందించిన పోలీస్ శాఖ ఈ ఘటనను రెడ్ ఫ్లాగ్ గా గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే యువతీ, యువకులపై దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 24 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలాఉండగా కల్యాణసింగుపూర్లో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నాడు పోలీసులు ప్లాగ్మార్చ్ నిర్వహించారు. క్రైం బ్రాంచ్ దర్యాప్తునకు ఆదేశాలు ఈ ఘటనకు సంబంధించి స్పందించిన రాష్ట్ర పోలీస్ శాఖ డీజీ జొగేష్ బహదూర్ ఖురానియా ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు క్రైం బ్రాంచ్ మహిళ, శిశు అపరాధ నివారణ శాఖకు దర్యాప్తు కోసం ఆదేశించినట్లు సమాచారం. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కల్యాణసింగపూర్, ఘటన చోటు చేసుకున్న ఇంతాలిగుడ ప్రాంతంలో త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఒకవైపు ప్లాగ్ మార్చ్ మరొవైపు దాడికి పాల్బడిన నిందితులను అరెస్తు చేసే ప్రక్రియలను వేగవంతం చేశారు. యువతీ, యువకుల దాడికి సంబంధించి అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో కల్యాణసింగుపూర్ కు సమీపంలొ గల ఇంతాలిగుడ గ్రామంలో పురుషులంతా పరారైపోయారు. మరికొందరిని అరెస్టు చేశారు. సుమారు 60 కుటుంబాలకు పై బడి ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక్క యువకుడు కూడా కనిపించడం లేదు. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ గ్రామప్రజలు వారి కుటుంబాలకు చెందిన యువకులను ఒక్కొక్కరిని అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో భయాందోళనలకు గురవుతున్నారు. కల్యాణసింగుపూర్ ఐఐపీగా శివాజీ పండా కల్యాణ సింగుపూర్లొ వరుస ఘటనల నేపథ్యంలో ఐఐసీగా విధులు నిర్వర్తించే కల్పన బెహరను పోలీస్ శాఖ బదిలీ చేసింది. దీంతో ఆ స్థానంలో ఐఐసీగా శివాజీ పండ బాధ్యతలు చేపట్టారు. రాయగడ సైబర్ పోలీస్ స్టేషన్ ఐఐసీగా విధులు నిర్వహించే పండ ను శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కల్యాణసింగుపూర్ ఐఐసిగా పోలీస్ శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమైంది..? కంధమాల్ జిల్లా దారింగిబడి జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న సుమన్ ఝా, అర్పిత సుతారియాలు తమ విధుల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన దారింగిబడి నుండి కలహండి జిల్లా థువామూల్ రాంపూర్కు వెళ్లేందుకు స్కూటీలో బయల్దేరారు. గూగుల్ మ్యాప్పై ఆధారపడడంతో థువామూల్ రాంపూర్కు వెళ్లే ప్రక్రియలో దారితప్పి కల్యాణసింగుపూర్ ప్రాంతానికి రాత్రి సమారు 8.30 గంటల ప్రాంతంలొ చేరుకున్నారు. అయితే దారిలొ కొందరు అల్లరిమూక వారిని పిల్లలు ఎత్తుకు వెళ్లేవారిగా చిత్రీకరించి వారిని వెంబడించారు. ఈ క్రమంలో వారి బారి నుంచి బయటపడేందుకు కల్యాణసింగుపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారు పిల్లలను ఎత్తుకు వెళ్లే గ్యాంగ్ అని వారిని పట్టుకోండని కేకలు వేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు వారిపై దాడికి తెగబడ్డారు. యువతి వస్త్రాలను చించే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన తీవ్రరూపం దాల్చింది. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
కొరాపుట్: మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు జిల్లాలోని బొయిపరిగుడ పోలీస్ స్టేషన్ పరిధి బడిపహడ్ పర్వత ప్రాంతంలోని దండకారణ్యంలో డీవీఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం డంప్ను గుర్తించినట్టు చెప్పారు. ఇందులో ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు కంట్రీ మేడ్ గన్స్, ఒక క్లైమర్ మైన్, కేజీ బరువు ఉండే పది టిఫిన్ బాక్సు బాంబులు, ఆరు ఐఈడీ బాంబులు, మావోయిస్టు కిట్ బ్యాగ్, మావోయిస్టు సాహిత్యం, మందులు, నిత్యావసర వస్తువులు లభించినట్టు ఎస్పీ చెప్పారు. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినదిగా పేర్కొన్నారు. ప్రస్తుతం దండకారణ్యంలో డీవీఎఫ్, ఎస్వోజీ దళాలు గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడించారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధి కుంభారి సాహీలో గల లక్ష్మణ బాలాజీ మంది రం ప్రాంగణంలో సోమవారం విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి వారు నిర్వహిస్తు న్న జయపురం సిటీ స్కూల్ విద్యార్థులు ఆల య ప్రాంగణంలో పలు రకాల పూల, ఫల మొ క్కలు నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల కల్చరల్ ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ నేతృత్వంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ప్రశంసించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
● తాత మనవడి ఆఖరి ప్రయాణం
పూసపాటిరేగ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెంద గా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలి గ్రామానికి చెందిన మన్యాల సూరిబాబు (60), లక్ష్మి ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరా వుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్కుమార్ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాసుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. -
● అర్ధరాత్రి మృత్యుకేళి
వజ్రపుకొత్తూరు: ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ పల్సర్ బైక్ ఝాన్సీ కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాల్లో కన్నీరు.. కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన -
బైక్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పలాస: మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన నాతిమిరి రఘునాథన్ను బైకుల చోరీ కేసులో అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రఘునాథన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు నేర్చుకున్నాడు. అనంతరం బెంగాల్, అబుదాబిలో పనిచేసి 2019లో విశాఖపట్నం చేరుకున్నాడు. పరవాడ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో వెల్డింగ్ పనులను 2021 వరకు చేశాడు. ఈ సమయంలో ఇతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో బైకుల దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్ని బైకులు అతని సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలోనే పలాసలోని ఒక ఇంటి ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ను గత నెల 30వ తేదీన దొంగలించాడు. సోమవారం మరో బండిని దొంగతనం చేయడానికి వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పలాస మండలం కంబిరిగాం కూడలి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిక్కాడు. మొత్తం 18 కేసులు పట్టుబడిన రఘునాథన్ను విచారించగా అతనిపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. బైకుల దొంగతనం కేసుల్లో ఆమదాలవలస, అనకాపల్లి, విజయనగరం, పరవాడ తదితర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 29న పర్లాకిమిడిలో అరైస్టె.. విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి ఈ ఏడాది జనవరి 8న బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలాసలో బైకు దొంగతనం చేయడానికి వస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు ఆర్.నర్సింహమూర్తి, ఎన్.సునీల్, సీసీసీ ఎస్ఐ భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ నిధులతో ఆర్థిక సహాయం
రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన కొలనార సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో నలుగురికి రెడ్ క్రాస్ నిధుల నుంచి 28 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సమితిలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుల రూపంలొ వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 46 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 25 వ్యక్తిగత, 22 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ కెముండో, ఏఎస్పీ గొసానార్ బర్లా, జిల్లా అటవీ శాఖ అధికారి అన్నాసాహెబ్ ఆహోలే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెద్దపులి చర్మం స్వాధీనం కొరాపుట్: విక్రయం జరుగుతున్న పెద్ద పులి చర్మాన్ని నబరంగ్పూర్ జిల్లా అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.పెద్ద పులి చర్మం విక్రయం జరుగుతుందనే సమాచారంతో నబరంగ్పూర్, డాబుగాం, పపడాహండి, కొడింగాలకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పపడాహండి సమితి జఠాబల్ గ్రామ సమీపంలో పత్రి అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఇదే సమయంలో అటవీ సిబ్బంది దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. పత్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపు లో తీసుకున్నారు. అతని నుంచి పెద్ద పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్మం జార్సుగుడ అడవుల నుంచి తీసుకొని వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీని విలువ కనీసం రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుందని అటవీ సిబ్బంది ప్రకటించారు. విలు విద్య కోచ్ రాజేష్ హస్థాక్ మృతి మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాకు చెందిన విలువిద్య కోచ్ రాజేష్ హస్థాక (49) ఆదివారం మృతి చెందారు. జిల్లాలో సతాలి తెగకు చెందిన ఆదివాసీ యువకుడు ఈ క్రీడలో జిల్లా స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్య క్షీణించడంతో కుటుంబ సభ్యులు భువనేశ్వర్ తరలించారు. అక్కడ కిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. సోమవారం క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మల్కన్గిరి : హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి మల్కన్గిరి జిల్లా సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2020లో మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో తర్లాకోట గ్రామానికి చెందిన సుభాష్ భూయాన్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బాజా మడ్కామి అనే వ్యక్తి విల్లుతో బాణం సంధించి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాజా మడ్కామిని అరెస్టు చేశారు. అతడిపై అభియోగ పత్రం దాఖలు చేశారు. 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, వాదనలు పరిశీలించిన తర్వాత జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రాజలక్ష్మి పట్నాయక్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదనంగా మృతుడు సుబాష్ భూయాన్ భార్యకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
ఉత్సాహంగా బిరిపాణి జాతర
జయపురం: జయపురం సమితి గొడొపొదర్లో సోమవారం బిరిపాణి జాతర వైభవంగా జరిగింది. బిరిపాణి జాతర వ్యవసాయానికి సంబంధించినది. ఈ జాతర ద్వారా వర్షాలు బాగా పడి పంటలు పండాలని వారు కోరుతారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆదివాసీ ప్రజా సమూహంతో గ్రామ దేవతల సంబరం జరిగింది. గొడొపొదర్ గ్రామంలో బిరిపాణి జాతర అంగరంగ వైభవంగా దిశారీలు కలిసి జరిపారు. ముందుగా గ్రామ నడి బొడ్డున గల బిరిపాణి దేవి మందిరంలో వివిధ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మవార్ల లాఠీలను మందిరం వద్ద ఉంచి దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇచ్చి జాతర ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్ద గ్రామ దేవతల లాఠీలకు పూజలు చేయగా అక్కడి నుంచి గ్రామానికి దూరంలోగల పర్వతంపైకి వెళ్లి పర్వతంపై గల కలుగు వద్ద దేవిని అధిష్టించి పూజలు చేసి.. కలుగులో చేయి పెట్టి ఆ కలుగులో ఉన్న నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని అంచనా వేశారు. జాతరలో పాల్గొన్న భక్తులకు బిలం నుంచి వచ్చే నీటిని ఇస్తారు. ఆ నీటిని పొలాల్లో చల్లుతారు. బిరిపాణి దేవి సత్యమైన తల్లి అని జయపురం మహారాజుల కాలం నుంచి తమ గ్రామ ప్రజలు ఈ పండగ జరుపుతున్నారని గ్రామ పంచాయితీ సర్పంచ్, పూజారి వెల్లడించారు. -
జేకేపూర్లో రక్తదాన శిబిరం
రాయగడ: జేకే గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత హరిశంకర్ సింఘానియా 93వ జయంతిని పురస్కరించుకుని జేకేపూర్లోని జేకేపేపర్ మిల్లు ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. రాయగడ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో మిల్లు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని మొత్తం 166 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. శిబిరాన్ని జేకేపేపర్ మిల్స్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వినయ్ ద్వివేది ప్రారంభించారు. కార్యక్రమంలొ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) విశ్వజీత్ ద్వివేది, జనరల్ మేనేజరు (హెచ్ ఆర్ అండ్ డెవలప్మెంట్) సందీప్ పాండే, జేకే డిస్పెన్సరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రావ్, డాక్టర్ కె.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రక్తసేకరణ ప్రక్రియను రాయగడ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ బృందంలో డాక్టర్ సుదీప్త కుమార్ రమ్, డాక్టర్ కె.నవీన్, ఉమాకాంత మిశ్రా, జగన్ రాజ్ పట్నాయక్, ఉషారాణి బెవురియా పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం పట్ల జేకే పేపర్ మిల్స్కు ఉన్న నిబద్దద్ధను ఈ రక్తదాన శిబిరం మరోసారి చాటి చెప్పిందని వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది అన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: వృక్ష సంపద లేనిదే జీవరాశికి మనుగడ లేదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఒడిశా జర్నలిస్ట్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు, జయపురం సబ్ డివిజన్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ పిలుపునిచ్చారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి కమతా గ్రామం మా మాణికేశ్వరి స్పోర్స్, కమతా కల్చెరల్ యూత క్లబ్లు సంయుక్తంగా సోమవారం చేపట్టిన వృక్షారోపణ కార్యక్రమంలో రబి నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రబినాయక్ మాట్లాడుతూ గతంలో కొరాపుట్ జిల్లా అటవీ సంపదకు ఆలవాలమై ఉండేదన్నారు. పలు ప్రాజెక్టుల వలన కాల క్రమేణా జిల్లాలో అడవులు కనుమరుగు అవుతున్నాయన్నారు. దీనివలన పర్యావరణానికి ముప్పు ఏర్పడిందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కమతాలో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం చుట్టూ మామిడి, ఉసిరి, పనస, తదితర పండ్ల మొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలు నాటారు. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ అతిథి బీజేపీ నేత భాస్కర్ భట్ మాట్లాడుతూ.. కమతా స్టేడియం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర క్రీడా మంత్రితో సంప్రదించి సమకూర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఓజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి శంకర మహాపాత్రో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సలహాదారు కె.సికిల్ దొర, సునీల్ షొడంగి, దయానిధి పట్నాయక్, ఉపాధ్యక్షులు సుజిత్ కుమార్ పండా, సుశాంత పండా, టుటు పట్నాయక్, యూత్ క్లబ్ అధ్యక్షుడు పద్మనాభ శనాపతి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ శతపతి, ఆశిష్ కుమార్ హోత్త, ప్రధాన కార్యదర్శి ముకుంద మురారీ మిశ్ర, సహాయ కార్యదర్శులు రిపున్ హోత్త, రోహణ షొడంగి, కోశాధికారి హరిశంకర శతపతి, గ్రామ యువత పాల్గొన్నారు. -
విస్తరణకు అంగీకారం
కొడింగమాలి బాకై ్సట్ గని ● స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తిరాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కొడింగమాలి బాకై ్సట్ గనుల విస్తరణకు ఆ ప్రాంత వాసులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అయితే తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని, గని యజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నులగా ఉన్న బాకై ్సట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.0 మిలియన్ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ఆదివారం స్థానిక అశోక్ కళ్యాణ మండపలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. కాసీపూర్ సమితి పరిధిలోని పొడాపడి, బంకంబా గ్రామ పంచాయతీలకు చెందిన ఏడు గ్రామాల ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. గని విస్తరణకు అనుకూలంగా 26 మంది గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, మరో 23 మంది లిఖితపూర్వకంగా మద్దతు తెలియజేశారు. అలాగే కంసారిగుడ, పొడాపడి, కిందిరిపదర్, పుల్జబ, ఉపర్ కొడింగ, బంకంబా, బజర్గడ్ గ్రామాలకు చెందిన 500 మందికిపైగా ప్రజలు హాజరై గని విస్తరణకు సమ్మతించారు. అయితే గని విస్తరణతో పాటు తమ ప్రాంతంలో తాగునీరు, రహదారులు, పాఠశాలలు, వృధ్యాప్త భత్యాలు, వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని గ్రామస్తులు కోరారు. స్థానిక యువతకు ఉద్యోగఅవకాశాలు కల్పించడంతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొడింగమాలి బాకై ్సట్ గని కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్, రాయగడ జిల్లాలొని కాసీపూర్ తహసీల్స్ పరిధుల్లోని 428.075 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గనిలో వార్షిక ఉత్పత్తిని 3.6 మిలియన్ టన్నుల నుంచి 6.0 మిలియన్ టన్నులకు పెంచే ప్రతిపాదనపై ప్రజా విచారణ నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాయగడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నిహారి రంజన్ కుహరో అధ్యక్షత వహించగా, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ శాఖ అధికారి అశోక్భొయ్ సమన్వయం చేశారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ దిలీప్ దూదూల్ అభిషేక్, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్న తదితర అధికారులు హాజరయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కళింగాంధ్ర తొలి దళిత ఆత్మఘోష ‘ఈర్నం’
శ్రీకాకుళం కల్చరల్ : ‘తెలుగు సాహిత్యరంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉంది. దళిత కవితాత్వికతలో చాలా వెలితి కన్పించేది. కలమట దాసు బాబు తాజాగా రచించిన ‘ఈర్నం’ చదివిన తర్వాత అది భర్తీ చేసే తరం ప్రారంభమైందన్న సంతృప్తి కలిగింది’ అని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈర్నం కవితా సంకలనం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సీహెచ్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కవితా సంపుటిపై ప్రముఖ కవి బాల సుధాకర్ ‘దళిత కళింగం’ పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు (కథా నిలయం), చీకటి దివాకర్, కె.శ్రీనివాస్ (సాహితీ స్రవంతి), అల్లాడ లక్ష్మి (ఐద్వా), నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు (అరసం), పక్కి రవీంద్రనాథ్ (స్నేహ కళా సాహితి, పార్వతీపురం), పి.వి.నరసింహులు( విశ్వసాహితి, ఆమదాలవలస), అల్టి మోహనరావు (రాజాం రచయితల వేదిక) తదితరులు పాల్గొన్నారు. -
355 మందికి వైద్య పరీక్షలు
రాయగడ: సదరు సమితి కొత్తపేటలో కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం జరిగింది. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు అంధవరపు గౌరి శంకర్, పవన్ సేనాపతి హాజరై 355 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొత్తపేట పరిసర ప్రాంతాల్లో గల వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. కొత్తపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తకొట శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా ఆవిర్భవించిన ఈ సంఘం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు కొరపాన శ్రీనివాస్రావు, కార్యదర్శి పెద్దిన నాగేశ్వరరావు, సహకార్యదర్శి మద్ది సురేష్ కుమార్, పెద్దిన మురళి, తదితరులు సహకరించారని శ్రీధర్ తెలియజేశారు. -
యువతిని రక్షించిన యువకుడు..!
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితిలో ఇటీవల పిల్లలను అపహరించే వారంటూ అనుమానంతో జరిగిన మూకుమ్మడి దాడి ఘటనలో బాధిత యువతిని రక్షించిన ఇంటాలిగుడ గ్రామానికి చెందిన పురుష సికక అనే ఆదివాసీ యువకుడు వెలుగులోకి వచ్చాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి యువతిని రక్షించిన ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియోల్లో స్పష్టమైంది. ఆగ్రహంతో ఉన్న గుంపు యువతిపై దాడి చేస్తున్న సమయంలో సికక నేరుగా జన సమూహంలోకి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గుంపు దాడిలో యువతి దుస్తులు చించివేశారు. తన వద్ద ఉన్న తువ్వాలను ఆమైపె కప్పి మానవత్వాన్ని చాటుకున్నాడు. యువతిని రక్షించే క్రమంలో గుంపు తీవ్రంగా గాయపరిచినప్పటికీ అతను వెనుకాడకుండా ఆమెను సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో యువతి కొన్ని వస్తువులు కిందపడిపోవడంతో వాటిని ఏరుకునే ప్రక్రియలో మరో యువకుడు బలరామ్ బాగ్ ఆ యువతిని పోలీసు వాహనంలో కూర్చొబెట్టి తన టీ–షర్టును ఆమెకు అందించిన వీడియోలు సమాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తనపై దాడి కారణంగా ఇప్పటికీ శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పురుష సకిక తెలిపాడు. సంఘటన జరిగిన రోజు ఇద్దరు స్వచ్ఛంధ సేవకులను ప్రశ్నిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు, సమీపంలోని ఒక డాబా వద్ద మద్యం సేవించిన యువకులు వారిపై దాడి చేయడంతో పరిస్థితి అదుపుతప్పిందన్నారు. పోలీసుల పాత్రపై ప్రశ్నలు ఈ ఘటన అనంతరం ఇంటాలిగుడ, సాయినగర్ తదితర పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన స్థలానికి కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ, సమాచారం సకాలంలో పోలీసులకు అందలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సుమారు 500 మందికి పైగా గుంపు అక్కడకి చేరుకున్నప్పటికీ.. కళ్యాణసింగుపూర్ పోలీసుల స్పందన ఆలస్యమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన గంట తరువాత ఐఐసీ కల్పనా బెహర సంఘటన స్థలానికి చేరుకున్నారని, అప్పటికీ గుంపులోకి వెళ్లి పరిస్థితిని అదుపు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెడ్ ప్లాగ్ కేసుగా గుర్తింపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రాజ్ ప్రసాద్ ఈ కేసును రెడ్ ప్లాగ్ కేసుగా పరిగణలోకి తీసుకుంటున్నామని శనివారం రాత్రి విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఇప్పటికి 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును రెడ్ ప్లాగ్గా పరిగణించాలని పోలీసులు ప్రతిపాదించగా.. క్రైం బ్రాంచ్ కూడా దర్యప్తులో సహకరిస్తుందన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వారిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గ్రామస్తులు మాత్రం ఈ ఘటనలో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పటికీ.. కేవలం ఇంటాలిగుడ గ్రామాన్నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరిలో జిల్లా పరిపాలన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ సమితి ఒడిశా సహకారంతో స్థానీక బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి హాజరయ్యారు. కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే కూడా పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా దోహదపడుతుందని వక్తలు తెలిపారు. జయపురంలోని సంస్థల ఆధ్వర్యంలో.. జయపురం: జయపురంలో పలు సంస్థలు అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించాయి. వాటిలో సోషియల్ ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ అసోషియేషన్(సీవా)సభ్యులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బిజూ స్మృతి కమిటీ వారు బిజూ భవణంలో యోగా శిబిరం నిర్వహించారు. స్థానిక పతంజలి యోగా సంస్థ వారు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించారు. జయపురం జిల్లా న్యాయ స్థానం ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో అన్ని కోర్టుల జడ్జిలు న్యాయవాదులు కోర్టుల సిబ్బంది పాల్గొని యోగా చేశారు. జయపురంలో.. జయపురం: తెలుగు సాంస్కృతిక సమితి వారు జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్ పర్యవేక్షణలో జరిగిన యోగా శిబిరంలో ఆమె యోగా గురించి వివరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొని యోగాభ్యాసం చేశారు. గజపతి జిల్లాలో.. పర్లాకిమిడి: పర్లాకిమిడి గజపతి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం అధికారులు ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా చేయడం అలవర్చుకోండి... ఆరోగ్యంగా ఉండండి.. కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దయామయ పాఢి, జిల్లాముఖ్య అటవీ శాఖా అధికారి కె.నాగరాజు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చెలిగడకు చెందిన యోగా భ్యసకులు లోకనాథ్ దండసేన, పతంజలి యోగా సమితి సభ్యులు సురేంద్ర రథ్, మహిళా యోగా శిక్షకులు ఆశాలతా అమ్మన్న, సి.సి.డి. సంస్థ ఎ.జగన్నాధ రాజులు పాల్గొన్నారు. చంద్రగిరి వద్ద జిరంగో టిబెటియన్ మానాస్ట్రీ వద్ద బౌధ్ధ మందిరం వద్ద యోగా దినోత్సవం జరుపుకున్నారు. రాయగడలో.. రాయగడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక అంబాగుడలో గల బిజుపట్నాయక్ ఇండోర్ స్టేడియంలొ జిల్లా యంత్రాంగం ,క్రీడా శాఖ సంయుక్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గౌరవ అతిథిగా ఎస్డీసీ ఉపాధ్యక్షురాలు మంజుల మినియాక, జిల్లా క్రీడాధికారి షేక్ ఆలీనూర్, జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ తదితరులు హాజరయ్యారు. వారు యోగా ప్రాముఖ్యతను వివరించారు. -
ఎలుగు మృతి కేసులో ఐదుగురు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి అటవీ శాఖ పరిధిలో గల డైగూడా గ్రామం జూన్ 18 న ఒక ఎలుగుబంటి వాహనాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు దాన్ని రాళ్లతో కొట్టారు. అటవీ శాఖ వారు ఎలుగును పట్టుకుని చికిత్సకు తరలించగా శనివారం మృతి చెందింది. దీంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా.. రాళ్ల దెబ్బలతో మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ వీడియో ఫుటేజ్ల ఆధారంగా రాళ్లతో కొట్టిన ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి పై కేసు నమోదు చేశారు. పేరుకుపోయిన చెత్త.. పర్లాకిమిడి: పర్లాకిమిడి సరిహద్దులోని పాతపట్నం మహేంద్ర తనయ నది బ్యారేజ్ వద్ద పాతపట్నం మండల పారిశుద్ధ్యశాఖ ప్రతిరోజూ చెత్తను పారబోస్తుండంతో పాతపట్నం, పర్లాకిమిడికి రాకపోకలు సాగిస్తున్న పాదచారులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒకపక్క వంతెన దిగువన శ్మశానం వచ్చే దుర్ఘంధం, ఆవలి వైపు పాతపట్నం ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఉన్నాయి. ప్రజాఫిర్యాదుల మేరకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం పాతపట్నం, పర్లాకిమిడి మధ్య ఉన్న మహేంద్రతనయ నది వద్ద పేరుకుపోతున్న చెత్తపై పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ముకు చూపించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం మున్సిపల్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రూపేష్ ఫోన్ చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవం పర్లాకిమిడి: బిడ్డల పెంపకంలో తల్లి సాంగత్యం ఎటువంటిదో, ఉన్నత చదువులు చదివించి విద్యాబుధ్ధులు నేర్పించే తండ్రి కూడా అంతే బాధ్యత వహిస్తాడని దయామయ పాఢి అన్నారు. స్థానిక మహారాజా ప్యాలస్లో యుటెక్ కంప్యూటర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్ సీడీఓ దయామయ పాఢి విచ్చేసి అంతర్జాతీయ పితృదినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల రీడర్ కమల్ సిఖా మల్లిక్, ముఖ్యవక్తగా ఇతిశ్రీ మహాపాత్రో, గౌరవ అతిథిగా విశ్రాంత బ్యాంకు అధికారి హారిమోహాన్ పట్నాయిక్ విచ్చేయగా, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శథపతి, లోకనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో జరిగింది. వృధ్ధాప్యంలో తండ్రిని చూసుకునే బాధ్యత మగబిడ్డలు కంటే..ఆడపిల్లలే ఎక్కువగా వారి ఆరోగ్యంపై శ్రధ్ధ వహిస్తారని జిల్లా పరిషత్ అధికారి దయామయా పాఢి అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు -
కేరళలో వలస కార్మికుని దారుణహత్య
● మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తిరాయగడ: ఉపాధి కోసం కేరళకు వెళ్లిన జిల్లాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలోకి ముంచెత్తింది. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి దొరాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంగాసిలి గ్రామానికి చెందిన ధనపతి నాయక్ (28)గా గుర్తించారు. అందిన సమాచారం మేరకు.. ధనపతి నాయక్ సుమారు ఐదు సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ నగరంలో ఏంజీ రోడ్డు వద్ద ఉన్న ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవననం సాగిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఉపాధి కోసం స్వగ్రామాన్ని విడిచి కేరళకు వెళ్లాడు. ఈ నెల 18వ తేదీన విధులకు సెలవు తీసుకుని స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అసోంకు చెందిన కొందరు యువకులతో పాటు ఒడిశాకు చెందిన మరికొందరు యువకులు, యువతులు కలిసి ధనపతిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధనపతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై త్రిసూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడి ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషాద సమాచారం డొంగాసిలి గ్రామానికి చేరడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ధనపతి కుటుంబం తీవ్రఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కేరళ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం తమవల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు జిల్లా పరిపాలన, కార్మిక శాఖ అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు, గ్రామవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కార్మిక శాఖ అధికారులు ధనపతి పనిచేసిన రెస్టారెంట్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కార్మిక శాఖ అధికారి రవీంద్రనాధ్ త్రిపాఠి తెలిపారు. -
ఆదరణ కరువై..
ఆమదాలవలస: సుమారు రెండున్నర దశాబ్దాల కిందట ఆమదాలవలసలో బస్టాండ్ సమీపంలో రైతుబజార్ ఏర్పాటు చేశారు. తాజా కూరగాయలు లభించడంతో ప్రారంభంలో బాగానే కొనుగోళ్లు జరిగాయి. తర్వాత ప్రధాన రహదారిపై కొంతదరు వ్యాపారులు కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే అమ్మకాలు జరపడంతో రైతుబజారుకు వెళ్లే వారు కరువయ్యారు. క్రమంగా ఆదరణ కరువైంది. తొలుత 28 దుకాణాలతో ప్రారంభమైనా.. ఇప్పు ఒక్క దుకాణం కూడా తెరుచుకోక పూర్తిగా మూతపడింది. 2015లో కొంతభాగం అన్న క్యాంటీన్కు కేటాయించడంతో మిగిలిన దుకాణాలు మూతపడ్డాయి. రైతుబజారుకు నిధులు కేటాయించి పున:ప్రారంభిస్తే బాగుంటుందని రైతులు, పట్టణవాసులు కోరుతున్నారు. -
నగదుతో పరారైన మహిళ అరెస్టు
పర్లాకిమిడి: అనేక ఆర్థిక మోసాలకు పాల్పడి పరారీలో ఉన్న మహిళ ఝిల్లీ సాహును శనివారం పర్లాకిమిడి ఆదర్శ ఠాణా పోలీసులు రాయగడ బ్లాక్లో ఆమె కన్నవారి ఇంట్లో అరెస్టు చేశారు. రెండేళ్లుగా ఈమె పర్లాకిమిడి, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురిని కలిసి అధిక వడ్డీలు ఇస్తామని లక్షలాది రూపాయలు తీసుకుని పరారైంది. ప్రాథమిక సమాచారం మేరకు 2023–24 సంవత్సరంలో ఆమె 25 మందిని మోసం చేసి 1.38 కోట్ల రూపాయల నగదుతో పాటు 500 గ్రాముల బంగారం, వెండి వస్తువులు కాజేసినట్టు ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత భూపతి తెలియజేశారు. ఆర్ధిక మోసాలకు పాల్పడిన ఝిల్లి సాహు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇతరుల బంగారం వస్తువులు కుదువపెట్టి డబ్బులు తీసుకున్నట్టు దర్యాప్తులో తేలినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. ఝిల్లి సాహుతో పాటు భర్త ఉదయనాథ్ సాహు అక్కౌంట్లో రూ. 10 లక్షల లావేదేవీలు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వారిపై పలు కేసులు పోలీసు స్టేషన్లో నమోదు అయ్యాయి. -
● అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు ● సిబ్బంది చేతివాటంపై భక్తుల అసంతృప్తి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్ గ్రూప్ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల -
జాతీయ పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
టెక్కలి: నాసిక్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ సామ గౌతమ్ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్, గొండు భవి భాస్కర్నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.దయామయ, ఎన్.లక్ష్మణ్నాయుడు, ఎం.గౌతమి అభినందించారు. వైన్షాపులో చోరీ హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలంలో ఎస్బీ వైన్ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న బైక్ రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్ షాయిబ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్లు ఫుట్పాత్ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు. మాస్టార్లూ..అభినందనలు.. మందస: మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూ డా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్కుమార్ పాడి, కిషోర్గౌడ్లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. -
కాగితాలకే పరిమితం..
సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్ కాటాలకు చార్జింగ్ పెట్టుకునేందుకు ప్లగ్పిన్లు కూడా లేవు. ఫ్యాన్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి. చినుకుపడితే చెరువే.. రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు -
రైతు బేజార్లు
ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో నేరుగా రైతుల ద్వారానే విక్రయాలు జరిపేందుకు పట్టణాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు విక్రేతలతో పాటు ఇటు కొనుగోలుదారులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైతుబజారు ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నిర్వహణ కొరవడి రైతుబజారు మూతపడింది. ఇక, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రైతుబజారు కలగానే మిగిలిపోయింది. ● మున్సిపాలిటీలో కూరగాయల కొనుగోలుకు తప్పని పాట్లు ● శ్రీకాకుళంలో ఆదాయం సమకూరుతున్నా కానరాని సౌకర్యాలు ● ఆమదాలవలసలో ఆదరణ లేక మూసివేత ● పలాసలో ప్రతిపాదనలకే పరిమితం ● ఇచ్ఛాపురంలో డైలీ మార్కెట్లోనే విక్రయాలు ఆదాయం ఫుల్..అభివృద్ధి నిల్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మొత్తం 96 షాపులున్నాయి. అందులో సుమారు 25 వరకు అద్దెలు వచ్చే షాపులున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా రూ.1,73,640 సొమ్ము అద్దె రూపేనా వస్తోంది. ఏటా సుమారు రూ.20లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇంత మొత్తం వస్తున్నా ప్రభుత్వం రైతు బజారులో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. సరైన సదుపాయాలు లేక ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు గేట్లకు ఎదురుగా ఉండే 20 షాపుల్లోనే పూర్తిస్థాయిలో కూరగాయలు అమ్మకాలు జరగుతున్నాయి. మిగిలిన షాపుల యజమానులకు వ్యాపారాలు లేక అసలు దుకాణాలే తియ్యడం లేదు. కనీస సౌకర్యాలు కరువు.. రైతుబజారులో వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన కనీస -
రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం
● 49,443 మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమరాయగడ: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం శనివారం స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో నిర్వహించారు. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో నిధులను జమచేశారు. ఈ కార్యక్రమాన్ని రాయగడలోని రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి ఎహెసాన్ షేక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన రైతులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించిన రైతులు తమ ఖాతాల్లో నిధులు జమకావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పీఎం–కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల రుపాయల చొప్పున మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్పర్ (డిబిటి) విధానంలో ఈ నిధులు జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన వ్యవసాయ శాఖ అధికారి ఎహెసాన్ షేక్ మాట్లాడుతూ రాయగడ జిల్లాలో మొత్తం 49,443 మంది పీఎం–కిసాన్ లబ్ధిదారుల ఖాతాల్లో 23వ విడతగా రెండు వేల రుపాయలు చొప్పున జమ జరిగినట్లు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నాలుగు కేసుల్లో నిందితుల అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసులు పట్టణంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి(ఎస్.డి.పి.ఓ)అర్చిత మిత్తల్ ఆదివారం పత్రికాల వారికి వెల్లడించారు. జయపురం పట్టణంలో దేవాలయాలలోను, వ్యాపార సంస్థలు విద్యాలయాలు మొదలగు ప్రాంతాలలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్టయిన నిందితులు స్థానిక ఒడియ మేదరి వీది రింకు బాగ్(20)గోపబందునగర్ నివాసి రవీంధ్ర బాగ్(32) లు వెల్లడించారు. స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్లో, ఇనుప మంచాలు, చెక్క కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలతో పాటు ఒక ఆటోను సీజ్ చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. స్థానిక విక్రమ దేవ్ విశ్వవిద్యాలయ హాస్టల్ నుంచి దొంగతనం చేసిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా బంకేశ్వర మహాదేవ్ మందిరం, గోపీనాధ్ మందిరాల్లో హుండీలను పగులగొట్టి డబ్బు, రెండు వెండి కిరీటాలను దొంగిలించిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నగదు, దొంగిలించిన సామానులు స్వాధీన పరచుకున్నట్లు పోలీసు అథాకారి వెల్లడించారు. స్థానిక మహాత్మాగాంధీ జంక్షన్లో ఒక స్పేర్ పార్ట్స్ దుకాణంలో దొంగతనం చేసిన ఇద్దరు మైనర్ బాలురును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి వారు దొంగిలించిన నగదు, ఒక కేష్ టోకెన్ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. అలాగనే జయపురం కెనాల్ రోడ్డులో ఒక దుకాణం నుంచి దొంగిలించిన రూ.6 లక్షల85 వేలలో ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల 75 వేల 500 లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురనివారిని అరెస్టు చేసినట్లు ఎస్డీపీఓ వెల్లడించారు. -
మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది
న్యూఢిల్లీ: తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆప్యాయత, అనురాగాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని, దేశ సేవను కొనసాగించడానికి స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో జన్మించారు. శనివారం 68వ పడిలోకి ప్రవేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఆప్యాయ తతో పంపించిన సందేశాలు, శుభాకాంక్షలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులకు ముర్ము ధన్యవాదాలు తెలిపారు. ముర్ము ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ రాష్ట్రపతి ముర్ము ధైర్యం, సరళత, వినమ్రత, ప్రజాసేవ పట్ల అచంచలమైన అంకితభావంతో కూడిన ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ముర్ము దేశానికి విశేషమైన సేవలందించారని, ముఖ్యంగా అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. -
జీవనాధారమే ప్రాణం తీసింది
● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు పొందూరు: జీవనాధారమే ఆ కాపరి ప్రాణాలు పోయేలా చేసింది. 40 ఏళ్లుగా గొర్రెల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ వ్యక్తి ఆ గొర్రెలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. పొందూరు– జి.సిగడాం మండలాల సరిహద్దు రైలు పట్టాలకు సమీపంలో ఉన్న గొర్రెల మందలో నుంచి కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లడంతో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు, గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పొందూరు మండలంలోని రెడ్డిపేట(పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) గొర్లె కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆయన శనివారం గొర్రెల మందను వాండ్రంగి సమీపంలోని రైలు పట్టాల వద్దకు మేత కోసం తీసుకెళ్లారు. అకస్మాత్తుగా కొన్ని గొర్రెలు రైలు పట్టాలమీదకు వెళ్లిపోయాయి. అదే సమయంలో అతివేగంగా వస్తున్న రైలును గమనించి పోతయ్య పరుగు పరుగున పట్టాలపైకి వెళ్లారు. గొర్రెలను రక్షించే క్రమంలో తన సంగతి మర్చిపోయాడు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 30 గొర్రెలూ చనిపోయాయి. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోతయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న భార్య కుమారులు పట్టాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
స్వచ్ఛంద సేవకులపై దాడి అమానుషం
రాయగడ: వాస్తవాలు తెలుసుకోకుండా పిల్లల్ని ఎత్తుకెళ్లేవారని అనుమానించి ఇద్దరు యువతీ, యువకులపై దాడి చేసిన ఘటన అమానుషమని ఎస్పీ రాజ్ ప్రసాద్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి స్థానిక డీపీవో కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనను చాలా సెన్సేషన్గా పరిగణలోకి తీసుకుని స్వయంగా తానే దర్యాప్తు చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని చెప్పారు. ఘటనలో భాగంగా యువతిపై దాడి చేసే సమయంలో తీసిన వీడియోలు వైరల్ అయ్యిందని అన్నారు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమైపె కొందరు అమానుషంగా ప్రవర్తించి మహిళ అని చూడకుండా, వివస్త్రను చేసే విధంగా వీడియోలు ప్రచారం కావడం చాలా విచారకరమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం చట్టపరమైన నేరమని హెచ్చరించారు. దీనిపై సైబర్ క్రైం శాఖ సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇటువంటి తరహా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ కేసులో నిందితులుగా ఉండే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని తెలిపారు. -
సునీల్కుమార్ అరెస్టు అక్రమం
కంచిలి : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, బీసీ యువ నాయకుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. కంచిలిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. కారుమూరి సునీల్కుమార్ను అరెస్ట్ చేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో అంతులేని మద్యం అక్రమాలు జరిగాయని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రస్తుతం లేని మద్యం స్కామ్ సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, డీఎస్సీ–25లో అంతులేని అక్రమాలు, అవినీతి, అమరావతిలో వేలాది మంది రైతుల్లో వ్యతిరేకత, ఆక్వా రైతుల ఉద్యమాలు.. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీచ రాజకీయాలకు తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రామదాసు తదితరులు పాల్గొన్నారు. -
● ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ల రాయితీలో కోత ● ఇకపై నాలుగు సిలిండర్లకే సబ్సిడీ ● అదనపు సిలిండర్లకు పూర్తి పైకం చెల్లించాల్సిందే
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేద, మధ్య తరగతి కుటుంబాలు వంట చెరకు కష్టాల నుంచి విముక్తి పొందాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల్ గ్యాస్ రాయితీ పథకంలో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఏటా తొమ్మిది సిలిండర్ల రాయితీ ధరపై అందించేవారు. ఆ భారం కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇకపై రాయితీ సిలిండర్లను నాలుగు మాత్రమే తీసుకోవాలని, అదనంగా కావాలంటే అదనపు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఇటీవల పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు, ఇతర ఆర్థికపరమైన కారణాల వలన రాయితీ సిలిండర్లు తగ్గించినట్టు ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం వినియోగదారులు మొదట్లో ఏడాదికి 12 సిలిండర్లు వరకు రాయితీ పొందేవారు. తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించారు. తాజాగా 4 సిలిండర్లకు కుదించడంతో వినియోగదారులపై భారం పడనుంది. ఒక్కో సిలిండర్ రాయితీ రూ.300 చొప్పున ఏటా రూ.3600 అందాల్సిన ప్రయోజనం ఇకపై రూ.1200 మాత్రమే దక్కనుంది. మరీ నాలుగేనా? ఉజ్వల పథకం గ్యాస్ కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున ఎనిమిది, అంతకంటే ఎక్కువ సిలిండర్లు అవసరమవుతాయి. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఇందులో నాలుగింటికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. మిగిలిన నాలుగు సిలిండర్లుకు పూర్తి మొత్తం చెల్లించాల్సిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.968.50 ఉంది. ఈ లెక్కన వినియోగదారులపై భారీగా భారం పడనుంది. కొత్త కనెక్షన్లు నిల్.. ఉజ్వల పథకంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో ఈ పథకం కింద పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తెలుపు రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకొంటే వెంటనే మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్లపై రాయితీని కుదించడం అన్యాయం. పేదలందరూ గ్యాస్ వినియోగించునే లక్ష్యంతో గతంలో ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చి.. ఇప్పుడు కోత విధించడం తగదు. ఉన్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదు. – బి.వి.రమణ, గ్యాస్ వినియోగదారుడు, శ్రీకాకుళం ఉజ్వల పథకం వినియోగదారులకు ఏడాదికి 4 సిలిండర్లు వరకు మాత్రమే రాయితీ వర్తించేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే వారు పూర్తి మొత్తం చెల్లించాలి. అటువంటి వాటికి రాయితీ వర్తించదు. – జి.సూర్యప్రకాశరావు, డీఎస్వో -
రెవెన్యూ శాఖ సేవలు భేష్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాగితంపై ఉండే వివరాలు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత సేవలందించడమే ప్రతి రెవెన్యూ ఉద్యోగి లక్ష్యంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ, రిటైర్డ్ జేసీ–2 రజనీకాంతరావు, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు, సెక్షన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటా సర్వేలు చేసి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి కె.సాయిప్రత్యూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 14 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓటర్లకు ఫారాలు అందించి నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 21న ఉంటుందని, తర్వాత అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అర్బన్ ఏపీసీ జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు ఐ.టి.కుమార్, రమేష్, పైడి వేణుగోపాల్, ఈశ్వరి, పి.ఎం.జె.బాబు, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయ త్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మహారాష్ట్ర అహిల్యనగర్ జిల్లా, జామ్ఖేద్ కి చెందిన శంకర్ చంద్రకాంత్ పవార్, నవీముంబై థా నే జిల్లా, భుతవాలీగామ్ కి చెందిన సునీత విజయ్ కాలే అనే మహిళ ఇద్దరూ కలసి లగేజి బ్యాగ్లతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ఆర్థి క పరిస్థితి బాగులేకపోవడంతో ముంబైలో గంజా యి వ్యాపారం చేసే దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఒడిశా నుంచి గంజాయి వ్యాపారి సూచించిన వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి తనకి అందజేస్తే తీసుకొచ్చిన ప్రతి సారి రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీనికి నిందితులు ఇద్దరూ అంగీకరించి ఒడిశాలో మార్షల్ లిమ్మా అలియాస్ రాజే ష్ వద్ద నుంచి గంజాయిని తీసుకెళ్లి ఇప్పటికే మూ డు సార్లు గంజాయి వ్యాపారికి అందజేశారు. ఇదే క్రమంలో ఈనెల 12 వ తేదీన గంజాయి కోసం విశాఖపట్టణం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజా యి సరఫరా చేసే వ్యక్తికి ఫోన్ చేయగా బరంపురంలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని 20 వ తేదీన ఇచ్ఛాపురంలో ఉంటే అక్కడికి తీసు కొచ్చి సరుకు అందజేస్తానని చెప్పాడు. దీనికి వీరు విశాఖపట్టణంలో ఐదు రోజులు ఉండి అక్కడి నుంచి బ రంపురం చేరుకున్నారు. బరంపురంలో రెండు రోజులు బస చేసి శనివారం ఇచ్ఛాపురం చేరుకున్నా రు. వీరు గంజాయి సరఫరా చేసే వ్యక్తి రాజేష్కి ఫో న్ చేయగా ఉదయం ఒక లగేజి బ్యాగ్, రెండు చేతి బ్యాగ్లతో 30.600 కిలోల గంజాయిని ఎల్సీగేట్ వద్ద అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద రూ లగేజ్తో రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
యోగాతో ఆరోగ్యకర సమాజం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అన్నాదొరై పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం
కొరాపుట్: గత రెండేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించామని నబరంగ్పూర్ జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ రెండేళ్ల పాలనలో విజయాలపై వికసిత్ భారత్–వికసిత్ ఒడిశా కార్యక్రమం శనివారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా సాధ్యమైందన్నారు. ఆర్థిక, వైద్య, సంక్షేమ, విద్యా రంగాల్లో ఘననీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. మారుముల గిరిజన గ్రామాలకు కూడా అభివృద్ధి చేరిందని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు అవార్డులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్ర, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, జెడ్పీ చైర్మన్ సస్మిత మెలక, కలెక్టర్ సత్యవాన్ మహాజన్, కోట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పథకాలు అందజేత రాయగడ: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సదరు సమితి కార్యాలయంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు శనివారం అందజేశారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, ఆహార భద్రత, స్వయం ఉపాధి, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాల కింద సహాయాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, సమితి ఉపాధ్యాక్షుడు హరప్రసాద్ హెప్రుక, మాజీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, సీడీపీవో పానమణి హంసద, ఏబీడీ కాలు చరణ్ నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి సుబ్రత్ దాస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు సెల్ఫోన్లు అందజేశారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 మందికి అంత్యోదయ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులు అందజేశారు. అలాగే మరికొందరికి పథకాలు అందజేశారు. -
ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి
సంతబొమ్మాళి : నౌపడలో ఒరేమాడు చెరువులో శనివారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా 16 మంది వేతనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా స్టాఫ్ నర్సులు ధనలక్ష్మి, అమర వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో గుణుపూర్–కటక్ ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ప్రయాణిస్తూ ఆకస్మికంగా మృతిచెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఎరుపు టీ షర్ట్, నలుపు ఫ్యాంట్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాలివాన బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఖరీఫ్లో జల్లిన విత్తనాలు నీట మునిగాయి. దబ్బగూడలో పూరిల్లు నేలకొరిగింది. ఎంటీఎస్ టీచర్లను ఇబ్బందిపెట్టొద్దు శ్రీకాకుళం : డీఎస్సీ–2008, 1998 ఎంటీఎస్ టీచర్ల నియామకం జరిగినప్పటి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్, బదిలీల పేరుతోనూ స్థాన చలనం చేయడం తగదని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకటప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ 22లోపు వారి స్థాన చలనం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం చేశారు. ప్రతిసారీ సుదూర ప్రాంతాల పాఠశాలలకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొదట్లో నియామకం చేసినప్పుడు వారి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారని, ఆ తర్వాత పక్క మండలాలు, డివిజన్ కూడా దాటి పంపించడం సరికాదన్నారు. విద్యా శాఖ అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చే జీతం తక్కువ కావడం, మిగిలిన సర్వీస్ కూడా తక్కువే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : గుండెపోటుతో మరణించిన ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శనివారం నగరంలోని సంపత్బాలాజీనగర్లో నివాసముంటున్న ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. సతీమణి లక్ష్మికి ధైర్యం చెబుతూ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి పాతపట్నం: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా 3వ అదనపు జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి(డీఎల్ఎస్ఏ) కె.హరిబాబు అన్నారు. శనివారం పాతపట్నం సబ్ జైల్ను పాతపట్నం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణితో కలిసి సందర్శించారు. ఖైదీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జూలై 11న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సబ్జైలర్ ఎం.సన్యాసినాయుడు, న్యాయవాదులు, జైల్ సిబ్బంది పాల్గొన్నారు. -
34 బెల్టుషాపులపై కేసులు
● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు శ్రీకాకుళం క్రైమ్ : సాక్షి దినపత్రికలో ఈ నెల 19న వచ్చిన ‘నేతలు.. మేతలు’ కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యంత్రాగం స్పందించింది. మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టుషాపుల్లో విక్రయాలు, అడుగడుగునా అక్రమ మద్యం, అక్రమ వసూళ్లు, నేతలు దర్జాగా దోచేస్తున్న వైనంపై శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 34 బెల్టుషాపులపై ఎకై ్సజ్ శాఖ కేసులు నమోదు చేశారు. 40.32 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశారు. నెలాఖారువరకు స్పెషల్ డ్రైవ్.. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాలతో ఈ నెలాఖరు వరకు అనధికార మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిత తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా చర్చలు, సమావేశాలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
కబళిస్తున్న క్షయ..!
రాయగడ: క్షయ వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్ఎల్ఈసీ) అమలు చేస్తున్నప్పటికీ.. రాయగడ జిల్లాలో ప్రతిఏటా కొత్త క్షయ రోగులు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో మొత్తం 159 మంది క్షయవ్యాధికి గురైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. జిల్లాలోని కాసీపూర్ సమితిలోనే అత్యఽ దిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2022– 23లో 68 కేసులు నమోదు కాగా, 2023–24లో 42, 2024–25లో 36, 2025–26లో 49 కేసులు గుర్తించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే 4 నుంచి 5 కేసులు నమోదైనట్లు సమాచారం. క్షయవ్యాధిపై సమాజంలో ఇప్పటికీ అపోహాలు, మూఢనమ్మకాలు కొనసాగుతుండడంతో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది. 2007కు ముందు లెప్రా అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ప్రభుత్వ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన, చికిత్స, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించేది. అనంతరం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో క్షయవ్యాధి నియంత్రణ కోసం ప్రత్యేక మల్టీపర్పస్ వర్కర్లు పనిచేసేవారు. ప్రస్తుతం పురుష, మహిళా ఆరోగ్య కార్యకర్తలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితేవారు ఇతర ఆరోగ్య కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉండడంతో క్షయ నిర్మూలనకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధిపై ప్రత్యేక శిక్షణ లేకపోవడం వల్ల కొత్త రోగుల గుర్తింపు, చికిత్స పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స విధానం క్షయ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే ఆరు నెలలపాటు మల్టీడ్రగ్ థెరాఫీ (ఎండీటీ) మందులు తీసుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఏడాది వరకు చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది. మందులను క్రమం తప్పకుండా వాడకపొతే పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాయగడ వంటి గిరిజన, దూర ప్రాంతాల్లో రోగులు ప్రతిరోజూ మందులు తీసుకుంటున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకు తగిన సిబ్బంది కొరత ఉందని సమాచారం. జిల్లాలోని కాసీపూర్తో పాటు రాయగడ పట్టణ ప్రాంతం, జిమిడిపేట, మునిగుడ, బిసంకటక్ ప్రాంతాల్లో క్షయవ్యాధి రోగులను గుర్తిస్తున్నారు. అయితే ఆరోగ్య శాఖ క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సర్వేలు, వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తు గుర్తింపు చర్యలను మరింత బలొపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాయగడ జిల్లాలో ప్రతిఏటా కొత్త కేసులు నాలుగేళ్లలో 159 కేసులు గుర్తింపు అత్యధికంగా కాసీపూర్లో నమోదు -
ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభం
జయపురం: కొరాపుట్ జిల్లాలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జయపురం, కొరాపుట్ ఆస్పత్రుల్లో ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అత్యాధునిక మెషిన్లను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కలెక్టర్ మనోజ్ మహాజన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నూతన యంత్రాలు నెలకొల్పడం ఆనందదాయకమన్నారు. కలెక్టర్ మనోజ్ మహాజన్ మాట్లాడుతూ ఈ నూతన యంత్రాల ద్వారా ఒకే నమూన సేకరణతో దాదాపు 1700 కంటే ఎక్కువ రకాల పరీక్షలు చేయవచ్చని, అందువలన రోగ నిర్ధారణ ప్రక్రియ మరింత వేగంగా, ఖచ్చితంగా ఉంటుందన్నారు. పరీక్ష జరిపిన 5 నుంచి 10 నిమిషాల్లో రోగి సెల్ఫోన్కు రిపోర్ట్ పంపించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన జయపురం: భారతీయ నౌకపై అమెరికా సైనికులు కాల్పులు జరిపడంతో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మృత్యవాత చెందడంపై భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జయపురం ప్రధాన కూడలి వద్ద కమ్యూనిస్టు పార్టీ నేతలు శనివారం ఆందోళన చేపట్టారు. ముగ్గురు భారతీయ నౌకా సిబ్బందిని అమెరికా సైనికులు హత్య చేసినా, కేంద్ర ప్రభుత్వంలో కనీసం స్పందన లేదని దుయ్యబట్టారు. ఈ ఘటనపై నిరసన తెలుపలేదు సరికదా.. కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ప్రజా ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో, దామోదర రొ ణ, సురేష్ గౌడ, భీష్మ నాయిక్, ఉత్తమ మల్లిక్, నంద హరిజన్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు సమకూర్చాలని వినతి జయపురం: జయపురం సదర్ పోలీసుస్టేషన్ పరిధి జయపురం సమితి అంబాగుడ పోలీసు పంటికి వాహనాలు సమకూర్చాలని అంబాగుడ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో ఆ గ్రామ యువకులు జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. అంబాగుడ పోలీసు పంటి లో గతేడాది నుంచి నాలుగు చక్రాల వాహనం లేదని, అందువలన ఎక్కడ నేరాలు జరిగినా పోలీసులు సకాలంలో వెళ్లలేకపోతున్నారని తెలిపారు. అందువలన నాలుగు చక్రాలు వాహనాలు సమకూర్చాలని విన్నవించారు. లక్క బొమ్మల తయారీ కేంద్రం పరిశీలన కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని సుంకారి వీధిలో సరళ హస్త కళల తయారీ కేంద్రాన్ని ఎస్పీ పర్ధవ్ కశ్యప్ జగదీష్ శనివారం తల్లిదండ్రులతో కలిసి సందర్శించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న లక్క బొమ్మలు తయారు చేసే విధానం పరిశీలించారు. సుంకారి జాతి మహిళలు తమ చేతి గోళ్ల మీదుగా లక్క కాల్చి తీగలుగా మార్చి అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వీటికి దేశ విదేశాల్లో ప్రాచూర్యం ఉంది. లక్క బొమ్మల తయారీలో అనేక బహుమతులు పొందిన ప్రభాతి పాత్రో బొమ్మలు చేస్తుండడం చూసి ఎస్పీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం కొన్ని బొమ్మలు కొనుగోలు చేశారు. -
నీతి అయోగ్ బృందం పర్యటన
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో నీతి అయోగ్ బృందం శనివారం పర్యటించింది. డాబుగాం, తెంతుకుంటి సమితుల్లో నీతి అయోగ్ కేంద్ర ఇన్చార్జి మీరా మహంతి క్షేత్ర పర్యటన చేశారు. తెంతులకుంటి సమితిలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లీ, బిడ్డలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న ఆరోగ్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర ఇంద్రావతి డ్యామ్ను పరిశీలించారు. నబరంగ్పూర్ జిల్లాలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, మొక్కజొన్న పరిశ్రమ ఏర్పాటు వంటి నిర్మాణాల పురోగతి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. పర్యటనలో నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తదితరులు పాల్గొన్నారు.


