breaking news
Orissa
-
రథయాత్రలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని పద్మపూర్ సమితి ఇఛ్చామొనొగుడ గ్రామానికి చెందిన తరణీ చరన్ గొమాంగో(50)గా గుర్తించారు. స్థానిక కొత్త బస్టాండ్ కూడలిలో రథయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న గొమాంగో శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర వేదన కనిపించింది. -
కమల దళపతి ఎవరో..?
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. కొత్త సారథిపై రాష్ట్ర రాజకీయ పక్షాలు పలు అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్గాలు పాలక పార్టీ నాయకత్వ సారథ్యం యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అనేది చూస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఈ ఉత్కంఠకు తెర పడుతుంది. దీనిలో భాగంగా ఆదివారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రతాప్ చంద్ర షడంగ తెలిపారు. ఔత్సాహిక అభ్యర్థులు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసేందుకు ఈనెల 7వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడేళ్ల పదవీ కాలం కొత్త అధ్యక్షుడి సారథ్యంపై రాష్ట్రంలో బీజేపీ మనుగడ ముడిపడి ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ, ప్రభుత్వ సంబంధాన్ని మరియు ఒడిశా రాజకీయ పరపతిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మధ్య అద్భుతమైన సమన్వయం ఫలిత ఆధారిత దక్షతను చాటుకుంది. మన్మోహన్ సామల్ తిరిగి ఎన్నికై తే ఈ పరిస్థితి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. ఆయన పదవీ కాలంలో పలు కీలక అంశాలు హుందాగా పరిష్కరించబడ్డాయి. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ పాలన పగ్గాలు చేపట్టినా ఎటువంటి ఒడిదుడుకులకు అవకాశం లేకుండా తన వంతు కర్తవ్యాన్ని దక్షతతో నిర్వహించి పార్టీ అంతర్గత వ్యవహారాల్ని వివాదరహితంగా నిర్వహించారు. నాయకత్వం మారితే... నాయకత్వం మారితే సమన్వయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కడం తథ్యం. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలపై హోరా హోరీ పోరు కొనసాగుతోంది. కొత్త నాయకుని సారథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త అధ్యక్షుడికి వివిధ ప్రభావవంతమైన రాష్ట్ర నాయకులకు ఉన్న సామీప్యత పరిశీలనలోకి వస్తుంది. రాష్ట్ర బీజేపీ తన ప్రస్తుత సమతుల్యతను కాపాడుకుంటుందా లేదా దాని అంతర్గత అధికార నిర్మాణాన్ని మరియు రాజకీయ వ్యూహాన్ని పునర్నిర్మించగల పరివర్తనను స్వీకరిస్తుందా అనే దానిపై అందరి దృష్టి ఉంది. రానున్న 48 గంటలు పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. అవసరమైతే ఈనెల 8న ఎన్నికలు జరుగుతాయి. కొత్త రాష్ట్ర శాఖ ప్రముఖుడు (అధ్యక్షుడు) మరియు కేంద్ర మండలి సభ్యుల పేర్లను అదే రోజున ప్రకటిస్తామని ప్రతాప్ చంద్ర షడంగి తెలిపారు. పూరీలో రథయాత్రలో తొక్కిసలాట ఘటనతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు కేంద్ర మండలి సభ్యుల ఎన్నిక స్వల్పంగా వాయిదా పడింది. ఉత్కంఠగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక నేడు నోటిఫికేషన్ జారీ -
రాజ్భవన్లో వన మహోత్సవం
భువనేశ్వర్: వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజ్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామానంద పార్క్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మొక్క నాటి నీరు పోశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజ్ భవన్ ప్రాంగణంలో అనేక మొక్కలు నాటారు. గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణం అందించేందుకు వ్యక్తులు, సంస్థలు ఉత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం వద్ద అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచబోమని మాటిచ్చి ఇప్పుడు దఫదఫాలుగా పెంచుతూ పోతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాలను ఉససంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ శనివారం దర్శించుకున్నారు. జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు ఆలయ అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు మాధవ్శర్మ, ఆలయ అధికార సిబ్బంది బిఎస్.చక్రవర్తి తదితరులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్కుమార్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షుడు ఉంగటి పాపారావు పాల్గొన్నారు. విశ్రాంత ట్రెజరీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా తవిటన్న శ్రీకాకుళం పాతబస్టాండ్: పదవీ విరమణ పొందిన ట్రెజరీ ఉద్యోగులు శనివారం సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చే ఇబ్బందులు, సంక్షేమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు టీఆర్ఈడబ్ల్యూఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అంకడాల తవిటన్న, ఉపాధ్యక్షుడిగా భీష్మాచార్యులు, కార్యదర్శిగా రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఎ.కోటేశ్వరరావు, కోశాధికారిగా ఆర్ఎస్ పట్నాయక్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ ట్రెజరీ ఆఫీసర్ రామచంద్రయ్య, డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్ వెంకటరావు పాల్గొన్నారు. నేడు జిల్లా అండర్–15 చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధిలోని చెస్ శిక్షణా కేంద్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 99125 59735 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఏపీచెస్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో వివరాలను నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బొడ్డేపల్లి రమేష్కుమార్ ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బొడ్డేపల్లి రమేష్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈయన 2013 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు రమేష్కుమార్కు అభినందనలు తెలిపారు. ఆప్కో వస్త్రాలపై రాయితీ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో షోరూంలలో ఆషాఢ మాసం సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 నుంచి 70 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమదాస్ శనివారం తెలిపారు. ధర్మవరం, మాధవరం, వెంకటగి, ఉప్పాడ, బందరు, రాజమండ్రి, మంగళగిరి చీరలు, బెడ్షీట్స్, లుంగీలు, టవల్స్ అందు బాటులో ఉన్నాయని వివరించారు. ఆప్కోహేండ్లూమ్స్.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ స్టోర్స్లోనూ ఆప్కో వస్త్రాలు లభి స్తాయని తెలిపారు. వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. -
ఆశ్రమ పాఠశాలలో భారీ కుంభకోణం
కొరాపుట్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సామగ్రిలో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆరోపించింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం 28 వేల ప్లేట్లు కొనుగోలు చేసిందన్నారు. కానీ వాటి వాస్తవ ధర రూ.120 కాగా, టెండర్ మాత్రం రూ.400లకి ఖరారు చేశారన్నారు. ఇలాంటి కుంభకోణం తాము ఏనాడు చూడలేదన్నారు. హాస్టల్లో ఉండే పెద్ద తపేలా ఖరీదు రూ.3,200లు కాగా, దానిని రూ.11 వేలకి కొనుగోలు చేశారని మండిపడ్డారు. రూ.30 వేల దోమ తెరలను ఒక్కొక్కటీ రూ.2 వేలకు కొనుగోలు చేశారని, అయితే దోమ తెరలు రూ.2 వేలు ఎక్కడైనా ఉంటుందని ప్రశ్నించారు. ఇలా అనేక విధాలుగా విద్యార్థుల సొమ్మును కాజేశారని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, నాయకులు సరోజ్ పాత్రో, భీమొ పూజారి, లల్లు త్రిపాఠి, దిలీప్ పండా, ప్రమెద్ రథ్, సుమిత్ పూజారి తదితరులు పాల్గొన్నారు. బీజేడీ నాయకుల ఆరోపణ -
రూ.1.38 కోట్లతో దంపతులు పరారీ
పర్లాకిమిడి: స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి రూ.1.38 కోట్ల డబ్బులు తీసుకొని దంపతులు పరారైన ఘటన పట్టణంలో వెలుగు చూసింది. ఈ దంపతులు మహిళా స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి తొలుత రుణాలు మంజూరు చేయించారు. అనంతరం ఉద్యోగులు, రాజకీయ నాయకులకు అతి తక్కువ వడ్డీతో బంగారం కుదువపెట్టి రుణాలు మంజూరు చేసేవారు. ఆ తర్వాత వారి పేర్ల మీద ఎక్కువ మొత్తంలో వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేయించుకొని ఆ నగదుతో పరారయ్యారు. అయితే రుణాలు తీసుకున్న బ్యాంకులు నగదు కట్టాలని నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఈ మోసం జరిగి నాలుగు నెలలు అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆదర్శ పోలీసుస్టేషన్లో ఒక స్వతంత్ర బృందం కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా వెల్లడించారు. -
భక్తిశ్రద్ధలతో బహుడా
తొమ్మిది రోజుల పాటు గుండిచా మందిరంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన జగన్నాథుడు సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి శనివారం తిరిగి మందిరానికి బయల్దేరాడు. దీనినే మారు రథయాత్ర(బహుడా)గా పిలుస్తారు. గండిచా మందిరంలోని దేవతామూర్తులను రథంపైకి ఎక్కించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాలు లాక్కొని వెళ్లారు. దేవతామూర్తుల రథాలు సాంప్రదాయం ప్రకారం మార్గమధ్యలోని తమ పిన్ని ఇంటి వద్ద ఆగాయి. అక్కడ దేవతామూర్తులు ఏకాదశి పురస్కరించుకొని ఆదివారం విడిది చేస్తారు. భక్తుల పూజలందుకున్న అనంతరం ప్రధాన మందిరానికి రథాలు బయల్దేరుతాయి. – సాక్షి నెట్వర్క్ -
గ్రామానికి చేరుకున్న మృతదేహాలు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమయలారం వద్ద రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు స్వగ్రామానికి వచ్చాయి. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి భిక్ష పంచాయతీ కొదాబట్ట గ్రామానికి అంబులెన్సులు వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన కృష్ణగౌడ కుమారుడు రమేష్ గౌడ (22), హరిశ్చంద్ర బోత్ర కుమారుడు చైతు బోత్ర (23)లు ఈ ఘటనలో మృతి చెందారు. ఇదే ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఆ పరిశ్రమలో పని చేస్తుండగా, ఆరోజు వీరిద్దరూ విధులకు వెళ్లడంతో మృత్యువాతపడ్డారు. వీరి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్చరణ్ మజ్జి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. సంబంధిత కంపెనీ ప్రతీ మృత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. వీరి మృతదేహాలు వస్తున్న విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి వందలాది గిరిజనులు తరలివచ్చారు. ఇద్దరి మృతదేహాలకు ఒకేచోట అంత్యక్రియలు చేపట్టారు. -
హోటళ్లపై అధికారుల దాడులు
జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్పాడ్ ఎన్ఏసీలో హోటళ్లు, బేకరీలపై అధికారులు శనివారం దాడులు జరిపారు. హోటళ్ల వంట గదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు, వంట నూనె వినియోగించాలని, పరిశుభ్రత పాటించాలని కోట్పాడ్ ఎన్ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేష్ మహంతి హోటల్ యజమానులకు సూచించారు. దాడుల్లో శానిటేషన్ అధికారి సుధీర్ కుమార్ నందో, గోపీ మఝి తదితరులు పాల్గొన్నారు.నారాయణరావు నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న పడాల నారాయణరావు(84) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారులు పి.శ్రీనివాస్, పి.శ్రీకాంత్, కుమార్తె పి.శ్రీదేవిలు విషయం రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుధీర్ పర్యవేక్షణలో మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి పి.సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు. -
గాంధీజీ విగ్రహం ధ్వంసం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డు గాంధీ నగర్లో గాంధీజీ విగ్రహాన్ని ఒక యువకుడు ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తెలిసిన వెంటనే పార్టీలకు అతీతంగా నాయకులు సంఘటన స్థలానికి వెళ్లి ఖండించారు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విగ్రహాన్ని 1964లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడర్ ఆవిష్కరించారని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి పేర్కొన్నారు. దీనిని 1994లో స్వాతంత్య్ర సమరయోధుడు జగన్నాథ త్రిపాఠి పున ప్రతిష్ట చేశారన్నారు. అటువంటి చారిత్రాత్మక విగ్రహాన్ని మరలా పునః ప్రతిష్ట చేసేవరకు ఆందోళన చేస్తామన్నారు. దీంతో అక్కడే ఉన్న అన్ని పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అమిత్ ప్రధాన్(బీజేపీ), సుమిత్ పూజారి (బీజేడీ), అఖిల్ బోత్ర, బృందావన పండా, పొరి సాహు, పిరోజ్ (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహించేందుకు తన సొంత గ్రామమైన ఖెదాపడ నుంచి స్కూటీపై రాయగడ వస్తున్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. మృతురాలు లావణ్య గంట (24 )గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీసుస్టేషన్ పరిధి గునాఖాల్ రోడ్డు కూడలి వద్ద లావణ్య నడుపుతున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొంది. దీంతో ఆమె తన ఎదురుగా వస్తున్న లారీకింద పడిపోవడంతో తీవ్రగాయాలపై సంఘటన స్థలంలోనే మృత్యువాతపడింది. బైక్పై వస్తున్న బిసంకటక్ పరిధి మునిగా గ్రామానికి చెందిన కాంతారావు కడ్రక, సుబ్బారావు కడ్రకలు కూడా కిందపడిపోయి తీవ్రగాయాలకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ లావణ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి ● మాజీ మంత్రి, ఆదివాసీ నేత జయరాం పంగి డిమాండ్ జయపురం: దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, అవిభక్త కొరాపుట్ ఆదివాసీ నేత, దండకారణ్య పర్వతమాల వికాస పరిషత్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు జయరాం పంగి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కొరాపుట్, నవరంగపూర్, రాయగడ, మల్కన్గిరి, గజపతి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, పాడేరు ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్కు ఆ ప్రాంతాల నేతలు, ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర రాష్ట్రం ఏర్పడితే ఇంతవరకు ఒడిశా– ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరుత దాడిలో 5 మేకలు మృతి మల్కన్గిరి: జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి కుమారపూట్ గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుత దాడిలో మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సమారీ దాంగడమాఝి అనే వ్యక్తి తన మేకలను ఒక శాలలో కట్టి ఇంటికి వెళ్లాడు. అయితే శనివారం ఉదయం వచ్చి చూస్తే 5 మేకలను పులి చంపి పడేసింది. ఒక మేకను పులి ఈడ్చుకొని వెళ్లినట్లు ఆనవాలు ఉన్నాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మత్తిలి రేంజర్ వాసుదేవ్ నాయక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక్కో మేకకు పరిహరంగా రూ.3,000 చొప్పున రైతుకు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కొలనార సమితి సూరి పంచాయతీలోని బొడొపొడియా గ్రామానికి చెందిన పెంటి ఉలక(64)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకు పనిమీద పెంటి తన బంధువులతో స్యూటీపై వస్తోంది. అదే సమయంలో స్థానిక జియోమార్ట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక బస్సు స్యూటీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన ఆమె సంఘటన స్థలం వద్దే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయాల్లో యువత చురుకై న పాత్ర పోషించాలి
–8లోuఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025నృత్యాలు చేస్తున్న కళాకారులుశ్రీమందిరం సింహద్వారం వద్దకు చేరిన రథాలుపూరీ శ్రీజగన్నాథుని మారు రథయాత్ర బహుడా సందర్భంగా సాగర తీరంలో సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శుభాకాంక్షలుభువనేవ్వర్: శ్రీజగన్నాథుని రథయాత్ర ద్వితీయ ఘట్టం బహుడా అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. అధికారులు, సేవాయత్ వర్గాల మధ్య సమన్వయంతో యాత్ర పూజాదులు నిర్ధారిత వేళ కంటే ముందుగా పూర్తి చేయడంతో అడప మండపం నుంచి వరుస క్రమంలో రథాలపైకి మూలవిరాటుల తరలింపు పొహండి ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మూల విరాటులు తరలి వస్తుండగా శారదా బాలి ప్రాంగణం శంఖ ధ్వని, ఘంటానాదంతో మారుమోగింది. భక్తుల జైజగన్నాథ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. ఔత్సాహిక కళాకారులు భక్తిశ్రద్ధలతో రథాల ఆవరణలో శాసీ్త్రయంగా నృత్యం ప్రదర్శించి భక్తజనం దృష్టిని ఆకట్టుకున్నారు. ఆసీనులైన దేవతామూర్తులు తొలుత చక్రరాజ్ సుదర్శనుడు గుండిచా ఆలయం అడప మండపం నుంచి తరలివచ్చి దేవీ సుభద్ర రథం దర్ప దళనంపై ఆసీనుడయ్యాడు. వెంబడి తాళధ్వజంపైకి బలభద్రుని మూలవిరాటు చేరింది. దేవీ సుభద్ర దర్ప దళనంపైకి చేరడంతో, చివరగా శ్రీజగన్నాథుడు నందిఘోష్ రథంపై ఆసీనుడు అయ్యాడు. వెంబడి మూలవిరాటుల ఉత్సవమూర్తులను రథాలపైకి వరుస క్రమంలో తరలించడంతో పొహండి ముగిసింది. ఉదయం 9.55 గంటలకు ప్రారంభమైన పొహండి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసింది. అంతకు ముందు మంగళ హారతి, మైలం వంటి అనేక ఆచారబద్ధమైన పూజలు, సేవాదులు నిర్వహించారు. మూల విరాటులు రథాలపై ఆసీనులు కావడంతో పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ చెర పహార కార్యక్రమంలో పాల్గొని 3 రథాలను శుద్ధి చేశారు. అనంతరం రథాల మారుయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభం తొలుత బలభద్రుని తాళధ్వజం మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరింది. వాస్తవానికి రథాలు లాగడం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబడుతుందని ప్రకటించారు. ఆ తర్వాత దేవి సుభద్ర దర్ప దళనం యాత్ర ప్రారంభించింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం దారి పొడవునా ఆత్మీయుల్ని పలకరించుకుంటూ నిదానంగా శ్రీమందిరం గమ్యం చేరింది. దారిలో బాలగండి చౌరస్తా ప్రాంతంలో మౌసీ మా (పిన్నమ్మ) ఆలయం ఆవరణలో నందిఘోష్ రథం ఆనవాయితీ ప్రకారం కాసేపు ఆగింది. యాత్ర ముగించుకుని శ్రీమందిరానికి చేరబోతున్న జగతినాథునికి పిన్నమ్మ ప్రేమతో తయారు చేసిన తీపి వంటకం పొడొ పిఠా మట్టి పాత్రలో నివేదించింది. ఏటా మారు రథయాత్ర ముందు రోజున మౌసీ మా ఆలయంలో ఈ వంటకం సిద్ధం చేస్తారు. ఈ సాంప్రదాయ ఒడియా రుచికరమైన వంటకం గోధుమ పిండి, చెన్నా (విరిగిన పాలు), చక్కెర, పిస్తాపప్పులు, ఏలకులు, లవంగాలు మరియు శుద్ధ నెయ్యిల గొప్ప మిశ్రమంతో తయారై ఘుమఘుమలాడుతు రుచికరంగా ఉంటుంది. మౌసీ మా ఆలయం నుంచి ప్రారంభమైన శ్రీ జగన్నాథుని రథం మరోమారు గజపతి మహారాజా భవంతి ఆవరణలో ఆగింది. అన్నాచెల్లెళ్లతో యాత్రకు వెళ్లి తనను ఒంటరి చేశారన్న మనస్తాపంతో కలత చెందుతున్న శ్రీమహాలక్ష్మీ దేవిని బుజ్జగించి నచ్చజెప్పడంలో గజపతి మహారాజా రాయబారిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ముచ్చట గొలిపే లక్ష్మీనారాయణుల భేటీ అత్యంత భక్తిశ్రద్ధలతో భక్త జన సంద్రం సమక్షంలో జరిగి యాత్రలో ఆకర్షణీయ ఘట్టంగా నిలిచిపోతుంది. ● మంత్రి సూర్యవంశీ సూరజ్న్యూస్రీల్ఎట్టకేలకు..! కొరాపుట్ – జయపూర్ మార్గంలో కదిలిన రైలు -
నదిని దాటాల్సిందే..!
చదువు సాగాలంటే..అక్షరాలు నేర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు అక్కడి గిరిజన విద్యార్థులు. చదువుకోవాలనే ఆశయంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని నడుకుంటూ దాటుతున్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి పిండాపొదర్ గ్రామ పంచాయతీ శేషకుడి గ్రామ ప్రజలు అంధారి నది దాటుతున్న దృశ్యమిది. గత వారం రోజులుగా వర్షాలు వలన పిల్లలు చదువులకు వెళ్లలేకపోయారు. ఇలా అయితే తమ పిల్లలు తమలాగే వెనుకబాటుతనానికి గురవుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిన్నారులను తమ భుజాల మీద కూర్చొనబెట్టి ప్రమాదకర పరిస్థితిలో నదిని దాటించారు. ఈ గ్రామంలో 280 మంది జనాభా నివసిస్తున్నారు. దీంతో నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా పాలకులను వేడుకుంటున్నా తమ మొర వినడం లేదని వాపోతున్నారు. కనీసం పాద వంతెన నిర్మించినా తమ ప్రాణాలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇలాగే ప్రతిరోజు రెండు పూటలు గిరిజనులు పిల్లలను పాఠశాలకి పంపించడం, తీసుకొని రావడం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా తమ జీవనోపాధి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నదిని దాటుతున్నారు. – కొరాపుట్ -
బయటకు వచ్చిన రైల్వే ట్రాక్
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే మార్గంలో జయపూర్–కొరాపుట్ రైల్వే స్టేషన్ల మధ్య జర్తి–మాలిగూడ మధ్య కనుమరుగైన రైల్వే ట్రాక్ బయట పడింది. ఈ ప్రదేశంలో బుధవారం మట్టి, కొండ చరియలు వర్షం వల్ల ట్రాక్ మీదకు చొచ్చుకు వచ్చి న విషయం పాఠకులకు విధితమే. మూడు రోజులు గా రైల్వే సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి ట్రాక్ని వెలికి తీశారు. ట్రాక్ మీద ఉన్న మట్టి,బండ రాళ్లని తొలగించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్ పూర్తిస్థాయిలో కనిపించింది. ట్రాక్ పటిష్టత పరిశీలన జరుగుతుంది. ఈ ఆపరేషన్లో 25 వేల క్యుబిక్ బురదని ట్రాక్ మీద నుంచి తొలగించారు. 16 హెవీ ఎర్త్ మూవర్స్ రాత్రింబవళ్లు పనిలో నిమగ్నమయ్యాయి. 300 మంది సిబ్బంది, కార్మికులు, టెక్నికల్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు ప్రకటించారు. వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోరా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘల్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంకువాల్ ఈ ట్రాక్ పునరుద్ధరణతో హర్షం వ్యక్తం చేశారు. కొరాపుట్ నుంచి యథావిధిగా రైళ్లు కొరాపుట్ నుంచి రైళ్లు యథావిధిగా నడుస్తాయి. కొరాపుట్–కోల్కత, కొరాపుట్–భువనేశ్వర్, కొరాపుట్–విశాఖ పట్నంలో రైళ్ల రాకపోకల్లో మార్పేమి లేదు. అన్ని రైళ్లు ఈ మార్గంలో నడుస్తున్నాయి. ఇక కిరండోల్–కొరాపుట్ మార్గంలో ట్రాక్ పటిష్టత పూర్తయిన తర్వాత రైళ్లు నడుస్తాయి. రథయాత్ర ప్రత్యేక రైళ్లు రద్దు పూరి రథయాత్ర కోసం జగదల్పూర్–పూరి, విశాఖ పట్నం–పూరికి ప్రత్యేక రైళ్లని రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వెళ్లాల్సిన రెండు ర్యాక్లలో ఒకటి కిరండోల్ దగ్గర ఒకటి,అంబుగాం దగ్గర మరోకటి ఉండి పోయాయి. ఈ రెండు ర్యాక్లు వెళ్లే లోపు ఇక్కడ ప్రమాదం జరి గింది. దీంతో శుక్ర వారం రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన చేసింది.ఈ నెల 5,7 తేదీల్లో జగదల్పూర్ నుంచి పూరీ వెళ్లాల్సిన రైళ్లు, 6న విశాఖ–పూరి, 7న పూరి–విశాఖ పట్నం ప్రత్యేక రథయాత్ర రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. -
విద్యతోనే వికాసం
రాయగడ: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందా లంటే విద్యతోనే సాధ్యపడుతోందని రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడా, సాంస్కృతిక శాఖల మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల 59వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. విద్యావిధానంలో రాష్ట్రం కొంత పుంతలు తొక్కుతోందన్నారు. ఆధునిక, సాంకకేతిక పరంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు వారు ఆసక్తి కనబరిచే రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. శ్రద్ధతో విద్యను అభ్యసిస్తే వారి భవిష్యత్ ఉజ్వలంగా మారుతుంద ని హితవు పలికారు. ఉన్నత విద్యవిధానంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టిసారించాలని అన్నారు. పట్టుదల, కృషితో ముందుకు సాగితే స్వయం ఉపాధిలో రాణించి మరికొంతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులతో మాటా..మంతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులతో మంత్రి మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలొ రాయగడ వంటి ప్రాంతం ఎంతో గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆదివాసీ, హరిజనుల సంఖ్య అధికంగా గల ఈ జిల్లాలో విద్యావిధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం యోచిస్తుందని వివరించారు. ఆటానమస్ కళాశాలలోని పలు సమస్యలను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నివేదిక సమర్పణ.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ కళాశా ల వార్షిక నివేదకను చదివి వినిపించారు. 1966వ సంవత్సరంలో ఏర్పాటైన కళాశాల అంచెలంచెలు గా అభివృద్ధి చెందిందని అన్నారు. 2007లో స్వయం ప్రతిపత్తి కళాశాలగా గుర్తింపు పొందిందని వివరించారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ నుంచి పీజీ వరకు తరగతులు ఉన్నాయని.. సుమారు 5,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎందోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగుతున్న ఈ కళాశాలలో వసతుల ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, ఏడీఎం నిహారి రంజన్ కుహరో పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో వివిధ శ్రేణుల్లొ టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు మంత్రి జ్ఞాపికలను అందించి సత్కరించారు. మంత్రి సూర్యవంశీ సూరజ్ ఘనంగా కళాశాల వ్యవస్థాపక దినోత్సవం -
జనావాసాల్లో చిరుత సంచారం
కొరాపుట్: జనావాసాల్లో చిరుత పులి సంచా రం ఆందోళన రేకెత్తించింది. శుక్రవారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా సరిహద్దు చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్లోని ఇమిలి పరాలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చిరుత కనిపించింది. కాలనీ వద్ద ప్రహరీపై చిరుత కదలికలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. నేటి నుంచి కేంద్ర మంత్రి పర్యటన కొరాపుట్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శని, ఆదివారాల్లో కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. శుక్రవారం జయపూర్ పట్టణంలో జగత్ జనని జంక్షన్ వద్ద బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించా రు. శనివారం ఉదయం కొరాపుట్ జిల్లా ధమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్దకు కేంద్రమంత్రి చేరుకుంటారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జగన్నాథ శ బరి శ్రీక్షేత్రంలో జరగనున్న మారు రధాయాత్ర బహుడాలో పాల్గొంటారు. అనంతరం కేంద్రి య విశ్వ విద్యాలయంలో రూ .480 కోట్లతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తా రు. ఆదివారం జయపూర్ పట్టణంలోని జగన్నాధ సాగర్ సమీపంలో పంచానన్ మందిర్ సమీపంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్ధాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ అకాంక్ష జిల్లాలో ఉన్న కొరాపుట్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్ష చేస్తారు. ఈ పథకాలు త్వరగతిన ప్రజలకు చేరేందుకు దిశ నిర్దేశం చేస్తారు. సమావేశానికి అవిభక్త కొరాపు ట్ జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తారని మంత్రి నిత్యానంద గోండో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న కొరాపుట్ జిల్లాలో బీజేపీని పటిష్టత చేస్తారని మంత్రి పేర్కొనా రు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘు రాం మచ్చో, బీజేపీ నాయకుడు గౌతం శాంత్ర ఉన్నారు. రైతులను కోలుకోలేని దెబ్బ తీసిన వర్షాలు జయపురం: కొద్దిరోజులుగా జయపురం సబ్డివిజన్లో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పలు ప్రాంతాలలో రబీ ధాన్యం పంట కోతలు జరిగిన తరువాత కొంత పంట నూర్పులు జరిగినా మరికొంత పంట కోతలు జరగి పొలాలోనే ఉన్నాయి. ఆ సమయంలో వర్షాలు పడటం వలన ధాన్యం మొక్కలు మొలిచాయని జయపురం సబ్డివిజన్ కుంధ్ర సమితి రాణీగుడ పంచాయతీ సర్గిగుడ గ్రామ రైతులు వెల్లడించారు. ధాన్యం కోతలు జరిగి నూర్పులు ప్రారంభించే సమయంలో వర్షాలు పడటంవలన ధాన్యం మొలకలొచ్చాయని, వర్షం నుంచి ధాన్యం మరో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు విరామం లేకుండా పడిన వర్షాలు వలన అవరోధం ఏర్పడిందని రైతులు వాపోయారు. ఆ గ్రామంలో మనోజ్ కుమార్ మహంకుర తన 5 ఎకరాలలో వరి పండించగా వచ్చిన 130 క్వింటాళ్ల ధాన్యం వర్షాలు కారణంగా మొలకలెత్తయని వారు వెల్లడించారు. విద్యార్థులకు చదువు కష్టాలు! పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా బ్లాక్లో స్కూల్కు వెళ్లడానికి విద్యార్థులు పడరాని కష్టాలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ గరడమా పంచాయతీ రాజఖమా గ్రామస్తులు వర్షాకాలంలో కిలోమీటరున్నర నడిచి గడపుర్ నదిని దాటి బడసాయి స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. స్వాతంత్య్రం సాధించి 76 ఏళ్లు గడిచినా గడపూర్ నదిపై వంతెనను ప్రజాప్రభుత్వాలు నిర్మించలేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మోహానా బ్లాక్ ఖుంబర్పాడ, రాంసింగ్, గురిమెరా, బెత్తగుండ, బెముడిపద, చిందన్కపంక, లుటిపదర్, గురుఝలి, బలిబంద, గంగుడిపంకల్ మరియు రాజఖమా గ్రామాలకు వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో బాహ్యాప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. -
ఘనంగా వనమహోత్సవం
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు, జయపురం అటవీ డివిజన్ సహకారంతో శుక్రవారం నుంచి మహోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో జీవరాశి మనుగడకు చెట్లు ఎంతో అవసరం అన్నా రు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి పర్యవేక్షణ లో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మొ దట మొక్కలు నాటి వనమహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ విచారపతి స్వయం ప్రకాశ్ దాస్, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యామయి సునీత, సివిల్ కోర్టు రిజస్ట్రార్ విష్ణు ప్రసాద్ బెహర పాల్గొన్నారు. -
సమావేశంలోనే గుండెపోటుతో ఆశకార్యకర్త మృతి
మల్కన్గిరి: సమావేశంలోనే గుండెపోటుకు గురై ఆశ కార్యకర్త ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కార్యాలయంలో చోటుచేసుకుంది. ఆరోగ్యపధ్ శిక్షణ కార్యక్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖోయిర్పూట్ సమితి కేంద్రంలో గురు, శుక్రవారాల్లో ఆరోగ్యపధ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాుర. ముదిలిపోడ పంచాయతీకి చెందిన మంగులి కిర్సని (43) హాజరైంది. శిక్షణ సమయంలో సహోద్యోగులతో నవ్వుతూ అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆమె గురువారం సాయంత్రం స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే తోటి ఉద్యోగులు ఖోయిర్పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. దీంతో తోటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి గురయ్యారు. కాగా శుక్రవారం ఆశ వర్కర్ల సంఘం ప్రతినిధులు మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలాయనికి వచ్చి తమతో పని చేసి మంగులి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని, పిల్లలు ఉండేందుకు ఇల్లు, పిల్లల చదువుకు ప్రభుత్వ సహయం, కుటుంబంలో ఒకరికు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. -
సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానం
కొరాపుట్: భగవాన్ సత్యసాయి భక్తుల సేవలు నిరుపమానమని కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి కేంద్రంలో నూతనంగా నిర్మించిన భగవాన్ సత్యసాయి సమితి కేంద్ర భవనం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని ఆశయాలు సజీవంగా కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో సాయి భక్తులు నిత్యం ఏదో ఒక సమాజ సేవ చేయడం తాను బాల్యం నుంచే గమనించానని పేర్కొన్నారు. తన వంతుగా సాయి సమితికి ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో సాయి సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్కే దాస్, సచిదానంద, డాక్టర్ బెహర, ఆరుణ్ పాత్రో (రాజా), ఎస్.నాగభూషణ్రావు, మర్కెండయ్ షరాఫ్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కిరండోల్–కొత్తవలస రైల్వేలైన్ పునరుద్ధరణ
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్ పునరుద్ధరణ కోసం భారీ ఎత్తున్న రైల్వే సిబ్బంది మోహరించారు. బుధవారం కొరాపుట్–జయపూర్ రైల్వే స్టేషన్ల మార్గంలో జర్తి–మాలిగుడల మధ్య పెద్ద ఎత్తున మట్టి చరియలు ట్రాక్ మీదకు చొచ్చుకువచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు రైల్వే సిబ్బంది మట్టిని తొలగించడానికి పనులు చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలు పనులకు ఆడ్డంకిగా మారాయి. 13 హెవీ జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రక్లు, సుమారు 300 మందికి పైగా కార్మికులు ఈ పనులలో నిమగ్నమయ్యారు. రాళ్లు తొలగిస్తున్నప్పటికీ వర్షం నీరు వస్తుండడంతో పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి. రాయగడ రైల్వే డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ సంఘటన స్థలంలో టెంట్ వేసుకొని మకాం వేశారు. రాత్రింబవళ్లు డీఆర్ఎం అక్కడే ఉండడంతో పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి.ఇప్పటికే జగదల్పూర్–భువనేశ్వర్, జగదల్పూర్–రౌర్కెలా, కిరండోల్– విశాఖ పట్నం ప్యాసింజర్, కిరండోల్–విశాఖపట్నం నైట్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. గురువారం కూడా కిరండోల్–కొరాపుట్ల మధ్య రైళ్లు నడవలేదు. కొరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని రైళ్లు నడుపుతున్నారు. శుక్రవారం ఉదయానికి పునరుద్ధరణ పనులు పూర్తవ్వవచ్చని రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘల్ ప్రకటించారు. -
భయపెడుతున్న వరద
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో నదులు కట్టలు తెంచుకున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతంగా కొరాపుట్ జిల్లా కొట్పాడ్లో 152 మిల్లీమీటర్లు పడింది. ఈ విషయం రాష్ట్ర వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్లో ప్రకటించింది. లమ్తాపుట్ సమితిలో ఆంధ్రా–ఒడిశా ఉమ్మడి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాచ్ఖండ్లో డీ డ్యాం లో 6,7 గేట్లు ఎత్తేశారు. ఈ రెండు గేట్ల నుంచి క్యూసెక్కుల నీటిని చిత్రకొండ జలపాతానికి వదిలారు. డ్యామ్ సామర్థ్యం 2,590 అడుగులు కాగా అక్కడ 2,588 అడుగుల వరకు నీటి పరిమాణం వచ్చింది. గత ఐదు రోజుల్లో ఈ బేసిన్లో 262 మిల్లీ మీటర్ల వర్షం పడింది. దీంతో నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డ్యామ్లో 2,586.5 అడుగుల నీరు ఉంది. రైతుల కష్టాలు కుంద్రా సమితిలో పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయింది. 25 ఎకరాల పంట పొలంలో ధాన్యం మొలకలెత్తాయి. ఈ రైతులకు ధాన్యం కొనడానికి ఇప్పటికే ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ ధాన్యం ఏం చేయాలో తెలియక రైతులు రోదిస్తున్నారు. లమ్తాపుట్ సమితిలో కల్వర్టు వద్ద నీరు ప్రవహిస్తోంది. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ సమీపం డొడ్ర వద్ద రోడ్లు తెగి వర్షం నీరు పారుతోంది. ఈ ప్రాంతాన్ని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రమేష్ సాహు సందర్శించారు. పరిస్థితి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లారు. కొరాపుట్ జిల్లాలో 47 ఇళ్లు ధ్వంసం గురువారం ఉదయానికి కొరాపుట్ జిల్లాలో వర్షాల వల్ల 47 ఇళ్లు కూలి పోయాయి. బాధిత ప్రజలు తమ వద్దకు ప్రభుత్వ సిబ్బంది వచ్చి పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నందపూర్ సమితి సెమలా వద్ద రోడ్డు పై భారీవృక్షం కూలి పోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందపూర్ అగ్ని మాపక బృందం వచ్చినప్పటికీ భారీ వృక్షం కావడంతో తొలగించడం కష్టమైంది. దీంతో స్థానిక గిరిజనుల సాయంతో చెట్టును తొలగించారు. నబరంగ్పూర్ జిల్లా ఖాతీ గుడకి వెళ్లే మార్గంలో లమ్తాగుడ వద్ద కల్వర్టు మునిగి పోయింది. దీంతో ఇంద్రావతి నుండి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. -
అలరించిన గుహారి
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా కొనసాగుతున్న గుహారి భక్తి, ఆధ్యాత్మిక సంగీత ఉత్సవం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. స్థానిక ఉత్కళ రంగస్థలంపై ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిశాఖతో కలిసి గురు కేలూ చరణ్ మహాపాత్రో ఒడిస్సీ పరిశోధన కేంద్రం ఈ ఉత్సవం నిర్వహించింది. జగన్నాథుని ఆధారంగా రూపొందించిన గాయకుల భక్తి సంగీత ప్రదర్శన ఉత్సవంలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. గాయకులు మహాప్రసాద్ కొరొ, అనుసూయ నాథ్, బసంత పాత్రో, సృష్టి సురూప, అలోక్ కుండు, నిషి ప్రభ పాణి, ప్రభాత్ కుమార్ పాత్రో, దీప్తి దా్స్, దిబ్యరంజన్ దాస్ జగన్నాథునిపై ఆధారిత భుజ తాళే, అహే నీలగిరి, దుఃఖ నాశన హే, ఏహి కఠారే మో మన, మొన్నొ రే హరి భజన, పతితపావన బన్నా, రాధా శ్రీపాద బ్రజా, జై జగబంధు హే జాదు నందన, జై జై జగన్నాథ్ తదితర భక్తి గీతాలు ఆలపించారు. దుష్మంత్ కుమార్ పరిడా (తబలా), వైభవ కుమార్ దాస్ (డ్రమ్), ప్రీతి రంజన్ స్వంయి (వేణువు), సుధాంశు శేఖర్ జెనా (ఆక్టోపాడ్), చింతామణి మిశ్రా (కీబోర్డ్), సుమంత మహరణ (హార్మోనియం) వాద్య సహకారం అందజేశారు. ప్రముఖ గాయని పద్మశ్రీ శ్యామ మణి దేవి, ఒడిస్సీ నృత్యకారిణి పద్మశ్రీ కుంకుమ్ మహంతి, ప్రఖ్యాత గాయని గీతా పట్నాయక్, ప్రముఖ పండితుడు డాక్టర్ కీర్తన్ నారాయణ్ పర్హి, జీకేసీఎం ఒడిస్సీ రీసెర్చ్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుజా తరిణి మిశ్రా అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ మృత్యుంజయ రథ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
బహుడాకు రథాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆద్యంతాలు యుద్ధ సన్నాహమే. భక్తి శ్రద్ధల మేళవింపుతో స్వామి యాత్ర అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. స్వామి భక్తులు విభిన్నం. భగవంతుని అపురూప దర్శనం కోసం పరిమితం కాకుండా భక్తి భావోద్వేగంతో స్వామి యాత్రలో అడుగడుగున ప్రత్యక్ష పాత్రధారులుగా పాలుపంచుకుంటారు. అగణిత భక్త జనం మధ్య స్వామి ఆప్యాయ అనురాగాలతో యాత్రలో పాల్గొంటాడని వీరి విశ్వాసం. ఇదే స్ఫూర్తితో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణ నుంచి శ్రీ గుండిచా నక్కొ చొణ ద్వారం ఆవరణకు యాంత్రిక, సాంకేతిక వినియోగం లేకుండా 3 భారీ రథాల్ని సురక్షితంగా గమ్యం చేర్చారు. ఇదే తరహాలో మారు రథ యాత్రకు 3 రథాలు సిద్ధమయ్యాయి. వర్షం ప్రభావంతో బుధవారం నాడు ప్రారంభించిన రథాల మలుపు కార్యక్రమం పాక్షికంగా పూర్తయ్యింది. శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథం లాగే సమయానికి కుండపోత వాన కురవడంతో వాయిదా పడింది. మరునాడు గురువారం ఉదయం నందిఘోష్ రథాన్ని లాగి శ్రీ గుండిచా నక్కొచొణ ద్వారం ముంగిటకు పోలీసు జవానులు చేర్చారు. -
వెదజల్లుతున్న దుర్గంధం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని డైలీ మార్కెట్ వద్ద తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. బస్టాండ్ సమీపంలో రైతు బజార్ పేరిట ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇదే ప్రధాన మార్కెట్ కావడంలో నిత్యం వందల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. అంతేకాకుండా ఆంధ్ర, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల నుంచి అనేక వస్తువులు వస్తుంటాయి. ఇక్కడ నుంచి అనేక ఉత్పత్తులు వెళ్తుంటాయి. అటువంటి మార్కెట్లో పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించింది. ఎక్కడికక్కడే మురికి కుంటలు ఏర్పడ్డాయి. వాటిని శుభ్రం చేసే నాథుడే కరువయ్యాడు. మురికికూపాల పక్కన గిరిజనులు తమ ఉత్పత్తులు విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకి రెండుసార్లు మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయాలి. కానీ అలా జరగడం లేదు. చేసేది ఏమీ లేక, చెప్తే వినేవారు లేక ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ద్వారం.. సుగంధ భరితం భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయం నక్కొచొణ ద్వారం శోభాయమానంగా సుగంధం విరజిమ్ముతోంది. మారు రథ యాత్ర (బహుడా) రోజున బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునితో చక్ర రాజు సుదర్శనుడు మూల విరాట్ల ఈ ద్వారం గుండా వెలుపలికి విచ్చేస్తారు. యాత్రలో భాగంగా అడపా మండపంపై పూజలు అందుకున్న దేవతలు తిరిగి శ్రీ మందిరంలో రత్న వేదిక చేరేందుకు వరుస క్రమంలో (గొట్టి పొహండి) బయటకు తరలి వచ్చి రథాలపై ఆసీనులు అవుతారు. అనంతరం మారు యాత్రకు రథాలు బయల్దేరుతాయి. హీరా పంచమి రోజున శ్రీదేవి కూడా ఈ ద్వారం గుండా తిరిగి వస్తుంది. నక్కొచొణా ద్వారం పైభాగం మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ద్వారం ఎడమ వైపున బ్రహ్మ, కుడి వైపున మహా దేవుడు ఉంటాడు. బ్రహ్మ మరియు శివుని పైన, నవ గ్రహాలు కూడా ఉంటాయి. బహుడా యాత్ర కోసం ఈ ద్వారం ముస్తాబు అవుతోంది. భారీ రంగవళ్లులతో యాత్ర శోభ రంగరించుకుంటుంది. దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ రాయగడ: జిల్లాలోని గుడారిలో కలెక్టర్ ఫరూల్ పట్వారీ ఆదేశాల మేరకు జిల్లా సామాజిక సురక్షా అధికారి రంజిత బెహర ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వైద్యుల సమక్షంలో నిర్వహించిన పరీక్షల్లో వివిధ సమస్యలతో ఉన్న దివ్యాంగులకు గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు అందేలా పేర్లు నమోదు చేశారు. కార్యక్రమంలో పద్మపూర్ సామాజిక సురక్షా అధికారి సిగ్నమయి బారిక్, పీఏ మనోజ్ కుమార్ మిశాల్, అనీల్ గౌడొ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర గవర్నర్తో కలిసిన మోంటానా ప్రతినిధి బృందం
భువనేశ్వర్: భారత దేశ ఘనమైన సంస్కృతి, కళలు, సామాజిక పురోగతి రంగాల్లో వైవిధ్యాన్ని అన్వేషించాలని అమెరికాలో మోంటానా ప్రతినిధి బృందాన్ని గవర్నర్ కోరారు. ట్రెక్ 2025 కార్యక్రమం కింద 10 మంది సభ్యుల మోంటానా ప్రతినిధి బృందం గురువారం రాజ్ భవన్న్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటిని కలిసింది. ఇలాంటి సందర్శనలు వివిధ దేశాల ప్రజల మధ్య మెరుగైన అవగాహనను పెంపొందించడానికి సహాయపడతాయని గవర్నరు అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు రాజ్ భవన్ సందర్శించారు. జన జీవనం అస్తవ్యస్తం జయపురం: జయపురం సబ్డివిజన్లో భారీ వర్షాలు పడుతుండగా జయపురంలో అత్యధికంగా 73.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొయిపరిగుడ సమితిలో 73 మిల్లీ మీటర్ల వర్షం నమోదు కాగా జయపురం, బొయిపరిగుడ సమితిలో జన జీవనం అస్తవ్యస్తమైంది. జయపురం పట్టణంలోని పలు వీధుల్లో వరద నీరు మోకాలు ఎత్తున పారింది. పదికిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బి.సునీత ముంపుకు లోనైన ప్రాంతాలను తిరిగి పరిస్థితిని సమీక్షించారు. విజయవాడ– రాంచీ 326 జాతీయ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుప్తేశ్వర వెళ్లే రహదారిలో రోడ్డు ధ్వంసమైంది. పేకాట శిబిరంలో రూ.3.66 లక్షలు స్వాధీనం పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్ కుర్లండ గ్రామశివార్లలో జీడితోటలో పేకాట శిబిరంపై పర్లాకిమిడి ఆదర్శపోలీసు స్టేషన్ సిబ్బంది దాడిచేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.66 లక్షలు, 30 టూవీలర్స్ బైక్లు, 5 ప్యాకెట్ల పేకలు స్వాధీనం చేసుకున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ తెలియజేశారు. ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేశారు. బ్యాగ్ అప్పగింత భువనేశ్వర్: తొందరపాటులో రైలులో బ్యాగ్ని వదిలి దిగిపోయిన ప్రయాణికునికి టికెటు తనిఖీ అధికారి సురక్షితంగా అందజేశారు. గురువారం సిలిగురి (గువాహతి) – కోయంబత్తూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడు రాణా సర్కార్ విలువైన సామగ్రితో నిండిన బ్యాగును మరిచిపోయారు. ఖుర్దారోడ్ మండలం చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ (సీటీఐ) లక్ష్మీధర మహంతి బ్యాగును ప్రయాణికునికి అప్పగించారు. ప్రయాణికుని ఫిర్యాదు అందడంతో చేపట్టిన సత్వర గాలింపుతో ఇది సాధ్యమైందని సీటీఐ వివరించారు. మండల కమర్షియల్ కంట్రోల్, రక్షక దళం వర్గాల సమన్వయంతో ప్రయాణికునికి సామగ్రి సురక్షితంగా అందజేశామన్నారు. కలెక్టర్కు కృతజ్ఞతలు కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) నిర్వహణ ఇచ్చినందుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం సాయంత్రం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కి రాణీ లక్ష్మీభాయి స్వయం సహాయక బృందం తరలివెళ్లింది. తమకు మండీలు నిర్వహణ బాధ్యత అప్పగించినందుకు కలెక్టర్ వి.కీర్తి వాసన్కి అభినందించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ 2 నుంచి 30వ తేదీ వరకు మండీలు నిర్వహించామన్నారు. కొరాపుట్ జిల్లాలో 14.5 లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కలహండి, బలంగీర్ జిల్లాల నుంచి వచ్చిన మిల్లర్లు ఈ ధాన్యం కొనుగోలు చేశారన్నారు. ఈ మండీల నిర్వహణ ఎస్హెచ్జీ, పానీ పంచాయతీ, ల్యాంప్స్కి అప్పగించామని కలెక్టర్ ప్రకటించారు. -
జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ ప్రారంభం
పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం హాల్లో గురువారం జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, జిల్లా సామాజిక సురక్షా అధికారి సంతోష్ కుమార్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరంలో 136– మోహానా అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ సంఖ్య 297, 137– పర్లాఖిముండి నియోజికవర్గంలో 276 బూత్లు ఉన్నాయి. ఓటరు జాబితాలో కొత్తగా చేరాలనుకున్నావారు ఫారం 6, ఫారం 6(బి) ఓటరు పరిచయ పత్రానికి ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. ఫారం 8 ఓటరు జాబితాలో తన పేరు, అడ్రస్ సవరణ చేయాలన్నారు. ఓటర్లు నమోదు చేయడానికి ఓటరు హెల్ప్ లైన్లో బూత్ అధికారులకు ఫారం 6, 7, 8, 6(బి)ను అందజేయలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో మోహానా అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మోహన్ సర్కారుకు అగ్ని పరీక్ష
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాల ప్రతిష్టంభన నెలకొంది. అధికారిపై కొందరు నేతలు దాడికి పాల్పడడంపై ప్రభుత్వ అధికారుల ఆగ్రహం చల్లారడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సర్కారుకు అగ్ని పరీక్షగా ఎదురైంది. మంత్రుల ఓదార్పు, సానుభూతి చర్యలకు ఓఏఎస్ అధికారులు తలొగ్గకుండా దాడి తెర వెనక వాస్తవ సూత్రధారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి అరెస్టు డిమాండ్తో ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు సామూహికంగా ఉద్యమిస్తున్నారు. ఈ మేరకు స్థానిక ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రభావిత ఓఏఎస్ అధికార వర్గం డిమాండ్ మేరకు చర్యలు చేపట్టేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, ముఖ్యమంత్రి ఎవరి తరహాలో వారు మంత్రులు, కార్యవర్గ సభ్యులు తదితర ప్రముఖులతో ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. బుధవారం నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ చేతులెత్తేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని బహిరంగంగా ప్రకటించి తప్పుకుంది. రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలుకుబడి, పరపతికి అతీతంగా నిందితులు ఎవరైనా వారి వ్యతిరేకంగా చర్యలు తథ్యమని భరోసా ఇస్తున్నారు. మోహన్ చరణ్ మాఝి కొలువులో ఇరువురు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్దేవ్, ప్రభాతి పరిడా ఇంత వరకు పెదవి కదపలేదు. ఓఏఎస్ అధికారిపై దాడిలో ప్రధాన సూత్రధారిగా బీజేపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యుడు జగన్నాథ్ ప్రధాన్కు వ్యతిరేకంగా స్థానిక ఠాణాలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలైంది. నాలుగు రోజులు గడిచినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. 3 రోజులే గడువు: ఓఏఎస్ సంఘం తొలుత 24 గంటల్లో చర్యల్ని ఆశించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ, హామీ పట్ల నమ్మకంతో 3 రోజుల పాటు సహనంతో మెసులుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సంఘం (ఓఏఎస్ఏ) చెప్పింది. మంత్రి అభ్యర్థన మేరకు అధికారులు అత్యవసర సేవల కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాలకు ఏ మాత్రం అంతరాయం లేకుండా నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. పూరీ రథ యాత్రలో దాదాపు 100 మంది అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఓఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రిపై పూర్తి నమ్మకం ఉందని ఓఏఎస్ఏ ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ప్రత్యక్షమయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, జగన్నాథ్ ప్రధాన్ మధ్య బుధవారం రాత్రి సుమారు మూడు గంటలు పైబడి నిర్విరామంగా జరిగిన చర్చల నేపథ్యంలో ప్రకాష్ మిశ్రా సందర్శించినట్లు స్పష్టం అవుతుంది. -
జయపూర్ యువరాజుకి గిరిజనుల కానుకలు
కొరాపుట్: జయపూర్ రాజా నగర్లోని మోతిమహల్ కి నందపూర్ నుంచి గిరిజనులు తరలి వచ్చారు. యువరాజు విశ్వేశ్వర చంద్ర చుడ్ దేవ్కి అటవీ ఉత్పత్తులు బహూకరించారు. తలపాగా కట్టి రాజరిక గౌరవం చేశారు. యువరాజు చంద్ర చుడ్ ఇటీవల నందపూర్ రథయాత్రలో రథ నిర్మాణం కోసం రు.లక్ష విరాళం పంపించారు. అక్కడ జగన్నాథ పూజా కమిటీకి చెందిన ప్రదీప్ దాస్, జగన్నాఽథ్ పంగి, కాశీనాథ్, భువనేశ్వర్ దళపతి, అజయ్ ఖెముండు తదితరులు వచ్చి ప్రసాదాలు అందిచారు. అనేక దశాబ్దాలుగా మోతీ మహల్ తలుపులు తెరవలేదు. ప్రస్తుత యువరాజు చంద్ర చుడ్ దేవ్ అలహాబాద్లో బాల్యం గడిపి ఇటీవలే జయపూర్ సంస్థానానికి తిరిగి వచ్చారు. తమ వంశీయుల సంప్రదాయాలు కొనసాగించడానికి ప్రజలకు సహాయ సహాకారాలు ప్రారంభించారు. ఇటీవలే ఆంధ్రా యూనివర్సిటీకి రు.లక్ష పంపించారు. -
కొరాపుట్ జిల్లాలకు సముచిత స్థానం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల ప్రజలకు రాజధానిలో సుముచిత స్థానం ఉంటుందని సీఎం మోహన్చరణ్ మాఝి అన్నారు. గురువారం రాజధానిలోని శబరి సాంస్కృతి సంసద్ సంస్థ ద్వారా నిర్మితమైన సాహిద్ భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలైన కొరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, మల్కన్గిరి జిల్లాల ప్రజలకు ఈ భవనం ఎన్నోవిధాలుగా ఉపయెగపడుతుందన్నారు. శబరి అంటే సవర అనే పదం నుంచి మార్పు అన్నారు. అటువంటి శబరి పేరు భవనానికి ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక గిరిజన సంస్కృతులు, కళలకు ఈ జిల్లాలు నిలయాలని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి నిత్యానంద గోండో, ఎంపీలు మున్నాఖాన్, బలభద్ర మజ్జి, మాజీ మంత్రులు రమేష్ చంద్ర మజ్జి, జగన్నాథ సారక, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహీణీపతి, గౌరీ శంకర్ మజ్జి, నర్సింగ్ బోత్ర, రుపుధర్ బోత్ర, రఘురాం మచ్చో, అప్పలస్వామి కడ్రక, నీలమాధవ్, మడ్కామి తదితరులు పాల్గొన్నారు. సీఎం మోహన్చరణ్ మాఝి -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని బోడెమ్మకోవెల సమీపంలో బలగవీధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి రూ.1.70 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి కె.శ్రీనుబాబు వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. గార మండలం కొర్లాం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న కుప్పిలి రామామణి బలగవీధిలో పెంకుటిల్లులో కుమారుడు లోకేష్తో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నారు. లోకేష్ విశాఖలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం విధుల నిమిత్తం రామామణి కొర్లాం వెవెళ్లింది. దేవుని గుడిలో ఉన్న దీపం ప్రమిద మంచంపై పడి మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురై ఆర్పేందుకు యత్నించారు. ఈలోగా ఫైర్ సిబ్బంది జీవీకే నాయుడు, ఎస్ ప్రసాద్, ఎం.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, పి.జగన్నాథరావు, వై.పాపారావులు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామాన్లు కాలిపోయాయి. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవారం వేర్వేరు రహదారి దుర్ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా దంపతులు, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మహిళా హోమ్ గార్డు, స్కూటరుని ట్రక్కున ఢీకొన్న దుర్ఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఖుర్ధా–బొలంగీర్ 57వ నంబరు జాతీయ రహదారిపై నిలకడగా నిలిచి ఉన్న ట్రక్కుని కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుని కొడుకు, కోడలు మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్యతో కలిసి వెళ్తుండగా కారు ట్రక్కుని ఢీకొనడంతో దంపతులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బౌధ్ జిల్లా రంభికట టోల్గేట్ సమీపం నువాపడా కూడలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులు నయాగడ్ గొణియా ప్రాంతానికి చెందిన రాజ్కిషోర్, మీనాక్షి సాహుగా గుర్తించారు. మరో దుర్ఘటనలో ట్రక్కు దూసుకెళ్లి మహిళా హోమ్ గార్డు దుర్మరణం పాలైంది. సైకిల్పై వెళ్తున్న మహిళా హోమ్ గార్డుపై ట్రక్కు దూసుకుని పోవడంతో దుర్మరణం పాలైంది. కటక్ నగరం ఛత్ర బజార్ అర్బన్ హట్ సమీపంలో ట్రక్కు హోం గార్డుపైకి దూసుకెళ్లింది. మృతురాలు మనోరమ పండాగా గుర్తించారు. ఆమె మాల్ గోదాం పోలీస్ ఠాణాలో హోమ్ గార్డుగా పనిచేస్తోంది. ఆమె తన విధిని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు స్కూటర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. కటక్ బాదంబాడి నుంచి లింక్ రోడ్ వెళ్తున్న స్కూటీని లింక్ రోడ్ మధుపట్న కూడలి వద్ద బస్సు స్కూటర్ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉంది. -
క్రీడా రత్నాలు
భువనేశ్వర్: ప్రపంచ క్రీడా వేదికపై ఒడిశా పోలీసు క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. అమెరికా బర్మింగ్హామ్లో జరిగిన ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2025లో కరాటే, 800 మీటర్లు, 1500 మీటర్లు పందెంలో బంగారు పతకాలు సాధించారు. మరిన్ని తేజోవంతమైన విజయాలతో వీరి భవిష్యత్ ఉజ్వలం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. కరాటే (64 కిలోల లోపు) విభాగంలో కానిస్టేబుల్ భగవాన్ రెడ్డి, పురుషుల (84 కిలోల లోపు) కరాటే పోటీలో కానిస్టేబుల్ సుమన్ శేఖర్ దాస్ బంగారు పతకాలు సాధించారు. మహిళల 1500 మీటర్ల రేసులో కానిస్టేబుల్ సుష్మితా టిగ్గా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె గతంలో 800 మీటర్ల రేసులో రజత పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 1500 మీటర్లు మరియు 800 మీటర్ల రేసులో కానిస్టేబుల్ అశోక్ దండసేన వరుగా 2 బంగారు పతకాలు చేజిక్కించుకున్నాడు. -
తెలంగాణ పేలుడులో నబరంగ్పూర్ వాసులు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేలుడులో ఇద్దరు జిల్లా వాసులు మృతి చెందారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితిలో అనేక గ్రామాలకు ఈ సమాచారం వచ్చింది. సంగారెడ్డి జిల్లా పాశమైలవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి సుమారు 45 మంది మృతి చెందారు. ఇదే పరిశ్రమలో నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి కొడాబెట్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ (30), చైతు బోత్ర (31) లు మృతి చెందారని సమాచారం వచ్చింది. సమితిలో కోడాబెట్ గ్రామంతో పాటు బుబాలిబెధ, పరసాల గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు ఇదే పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొడాబెట్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులలో ఇద్దరు మాత్రమే పనికి వెళ్లారు. వారి మృతదేహాలను అక్కడ మార్చురీలో ఉంచినట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. మృతుల బంధువుల డీఎన్ఏ కావాలని సమాచారం రాగా ఇక్కడ నుండి కొందరు యువకులు సంగారెడ్డి బయలు దేరి వెళ్లారు. -
ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి
● ఏరియల్ సర్వే నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి భువనేశ్వర్: ఉత్తర ఒడిశాలో ఎడతెరిపి లేని వానలతో పలు నదులు ఉప్పొంగాయి. జనావాసాలు వరద నీటిలో మునిగాయి. ఒడ్రాఫ్, తదితర వర్గాల సకాల సహాయ, సహకారాలతో చిరు ప్రమాదాలు మినహా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గురువారం ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. భొగొరాయి, బలియాపాల్, బొస్తా, జలేశ్వర్, బాలాసోర్ సదర్, రెముణ తదితర ప్రాంతాల్ని సందర్శించారు. ఈ జిల్లాలోని 6 మండలాల్లో 154 గ్రామాలు, జలేశ్వర్ మునిసిపాలిటీలోని 8 వార్డులు వరద నీటితో ప్రభావితమైనట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఆశ్రయంతోపాటు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ఒడ్రాఫ్, అగ్నిమాపక దళాలను నియమించారు. కెంజొహర్ జిల్లాలో వరద ఉధృతి కెంజొహర్ జిల్లా జోడా కాన్పూర్ ప్రాంతంలో తాత్కాలిక మట్టి కట్ట తెగడంతో వరద నీరు జనావాస ప్రాంతాల్లోకి వెళ్లింది. ఎటువంటి హాని జరగకుండా సత్వర చర్యలు చేపట్టినట్లు ఆనకట్ట చీఫ్ ఇంజినీర్ తెలిపారు. -
ఎయిర్పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు
మందస: తమకు ఎయిర్పోర్టు వద్దని, పచ్చని భూములే ముద్దు అని మందస మండలం టి.గంగువాడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన చిత్త గున్నయ్య ఆధ్వర్యంలో బాధిత రైతులు కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులుగా గ్రామానికి కొందరు అధికారులు వచ్చి సర్వే పేరిట వచ్చి కొలతలు వేయడానికి మిషన్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ భూములపై ఏ హక్కుతో కొలతలు వేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష స్పందించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి మోహన్రావు, జోగి మోహన్రావు, రామారావు, పుక్కల్ల నారాయణ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. -
బీఎంసీ కమిషనర్పై దాడికి నిరసన
మల్కర్గిరి: మల్కన్గిరిలో గురువారం కూడా జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ఓఎస్ అధికారులు పెన్డౌన్ చేశారు. భువనేశ్వర్లో బీఎంసీ కమిషనర్ రత్నకర్ సాహుపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా యునీట్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలిపారు. రెండు రోజులుగా ప్రఽభుత్వ పనులను అపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తిరిగి విధులు నిర్వహిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. జిల్లా క్లర్క్ సంఘం అధ్యక్షుడు సి.హెచ్.కృష్ణరావు, తదితరులు పాల్గొన్నారు. బస్సులో వర్షం నీరు ● ప్రయాణికుల అవస్థలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా భలిమెల నుంచి బరంపురం పట్టణానికి నడిచే బస్సు పైకప్పు నుంచి సీట్లపై వర్షం నీరు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ బస్సు ప్రతీరోజు మధ్యహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు తడిచి ముద్దవుతున్నారు. గురువారం కూడా బస్సు బయలిదేరినప్పుడు సీట్లు పూర్తిగా తడిచిపోయి ఉండటంతో కండక్టర్ను ప్రయాణికులు అడిగితే ఏ మాత్రం పట్టించుకోలేదు. తాము ఏమీ చేయలేమని, పైఅధికారులతో సంప్రదించాలని డ్రైవర్, కండక్టర్ చెప్పారు. రూ.600 టికెట్ కొని నరకయాతన పడి ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంపై బరంపురం డీటీఎం అరవింద్ మహంతిని వివరణ కోరగా.. బస్సు పైకప్పును బాగు చేస్తామన్నారు. శుక్రవారం నుంచి ఆ బస్సు స్థానంలో మరొక బస్సును పంపుతామన్నారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్, కండక్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడు మృతి ఆమదాలవలస/ఎచ్చెర్ల: ఆమదాలవలస మున్సి పాలిటీ పరిధిలోని చొట్ట వానిపేట కాలనీలో గురువారం విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెంద గా మరొకరు గాయపడ్డారు. స్థానికులు తెలిపి న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చొట్టవానిపేట కాలనీలో గొర్లె పెంటయ్య ఇంటి నిర్మా ణం జరుగుతోంది. లావేరు మండలం చిన్నమురపాకకు చెందిన గేదెల లక్ష్మణ్(40), మురపాక రమణ రాడ్ బెండింగ్ పనుల కోసం గురువారం వచ్చారు. ఇనుప రాడ్లను భవనంపైకి తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగలగడంతో షాక్కు గురై కిందపడ్డారు. ఈ ఘటనలో లక్ష్మ ణ్ అక్కడికక్కడే మృతిచెందగా రమణ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. మృతుడు లక్ష్మణ్కు భార్య అసిరితల్లి, ఇద్దరు కుమారులు భాస్కరరావు, బాలరాజు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
వంతెన గోడను ఢీకొట్టిన వ్యాన్
● రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన అరటి గెలలు టెక్కలి రూరల్: బొప్పాయిపురం సమీపంలో జాతీ య రహదారిపై గురువారం వేకువజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్ వంతెన గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాల తో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావులపాలెం నుంచి ఒడిశా వైపు అరటి గెలల లోడుతో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీపంలో బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి ఇరుకు వంతెన ఉండటంతో గమనించక వంతెను గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ శాంతన్ శెట్టికి స్వల్ప గాయాలు కాగా.. వ్యాన్ రెండు భాగాలుగా విడిపోవడంతో అరటిగెలలు రోడ్డుపై పడిపోయా యి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పకి తరలించారు. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
జయపూర్లో పట్టపగలు రూ.లక్ష లూటీ
కొరాపుట్: జయపూర్ పట్టణంలో దోపిడీ దొంగలు పట్టపగలు చెలరేగిపోయారు. గురువారం సాయంత్రం బెల్ రోడ్డులో ప్రజలందరూ చూస్తుండగా దోపిడీ చేశారు. హడియా గ్రామానికి చెందిన గిరిజన రైతు కమలోచన్ బోత్ర తనకు ప్రభుత్వం నుంచి అందిన రు.3.9 లక్షల నగదు ఎంజీ రోడ్డులోని షిర్డీ సాయి మందిరం సమీపంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో డ్రా చేశాడు. తనతో వచ్చిన గిరిజనులతో కలిసి బెల్ రోడ్డు గుండా రాజానగర్ వెళ్లి హడియా గ్రామానికి వెళ్లాలని బయలుదేరాడు. వాహనం బెల్ రోడ్డులో వెళ్తుండగా సొంబారు తోట సమీపంలో పంచముఖ హనుమన్ విగ్రహ సమీపంలో ముగ్గురు యువకులు రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనం ఆపారు. ఒక యువకుడు బోలిరోలో ఉన్న నగదు సంచి లాగడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే తేరుకున్న కమలోచన్ బోత్ర సంచి గట్టిగా పట్టుకున్నాడు. బోలోరోలో ఉన్న మిగతా గిరిజనులు స్పందించే లోపు రు.లక్ష నగదు (రెండు యాబై వేల కట్టలు) పట్టుకొని పరారయ్యారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐలో గిరిజనులు డబ్బులు డ్రా చేసినప్పటి నుంచి దొంగలు అనుసరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కెనాల్లో లాంచీ బోల్తా
కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి ద్వరసని గ్రామ పంచాయతీలోని ముండి గుడ కెనాల్ లో బుధవారం సాయంత్రం లాంచీ బోల్తాపడింది. అయితే అందులో ఉన్నవారిని సమీపంలో ఉన్న గిరిజనులు కాపడడంతో పెను ప్రమాదం తప్పింది. లాంచీ బోల్తాపడిన సమయంలో అందులో ఏడుగురు ఉన్నారు. లాంచీ బోల్తాపడడంతో అందులో ఉన్నవారు భయంతో హాహాకారాలు చేయడంతో వారి కేకలువిని సమీపంలో ఉన్న గిరిజనులు రంగం లోనికి దిగారు. తాళ్లు వేసి వారిని రక్షించారు. లాంచీని కూడా అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అయితే లాంచీలో ఉన్న మూడు బైక్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. మురాన్ నది నుంచి ఈ కెనాల్ ద్వారా నీరు ఇంద్రావతి డ్యాంలో కలుస్తుంది. కెనాల్కి మరో వైపు నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ఉంది. ప్రయాణికులను కాపాడిన గిరిజనులు వరదనీటిలో కొట్టుకుపోయిన మూడు బైక్లు -
పూరీ తొక్కిసలాట మృతులకు పరిహారం
భువనేశ్వర్: పూరీ రథయాత్రలో శారదా బాలి ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో మృతులకు ప్రకటించిన పరిహారం రాష్ట్ర మంత్రులు ప్రత్యక్షంగా అందజేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా బుధవారం బలిపట్న మండలం ఒఠాంతొరొ గ్రామానికి చెందిన పార్వతి దాస్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కటుంబీకుల్ని ఓదార్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 25 లక్షల ఆర్థిక పరిహారం కుటుంబీకులకు అందజేశారు. విషాదం పట్ల వివచారం వ్యక్తం చేశారు. ఆటోపై విరిగి పడిన చెట్టుజయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి సంతలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగి అక్కడ ఉన్న ఆటోపై పడింది. మంగళవారం రామగిరి వారపు సంతకు పలువురు వ్యాపారులు, ప్రజలు వచ్చారు. కొంతమంది ఆటోలో తిరిగి తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక మామిడి చెట్టు గాలికి అకస్మాత్తుగా విరిగి ఒక ఆటోపై పడింది. ఆ సమయంలో అందులో ఎవరూలేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారిపై ఆ చెట్టు పడటం వలన దండాబెడ నుంచి బొయిపరిగులకు వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి చెట్టును తొలగించి రోడ్డు క్లియర్ చేశారు. తొక్కిసలాట దర్యాప్తు వేగవంతం భువనేశ్వర్: పూరీ శారదా బాలి ప్రాంగణంలో తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్ దర్యాప్తు ప్రారంభించారు. నెల రోజుల్లోగా నివేదిక అందజేసేందుకు కమిషనర్తో పాటు నలుగురు ఓఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్, సాధారణ పాలన, ప్రజాభియోగాలు విభాగం అదనపు కార్యదర్శి మానస్ రంజన్ సామల్, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి బినయ కుమార్ దాష్, జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి రష్మి రంజన్ నాయక్, నిర్మాణ శాఖ అదనపు కార్యదర్శి ప్రదీప్ కుమార్ సాహూ ఉన్నారు. బినయ కుమార్ దాష్, రష్మి రంజన్ నాయక్, ప్రదీప్ కుమార్ సాహూ ప్రస్తుతం రథ యాత్ర కార్యకలాపాల పర్యవేక్షణ కోసం పూరీలో సేవలు అందిస్తున్నారు. సంబంధిత అధికారులు వారి సాధారణ, దైనందిన విధులతో పాటు దర్యాప్తు బాధ్యతలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం.. చెత్త కుప్పల్లో ప్రసాదం రాయగడ: రథయాత్రలో భాగంగా ప్రభు జగన్నాథుని కిచుడి భోగం (ప్రసాదం)పొందేందకు గంటల తరబడి భక్తులు వేచి ఉంటారు. ఈ మహాప్రసాదానికి అంత పవిత్రత ఉంది. ఈ క్రమంలో స్థానిక గుండిచా మందిరంలో నిర్వాహకుల నిర్లక్ష్యం తాజాగా బయటపడింది. జగన్నాధుని మహాప్రసాదాన్ని చెత్తకుప్పల్లో పారబోయడం చర్చనీయాంశంగా మారింది. మహాప్రసాదం కోసం గంటల తరబడి వేచి ఉన్నా లభించక నిరాశతో వెనుతిరిగే భక్తులు ఇలా ప్రసాదాన్ని నిర్వాహకులు నేలపాలు చేస్తుండటంపై మండిపడుతున్నారు. ఒకవేళ మిగిలిపొతే సమీపంలోని నదిలో వేయకుండా చెత్తకుప్పల్లో పారబోయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రియదర్శని సిబ్బందిపై మండిపడ్డారు. -
● ప్రజా సేవలు బంద్
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో బుధవారం ప్రజా సేవలు స్తంభించాయి. భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో జాయింట్ కమిషనర్ రత్నాకర్ సాహుపై బీజేపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. రత్నకర్ సాహు అత్యధిక కాలం నబరంగ్పూర్, కొరాపుట్ జిల్లాలో పని చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో హత్యాయత్యాన్ని నిరసి స్తూ నబరంగ్పూర్ జిల్లాలో ఓఏఎస్ అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్ర భుత్వ కార్యాలయాలలో ప్రజలకు సేవలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఏఎస్ అధికారులు భారీ వర్షంలో ర్యాలీ నిర్వహించారు. తమ సహచర ఓఏఎస్ అధికారిపై జరిగిన దాడిని ఖండించారు. భద్రత లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేమని నినాదాలు చేశారు. ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో జిల్లాస్థాయి ముఖ్య కార్యాలయాలు వెలవెలబోయాయి. జయపూర్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి దాడులను సహించమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ పార్టీల కార్యకర్తల దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రెవెన్యూ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు నబరంగ్పూర్లో మాట్లాడుతూ.. రత్నకర్ సాహుకి తాము అండగా ఉన్నామని ప్రకటించారు. మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్తకర్తల దాడి నేపథ్యంలో మూకుమ్మడి సెలవులో ఉద్యోగులు -
లైంగిక దాడి కేసులో ఒకరి అరెస్టు
జయపురం: జయపురంలో ఉంటున్న హర్యానకు చెందిన మహిళపై జరిగిన లైంగిక దాడిలో కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు మహిళా పోలీసు అధికారి ఆశ్రిత ఖాల్కో బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక మహాత్మా గాంధీ రోడ్డు గాంధీచౌక్ పరిదికి చెందిన దేవ్ సోనిగా తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. కోర్టు బెయిల్ నిరాకరించటంతో జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాలు ప్రకారం.. జయపురం సమీప బరిణిపుట్లోని రాహుల్ గర్గ్ షోరూంలో హర్యానకు చెందిన మహిళ పని చేస్తూ.. పట్టణంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గతనెల 28వ తేదీ రాత్రి సమయంలో జయపురం రథాయాత్ర తిలకించేందుకు ఆమె వెళ్లింది. మార్గమధ్యలో దేవసోని కలిశాడు. అనంతరం వారంతా రథాయాత్ర చూసి అందరూ ఇంటికి వచ్చారు. ఆ మహిళ తన ఇంటిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో దేవ్ సోని వచ్చి ఆమైపె దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అరిస్తే చంపుతానని బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. బాధిత మహిళ జయపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుని అరెస్టు చేశామన్నారు. ఈ సంఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి వెల్లడించారు. -
బురదలో కూరుకుపోయిన అంబులెన్స్
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి నాకమామ్ముడి పంచాయతీ హతీహాంబ్ గ్రామం నుంచి గంధిగూఢకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజగా గంధిగూఢ గ్రామం నుంచి ఓ రోగిని బుధవారం తరలిస్తున్న అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. దీంతో గంటసేపు రోగి అంబులెన్స్ ఇబ్బందిపడ్డాడు. ఇంతలో ట్రాక్టర్కు తాడును కట్టి దాని సహాయంతో అంబులెన్స్ను బురదలో నుంచి బయటకు తీశారు. అనంతరం రోగిని కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
● చిత్రకారులకు ఘన సత్కారం
జయపురం: స్థానిక విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్టు కళాశాలలో రథాయాత్ర సందర్భంగా నిర్వహించిన ధారుదేవత చిత్రాల వర్క్షాపుల్లో పాల్గొని జగన్నాథుని వివిధ రూపాలతో విద్యార్థులు వేసిన చిత్రలను సిమ్మాద్రి మహారాణ కళా భవనంలో బుధవారం ప్రదర్శించారు. ఈ చిత్రాలతో పాటు డాక్టర్ పరేష్ రథ్ ప్రదర్శించిన జయపురం చారిత్రిక చిత్రాల ప్రదర్శన కూడా ఈ భవనంలోనే జరుగుతోంది. ఈ ప్రదర్శనలో ధారు దేవతపై 40 చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర కారులైన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాహిణీపతి ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ ప్రదర్శన ఈ నెల ఐదో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ఝుధిష్టర్ మల్లిక తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్ర కళలో విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఒడిశాలో ప్రథమ శ్రీవిక్రమ అర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలను ఇంకా అభివృద్ధి చేయాలని.. అందుకు తాను చేయూతనిస్తానని అన్నారు. కార్యక్రమంలో కొరాపుట్ భారతీయ జాతీయ కళా సాంస్కృతిక చారిత్రిక ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రఫుల్ల చంద్ర మహారాణ, కొరాపుట్ కోట్స్ (కౌన్సిల్ ఆఫ్ అనాలిటికల్ ట్రైబుల్ స్టడీష్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరేష్ రథ్ పాల్గొన్నారు. అతిథులకు ధారుదేవత చిత్రాలను నిర్వాహకులు అందజేశారు. -
● క్రిస్టియన్ మంచ్ ఆందోళన
మల్కన్గిరి: జిల్లా క్రిస్టియన్ మంచ్ తరఫున బుధవారం మల్కన్గిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గత నెల 21 వ తేదీన మల్కన్గిరి సమితి కటామాటేరు గ్రామంలో కొందరు దుండగులు 30 మందిని తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే. దీనికి నిరసనగా క్రిస్టియన్ సంఘం వారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్కు వినతిపత్రం ఇవ్వాలని వచ్చారు. కలెక్టర్ సకాలంలో రాలేదని ఆందోళనకారులును గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారులుకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. -
వైభవంగా గుహారీ సంగీత ఉత్సవం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని గుహారి జగన్నాథ భక్తి సంగీత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో గురు కేలూ చరణ్ మహాపాత్రొ ఒడిస్సీ పరిశోధనా కేంద్రం ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తుంది. స్థానిక జీకేసీఎమ్ ఒడిస్సీ పరిశోధనా కేంద్రం ప్రాంగణం రంగ స్థలం వేదికగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని భక్తి సంగీతాన్ని ఆలపిస్తారు. ముందుగా సంస్కృత పండితుడు ప్రొఫెసర్ ప్రఫుల్ల కుమార్ మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేశారు. జీకేసీఎమ్ ఒడిస్సీ పరిశోధన కేంద్రం విద్యార్థులు బృంద గానం చేశారు. తొలి రోజు ఉత్సవంలో ప్రఖ్యాత గాయకులు దుఃఖి శ్యామ్ త్రిపాఠి, సుస్మితా దాస్, లక్ష్మీకాంత పాలిత్, భాగ్యశ్రీ మహంతి, బిష్ణుమోహన్ కబీ, సంజు మహంతి వీనుల విందైన సంగీతం ఆలపించారు. మనోరంజన్ అధికారి (తబలా), సందీప్ సాహు (డ్రమ్), జబహర్ మిశ్రా (ఫ్లూట్), సముయేల్ ఖుంటియా (ఆక్టోప్యాడ్), సుబ్రత్ రౌత్రాయ్ (కీబోర్డు), అజయ్కుమార్ దాస్ (హార్మోనియం) వాద్య సహకారం అందజేశారు. డాక్టర్ మృత్యుంజయ రథ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
జయపురం కేంద్ర విద్యాలయం సందర్శన
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సమగ్ర గిరినాభివృద్ధి ఏజెన్సీ(ఐటీడీఏ) భవనంలో నిర్వహిస్తున్న జయపురం కేంద్ర విద్యాలయ తాత్కాలిక క్యాంపస్ను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ మగళవారం సాయంత్రం సందర్శించారు. జయపురంలో కొత్తగా ప్రారంభిస్తున్న కేంద్ర విద్యాలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి పాఠ్య బోధనలు జరుగనున్నందున విద్యాలయంలో తరగతి గదులను, క్యాంపస్ పరిసరాలను తదితర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జయపురం వస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్ల విద్యాలయ భవనాలకు రంగులు వేయాలని అలాగనే విద్యాలయ సైన్బోర్డు మార్చాలని సూచించారు. అనంతరం గ్లోకల్ హాస్పిటల్ ప్రాంతంలో కేంద్ర విద్యాలయం భవనాలు నిర్మించేందుకు గుర్తించబడిన 8 ఎకరాల స్థలాన్ని కలక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉన్ననట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్తోపాటు జయపురం సబ్కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం మున్సిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, ఐటీడీఏ ఇంజినీర్ చైతన్య, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలి
భువనేశ్వర్: రాష్ట్రంలో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పరిస్థితి పట్ల విద్యుత్శాఖ బాధ్యతలు వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ ప్రత్యక్షంగా చొరవ తీసుకున్నారు. ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఒడిశా పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ (ఓపీజీసీ), ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ) ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టుల్ని వేగవంతం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి గల కారణాలు, పరిస్థితులను మంత్రి పరిశీలించి సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించాలని సీనియర్ అధికారులతో చర్చించారు. ఒడిశా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, స్థిరత్వాన్ని పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఓపీజీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2‘‘660 మెగా వాట్ మూడవ దశ విస్తరణ, 50 మెగా వాట్లు సౌర విద్యుత్ ప్రాజెక్టు, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) యూనిట్, ఫ్లై యాష్ వినియోగం, ఖాళీ అయిన గనుల నిర్వహణ ప్రాజెక్టుల్ని సమీక్షించారు. ఓహెచ్ పీసీ చొరవతో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో 600 మెగా వాట్ల ఎగువ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (కలహండి), 600 మెగా వాట్ల ఎగువ కోలాబ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (కొరాపుట్), 500 మెగా వాట్ల బలిమెల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (మల్కన్గిరి), 63 మెగా వాట్ల ఖడగ్ హైడ్రో ప్రాజెక్ట్ (కంధమల్) ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
బీజేపీ నేత జగన్నాథ్ను అరెస్టు చేయాలి
భువనేశ్వర్: స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూ విధి నిర్వహణలో ఉండగా అవమానకర దాడిని ప్రేరేపించిన ప్రధాన సూత్రధారి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహఖ సభ్యుడు జగన్నాథ్ ప్రధాన్ను వెంటనే అరెస్టు చేయాలని ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం బుధవారం అందజేశారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి మల్కన్గిరి: కోరుకొండ సమితి మాటపాకా ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రోహిత్ మడ్కమి (12) అనే విద్యార్థి బ్రెయిన్ మలేరియాతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇతని స్వగ్రామం శిఖాపల్లి పంచాయతీ ఊరమగుడ. హాస్టల్లో ఉండగా జ్వరం రావడంతో మల్కన్గిరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రోహిత్ మృతిచెందాడు. సబ్ కలెక్టర్ దుర్యోధన్ పాత్రో ఈ ఘటనపై ఆరా తీశారు. ఏసీపీ ప్రకటన రాజ్యాంగ విరుద్ధం కొరాపుట్: ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లు విరగ్గొట్టాలని, అలా చేస్తే రివార్డు ఇస్తానని భువనేశ్వర్ ఏసీపీ నర్సింగ బలో వ్యాఖ్యానించడం రాజ్యంగ విరుద్ధమని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భువనేశ్వర్లో బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ దాడి చేస్తే ఎక్కడికు వెళ్లారని ప్రశ్నించారు. ఇలా దాడి చేస్తే వారి మీద 307 సెక్షన్ ఎందుకు పెట్టలేదన్నారు. పూరీ మరణాలు కనిపించవా? కొరాపుట్: పూరీ మరణాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు భక్తులు మరణించినందున ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఇదే గుజరాత్ మోడల్ పాలన అని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. ఘనంగా వనమహోత్సవం పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్లో వన మహోత్సవాలు సందర్భంగా ‘తల్లి కోసం ఒక మొక్కను నాటుదాం’అనే నినాదంతో జిల్లా స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నత పాఠశాలల పీఈటీ ఇన్చార్జి సురేంద్ర కుమార్పాత్రో ముఖ్యఅతిథిగా విచ్చేసి శిశు విద్యామందిర్ ఆవరణలో విద్యార్థులతే మొక్కలను నాటించారు. కార్యక్రమంలో సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్ కుమార్ పండా, జిల్లా వికాస్ సమితి కార్యకర్త అరుణ్కుమార్ భాగ్, కోశాధికారి ప్రమోద్ కుమార్ పాఢి, మనోజ్ కుమార్ దాస్, ప్రకాష్ చంద్ర త్రిపాఠి, సరోజ్ కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు. గొట్టా బ్యారేజీ నీరు విడుదల హిరమండలం : ఖరీఫ్లో శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. అనంతరం గొట్టా బ్యారేజీ నీటి నిల్వ, ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో ప్రవాహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులు మాట్లాడుతూ బ్యారేజీలో ప్రస్తుతం 38.1 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, వంశధార ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్లు ఎ.రవీంద్ర, ఒ.ఆనందరావు, వంశధార ఎస్ఈ స్వర్ణకుమార్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఈఈలు సీతారాంనాయుడు,శేఖర్ బాబు, డీఈఈలు బి.సరస్వతి, ధనుంజయరావు, ఏఈ పరిశుద్ధబాబు, సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు పొగిరి బుచ్చిబాబు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు టి.తిరుపతిరావు, నాయకులు పి.శ్రీధర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న అధికార వర్గం
● ముఖ్యమంత్రితో ముఖాముఖి భేటీ ● సామూహిక సెలవు హెచ్చరిక భువనేశ్వర్: రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల మధ్య దూరం పెరుగుతోంది. భువనేశ్వర్ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగా దాడి చేయడంపై ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఓఏఎస్) వర్గం తీవ్రంగా మండిపడుతుంది. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టకుంటే సామూహిక సెలవు ఆందోళనకు దిగుతామని ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్పింది. ప్రజల పట్ల, ప్రజా ప్రతినిథుల పట్ల అధికారులు దురుసు, అసభ్య ప్రవర్తనపై ఏమాత్రం సహించేది లేదని, తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖపై విపరీత ప్రభావం చూపుతుంది. జాజ్పూర్ ప్రాంతంలో ఊహాతీత అతిసార తాండవం, పూరీలో కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాట మరణాలు, బలభద్ర స్వామి మూల విరాట్ బోర్లా పడడం వంటి తీవ్ర సంచలనాత్మక సంఘటనల నుంచి కోలుకోక ముందే విధి నిర్వహణలో ఉన్న భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్పై రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం బాహాటంగా దాడి చేశారు. ఈ చర్యపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అసోసియేషన్ (ఓఏఎస్ఏ) ప్రతినిధులు రాత్రికి రాత్రి ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్, జంట నగరాల పోలీసు కమిషనరుతో అత్యవసరంగా సమావేశమయ్యారు. జరిగిన సంఘటనపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తక్షణ స్పందన ఆశిస్తున్నట్లు విన్నవించారు. తమ విన్నపంపై సత్వర చర్యలు చేపట్టకుంటే సామూహిక సెలవుతో అంతా కలిసికట్టుగా శాంతియుత ఆందోళనకు శంఖారావం చేస్తామని సున్నితంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి బుజ్జగింపు బాధిత అధికారుల వర్గం అభ్యర్థనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందించారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 3 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇతరుల కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు. చట్టం పట్ల గౌరవ భావంతో ప్రభుత్వ చట్టపరమైన చర్యలను విశ్వసించి సామూహిక సెలవులపై వెళ్లవద్దని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి బాధిత వర్గం పాక్షికంగా శాంతించింది. అయితే రాజీ కుదరలేదని ఆ వర్గం ముఖ్యమంత్రికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓఏఎస్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సామూహిక సెలవు ఆందోళనని వాయిదా వేశారు. మరో వైపు అన్ని జిల్లా ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్లు (ఓఏఎస్ఏ) మంగళవారం సమావేశమై, సంఘటనను ఖండించి, రాష్ట్ర సంఘానికి తీర్మానాలను పంపాలని అభ్యర్థించారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ చర్యల పట్ల ఐఏఎస్, ఓఎఫ్ఎస్, ఓఎస్ఎస్, ఓఆర్ఎస్ ఇతర సంఘాల సంఘీభావం ప్రకటించాయి. -
‘రాష్ట్రంలో భద్రత క్షీణిస్తోంది’
భువనేశ్వర్: రాష్ట్రంలో సాధారణ పౌరుడు మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయింది. రాష్ట్రలో భద్రత, రక్షణ పూర్తిగా క్షీణించి పోయిందని పలు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గందరగోళంగా తయారైందని, విధి నిర్వహణలో ఉన్న స్థానిక నగర పాలక సంస్థ అదనపు కమిషనర్పై పట్టపగలు బాహాటంగా మారణాంతక దాడికి పాల్పడడం ఈ విచారకర పరిస్థితిని తేటతెల్లం చేసిందని నగర మేయర్ సులోచనా దాస్ ఘాటుగా స్పందించారు. నామ మాత్రంగా ముగ్గురు నిందితుల్ని మాత్రమే అరెస్టు చేశారని, ప్రధాన సూత్రధారి ముసుగు తొలగించి తెర పైకి తేవాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఆటవిక పాలన: సోఫియా ఫిరదౌసి రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని కటక్ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌసి వ్యాఖ్యానించారు. పూరీ రథ యాత్ర తొక్కిసలాట సంఘటన, బీఎంసీ సంఘటన మాత్రమే కాదు, రాష్ట్రంలో సాధారణ శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారి అసభ్యంగా ప్రవర్తించారు: జగన్నాథ్ ప్రధాన్ భువనేశ్వర్ నగర పాలక సంస్థ దాడి సంఘటనపై భారతీయ జనతా పార్టీ నాయకుడు జగన్నాథ్ ప్రధాన్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. స్వచ్ఛ సాథీ విషయమై ఫోన్ చేసిన సందర్భంలో నువ్వు ఎవరు, నన్ను ఎందుకు అడుగుతున్నావని అసభ్యంగా ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఈ స్పందనని సోషల్ మీడియాలో తన వ్యాఖ్యని ప్రసారం చేసినట్లు తెలిపారు. విచారకర సంఘటన: బిజయ్ కుమార్ పట్నాయక్ 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఇలాంటి విచారకర సంఘటనని చవి చూడలేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. బీఎంసీ అదనపు కమిషనర్పై జరిగిన దారుణమైన దాడిని చాలా భయంకరమైన సంఘటనగా అభివర్ణించారు. -
అలరించిన భక్తి గీతాలాపన
రాయగడ: స్థానిక న్యూకాలనీ శ్రీరామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్న రథయాత్రలో భాగంగా ఆలయ మండపంలో మంగళవారం అన్నమాచార్య సంకీర్తన మండలి వారు నిర్వహించిన భక్తి గీతాలపన కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో పి.కళ్యాణి, లాడి జయలక్ష్మి, కొత్తకొట శాంతి ప్రియ, గిరీష్ పట్నాయక్ తదితరులు అన్నమాచార్య కీర్తనలు, భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.తెలుగు మహిళల విష్టు సహస్ర పారాయణం కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు మహిళలు విష్టు సహస్ర పారాయణం చేశారు. మంగళవారం సాయంత్రం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డు లో ఉన్న గుండిచా మందిరంలో పవిత్ర హిరా పంచమి సందర్భంగా సహస్ర పారాయణం పఠించారు. పట్టణానికి చెందిన తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్థ జ్యోతిర్మయి సంస్థ మహిళ సభ్యులు పారాయణం చేశారు. ఏటా హిరా పంచమి రోజున జ్యోతిర్మయి మహిళలు రథాయత్రలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 14న స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు కానున్నారు. మర్నాడు 15న కటక్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. కటక్లోని రెవెన్షా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రెవెన్షా బాలికల పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు. బీఎంసీ అధికారిపై దాడి: నాలుగో నిందితుడు అరెస్టు భువనేశ్వర్: స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి నాలుగో నిందితునిగా ధ్రువీకరించి సచికాంత్ స్వంయిని మంగళ వారం అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర మరియు దేబాషిస్ ప్రధాన్ను స్థానిక ఖారవేళ నగర్ ఠాణా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధిత అధికారి ఠాణాలో పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగిపై తీవ్రమైన దాడి, నేరపూరిత కుట్ర, కిడ్నాప్ యత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం, ఉద్దేశ్యపూర్వక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం నేరారోపణల కింద కేసులు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషను అధికారిపై దాడికి సంబంధించి దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కార్యకర్తల వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. స్థానిక కార్పొరేటర్తో సహా ఐదుగురు సభ్యులను సస్పెండ్ చేసింది. హింసాత్మక చర్యలకు పాల్పడడం దుష్ప్రవర్తనగా పేర్కొంటూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సమల్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ సస్పెండు చేసిన వారిలో కార్పొరేటర్ అపురూప్ నారాయణ్ రౌత్, రష్మి రంజన్ మహా పాత్రో, దేబాషిస్ ప్రధాన్, సచికాంత్ స్వంయి, సంజీవ్ మిశ్రా ఉన్నారు. వీరందరి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. -
విమానాశ్రయంలో మాక్ డ్రిల్
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆపత్కాల పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో విమానాశ్రయం యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ కసరత్తు నిర్వహించారు. ఆకస్మిక విపత్తు నిర్వహణలో ప్రతిస్పందన బృందాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఇలాంటి కసరత్తులు భద్రతా చర్యలను బలోపేతం చేస్తాయి. సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని దృఢపరచి సంభావ్య సంక్షోభాలకు వేగవంతమైన, ప్రభావవంతమైన ప్రతిస్పందనను నిర్ధారిస్తాయని నిర్వాహక వర్గం తెలిపింది. -
యాత్ర పనులు సమీక్షించిన ముఖ్యమంత్రి
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర అంతిమ ఘట్టం చేరువ అవుతుంది. తొలి ఘట్టంలో చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో శ్రీ గుండిచా మందిరంలో సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర (బహుడా), స్వర్ణాలంకార దర్శనం, ఒధొరొ పొణా, నీలాద్రి విజే వంటి ప్రముఖ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ జగన్నాథుని రథ యాత్రలో ఇవి అత్యంత ప్రముఖమైన ఘట్టాలు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో సేవల్లో జాప్యం, తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర యంత్రాంగం సమన్వయంతో జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పనులకు సంబంధించి మంగళవారం పూరీ సర్క్యుట్ హౌసులో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల శారదా బాలి ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట మరణాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి, ప్రఽభుత్వ ప్రముఖ కార్యదర్శి, శ్రీమందిర్ ముఖ్య నిర్వాహకుడు (సీఏఓ), రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్, అగ్నిమాపక సేవల డైరెక్టరు జనరల్ పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేయండి
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదో తేదీన చేపట్టనున్న హర్తాల్ను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శ్రామిక వర్గం, వ్యవసాయ, యువజన, విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా ప్రభుత్వలు అనుసరిస్తున్నట్టు చెప్పారు. దీనికి నిరసనగా రాష్ట్రంలో చేపట్టనున్నసమ్మెకు అన్ని ట్రేడ్ యూనియన్లు, గజపతి మోటారు వర్కర్సు కర్మచారి సంఘాలు, ఆశ, అంగన్వాడీ, మిషన్ శక్తి సాథీలు, జీవికా మిషన్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్లకిమిడిలోని దండుమాలవీఽధిలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ట్రేడ్ యూనియన్ల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గజపతి జిల్లా మోటారు కర్మచారి సంఘం, ఆశవర్కర్లు, ఉద్యానవనాల సాథీలు, పాచికా సహాయకులు, గ్రామపంచాయతీ ఉద్యోగులతో సహా మిషన్ శక్తి, జీవికా మిషన్ అధ్యక్షురాలు సస్మితా బోడోరయితో, జిల్లా కోఆర్డినేటరు నర్సింహా మాలబిశోయి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల సంపాదకులు జయంత్ దాస్ పాల్గొన్నారు. -
దళిత యువకులను హింసించిన వారిని అరెస్టు చేయాలి
పర్లాకిమిడి: గంజాం జిల్లా ధరాకోట్ గ్రామంలో ఇద్దరు దళిత యువకులు గోవులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారికి అరగుండు కొట్టి, రోడ్డుపై కూర్చోబెట్టి హింసించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత ఆదివాసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. దళిత క్రిస్టియన్లపై భజరంగ్ దళ్ నాయకులు పాశవిక చిత్రహింసలు చేసిన వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ మఝి అరెస్టు చేయాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని గజపతి జిల్లా ఆదివాసీ దళిత మంచ్ కన్వీనరు కేదార్ శోబోరో హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్కు ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆందోళనలో అమోద్ బర్దన్, శ్రీనివాస బెహారా, కడుకా శబర, చుంబ్రా శోబోరో, దళిత మహాసభ నాయకులు చైతన్య లిమ్మా పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా సువర్ణరేఖ ప్రవాహం
● పాఠశాలలకు సెలవు భువనేశ్వర్: సువర్ణ రేఖ వరదతో ఉప్పొంగుతుంది. రాజ్ఘాట్ వద్ద ప్రమాద సంకేతం దాటి నది నీటి మట్టం పెరిగింది. మంగళ వారం ఉదయం 7 గంటలు సరికి 10.83 మీటర్ల నీటి మట్టంతో సువర్ణ రేఖ పొంగి పొర్లుతోంది. భొగొరాయి మండలంలో 15 పంచాయతీలలోని 30 గ్రామాలు నీట మునిగిపోయాయి. శాంతిస్తున్న జలకా నది ప్రమాద సంకేతం దిగువన జలకా నది నీరు ప్రవహిస్తోంది. బొస్తా మండలం మథాని తీరంలో ప్రమాద సంకేతం దిగువ నీటి మట్టంతో ప్రవహిస్తోంది. బొస్తా మండలంలో 10 గ్రామాలు వరద నీట మునిగాయి. పాఠశాలలకు సెలవు బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ఈ జిల్లాల్లో మూడు ప్రధాన నదులు సువర్ణ రేఖ, బుఢాబలంగ్, జలకాలో వరద నీరు ఉప్పొంగుతోంది. బుఢాబలంగ్ నదిలో వరద ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం ఈ నది నీటి మట్టం 7.20 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వరద ముప్పు దృష్ట్యా రెండు జిల్లాల జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తరలింపుతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించాలని జల వనరుల శాఖ ఆదేశించింది. మయూర్భంజ్ జిల్లాలో మెరుపులు, ఉరుములతో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని దృష్ట్యా మయూర్భంజ్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు 3 రోజుల పాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ హేమకాంత్ సాయి ఆదేశించారు. -
హోరెత్తుతున్న నిరసనలు
భువనేశ్వర్: స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ అదనపు కమిషనర్పై అమానుష దాడి పట్ల సిబ్బంది తీవ్ర నిరసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యని వ్యతిరేకిస్తూ మంగళ వారం బీఎంసీ కార్యాలయలంలో అధికారులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకి నడుం బిగించారు. బొలంగీర్లో ఓఏఎస్ రాతకోతలు విరమణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఓఏఎస్ అధికారిపై దాడికి నిరసనగా బొలంగీర్ జిల్లాలో ఓఏఎస్ అధికారులు రాతకోత కార్యకలాపాలు విరమించి శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నారు. బొలంగీర్ సర్క్యుట్ హౌస్లో ఈ అధికారులు అంతా సమావేశమై తదుపరి కార్యాచరణ కోసం వ్యూహాత్మక కార్యాచరణ రూపొందిస్తున్నారు. కటక్ నగరంలో పరిస్థితి మరింత వాడివేడిగా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఓఏఎస్, ఓఆర్ఎస్ అధికారులు సామూహిక సెలవు ఆందోళనకు దిగారు. నిందితుల్ని కఠినంగా శిక్షించేంత వరకు సెలవులో ఉంటామని హెచ్చరించారు. కటక్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శివ్ టొప్పో ఈ మేరకు సమాచారం ఇచ్చారు. -
గర్భిణికి ప్రసవ కష్టాలు!
● బురద రోడ్డులో నడిచి ఆస్పత్రికి వెళ్లిన వైనం జయపురం: నిండు గర్భిణికి ప్రసవ కష్టాలు వెంటాడాయి. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో అంబులెన్స్ గ్రామం వరకూ రాలేని పరిస్థితి నెలకుంది. దీంతో బురదలోనే కిలోమీటర్ నడుచుకుంటూ.. అక్కడ నుంచి ఆస్పత్రికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి మఠపడ పంచాయితీ డెంగాపకన గ్రామానికి చెందిన పవిత్ర కండకిభార్య గోరి కండకి నిండు గర్భిణి. ఆమెకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు మొదలు కావటంతో ఆమె భర్త అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ గ్రామానికి బయలుదేరినప్పటికీ రోడ్డు బురదతో ఉండడంతో ముందుకు కదల్లేదు. గర్భిణి గోరి నొప్పులు తాళలేక పోవటంతో గత్యంతరం లేక ఆమెను పట్టుకొని బురద మార్గంలో దాదాపు కిలోమీటర్ దూరంలో నిలిచి ఉన్న అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి అంబులెన్స్లో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆస్పత్రికి చేరిన తరువాత ప్రసవించిందని.. ఒక వేళ మార్గంలో ప్రసవిస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి పక్కా రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. -
ముఖ్యమంత్రిని కలిసిన పాత్రికేయ ప్రతినిధులు
భువనేశ్వర్: ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ మీడియా ప్రతినిధులు లోక్ సేవా భవన్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిశారు. ఈ సందర్బంగా రథ యాత్ర సమయంలో తాము ఎదుర్కొన్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ భువనేశ్వరులో గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులను ప్రతి సంవత్సరం పూరీకి తీసుకెళ్లి రథ యాత్రను కవరు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది యాత్ర కవరేజి కార్యకలాపాల్లో మీడియా ప్రతినిధులు పూరీలో వివిధ సమస్యలను ఎదుర్కొన్నారని ఈ బృందం ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించింది. ఈ విషయంపై చర్చించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ చర్చలో సీనియర్ పాత్రికేయులు సనత్ మిశ్రా, ప్రద్యుమ్న కుమార్ మహంతి, భగవత్ త్రిపాఠి, పవిత్ర మోహన్ సామంతరాయ్, పార్థ సారథి జెనా, కిషోర్ మంగరాజ్, దేబకాంత్ మహపాత్రో, స్వరూప్ కుమార్ మహంతి, గజేంద్రనాథ్ బెహెరా, సనాతన్ దొలొబెహెరా, సుబోధ్ కనుంగో, సూర్యకాంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో మునిగి ఇద్దరు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి నిలిగూడ గ్రామానికి చెందిన ఇద్దరు కాలువలో మునిగి మృతి చెందారు. నిలిగూడ గ్రామానికి చెందిన లవ్ డేరా(40), శుక్ర ఫటకా(35) సోమవారం ఉదయం పొలం పని కోసం కాలువ దాటి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో కాలువ దాటుతూ నీటిలో మునిగిపోయారు. చీకటి పడినా వారు ఇళ్లకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఓ మృతదేహం కాలువలో కనిపించడంతో రైతులు మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. మత్తిలి ఐఐసి దేవి ప్రియదర్శిని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి కాలువలో వెతికించగా మొదట మహిళ మృతదేహం దొరికింది. మరికొంత దూరంలో రాళ్ల మధ్యన పురుషుడి మృతదేహం కనిపించింది. మృతదేహాలను మత్తిలి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. పోలీసులు ప్రమాదకర మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
మంత్రి పరామర్శ
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథయాత్రలో పూరీ శారదా బాలి ప్రాంతం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుడు ప్రేమకాంత్ మహంతి కుటుంబాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏడాదిగా కార్మికుల ఆందోళన కొరాపుట్/జయపురం: జయపూర్లోని సేవా పేపర్ మిల్లు కార్మికులు చేపడుతున్న ఆందోళనకు ఏడాది పూర్తయ్యింది. దీంతో గగనాపూర్లో మిల్ ప్రధాన ద్వారం ముందు భారీ వర్షంలో మంగళవారం కార్మికులు నిరసన తెలిపారు. 2024 జులై 1వ తేదీ నుంచి ఆందోళన చేపడుతున్నట్లు కార్మిక నాయకుడు ప్రమోద్ మహంతి ప్రకటించాడు. అయినా ఇంతవరకు 2018 నుంచి రావాల్సిన వేతన బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా మూసి ఉన్న పరిశ్రమని నమ్ముకొని ఉన్న కార్మికుల దుస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. ఈ పరిశ్రమని ఎవరు అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో నాలుగు సార్లు పరిశ్రమ అమ్మకానికి గురైందన్నారు. పరిశ్రమ నడపడానికి వివిధ సమయాల్లో రూ.250 కోట్లు తీసుకున్నారు గానీ, కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికుల చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. నాటుసారాతో ఇద్దరు అరెస్టు జయపురం: చట్ట వ్యతిరేకంగా నాటుసారాను అమ్మేందుకు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు జయపురం ఎకై ్సజ్ అధికారి బలరాం దాస్ తెలిపారు. అరైస్టెనవారిలో జయపురం సమితి నీలాగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ నాయిక్, సునాధర కమరలు ఉన్నారు. లక్ష్మణ్ వద్ద ఒక మోటారు బైక్ను కూడా స్వాధీనపరచుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచామని, కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో జైలుకు తరలించామన్నారు. -
కుంభిగుడ, టికిరపడలో ఏనుగుల బీభత్సం
రాయగడ: రాయగడకు సమీపంలో గల కుంభిగుడ, కల్యాణసింగుపూర్ సమితి పరిధిలోని టికిరపడ గ్రామాల్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. కుంభిగుడలో గల రైతు దూడల శ్రీనివాస్ ఫార్మ్హౌస్లో ఉన్న నీటి సరఫరా పరికరాలు పీకి పారేశాయి. అదేవిధంగా పక్కనే గల అరటి చెట్లను నేలమట్టం చేశాయి. టికిరపడలో కొండ ప్రాంతంలో నివసిస్తున్న కేశవ కృషిక, జుమూర్ కుట్రుకలకు చెందిన రెండు ఇళ్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ప్రాణభయంతో రెండు కుటుంబాలకు చెందిన 8 మంది అడవుల గుండా పరుగులు తీశారు. ఇళ్లలోకి చొరబడిన ఏనుగుల గుంపు ఇంటిలో దాచి ఉంచిన బియ్యం, చోలు, జొన్నలు, కందులు తదితర వస్తువులను చెల్లాచెదురు చేశాయి. మంగళవారం రాత్రి దాదాపు 24 ఏనుగులు ఒక్క సారిగా తమ ఇళ్లపై దాడి చేసినట్లు కేశవ తెలియజేశారు. గత కొద్ది రొజులుగా కళ్యాణ సింగుపూర్, కొలనార, రాయగడ తదితర సమితుల్లో ఏనుగుల సంచారం ఎక్కువవుతుండటంతో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బితుకుబితుకుమంటూ జీవిస్తున్నారు. -
శ్రావణ మాస భోల్ భం ఏర్పాట్లు పరిశీలన
కొరాపుట్: శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు భోల్ భం యాత్రకు తరలి రానున్న నేపథ్యంలో అందుకుతగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు కాలి నడకన భోల్భం యాత్ర చేస్తూ గుప్తేశ్వరం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరం క్షేత్రాన్ని కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. బోయిపరిగుడ సమితి రామగిరి పంచాయతీలోని దండకారణ్యంలో ఉన్న ఈ క్షేత్రానికి తరలి వెళ్లారు. అక్కడ కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఆర్డీ విభాగ రహదారులు, నడక మార్గాలు, కాటేజీలు, భవనాలు పరిశీలించారు. శబరి నది వద్ద భక్తులకు అందాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. ముందస్తు సమాచారం లేకుండానే భారీ వర్షంలో కలెక్టర్ రావడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. స్వయంగా గొడుగు వేసుకొని అరణ్య ప్రాంత నిర్మాణాల పురోగతిని కలెక్టర్ తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్య రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. గుప్తేశ్వరం క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ -
పురుగుల మందు తాగి మహిళ మృతి
మల్కన్గిరి: జిల్లాలోని పోడియా సమితి నీలిగూడ పంచాయతీ ధర్మపల్లి గ్రామంలో కాళి మడ్కమి (38) అనే మహిళ పురుగుల మందు తాగి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. కాళి గత కొన్ని నెలలుగా మానసిక స్థిరత్వం కోల్పోయి గ్రామంలో తిరుగుతోంది. పొలం కోసం తెచ్చిన పురుగుల మందును ఇంటి వద్ద ఒకచోట కుటుంబ సభ్యులు దాచారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మందును తాగిపడిపోయింది. అనంతరం గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ధర్మాపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. దీంతో వెంటనే మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కాళి మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోడియా ఏఎస్ఐ కేశవబత్రా మల్కన్గిరి వచ్చి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కూల్చివేతలు సరికాదు
● వందేళ్లుగా జొరిగాంలో నివాసముంటున్నాం ● కలెక్టర్కు వందలాది మంది ప్రజల విజ్ఞప్తికొరాపుట్: వందేళ్ల నుంచి తాము నివసిస్తున్న గ్రామంలో పట్టాలేని నివాసాలను కూల్చివేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదని నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి కేంద్రం ప్రజలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్కు తరలివచ్చి కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకు వినతిపత్రం అందజేశారు. ఇలా కూలుస్తూపోతే గ్రామంలో ఏ ఒక్క నివాసం కూడా ఉండదని పేర్కొన్నారు. తమకు ఇన్నేళ్లలో ఏనాడు అధికారులు నోటీసులు ఇవ్వడం గానీ, రావడం గానీ జరగలేదన్నారు. ఇప్పుడు హఠాత్తుగా చర్యలు చేపడతామంటున్నారని గిరిజనులు పేర్కొన్నారు. ఇదే సమయంలో గిరిజనులను తోడ్కోని వచ్చిన మాజీ ఎంపీ రమేష్ మజ్జి మాట్లాడుతూ ఇలా కూలుస్తూపోతే అనేక గ్రామాలు శ్మశానాల్లా మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా అక్కడి అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్నారని, ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ ఇలాంటి సమస్య జొరిగాంతో పాటు ఉమ్మర్కోట్, రాయిఘర్ సమితుల్లో ఉందన్నారు. అడవిని నమ్ముకొని గిరిజనులు జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూముల కోసమే గతంలో రాయిఘర్లో దళిత్ సమాజ్ ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అటవీ ప్రాంతంలో గిరిజనుల నివాసాలు కూల్చితే సమస్య ఇంకా పెరుగుతుంది కానీ పరిష్కారమవ్వదని పేర్కొన్నారు. -
● గుండిచా మందిరం మెరిసేలా..
జయపురం: జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతా మూర్తులు రథాయాత్ర సందర్భంగా జయపురంలోని గుండిచా మందిరం (బంకమఠం)లో విడిది చేసి ఉన్న దేవతా మూర్తులను తిలకించి పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం లోపించకుండా గుండిచా మందిర ప్రాగణాన్ని జమాల్ లైన్ శ్రీరామ కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు నేతృత్వంలో మందిర పరిసరాలను కమిటీ సభ్యులు, గుండిచా మందిరాన్ని తుడిచి, కడిగి పరిశుభ్ర పరుస్తున్నారు. రథాయాత్ర సమయంలో జమాల్ లైన్ శ్రీరామ మందిర పరిశీలన కమిటీ సభ్యులు గుండిచా మందిరం ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్నట్టు నాగరాజు వెల్లడించారు. ఆదివారం నుంచి రోజూ ఉదయం ఆరు గంటలకు శ్రీరామ మందిర పరిశీలన కమిటీ సభ్యులు వచ్చి గుండిచా మందిర పరిసరాలన చీపుర్లతో తుడుస్తూ వ్యర్ధ పధార్ధాలను తొలగించి వాటిని పారవేసున్నట్లు వెల్లడించారు. ఈ నెల ఐదో తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కాగా శ్రీరామ మందిర కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను భక్తులు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. పనులను పూజారి గన్నవరపు కోటేశ్వరశర్మ పర్యవేక్షిస్తున్నారు. అభినందనలు అందుకుంటున్న శ్రీరామ మందిర కమిటీ సభ్యులు -
వైద్య శిబిరానికి విశేష స్పందన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియా జాంత్రీ పంచాయతీలో సోమ వారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ఆస్పత్రి మెడిషన్ స్పెషలిస్ట్ కృష్ణచంద్ర మహపాత్రో నేతృత్వంలో 15 మంది వైద్యశాఖ సిబ్బంది 200 మందికి వైద్య సేవలు అందించారు. 15 మందికి మలేరియా పాజిటీవ్ వచ్చింది. మరికొంత మందికి సాధారణ జ్వరం, వృద్ధులుకు ఈసీజీ తీసి మందు లు అందించారు. బీపీ ఉన్నవారికి మందులు ఇచ్చా రు. కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేశారు. ఇదే తొలిసారి.. చిత్రకొండ సమితిలో దూర్గాం ప్రాంతం ఒకప్పుడు మావోలు అడ్డాగా ఉండేది. జాంత్రీ పంచాయతీకి మావోల భయంతో అప్పటి ప్రభుత్వం రహదారి కూడా నిర్మించలేదు. ఈ పంచాయతీకి వెళ్లాలంటే లాంచీలే శరణ్యం. 4 గంటల పాటు చిత్రకొండ ఫిల్ బాయి నుంచి లాంచీలో ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో మలేరియా టెస్టులు చేసి ఉచితంగా మందు లు పంపిణీ చేశారు. జాంత్రీ పంచాయతీలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి మందులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ప్రాంతంలో ఏవరికై నా జబ్బు చేస్తే జాన్బాయి వెళ్లి అక్కడ ఆరోగ్య కేంద్రంలో ఇచ్చిన మందులు తప్ప.. గిరిజన ప్రజలకు బయట ప్రపంచం తెలియదు. మావద్దకు వచ్చి వైద్యులు మందులు ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. మల్కన్ గిరి ప్రభుత్వ ఆస్పత్రి సీనియర్ వైద్యులు నారాయణ్ పాత్రో, దేవశిష్ పండా, ఐసీయూ సిబ్బంది పద్మావతి జేనా, నర్సింగ్ అధికారి రష్మరేఖా పరిడా, సంగీత నాయక్, దీపికా దాస్, ఐశ్వర్య స్యాయ్, ఆరోగ్య కార్యకర్తలు శంకర్ పాల్, మహిమా దాస్, బసంత్ రాయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రైలు ప్రయాణం చార్జీలు పెంపు
భువనేశ్వర్: భారతీయ రైల్వే శాఖ ప్రయాణం చార్జీలు పెంచింది. జూలై ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త చార్జీలు అమలవుతాయని స్పష్టం చేసింది. ద్రవ్య సేవా పన్ను (జీఎస్టీ), రిజర్వేషన్, సూపర్ఫాస్ట్ సర్చార్జీలు వంటి అనుబంధ చార్జీల్లో మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది. చార్జీల తాజా పెంపు ఉత్తర్వుల ప్రకారం సబర్బన్ సింగిల్ జర్నీ చార్జీలు, సీజన్ టిక్కెట్ల (సబర్బన్, నాన్–సబర్బన్ మార్గాలకు) చార్జీల్లో మార్పు లేదు. సాధారణ తరగతిలో 500 కిలో మీటర్ల వరకు ప్రయాణ చార్జీలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుంది. 501 నుంచి 1500 కిలో మీటర్ల వరకు ప్రయాణానికి రూ. 5, 2,500 కిలో మీటర్ల వరకు రూ. 10, 2,501 నుండి 3,000 కిలోమీటర్ల ప్రయా ణం చార్జీని రూ.15 పెంచారు. హర్యానారాష్ట్ర మహిళపై లైంగిక దాడి జయపురం: పొట్టకూటి కోసం.. కష్టపడి జీవించేందుకు హర్యాన రాష్ట్రం నుంచి జయపురం వచ్చిన ఒక మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్ప డ్డాడు. బాధిత మహిళ జయపురం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పట్టణంలో ఒక వ్యాపారి అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మహిళా పోలీసు అధికారి అంకిత ఖాల్కో వెల్లడించారు. పోలీసుల వివరణ ప్రకారం.. ఈ ఘటన జూన్ 28వ తేదీ రాత్రి జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన.. ● 16 గ్రామాలకు రాకపోకలు బంద్ కొరాపుట్: భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి ఉమ్వెల్ గ్రామ పంచాయతీకి సిమిలిగుడ సమితి రాజుపట్ గ్రామ పంచాయతీలను కలిపే వంతెన సోమవారం కొట్టుకుపోయింది. ఈ రెండు పంచాయతీలలో చెరో ఎని మిదేసి గ్రామాలు కలసి కొలాబ్ రిజర్వాయర్లో వెదురు వంతెన నిర్మించుకొని రాక పొకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంతెన కూలిపోవడంతో సిమిలిగుడ సమితి కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ వంతెన కోసం దశాబ్దాలుగా ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా వంతెన నిర్మాణం జరగలేదు. దీంతో గిరిజనులే వెదు రు వంతెన నిర్మించుకుంటే అదీ కూలిపోయింది. -
వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి బోమ్మిగ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాయింట్ గ్రీవెన్స్ సెల్ సోమవారం జరిగింది. ఈ గ్రీవెన్స్కు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, సబ్ కలెక్టర్ అనుప్ పండా హాజరయ్యారు. బొమ్మిక పంచాయతీలో మధుసూదన్పూ ర్, కంట్రగడ, మచ్చుమర గ్రామాల నుంచి మొత్తంగా 54 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 15, గ్రామ సమస్యలకు సంబంధించినవి 39 అందాయి. వాటిని త్వరితగతంగా పరిష్కరించాలని జి ల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్ నారాయణ బెహరా, గుసాని బీడీఓ గౌరచంద్ర పట్నాయక్, సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.అలీ, డి. ఎస్.ఎస్.ఓ సంతోష్కుమార్ నాయక్ పాల్గొన్నారు. చిత్రకొండ సమితిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించి 48 వినతులు స్వీకరించారు. చిత్రకొండ పరిసర పంచాయతీలకు చెందిన వారు వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హా మీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర సభోరో, చిత్రకొండ సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పట్టణ సమస్యలపై అధికారులకు వినతి
జయపురం: జయపురం ప్రజల సమస్యలతో పాటు ఇతర సామాజిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని జయపురం సిటిజన్ కమిటీ తీర్మానించింది. స్థానిక సిటిజన్ కమిటీ భవనంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పట్టణ సమస్యలపై సుధీర్ఘంగా చర్చించింది. పట్టణంలో గల డ్రైనేజ్ సిస్టమ్ను స్వరేజ్ డ్రైన్ సిస్టంలో మమేకం చేయాలని, పోస్టల్ కార్యాలయాన్ని పునః ప్రారంభించాలని, పట్టణంలో రైల్వే టిక్కట్లు అమ్మే కౌంటర్ ఏర్పాటు, సర్దార్ పటేల్ మార్గంలో (మైన్ రోడ్డు)లోమహిళల కోసం ఆధునిక శైచాలయం ఏర్పాటు చేయాలని, సీనియ ర్ సిటిజనులకు గురింపు కార్డులు సమకూర్చాలని, పట్టణంలో భూమి రికార్డు కార్యాలయం ఏర్పాటు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మున్సిపాలిటీ వారిచే జనన, మరణ ధ్రువ పత్రాలు సమకూర్చే ఏర్పాటు చేయాలని, పట్టణ రెండవ మార్కెట్ పూర్తి స్థాయి లో నిర్వహించాలని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని, ఆల్ట్రా సౌండ్ సౌకర్యం అందరు రోగులకు కల్పించాలని లిఖిత పూర్వకంగా డిమాండ్ చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో సిటిజన్ కమిటీ అధ్యక్షులు బినోదిణీ శాంతపాత్ర, కార్యదర్శి జి.వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు మదన మోహననాయిక్, సలహాదా రు సత్య భాను పండ, కార్యవర్గ సభ్యులు భీమ సేన్ అగర్వాల్, దేవేంధ్ర బాహిణీపతి, పి.మహేశ్వరరా వు, పరమేశ్వర పాత్రో, రత్నాకర చౌధురి, జి.బి.రావు, భవానీ ఆచార్య, గీతా ప్రకాశ మిశ్ర, నరసించౌదురి పాల్గొన్నారు. -
వాటర్షెడ్ జాయింట్ డైరెక్టర్పై విజిలెన్స్ దాడి
కొరాపుట్: వాటర్ షెడ్ జాయింట్ డైరెక్టర్ దయానిధి బాగ్ ఆస్తుల లక్ష్యంగా విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించింది. సోమవారం ఉదయం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల ఏక కాలంగా ఈ దాడులు ప్రారంభమయ్యాయి. వాటర్ షెడ్ విభాగంలో రాయగడ జిల్లాలో, రాష్ట్ర సోషల్ కన్జర్వేషన్ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. విధి నిర్వహణలో అనేక అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కలహండి జిల్లా భవాని పట్న విజిలెన్స్ కోర్టు ప్రత్యేక జడ్జి ఈ దాడులకు సెర్చ్ వారెంట్లు జారీ చేశారు. నిందితుని స్వస్థలం కలహండి జిల్లా జునాగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పుగాంలో, ఇదే జిల్లా ధర్మగఢ్ లో విక్రం గుడలోని అల్లుడు నివాసంలో, భువనేశ్వర్లోని గోతపట్న లోని మహానది అపార్ట్మెంట్లో, భువనేశ్వర్లోని చంద్ర శేఖర్ పూర్లోని సొంత ఇంటిలో, భువనేశ్వర్లోని వాటర్షెడ్ కార్యాలయ చాంబర్లో, నబరంగ్పూర్ జిల్లా మజ్జిగుడలో నిర్మితం అవుతున్న భవనంలో, నబరంగ్పూర్ జిల్లా చుటియా గుడలో భార్య పేరు మీద ఉన్న 2 భవనాల్లో దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 10 మంది డీఎస్పీలు, 8 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఏఎస్ఐలు పాల్గొన్నారు. -
60 కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు అరెస్టు మల్కన్గిరి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు పోలీసులకు చిక్కారు. వీరివద్ద నుంచి సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో పూజారిగూఢ గ్రామ సమీపంలో బలిమెల పోలీసులు ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేసిన వ్యక్తులు రెండు బైక్ల్లో రెండు బ్యాగ్ల్లో ఉంచి అక్రమంగా జయపురం తరలిస్తున్నారు. బలిమెల పోలీసులకు అందిన సమాచారంతో ఐఐసీ దీరాజ్ పట్నాయక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనాలపై వస్తున్న వారిని తనిఖీ చేయగా.. బ్యాగ్లో ఉన్న 60 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో ఇద్దరిని వెంటనే అరెస్టు చేశారు. పట్టుబడిన యువకులను కోరుకొండ సమితి ముదిలిగూఢ గ్రామానికి చెందిన తార గోలారీ, నాధ్ హంతాల్గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. సుమారు మూడు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్లు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. -
బీఎంసీ కమిషనర్పై దాడి
భువనేశ్వర్: స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్పై అమానుష దాడి దిగ్భ్రాంతిని కలిగించింది. సోమవారం కార్యాలయంలో ప్రజాభియోగాల విచారణ కొనసాగుతున్న తరుణంలో స్థానిక 6వ నంబరు వార్డు కార్పొరేట రు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో అపరిచిత వ్యక్తులు విధి నిర్వహణలో ఉన్న అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై అకస్మాత్తుగా దాడికి దిగారు. అపరిచిత వ్యక్తులతో కలిసి వార్డు కార్పొరేటరు ప్రజాభియోగాల విచారణ నిర్వహిస్తున్న అధికారిని ఈడ్చుకుంటూపోయి కాలితో తన్ని ఘోరంగా అవమానపరిచారు. ఈ సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనికి అపరిచిత వ్యక్తులతో చొరబడి కార్పొరేటరు వ్యూహాత్మకంగా అధికారిని అవమానపరిచే రీతిలో ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. ఈ చర్యపై నిరసనతో బీఎంసీ సిబ్బంది, కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. నిందితుల వ్యతిరేకంగా చర్యలు చేపట్టేంత వరకు నిరసన నిరవధికంగా కొనసాగుతుందని హెచ్చరించారు. బీఎంసీ కార్యాలయం ఎదురుగా నడి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ప్రధాన మార్గంలో వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో మేయరు, పలువురు బీజేడీ ఎమ్మెల్యేలు, ముందంజ కార్యకర్తల్ని పోలీసులు వ్యానులో తరలించారు. నిందితులు అరెస్టు విధి నిర్వహణలో ఉన్న నగర పాలక సంస్థ అదనపు కమిషనరుపై దాడికి పాల్పడిన ఆరోపణ కింద 3 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో 6వ నంబరు వార్డు కార్పొరేటరు ఉన్నాడు. అరెస్టు చేసిన వారిలో జీవన్ రౌత్, రస్మి మహాపాత్రొ మరియు దేబాశిష్ ప్రధాన్ ఉన్నట్లు స్థానిక ఖారవేళ నగర్ ఠాణా పోలీసులు తెలిపారు. -
కుంభేయిగుడలో ఏనుగుల సంచారం
రాయగడ: రాయగడ అటవీ రేంజ్ పరిధిలోని కుంభేయిగుడ ప్రాంతంలో మూడు గున్న ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాటి సంరక్షణకు సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ నిలిపివేసింది. విద్యుత్ ఘాతానికి గురైతే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న ముందస్తు చర్యలతొ అధికారుల ఆదేశానుసారం ఆయా ప్రాంతంలో విద్యుత్ సరఫరాను గత రెండు రోజులుగా నిలిపివేశారు. అయితే సమీపంలో గల గ్రామంలో విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ అటవీ ప్రాంతం వైపు గల విద్యుత్ తీగలకు సంబంధించి సరఫరాను నిలిపివేశారు. అటవీ రేంజ్ పరిధిలో గల పొంగిలి, సూరి, ఫకిరీ, కుంభేయిగుడ, తొటాగుడ, ఖమాసింగి అదేవిధంగా బొడొఖిల్లాపదర్ పంచాయతీలొని అరబి, ఖరగడి, సన గుమడ, బొడొగుమడ తదితర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆది, సొమవారాల్లో ఆయా ప్రాంతాల్లొ పర్యటించిన అటవీ శాఖ అధికారులు ఏనుగుల నడక గుర్తులను గుర్తించారు. ఒక ఆడ ఏనుగు, ఒక మగ ఏనుగుతో పాటు మరో చిన్న ఏనుగు పిల్ల ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఏనుగుల సంచారానికి సంబంధించి గ్రామస్తులను చైతన్య పరిస్తున్న అధికారులు వాటి నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు గురించి వివరించారు. -
రాయగడలో విజృంభిస్తున్న అతిసారం
రాయగడ: జిల్లాలో అతిసారం వ్యాధి చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొలనార సమితి సూరి, కూలి, పెంట, రాయగడ సమీపంలో గల పితామహల్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడిన రోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ 8 మంది వరకు అతిసారం వ్యాధితో వార్డుల్లో చేరుతున్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అందాక ఇంటికి వెళ్లిపోతున్నారని జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ మిశ్రో తెలిపారు. తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు వివరించారు. 140 మందికి ఉచిత వైద్య పరీక్షలు జయపురం: దక్షిణ ఆయుర్వేద వికాస పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఏక్టివ్ లైఫ్ ఫిజియోథెరిఫీ కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వర్గీయ మీన కేతన పండ స్మృతి కమిటీ సహకారంతో నిర్వహించిన శిబిరంలో డాక్టర్లు సుదర్శణ గౌఢ, బినోద్ బిహారి రథ్, ప్రశాంత్ కుమార్ ప్రధాన్, మనోజ్ కుమార్ ప్రధాన్ రోగులకు వైద్య పరీక్షలు జరిపారు. రోగులకు అవసమైన ఆయుర్వేద మందులు ఉచితంగా ఇచ్చి వాటిని వాడే విధానాన్ని వివరించారు. శిబిరంలో 140 మంది రోగులకు వైద్యపరీక్షలు జరిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కవిరాజ్ క్షేత్రవాసీ పండ, భవానీచరణ ఆచార్య, సత్యనారాయణ పరిచ, శ్రీనివాస పాత్రో, కాళీచరణ మహరాణ, రాజేంద్ర జెన, రంజన్ కుమార్ గౌడ్, డాక్టర్ శ్రీనివాస పాత్రో సహకరించారు. ఆయుర్వేద వైద్యులు పమేశ్వర పాత్రో ధన్యవాదాలు తెలియజేశారు. జెడ్పీ చైర్పర్సన్కు తీవ్ర అస్వస్థత ● మెడికల్ కళాశాలలో చేరిక కొరాపుట్: కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడల్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం రఘురాం మీడియాతో మాట్లాడుతూ.. సస్మితా మెలకపొట్టలో కణితి వంటి రాయి ఏర్పడిందన్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారని రఘురాం పేర్కొన్నారు. జనం చెంతకు జగన్నాథుడు పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో సోమవారం నృసింహా, వరాహ అవతారంలో జగన్నాథ, బలరాముడు భక్తులకు దర్శనం ఇచ్చారు. గుండిచా వెలుపల భక్తులు స్వామి వారి ఓబడా ప్రసాదాన్ని స్వీకరించేందుకు బారులు తీరారు. మంగళవారం గుండిచా మందిరంలో హిరా పంచమి వేడుక జరుగనుంది. భక్తులకు దర్శనం.. జయపురం: జయపురం గుండిచా మందిరంలో ఆదివారం రాత్రి జగన్నాఽథుడు, బలభద్ర దేవతా మూర్తులు మత్స్య, కశ్యప అవతారాల లో భక్తులకు దర్శనమిచ్చారు. అవతార మూ ర్తులను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. జయపురంలో ఒక రోజు ఆలస్యంగా రథయా త్ర ప్రాంభం కావటం వలన రెండు అవతారా ల్లో దేవతా మూర్తులు ఒకే రోజు భక్తులకు దర్శనమిచ్చారు. -
పంచాయతీ కార్యాలయానికి తాళాలు
కొరాపుట్: సెల్ ఫోన్ నెట్వర్క్ సమస్యతో విసిగిపోయిన గిరిజనులు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలియజేశారు. కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి కుడి పంచాయతీ ప్రజలకు సెల్ఫోన్ సిగ్నల్ సమస్య వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తమకు తెలియకుండా పోయిందంటు ప్రజలందరూ సోమవారం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నినసన తెలియజేసి తాళం వేసి నిరస న వ్యక్తం చేశారు. ఈ సమయంలో కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీ రాణి, వార్డు సభ్యులు ఉన్నారు. సిగ్న ల్ సమస్యను తాము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గిరిజనులతో చర్చలు జరిపారు. -
హెచ్ఎంను బదిలీ చేయాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి గడ్డిశెశిఖాల్ పంచాయతీలొని మండలపితేసు గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలను బదిలీ చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేసారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ హెచ్ఎంతోపాటు మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఉన్న ఒక ఉపాధ్యాయురాలు కూడా అప్పుడప్పుడు విధులకు హాజరవుతుండడంతో తమ పిల్లలు పాఠాలు నేర్చేందుకు కష్టతరమవుతుందని.. ఇదే కొనసాగితే పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వారంతా అన్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంను బదిలీ చేస్తే పాఠశాలలో చదువులు మెరుగుపడతాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. యాత్ర కోసం వెళ్లిన యువకుడు శవమయ్యాడు! రాయగడ: జగన్నాథ రథయాత్ర చూసేందుకు వెళ్లిన యువకుు శవమై దర్శనమించారు. జిల్లా లోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గి సమీపంలోని మామిడి తోటలో యువకుని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు డుమునిలి పంచాయతీ లొట్టగుడ గ్రామానికి చెందిన జొగులు కలక కుమారుడు పింటూ కలక (21)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాల్లోకి వెళితే.. జూన్ 27వ తేదీన జగన్నాథ రథాయత్ర చూసేందుకు పింటు బిసంకటక్ వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే యాత్ర ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంటికి తిరిగి రాకపొవడంతో బిసంకటక్ పోలీస్ స్టేషన్లో పింటు తండ్రి జోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం డుమునిలి –దుర్గి సమీపంలో దుర్గంధం వెదజల్లడంతో అటువైపుగా వెళుతున్న కొందరు మామిడితోటలోకి వెళ్లి చూడగా.. యువకుడు ఉరివేసుకుని చనిపోయి ఉండటాన్న చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం పింటుదిగా గుర్తించి వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న గ్రామస్తులు -
కూర్మావతారంలో జగన్నాథుడి దర్శనం
రాయగడ: స్థానిక గుండిచా మందిరంలో కొలువుదీరి పూజలందుకుంటున్న జగన్నాథుడు సోమవారం కూర్మావతారంలొ భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారి దర్శనభాగ్యం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. జిల్లాలోని బిసంకటక్లో కూడా జగన్నాథ రథాయాత్ర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గుండిచా మందిరంలో స్వామి వారు చెల్లెళ్లు శుభద్ర, సొదరుడు అగ్రజుడు బలభద్రుని సమీతంగా కూర్మావతారంలో దర్శనం ఇచ్చారు. అలాగే స్వామివారి అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. స్థానిక గుండిచా మందిరంలో అన్నభోగం కోసం 60 రూపాయల టిక్కెట్టు ధరను నిర్ణయించిన నిర్వాహకులు ఆవిధంగా అన్నభోగాలను విక్రయిస్తున్నారు. అయితే గంటల తరబడి భోగం కోసం పడికాపులు పడాల్సి వస్తుందని భక్తులు నిరాశ చెందుతున్నారు. పరిమతంగా టిక్కెట్లు విక్రయిస్తుండటంతో అందరికీ భోగం అందుబాటులో ఉండటం లేదు. -
ఉప్పొంగుతున్న నదులు
భువనేశ్వర్: జార్ఖండ్, ఉత్తర ఒడిశాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బాలాసోర్ జిల్లాలో ప్రముఖ నదులు వరదతో ఉప్పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో దిగువ ప్రాంతాల నదులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. పొరుగు జిల్లా మయూర్భంజ్ కూడా వరద ముంపు అంచుల్లో ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బుఽఢాబలంగా, జలకా, వైతరణి వంటి ఇతర నదులు తాత్కాలికంగా ఉప్పొంగి శాంతిస్తున్నాయి. జార్ఖండ్లోని చండిల్ ఆనకట్ట నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో సువర్ణ రేఖ నది వరదతో ఉప్పొంగుతోంది. సువర్ణ రేఖ నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాలు వరదలతో సతమతం అవుతున్నాయి. ఉప్పొంగుతున్న నదీ తీర ప్రాంతాలకు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. వరదల ఉధృతిని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అనుబంధ అధికార యంత్రాంగంతో సమావేశమై సమీక్షించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం సువర్ణరేఖ, బుఽఢాబలాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జార్ఖండ్లోని పరీవాహక ప్రాంతంలో నిరంతర వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. బాలాసోర్ జిల్లాలోని రాజ్ఘాట్ వద్ద సువర్ణ రేఖ నది వద్ద నీటి మట్టం ప్రమాద పరిమితి దాటిందని జల వనరుల శాఖ తెలిపింది. నీటి మట్టం 11.52 మీటర్లకు పెరిగి 10.36 మీటర్ల ప్రమాద గుర్తును అధిగమించింది. మథాని వద్ద జలకా నది నీటి మట్టం 6.84 మీటర్లు గరిష్ట పరిమితికి మించి 6.50 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుంది. 5వ నంబరు జాతీయ రహదారి వద్ద బుఽఢాబలంగా నది ప్రస్తుత నీటి మట్టం 7.20 మీటర్లు కొనసాగుతుంది. ఈ నది ప్రమాద సంకేతం 8.13 మీటర్లు. ఈ పరిస్థితుల దృష్ట్యా వరద పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి హామీ ఇచ్చారు. వరద ముంపుతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితి గురించి, ముఖ్యంగా చండిల్ అసంపూర్ణ ఆనకట్ట స్థితిగతుల గురించి నిరంతరం జార్ఖండ్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నదుల ప్రవాహాన్ని యంత్రాంగం నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైన చోట కట్టలను బలోపేతం చేస్తోందని మంత్రి అభయం ఇచ్చారు. మంత్రి సమాచారం ప్రకారం బుఽఢాబలాంగ్ నది నీటి మట్టం క్రమంగా దిగజారుతుంది. సువర్ణ రేఖ నది నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం వర్షపాతం లేనందున ఈ రెండు నదుల్లో నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. అంచనా ప్రకారం వానలు కురిస్తే జలేశ్వర్, ఇతర లోతట్టు ప్రాంతాలను కొంత మేరకు ప్రభావితం చేస్తుంది. ఒడిశా ప్రభుత్వం వరద పరిస్థితిని ముందస్తుగా నిర్వహిస్తోంది, సెంట్రల్ రేంజ్ ఆర్డీసీ, ఇతర అధికారులు ప్రత్యక్షంగా వరద ఉధృతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. వరద నీరు విడుదల నియంత్రణతో సువర్ణ రేఖ మరియు బుఽఢాబలాంగ్ నదుల నీటి మట్టం త్వరలో తగ్గుతాయని మంత్రి సురేష్ కుమార్ పూజారి అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న 24 గంటలు కీలకం: ఈఐసీ ఉత్తర ఒడిశా, జార్ఖండ్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశాలో పెను వరద ముప్పు పొంచి ఉందని జల వనరుల శాఖ అత్యున్నత ఇంజనీర్ (ఈఐసీ) తెలిపారు. రానున్న 24 గంటలు చాలా కీలకం అన్నారు. వరద పరిస్థితి వర్షపాతంపై ఆధారపడి ఉంటుందన్నారు. సువర్ణ రేఖ, బుఢాబలంగొ మరియు జలకా 3 నదులలో నీటి మట్టం పెరిగింది, వరద పరిస్థితి పొంచి ఉంది. ఈ పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తున్నట్లు వివరించారు. పొడి ఆహారం సరఫరా బాధిత గ్రామాల ప్రజలకు పొడి, వండిన ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కెంజొహర్, మయూర్భంజ్, బాలాసోర్లలో ఒడ్రాఫ్ బృందాలను మోహరించారు. సహాయక చర్యలకు మద్దతుగా కటక్ నుంచి 2 యూనిట్ల అదనపు బృందాలను బాలాసోర్కు పంపుతున్నారు. అగ్నిమాపక దళం అధునాతన పరికరాలతో రక్షణ, సహాయక చర్యలలో చురుకుగా పాల్గొంటోంది. -
పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్ తాఖీదు జారీ
భువనేశ్వర్: పూరీ రథ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాఖీదులు జారీ చేసింది. పూరీ జిల్లా కలెక్టర్ పోలీసు సూపరింటెండెంట్ వివరణ కోరుతూ ఈ తాఖీదులు జారీ అయ్యాయి. ఈ విచారకర సంఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించింది. మిగిలిన రథయాత్రను సరైన పద్ధతిలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. నందన్ కానన్లో పసుపు అనకొండల జననం భువనేశ్వర్: నగరం శివార్లు బారంగ్ నందన్ కానన్లో 7 అనకొండ పాము పిల్లలు జన్మించాయి. 2019 సంవత్సరంలో చైన్నెలోని మద్రాస్ క్రోకోడైల్ బ్యాంక్ ట్రస్ట్ నుండి తీసుకువచ్చిన ఒక జత అనకొండలు రెండో సారి ఈ పిల్లల్ని జన్మనిచ్చాయి. వీటితో జంతు ప్రదర్శనలో అనకొండల సంఖ్య 14కి చేరింది. -
● ప్లేట్లు ఊడుతున్నాయ్!
కొరాపుట్: ఇనుప వంతెన ప్లేట్లు ఊడుతున్నా అధికారులు పట్టించు కోవడంలేదు. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కుమలి కమత రోడ్డు మార్గంలో హోర్దలి వద్ద నదిపై ఇనుప వంతెన ఉంది. దానిపై వెళ్తున్న వాహనాల వలన ప్లేట్లుకి ఉన్న నట్లు, బోల్టులు ఊడిపోతున్నాయి. ఇలా ఒక్కొక్కటి ఊడుతుండడ తో ఇనుప ప్లేట్లు వదులుగా మారాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్లేట్లు నదిలో పడి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షాకాలం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. అధికారులు స్పందించి ప్లేట్లు ఊడిపడిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఘనంగా దేశాలమ్మతల్లి వార్షికోత్సవం
రాయగడ: సదరు సమితి పరిధి జేకేపూర్లోని బీసీ రోడ్డు వద్ద పూజలందుకుంటున్న దేశాలమ్మతల్లి అమ్మవారి వార్షిక జాతర ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యింది. మూడు రోజులు జరగనున్న యాత్రను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అమ్మవారి ఘటాలు కొలువుదీరాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరికలు సొమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నెక్కంటికి ఉత్సవ కమిటీ సభ్యులు జె.రాజు, ఆర్.శంకరరావు, జి.శంకరరావు, పుండరీకాక్ష సభ్యులు స్వాగతం పలికి సన్మానించారు. మందిర అభివృద్ధిని చేసి అమ్మవారి జాతరను ఏటా ఘనంగా నిర్వహించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా నెక్కంటి ఆకాంక్షించారు. -
శ్రీ గుండిచాకు భక్తుల తాకిడి
భువనేశ్వర్: శ్రీ గుండిచా మందిరం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. అడపా మండపంపై మూల విరాటుల్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శ్రీ మందిరం తరహాలో ఇక్కడ అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయి. భక్తులకు మహా ప్రసాదం (అన్న భోగం) లభిస్తుంది. సోమవారం నుంచి ఈ ప్రసాదం లభ్యం అవుతుంది. అడపా మండపంపై దర్శనం తర్వాత అడపా ఒబొఢా (అన్న భోగం) ఆరగించడం కూడ పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మి ఆగమనం మంగళ వారం పవిత్ర హిరా పంచమి. అన్నా చెల్లెళ్లతో శ్రీ జగన్నాథుడు శ్రీ గుండిచా యాత్రకు తరలి వచ్చాడు. శ్రీ మందిరం బోసిబోయింది. శ్రీ మహాలక్ష్మి ఒంటరైంది. స్వామిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న సందర్భంగా శ్రీ గుండిచా యాత్రలో హిరా పంచమి ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ మహాలక్ష్మి ఆగమనం పురస్కరించుకుని శ్రీ జగన్నాథుడు మరోమారు ముస్తాబయ్యేందుకు సిద్ధమయ్యాడు. పంచమి యుక్త చతుర్థి తిథి సందర్భంగా శ్రీ గుండిచా అడపా మండపంపై శ్రీ జగన్నాథునికి శ్రీ ముఖ సింగారం (బొనొకొ లగ్గి) చేశారు. తిథి ఘడియలకు అనుగుణంగా సోమవారం రాత్రి ద్వితీయ భోగ మండప సేవ అనంతరం ఈ సేవ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ లెక్కన రాత్రి 9 గంటలకు ఆరంభించారు. సుమారు 4 గంటల సేపు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. కస్తూరి, కేసరి, కర్పూరం వంటి ప్రముఖ సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకుని శ్రీ జగన్నాథుని ముఖం ముఖం ప్రకాశవంతం అవుతుంది. వరుస క్రమంలో దర్శనం శ్రీ జగన్నాథుని జనన వేదికగా పేరొందిన శ్రీ గుండిచా మందిరం అడపా మండపంపై స్వామి దర్శనం విశేషత కలిగి ఉంది. రద్దీ క్రమంగా పెరుగుతుంది. భక్తులకు క్రమబద్ధమైన దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక బారికేడ్ గుండా వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం బొడొ సింగారం అలంకరణ తర్వాత తలుపులు తెరవడంతో సర్వ దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రతిపాదించిన సర్వ దర్శనం ఉదయం 10.10 గంటలకు ఆరంభం కావడంపై సర్వత్రా విచారం వ్యక్తం అయింది. భక్తులు బారికేడ్ గుండా శ్రీ గుండిచా సింహ ద్వారం నుంచి ప్రవేశించి నక్కొచొణా ద్వారం గుండా వెలుపలకు వచ్చేందుకు వీలుగా వరుస వ్యవస్థ ఏర్పాటు చేశారు. మంగళవారం హిరా పంచమి నాడు, శ్రీ మహా లక్ష్మీ దేవి శ్రీ గుండిచా ఆలయాన్ని సందర్శించనుంది. -
తొక్కిసలాట
పూరీ శారదా బాలి వద్ద ..భువనేశ్వర్: పూరీలోని శ్రీ గుండిచా ఆలయం సమీపం శారదా బాలి ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పలువురు గాయ పడ్డారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది. మృతులను బొలొగొడొకు చెందిన 36 ఏళ్ల బసంతి సాహు, 78 ఏళ్ల ప్రేమకాంతి మహంతి, బలిపట్నకు చెందిన ప్రభాతి దాస్గా గుర్తించారు. తెల్లవారు జామున 4 గంటలకు రథాలపై ఏకాంత సేవ తెరలు (పొహుడా) తెరిచిన వెంటనే స్వామి వారి తొలి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల ప్రాణాలు ఇసుక (బాలి)లో కలిసి పోయాయి. ఈ దర్శనం కోసం భక్తులు భారీగా గుమిగూడి ఉండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చారుమళ్ల కలపతో నిండిన ట్రక్కు అకస్మాత్తుగా జనంలోకి ప్రవేశించింది. దర్శనం కోసం ఎగబాకుతున్న జనం ప్రాణ రక్షణ కోసం అకస్మాత్తుగా చెల్లాచెదురయ్యే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో 500 మందికి పైగా భక్తులు శారదా బాలిపై పరిచిన ప్లాస్టిక్ చాపలపై కూర్చుని ఉండగా కలప రవాణా ట్రక్కు దూసుకుని వచ్చింది. ఈ దూకుడులో 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. సెక్యూరిటీ గార్డు ఉండి ఉంటే.. దుర్ఘటన సమయంలో రథం దగ్గర సెక్యూరిటీ గార్డులు లేరు. భద్రతా ఏర్పాట్లు ఉండి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని తొక్కిసలాటలో మృతి చెందిన బొలొగొడొ ప్రాంతానికి చెందిన బసంతి సాహు భర్త వాపోయాడు. సుమారు గంటన్నర సేపు సహాయం కోసం ప్రాధేయపడి నీరుగారి పోయామని భోరుమన్నాడు. క్షమాపణ కోరిన ముఖ్యమంత్రి శారదా బాలి ప్రాంగణంలో రథాలపై దేవుళ్ల దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటనకు తాను, తన ప్రభుత్వం జగన్నాథ ప్రేమికులందరికీ క్షమాపణలు కోరుతున్నామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభ్యర్థించారు. ఈ ఆపత్కాలంలో దారుణమైన నష్టాన్ని భరించే శక్తిని మహాప్రభు జగన్నాథుడు బాధిత భక్తులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. భద్రతా నిర్లక్ష్యంతో ఈ ఘోరమైన సంఘటన జరిగినట్లు ఆరోపణ. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించి బాధ్యులైన వారి వ్యతిరేకంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకనేందుకు ఆదేశించారు. ముగ్గురు భక్తులు మృతి పలువురికి గాయాలు ఈ విచారకర సంఘటనపై విపక్ష నేత నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబీకులకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జన సమూహం నిర్వహణకు ప్రభుత్వ ఏర్పాట్లు లేకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుందని, తొలి రోజున శ్రీ జగన్నాథుని నంది ఘోష్ రథం కదలకపోవడాన్ని జగన్నాథుని ఇచ్ఛగా పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఈ విచారకర సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అడపా విజే, స్వర్ణ అలంకారం, నీలాద్రి విజే మును ముందు ఘట్టాల్లో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అవాంఛనీయ సంఘటనలు నివారించడంలో పూచీదారితనంతో వ్యవహరించాలని నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూరీ శారదా బాలి ఘటనలో ముగ్గురు మృత్యు సంఘటనతో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా శారదా బాలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, కలెక్టర్ ప్రతిస్పందించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని పూరి ఎస్పీ తెలిపారు. శారదా బాలిలో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో 3 మంది భక్తులు మరణించారు. ఆరుగురు గాయపడినట్లు ఈ అధికారులు తెలిపారు. పొహుడా తెరిచిన తర్వాత అకస్మాత్తుగా రద్దీ ఏర్పడి ఈ విషాదం చోటు చేసుకుందని కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం క్షమించరానిది – నవీన్ పట్నాయక్ -
జాతీయ గణాంకాలతోనే నిధుల కేటాయింపు
పర్లాకిమిడి: జాతీయ గణాంకాల వల్ల దేశంలో వ్యవసాయం, భారీ నీటి పథాకాలు, ప్రధాన మంత్రి సఫలయోజనా పథకం, జాతీయ నమూనా, కృషి జన గణాంకాలతోనే వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరుగుతాయని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో 19వ జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ గణాంకాల దినోత్సవాన్ని 2007 నుండి దేశవ్యాప్తంగా ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర జన్మదినం నాడు జరుపుకుంటారని గుర్తు చేశారు. దేశ సామాజిక, అర్ధనైతిక, వార్షిక, నీతి అయోగ్ పథకాలు తయారు చేయడానికి జాతీయ గణాంకాలు దోహద పడతాయని డిప్యూటీ డైరెక్టర్ కులమణి రౌతో అన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళికా, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోగా, అతిథులుగా సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా గణాంకాల డిప్యూటీ డైరెక్టర్ కులమణి రవుతో, ఎస్కేసీజీ కళాశాల ఎకానమిక్స్ అధ్యాపకులు సంజయ్ కుమార్ సాహు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో 19వ జాతీయ గణాంకాల దినోత్సవం -
బరిపద రథ యాత్ర ప్రత్యేకం
భువనేశ్వర్: రథయాత్రలో మహిళలకు కీలక పాత్ర కల్పించి భగవంతుని సేవలో అందరికీ సమాన అవకాశం భావానికి ప్రాణం పోస్తోంది మయూర్భంజ్ జిల్లా బరిపద ప్రాంతంలో స్వామి రథ యాత్ర. పలు విభిన్నతలతో ఈ ప్రాంతంలో యాత్ర కొనసాగడం విశేషం. శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ఇమిడి ఉన్న ఆచార వ్యవహారాలతో శ్రీక్షేత్రంలో వార్షిక రథ యాత్ర తరహాలో నిర్వహిస్తారు. పూరీలో యాత్ర జరిగిన మర్నాడు బరిపదలో శ్రీ జగన్నాథ రథ యాత్ర జరుగుతుంది. ఇక్కడ యాత్ర వరుసగా రెండు రోజులు కొనసాగడం మరో విభిన్నత. ఇక్కడ రథాలను మహిళలు లాగుతారు. ఇలా ఆచార వ్యవహారాల్లో వివాదరహిత నిర్వహణతో ఏటా రథ యాత్రని జరుపుకుంటున్న బరిపద ప్రాంతం ద్వితీయ శ్రీక్షేత్రంగా పేరొందింది. దేవీ సుభద్ర రథాన్ని మహిళలు మాత్రమే లాగుతారు. ఈ ఆచారం సీ్త్ర సాధికారతను చాటుతుంది. భగవంతుని కార్యకలాపాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. బరిపద రథ యాత్ర ఆధ్యాత్మిక సహవాసం, సాంస్కృతిక ఐక్యతతో జనం అంతా లీనం అయ్యే అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ప్రఖ్యాత పూరి రథ యాత్ర తర్వాత రోజు బరిపదలో రథ యాత్ర జరుగుతుంది. ఇదో ప్రత్యేక సంప్రదాయం ద్వారా విభిన్నంగా ప్రాచుర్యం సంతరించుకుంది. రథ యాత్ర సాధారణంగా ఒక నిర్దిష్ట కాలంలో జరుగుతుంది. ఏటా ఆషాఢ కృష్ణ అమావాస్య రోజున జరిగే నేత్ర ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల ప్రతిపద నాడు ఉభా యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర ప్రయాణానికి దేవతల సన్నద్ధతకు సంకేతం. ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు శ్రీ మందిరం నుంచి వరుస క్రమంలో (గొట్టి పొహొండి) మూల విరాట్లు రథాల్ని అధిరోహించి శ్రీ గుండిచా మందిరానికి యాత్రగా తరలి వెళ్తారు. శారదా బాలి ప్రాంతంలో శ్రీ గుండిచా ఆలయం అడపా మండపంపై దేవతా మూర్తుల దర్శనం పరమ పావనంగా పరిగణిస్తారు. యాత్రలో ఆబాలగోపాలం మూల విరాట్లు ఆసీనులైన రథాల్ని లాగుతారు. తిరుగు యాత్ర బహుడా సందర్భంగా కూడ ఇదే శైలి కొనసాగుతుంది. బరిపదలో మాత్రం దేవీ సుభద్రని మహిళలు మాత్రమే లాగడం విభిన్నం. ఇక్కడ రథ యాత్ర రెండు రోజులు జరుగుతుంది. నేత్రోత్సవం తర్వాత రథాలపైకి దేవుళ్లని తరలించిన మర్నాడు రథాలు లాగుతారు. పూరీలో యాత్ర జరిగే రోజున బరిపదలో దేవతలు రథాల్ని అధిష్టించడంతో ముగుస్తుంది. మర్నాడు రథాలు లాగేంత వరకు దేవతల్ని రథాలపై సర్వులు దర్శించుకునేందుకు పూర్తి అవకాశం కల్పిస్తారు. రథాలపై దేవుళ్ల దర్శనం కోటి జన్మల పుణ్య ఫలంగా భక్తజనం భావిస్తారు. మహిళా సాధికారతకు తార్కాణం -
ఎగ్జిబిషన్ సందర్శనకు పోటెత్తిన జనం
జయపురం: జయపురం మహారాజా రాజర్శి విక్రమదేవ్ వర్మ 157వ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం స్థానిక శ్రీవిక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో సిటీ ఆఫ్ విక్టరీ జయపుర ఫొటోఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జయపురం రాజుల నాటి ఫొటోలను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం అనేక మంది యువకులు, ముఖ్యంగా వివిధ కళాశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చి ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఇన్టేక్ కొరాపుట్ చాప్టర్, శ్రీవిక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల జయపురం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫొటో ప్రదర్శనలో జయపురం మహారాజుల కాలం నాటి ఫొటోలను తిలకించిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రదర్శన చూడటం ఇదే ప్రథమమంటున్నారు. ఇక ముందు కూడా ఎంతో చారిత్రిక నేపథ్యం ఉన్న జయపురం సామ్రాజ్యంపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే చరిత్రను తెలుసుకొనేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి పాయికొడాకులుగుడ గ్రామ సమీపంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. మృతులు సమితి లొని డిమిరినెలికు గ్రామానికి చెందిన మనోజ్ సరక (30), గహా హుయిక (28)గా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. డిమిరినెలికు గ్రామానికి చెందిన మనోజ్, గహా, హడి పిడికకలు ఒకే బైకుపై తమ గ్రామం నుంచి మునిగుడ వెళ్తున్న సమయంలొ పాయికొడాకులుగుడ గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే ఉన్న ఒక చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలొ ఇద్దరు సంఘటన స్థలం వద్దే మృతి చెందగా హడి పిడికక గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడిన రామగిరి హత్య కేసు మిస్టరీ
● ఇద్దరు నిందితులు అరెస్టు ● హత్యకు దారితీసిన భూవివాదం పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి రామగిరిలో ఈ నెల 23వ తేదీన కడమాసింగి గ్రామానికి చెందిన రామచంద్ర నాయక్ (35) దారుణ హత్యకు గురయ్యారు. శవానికి రాళ్లను కట్టి నువాసాహి డ్యాంలో విసిరేశారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న రామగిరి పోలీసులు హత్యంతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేశారు. రాణిపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జ్యోతింద్ర పండా సమక్షంలో నిందితులను ఆదివారం ప్రవేశపెట్టి విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి తన తమ్ముడు రామచంద్ర నాయక్ కనబడుట లేదని అన్నయ్య బరున్ కుమార్ నాయక్ రామగిరి పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్య లు చేపట్టినప్పటికీ రామచంద్ర నాయక్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే కడమాసింగి గ్రామానికి సమీపంలో నువాసాహి డ్యాంలో మృతదేహం ఉన్నట్టు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి వాకబు చేయగా అది రామచంద్రనాయక్దిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతుని మెడమీద, తలపై బలమైన గాయాలు ఉండడంతో హత్యగా పోలీసు లు నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితులైన అనాఘా గ్రామానికి చెందిన అతుల్ ప్రసాద్ బెహార్ దోళాయి, కరంజపడ గ్రామానికి చెందిన బిశ్వభాను ప్రధాన్ను రామగిరి పోలీసులు అరెస్టు చేసి మర్డర్ సీనును రీక్రియేట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమంటే ఒక భూవివాదం విషయమై రామచంద్రనాయక్ను హత్య చేయాలని నిందితులు పన్నాగం పన్నినట్టు తెలియవచ్చింది. హత్య ఎలా చేశారంటే .. తొలుత రామచంద్ర నాయక్ను తలపై రాళ్లతోకొట్టి, తరువాత గొడ్డలితో మెడపై వేటువేశారు. తరువాత పొదల్లో శవాన్ని దాచిపెట్టారు. అనంతరం ఏం చేయాలో పాలుపోక అతుల్ ప్రసాద్ దళబెహారా తన మామయ్యను పిలిచి సలహా అడిగాడు. జూన్ 22వ తేదీ రాత్రి సమీపంలో మృతదేహాన్ని నువాసాహి డ్యాంకు తీసుకెళ్లి శవానికి రాళ్లు కట్టి విసిరివేసి పారిపోయినట్టు నిందితులు దర్యాప్తులో అంగీకరించినట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. 25వ తేదీన డ్యాంలో తేలిన శవానికి వైద్యులు పోస్టుమార్టం చేయడం.. రామచంద్ర నాయక్ తలపై బలమైన గాయాలు ఉన్నట్టు పీఎం రిపోర్టులో డాక్టర్లు ధ్రువీకరించారు. నిందితులు మృతుని మైబైల్ను కూడా ధ్వంసం చేసినట్టు ఎస్పీ చెప్పారు. అయితే డ్యాం వద్ద దొరికిన మొబైల్ను డాటా తీసి పోలీసులు నిందితుల నంబర్లు సేకరించి మొబైల్ ట్రాక్తో పట్టుకోగలిగారు. నిందితుల వద్ద నుండి ఒక గొడ్డలి, మెడకు చుట్టిన తువ్వాలు, రాళ్లు, తాడును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా వెల్లడించారు. కేసు దర్యాప్తులో సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా, ఓఐసీ డి.గజపతి దొర, ఏఎస్సై సంతోష్ కుమార్ బెహరాలు కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
● మంత్రి కృష్ణ చంద్ర పాత్రో భువనేశ్వర్: రాష్ట్రంలో రబీలో రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన రైతుల నుంచి సేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అధికారులను ఆదేశించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సెలవు దినాల్లో కూడా పని చేయాలని ఆదేశించారు. స్థానిక రాష్ట్ర ఆహార సరఫరా సంస్థను ఆదివారం సందర్శించిన సందర్భంగా మంత్రి రబీ ధాన్యం సేకరణ పురోగతిని అధికారులతో చర్చించి సమీక్షించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశలో ఉన్నందున లోపాలు లేకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో మంత్రి వివిధ జిల్లా కలెక్టర్లు, రైతులతో కూడా చర్చించారు. రాష్ట్ర పౌర సరఫరా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.సుదర్శన్ చక్రవర్తి ధాన్యం సేకరణ పురోగతిని వివరించారు. పలువురు సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. మజ్జిగౌరి దర్శనానికి భక్తుల తాకిడి రాయగడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో అమ్మవారి దర్శనార్ధం వేచిఉన్న భక్తులకు దర్శనం అయ్యేసరికి సాయంత్రం పట్టింది. దీంతో భక్తులు విసుగెత్తి మందిరం ప్రాంగణంలో ఉన్న చెట్టు వద్ద మొక్కుబడులను తీర్చుకుని తిరిగి వెళ్లడం కనిపించింది. ఇదిలాఉండగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు రావడంతో మందిర ప్రాంగణం కిక్కిరిపొయింది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మందిర నిర్వాహకులు తగు చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు అవస్థలు ఎదుర్కొన్నారు. ‘పనులు చేయకుండా డబ్బు స్వాహా’ జయపురం: మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజనలో పనులు చేయకుండా రూ.12 లక్షల అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతిపై దర్యాప్తు జరపాలని జయపురం సబ్డివిజన్ బొరాగుమ్మ సమితి నారిగాం పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ పంచాయితీ ఉన్నతికోసం రూ.12 లక్షలు మంజూరు కాగా పనులు జరుపకుండానే స్వాహా చేశారని ఆరోపిస్తున్నారు. ఆ డబ్బుతో ఏయే పనులు చేపట్టారో తెలీడం లేదని నారిగాం మాజీ సర్పంచ్ ఆరోపించారు. మాజీ సర్పంచ్ నేతృత్వంలో నారిగాం ప్రజలు బొరిగుమ్మ బీడీఓను కలసి అవినీతిపై శనివారం ఆరోపించారు. మనొరెగ పథకంలో నారిగాం పంచాయతీ బటిగుడలో ఫీల్డ్ కాలువ నిర్మాణానికి రూ.6 లక్షలు మజూరు కాగా ఖంగారుతోట ప్రాంతంలో ఫీల్డ్ కాలువ కొరకు మరో రూ. 6 లక్షలు మంజూరు అయ్యాయని నారిగాం మాజీ సర్పంచ్ లక్ష్మణ వెల్లడించారు. అయితే ఆ రెండు పనులు చేయకుండా డబ్బు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఆ రెండు కెనాల్లు తవ్వేందుకు కూలీలకు దాదాపు రూ.3 లక్షలు కూలి డబ్బులు ఇచ్చారని, అయితే కెనాల్ పనులు జరగలేదని ఆరోపించారు. ఈ అవినీతిలో సర్పంచ్, పీఈఓ, ఏడీఈఓ, రామపాత్రొపుట్ పూజారిలు మమేకమై ఉన్నట్లు ఆరోపించారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆరోపించారు. శనివారం బీడీఓకు ఆరోపణల పత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. ఈ అవినీతిపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
పొలం వద్దకే మన్ కీ బాత్
కొరాపుట్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమం పొలం పనుల వద్దకు చేరింది. ఆదివారం మాన్ కి బాత్ 123వ ఏడిషన్ జరిగింది. నబరంగ్పూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు. వేకువ జామున ఇంటి నుంచి పొలాలకు వెళ్లి తిరిగి రాత్రికి వస్తున్నారు. ప్రధాని సందేశం గిరిజనులకు అందాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు వినూత్న ఆలోచన చేశారు. నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితిలో ల్యాప్ ట్యాప్ను పొలం వద్దకు తీసుకువెళ్లి మాన్ కి బాత్ కార్యక్రమాన్ని వినిపించారు. -
పూరీ మరణాలకు బాధ్యులెవరు..?
కొరాపుట్: పూరీలో జరిగిన మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని పీసీసీ డిమాండ్ చేసింది. ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రథయాత్రను బీజేపీ పాలకులు చెడగొట్టారని విమర్శించారు. ఇప్పటికే ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం చెబుతుందన్నారు. కానీ మరో 600 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం పాలకులు మర్చిపోయారన్నారు. అసలు ఈ యాత్రని పర్యవేక్షణ చేస్తున్నదెవరో ప్రజలకు చెప్పాలన్నారు. అనేక సార్లు సమీక్ష జరిపిన తర్వాత ప్రశాంతంగా జరగాల్సిన యాత్ర విషాదంగా మారిందన్నారు. విషయం పై రాజకీయాలు చేయాల్సిన సమయం కానందున తాము సంయయనం వహిస్తున్నామని భక్త చరణ్ దాస్ ప్రకటించారు. అంతకు ముందు కలహండి జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ తో కలసి నబరంగ్పూర్ వచ్చారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకురాలు కాధంబని త్రిపాఠి ఏర్పాటు చేసిన బాధిత మహిళల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా దాటి కొరాపుట్ జిల్లాలోనికి ప్రవేశించారు. జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్కలు ఘనస్వాగతం పలికారు. వందలాది బైక్లతో ర్యాలీ చేశారు. -
ఏకాంత సేవ సమాచారం లేదు: సేవాయత్
భువనేశ్వర్: రథాలపై ఏకాంత సేవకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, ఈ మేరకు భక్తులకు ముందస్తు సమాచారం జారీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని సీనియర్ సేవాయత్, శ్రీ మందిరం మాజీ పాలక మండలి సభ్యుడు రామచంద్ర దాస్ మహా పాత్రో విచారం వ్యక్తం చేశారు. ఏకాంత సేవకు సంబంధించి భక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని, కానీ అది జరగలేదని తెలిపారు. భక్తులకు కనీస సమాచారం అందజేసేందుకు అనుబంధ కేంద్రంలో ఏ ఒక్కరు అందుబాటులో లేరని ఆరోపించారు. పాము కాటుతో ఇద్దరికి అస్వస్థత రాయగడ: రెండు వేర్వేరు ఘటనల్లో పాముకాట్లకు గురై ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలోని నిరుగుండి గ్రామానికి చెందిన తటక టక్రి భార్య సస్మిత కల్యాణసింగుపూర్లో రథయాత్రను చూసేందుకు శనివారం వెళ్లారు. అదే గ్రామంలో గల తన కన్నవారింట్లో రాత్రి ఉండిపోయింది. ఆదివారం తెల్లవారున కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలో గల నది వద్దకు వెళ్లింది. అదే సమయంలో పాము ఆమెను కాటు వేసింది. ఇంటికి వచ్చి తమ కుటుంబీకులతో విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమెను కల్యాణసింగుపూర్ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. చికిత్సను అందించిన వైద్యులు పాముకాటుకు గురైన మహిళ ఆరోగ్యం కుదుటుగా ఉందని చెప్పారు. కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలో గల సెరిగుమ్మ పంచాయతీలోని మండాపుట్ గ్రామానికి చెందిన నచిక రఘు అనే వ్యక్తికి పాము కాటు వేసింది. కళ్యాణసింగుపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ముఖ్యమంత్రి కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీగా శాశ్వత్ మిశ్రా భువనేశ్వర్: 1996 సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్ అభ్యర్థి శాస్వత్ మిశ్రా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. మరో వైపు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినీత్ అగర్వాల్ని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ఆఫీసరు ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా, పూరీ జిల్లా కలెక్టరు సిద్ధార్థ శంకర స్వంయిని సాధారణ పాలన విభాగం ఆఫీసరు ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా బదిలీ చేశారు. చోరీ కేసులో ముగ్గురు అరెస్టు రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాలాజీ మెడికల్ స్టోర్స్లో ఇటీవల జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బి.హేమంత్ కుమార్, షేక్ బాష, బి.వెంకటేష్ ఉన్నారు. వారి నుంచి రూ.15,580 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన అర్ధ రాత్రి ప్రధాన రహదారి వద్ద గల బాలాజీ మెడికల్ స్టోర్స్లో చోరీ జరిగింది. దుకాణం షట్టర్ను గ్యాస్ పైపులతో కట్ చేసి దుండగులు లోపలకు చొరబడి క్యాస్ కౌంటర్లో గల సుమారు 12 వేల రుపాయల నగదును చోరీ చేసినట్లు బాధితుడు చిన్నారి సురేష్ కుమార్ సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి శనివారం కోర్టుకు తరలించారు. రథం లేని రథయాత్ర కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి పట్కి గ్రామ పంచాయతీలో జరిగిన రథయాత్ర విమర్శలకు దారి తీసింది. ఇక్కడ పాత రథం పాడైపోవడంతో గిరిజనులు కొత్త రథం నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అందుకు అవసరమైన కలప 10 ట్రాక్టర్ల ద్వారా తెస్తుండగా ఈ ఏడాది మార్చి 30న అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేనందున సీజ్ చేశారు. దేవాలయ కమిటీ విజ్ఞప్తితో ఉచితం సేవకి వచ్చిన ట్రాక్టర్లు కూడా సీజ్ అయ్యాయి. నేటికీ వాటిని వదలకపోవడంతో అందరికీ ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో గిరిజనులు రథం లేకుండా రథయాత్ర చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి తెల్రాయ్ పంచాయతీకి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కలిమెల నుంచి మోటు వైపు బైక్ వెళ్తుంది. వెనుక నుంచి ట్రక్కును ఢీకొంది. బైక్పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన రాళ్లపై పడిపోయాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలిమెల ఐఐసీ ముకుందో మేల్క ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎక్కడ నుంచి వస్తున్నాడో తెలియలేదు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సోమవారం ఎవరైనా మృతదేహం కోసం వస్తే పోస్టుమార్టం పూర్తిచేసి అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు. వ్యాన్ఢీ కొని.. కొరాపుట్: కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి కొంచనా గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భారీ వర్షంలో వ్యాన్ వస్తుంది. అదే సమయంలో ఓ యువకుడు (30) చెట్టు కింద తన బైక్ ఆపి నిల్చున్నాడు. వ్యాన్ అదుపు తప్పి ఆ యవకుడిని ఢీకొంది. సంఘటన స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. వ్యాన్ కూడా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే లమ్తాపుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు నందపూర్ సమితి పడేల్ గ్రామ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి పారువా గ్రామ పంచాయతీ ఇంద్రానగర్ వద్ద ఆదివారం సాయంత్రం జగిరిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్కూటిని గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపొయింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయిఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని రాయిఘర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బాలికల అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు
కొరాపుట్: బాలికల అక్రమ రవాణాని నబరంగ్పూర్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్డీపీఓ కృష్ణచంద్ర భాత్ర ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం కొడింగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గొట్టిబెడ గ్రామంలో రఘు బోత్ర తన చెల్లెలితో పాటు ముగ్గురు బాలికలు గ్రామంలో అదృశ్యమయ్యారని 24న ఫిర్యాదు చేశారు. తనకు ఈ గ్రామంలో కొందరు బాలికల అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నట్లు అనుమానం ఉందని పేర్లు ఇచ్చారు. అనుమానిత వ్యక్తుల ఫోన్లపై నిఘా ఉంచడంతో తమిళనాడు రాష్ట్రంలో ఈ ముగ్గురు బాలికలు ఉన్నారని ఖరారు చేసుకున్నారు. వెంటనే తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికలను రక్షించారు. ఈ బాలికలను అక్రమ రవాణా చేసిన నబరంగ్పూర్ పట్టణానికి సమీపంలో పకనా గుడకి చెందిన ప్రతాప్ హరిజన్, తెంతుల కుంటి సమితి కమత గ్రామానికి చెందిన బికాష్ నాయక్, బాధిత బాలికల గ్రామానికి చెందిన ఖగుపతి జానీ, మితుల జానీలను అరెస్ట్ చేశారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించండి
● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భక్త చరణ దాస్, పీసీసీ ప్రహరి అజయ లల్లు జయపురం: కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జయపురంలో నిర్వహించిన రాజ్యాంగాన్ని పరిరక్షించండి ర్యాలీకి, సమావేశానికి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భక్త చరణ దాస్, పీసీసీ ప్రహరి అజయ లల్లును జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క స్వాగతం పలికారు. వీరి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు అంబాగుడ నుంచి 26వ జాతీయ రహదారిలో బైక్ రాలీలో జయపురం తీసుకువచ్చారు. పార్టీ రాష్ట్ర నేతలకు జయపురంలో ఘన స్వాగతం పలికారు. 26వ జాతీయ రహదారి పారాబెడ జంక్షన్లో గల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విక్రమ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసి బహిరంగ సభావేదిక వద్దకు చేరుకున్నారు. నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని, రాజ్యాంగ పరిరక్షణకు పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సభా కార్యక్రమాలు జరుగుతుండగా భారీవర్షం పడటంతో కొంతసమయం అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
జయపూర్ రైల్వేస్టేషన్లో సౌకర్యాల లేమి!
● ప్రయాణికుల పాట్లు! కొరాపుట్: వర్షాకాలం వస్తే చాలు జయపూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు. ఆదివారం సాయంత్రం జయపూర్ రైల్వే స్టేషన్లో హిరాఖండ్ రైలు ఎక్కడానికి వచ్చిన వందలాది ప్రయాణికుల బాధలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. పేరుకే పెద్ద స్టేషన్ అయినప్పటికీ ప్లాట్ఫారం మీద ఉండడానికి స్థలం లేదు. అతి పెద్ద ప్లాట్ఫారం ఉన్నా అందుకు తగ్గ షెడ్స్ లేవు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉన్న షెడ్లో జాగా లేకపోవడంతో ప్రయాణికులు రక్షించుకోవడానికి పాదచారుల వంతెన కింద, ఫుడ్ స్టాల్ ముందు నిల్చోవలసి వస్తుంది. దేశంలో రైల్వే ఆధునీకరణ జరిగినా ఇక్కడ మాత్రం చేపట్టలేదు. కనీసం రైళ్లు వచ్చి వెళ్లే సమాచారం తెలిపే డిస్ప్లే బోర్డు లేదు. చిన్న స్టేషన్లలో రైళ్లు బోగీలు ఆగే స్థలం చెప్పే బోర్డుల వ్యవస్థ కూడా లేకపోవడం దయనీయం. రైలు వస్తే ప్రయాణికులు బోగిల కోసం పరుగులు తీయాల్సిందే. ఈ స్టేషన్ మీదుగా విశాఖ పట్నం, భువనేశ్వర్, కోల్కతా, రౌర్కెలాలకు పది రైళ్లు నడుస్తున్నాయి. సుమారు లక్షా 50 వేల జనాభా ఉన్న జయపూర్ పట్టణంతో పాటు సమీప వందలాది గ్రామాలు, ప్రక్కనే నబరంగ్పూర్, మల్కన్గిరి జిల్లాల ప్రజలు ఇదే స్టేషన్ మీద ఆధార పడుతున్నారు. పక్క రెండు జిల్లాలలో ఎక్కడా రైల్వే లైన్ లేక పోవడంతో జయపుర్ మాత్రమే గత్యంతరం. ఇంతటి రద్దీ ఉన్న స్టేషన్లో రైలు ఎక్కలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి ఉంటుంది. -
గవర్నర్ ప్రగాఢ సంతాపం
భువనేశ్వర్: పూరీ గుండిచా మందిరం శారదా బాలి ప్రాంగణంలో తొక్కిసలాట చోటుచేసుకొని పలువురు మృతి చెందడంపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మలకు శాంతిచేకూర్చాలని భగవంతున్ని వేడుకుంటున్నట్టు పేర్కొన్నారు. దివ్య దర్శనం శ్రీ గుండిచా శారదా బాలి ప్రాంగణంలో రథాలపై మూల విరాట్లు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు భక్తులకు దివ్య దర్శనం భాగ్యం కల్పించారు. రథాలపై దేవతా త్రయం బొడొ సింగారొ అలంకరణలో సుగంధిత పుష్ప అలంకరణలో శోభిల్లారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల వరకు భక్తులకు రథాలపై ఈ దివ్య దర్శనం ప్రాప్తించింది. శ్రీ గుండిచా అడపా మండపానికి తరలించేంత వరకు నిరవధికంగా దర్శించుకున్నారు. – భువనేశ్వర్ ఆందోళనలకు ఉద్యోగులు సిద్ధం పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఆదివారం ఉదయం ఒడిషా రెవెన్యూ అమలా సంఘం సాధారణ పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శివప్రసాద్ పండా పర్యవేక్షించగా, జుధిష్టర్ రణసింగ్ అధ్యక్షత వహించారు. ఇతర అతిథులుగా సాధారణ కార్యదర్శి సంతనుకుమార్ మిశ్రా, బాబూలాల్ పూజారీ, భైరవ్ పట్నాయిక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బసంత పసుపురెడ్డి, సుశీల్ కోరా హాజరయ్యారు. గజపతిలో పనిచేస్తున్న రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగుల పది డిమాండ్లు నేరవేర్చేందుకు వచ్చే రోజుల్లో ఆందోళన చేయడానికి సిద్ధం కావాలని సభ్యులు తీర్మానించారు. జిల్లాలో మినిస్టిరీయల్ ఉద్యోగుల క్యాడర్ పునర్నిర్మాణం, జూనియర్ అసిస్టెంట్లకు బేసిక్ పే 9 లెవల్కు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పీఎం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల జారీపై నాయకులు చర్చించారు. రెవెన్యూ ఉద్యోగులు అపరిష్కృతంగా మిగిలిపోయిన డిమాండ్లు నెరవేరేందుకు జూలై 7 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని, జూలై 14 నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించాలని నాయకులు తీర్మానించారు. రైలు నుంచి జారిపడిన యువకులు ● ఒకరికి గాయాలు గోపాలపట్నం: ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి ఇద్దరు యువకులు జారిపడగా, వారిలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సింహాచలం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పవిత్రా దాస్, సగ్రామ్ దాస్ ప్రయాణిస్తున్నారు. సింహాచలం రైల్వేస్టేషన్లో ఈ రైలుకు హాల్ట్ లేదు. అయితే రైలు స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో వారు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది గమనించి వారిని కాపాడారు. వారిలో ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. ఈ యువకులు ఒడిశా రాష్ట్రం డెంకనాల్ జిల్లా కుకట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు వెళ్తున్న వీరు ఫుట్బోర్డుపై కూర్చోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై పడటం వల్ల ప్రాణాపాయం తప్పిందని ఆర్పీఎఫ్ ఎస్ఐ సూరజ్ కుమార్, ఏఎస్ఐ జి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ డి.జగదీష్ తెలిపారు. -
● మత్స్య, కూర్మ అవతారంలో జగన్నాథ, బలరాములు
పర్లాకిమిడి: పట్టణంలోని గుండిచామందిరంలో ఆదివారం శ్రీజగన్నాథ, బలరాములు మత్స్య, కూర్మావతారంలో భక్తులకు కనువిందు చేశారు. సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి చట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారి దర్శనానికి భారీగా విచ్చేస్తున్నారు. రాయగడ: రథాయాత్ర మూడో రోజైన ఆదివారం జగన్నాథుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గుండిచా మందిరంలో కొలువైయున్న దేవతామూర్తులు ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు స్వామివారు రోజుకో రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా సేవాయుతులు అలంకరిస్తున్నారు. స్వామివారి దశవతారాల్లో భాగమైన కూర్మావతారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గుండిచా మందిరం ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతుంది. ఇదిలాఉండగా సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, సంకీర్తనలు కళాకారులచే నిర్వహించారు. -
బాక్సింగ్లో మెరిసిన సత్య భార్గవ్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన జి.సత్య భార్గవ్ బాక్సింగ్లో మెరిశాడు. ఇటీవల హర్యానాలో జరిగిన 6వ జూనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎస్.దేవివరప్రసాద్ త్రుటిలో పతకం కోల్పోయాడు. టోర్నీ ముగించుకుని జిల్లాకు తిరిగొచ్చిన క్రీడాకారులను, డీఎస్ఏ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావును డీఎస్డీఓ డాక్టర్ కై .శ్రీధర్ గవరావు శనివారం అభినందించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్ దేవ్, బలగ సీతారాం, వంగా మహేష్, సీనియర్ బాక్సర్లు హర్షం వ్యక్తం చేశారు. -
జగన్నాథుని రథయాత్ర
చిలికా సరస్సులో ..భువనేశ్వర్: ఏటా శ్రీ క్షేత్రంలో రథ యాత్ర జరిగే రోజున చిలికా సరసులో స్వామి రథ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఏటా చిలికా సరస్సు జలాలపై స్వామి యాత్ర జరుగుతుంది. శతాబ్దాలుగా ఈ యాత్ర నిరవధికంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఖుర్ధా జిల్లా చిలికా సరస్సులో సుందరమైన కొంకొణొ శిఖారి ద్వీపం జగన్నాథుని జల రథ యాత్ర స్థలం. చిలికా సరసు జలాలపై స్వామి రథ యాత్ర ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. స్వామి యాత్రతో నిశ్చలమైన చిలికా సరసు కొంకొణొ శిఖారి ద్వీపం పరిసరాలు మేళ తాళాలు, మృదంగం, ఘంటానాదంతో మారు మోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంటుంది. బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి పడవ రథంపై చిలికా సరసు నీలి జలాల మీదుగా యాత్ర నిర్వహించడం ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుంది. యాత్ర పడవ రథం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుని కొంకొణొ శిఖారి ద్వీపం చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో స్వామి యాత్ర ముగుస్తుంది. దాడులు ప్రభావం ఈ విభిన్నమైన రథ యాత్ర చరిత్ర పుటల్లో చోటు చేసుకుంది. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంపై గతంలో 18 సార్లు దాడులు జరిగినట్లు సమాచారం. ఆయా సందర్భాల్లో రక్షణ కోసం దేవతా మూర్తులను చిలికా సరస్సులోని నొయిరి ఘాట్ కొంకొణొ శిఖారీ ద్వీపానికి 2 సార్లు తరలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1731లో ముస్లిం పాలకుడు తాకీ ఖాన్ పూరీలోని శ్రీ మందిరంపై దాడి చేసి ఆక్రమించినప్పుడు భద్రంగా పదిలపరిచేందుకు రత్న వేదికపై మూల విరాట్లు శ్రీ జగన్నాథుడు, బలభద్ర స్వామి, దేవీ సుభద్రతో చక్రరాజు సుదర్శనుని రహస్యంగా చిలికా సరసుకు తరలించారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులుతో కూడుకొని ఉండడంతో సురక్షితంగా భావించి దేవుళ్లని ఇక్కడకు తరలించారు. ఈ అటవీ ప్రాంతంలో కొంకొణి అనే పండ్లు మినహా ఇతర పదార్థాలు లభ్యం కానందున వీటినే నిత్యం నైవేద్యంగా సమర్పించి ఆరాధించి రక్షణ కల్పించారు. ఈ చర్యతో స్వామి నెలకొన్న ద్వీపం కొంకొణొ శిఖారి ద్వీపంగా భాసిల్లుతుంది. అది మొదలుకొని ఈ ద్వీపంలో శ్రీ జగన్నాథుని పూజాదులు ఆచారం ప్రకారం నిర్వహిస్తున్నారు. సందర్శకులకు సదుపాయాలు చిలికా సరసులో స్వామి రథ యాత్ర ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు తరలి వస్తారు. వీరంతా తీరానికి పరిమితం కాకుండా సరసులో యాత్ర పడవతో తిరుగాడేందుకు పడవ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా నొయిరీ ఘాట్ నుంచి కొంకొణొ శిఖారి ద్వీపం వరకు భక్తులను తీసుకెళ్లడానికి ఉచిత పడవలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం యాత్ర సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. కొంకొణొ శిఖారీ ట్రస్ట్ భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉచిత రవాణాతో ప్రసాద వితరణ చేసింది. మహా ప్రభువు రథ యాత్ర భక్తులు, భగవంతుని అద్వితీయ కలయికకు ఈ యాత్ర నిలువెత్తు తార్కాణం. -
రహదారి సౌకర్యం కల్పించండి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి గడ్డి శశిఖాల్ పంచాయతీ మోండొలోపితేసు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో గ్రామానికి ఉన్నటువంటి మట్టిరోడ్డుపై కనీసం నడిచే అవకాశం కూడా లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. హనుమాన్ చాలీసా పుస్తకాలు పంపిణీ రాయగడ: సదరు సమితి దిసారిగుడ గ్రామంలో ఆధ్యాత్మికంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హనుమాన్ చాలీసా పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఆధ్యాత్మికురాలు జయంతి సెఠి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మన సనాతన ధర్మాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు తెలుసుకునేవిధంగా తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు గొడుగులను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్య మెలక తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై చేపలు పడుతూ నిరసన మల్కన్గిరి: దారి అధ్వానంగా ఉందని చెప్పినా ఏమీ చేయకపోవడంతో ఆ గ్రామస్తులు రోడ్డుపై చేపలు పట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో 19 వ వార్డులో గల రిక్లమేషన్ చౌక్ నుంచి ఎంవీ 43 గ్రామం వరకు దాదాపు 3 కిలోమీటర్ల దారి పూర్తిగా ధ్వంసమైపోయింది. రహదారి మధ్యలో 2 నుంచి 3 అడుగుల లోతైన గుంతలు పడి ఉండడంతో స్థానికులు శనివారం అందులో చేపలు పట్టి నిరసన తెలిపారు. ఆహార పానీయాలు పంపిణీ భువనేశ్వర్: సుదూర ప్రాంతాల నుంచి శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్శనకు విచ్చేసే రైలు ప్రయాణికుల కోసం ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో ఉచిత ఆహార పానీయ వితరణ కేంద్రం నిర్వహించారు. స్థానిక బాలాజీ మందిరం కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. రథ యాత్రను పురస్కరించుకుని రైల్వే శాఖ పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లు నడిపించడంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సేవలను అందిస్తున్నారు. పాముకాటుకు చిన్నారి మృతి కంచిలి: మకరాంపురం గ్రామానికి చెందిన గుడియా సాయిసా(10) అనే చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. గుడియా పూర్ణచంద్ర–గీత దంపతుల కుమార్తె సాయిసా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బరంపురం ఎం.కె.సి.జి. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. సాయిసా స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి పూర్ణచంద్ర టిఫిన్ హోటల్లో హెల్పర్గా, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నారి సాయిసాతోపాటు కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ కబడ్డీ పోటీలకు సిక్కోలు క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: మొదటి జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు చెందిన సత్తారు రామ్మోహనరావు, పోతనపల్లి యమున ఎంపికయ్యారు. ఈ పోటీలు జూన్ 29 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే వీరు ఏపీ జట్లతో కలిసి హరిద్వార్ చేరుకున్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
● ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు కంచిలి: కంచిలిలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బొగాబెణి పంచాయతీ జెన్నాగాయి గ్రామానికి చెందిన దుర్యోధన జెన్నా భార్య తులసి జెన్నా, మూడేళ్ల కుమారుడు ఢిల్లేశ్ జెన్నాలతో కలిసి బైక్పై కంచిలి బజారుకు బయలుదేరాడు. అదే సమయంలో పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న కారు అతివేగంతో వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలోకి ద్విచక్ర వాహనంతో సహా సుమారు వంద మీటర్లు ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న భర్త, భార్య, బిడ్డలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని 108 అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కారు కవిటి మండలం ఇంటెనకపుట్టుగ గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. కారు ను నిర్లక్ష్యంగా నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన దుర్యోధన జెన్నా గొల్లకంచిలి గ్రామంలో నిమ్మాసినమ్మ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. పూజా సామగ్రి కొనుగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంచిలి ఏఎస్ఐ పి.అప్పిరెడ్డి కేసు నమోదు చేశారు. -
ఘనంగా విక్రమదేవ్ వర్మ జయంతి
జయపురం: జయపురం మహారాజు రాజర్శి స్వర్గీయ విక్రమదేవ్ వర్మ 157వ జయంతిని జయపురంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఆర్మాల్ సభాగృహంలో జయపురం సాహిత్య పరిషత్, ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విక్రమదేవ్ వర్మ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజళి ఘటించి జయంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోఒడిశా సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ సురేంద్రనాథ్ దాస్ ముఖ్యవక్తగా పాల్గొని సామ్రాట్ విక్రమదేవ్ సాహితీ రంగానికి అందించిన సేవలు వివరించారు. సమావేశంలో గాయిత్రీ పాణిగ్రహి రచించిన స్మృతి పకుడ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాహితీవేత్త బంగాళీ నందోను విక్రమదేవ్ సమ్మాన్ 2025 తోను, ప్రొఫెసర్ సత్యనారాయణ రథ్ను, జయపురం సాహిత్య పరిషత్ సమ్మాన్తోను సన్మాణించారు. కార్యక్రమంలో కొరాపుట్ కోట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ రథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరేష్ రథ్, సాహిత్య పరిశోధకులు శ్రీరంగ నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి, పలువురు రచయితలు, సాహిత్యకులు పాల్గొన్నారు. విక్రమదేవ్ జయంతి సభలో పాల్గొన్న ప్రముఖులు -
విక్రమదేవ్ వర్మకు ఘన నివాళి
జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్కళాంధ్ర వారధి జయపురం మహారాజు సామ్రాట్ విక్రమదేవ్ వర్మ అని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. విక్రమ దేవ్ వర్మ 157వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఇంటాక్ కొరాపుట్ చాప్టర్ సహకారంతో స్థానిక శ్రీ విక్రమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ‘సిటీ ఆఫ్ విక్టరీ జయపుర’ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విక్రమదేవ్ వర్మ ప్రత్యేక ఒడిశా ఉద్యమంలో చిరస్మరణీయ భూమిక నిర్వహించారని గుర్తు చేశారు. ‘సిటీ ఆఫ్ విక్టరీ జయపుర’ ఫొటో ప్రదర్శనను కౌన్సిల్ ఆఫ్ అనాలిటికల్ ట్రైబల్ స్టడీస్ కొరాపుట్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ పరేష్ రథ్ నిర్వహించారు. -
ఏయూకి జయపూర్ రాజా రు. లక్ష విరాళం
కొరాపుట్: జయపూర్ మహారాజా 4వ విక్రం దేవ్ వర్మ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగంలో ఉన్న జయపూర్ విక్రం దేవ్ సెన్స్ అండ్ టెన్నాలజీ భవనం ముందు ఉన్న విక్రం దేవ్ వర్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. జయపూర్ రాజ వంశపు ప్రస్తుత వారసుడు, ప్రస్తుత మహారాజు విశ్వేశ్వర్ చంద్ర చుడ్ దేవ్ హజరై విక్రం దేవ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. సుమారు శతాబ్దం తర్వాత జయపూర్ నుంచి రాజా ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లారు. ఏయూ నిర్మాణ సమయంలో నాటి రాజా విక్రం దేవ్ వర్మ చాలా ఆర్థిక సహాయం చేశారు. 1926 వరకు ప్రతి ఏడాది రూ. లక్ష చొప్పున ఆక్కడి విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం పంపించేవారు. అప్పట్లో రూ. లక్ష విరాళానికి బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్య పోయారు. విక్రం దేవ్ చేసిన సహాయానికి గుర్తుగా ఏయూలో విక్రందేవ్ విగ్రహం ప్రతిష్టించారు. ఒక విభాగానికి నేటికీ అతని పేరు కొనసాగిస్తున్నారు. వారి వారసుడు చంద్ర చుడ్ దేవ్ తమ వంశీయుల పేరు ప్రతిష్టలు కాపాడడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఏయూకి లక్ష రూపాయల విరాళాన్ని శనివారం వర్సిటీ పాలకవర్గానికి అందజేశారు. మహారాజ ఆప్ కళింగ్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఇకపై ప్రతి ఏటా ఏయూకి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. -
కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం
కొరాపుట్: కల్తీ ఆహార పదార్ధా విక్రయాలపై అధికారులు ఉక్కు పాదం మొపారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అరుణ్ కుమార్ మహారణ నేతృత్వంలోని బృందం శనివారం పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మెయిన్ రోడ్డులో స్వీట్స్ షాప్స్, రోడ్డు పక్కన విక్రయించే చిరు తిళ్ల దుకాణాల్లో సోదాలు జరిపారు. సుమారు 80 కేజీల కల్తీ ఆహారాలను గుర్తించి డ్రైనేజీల్లో పార వేశారు. ఆహారంలో రంగులు కలిపి విక్రయించవద్దని వ్యాపారులను హెచ్చరించారు. జగన్నాథ రథా యత్ర నేపథ్యంలో రోజూ గ్రామీణ ప్రాంతాల నుంచి గిరిజనులు నబరంగ్పూర్ వచ్చి తిను బండారాలు కొనుగోళ్లు చేస్తారు. ఇటువంటి ఆహారాన్ని కొనుగోలు చేసి తింటే వ్యాధులు ప్రబలుతాయని అధికారులు పేర్కొన్నారు. -
మత్స్యావతారంలో జగన్నాథుడు
రాయగడ: రథయాత్రలో భాగంగా గుండిచా మందిరంలో కొలువుదీరిన దేవతామూర్తులు జగన్నాథ ,బలభద్ర, సుభద్రలు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు మత్స్యావతారంలో జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. భారీ వర్షంతో నిలిచిన రథాలు జయపురం: పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఒకరోజు ఆలస్యంగా జయపురంలో శనివారం రథయాత్ర ప్రారంభమైంది. అయితే రథాలు వెల్కం జంక్షన్ వద్దకు చేరుకునే సమయానికి భారీగా వర్షం కురవడంతో అక్కడే నిలిచిపోయాయి. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో వర్షం తగ్గడంతో మరలా రథాలు పయనం సాగించి గుండిచా మందిరానికి చేరాయి. యాత్రంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో మహిళ దుర్మరణం జయపురం: కూరగాయల తోటలో విద్యుత్ షాక్తో మహిళ దుర్మరణం పాలైన ఘటన జయపురం సదర్ పోలీసుస్టేషన్ పరిధి గొడొపొదర్ ప్రాంతంలోని ఏకతాగుడ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏకతాగుడ గ్రామంలో బిద్యుత్ మండల్ తన కాయగూరల పంటను పశువుల నుంచి రక్షించుకునేందుకు కంచె వేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అయితే అతడి భార్య ప్రియాంక మండల్ తోటకు వెళ్లింది. ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రియాంక విద్యుత్ షాక్కు గురై కింద పడిపోయింది. వెంటనే ఆమెను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందడంతో సదర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. గర్భిణికి డోలీ కష్టాలు! ●● డోలీలో ఐదు కిలో మీటర్లు మోసుకొచ్చిన కుటుంబ సభ్యులుకొరాపుట్: గర్భిణిని డోలీలో ఐదు కిలో మీటర్లు తరలించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ కెబిడి గ్రామ పంచాయతీ కుసుంబోట గ్రామానికి చెందిన త్రినాఽథ్ ముదలి భార్య రైలీ ముదలికి శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో మంచాన్ని డోలీగా చేసుకొని గిరిజనులు ఐదు కిలో మీటర్లు తరలించారు. మార్గమధ్యలో భారీ వర్షంతో పాటు కొండలు, గుట్టలు, అడవులు, నదులు దాటి ఆస్పత్రికి మోసుకొని వచ్చారు. అనంతర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ బిడ్డకి రైలీ ముదలి జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. -
రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన
కొరాపుట్: రోడ్డుపై ధాన్యం పోసి రైతులు ఆందోళనకు దిగారు. శనివారం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ కొట్పాడ్ సమితిలో జాతీయ రహదారిపై రైతులు ధాన్యం పోసి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలోని డుంగ్రి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వివాదం కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది రైతులకు చెందిన సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం ఉంది. వాటిని కొనుగోలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కాల పరిమితి తీరి పోతున్నందున ధాన్యం కొనుగోలు చేయాలని పలు మార్లు రైతులు విజ్ఞప్తి చేశారు. చివరకు జయపూర్లో సబ్ డివిజన్ కార్యాలయాలకు వినతి పత్రాలు సమర్పించారు. రథయాత్ర తర్వాల రోడ్ల పైకి దిగుతామని ముందే హెచ్చరించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం రోడ్లపై వేసి ఆందోళనకు దిగారు. -
కొఠియాలో అంగరంగ వైభవంగా రథయాత్ర
కొరాపుట్: ఆంధ్ర–ఒడిశా వివాదాస్పద ప్రాంతంలో అంగరంగ వైభవంగా రథయాత్ర జరిగింది. శనివారం రాష్ట్ర మంత్రి వర్గం భారీగా తరలివచ్చింది. ఈ ప్రాంతం తమదేనని పరోక్షంగా ఆంధ్రాకు సంకేతాలు పంపించింది. ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్దన్ సింగ్ దేవ్, రాష్ట్ర గనుల మంత్రి బిభూతి భూషణ్ జెన్నా, రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, మత్స్య శాఖ మంత్రి గోకులా నంద నాయక్ జయపూర్లో దిగారు. వీరికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల బృందం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న జగన్నాథ దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక గిరిజనులతో కలసి రథం మీదకు ఎక్కి పూజలు చేశారు. రథాన్ని లాగుతూ యాత్ర కొనసాగించారు. ఇంత వరకు చరిత్రలో ఏనాడూ ఈ స్థాయిలో అధికార యంత్రాంగం కొఠియా రాలేదు. ఈ సారి పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, కాంగ్రెస్కు చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క జత కలిశారు. సీఎల్పీ నాయకుడు రాం చంద్ర ఖడం, ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ బాహిణీపతి (జయపూర్), రుపుధర్ బోత్ర(కొట్పాడ్), రఘరాం మచ్చో(కొరాపుట్) ఐక్యంగా కొఠియా కోసం సంఘీబావ ప్రకటనలు చేశారు. కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కొఠియా పరిధిలో 22 గ్రామాల ప్రజలు ఈ యాత్ర లో పాల్గొన్నారు. పోలీసులు భారీగా మోహరించారు. -
● కన్నీటి వీడ్కోలు!
కొరాపుట్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఒకే చోట దహన సంస్కారాలు శనివారం నిర్వహించారు. చితిమంటలు ఎగసి పడుతుంటే కుటుంబ సభ్యులు కన్నీట పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నబరంగ్పూర్ జిల్లా జొరిగాం గ్రామానికి చెందిన చంపక్ లాల్ జైన్ కుమారుడు సాగర్ జైన్ (21), మహావీర్ జైన్ కుమారుడు అంకుర్ జైన్ (18), మన్ మెహన్ జైన్ కుమారుడు క్రిష్ జైన్ (22) కారు ప్రమాదంలో శుక్రవారం వేకువ జామున మృతి చెందారు. వీరి మృతదేహాలను జొరిగాం పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులందరు తమ తండ్రులకు ఒకే మగ సంతానం. అంతేకాక ఇద్దరు తండ్రులు అన్నదమ్ములు, మరో మృతుడు కూడా ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. దీంతో ముగ్గురు మృతదేహాలకు శనివారం జొరిగాం గ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్ర బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ముగ్గురు మృతికి సంతాపంగా జొరిగాంలో వర్తక వాణిజ్య సంస్థలను మూసివేశారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు మృతదేహాలకు ఒకేసారి దహ న సంస్కారాలు -
నయన పథగామి
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025జగన్నాథ స్వామీ.. దేవదేవుడు గర్భగుడి వదిలి భక్తుల వద్దకు తరలివచ్చాడు. కోవెల పరిసరాలను పావనం చేస్తూ రథాన్ని అధిరోహించాడు. కడలి ఘోషతో పోటీ పడుతూ సాగిన భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సుభద్ర, బలభద్ర సమేతుడై గుండిచాకు బయల్దేరాడు. గుండె గొంతుగా చేసుకొని జనం జయహో జగన్నాథ అని కీర్తిస్తుంటే.. చిరు మందహాసుడై ఆలకించాడు. ప్రేమగా రథాన్ని లాగుతుంటే అంతటి గొప్ప దేవుడు అవలీలగా ముందుకు కదిలాడు. నేత్రోత్సవం, నవ యవ్వన సేవతో అలసినా భక్తుల కోసం కొంతదూరం కదిలి, మిగిలిన దూరం మరుసటి రోజు వెళ్దామని సందేశమిచ్చాడు. – భువనేశ్వర్ భక్తుల కోసం తరలివచ్చే భగవంతుని దర్శనానికి ఆశేష ప్రజానికం పోటెత్తారు. దీంతో జై జగన్నాథ్ నినాదంతో శ్రీక్షేత్రం మారుమోగింది. భగవంతుని సమక్షంలో హెచ్చు తగ్గులకు తావులేదని రథయాత్ర ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. భక్తికి మించిన శక్తి వేరొకటి లేదని సర్వ జనులు భుజం భుజం కలిపి నింగికి ఎగసే మూడు భారీ రథాలను అవలీలగా గమ్యం చేర్చడం భగవంతునిపై విశ్వాసాన్ని బలపరుస్తుంది. కృత్రిమ మేధస్సుకు ధీటుగా సహజమైన భక్తిభావంతో సాక్షాత్తు జగతినాథుని రథానికి సాధారణ ప్రజలు యాంత్రిక, సాంకేతిక స్పర్శ లేకుండా నిరాటంకంగా ముందుకు లాగి సురక్షితంగా గమ్యం చేర్చడం అత్యద్భుత ఘట్టంగా అబ్బురపరుస్తుంది. సోదర, సోదరితో కూడి బయల్దేరిన శ్రీజగన్నాథుని రథయాత్రలో తరతరాలుగా సేవలందిస్తున్న వంశీకుల వారసులు, అనంత భక్తజనం ఆద్యంతం ప్రత్యక్ష పాత్రధారులుగా తారసపడతారు. ఇదే తరహాలో ఈ ఏడాది జరిగిన యాత్రలో వంశపారంపర్యంగా స్వామి కార్యంలో పాలుపంచుకుంటున్న వడ్రంగి, కమ్మరి వంటి సేవకులు రథాలను తయారు చేయగా.. దర్జీ, చిత్రకారులు, రూపకారులు ఆకర్షణీయంగా రథాలను తీర్చిదిద్దారు. భక్తజనం గుండిచా మందిరం వైపు యాత్రని సజావుగా నిర్వహించి మనమంతా ఒక్కటే, జగన్నాథుడు మనందరి వాడేనన్న సరళమైన భావనతో యాత్రని మేటిగా నిర్వహించారు. మార్మోగిన ఘంటానాదం తరంగ ధ్వనితో మారుమోగిన ఘంటానాదం మధ్య సువిశాల పుష్ప మకుట అలంకరణతో మూల విరాటులు వరుస క్రమంలో తరలి వచ్చి రథాల్లో ఆశీనులయ్యారు. రక్షకుడిగా సుదర్శనుడు ముందుగా బయల్దేరి సుభద్ర దేవి రథంలో ఆశీనేడు పునరారంభం భువనేశ్వర్: యాత్రలో వరుస క్రమంగా బయల్దేరిన మూడు రథాలు సకాలంలో గమ్యం చేరలేకపోయాయి. శ్రీమందిరం, శ్రీగుండిచా మందిరం మధ్యమార్గంలో నిలిచి పోయాయి. ఆచారం ప్రకారం చీకటి పడిన తర్వాత రథాలు లాగడం నిలిపివేయడం అనివార్యమైంది. శుక్రవారం సాయంత్రం 7.41 గంటలతో రథాలు లాగడం నిలిపివేశారు. బాలగండి చౌరస్తాలో బలభద్రుని తాళధ్వజం, మారీచ్కోట్ కూడలి ప్రాంతంలో దేవీ సుభద్ర రథం దర్ప దళనం, శ్రీజగన్నాథుని నంది ఘోష్ రథం శ్రీమందిరం సింహద్వారం దగ్గరే నిలిచిపోయింది. అనివార్య కారణాలతో ఈ రథం లాగడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. చీకటి పడడంతో లాంచనంగా లాగి నిలిపి వేశారు. ఉదయం 9.30 గంటలకు... మార్గమధ్యలో నిలిచిన రథాలను శనివారం ఉదయం 9.30 గంటలకు లాగడం ప్రారంభిస్తారని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. అంతవరకు నిత్య, దైనందిన, యాత్ర పూజాదులు రథాలపై యథాతథంగా కొనసాగుతాయి. భక్తులు నిరవధికంగా రథాలపై దేవుళ్లని దర్శించుకునేందుకు వీలవుతుందన్నారు. స్వామి సేవలో ప్రముఖులు శ్రీజగన్నాథుని రథయాత్రలో అంతా సమానమే. అతిరథ మహారథులు సాధారణ భక్తజనంతో కలిసిమెలిసి స్వామి రథంలాగి పుణీతం కావాలని పరితపిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో అదే తరహాలో పాల్గొని ఉత్సాహపరుస్తారు. ఈ ఏడాది జరిగిన రథయాత్రలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు దంపతులు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో పాటు పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నుడు అయ్యాడు. దీంతో మార్గం సుగమం ఖరారు సంకేతంగా భావించి బలభద్ర స్వామి బయల్దేరి తాళ ధ్వజంలో చేరాడు. అనంతరం సుభద్ర తన రథంలోకి చేరింది. అన్నా, చెల్లెలు ఉత్సాహంతో రథాల్లోకి చేరడంతో ఉవ్విళ్లూరుతున్న భక్తజనం మధ్యలోకి సుగంధ భరిత శ్రీజగన్నాథుడు నందిఘోష్ రథం అధిరోహించడంతో యాత్ర ప్రాంగణం హరీ భోల్.. జై జగన్నాథ్ నినాదాలతో శ్రీక్షేత్రం కంపించింది. మూల విరాటులు యాత్ర కోసం రథాల్లో చేరడంతో ఉత్సవమూర్తులు మదన మోహనుడు, రామకృష్ణులు తోడుగా చేరారు. వీరంతా చేరడంతో రథాలు కదిలే దేవాలయాలుగా తేజోవంతం అయ్యాయి. ఆది శంకరాచార్యులు, గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతీ రథాలపై దేవుళ్లకు తొలి దర్శనం చేసుకుని భక్త జనాన్ని ఆశీర్వదించారు. యాత్రకు బయల్దేరే ముందు రథాల్లో దేవుళ్లకు ఎటువంటి అశుచి ఆవహించకుండా తొలి సేవకునిగా పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్దేవ్ రాజ పురోహితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో బంగారు పిడి కలిగిన చీపురుతో మూడు రథాలను ఊడ్చి పవిత్ర జల సించనంతో సుగంధిత పుష్పాలు విరజిమ్మి స్వచ్ఛతని నికరం చేయడంతో రథాల కదలిక కోసం యంత్రాంగం రంగంలోకి దిగింది. రాజావారి సేవ పూర్తి కావడంతో రథాలకు సారథులు, కొయ్య గుర్రాలను అమర్చారు. ఘంటకులు ఇతరేతర వర్గాల వంశపారంపర్య సేవక వర్గం రథాలపైకి చేరి ఘంటానాదం ఆరంభం కావడంతో భక్తజనం ఊపందుకుంది. అన్నా చెల్లెళ్ల రథాల వెంబడి నంది ఘోష్ రథంలో శ్రీజగన్నాథ స్వామి చివరగా బయల్దేరాడు. రథయాత్ర తొలి ఘట్టం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. గుండిచా మందిరం అడపా మండపానికి మూల విరాటులు వెళ్లేంత వరకు దైనందిన నిత్య సేవలను రథాలపై యథాతథంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీజగన్నాథుడు అందరివాడు. కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా సర్వ జనులను కటాక్షించే ప్రత్యక్ష దైవం. యావత్తు భక్తజనం ఏక కాలంలో జై జగన్నాథ్ నినాదంతో ప్రార్థిస్తారనేదానికి ఈ చిత్రం నిలువెత్తు సాక్ష్యం. – భువనేశ్వర్/పూరీ పూరీ తీరం.. భక్తజన సంద్రం వైభవంగా జగన్నాథ రథయాత్ర కనులారా స్వామిని చూసి తరించిన భక్తజనం -
జగన్నాథునికి బాహు కవచం
భువనేశ్వర్: అస్వస్థత నుంచి కోలుకున్న వెంటనే జగతి నాథుడు భక్తజనం మధ్యకు తరలి వచ్చాడు. స్వీయ రక్షణ కోసం అత్యంత జాగ్రత్తతో బయటకు అడుగు పెట్టడం విశేషం. యాత్రలో భాగంగా పలుమార్లు ఎత్తుడు, దింపుడు మధ్య మూల విరాటులు నలిగి పోతాయి. ఈ సన్నాహంలో శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ప్రత్యేక రక్షా కవచ ధారణతో బయల్దేరుతాడు. ఈ సందర్భంగా చేపట్టే చర్యని బాహు కవచం అమరిక (బాహుటొ కొంటొకొ)గా వ్యవహరిస్తారు. దైతపతి సేవకులు ఎంతో బాధ్యతతో మూల విరాటులకు బాహు కవచాల్ని అమర్చుతారు. ఈ పని పూర్తయినట్లు ధ్రువీకరించిన తర్వాత మూల విరాటులను కదిపేందుకు పూనుకుంటారు. ఈ సన్నాహంతో శ్రీ భుజాలు దృఢంగా తయారవుతాయి. ఎత్తుడు, దింపుడులో (పొహండి) ఎటువంటి హాని సంభవించేందుకు అవకాశం ఉండదు. స్నాన పూర్ణిమకు ముందుగానే వీటిని సిద్ధం చేస్తారు. జ్యేష్ట శుక్ల పక్ష త్రయోదశి నాటికి స్నానయాత్ర, రథయాత్ర మరియు మారు రథయాత్ర కోసం అవసరమైన బాహు కవచాలను సిద్ధం చేస్తారు. ఈ మూడు సందర్భాల్లో మూల విరాటులు రక్షా కవచంతో బయటకు వస్తాయి. స్వామి సేవలో సామగ్రి పునర్వినియోగం ఉండదు. ఏటా సాక్షి గోపాల్ వకుల వనం నుంచి తరలించే బొగొడ చెట్టు చెక్కతో మూల విరాటుల రక్షా కవచం తయారు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. చరిత్రను పరిశీలిస్తే.. దీని వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. సాక్షి గోపాలు వకుల వనంలో ఒక సన్యాసి తపస్సులో నిమగ్నమై ఉన్న తరుణంలో పరీక్షించేందుకు సోదరులు శ్రీ జగన్నాథుడు, బలభద్ర స్వామి సాధారణ వ్యక్తుల రూపంలో వనంలోనికి చొరబడి అక్కడ చెట్టులో పండిన పనస పండుకోసే మెషిన్తో అలికిడి చేస్తారు. ఆ శబ్దానికి తపో దీక్షలో ఉన్న సన్యాసి ఉలికిపడి ఇరువురినీ నిలదీస్తాడు. వీరిరువురు వాస్తవ వివరణ తెలియజేయకపోవడంతో తెల్లారే వరకు వనంలో బొగొడ చెట్టుకు కట్టి పడేసి ఉదయం రాజావారు ముందు ప్రవేశ పెడతానని బెదిరించడంతో దేవుళ్లు ప్రత్యక్షం అవుతారు. ఈ వాస్తవం బాహ్య ప్రపంచానికి తెలియకుంటే పనస పండు దొంగతనం నింద తనకు చుట్టుకుంటుందని సన్యాసి ప్రాధేయపడతాడు. సన్యాసి అభీష్టం మేరకు జగతికి తెలియజేసేందుకు ఏటా 3 సార్లు వకుల వనంలో బొగొడ చెట్టు కలపతో రక్ష కవచం ధారణ చేసి యావతు భక్త జనం మధ్య ప్రత్యక్షం అవుతామని వరం ఇచ్చి అదృశ్యమవుతారు. మానవ రూపంలో దేవుళ్లను ఏ చెట్టుకు కట్టి పడేస్తామని సన్యాసి బెదిరించాడో, అదే చెట్టు కలపని ఏటా 3 సార్లు మూల విరాటులు కట్టుకుని బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షం కావడంతో భగవంతుడు, భక్తుని మధ్య భక్తిభావ సంబంధానికి ప్రతీకగా కొనసాగుతుందని చెబుతారు. -
సర్వం జగన్నాథం
● రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రథయాత్ర పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శాస్త్రోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పట్వారీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్లో... కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్పూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. -
చోరీ కేసులో నిందితులు అరెస్టు
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి జిల్లాలోని అంబొదల పోలీసులు 11 మంది నిందితులను అరెస్టు చేశారు. అంబొదల పోలీస్స్టేషన్ పరిధి జగదల్పూర్ ప్రాంతంలోని ఒక క్రషర్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ చోరీ కేసు లో నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి నాలుగు ఇనుప పైప్లు, గ్యాస్ కట్టర్లు, మూడు ఆక్సిజన్ సిలెండర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను గురువారం కోర్టుకు తరలించారు. ఎడతెరిపి లేని వర్షం ● కొట్టుకుపోయిన రోడ్డు జయపురం: కొరాపుట్ జిల్లాలో కొద్ది రోజులు గా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా యి. దీంతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుగడ సమితి చిపాకూర్ పంచాయతీ ప్రధాన మార్గంలోని కిర్షాల గ్రామ సమీపంలో నిర్మించి న కల్వర్టు, రోడ్డు కొట్టుకుపోయాయి. 6 నెలల క్రితం నిర్మించిన కల్వర్టు కూలిపోగా, తారురోడ్డు కొట్టుకుపోయింది. వీటిపై ఆధారపడి సుమారు 6 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కల్వర్టు కూలిపోవడంతో ప్రస్తుతం ఆయా గ్రామాలకు సమితి కేంద్రాల తో సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా నాణ్య తా ప్రమాణాలు పాటించకపోవడం వలనే కొట్టుకుపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నా రు. రూరల్ డవలప్మెంట్ అధికారులు తక్షణ మే చర్యలు తీసుకొని రోడ్డు పునరుద్ధరించాలని కోరుతున్నారు. డివైడర్ను ఢీకొన్న ట్యాంకర్ రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి దిగుతున్న ట్యాంకర్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొంది. శుక్రవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి బ్యాక్ ఆయ ల్ లోడ్తో జాజ్పూర్ వైపు వెళ్తున్న ట్యాంకర్ స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ దిగుతు న్న సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ఆటోని తప్పించబోయి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సంతోష్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచా రం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం మోహన్ చరణ్ రాజీనామా చేయాలి జయపురం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అల్పవర్గాల ప్రజలు, దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ ఆరోపించింది. అత్యాచారాలు అరికట్టలేని సీఎం మోహన్చరణ్ మాఝీ రాజీనామా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జయంతి దాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం ప్రధాన కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఆందోళనలో రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు, కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి, సీపీఐ జిల్లా కార్యదర్శి జుధిష్టర రౌలో, సహాయ కార్యదర్శి కుమార్ జాని, జిల్లా మాజీ సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, సత్యభ్రత నందో, నంద హరిజన్, బలభధ్ర బోయి, పవన మహుళియ, ఘాశీరాం సాహు తదితరులు పాల్గొన్నారు. అపురూప అవకాశం ● గవర్నర్ హరిబాబు కంభంపాటి భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ స్వామి వార్షిక రథయాత్రలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి దంపతులు పాల్గొన్నారు. ఇదో అపురూప అవకాశమని పేర్కొన్నారు. బొడొ దండొలో జై జగన్నాథ నినాదాల మధ్య రథా లు కదులుతున్న దృశ్యం ప్రజల భక్తిశ్రద్ధల అపూర్వ సంగమంగా హృదయాన్ని హత్తుకుందన్నారు. దైవ చింతనలో ఐక్యత మరియు విశ్వాసం మమేకం కావడం శ్రీజగన్నాథుని లీలగా తన్మయత్వం వ్యక్తం చేశారు. శ్రీజగన్నా థుని రథయాత్ర ఆనందకరమైన భక్తి వాతావరణ ఆవిష్కరణకు నాందిగా పేర్కొన్నారు. సుదర్శనుని పొహండి భువనేశ్వర్: యాత్రలో రక్షకునిగా సుదర్శనుని స్థానం అత్యంత కీలకం. మూల విరాటుల కంటే ముందుగా సుదర్శనుడు శ్రీమందిరం నుంచి బయటకు తరలివచ్చి రథంపై ఆసీనుడు అయ్యాడు. ఆయన చతుర్థామూర్తిగా మూల విరాటుల సరసన నిత్యం దర్శనం ఇస్తాడు. సుభద్ర దేవి రథంలో రక్షకునిగా యాత్ర కొనసాగిస్తాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం
● ముగ్గురు యువకులు మృతి కొరాపుట్: ఒక కుటుంబానికి చెందిన చేతికందివచ్చిన యువకులు ఒకేసారి మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా జొరిగాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జొరిగాంకు చెందిన చంపక్ లాల్ జైన్ కుమారుడు సాగర్ జైన్ (21), మహావీర్ జైన్ కుమారుడు అంకుర్ జైన్ (22), మన్మోహన్ జైన్ కుమారుడు క్రిష్ జైన్ (18)లు మృతి చెందారు. వీరంతా కారులో పుప్పుగాం రోడ్డులో వెళ్తుండగా దినేగుడ గ్రామం వద్ద బురద వలన వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంట నే సాగర్ జైన్, అంకుర్ జైన్లు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన క్రిష్ జైన్ని పోలీసులు అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులు తండ్రులు ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరో వ్యక్తి ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి. ముగ్గురు యువకులు వారి తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమారులు కావడం విచారకరం. -
కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025 -
రథయాత్రకు త్రివిధ భద్రత
● డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ విజయవంతం ● శ్రీ జగన్నాథ ధామ్ యాప్ ప్రారంభం భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధునాతన వ్యవస్థతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జల, స్థల, వాయు మార్గాల్లో యాత్ర సమగ్ర పరిసరాలపై నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో పూరీ శ్రీ మందిరం శిఖరాన డ్రోన్ సంచారం కలవరపరుస్తోంది. యాత్ర పురస్కరించుకుని ఈ బెడద తలెత్తకుండా అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని ప్రవేశ పెట్టారు. పటిష్టమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం శక్తివంతమైన వాహనాలు తదితర సరంజామాతో నిపుణులైన సిబ్బందిని రంగంలోకి దింపారు. ఈసారి కృత్రిమ మేధస్సుని విస్తారంగా ప్రయోగిస్తున్నారు. ఏఐ అనుసంధానంతో పూరీ పట్టణ వ్యాప్త సీసీటీవీ వ్యవస్థ పర్యవేక్షణ, వాహనాల రవాణా తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. భద్రతా యంత్రాంగంతో యాత్రికులు, సాధారణ ప్రజానీకానికి ఏఐ అనుసంధానం అక్కరకు రానుంది. ఈ ఏడాది తొలి సారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా బుధవారం ఈ క్రేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. రథ యాత్ర పురస్కరించుకుని పూరీ పట్టణం వాహనాల రవాణాతో రద్దీగా తయారుకాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రద్దీ పెరుగుదలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ని జారీ చేశారు. ఈ కోడ్ని స్కాన్ చేయడంతో వాహనాల రవాణా తాజా వ్యవస్థని ప్రతి ఒక్కరూ సులువుగా తెలుసుకునేందుకు వీలు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపుల కోసం 112కు డయల్ చేయాలని పూరీ పోలీసు యంత్రాంగం ప్రకటించింది. డ్రోన్ కూల్చివేత రథయాత్రకు ప్రతిపాదించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని బుధవారం ప్రారంభించారు. ఈ వ్యవస్థ తొలి విజయాన్ని సాధించింది. శ్రీ మందిరం శిఖరం ఆకాశ మార్గంలో సంచరిస్తున్న డ్రోన్ కుప్ప కూలింది. దీన్ని పరిశీలించగా శ్రీ మందిరం దక్షిణ ద్వారం పరిసరాల్లో శ్రీ మందిరంపై చక్కర్లు కొడుతున్నట్లు తేలింది. కొత్తగా ప్రారంభించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని దీన్ని కుప్ప కూల్చింది. ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కుప్పకూలిన డ్రోన్ స్వాధీనపరచుకుని నిర్వీర్యపరిచారు. దీని ప్రయోగం పూర్వాపరాలపై విచారణ కొనసాగుతుంది. శ్రీ మందిరం ప్రాంగణనం నో ఫ్లయింగ్ జోన్ పరిధిలో ఉన్నందున డ్రోన్ వినియోగం నిషేధంగా పేర్కొన్నారు. తీర ప్రాంతంలో కోస్టు గార్డుల పహరా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో అవాంఛనీయ, అభ్యంతరకర చొరబాటులు నివారించేందుకు ఈ వ్యవస్థ రాత్రింబవళ్లు పని చేస్తుంది. సాగర తీరంలో కెరటాల్లో కొట్టుకుపోవడం వంటి సంఘటనల నివారణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన లైఫ్ గార్డుల్ని తీరంలో అనుక్షణం అందుబాటులో ఉండేలా నియమించారు. శ్రీ జగన్నాథ ధామ్ యాప్ ఈ ఏడాది యాత్ర సందర్భంగా శ్రీ జగన్నాథ ధామ్ మొబైల్ యాప్ ప్రారంభించారు. దీనిలో దర్శన వేళలు, సేవా బుకింగు, వసతి సమాచారం, ఆలయ సేవలు, నిత్య పూజాదులు, దర్శనం కోసం క్యూ తాజా పరిస్థితి, రథ యాత్ర సౌకర్యాలు, అత్యవసర సేవలు సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది. -
ఈస్టుకోస్ట్ రైల్వే ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మిశ్ర
కొరాపుట్: ఈస్టుకోస్ట్ రైల్వే విభాగ ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మి శ్ర నియమితులయ్యారు. గురువారం ఈస్ట్కోస్ట్ రైల్వే ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ ప్రస్తుతం జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్నారు. ఇకపై నబరంగ్పూర్ జిల్లాలో ఈస్ట్కోస్ట్ రైల్వే శాఖ తరుపున అన్ని కేసులు వాదించనున్నారు. ప్రస్తుతం నబరంగ్పూర్–జయపూర్, నబరంగ్పూర్–జునాఘడ్ రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ అనేక కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కేసులు వాదించడానికి సంతోష్ని నబరంగ్పూర్ జిల్లాలో నియమించింది. యాత్రికులకు జీవిత బీమా భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తులు, యాత్రికులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పూరీ మున్సిపల్ ప్రాంతం పరిధిలో జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం పరిమితం. యాత్ర సమయంలో ప్రమాదాలు, అసహజ మరణాలు, తొక్కిసలాటలు, ఉగ్రవాద దాడులు వంటి ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సౌకర్యాన్ని సేవకులు, శ్రీ జగన్నాథ ఆలయ సిబ్బందికి విస్తరింపజేయడం విశేషం. విద్యుత్ కోతలపై నిరసన కొరాపుట్: విద్యుత్ కోతలను నిరసిస్తూ నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రం విద్యుత్ సెక్షన్ కార్యాలయం ముందు స్థానికులు గురువారం ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైన స్తంభాలు, వైర్లు మార్చాలని, ప్రతీ పంచాయతీకి ఫీడర్ ఏర్పాటు చేయాలని, స్మార్ట్ మీటర్లు తొలగించి, పాత మీటర్లు పునరుద్దరించాలని కోరారు. అలాగే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తి వేయాలని, విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకి సంఘీభావం ప్రకటిస్తూ మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి బైఠాయించారు. రథ యాత్రలో ఉచిత ఆటో సేవలు భువనేశ్వర్: పూరీ రథయాత్రలో ఉచిత ఆటో సేవల సౌకర్యం కల్పించినట్లు రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి బిభూతి జెనా తెలిపారు. యాత్రికులకు 200 ఆటోలు ఉచిత సేవలు అందిస్తాయి. దీంతో ఉచిత ఆహారం సరఫరా అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి పూరీ యాత్ర స్థలానికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసే బస్సులు నిలిపేందుకు 28 ప్రదేశాల్లో పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. హత్య కేసులో మరో ఐదుగురు నిందితులు అరెస్టు రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు ఒక హత్యకేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జుమురుగుడ గ్రామానికి చెందిన శివ సాహు, సంతోష్ సాహు, అమర్ సాహు, పింకూ సాహు, బుడుపలమలు ఉన్నారు. గతేడాది మే 21వ తేదీన జుమురుగుడ గ్రామంలో నివాసముంటున్న భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణపై గ్రామంలో కొందరు అత్యంత దారుణంగా మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో 21 మందిని పద్మపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో గజపతి జిల్లా వలస కూలీ మృతి పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ పంచాయతీ గరడమా గ్రామనివాసి మహేంద్ర బోలియార్సింగ్ (30) పని కోసం కొద్దిరోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం వెళ్లి ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ కింద పడి మృతి చెందినట్టు అడవ పోలీసు అధికారికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మహేంద్ర బోలియార్సింగ్ నుంచి ఎలాంటి సమాచారం గానీ ఫోన్ కాల్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులకు మృతి చెందినట్టు రైల్వే పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో మహేంద్ర కుటుంబసభ్యులు ఎర్నాకుళం నుంచి మృతదేహాన్ని తీసుకురావాలని బీడీఓను కోరారు. -
కనరో భాగ్యము
● నేడే పూరీ రథయాత్ర ● సకల ఏర్పాట్లు సంసిద్ధం భువనేశ్వర్: శ్రీక్షేత్రంలో ఉత్సవ ఉత్సాహం కనిపిస్తోంది. ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపద తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో మూల విరాట్లు నవయవ్వన రూపంలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. మరో వైపు శుక్రవారం జరగనున్న యాత్ర కోసం స్వామిని తీసుకుని వెళ్లేందుకు శ్రీ మందిరం సింహ ద్వారం ముంగిటకు చేరాయి. తయారీ ప్రాంగణం నుంచి దక్షిణాభిముఖంగా మూడు కొత్త రథాలు వరుస క్రమంలో శ్రీ మందిరం ముంగిటకు చేరాయి. ఈ యాత్ర ఉభా యాత్రగా సుపరిచితం. అన్న బలభద్ర స్వామి అనుమతితో శ్రీ జగన్నాథుని రథం నందిఘోష్ ముందుగా తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరడం విశేషం. వెంబడి సోదరి దేవీ సుభద్ర రథం దర్ప దళనం బయల్దేరింది. చివరగా బలభద్ర స్వామి రథం తాళ ధ్వజం శ్రీ మందిరం వాకిలికి చేరింది. ఈ దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. నవ యవ్వన దర్శనాన్ని ఉభా యాత్రగా పేర్కొంటారు. సాయంత్రం 4.40 గంటలకు మూల విరాట్ల నుంచి ఆజ్ఞా మాలలు చేరడంతో మూడు రథాలు వరుస క్రమంలో లాగడం ప్రారంభించారు. ముందస్తు సన్నద్ధత ప్రకారం పోలీసుల భద్రత వలయాల మధ్య రథాలు సురక్షితంగా ముందుకు సాగాయి. రాత్రంతా సన్నాహాలు స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా తహతహలాడి పోయారో భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించేందుకు స్వామి అంతకంటే అధికంగా ఆరాటపడడం అద్భుతం. తెల్లారితే పరిపూర్ణ దర్శనంతో నేత్రోత్సాహం కలిగించేందుకు రాత్రి అంతా స్వామి మేలుకొని ఏకాంత సేవకు దూరమయ్యాడు. స్నాన యాత్ర నుంచి 15 రోజుల విరామం తర్వాత దేవతలు నవయువ వేషంలో భక్తులకు నవ యువకునిగా దర్శనం ఇచ్చేందుకు శ్రీ ముఖ అలంకరణ (బొనొకొ లగ్గి)లో తలమునకలయ్యాడు. ఒణొసొరొ చతుర్దశి, ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయ నియమాల ప్రకారం దత్త మహా పాత్రో సేవకులు మూల విరాట్లకు శ్రీ ముఖ సేవతో నవ యవ్వనంగా తీర్చిదిద్దారు. అనంతరం నవయువ దర్శనం సన్నాహాలు ప్రారంభించారు. రథాల పైకి వెళ్లే ముందు శ్రీ మందిరంలో ఆకర్షణీయమైన అలంకరణలో చతుర్థామూర్తులను దర్శించుకోవడం అపురూప అవకాశంగా భక్తులు భావిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ మందిరం దక్షిణ ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. తొలి గంట పరకామణి దర్శనం కల్పించారు. ఆ తర్వాత సర్వ దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు స్వల్ప అంతరాయంతో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్ర పటాల తొలగింపు భారీ స్నానంతో స్వామి అస్వస్థతకు గురి కావడంతో తెరమరుగైన 15 రోజులపాటు ప్రధాన దేవతల ప్రతీకగా దర్శనం ఇచ్చిన చిత్ర పటాల దేవుళ్లను ముందుగా తొలగించారు. చిత్ర పటాలతో పూజలందుకున్న శ్రీ జగన్నాథుని ఉత్సవ మూర్తి మదన మోహనుడు, డోల గోవిందుడు, బలభద్రుని ఉత్సవ మూర్తులు రామకృష్ణులు, నృసింహుని దక్షిణ గృహానికి తరలించారు. శ్రీ దేవి, భూదేవి ఉత్సవ మూర్తుల్ని శయ్యా గృహానికి తరలించారు. అనంతరం బలభద్ర స్వామి ప్రతీక రూపం అనంత వాసుదేవుడు, శ్రీ జగన్నాథుని ప్రతీక చిత్రపట దేవుడు అనంత నారాయణుడు, దేవీ సుభద్ర ప్రతీకగా పూజలందుకున్న భువనేశ్వరి చిత్రటాలను విమలా దేవి ఆలయం సమీపంలో మొండొణి గృహానికి తరలించారు. తెరలు తొలగడంతో చివరగా దేవతలు చికిత్స పొందిన ప్రాంగణంలో మంచం వగైరా తొలగించి కడిగి సున్నం నీరు చిమ్మి శుద్ధి చేశారు. కొఠొ సుంవాసియా సేవకులు ఈ పనుల్లో పాలుపంచుకోవడం ఆచారం. ఈ తంతు అంతా ముగిసే సరికి తెల్లారి పోవడంతో బుధవారం రాత్రి అంతా మెలకువగానే ఉండాల్సి వచ్చింది. నిర్విరామంగా భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించి నేత్రోత్సవం జరుపుకున్నాడు. నేడు రథ యాత్ర స్వామి పూర్తిగా కోలుకుని నవ యువకుని ఉత్సాహంతో యాత్ర కు సిద్ధమయ్యాడు. యాత్ర కోసం రథాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని స్వామి రాక కోసం నిరీక్షిస్తున్నాయి. స్వామి తెర మరుగున ఉన్న రోజుల్లో వేధించిన ఉక్కపోత వాతావరణం సానుకూలంగా మారింది. అదే సమయంలో వరుణ దేవుడు కరుణించే సంకేతాలు లభిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర వారం భారీ నుంచి అతి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. పూరీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఉపరితల గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు ఉంటుందని అంచనా. సింహద్వారం ముంగిటకు రథాలు రథయాత్ర కోసం మూడు రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు సురక్షితంగా చేరాయి. రథాలపైకి మూల విరాటులు తరలించేందుకు వీలుగా అమర్చాల్సిన చారుమళ్లు, రథాలు లాగేందుకు అవసరమైన తాళ్లు తదితర సామగ్రి రథాల ప్రాంగణానికి చేరాయి. రథాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.00 గంటలకు రథాల తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరిన శ్రీజగన్నాథుని నందిఘోష్ రథం సాయంత్రం 5.40 గంటలకు, తర్వాత సాయంత్రం 5.54 గంటలకు బయల్దేరిన సుభద్ర రథం దర్ప దళనం సాయంత్రం 6.26 గంటలకు, చివరగా సాయంత్రం 6.37 గంటలకు బయల్దేరిన బలభద్రుని తాళధ్వజం రాత్రి 7.15 గంటలకు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు చేరాయి. -
బీజేడీ శ్రేణుల ఆందోళన
కొరాపుట్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లోని విద్యాలయాల ఎదుట బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ పార్టీ యువజన విభాగం బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో కూడా ఆందోళనలు జరగ్గా.. సంఘీభావంగా పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఆందోళను చేపట్టారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి మాట్లాడుతూ.. అమెరికా వంటి దేశం తమ పౌరులలో మహిళలను ఒడిశా వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన దుస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొందన్నారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, తపస్ త్రిపాఠి, మంజులా మజ్జి పాల్గొన్నారు. కొరాపుట్ డీఏవీ కళాశాల మందు జరిగిన ఆందోళనలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మిత మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మున్సిపల్ చైర్మన్ లలిల్ శెఠి హాజరయ్యారు. జయపూర్లోని విక్రందేవ్ యునివర్సిటీ, డాబుగాం, ఉమ్మర్ కోట్లలో జరిగిన ఆందోళనలో బీజేడీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: స్థానిక అటానమస్ కళాశాల మెయిన్ గేట్ వద్ద బుధవారం బీజేడీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిప్పులు చెరిగాయి. బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువయ్యిందని దుమ్మెత్తి పోశాయి. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి దిష్టిబొమ్మను దహనంచేశారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేడీ యువ నాయకులు వినోద్ పొలాయ్, అవినాష్ బిసొయ్, సంతోష్ దొళాయి, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: గంజాం జిల్లా గోపాల్పూర్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన నిరసిస్తూ విపక్ష బీజేడీ ఛత్ర పరిషత్ నాయకులు బుధవారం పర్లాకిమిడి హైస్కూల్ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బీజేడీ ఛత్ర సంసద్ అధ్యక్షుడు త్రిపాఠి హెచ్చరించారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బిశ్వజిత్ త్రిపాఠి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్నాయక్, కాశీనగర్ నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు రఘురాం సాహు, గుసాని జెడ్పీ సభ్యులు శాసనం బాలరాజు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, ఎస్.గజపతిరావు, బీజేడీ యువజన నాయకులు శాసనం లింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ మార్కెట్లో గుర్తింపు తీసుకువస్తాం
కొరాపుట్: తరతరాలుగా కొరాపుట్ జిల్లాలో పేరెన్నిక గల ఉత్పత్తులను జాతీయ మార్కెట్ గుర్తింపు తెస్తామని జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ప్రకటించారు. బుధవారం కలక్టరేట్లో జరిగిన సమీక్షలో ప్రసంగించారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గిరిజనులు పండిస్తున్న కాలా జిర (నల్ల ధాన్యం), కొరాపుట్ కాపీ పంట, కొట్పాడ్లో గిరిజనుల నేత చీరలు ముఖ్యమైనవని అన్నారు. ప్రభుత్వ ఎంఎస్ఎంఈ విభాగంతో కలిసి వీటి మార్కెటింగ్ దేశీయ స్థాయిలో చేస్తామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరాపుట్ బ్రాండ్తోనే విక్రయాలు జరుగుతాయన్నారు. -
రథం నిర్మాణానికి రూ. ఒకలక్ష విరాళం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ జగన్నాథ రథం నిర్మాణానికి జయపూర్ మహారాజు చంద్ర చుడ్ విశ్వేశ్వర్ దేవ్ రూ. లక్ష విరాళం అందజేశారు. బుధవారం నందపూర్ జగన్నాథ మందిర నిర్వాహణ కమిటీ పెద్దలకు జయపూర్ రాజ కోట వద్ద రాజ పరివార సిబ్బంది విరాళం మొత్తాన్ని అందించారు. నందపూర్ రాజధానిగా చేసుకొని సూర్య వంశీయులు పరిపాలన చేశారు. అనంతరం వీరు జయపూర్ని రాజధానిగా మార్చుకున్నారు. నాడు సూర్య వంశీయులు నందపూర్లో స్థాపించిన 17 దేవ దేవి పీఠాలను నేటికీ అక్కడ ప్రజలు కొలుస్తున్నారు. నందపూర్ కమిటీ సభ్యులు జగన్నాథ పంగి, భువనేశ్వర్ దళపతి, బుడు పూజారిలు జయపూర్ రాజమహాల్కి తరలి వచ్చారు. వీరికి రాజ మహాల్ మేనేజర్ కిషన్ కుమార్ నగదు అందజేశారు. రథాయాత్ర రోజున రథం మీద ఉండే ముగ్గురు దేవతా మూర్తులకు ఇచ్చే రాజ విందుకి రాజ ప్రతినిధి హాజరవుతారని రాజ ప్రసాదం సందేశం ఇచ్చింది. -
నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. జ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిషేకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. -
రథాలపై నీలచక్రాల అమరిక
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోత్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణ లేదు
● వోపీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విచారం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అంశంపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు, ఫోను సంప్రదింపులకు స్పందించ లేదు. లేఖలకు ఆయన సమాధానం ఇవ్వలేదని భక్త చరణ్ దాస్ అన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయబోమని అయితే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని.. సమస్య పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతామన్నారు. –రాష్ట్రపతి దృష్టికి సమస్య.. మహిళల పట్ల అత్యాచారాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రంలో పరిస్థితిని వివరించాలని భావిస్తోంది. గంజాం జిల్లా గోపాల్పూర్, కంధమల్ జిల్లా టికాబలి, కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్ ప్రాంతాలలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలపై నిజ నిర్ధారణ కమిటీ నేరుగా వెళ్లి ఆరా తీసింది.. పర్యటన చివరి రోజున స్థానిక కాంగ్రెస్ భవనన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్ మున్సి మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు కమిటీ నిజ నిర్ధారణ నివేదికను సమర్పిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళల భద్రత కోసం సమయం లేనందున రాష్ట్రంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ఢిల్లీ స్థాయిలో లేవనేత్తుతామన్నారు. -
అక్రమ మైనింగ్ అడ్డగింత
కొరాపుట్: అక్రమ మైనింగ్ని అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి లుంగ్రి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే జిల్లా మైనింగ్ అధికారులు సిమిలిగుడ పోలీసులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల రాకను గమనించిన మైనింగ్ చేస్తున్న వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే తవ్వకాల కోసం వినియోగిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్ని అధికారులు సీజ్ చేసి సిమిలిగుడ పోలీస్స్టేషన్కి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
గవర్నర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి బుధవారం ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, ఇంధన రంగంలో సంస్కరణలు, వ్యవసాయ రంగం ప్రోత్సాహకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి అన్ని విభాగాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని గవర్నర్ ప్రస్తావించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు రాయగడ: స్థానిక ఉత్కళ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్ వద్ద సరస్వతి శిశు మందిరంలో బుధవారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్ విభాగంలో సొనాలి ప్రధాన్ ప్రథమ, హర్షిత హిమిరిక ద్వితీయ, సంజయ్ బాగ్ తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్ విభాగంలో ప్రజ్ఞాశ్రీ నందో ప్రథమ, శుభశ్రీ పండా ద్వితీయ, శుధాంశు బాల భర్తియా తృతీయ బహుమతులు గెలుపొందారు. కార్యక్రమంలో అసొసియేషన్ అధ్యక్షులు దయానిధి ఖడంగా, రాయగడ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శుభ్ర పండా, ఉత్కళ అల్యూమినియం కర్మాగారం కార్పొరేటర్ అండ్ పీఆర్ఓ పీతాంబర్ బెహరా తదితరులు పాల్గొన్నారు.జనావాసాల్లోకి విషసర్పాలు రాయగడ: జిల్లాలోని మునిగుడలొ కొండప్రాంతాలకు సమీపంలోని వీధుల్లో నివసిస్తున్న ప్రజలు విషసర్పాల బారిన పడి భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా విషసర్పాలు జనవాసాల్లోకి ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో పొదల్లో నుంచి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రమోద్ సాహు అనే వ్యక్తి ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడింది. దీంతో ఆ ఇంటిలోని వారు ఆందోళన చెందారు. స్నేక్స్నాచర్ ద్వారా పామును పట్టించి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమష్టి కృషితోనే వర్సిటీ అభివృద్ధి ●● వీసీ ఆచార్య కేఆర్ రజనీ ● ఘనంగా బీఆర్ఏయూ 18వ వ్యవస్థాపక దినోత్సవం ఎచ్చెర్ల: అందరి సమష్టి కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతోందని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనీ అన్నారు. వర్సిటీ 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ వెనుకబడిన ప్రాంతంలో స్థాపించిన వర్సిటీ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించుకోవాలన్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఇటీవల విడుదలైన పీఎం ఉషా నిధులను వర్సిటీ బలోపేతానికి, మౌలిక వసతులు పెంచేందుకు, నూతన నిర్మాణాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎదైనా సమస్య ఉంటే తనకు నేరుగా తెలియజేయాలన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పరీక్షలకు అబ్జర్వర్లను నియమించాలని అంటున్నారని, అయితే ఇన్విజిలేటర్ ఉండగా పరీక్షల్లో చూచిరాతలకు తావు ఉండదని పేర్కొన్నారు. తక్కువ బడ్టెట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అబ్జర్వర్లను నియమిస్తే అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. వర్సిటీతో పేదలకు ఉన్నత విద్య వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ గిరిజన, పేద వర్గాలకు ఉన్నత విద్యనందించడంలో వర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత మాట్లాడుతూ గత 17 ఏళ్లలో వర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. ప్రగతే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులు, వర్సిటీ వర్గాలు పరిపాలనా వ్యవస్థను దిగజార్చే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శిష్యుడని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వద్ద మంచి పేరు ఉందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్కి ఫిర్యాదు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్కి బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల ఉద్యమ నేత ప్రపుల్ల సామంత్రాయ్ నేతృత్వంలో ఉద్యమకారులు రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ కంభంపాటి హరిబాబుకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని జొరిగాం సమితి హత్తిబెడ, రాయిఘర్ సమితి నకిటిసిమెద గ్రామాలలో గిరిజనుల నివాసాలను అధికారులు కూల్చి వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు రేగాయి. నబరంగ్పూర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠితో కలసి ప్రపుల సామంత్రాయ్ బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఎటువంటి నోటీసులు లేకుండా అటవీ ప్రాంతాలో గిరిజనుల ఇళ్లను కూల్చి వేశారని గవర్నర్కు వివరించారు. ప్రపుల్ల వెంట సర్వదల్కి చెందిన విశ్వజిత్ రాయ్, మైనింగ్ వ్యతిరేక ఉద్యమ నేత లింగరాజ్ అజాద్లు ఉన్నారు. ఉద్యమానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధం ● జూలై 7న నల్లబ్యాడ్జీలతో విధులకు.. ●14 నుంచి సమ్మెలోకి.. కొరాపుట్: సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతామని రెవెన్యూ మినిస్ట్రీయల్ ఉద్యోగులు వెల్లడించారు. ఈ విషయాన్ని నబరంగ్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకు బుధవారం నోటీసును అందజేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, బీమా రూ. 20 లక్షలు వర్తింపజేయాలని, ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీలు భీర్తీ చేయాలని, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూలై ఏడో తేదీ నుంచి నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు, జిల్లా అధ్యక్షుడు అశుతోష్ మహంతి, మితాలి పట్నాయక్, కై లాష్ చంద్ర దాష్ ఉన్నారు. పర్లాకిమిడిలో ఆక్రమణల తొలగింపు పర్లాకిమిడి: జగన్నాథ రథాయాత్రకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా రథాయాత్ర జరుగనున్న పర్లాకిమిడి పట్టణంలోని రాజవీధి, గుండిచామందిరం, కాలేజ్ రోడ్డు, మార్కెట్ వద్ద ప్రభుత్వ భూమిని ఆక్రమించి, డ్రైనేజీలను వదలకుండా ఆక్రమించిన చిల్లర దుకాణాలు, తోపుడు బండ్లు దుకాణాలను అధికారులు బుధవారం తొలగించారు. హైస్కూల్ జంక్షన్ వద్ద పకోడి, చిరు దుకాణాలను తొలిగించారు. మరోసారి దుకాణాలను రోడ్లపై పెట్టే వారిపై జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అనుప్ పండా హెచ్చరించారు. మార్కెట్కు ఇరువైపులా ఉన్న వాహనాలను కూడా తొలగించారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, తహసీల్దార్ నారాయణ బెహారా, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ధ్వజం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వివిధ సమితులు, పంచాయతీలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందజేస్తున్న నిధులు గ్రామ సభలు, పంచాయతీ ప్రతినిధుల ప్రామేయం లేకుండానే అధికారులు ఆమోదం తెలుపుతున్నారని గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, మోహనా జెడ్పీటీసీ సభ్యుడు సునీల్ కుమార్ బిషోయి, రాయఘడ సమితి అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 53వ జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత చైర్మన్ గవర తిరుపతి రావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ సి.డి.ఎం శంకర్ కెరకెటా, ఆదనపు పీడీ పృథ్వీరాజ్ మండల్ తదితరులు హాజరయ్యారు. గత జిల్లా పరిషత్ సమావేవాన్ని సమితి చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు బహిష్కరించారు. ఈసారి ఏడు సమితుల బ్లాక్ చైర్మన్లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పలు ప్రభుత్వ పథకాలైన కేంద్ర ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా పథకాలకు మండలాలకు ఎంతెంత నిధులు వె వెచ్చిస్తున్నారో తెలియజేయడం లేదని పలువురు సమితి అధ్యక్షులు ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశానకి జెడ్పీటీసీలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని మోహనా నుంచి వచ్చిన జిల్లా పరిషత్ సభ్యులు ఆరోపించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సమితి చైర్మన్లు కోరారు. -
నాటుసారా స్వాధీనం
మందస: మండలంలోని గుడ్డికోలా గ్రామంలో గురివారి అనే మహిళ నుంచి 40 లీటర్ల నాటుసారా పట్టుకోవడంతో పాటు, సారా తయారీకి వినియోగిస్తున్న 300 లీటర్ల బెల్లంఊటను ఎకై ్సజ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆమెను అరెస్టు చేసి సోంపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దాడుల్లో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుజాత, సిబ్బంది భాను ప్రసాద్, రమణ, వెంకటేష్, ఉమాపతి, విజయ్, మార్కరావు, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇరాన్పై దాడులను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఇరాన్పై అమెరికా దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్వంలో శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్ అవలంభిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి అమెరికా దాడులు విరుద్ధమని దుయ్యబట్టారు. ఇరాన్పై దాడితో క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుందని, దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై దాడులు అమెరికా స్వప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భారత్తో ఇరాన్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. ఈ దాడి ప్రపంచ శాంతి, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్.ప్రకాశరావు, ఎ.సత్యం, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, టి.తిరుపతిరావు, ఎ.లక్ష్మి, బి.సంతోష్, ఆర్.అరవింద్, ఎ.సోమశేఖర్, పి.జగ్గారావు, పి.జనార్దనరావు, ఎన్.సంతోష్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్లో తొలిసారిగా రథయాత్ర
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీలో ఈ నెల 27న జరుగనున్న రథయాత్ర కోసం జగన్నాథ రథాన్ని తయారుచేశారు. తొలిసారిగా వర్సిటీ క్యాంపస్లో రథయాత్రను నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు తెలిపారు. తొలుత వర్సిటీకాక ముందు జగన్నాథ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మ్యానేజ్మెంటు ఇంజినీరింగ్ కళాశాల ఉండేది. తదనంతరం సెంచూరియన్ వర్సిటీగా రూపాంతరం చెందింది. క్యాంపస్లో రథయాత్రను నిర్వహించనుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి నిర్మూలనపై స్పష్టమైన ప్రణాళిక ●● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: గంజాయి నిర్మూలన, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ సెంటర్లకు తరలింపుపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5న పాడేరులో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఉంటుందని తెలియజేశారు. గడిచిన 2024–25లో గంజా అక్రమ రవాణాపై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హనీష్ ఆయిల్, 478 వాహనాలను స్వాధీనం చేసుకొని 1,945 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాలు పెడుతున్నామని, 26 స్టాటిక్ చెక్పోస్టుల వద్ద 183 కేసుల్లో 11,047 కిలోల గంజాయి సీజ్ చేసి 469 మందిని అరెస్టు చేశామన్నారు. అదనంగా ఉన్న 298 డైనమిక్ చెక్పోస్టుల వద్ద 237 కేసుల్లో 21,070 కిలోల గంజాయి సీజ్ చేసి 743 మందిని అరెస్టు చేశామన్నారు. రవాణా చేసే ఎనిమిది మంది వ్యాపారుల నుంచి రూ.9.76 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, 1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరిచామన్నారు. 50 మందిపై పీడీ చట్టం, 19 మందిపై పీటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదించామన్నారు. రవాణాలో పాల్గొన్న 527 మందిని, గంజాయితోపాటు ఇతర నేరాల్లో పాల్గొన్న 348 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. 2024–25 కాలంలో 23 కేసుల్లో 40 మంది ముద్దాయిలకు న్యాయస్థానం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిందన్నారు. -
ప్రజల వద్దకు అధికారులు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు అధికారులు చేరనున్నారు. తమది ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తరచు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నరు భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రవేశపెట్టిన పలు పథకాల పట్ల అవగాహన కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అట్టడుగు స్థాయి పాలనను మెరుగుపరచడం అనివార్యంగా అధికార యంత్రాంగం గుర్తించింది. వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించడానికి ఉన్నతాధికార వర్గం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన బుధవారం వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్యదర్శులు వివిధ జిల్లాలు విస్తృతంగా సందర్శించాలని ప్రముఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ● అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఏటా జూన్, ఆగస్టు మధ్య వివిధ జిల్లాలకు క్షేత్ర పర్యటనలు చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కార్యాచరణతో వాస్తవంగా లబ్ధిదారులకు చేరుతున్న ప్రయోజనాల్ని విశ్లేషించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్శనలో అధికారులు జిల్లాల్లో కనీసం 2 నుంచి 3 రోజులు బస చేసి పంచాయతీ, మండల స్థాయిలో ప్రజా స్పందనతో పాలన తీరుని సమీక్షిస్తారు. కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించి స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన ఈ కార్యక్రమం లక్ష్యం. దీనిలో భాగంగా అధికారులు గ్రూప్ హెల్త్ సెంటర్లు, గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేస్తారు. -
మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
రాయగడ: గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సమితి సభ్యులు, సర్పంచులు తమ పరిధిలో గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగు, సాగునీరుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రక, సమితి సభ్యులు, సర్పంచ్లు, ఏబీడీఓ కాళి చరణ్ మాఝి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం నివాసం ముట్టడి
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారిక నివాసాన్ని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం చుట్టుముట్టారు. దళితులపై అమానుష దాడులు, మహిళలపై పెరుగుతున్న దారుణాలు, శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజ్ మహల్ చక్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరినీ వ్యాన్నుల్లో తరలించారు. -
రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం
భువనేశ్వర్: రథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
రాయగడ: ఒక మొబైల్ చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మూడేళ్ల జైలు శిక్షను విధించారు. అదేవిధంగా మరో రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలలు జైలు శిక్షను అనుభవించాలని వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2024 అక్టోబర్ 22వ తేదీన ఆర్యన్కుమార్ శర్మ, మరో వ్యక్తి జిల్లాలోని శశిఖాల్ పోలీస్స్టేషన్ క్యాంప్ హౌస్లో నిద్రించారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు 3 సెల్ఫోన్లు దొంగిలించారు. దీనికి సంబంధించి శశిఖాల్ పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్షయ నాగ్, మోహన్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి విచారించిన ఎస్డీజేఎం దాస్ ఐదుగురు సాక్షులను విచారించిన అనంతరం నిందితులకు శిక్షను ఖరారు చేశారు. తనిఖీలు ముమ్మరం భువనేశ్వర్: రథయాత్ర సందర్భంగా పూరీ పట్టణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా బాంబు పేలుడు తదితర విధ్వంస నిరోధక తనిఖీలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు, సాగర తీరం, వసతి సముదాయాలు, యాత్ర ప్రాంగణాలు తదితర కీలక జన సందోహిత ప్రదేశాల్లో పూరీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ● మర్యాదపూర్వక భేటీ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వీరివురు రాష్ట్ర పాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణను గవర్నర్కు వివరించినట్లు సీఎం తెలిపారు. – భువనేశ్వర్ -
ముక్కు మూసుకొని నడవాల్సిందే..
కొరాపుట్: జయపూర్ పట్టణంలోని 20, 21 వార్డుల్లో అపారిశుద్ధ్యం విలయతాండవం చేస్తోంది. ఎక్కడచూసిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చెత్తపై వర్షం పడుతుండడం వలన దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపారిశుద్ధ్యం వలన దోమలు, ఈగల బెడద పెరిగి రోగాలబారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతినెలా సు మారు రు.73 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వ్య యానికి తగ్గ ఫలితం ఉండడం లేదు. వర్షాలు పడుతుండడంతో డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నా యి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పేదల నివాసాలు కూల్చడం సరికాదు
కొరాపుట్: పేదల నివాసాలు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమా అని బీజేడీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి, మాజీమంత్రి రమేష్ చంద్ర మజ్జి ప్రశ్నించారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లోని తన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గత పది రోజుల్లో జిల్లాలో అనేక చోట్ల పేదల నివాసాలు కూల్చేయడం సరికాదన్నారు. రాయిఘర్ సమితి హత్తబెడాలో 28 మంది పేదల నివాసాలను కూల్చివేయడం దారుణమన్నారు. అదేవిధంగా ఉమ్మర్కోట్ సమితిలో పేదల దుకాణాలు, ఇళ్లు కూల్చేశారన్నారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ఆక్రమణలు తొలగించాలని ఆదేశంపర్లాకిమిడి: స్థానిక హైస్కూల్ జంక్షన్ నుంచి కాలేజీ రోడ్డు, మార్కెట్ జంక్షన్ వరకు ఉన్న దుకాణదారులు బుధవారంలోగా ఆక్రమణలు తొలగించాలని సబ్ కలెక్టర్ అనుప్ పండా ఆదేశాలు జారీ చేశారు. రథయాత్ర జరగనున్న ప్రదేశంలో గుండిచా బడి, చర్చి రోడ్డు వరకు ఉన్న ఆక్రమణలు మంగళవారం తొలగించారు. రానున్న రథయాత్రకు ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో జిల్లా సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, పురపాలక ఈవో లక్ష్మణముర్ము, ఇతర మున్సిపల్ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నారు.డ్రైనేజీ పనులు ఆపాలని వినతిపర్లాకిమిడి: స్థానిక ఎస్కేసీజీ కళాశాల హాస్టల్ వద్ద రోడ్డు విస్తరణలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆపాలని గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పర్లాకిమిడి టౌన్ రోడ్డులో భాగంగా అగ్నిమాపక దళం జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఖంజావీధి నుంచి కాలేజీ రోడ్డు జంక్షన్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆపాలని బీజేపీ నాయకులు బాలకృష్ణ పాత్రో, బబునా బెహరా, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో తదితరులు వినతిపత్రం ఎస్ఈ అభిషేక్ శెఠికి అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణిమా సాహు, ఇందిరా పట్నాయక్, ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.తిరుపతి పాణిగ్రాహికి అవార్డుపర్లాకిమిడి: రాష్ట్రంలో ప్రథమ ప్రైవేటు ఆస్పత్రి హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి భువనేశ్వర్లో టైమ్స్ హెల్త్ ఐకాన్ అవార్డును బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేతులమీదుగా అందుకున్నారు. భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ ఐకాన్ అవార్డు ఉత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హరిబాబు కంభంపాటి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో హైటెక్ గ్రూప్ గత పదేళ్లుగా ముఖ్య భూమిక పోషించిందని గవర్నర్ అభినందించారు. హైటెక్ గ్రూప్స్లో పనిచేస్తున్న డాక్టర్లు సంజయ్ కుమార్ జంగ్దీ, డా.దీపక్ కుమార్ దాస్, హైటెక్ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్ డా.అనిల్ కుమార్ పాణిగ్రాహి, హృద్రోగ నిపుణులు డీన్ ప్రొ.డాక్టర్ అక్షయ కుమార్ సాహు, ప్రొ.డా.అమ్రిత్ పట్టజోషి, సీఈవో జ్యోతిర్మయి పండా, డా.విక్రం కుమార్ సింగ్లు అవార్డులు స్వీకరించారు. -
జవానుల బలి దానాలు జాతి మరువదు
కొరాపుట్: జవానుల బలి దానాలు జాతి మరువదని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో అన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎఫ్ సెక్టర్ హెడ్ క్వార్టర్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జవానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కరువవ్వడంతో అలజడులతో ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయితే బీఎస్ఎఫ్ జవానుల రాకతో శాంతి వాతావరణం ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. సమాజ పరిరక్షణలో జవానులు చేసిన బలి దానాలు జాతి గుండెల్లో నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన బీఎస్ఎఫ్ జవానులకు అంజలి ఘటించారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ డీఐజీ సత్యవాన్ ఖంచి తదితరులు పాల్గొన్నారు. -
కలకలం..!
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025● పూరీ ఆలయంలో దశ మూలికల మోదకం దొంగతనం ఆరోపణ ● ఫిర్యాదు చేసిన బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ ● ఘటనపై చెలరేగుతున్న దుమారం ● ఆరోపణలు అవాస్తవం: సీఏవో అరవింద కుమార్ పాఢిభువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతున్న తరుణంలో స్వామివారి చికిత్స కోసం ఏర్పాటు చేసిన దశ మూలికల మోదక దొంగతనం ఆరోపణ తీవ్ర కలకలం రేపుతోంది. బలభద్ర స్వామి మూల విరాటు బాడొగ్రాహి ప్రత్యక్షంగా శ్రీమందిరం పాలన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విచారకర ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణ అవాస్తవమని ప్రాథమిక విచారణలో తేలిందని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి తోసిపుచ్చారు. ఆయన అభిప్రాయం ఆధారంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణ పూర్తిగా అబద్ధమని, స్వీయ ప్రచారం కోసం నిరాధారమైన ఆరోపణగా వ్యాఖ్యానించారు. విచారణలో నిజం నిగ్గు తేలితే తెర వెనక వర్గాలపై చర్యలు తప్పవని బాహాటంగా హెచ్చరించారు. మరోవైపు ఘటనపై బిజూ జనతా దళ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదో విపత్కర ఘటనగా పేర్కొన్నారు. లోగడ ఇటువంటి సంఘటనల దాఖలాలు లేవన్నారు. భగవంతుని విషయంలో రాజకీయం తగదని బీజేడీ నాయకుడు లెనిన్ మహంతి హితవు పలికారు. సీసీ టీవీ రికార్డింగు వంటి అనుబంధ ఆధారాలతో ఆరోపణపై విచారణ పూర్తయితే వాస్తవం తేటతెల్లమవుతుందని శ్రీ మందిరం సీఏవో వెల్లడించారు. 70 మోదకాలు తగ్గినట్లు ఆరోపణ తెర చాటున చికిత్స పొందుతున్న మూల విరాటులకు ఆలయ ఆచారం ప్రకారం ఒణొసొరొ ఏకాదశి పురస్కరించుకుని ఈనెల 21న దశ మూలికా మోదకం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవ కోసం సరఫరా చేసిన 313 మోదకాల్లో 70 దశ మూలిక మోదకాలు తక్కువ ఉన్నట్లు బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ మహాపాత్రో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మోదకాలు దొంగిలించినట్లు ఆయన ఆరోపించారు. స్వామి సేవకు ముందు వీటిని స్పర్శించడంతో పవిత్రత లోపించినా గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవ యథాతథంగా కొనసాగించినట్లు వివరించారు. స్వామి గోప్య సేవల కోసం సరఫరా చేసే మోదకాలను లెక్కించడం జరగదు. అనుబంధ వర్గాలు అందజేసే మోదకాలను యథాతథంగా శ్రీమందిరానికి తరలించడం జరుగుతుంది. సంబంధిత సేవాయత్ల సమాచారం ఆధారంగా లాంచనంగా రికార్డు నిర్వహణ కొనసాగుతుందని శ్రీ మందిరం సీఏవో తెలిపారు. ఈ క్రమంలో సీసీటీవీ రికార్డింగ్ ఆధారంగా వాస్తవం బయటపడే అవకాశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శ్రీ జగన్నాథుని బాడొగ్రాహి వర్గాలు ఆరోపణని బలపరుస్తున్నాయి. వివాదస్పదమైన ఆరోపణపై విచారణ జరిపేందుకు శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు, డిప్యూటీ నిర్వాహకుడు మరియు ఆలయ కమాండర్ సభ్యులుగా ప్రత్యేక కమిటీని నియమించారు. విచారణ కాల పరిమితిని స్పష్టం చేయలేదు.న్యూస్రీల్ -
● క్రీడాకారులకు సత్కారం
భువనేశ్వర్: జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రత్యేక నగదు పురస్కారంతో మంగళవారం సత్కరించారు. 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో సీనియర్ మహిళా వాల్ట్లో కాంస్య పతకం సాధించిన జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ను రూ.75,000లు, 38వ 9 ఏళ్లలోపు చదరంగం ఛాంపియన్ షిప్ – 2025 పోటీలో విజేతగా నిలిచిన బాల క్రీడాకారుడు సాత్విక్ స్వంయికి రూ.30,000ల నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. -
సైబర్ భద్రతపై అవగాహన అవసరం
భువనేశ్వర్: సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన అవసరమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో సైబర్ భద్రత – మాదక ద్రవ్యాల వ్యసన నివారణపై ప్రజా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రసంగించారు. ఆయనతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా, క్రైమ్ బ్రాంచ్ సీఐడీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రితేష్ మహాపాత్రో ఈ అంశాలపై వివిధ రకాల వివరణాత్మక విషయాలు వివరించారు. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా మారాయన్నారు. అలాగే మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి కోలుకోవడానికి సమయం, ధైర్యం మరియు సరైన మద్దతు అవసరమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.బి.ఎస్.రాజ్పుట్, స్పెషల్ టాస్క్ఫోర్స్ డీఐజీ పినాక్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ హరిబాబు కంభంపాటి -
ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ కన్వర్టర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎనర్జీ అప్లికేషన్స్–2025 (పీఈసీటీఈఏ–2025) సదస్సు విజయవంతంగా ముగిసింది. రవాణా మరియు ఇంధన వ్యవస్థల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ భవిష్యత్తుపై విద్యావేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో చర్చించారు. ఐఐటీ (ఐఎస్ఎం) ధన్బాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుకుమార్ మిశ్రా సదస్సును ప్రారంభించారు. స్థానిక ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్ మాట్లాడుతూ.. విద్యుత్ మరియు రవాణా రంగాల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి పవర్ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే నిమగ్నం చేయడం మరియు ఇంజినీరింగ్ యొక్క సామాజిక విలువకు వారిని బహిర్గతం చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ 2027లో ఈ సదస్సును ద్వైవార్షిక కార్యక్రమంగా మార్చడానికి జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. -
పంచాయతీలుగా గుర్తించండి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి పరిధి బిజాబొండిలి, హటొశశిఖాల్ ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శివపొదొరొ బికాస్ పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ బెహర నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం మంగళవారం బీడీవో కృష్ణచంద్ర దొలొ, అదనపు తహసీల్దార్ సుబేందు సాహులకు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజాభిప్రాయాలను సేకరిస్తోందని, దీనిలో భాగంగా మునిగుడ సమితిలోని శివపదర్ పంచాయతీలో భాగమైన బిజాబొండిలి, హటొశశిఖాల్లను పంచాయతీలుగా గుర్తించగలిగితే ప్రజలు మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉందని వినతిపత్రంలో వివరించారు. జనాభాపరంగా అభివృద్ధి చెందుతున్న శివపదర్ పంచాయతీ మరింత అభివృద్ధి చెందాలంటే కొత్తగా రెండు పంచాయతీల ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు. -
రథయాత్ర ఏర్పాట్లు పరిశీలన
కొరాపుట్: ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో రథయాత్ర ఏర్పాట్లను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ పరిశీలించారు. మంగళవారం పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో పర్యటించారు. విశ్వవ్యాప్త రథయాత్ర ఈనెల 27న జరగనుంది. కానీ కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా 28న జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంత సమస్య దృష్ట్యా ఇక్కడ రథయాత్రకి ప్రభుత్వమే అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. కలెక్టర్ నిర్మితమవుతున్న రథాన్ని పరిశీలించారు. ఆరోజు ప్రభుత్వం తరుపున అన్ని శాఖల అధికార యంత్రాంగం యాత్ర వద్ద మెహరించాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం కొఠియాలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించారు. -
బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో)గా సాయి కిరణ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వన మహోత్సవ వారోత్సవాల్లో అనేక ఔషధ మొక్కలు నాటుతామని తెలియజేశారు. కార్యక్ర మంలో అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మహా ప్రదర్శన కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ మహా ప్రదర్శన చేస్తుందని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి ప్రకటించారు. మంగళవారం జయపూర్ మెయిన్ రోడ్డులోని బంకు మఠం సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీన జయపూర్ పట్టణంలోని పారాబెడలో ఉన్న దసరా పొడియా అందుకు వేదిక కానుందన్నారు. కలహండి జిల్లా మీదుగా పీసీసీ ప్రెసిడెంట్ భక్త చరణ్ దాస్ వస్తారన్నారు. నబరంగ్పూర్ జిల్లా నుంచి అన్నిచోట్ల మెటార్ బైక్లు అనుసరించి జయపూర్ చేరేసరికి 5,000 బైక్ల ర్యాలీ జరుగుతుందన్నారు. కొరాపుట్, మల్కన్గిరి, నబరంగ్పూర్ జిల్లాల నుంచి సుమారు 40 వేల మందితో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ, రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ప్రకటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పవిత్ర శాంత (లక్ష్మీపూర్), మంగులు కిలో (చిత్రకొండ), మున్సిపల్ చైర్మన్లు నొరి మహంతి, శంకరరావు తదితరులు ఉన్నారు. శ్రీముఖలింగం హుండీ ఆదాయం రూ.3.32 లక్షలు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో గడిచిన 112 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3,32,883 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపా రు. పర్యవేక్షణ అధికారి ఆమదాలవలస గ్రూప్ టెంపుల్ అధికారి టి.రవితోపాటు కొమనాపల్లి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు పైడి శెట్టి వెంకటరమణ, అర్చకులు వెంకటాచలం,ధనాల స్వామి,భక్తులు పాల్గొన్నారు. డిగ్రీ 2, 4 సెమిస్టర్ల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభం ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో 2015–18 విద్యా సంవత్సరంలో సీబీఎస్ విధానంలో చదివి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి, 2019లో డిగ్రీలో చేరి ఏవైనా సబ్జెక్ట్లు ఉండిపోయిన సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించి రెండు, నాలుగు స్పెషల్డ్రైవ్ పరీక్షలను మంగళవారం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రతి రోజు జరిగే ఈ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షలను రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య పరిశీలించారు. జూలై 5న జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులు, ఎకై ్సజ్ అధికారులు, బీమా న్యాయవాదులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు పోలీసు వారి దగ్గర నుంచి రావాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ పాల్గొన్నారు. -
బీజేపీ మాక్ పార్లమెంట్
కొరాపుట్: దేశంలో ఎమర్జెన్సీ పాలనని గుర్తు చేస్తూ జయపూర్ పట్టణంలోని పారాబెడా సెంటర్లో ఉన్న బాలకృష్ణ ప్యాలెస్లో బీజేపీ యువ మోర్చా విభాగం మాక్ పార్లమెంట్ మంగళవారం ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయినందున నాటి అరాచకాలు నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించామని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ప్రాథమిక విద్యామంత్రి నిత్యానంద గోండో దేశ ప్రధాని హోదాలో విద్యార్థుల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో (కొరాపుట్), రుపుదర్ బోత్ర (కోట్పాడ్), పార్టీ నాయకులు గౌతం శాంత్ర, బిశ్వ త్రిపాఠి, అభిలాష్ పండా, పార్వతి తదితరులు పాల్గొన్నారు.