breaking news
Orissa
-
అర్ధరాత్రి బాంబుల మోత
భువనేశ్వర్: దేవీ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజధాని నగరంలో మంగళవారం అర్ధరాత్రి బాంబుల పేలుడు కలకలం రేపింది. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు భువనేశ్వర్ నగరం నడి బొడ్డున బాంబులు రువ్వి అలజడి రేపారు. పోలీసులకు బహిరంగ సవాలు విసిరారు. బొడొగొడొ, రాజధాని పోలీస్ ఠాణా ప్రాంతాల్లో భారీగా బాంబులు విసిరి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం తప్ప పౌరులకు ఎటువంటి ప్రాణహాని సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను జంట నగరాల కమిషనరేట్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని గాలింపు ముమ్మరం చేశారు. రెండు పోలీస్ ఠాణాల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను తనిఖీ చేసి దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు.. బొడొగొడొ పోలీస్ ఠాణా గౌతమ్ నగర్ బస్తీ, క్యాపిటల్ పోలీస్ ఠాణా ఫలికియా బస్తీపై భారీగా బాంబులు రువ్వారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆరుగురు దుండగులు రెండు బైక్లపై వచ్చి ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. తొలుత గౌతమ్ నగర్ బస్తీపై 5 బాంబులు రువ్వారు. తరువాత వారు ఫలికియా బస్తీపై మూడు బాంబులు విసిరారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలం చేరే సమయానికి దుండగులు పరారయ్యారు. ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరు బాంబులు విసిరారో పోలీసులు స్పష్టం చేయలేదు. గత రెండు నెలల్లో భరత్పూర్ పండా కుడియా బస్తీ, పులీశ్వరి బస్తీలలో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. ఈ చర్యలు స్థానికుల్ని కలవరపరుస్తున్నాయి. దుర్గా పూజలకు సిద్ధం.. రాష్ట్రంలో దుర్గా పూజోత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు బుధవారం డీఐజీ సెంట్రల్ రేంజ్ పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశయ్యారు. శాంతిభద్రతలను నిశితంగా పరిశీలించాలని ఎస్పీలకు ఆదేశించారు. -
అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత
భువనేశ్వర్: రాష్ట్ర 17వ శాసన సభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శాసన సభ వెలుపల, లోపల, పరిసరాల్లో ప్రతి కదలికపై నిఘా వేసేందుకు మూడంచెల భద్రతా వలయం సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్ధంగా ఎదుర్కోవడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించారు. శాసన సభ భద్రతా కార్యకలాపాల కోసం 30 ప్లాటూన్ల పోలీసులను మోహరించనున్నారు. 150 మంది ప్రత్యేక అధికారులు పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రాత్రింబవళ్లు 5 తాత్కాలిక కంట్రోల్ రూములు పని చేస్తాయి. స్ట్రైకింగ్ ఫోర్స్, బాంబు నిర్వీర్య బృందం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాయి. శాసన సభ సమీపంలోని వివిధ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దిగువ పీఎంజీలో 144 సెక్షన్ జారీ చేయనున్నారు. -
పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు
రాయగడ: రాయగడ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎనిమిది గంటల వరకు దట్టంగా కురిసిన మంచుతో పట్టణంలో చీకట్లు అలముకున్నాయి. దట్టంగా కురిసిన మంచుతో రోడ్లు కన్పించకపోవడంతో వాహనాల రాకపొకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో వాహనాలు నడిపే సమయంలో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తెంది. చాలామంది కాలం కాని కాలంలో కురిసిన మంచును ఆస్వాదించారు. భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ పూజలు రాయగడ: పట్టణంలో బుధవారం విశ్వకర్మపూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్డు వద్ద స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలను చేపట్టారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాలనీల్లో విశ్వకర్మ పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత సంస్థ ప్రతినిధులు పట్టణంలోని నిరుపేదలకు ఆహార పొట్లాలను బుధవారం పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో వారిని గుర్తించి సంస్థ సభ్యులు అక్కడకు చేరుకుని ఆహార పొట్లాలను అందించారు. తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా పేదల ఆకలి తీర్చేందుకు తమవంతు కృషి చేశామని సంస్థ కార్యదర్శి బరాటం అవంతి తెలియజేశారు. పంపిణీ కార్యక్రమంల్లో సంస్థ అధ్యక్షులు జి.రామక్రిష్ణ, కోశాధికారి పి.కల్యాణి ఉన్నారు. 15 అడుగుల నల్లత్రాచు పట్టివేత మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి లుగెల్ పంచాయతీ పరిధిలోని ఎంపీవీ–47 గ్రామంలోని ఓ వేపచెట్టు పైనుంచి భారీ నల్లత్రాచు పాము బుధవారం మధ్యాహ్న సమయంలో దిగుతూ అలజడి సృష్టించింది. దీన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వీరిని చూసిన పాము తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. వెంటనే కలిమెల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎంవీ–79 గ్రామ అటవీ శాఖ గార్డుతోపాటు మరోవ్యక్తి వచ్చి అతి కష్టంపై చెట్టూ ఎక్కి పామును పట్టుకున్నారు. దీని పొడవు 15 ఉందని అటవీ సిబ్బంది తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సి పాము ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చి చెట్టు ఎక్కిపోయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
672 కేజీల గంజాయి స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 90 గ్రామం వద్ద మంగళవారం రాత్రి కలిమెల పోలీసు స్టేషన్ ఎస్ఐ డి.డి.సుగ్రీ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. బైక్పై ముగ్గురు వ్యక్తు లు అతివేగంగా రావడంతో పోలీసులకు అనూమ నం వచ్చింది. వారిని అపి తనిఖీ చేశారు. ఆ ముగ్గురు బైక్ను, గంజాయి బస్తాను వదిలి పారారయ్యారు. బైక్ను, గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్ఇఐ బి.కె.మాఝి తన సిబ్బందితో పుల్లిమేట్ల గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మోటు వైపుకు అతి వేగంగా ఓ కారు వచ్చింది. అందులో 26 బస్తాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. కారును అపి తనిఖీ చేయగా అందులో గంజాయి ఉంది. వెంటనే ఈ గంజాయి ఏవరిది అని ఆరా తీయగా యం.పి.వి 13 గ్రామానికి చెందిన సుమన్ హల్దార్కి చెందినది అని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే సుమన్ను అరేస్టు చేసి కారును, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మొత్తం గంజాయిని తూకం వేయగా 677 కేజీలు ఉంది. ఐఐసీ ముకుందో మేల్క మాట్లాడుతూ ఈ మొత్తం గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందన్నారు. బైక్ను విడిచిపెట్టి పారారైన వారి కోసం గాలిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి సుమన్ను కోర్టుకు తరలిస్తామన్నారు. -
తేనెటీగల దాడిలో తల్లీకూతుళ్లకు గాయాలు
రాయగడ: పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న తల్లీకుతూళ్లు తేనేటీగల దాడిలో గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని నారాయణపూర్ పంచాయతీ పరిధిలో గల పిందుగుడ గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. మంజులత హియల్(గర్భిణి), ఆమె మూడేళ్ల కూతురు సుశ్రీలు దొందులి కూడలి చేరేసరికి తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇద్దరూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పక్కనే పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు వీరిని చూశారు. అటుగా వస్తున్న వాహనంలో కళ్యాణసింగుపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తేనేటీగల ముళ్లును వైద్యులు తీశారు. పరిస్థితి కుదుటగా ఉండటంతో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. రాయగడ: ఛత్తీష్గఢ్ జిల్లా రాయిపూర్ నుంచి విజయవాడకు బొగ్గు లోడ్తో వెళ్తున్న గూడ్స్ మంటల్లో చిక్కుకుంది. స్థానిక లడ్డ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాగన్లో మంటల వ్యాపించడంతో గూడ్స్ సిబ్బంది వెంటనే రైలును నిలిపి అధికారులకు సమాచారం అందించా రు. రాయగడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. పర్లాకిమిడి: పట్టణంలో మూడు రోడ్ల జంక్షన్ లో పాత ఫైర్ స్టేషన్ వద్ద సీసీ రోడ్డులో భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ము ఖ్యంగా రాత్రిపూట వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చాలని పలువురు కోరుతున్నారు. రాయగడ: దేశ ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ శ్రేణులు బస్టాండును శుభ్రపరిచారు. స్వచ్ఛ ఉత్సవ్ సందర్భంగా బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు బసంత కుమార్ ఉలక, పద్మనాభ దాస్, మంజులా మినియాక పాల్గొన్నారు. పీహెచ్సీ ముందు గిరిజన మహిళల ధర్నాపాతపట్నం: మండలంలోని బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) ముందు వైద్యం అందడం లేదని గిరిజన మహిళలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. బుధవారం ఉదయం ఆర్.ఎల్.పురం,పెద్ద సున్నాపురం, రామన్నగూడ తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలు పీహెచ్సీకి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని తమకు డాక్టర్ వద్దని ఆందోళన చేపట్టారు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే డాక్టర్ను నియమించి తమకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలు మందస: మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుధవారం గుంపుగా వెళ్లి దాడిచేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు కాటు వేశాయి. దీంతో వీరికి మందస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బీజేడీ ఆందోళన
కొరాపుట్: మహిళలపై జరుగుతున్న దురాఘాతాల ను అడ్డుకోవాలని ప్రతిపక్ష బీజేడీ ఆందోళన బుధవారం చేసింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి నివాసం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేడీ ముఖ్య నాయకులు తన గదికి రావాలని ఎస్పీ మడకర్ సంపత్ సూచించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను బీజేడీ నాయకులకు ఎస్పీ వివరించారు. ఇంకేం చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం బీజేడీ నాయకులు సూచన లు చేశారు. వారు చెప్పిన అన్ని రక్షణ చర్యలూ వెంటనే తీసుకొంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీకి బీజేడీ నాయకులు వినతిపత్రం అందించారు. మా జీ ఎమ్మెల్యేలు సదాశివ ప్రధాని, సుభాష్ గోండో, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజులా మజ్జి, మాజీ జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ నివేదిత మహాంతి, కౌసల్య ప్రధాని, రబి పట్నాయక్ పాల్గొన్నారు. -
పరిశుభ్రతతో ఆరోగ్యానికి భద్రత
భువనేశ్వర్: పరిసరాల పరిశుభ్రత జీవితంలో ఓ భాగం కావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో స్వచ్ఛత అభియాన్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలను నివారించడంలో పరిసరాల పాత్ర కీలకమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యాంపస్ను శుభ్రపరిచారు. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోస్టర్ తయారీ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. విశ్వవిద్యాలయ ఇన్చార్జి వైస్–ఛాన్సలర్ చండి చరణ్ రథ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరు యువకులు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఎల్సీ గేట్ వద్ద 11 కేజీల గంజాయితో ఇద్దరు యువకులను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సీఐ కార్యాలయం ఆవరణలో పత్రికా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఎల్సీగేట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. తమిళనాడుకి చెందిన కదాశిమ ముత్తుకుమార్, కపిల్దేవ్ మరియప్పన్ 11.120 కేజీల గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకొడి పట్టణానికి చెందిన వీరిద్దరూ.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకి చెందిన గంజాయి వ్యాపారి మణిక్ సబర్ వద్ద తక్కువ రేటుకి గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒడిశా నుంచి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా తమిళనాడుకి వెళ్లేందుకు గంజాయిని తీసుకెళ్తుండగా ఎల్సీగేట్ వద్ద రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి
రాయగడ: చిన్నారులకు చదువు, మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతపై అవగాహన కలిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలని స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొత్తకొట చంద్రమౌళి కుముంధాన్ అన్నారు. రెండు రోజులుగా ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కొనసాగిన శ్రీకృష్ణ జయంతి వేడుకలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుముంధాన్ మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషాధారణలతో అలరించారు. వారి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ, గొపికల వేషాధారలతో పాటు వారు చేసిన నృత్యాలు ఆనందడొలికల్లో ముంచెత్తాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు రాధాగోవిందునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నృత్యాల్లో పాల్గొన్న చిన్నారులకు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి రాఘవ కుముంధాన్ బహుమతులను అందజేసి వారిని ఉత్సాహపరిచారు. -
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
కొరాపుట్: ఇంద్రావతి మెగా హిల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకంగా పనులు జరిగితే ఉపేక్షించబోమని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హెచ్చరించారు. బుధవారం ఇంద్రావతి ప్రాంతంలో రెండు కొండల మధ్య నిర్మా ణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ నిర్మాణంపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెంతులకుంటి, నందాహండి, నబరంగ్పూర్ సమితుల్లో 19 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఏడాదికి ఒకే పంట పండించే రైతులు ఖరిఫ్తోపాటు, రబీలో కూడా పంటలు వేసుకోవచ్చన్నారు. ప్రాజెక్ట్కి అనుసంధానం చేసే రోడ్లు, అక్కడ నిర్మితం అవుతున్న భవనాలు, తదితర ప్రాంతాలను సందర్శించారు. కొత్త నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తాను ఈ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తుంటానన్నారు. -
ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా సమాజంలో సైన్స్ వైబ్రేషన్ పేరిట రెండు రోజుల సైన్స్ ప్రయోగాల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కళాశాల సెంటర్ ఫర్ అప్లయిడ్ సైన్సెస్, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఇండిజీనిఎస్ ఫర్ ప్రోగల్ సైన్స్ ఇన్వెన్షన్ సొసైటీ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రశ్నించే తత్వం ఉంటే విషయ పరిజ్ఞానం పెరిగి, అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అలాగే సైంటిఫిక్ టెంపర్, పరిశోధనా విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ మదమంచి ప్రదీప్, ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, ప్రొగ్రాం కో–ఆర్డినేటర్స్ డాక్టర్ రోణంకి హరిత, పి.సుధారాణి, శివాల రవిబాబు, కె.అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
నువాపడాలో 56 కొత్త పోలింగ్ కేంద్రాలు
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అఖిల పక్షాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల దృష్ట్యా చేపట్టిన పలు సంస్కరణలు, సవరణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రతినిధులకు వివరించారు. త్వరలో నువాపడాలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద 56 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను 302 నుంచి 358కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 36 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 322 ఉన్నట్లు పేర్కొన్నారు. నువాపడా నియోజకవర్గంలో 52 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చినట్లు ప్రకటించారు. ఈ నెల 15న అర్హత తేదీగా పరిగణించి బ్యాలెట్ పత్రాల జాబితాను సిద్ధం చేశారు. రాజకీయ పార్టీలకు బ్యాలెట్ పత్రాల జాబితాను అందుబాటులో ఉంచారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. -
ఉద్ధృతంగా కల్యాణి నది ప్రవాహం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో కళ్యాణి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వంతెనకు నీరు తాకుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఇదే తరహా వరదలు రావడంతో కళ్యాణసింగుపూర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బీజేడీ నాయకుల నిరసన రాయగడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిరసిస్తూ బీజేడీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగొ, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్ చంద్ర పాత్రో, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు పట్నాన గౌరీ శంకరరావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, రాయగడ మున్సిపల్ వైస్ చైర్మన్ శుభ్ర పండ, దేవాషీష్ ఖడంగా, సంతోష్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్కు వినతిపత్రం అందజేశారు. అత్యాచారాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని కోరారు. -
75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
భువనేశ్వర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక ఏకామ్ర కళాశాల ప్రాంగణంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. పుడమి తల్లి పరిరక్షణకు కృతజ్ఞతపూర్వకంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలనే ప్రధాని పిలుపునకు స్పందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రధాని మోదీకి అమూల్యమైన జన్మదిన కానుకగా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం మానవాళికి ఉత్తమ సేవగా పేర్కొన్నారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
భువనేశ్వర్: మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ శుభ మిత్ర సాహు ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కెంఝొహర్ ఘొటొగాంవ్ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బుధ వారం లభ్యమైంది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె స్నేహితుడు గుమాస్తా దీపక్ రౌత్ పట్ల తలెత్తిన సందేహం ప్రాథమికంగా రుజువు అయింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో తేలిన ఆధారాలతో పోలీసులు నిందితుడు దీపక్ రౌత్ను శుభమిత్ర మృత దేహాన్ని వెలికితీసేందుకు కెంఝొహర్ ఘొటొగాంవ్ అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ప్రదేశానికి భువనేశ్వర్ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు, మేజి స్ట్రేట్ సమక్షంలో జేసీబీ సహాయంతో తవ్వి శుభమిత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. సిమెంట్ సంచిలో కట్టిన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
¯]lÆó‡…-{§ýlÐðl*© ç³#sìæt¯]l Æøk-ి çÜ…§ýl-Æý‡Â…V> Æý‡MýS¢§é¯]l…
పర్లాకిమిడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరాన్ని బీజేపీ అధ్యక్షులు నవకిశోరో శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, విద్య, గణశిక్షా మంత్రి నిత్యానంద గోండ్ ముఖ్యఅతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. ఎకై ్సజ్ సూపరింటెండెంటు, బీజేపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్బ్యాంక్ అధికారులు తెలియజేశారు. సీడీఎంవో డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ పొట్నూరు లత, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణ పాత్రో, నృసింహాచరణ్ పట్నాయక్ పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఉండ్రుకొండ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపి న వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి వృద్ధునికి గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. కొంత సమయం వరకు సంఘటనా స్థలంలోనే వృద్ధుడు పడి ఉన్నాడు. అటుగా వచ్చిన కొంతమంది చూసి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీస్ అధికారి(ఐసీసీ) ముకుందో మేల్క తన సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. వృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని, ఈ ప్రాంత వాసి కాదని స్థానికులు తెలిపారు. 72 గంట లపాటు మార్చురీలో ఉంచుతామని, ఏవరైనా వస్తే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని అప్పగి స్తామని ఐసీసీ తెలిపారు. లేకపోతే తహసీల్దార్, పోలీసుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. -
పవర్ ప్లాంట్ వద్దు.. పర్యావరణం ముద్దు
బూర్జ: పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని పోరాట కమిటీ సమన్వయకర్త యోబ యోగి, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర ఆదివాసీలకు పిలుపునిచ్చారు. మంగళవారం పోరాట కమిటీ సభ్యులు పిలుపు మేరకు తిమడాం గ్రామంలో సమావేశం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న అడ్డూరిపేటలో జరిగే బహిరంగ సభకు అందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సాఫ్ట్ టెన్నిస్ పోటీలు
పాతపట్నం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17, అండర్–19 బాల, బాలికల సాఫ్ట్ టెన్నిస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు పాతపట్నం మండలం సూర్యనారాయణపురం గ్రామ సమీపంలోని అక్షర పాఠశాల మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 270 మంది విద్యార్థులు హాజరయ్యారని రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు తెలిపారు. కొందరు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ తిరుపతిరావు, డైరెక్టర్ రియాజ్, ప్రిన్సిపాల్ సుజాత, పీఈటీలు కె.రాజారావు, జె.కృష్ణ, ఎస్.కృష్ణారావు, లోకేశ్వరరావు, డి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
రణస్థలం: 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సభ్యత్వ అభియాన్లో భాగంగా మంగళవారం రణస్థలం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. జిల్లా పూర్వ అధ్యక్షుడు జి.వెంకటగిరి మాట్లాడుతూ కాంప్లెక్స్ స్థానాల్లో పని చేస్తున్న గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు, శాశ్వత స్థానాలు కేటాయించే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి రవి భట్టు మాట్లాడుతూ జూన్లో బదిలీలు పొంది రిలీవర్ లేని కారణంగా అదే స్థానాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేలా తాజా డీఎస్సీ అభ్యర్థులను నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు జి.చిన్ని కృష్ణంనాయుడు, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?
జలుమూరు: పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం అందవరం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. అందవరం, రామకృష్ణాపురం, గొల్లపేట గ్రామాల్లో రోడ్డుపైనే మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాల బారినపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు కూడా వెలగడం లేదని, ఇసుక లారీల వల్ల రోడ్డు గోతులమయంగా మారిందని వాపోయారు. విషయం తెలుసుకున్న పంచాయతీ విస్తరణ అధికారి ఉమామహేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. గంజాయితో ఇద్దరి అరెస్టు పలాస: ఒడిశా రాష్ట్రం జగిదిపదర్ గ్రామానికి చెందిన హేమంత్ సబర్, కేశబ్సబర్లు పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో మంగళవారం అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. మూడు ప్యాకెట్లలో ఉన్న 16.845 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఒడిశా రాష్ట్రం రాజ్బోసా గ్రామానికి చెందిన అముస్ అలియాస్ జూన్హేన్సన్ వద్ద గంజాయి తీసుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంజురైతో అనే వ్యక్తికి ఇచ్చేందుకు వీరు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. పలాస రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నరసింహమూర్తి సిబ్బందితో కలిసి పట్టుకున్నారని సీఐ చెప్పారు. గంజాయితో పాటు సెల్ఫోన్, రూ.3,650 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నీట్ పీజీ ఫలితాల్లో మెరిసిన విశాల్ బాలుడు అదృశ్యం 21న నవయువ కవితా మహోత్సవం శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, విశ్వసాహితీ కళావేదిక, ఆంధ్ర సారస్వత పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ నెల 21న శ్రీకాకుళం నవ యువ కవితా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈవేమన, జంధ్యాల శరత్బాబు, భమిడిపాటి గౌరీశంకర్ తెలిపారు. మునసబుపేటలోని గురజాడ విద్యా సంస్థల ఆవరణలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఉత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.రజిని, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, గురజాడ సంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, విశ్వసాహితీ కళావేదిక అధినేత కొల్లి రమావతి పాల్గొంటారని వివరించారు. -
కర్షకులకు కరెంట్ కష్టాలు
● వేధిస్తున్న విద్యుత్ సమస్య ● ఒక ట్రాన్స్ఫార్మర్కు 50 పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ● హెచ్చుతగ్గులతో కాలిపోతున్న మోటార్లు కవిటి : వ్యవసాయం, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనకుదరడం లేదు. ఇప్పటికే యూరియా, ఎరువులు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు కరెంట్ కష్టాలు సైతం వెంటాడుతున్నాయి. ఉద్దాన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ బోరు బావులపైనే ఆధారపడి సాగు జరుగుతోంది. కవిటి మండలం పుటియాదళ రెవెన్యూ గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు పెద్దసమస్యగా మారాయి. ఇక్కడ 276 ఎకరాలు వరిసాగు విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో దమ్ముల సీజన్లో మినహాయించి వరినాట్లు వేశాక సరైన వర్షం లేక అన్నదాత బోరుమంటున్నారు. ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు మొరాయిస్తున్నాయి. మోటార్లు తిరగడం లేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై 51 వరకు కనెక్షన్లు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఇటీవల 8 మోటార్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక దశలో.. వరిపైరు పొట్టదశకు చేరుకునే క్రమంలో నీరు తప్పక అందాల్సి ఉంది. ఈ సమయంలో మోటార్లు తిరగక రైతుల ఆందోళన చెందుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పట్టించుకోకుండా ఇన్ని కనెక్షన్లు ఎందుకు ఇచ్చారంటే ఉద్యోగులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి దృష్టి సారించాలని, లేనిపక్షంలో 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకే పంట పండిస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్మోటార్లు మాకు శ్రీరామరక్ష అనే భావనతో ఉండేవాళ్లం. కానీ ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పరిమితికి మించి కనెక్షన్లు ఉండటంతో అసాధారణంగా లోడ్ పెరిగింది. మోటార్లు తిరగడం లేదు. తక్షణం విద్యుత్శాఖ అధికారులు స్పందించి రైతుల్ని ఆదుకోవాలి. – బెందాళం వెంకటేశ్వరరావు, రైతు, కవిటిపుటియాదళలో ఎకరా పైగా వరిపొలం ఉంది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా లేక విద్యుత్ మోటార్లపైనే ఆధారపడుతున్నాం. మా ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఈ సీజన్లో 8 మోటార్లు కాలిపోయాయి. ఎప్పుడు ఎవరి మోటార్ కాలిపోతోందో అనే భయం వెంటాడుతోంది. తక్షణమే లోడ్ను తగ్గించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే చర్యలు తీసుకోవాలి. – బి.జయరాం, రైతు, రామయ్యపుట్టుగ -
ఘనంగా శ్రీకృష్ణ జయంతి
రాయగడ: స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు సోమవార ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో రాధా కాంతులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుంకుమ, తులసీ దళాలతో అర్చనలు చేశారు. అనంతరం భాగవత, విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు చంద్రమౌళి కుముందాన్, కార్యదర్శి రాఘవ కుముందాన్, శ్రీనివాస్ కుముందాన్ తదితరులు పాల్గొన్నారు. -
దళిత కార్మికుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేసి ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్టకొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు కోరారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ మంగళవారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొత్తగా టెక్కలిలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో హమాలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, నాయకులు టి.రామారావు, ఎన్.సురేష్, ఎన్.రమణ, బోనెల.రాము, పి.రామారావు, ఎల్.సీతారాం, ముద్దాడ.రాజు, కె.వి రమణ, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
డొంబొసొరోను సమితిగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధి డొంబొసొరా పంచాయతీని సమితిగా గుర్తించాలని పంచాయతీకి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సమితి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్న డొంబొసొరొ పంచాయతీని సమితిగా గుర్తిస్తే మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మౌలిక సౌకర్యాలు చేకూరుతాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను సమితులుగా గుర్తిస్తున్న నేపథ్యంలో తమ ప్రాంత డొంబొసొరో పంచాయతీని సమితిగా గుర్తించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికై నా స్పందించి సమితిగా గుర్తించాలని వారంతా కోరారు. -
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
● అఖిల పక్ష సమావేశంలో ఖరారు ● మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు ● అన్ని పార్టీలు సహకరించాలి: స్పీకర్ సురమా పాఢిభువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన మంగళవారం అఖిల పక్ష సమావేశం జరిగింది. వర్షాకాలం సమావేశాల్లో సభలో కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడడమే ఈ సమావేశం ప్రాథమిక లక్ష్యం. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్, వామపక్షం కమ్యునిస్టు (మార్కిస్టు) ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మోహన్ మాఝి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్దేవ్, ప్రభాతి పరిడాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభలో వర్షాకాల సమావేశాలు సజావుగా నడపడానికి అఖిల పక్ష సభ్యుల సహకారం అనివార్యమని స్పీకర్ అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతాయి. స్వల్ప కాలిక ఈ సమావేశాలను ఫలప్రదంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమావేశల్లో మొత్తం 7 పని దినాలు ఉంటాయి. వాటిలో ఒక రోజు ప్రైవేటు సభ్యుల బిల్లులు, మరో రోజు నో ఆఫీసు డే ఉంటాయని ఖరారు చేశారు. నేడు విపక్ష సమావేశం ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ శాసన సభా పక్ష సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. స్వల్పంగా వారం రోజుల నిడివితో ముగుస్తున్నందున పూర్తి సమయాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉపకరించే దిశలో సద్వినియోగపరచుకోవాలని విపక్షం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదీసేందుకు కసరత్తు చేస్తోంది. అవిశ్వాస తీర్మానం యోచన కాంగ్రెసు పార్టీ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ నుంచి ఈ మేరకు సాయం ఆకాంక్షిస్తోంది. లేకుంటే ఒంటరిగానైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు పట్టుదలగా ఉంది. ప్రతిపక్షాలు అనేక కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరికించడానికి సిద్ధమవుతున్నందున ఈ సమావేశాలు సభలో తుఫాను అలజడి రేపే అవకాశం ఉంది. దీనికి ప్రతిస్పందనగా అధికార భారతీయ జనతా పార్టీ ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధత వ్యక్తం చేస్తోంది.ట్రాఫిక్ ఆంక్షలు శాసనసభ వర్షాకాల సమావేశాలు పురస్కరించుకొని నగరంలో వాహనాల రాకపోకలను నియంత్రించాలని కమిషనరేట్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఈ సమావేశాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర శాసనసభ పరిసరాల్లో వాహనాల రవాణా నియంత్రించడానికి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిఫార్సు చేశారు. నిషేధిత ప్రాంతాల్లో రద్దీని నివారించడానికి ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలు పోలీసు, అగ్నిమాపక మరియు అంబులెన్స్ సేవలతో సహా అత్యవసర వాహనాలకు వర్తించవు. అలాగే రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర సచివాలయం మరియు ఇతర పరిపాలనా భవనాలు వంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వచ్చే అఽనుమతి కలిగిన వాహనాలను యథాతదంగా రాకపోకలు చేసేందుకు అనుమతిస్తారు. వాహనాల రవాణా నిబంధనలు హౌసింగ్ బోర్డు స్క్వేర్ నుంచి రవీంద్ర మండపం వైపు వచ్చే వాహనాలను కేశరి టాకీస్ స్క్వేర్ వద్ద మళ్లిస్తారు. ఏజీ స్క్వేర్ నుంచి పీఎంజీ వైపు వచ్చే వాహనాలు జయదేవ్ భవన్ వద్ద కుడి వైపునకు తిరిగి ఇందిరా గాంధీ పార్క్ రోడ్డులో వెళ్లాలి. మాస్టర్ క్యాంటీన్ వైపు నుంచి పీఎంజీ వైపు వచ్చే అన్ని వాహనాలను దిగువ పీఎంజీ వద్ద పక్కనే ఉన్న వీధి దగ్గర మళ్లిస్తారు. 120 ఈన్ఫాంట్రీ బెటాలియన్ స్క్వేర్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర మండపం వైపు నివారించి పవర్ హౌస్ స్క్వేర్ వైపు మళ్లిస్తారు. రాజ్ భవన్ స్క్వేర్ నుంచి ఎమ్మెల్యే కాలనీ మరియు రవీంద్ర మండపం వైపు వచ్చే వాహనాలను శాస్త్రి నగర్ స్క్వేర్ వైపు మళ్లిస్తారు. -
గురువులదే గురుతర బాధ్యత
జయపురం: సమాజ నిర్మాణంలో గురువులదే గురుతర బాధ్యత అని స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ అన్నారు. వర్సిటీ ఉపాధ్యాయ శిక్షణ(బీఈడీ) విభాగం నిర్వహించిన బీఈడీ ప్రథమ సంవత్సర విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని సూచించారు. స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో వర్సిటీ ఉపాధ్యాయుల శిక్షణా విభాగం నిర్వహిస్తున్న భూమికను ప్రశంసించారు. ఉపాధ్యాయ శిక్షణ విభాగ ప్రధాన అధికారి డాక్టర్ మనోరంజన్ ప్రదాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు అధ్యాపకులుగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లోకేష్ ప్రధాన్, కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని గుమ్మలో కొత్తగా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాల ఆరు మాసాలుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. గుమ్మ, నువాగడ, రాయఘడ, ఆర్.ఉదయగిరిలోని రామగిరి, మోహనాలో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ రెసిడెన్సియల్ విద్యాలయాలు నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆర్.ఉదయగిరిలో రాత పరీక్ష నిర్వహించింది. అందులో 60 మంది గుమ్మ ఏకలవ్య పాఠశాలకు ఎంపికై నట్లు జాబితా ప్రచురించారు. అయితే ఇప్పటివరకు పాఠశాలలో తరగతి గదులు పూర్తికానందున విద్యార్థులకు క్లాసులు మొదలు పెట్టలేదు. దీంతో తమ పిల్లలు ఒక విద్యా సంవంత్సరం కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో వద్ద విన్నవించారు. మొత్తం 60 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి వినతిపత్రం అందజేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలు తెరవకపోతే రస్తారోకో చేపడతామని హెచ్చరించారు. -
సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులు
జయపురం: పట్టణంలోని సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకుంటే పోలీసు యంత్రాంగం సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు సమకూర్చుతుందని జయపురం పట్టణ పోలీసుస్టేషన్ అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ తెలియజేశారు. స్థానిక జేఈఎన్సీ చర్చి సభాగృహంలో పట్టణ పోలీసులు అమో పోలీసు సమితి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి రాత్రి సమయాల్లో రచ్చ చేసేవారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సంఘ వ్యతిరేక ఘటనలు జరిగినప్పుడు సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. పట్టణంలో నేరాలు నియంత్రించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు సిద్దాంత బెహర, రుచికాంత మహాకురమ్, నవీన చంద్ర చౌదరి, ఆర్.పంగి, ఏఎస్ఐలు సత్యబాది నాయక్, డీపీ పండ, కేసీహెచ్ మిశ్ర, సపన్ కుమార్ మిశ్ర తదతరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడిని బదిలీ చేయండి
రాయగడ: సదరు సమితి నకిటి పంచాయతీలోని సొరొముండా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో చదువులు సక్రమంగా కొనసాగడం లేదని, సరిగ్గా ఒక ఉపాధ్యాయుడు విధులకు హాజరవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు మధ్యాహ్న భోజనం సమయంలో మాత్రమే వచ్చి వెళ్లిపోతున్నారన్నారు. అతను ఎప్పుడూ పాఠాల చెప్పడం లేదని పేర్కొన్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అదనపు అధికారి భజన్ లాల్ మాఝి దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని చెప్పారు. -
విస్తృతంగా వాహన తనిఖీలు
జయపురం: పట్టణ పోలీసులు నింబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ ఆదేశాల మేరకు జయపురం మెయిన్రోడ్డు, పోలీసుస్టేషన్ ముందు 26వ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా అధిక శబ్ధం చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్న 28 బైక్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి మోటారు వెహికల్ చట్టం ప్రకారం జరిమానాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వాటి సైలెన్సర్లను తొలగించి రోలర్తో తొక్కించారు. రోడ్లపై న్యూసెన్స్ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యాటకుడు సురక్షితం భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక పర్యాటకుడు మునిగిపోయాడు. ఉప్పొంగిన కెరటాల్లో కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యం తీరంలో పహారా కాస్తున్న లైఫ్ గార్డుల దృష్టికి రావడంతో తక్షణమే సముద్రంలోకి దూకి ఆదుకున్నారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పూరీ సాగర తీరం 9వ నంబర్ సెక్టారులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లైఫ్ గార్డుల సాయంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరిన పర్యాటకుడు కెంజొహర్ ప్రాంతానికి చెందిన వికాస్ నాయక్గా గుర్తించారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ అందజేత రాయగడ: జిల్లాలోని టికిరి జగన్నాథ మందిరం సమీపంలో రోడ్డుపై దొరికిన సెల్ఫోన్ను బాధితుడికి పోలీసుల సమక్షంలో అప్పగించి ఒక వ్యక్తి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నయాగడ జిల్లా బెగునియాపట్న ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ రవుత్ అనే వ్యక్తి టికిరి గ్రామంలో జరిగే అగ్ని భైరవ ఉత్సవాలను తిలకించేందుకు ఆదివారం వచ్చాడు. ఈ క్రమంలో ఉత్సవాలను తిలకించే సమయంలో తనకు జగన్నాథ మందిరం సమీపంలో ఒక సెల్ఫోన్ దొరికింది. దీంతో దొరికిన సెల్ఫోన్ను సోమవారం పోలీసులకు అప్పగించాడు. అయితే అప్పటికే తన సెల్ఫోన్ పోయినట్లు ఉషాపాడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ బిడిక అనే వ్యక్తి టికిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల సమక్షంలో పోగొట్టుకున్న బాధితుడికి అప్పగించారు. బడులకు వెళ్దాం రండి జయపురం: జయపురం సబ్ జైలు రోడ్డులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం 8వ వార్డులో రండి బడులకు వెళ్దాం అభిజాన్లో ర్యాలీ మంగళవారం నిర్వహించారు. బడులకు వెళ్దాం.. బాగా చదువుదాం, మంచి రాష్ట్రాన్ని నిర్మిద్దాం అనే నినాదాలు చేశారు. జైలు రోడ్డు, నెహ్రూ నగర్, మహాత్మాగాంధీ రోడ్డు, పీడబ్ల్యూడీ లైన్, డెప్పిగుడ మొదలగు ర్యాలీ చేపట్టారు. -
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు నివసిస్తున్న పర్శాలి, సునాఖుంటి పంచాయతీ పరిధిలో దాదాపు 23 గ్రామాలు అంధకారంలో ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు విద్యుత్ వెలుగులు కల్పించాలని కోరుతూ డొంగిరియా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయా పంచాయతీలకు చెందిన డొంగిరియాలు కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి తమ గోడును వినిపించారు. ఇదివరకు ఆయా గ్రామాల్లో సోలార్తో నడిచే విద్యుత్ వీధి ద్వీపాలను యంత్రాంగం ఏర్పాటు చేసిందని వినతిపత్రంలో వివరించారు. అయితే ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే అవి మరమ్మతులకు గురవ్వడంతో నిరుపయోగంగా పడి ఉన్నాయని తెలిపారు. అందువలన శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సునాఖండి పంచాయతీకి చెందిన బొన కడ్రక, మహేశ్వర్ కడ్రక, ముధు వడక, పర్శాలి పంచాయతీకి చెందిన కృష్ణ సికక, కులసిక రాము పాల్గొన్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆపరేషన్ ప్రహార్ నడుస్తున్న నేపథ్యంలో మోహనా పోలీసు అధికారి బసంత్ శెఠి నేతృత్వంలో మంగళవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా శికుళిపదర్ గ్రామం రోడ్డు భగమర్రి వద్ద పది బస్తాల గంజాయి రవాణా చేయడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తుండగా పట్టుబడినట్టు ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి గుడ్డు రయితోగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి సమారు 2.20 క్వింటాళ్లు ఉంది. దీని విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని మోహనా ఐఐసీ బసంత్ కుమార్ శెఠి తెలియజేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ పోలీసులు ఒక ఆటోలో ఒక క్వింటాల్ 3 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రిక మంగళవారం వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ జరుపుతుండగా బొయిపరిగుడ – కొరాపుట్ జంక్షన్ మీదుగా ఒక ఆటో వేగంగా వస్తూ కనిపించింది. ఆటో డ్రైవర్ పోలీసులను చూసి వెంటనే ఆటోని విడిచిపెట్టి అడవిలోకి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటబడినా చీకటిగా ఉండడం వలన సాధ్యం కాలేదు. డ్రైవర్ విడిచిపెట్టిన ఆటోను తనికీ చేయగా అందులో నాలుగు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయని పోలీసు అధికారి వెల్లడించారు. ఆటోతో గంజాయిని స్టేషన్కు తీసుకెళ్లారు. ఆటోలో మొత్తం ఒక క్వింటాల్ 3 కిలోల గంజాయి ఉందని వెల్లడించారు. కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గుణుపూర్ రైల్వేస్టేషన్లో... రాయగడ: జిల్లాలోని గుణుపూర్ రైల్వేస్టేషన్లో 27 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గజపతి జిల్లా అడవా ప్రాంతానికి చెందిన సుదామ్ నాయక్, ఆర్.ఉదయగిరి ప్రాంతానికి చెందిన నానునా బెవర్త ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుణుపూర్ రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక మహిళ, మరో యువకుడి బ్యాగులు తనిఖీలు చేయగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.95 వేలు ఉంటుందని అంచనా వేశారు. -
రానున్న దశాబ్దం నిత్యహరితం కావాలి: గవర్నర్
● ఓఎస్పీసీబీ 42వ వ్యవస్థాపక దినోత్సవం భువనేశ్వర్: రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాలుష్య నివారణ కోసం సంప్రదాయ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహనాలను (ఈవీలు) పౌరులు స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. స్థానిక ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (ఓఎస్పీసీబీ) 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి సోమవారం గవర్నర్ ప్రసంగిస్తూ పర్యావరణ పరిరక్షణ, పౌరులకు ఆరోగ్యకరమైన భవిష్యత్ను నిర్ధారించడానికి సమష్టి చర్య అవసరాన్ని తెలియజేశారు. రాజ్ భవన్ అధీనంలో అధికారిక వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చి ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులను తగ్గించడంతో స్వచ్ఛమైన విద్యుచ్ఛక్తి పొందేందుకు ప్రభుత్వ సబ్సిడీతో ప్రజలు డాబాపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. ఓఎస్పీసీబీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ, వేగవంతమైన పారిశ్రామికీకరణను పర్యావరణ బాధ్యతతో సమతుల్యం చేయడంలో నియంత్రణ, మార్గదర్శకం మరియు భాగస్వామిగా బహుముఖ పాత్రధారిగా వ్యవహరించినందుకు డాక్టర్ కంభంపాటి బోర్డును ప్రశంసించారు. నేటి వ్యవస్థాపక దినోత్సవం ఒడిశా పర్యావరణాన్ని పరిరక్షించడంలో బోర్డు సమగ్ర, ప్రగతిశీల విధానాన్ని జరుపుకునే వేడుకగా పేర్కొన్నారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీగా 75 లక్షల మొక్కల పెంపకం కార్యక్రమంలో పౌరులు మరియు విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. గ్రీన్ టెక్నాలజీ, జీరో వేస్ట్ పరిశ్రమలు, యువత భాగస్వామ్యం, పర్యావరణ పర్యవేక్షణ కోసం డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతో సహా సాహసోపేతమైన లక్ష్యాలతో రానున్న దశాబ్దాన్ని నిత్యహరితంగా ఆవిష్కరించే దృఢ సంకల్పంతో ఈ సంస్థ కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, కాలుష్యాన్ని నియంత్రించడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం సమష్టి బాధ్యత అని నొక్కి చెప్పారు. అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) మరియు ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ సురేష్ పంత్, పీసీసీఎఫ్ ప్రేమ్ కుమార్ ఝా వంటి సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బోర్డు వెబ్సైట్, ప్రచురణలను ఆవిష్కరించారు. సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహూను సత్కరించారు. కాలుష్య నియంత్రణ ఎక్సలెన్స్, ప్రశంస అవార్డులను ప్రదానం చేశారు. ప్రకృతి పరిరక్షణలో మరియు గ్రీన్ప్రెన్యూర్లుగా సాధించిన విజయాలకు మహిళలను సత్కరించారు. -
సరైన మార్గంలో రాష్ట్ర కాంగ్రెస్
భువనేశ్వర్: ‘కాంగ్రెస్లో అగ్ర, మధ్య, నిమ్న స్థాయి తేడా లేకుండా అందరూ నాయకులే. 2029 మనదే. భక్త చరణ్ దాస్ నాయకత్వంలో ఒడిశాలో కాంగ్రెస్ సరైన మార్గంలో ఉంది. రాహుల్ గాంధీ వేల మైళ్లు పాదయాత్రలో నడుస్తుంటే, మనం ఎందుకు చేయలేము?’ అంటూ ఆదివారం స్థానిక కాంగ్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ప్రేరేపించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో గుజరాత్లో జరిగిన 10 రోజుల శిక్షణా శిబిరం తరహాలో ఒడిశా కాంగ్రెస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి సమక్షంలో ప్రజల దృష్టిలో పార్టీ ఇప్పుడు ఒడిశాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే, భారతీయ జనతా పార్టీ, బిజూ జనతా దళ్ రెండింటినీ ఓడించడం సాధ్యమేనని తెలిపారు. ఒడిశాలోని మొత్తం 35 సంస్థాగత జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఈ నెల 30 నాటికి పూర్తవుతుందని, కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల పనిని ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తారని తెలిపారు. అక్టోబర్లో కాంగ్రెస్ అన్ని మండలాలకు చేరుకుంటుందని, నవంబర్, డిసెంబర్లో ఓటు దొంగతనం అంశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలని, బూత్ కమిటీలను ఏర్పాటు చేసే పనిని పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించిన గాంధీ జయంతి నుంచి ఏడాది పొడవునా జరిగే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ఆయన ప్రశంసించారు. క్రియాశీల నాయకులు, కార్మికులు పాల్గొనాలని కోరారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐసీసీ ఒడిశా వ్యవహారాల ఇన్చార్జి అజయ్ కుమార్ లల్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో పురోగమిస్తోందన్నారు. దే చురుకుదనంతో నిరవధికంగా కృషి చేస్తే 2029లో మమ్మల్ని ఆపడం అసాధ్యమని పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. -
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక యుగం
● 27 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన భువనేశ్వర్: రాష్ట్రం సరికొత్త పారిశ్రామిక యుగం వైపు రాష్ట్రం పయనిస్తోందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆనందం వ్యక్తం చేశారు. ఒడిశాను తూర్పు భారతదేశం యొక్క తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధునాతన, ప్రపంచ వ్యాప్త పోటీ ఉత్పత్తులపై దృష్టి సారించాలని పెట్టుబడిదారులు, భావి పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన 12 జిల్లాల్లో 27 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఓయూఏటీ కన్వెన్షన్ సెంటర్లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గంజాం, ఖుర్ధా, ఝార్సుగుడ, కొరాపుట్, అంగుల్ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేసి ఇతర జిల్లాల్లోని సంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ. 25,379 కోట్ల పెట్టుబడులు చేకూరుతాయి. రాష్ట్ర యువతకు 51,826 ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు వంటి అధిక విలువైన రంగాలలో విస్తరించి ఉన్నవిగా పేర్కొన్నారు. రాష్ట్ర విధానాలు, దార్శనికతపై విశ్వాసంతో పెట్టుబడిదారులు ఔత్సాహికంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నుంచి 58 ప్రాజెక్టులు ఇప్పటికే 1,11,899 పైబడి ఉద్యోగాలను సృష్టించాయి. ఉపాధి ఆధారిత అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
నాల్కో వద్ద ఉద్రిక్త పరిస్థితులు
కొరాపుట్: భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం కొరాపుట్ జిల్లా దమంజోడిలో నాల్కో ప్రధాన ద్వారం వద్ద నిర్వాసితులు బైఠాయించారు. ఈ ప్రాంతంలో అల్యూమినియం శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు తమ భూములు ప్రభుత్వం తీసుకుందన్నారు. నాడు ఉపాధి కల్పిస్తామని చెప్పి చిన్న చిన్న ఉపాధి పనులు కల్పించారన్నారు. తాము భూమిని నమ్ముకున్న ఆదివాసీలమని గుర్తు చేశారు. తరతరాలుగా వంశ పారపర్యంగా భూమి సాగు చేసుకుంటున్నామని అన్నారు. కానీ నాడు భూమి తీసుకున్నప్పడు నిర్వాసితులకు చిన్న చిన్న ఉపాధి పనులు ఇచ్చి చేతులు దులుపు కున్నారని, ఉపాధి పొందిన వారు చనిపోయాక వారి కుటుంబంలో అర్హత ఉన్న వారికి కూలి పనులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము రోడ్డున పడ్డామన్నారు. తమకు వ్యవసాయం లేదా కూలి పనులు మాత్రమే తెలుసని అన్నారు. ఈ రెండు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ సమస్యపై తాము ఎన్నిసార్లు నాల్కో ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. పరిశ్రమ లోపల ఉన్న వారు బయటకు రాలేక పోయారు. ముడి బాకై ్సట్ తో వచ్చిన వాహనాలు నాల్కో బయట ఉండి పోయాయి. వీరికి సంఘీభావంగా పొట్టంగి మాజీ ఎమ్మెల్యే పీతం పాడి ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పినా వారు ఆందోళన విరమించలేదు. -
గ్రీవెన్స్లో 75 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్లో సోమవా రం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఇందులో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుధూల్ అభిషేక్ దిలిప్ , జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల వారినుంచి 75 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 48 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా 19 సామాహిక గ్రామసమస్యలు, మరో ఎనిమిది వైద్య సంబంధిత సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన సమస్యలను వారి వారి పరిధిలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆదేశించారు. ఇంజినీర్ల పాత్ర కీలకం రాయగడ: ఇంజనీర్ల మేధా శక్తితో అనేక అధునాతన పోకడలకు శ్రీకారం చుడుతున్నారని.. కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా మారుతుందని ప్రొఫెసర్ దిలీప్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. సదరు సమితి పరిధిలోని ఖొల్లిగుడ వద్ద గల జిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. నేషన్ బిల్డింగ్కు ఇంజనీర్ల చేస్తున్న సేవలు అపారమని కొనియాడారు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఆధునిక పోకడలకు అనుగుణంగా ముందుకు సాగాలని హితవుపలికారు. కార్యక్రమంలో కళాళాల అధ్యాపకులు శ్రీనివాస్ పట్నాయక్, కాలి ప్రసాద్ ఆచార్య, బాదల్ కుమార్ ఆచార్య, జయంత్ పట్టజోషి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం రాయగడ: కొలనార సమితి పరిధిలో గల ముకుందపూర్ ఘాటీ మలుపులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు 8 ఏళ్ల చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రామనగుడ ప్ర భుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... జిల్లాలోని పద్మపూర్కు చెందిన ఎల్ రాజు పెంటి అనే వ్యక్తి బైకులో మేనత్త, ఇద్దరు పిల్లలతో కలసి పద్మపూర్ నుంచి రాయగడకు వెళ్తున్న సమయంలో ముకుందపూర్ సమీపంలో గల హతిఖంబ గ్రామం భగుడి ఘాటి మలుపులో ఎదురుగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైకు నడిపిస్తున్న రాజు తీవ్రగాయాలకు గురై మృతి చెందగా గాయాలు తగిలిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ముకుందపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీ కొట్టి వెళ్లిపోయిన వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జగన్నాథుని చూస్తూ.. భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో రత్న వేదికపై శ్రీ జగన్నాథుని దర్శించుకునే సమయంలో ఓ మహిళా భక్తురాలు అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. అస్వస్థతకు గురైనట్లు గుర్తించి తక్షణమే స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. మరణించిన భక్తురాలు ఖండపడా ప్రాంతానికి చెందిన మంజులత సాహుగా గుర్తించారు. -
ప్లేఉడ్ పరిశ్రమ భూమి పూజలో నిరసనలు
కొరాపుట్: ప్లేఉడ్ పరిశ్రమ భూమి పూజలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సోమవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి రాణికొన, కడంగుడ, పక్కజోల, లుంగ్రి గ్రామల మధ్య ప్రాంతంలో గ్రీన్ప్లే శాండిలా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించే ప్లే ఉడ్ పరిశ్రమకి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రతిపక్ష బీజేడీకి చెందిన పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రపుల్ల పంగి వేదిక వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి బలవంతంగా బయటకు పంపించారు. అదే మార్గంలో వస్తున్న కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్కు ఈ పరిశ్రమ ఏర్పాటులో లోపాలను ప్రపుల్ల పంగి ఎత్తి చూపారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు పిలవకుండా ఎలా భూమి పూజ చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా ఉపాధి కల్పిస్తామని చెప్పి గిరిజనలు నుంచి భూమిని లాక్కుంటున్నారన్నారు. కానీ ఉపాధి కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రపుల్లను వేదికకు దూరంగా లాక్కుపోయారు. అయిన్పటికీ ప్రపుల్ల తన వాహనం పైనుంచి నిరసన తెలిపారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మఝి వర్ూట్యవల్ మొడ్లో ఈ పరిశ్రమకు భూమి పూజ చేశారు. ఇక్కడ రూ.606 కోట్లతో రెండు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 1,300 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ పరిశ్రమలో ప్లే ఉడ్, కాగితం తయారవుతాయి. ఈ కార్యక్రమంలో సమితి చైర్మన్ లిల్లి అంతారియా, వైస్ చైర్మన్ శివ బంగారియా పాల్గొన్నారు. -
ఆయుధాలతో భారీ నిరసన ప్రదర్శన
కొరాపుట్: దండకారణ్య గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. సోమవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలో వేలాది మంది గిరిజనులు ఈ ర్యాలీ చేశారు. పొట్టంగి, సిమిలిగుడ సమితుల్లో కొట్టియా, మాలిపుట్, నువాగుడ, కుడి, సొరుసు పొదర్, పొట్టంగి సమితుల్లో 21 గ్రామాల్లో సేరుబందు పర్వతాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో అపారమైన బాకై ్సట్ గనులు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిని తవ్వుకోవడానికి ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ గిరిజనులు అడ్డగిస్తున్నారు. గనుల తవ్వకాలు జరిపే ముందు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. అనేక రాష్ట్రాలలో ఉన్న విధంగా పెసా చట్టం అమలు చేయాలంటున్నారు. అదే విధంగా పల్లె సభ అనుమతి తీసుకోవాలని చట్ట పరమైన డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్వాసితులకు పరిహారాలు, ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. దీంతో గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ జయరాం పంగి ఈ ఆందోళను ముందుండి నడిపించారు. పొట్టంగి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని గిరిజనులు తమ వినతి పత్రం సమర్పించారు. తమ ఆవేదన రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు. -
కళలను పరిరక్షించాలి
రాయగడ: సంప్రదాయ కళలను పరిరక్షించి వాటిని నమ్ముకుని ఉన్న కళాకారులను పొత్సాహించాల్సిన బాధ్యత మనందరిదని గుణుపూర్ శాసనస భమా మాజీ ఎంఎల్ఏ రఘునాథ్ గొమాంగొ అన్నారు. జిల్లాలొని రామనగుడలొ ఆదివారం సాయంత్రం జరిగిన లొక్ కళా మహొత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం భిన్న సంసృతులకు ప్రతీ కమని అన్నారు.ఎన్నొ కళలు ,కళాకారులు ఉన్నారని వారి ఆచార వ్యవహారాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. కళాకారులను ప్రొత్సాహించగలిగితే కళారంగం ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుప్రిత్ సంతొష్ బొచ్చ మాట్లాడుతూ కళాకారులను ప్రొత్సాహించేందుకు వేదికగా జిల్లా కళాకారుల సంఘం ఆవిర్భవించిందని అన్నారు . ప్రభుత్వం గుర్తించిన ఈ సంఘం ద్వారా కళాకారులను ఆదుకొవడంతొ పాటు వారిని ప్రొత్సాహించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లొక్ కళాకారులకు ఘనంగా సన్మానించారు. ఇటువంటి తరహా కార్యక్రమాలు జిల్లాలొ గల 11 సమితుల్లొ నిర్వహించేందుకు సన్నహాలుచేస్తున్నట్లు కళాకారుల సంఘం కార్యదర్శి ప్రియదర్శిని ముయిక అన్నారు. కార్తీక వ్రతానికి 19 నుంచి దరఖాస్తులు స్వీకరణ భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో కార్తీక వ్రతాల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది. district.odisha.gov.inలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నవారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 17 నుంచి హెల్త్ క్యాంపులు పర్లాకిమిడి: స్వస్థనారీ.. స్వసక్త పరివార్ అభియాన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు మహిళలలు, బాలికలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని జిల్లా ముఖ్య వైద్యాధికారి ఎం.ఎం.ఆలీ సోమవారం తెలియజేశారు. ఆధార్ కార్డుతో స్వస్థ్య కేంద్రానికి వస్తే హృద్రోగం, డయాబిటీస్, ఓరల్, బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్లు, అనీమియా, టీబీ, తదితర టాకాలు ఉచితంగా వేస్తామన్నారు. ఈ హెల్త్ క్యాంపులను సద్వినీయోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రాష్ట్ర మహిళా, శిశు వికాస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. బైకు చోరీ కేసులో.. నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష రాయగడ: బైకు చోరీ కేసులో ఎస్డీజేఎం వర్షాదాస్ కేసు విచారించారు. చోరికి సంబంధం ఉన్న నలుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెల్లడించారు. జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరీమానా కింద చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా మరో 6 మాసాలు జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి 18న చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగావళి నదీ సమీపంలో అడపతిఉగడ గ్రామంలో తొయికా రమేష్కు చెందిన బైక్ దొంగతనానికి గురైంది. ఈ మేరకు బాధితుడు చందిలి పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరుజు పిడిక, సహదదేవ్ మండంగి, బిజయ్ కుమార్ మండంగి, హరేష్ ఖమారీని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన ఎస్డీజేఎం వర్షాదాస్ 11 మంది సాక్షులను విచారించిన అనంతరం తీర్పును వెలువరించారు. ముమ్మరంగా తనిఖీలు పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితిలో పలు పంచాయతీలలో సహాకార సంఘాలు, సొసైటీల గోదాముల్లో జిల్లా ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సోమవారం కూడా తనిఖీలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ పరపతి సంఘాలు (ప్యాక్స్) ఆధీనంలో ఉన్న యూరియా రైతులుకు అందజేయాలని పర్లాకిమిడి తహసీల్దార్ నారాయణ బెహరా ఆదేశించారు. గుసాని సమితిలో సర్దాపురం, కామధేను, అరగఖండి, శైలాడ, బోమ్మిక గ్రామాలలో పరపతి సంఘాలకు వెళ్లి అధికారులు రికార్డులను తనిఖీలు చేపట్టారు. గజపతి జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు యూరియా అక్రమంగా తరలివెళ్తుందన్న అభియోగాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్ర అదక్, కె.సూరజ్కుమార్, ఎ.ఆర్.సి.ఎస్ అధికారి హరిహర శెఠి ఉన్నారు. -
ఆందోళన తీవ్రతరం చేస్తాం
జయపురం: సేవా పేపరుమిల్లు విశ్రాంత శ్రామికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక యాదవ భవనంలో సేవా పేపరుమిల్లు విశ్రాంత శ్రామికుల అత్యవసర సమావేశం జరిగింది. కార్మిక నేత బసంత బెహరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సేవా కార్మిక సంఘ నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. సేవా యూనిట్ హెడ్ ఎస్.ఎస్.పాల్ రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. మిల్లు నిర్వహణ బాధ్యత కొత్త మార్క్ ఏబీ కంపెని మేనేజ్మెంట్ డైరెక్టర్ అతుల్ డాభే చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకొని ఇతర విషయాలు చర్చించి ఒక కొలిక్కి వచ్చేసరికి ఈ నెల 25వ తేదీ కావచ్చని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 19 మంది శ్రామికుల గ్రాట్యుటీ ఫైనల్ చేయాలని, ఓపీడీఆర్ కేసు నోటీసు కంపెనీకి జారీ చేశారని మహంతి వెల్లడించారు. కార్మికులకు గత 14 నెలల జీతాలు చెల్లించలేదని, మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు, విశ్రాంత శ్రామికులకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కొత్త యాజమాన్యం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అన్ని వర్గాల కార్మికులు సమైఖ్యంగా పోరాటం సాగించనున్నట్లు మహంతి హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక నేతలు నారాయణదాస్, మోహణ్ చరణ రౌత్, ధృభ మల్లిక్, రత్నాకర బెహరా తదితరులు పాల్గొన్నారు. -
గుమ్మఘాటీలో బస్సు ప్రమాదం
● 8 మందికి గాయాలు రాయగడ: గుణుపూర్ నుంచి జయపురానికి వెళ్లే గోల్డెన్ రాక్ ప్రైవేటు బస్సు సోమవారం తెల్లవారు ఝామున ప్రమాదానికి గురైంది. సదరు సమితి పరిధిలో గల గుమ్మ ఘాటీ మలుపులో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కకు దూసుకువెళ్లిపొవడంతొ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికుల్లో 8 మంది గాయాలపాలయ్యారు. గుమ్మఘాటి మలుపు దిగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పడంతో రోడ్డు సైడుకు దూసుకుపోయింది. డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి బస్సును అదుపు చేయడంతొ పెను ప్రమాదం తప్పింది. గుణుపూర్ నుంచి సొమవారం అర్ధరాత్రి బయల్దేరిన బస్సు గుమ్మఘాటి దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగాక అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: జిల్లాలో నువాగడ బ్లాక్ తబరాడ గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం జాయింట్ గ్రీవెన్స్ సెల్కు అధిక స్పందన లభించింది. జిల్లా ఎస్పీ జ్యోతింద్రకుమార్ పండా, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి శంకర కెరకెటా హాజరయ్యారు. తబరాడ గ్రామ పంచాయతీతోపాటు కె.జలార్సింగి, ఖోజురిపద గ్రామాల నుంచి మొత్తం 92 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 68, గ్రామ సమస్యలకు సంబంధించినవి 24 ఉన్నాయి. ఒక అభియోగాన్ని అధికారులు వెంటనే పరిష్కరించారు. సామాజిక పింఛన్లను ముగ్గురు దివ్యాంగులకు జిల్లా ఎస్పీ పండా అందజేశారు. ఈ సందర్భంగా తబరాడ గ్రామ పంచాయతీ ఆవరణలో మెడికల్ క్యాంప్ను సీడీఎంఓ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్కు నువాగడ పంచాయతీ సమితి అధ్యక్షురాలు మాలతి ప్రధాన్, బీడీఓ లోకనాథ శోబోరో, తహసీల్దార్ మోనాలిసా ఆచార్య, సి.డి.ఎం.ఓ ఎం.ఎం.ఆలీ, తదితరులు పాల్గొన్నారు. -
అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సన్నద్ధత
భువనేశ్వర్: శాసన సభలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెసు సన్నద్ధత వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ శాసన సభ నాయకుడు రామచంద్ర కదమ్ ఈ విషయం వెల్లడించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్కు సభలో 51 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వారి సహకారం తీసుకుంటామన్నారు. బీజేడీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ సహకారం అందిస్తుందని, లేకుంటే కాంగ్రెసు స్వతంత్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలి గందరగోళ పరిస్థితి తాండవిస్తుంది. ప్రజలు సురక్షితంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లింగరాజ ఆలయంలో భక్తుడికి గాయాలు భువనేశ్వర్: స్థానిక ఏకామ్ర క్షేత్రం లింగరాజ ఆలయంలో సోమవారం అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. మహా ప్రభువు దర్శనం కోసం విచ్చేసిన యాత్రికుడు గాయపడ్డాడు. ఆలయ సముదాయం అడప మండపం నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన భక్తుడు ఉత్తరప్రదేశ్కు చెందిన శివవర్ధన్ సింగ్గా గుర్తించారు. ఆయన గతంలో అనారోగ్యంతో ఉండి తల తిరగడం వల్ల పడిపోయినట్లు తోటి యాత్రికుల నుంచి తెలిసింది. యువతే అభివృద్ధి రథ సారధులు భువనేశ్వర్: యువతరం శక్తి, సామర్థ్యం, ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి బలమైన సారథ్యం వహిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. యువత శక్తిసామర్థ్యాల్ని సమాజ సంక్షేమానికి ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల సృష్టికి పెద్ద పీట వేసిందన్నారు. స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 7 విభాగాలకు కొత్తగా ఎంపికై న 1,686 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కృషి మరియు దృఢ సంకల్పంతో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికి ముఖ్యమంత్రి అభినందించారు. -
లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
జయపురం: జయపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా సూర్యప్రకాశ్ రావు, కార్యదర్శిగా ఎమ్.కె.దాస్లు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే మిగతా పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం రాత్రి వెలువరించిన ఫలితాలలో ఉపాధ్యక్షులుగా జి.రమేష్ కుమార్, సహాయ కార్యదర్శిగా ఎస్.సతీష్,కేషియర్గా ఎస్.రామకృష్ణ లు విజయ సాధించినట్లు నూతన కార్యదర్శి ఎన్.కె.దాస్ నేడు పత్రికల వారికి తెలిపారు. సోమవారం స్థానిక 26 వ జాతీయ రహదారిలోగల లారీ ఓనర్స్ అషోషియేషన్ సొంత కార్యాలయంలో ప్రమాణ శ్వీకారం జరిగింది.భగవత్గీతపై ప్రమాణం చేస్తూ జరిగిన ప్రమాణ శ్వీకార ఉత్సవం కార్యక్రమంలో కొత్తగాఎన్నికై న అద్యక్షులు సూర్యప్రకాశ్ రావు, కార్యదర్శి ఎమ్.కె దాస్ లతో పాటు నూతన కార్యకర్తలు ప్రమాణ శ్వీకారం చేసారు.ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీదాస్ మాట్లాడుతూ సుధీర్ఘ 22 యేళ్లు తరువాత తిరిగి తనను లారీ ఓనర్సు అసోసియేషన్ కార్యదర్శిగా ఏక గ్రీవంగా సభ్యులు ఎన్నుకొనటం తనకెంతో ఆనందంగా గర్వంగా ఉందన్నారు.అషోషియేషన్ను మరింతగా బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని సభ్యులను హామీ ఇచ్చారు.పట్టణంలో 250 కిపైగా లారీలు ఉన్నాయని 147 మందికిపైగా లారీ యజమానులు ఉన్నారని వారందరినీ ఏకత్రాటిపై నడిపి వారి ప్రయోజనాలకు,లారీ ట్రాన్స్పోర్టు వ్యాపారం అభివృద్దికి తాను కృషి చేస్తానని వెల్లడించారు.పట్టణంలో బియ్యం మిల్లులు, కాజూ ప్యాక్టరీలు మొదలగునవి ఉన్నాయని ఆయామిల్లులు, ప్యాక్టరీల యజమానులతో మంచి సంబందాలు నెలకొల్పి ట్రాన్స్పోర్టు వ్యాపారాన్ని పెంచేందుకు కృషి చేస్తామని అవసరం అయితే మినీ ట్రక్కులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని కార్యదర్శి ఎమ్.కె.దాస్ వెల్లడించారు. -
ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలం
● భగ్గుమన్న బీజేడీ ● హోరెత్తిన రాజ్ భవన్ పరిసరాలు భువనేశ్వర్: రాష్ట్రంలో ఎరువుల కొరత, నల్ల బజారు వ్యవహారాలపై బిజూ జనతా దళ్ రాజ్ భవన్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. సకాలంలో ఎరువుల సరఫరాను నిర్ధారించడంలో ఘోరంగా విఫలమైందని బీజేడీ నాయకులు ఆరోపించారు. ఈ నిర్లక్ష్య వైఖరితో రైతాంగానికి సాగు పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేడీ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడించేందుకు విఫల యత్నం చేయడంతో ఆందోళన తీవ్రమైంది. పోలీసులతో ఘర్షణకు దారితీసింది. గవర్నర్ నివాసం వెలుపల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎరువుల సంక్షోభ పరిస్థితి నిర్వహణలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేసి పరిసరాలు మారు మోగించారు. వందలాది మంది బీజేడీ కార్యకర్తలు భారీ నిరసన ఊరేగింపులో పాల్గొన్నారు. రాజ్ భవన్ చేరుకోగానే, నిరసనకారులు దూకుడు నివారణ కంచెని ఛేదించేందుకు ప్రయత్నించారు, దీనితో భద్రతా దళాలతో ఘర్షణ జరిగింది. పరిస్థితి కొద్దిసేపు గందరగోళంగా మారడంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర రైతులతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. వారి దుస్థితిని అంగీకరించడానికి నిరాకరిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న దైనందిన ఆందోళనకర పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా పాలన కొనసాగుతుందని విపక్ష బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం గవర్నర్కు మొర పెట్టుకుంది. ఈ పరిస్థితులపై చొరవ కల్పించుకోవాలని గవర్నర్ను అభ్యర్థించారు. కీలకమైన పంట కాలంలో రైతులు ఎరువులు పొందలేకపోతున్న పరిస్థితిని ఎత్తిచూపుతూ గవర్నర్ హరిబాబు కంభంపాటికి ఒక స్మారక పత్రం సమర్పించేందుకు ఎమ్మెల్యేలు సహా బిజెడి నాయకుల ప్రతినిధి బృందం రాజ్ భవన్లో గవర్నరుని కలిసింది. వ్యవసాయ శాఖ మంత్రి హామీ రాష్ట్ర స్థాయిలో ఎరువుల కొరత లేదు. జిల్లాలకు పంపిణీ కొనసాగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్దేవ్ మాట్లాడుతూ అక్రమ నిల్వలు, విక్రయాలపట్ల తలెత్తిన పరిస్థితుల్లో విభాగం తక్షణమే స్పందించి ఆయా ప్రదేశాలలో దాడులు నిర్వహించి చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరో 8 నుంచి 10 రోజుల్లో అభ్యర్థన మేరకు కేంద్రం నుంచి ఎరువులు సరఫరా అయి అవసరాలను గట్టెక్కిస్తాయని మంత్రి హామీ ఇచ్చారు. -
అంత్యక్రియలకు తీసుకువస్తే..
భువనేశ్వర్: పూరీ సాగర తీరం స్వర్గ ద్వారంలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా భావిస్తారు. ఈ క్రమంలో గంజాం జిల్లా నుంచి ఓ వృద్ధ మహిళని అంత్యక్రియల కోసం తీసుకువచ్చారు. దహనకాండ సన్నాహాలు జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కాసేపట్లో ఆమె ప్రాణాలతో బతికే ఉన్నట్లు భావించి హుటాహుటిన అంబులెన్సులో స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె జీవించి ఉన్నట్లు ధ్రువీకరించారు. పాడిపైనుంచి కళ్లు తెరిచి కోలుకున్న వృద్ధ మహిళ గంజాం జిల్లా పొలొసొరొ కె.నువాగాంవ్ ప్రాంతానికి చెందిన 86 ఏళ్ళ పి. లక్ష్మిగా గుర్తించారు. ప్రస్తుతం ఈమె పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏమై ఉంటుంది .. స్వర్గ ద్వారం శ్మశాన వాటికలో అంత్యక్రియల నిర్వహణకు సంబంధిత మృత వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం అనివార్యం. మృత వ్యక్తి ఆధార్ కార్డు కూడా అవసరం ఉంటుంది. దాని ఆధారంగా వివరాలు నమోదు చేసిన మేరకు దహనకాండకు అనుమతిస్తారు. కానీ ఈమెకు చెందిన పత్రాలు తీసుకురాలేదు. -
ఏర్పాటుకు సన్నాహాలు
రాజధానిలో ఏఐ కెమెరాల..● 645 ప్రదేశాల్లో 3,100 కెమెరాలు ఏర్పాటుభువనేశ్వర్: రాజధానిని నేర రహితంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశలో ప్రభుత్వం మానవ వనరులకు బదులుగా ఏఐ (యాంటీ ఫిక్షన్ ఇంటెలిజెన్స్)ను మోహరించాలని నిర్ణయించింది. ఏఐతో మొత్తం రాజధానిని నియంత్రించడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలోని ప్రధాన వీధుల్లో 3,100 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శక్తివంతమైన వ్యవస్థ ఈ కెమెరాలు చాలా శక్తివంతమైనవి. అవి సీ్త్ర, పురుషుల గుర్తింపు, రంగు తదితర అంశాల్ని ఇట్టే పసిగడతాయి. ఇవి నేరస్తులను, సంబంధిత వాహనాలను సులభంగా పట్టుకోగలవు. నేరస్తుడి గురించి నామ మాత్రపు సమాచారం అందజేస్తే పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఏఐ కెమెరాలను అన్ని పోలీస్ ఠాణాలకు అనుసంధానించవచ్చు. నేరం చేసి ఎవరూ తప్పించుకోలేరు. నేరస్తుడు లేదా నేరంలో పాల్గొన్న వాహనం నగరంలో ఎక్కడ తిరుగుతుందో ఇట్టే తెలుసుకుని సంబంధిత ఠాణా పోలీసులకు సమాచారం ప్రసారం చేస్తుంది. ఫలితంగా, నేరస్తుడిని పట్టుకోవడం సులభం అవుతుంది. గతంలో ప్రతి 1,000 మంది జనాభాకు 75 సాధారణ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ ఒక్కో ఏఐ కెమెరా 2,000 మందిని పర్యవేక్షించగలవు. రాష్ట్ర ప్రభుత్వం తుది ఆమోదంతో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు వివిధ విదేశీ నగరాలను సందర్శించి అక్కడి ట్రాఫిక్, నేర నియంత్రణ వ్యవస్థలను పరిశీలించిన నివేదికల ఆధారంగా అటువంటి ఆధునిక సాంకేతికతని ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి దశలో రాజధానిలో నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో అమలు చేయాలని ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది. ఇది ప్రభావవంతంగా ఉంటే అంచెలంచెలుగా ఈ వ్యవస్థను క్రమంగా ఇతర నగరాల్లో కూడా ప్రవేశపెడతారు. భువనేశ్వర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, వివరణాత్మక సమీక్ష మరియు అధ్యయనం తర్వాత, 645 ప్రదేశాలలో 3100 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి దశలో 1500 ఏఐ కెమెరాలను నగరంలో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రీ–బిడ్డింగ్ సమావేశం ఇటీవల ముగిసింది. 14 కంపెనీలు పాల్గొని టెండర్ తీసుకోవడానికి ఆసక్తి చూపాయి. ఒడిశాలో మొదటిసారిగా ఒపెక్స్ మోడల్ కింద టెండర్ ప్రక్రియ జరుగుతోంది. గతంలో, ప్రభుత్వం మొత్తం డబ్బు ఖర్చు చేసేది. తదనంతర కార్యాచరణలో లోపాలు తలెత్తిన అనుంబంధ సంస్థలు ఎగవేయడం వంటి సంఘటనలు చోటుచేసుకునేవి. సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ వ్యవహారంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని చవి చూసిన ప్రభుత్వం ఒపెక్స్ మోడల్ టెండర్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇది పూర్తిగా పనితీరు ఆధారిత టెండర్. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి ముందస్తు ఖర్చు చేయదు. టెండర్ గెలిచిన సంస్థ అన్ని ఖర్చులను భరిస్తుంది. ఏఐ కెమెరాను కొనుగోలు చేయడం నుండి దానిని ఇన్స్టాల్ చేయడం మరియు అమలులోకి తీసుకురావడం వరకు సంస్థలు తన స్వంత ఖర్చుతో అన్ని పనులను చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బును సంస్థకు విడతలవారీగా చెల్లిస్తుంది. పని తీరుని చవి చూసిన తర్వాత కెమెరా వ్యవస్థ సరిగ్గా పని చేస్తే ఆ సంస్థ వాయిదాల డబ్బును పొందుతుంది. లేకుంటే చేజార్చుకోవడం తథ్యం. ఖరారైన సంస్థకు ఏడేళ్లలో 84 వాయిదాల్లో మొత్తం చెల్లించే నిబంధనతో టెండర్ నిర్దేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి సలహాదారు ప్రకాష్ మిశ్రా అధ్యక్షతన ఇటీవల దీనిపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని ఆ సీనియర్ అధికారి తెలిపారు. దీనిలో భువనేశ్వర్ పోలీస్ కమిషనర్, భువనేశ్వర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఏఐ కెమెరాల మౌలిక సదుపాయాల గురించి వివరంగా చర్చించారు. -
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: రక్తదానం అన్ని దానాల కన్నా మహత్తరమైనదని స్వయం సేవక సంఘ్ పశ్చిమ ప్రాంత ప్రముఖులు సుశీల్ జైన్ అన్నారు. ఆదివారం జయపురం అరవింద నగర్ సరస్వతీ శిశు విద్యాలయ దివ్య మందిర ప్రాంగణంలో కేశవ సేవా ట్రస్టు వారు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సునీల్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో రక్తహీన రోగులు, క్షతగాత్రులు, గర్భిణులకు రక్తం అవసరం ఉంటుందన్నారు. ఎటువంటి సమయంలో రక్త లేమితో ఏ ఒక్కరూ మరణించ కూడదని అటువంటివారు రక్షించాలంటే రక్తం ఎంతో అవసరమన్నారు. అందుచేత ప్రజలు, ముఖ్యంగా యువతీ, యువకులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిర నిర్వహణకు సరస్వతీ శిశు విద్యా మందిర పూర్వ విద్యార్థి సంఘం సహకరించింది. కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల హాస్పిటల్ రక్తనిధి టెక్నీషియన్లు దాతల నుంచి రక్తం సేకరించారు. ఈ శిబిరంలో 48 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయపురం నగర ఆర్.ఎస్.ఎస్ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర, సరస్వతీ శిశు విద్యాలయ పరిచాలన కమిటీ ప్రేమానంద నాయక్, రక్తదాతల మోటివేటెడ్ ధమంజొడి అధికారి డాక్టర్ నరేష్ చంద్ర సాహు, డాక్టర్ రమణీ రంజన్ దాస్లు అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతీ శిశు విద్యా మందిర్ ప్రధాన ఆచార్య డాక్టర్ రమణిని సన్మానించారు. శిబిర నిర్వహణలో విద్యామందిర్ పూర్వ విద్యార్థులు ప్రభాకర రౌత్, ప్రదీప్ త్రిపాఠీ, రక్తదాతల మోటివేటెర్లు మిహిర్ మిశ్ర, సత్యవాది మిశ్రలు రక్తదాన శిబిర నిర్వహణలో సహకరించారు. ఈ శిబిరంలో రక్తదాతలకు ప్రశంసాపత్రాలతో సన్మానించారు. -
ప్రజామరుగుదొడ్లను.. తెరిపించాలి
● పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి ప్రజల విజ్ఞప్తిపర్లాకిమిడి: కొత్త బస్టాండ్లో నెల రోజులుగా మూతబడి ఉన్న ప్రజా మరుగుదొడ్లను (సౌచాలయం తెరిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరుగుదొడ్లను మూసి వేయడంతో ప్రయాణికులు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం ఉదయం మూతబడిన మరుగుదొడ్లను సందర్శించారు. గతంలో బీహారీ వాళ్లకు కాంట్రాక్టు పద్ధతిన పురపాలక సంఘం సౌచాలయ నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పారు. అయితే ఇటీవల స్నానపు గది శ్లాబు విరిగిపోయిపోవడంతో నెలరోజులుగా మూసివేశారు. దీంతో స్టేషన్కు వచ్చి పోయే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో ఉన్న రెండు ప్రజామరుగుదొడ్లు మూతబడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి పర్లాకిమిడి మున్సిపల్ చైర్మన్ నిర్మలా శెఠి, ఈలో లక్ష్మణ ముర్మును పిలిపించి వివరణ అడిగారు. బస్టాండ్లో ఉన్న మరో సౌచాలయం కూడా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారని బస్సు వర్కర్స్ సంఘం జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ మాల బిశోయి, ప్రైవేటు బస్సు యాజమాన్యం సంఘం కార్యవర్గ సభ్యులు కిలారి గోపి ఎమ్మెల్యే రూపేష్కి వివరించారు. 15 రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి ప్రయాణికులకు అందుబాటులో తెస్తామని పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి హామీ ఇచ్చారు. -
దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకుర పూజలు
● 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ● ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిమగ్నంపర్లాకిమిడి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పర్లాకిమిడి పట్టణంలో పలు కూడళ్లలో పందిళ్లు, పెండాళ్లు, దుర్గాదేవి విగ్రహాల తయారీతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎస్కేసీజీ కళాశాల జంక్షన్ వద్ద జిల్లా ప్రైవేటు డైవర్స్ సంఘం, మోటారు వర్కర్స్ కలిసి దేవీ శరన్నవరాత్రి పూజలకు అంకుర పూజలు ఆదివారం ప్రారంభించారు. ఈనెల 22న అష్టమి నాడు కళాశాల జంక్షన్ వద్ద దుర్గాదేవి ప్రతిష్టించి పూజలు జరుపుతారు. అలాగే పెద్ద బ్రాహ్మాణ వీధి వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 21న మహాలయ అమావాస్య నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమౌతాయని నిర్వాహాకులు తెలిపారు. పెద్దబ్రాహ్మాణ వీధిలో గత 60 ఏళ్లుగా పెద్ద ఎత్తున దుర్గాశరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ధోబా చాకలి వీధి వద్ద కూడా పెద్ద ఎత్తున దుర్గా పెండాళ్లు నిర్మిస్తున్నారు. -
ముగిసిన వినాయక ఉత్సవాలు
జయపురం: జయపురంలో ఇప్పటి వరకూ వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక ఆర్అండ్బీ కాలనీ, నెహ్రూనగర్ డెప్పిగూడ, భూపతి వీధి కూడలి వద్ద మోడరన్ గ్రూపు వినాయక ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. వినాయక విగ్రహాలను వాహనాల్లో తరలించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.నాల్కో సందర్శన కొరాపుట్: భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) ని ఉన్నతాధికారులు సందర్శించారు. కొరాపుట్ జిల్లా దమన్జోడిలోని నాల్కో డైరక్టర్ జగదీష్ అరోరా రిఫార్మర్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో నాల్కో ఉన్నతాధికారులు మాచిరెడ్డి కృష్ణరెడ్డి, సతీష్ చంద్ర దుబే తదితరులు ఉన్నారు. ప్రథమ చికిత్సపై అవగాహన కొరాపుట్: ప్రథమ చికిత్సపై విద్యార్థినులకు అవగాహన ఉండాలని అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా పేర్కొన్నారు. ఆదివారం నబరంగపూర్ జిల్లా కేంద్రంలోని మహిళా మహా విద్యాలయంలో జరిగిన ఫస్ట్ ఎయిడ్ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. పాము కాటు, పక్షవాతం, కాలిన గాయాలు, అపస్మారక స్థితి వంటి ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి సందర్భంలో ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కుతాయని అన్నారు. కార్యక్రమంలో యూత్ రెడ్క్రాస్ అధికారి డాక్టర్ అయుత పండా, తర్నమ్ ఆరా, సునీత పాత్రో, లక్ష్మీకాంత్ సౌర తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రయాణికుల బస్సు బోల్తా భువనేశ్వర్: నయాగడ్ జిల్లా దస్పల్లా ప్రాంతంలో ఆదివారం ప్రయాణికుల బస్సు ప్రమాదా నికి గురైంది. కటక్ నుంచి బొలంగీర్కు ప్రయా ణిస్తుండగా జముసాహి సమీపంలో బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. టైరు పగిలి పది మందికి గాయాలు భువనేశ్వర్: వ్యాన్ టైరు పగిలి దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కటక్ నుంచి సంబలపూర్ వెళ్తుండగా అఠొగొడొ సమీపం కొఖొడి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్లో ఉన్న వాయిద్యకారులు గాయపడినట్లు సమాచారం. యూరియా స్టాకు పరిశీలన పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితిలో బాగుసల, పాటికోట, జాజిపూర్ సహకార సంఘాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం సందర్శించారు. గోదాముల్లో ఉన్న యూరియా స్టాకును అడిగి తెలుసుకున్నారు. యూరియా స్టాకును పరీక్షించిన ఎమ్మెల్యే రూపేష్ కొంత యూరియా పక్క రాష్ట్రానికి తరలి వెళ్తున్నట్లు గుర్తించారు. పాటికోట, బాగుసల గ్రామాల్లో యూరియ స్టాకును పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విలేకరులకు తెలియజేశారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
మందస: ఎచ్చెర్లలోని జిల్లా సాయుధ పోలీసు దళంలో విధులు నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ బెహరా మురళీకృష్ణ అనారోగ్యంతో చికిత్స పొందూతూ ఈ నెల 8న మృతి చెందారు. మందస కిల్లమ్మ వీధిలో నివాసం ఉంటున్న ఆయన భార్య మమతారాణికి ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రోణంకి కృష్ణంనాయుడు, ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు. పోరాటాలతోనే హక్కుల సాధన శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అంగన్వాడీల పోరాట ఫలితంగానే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సుధ, కె.కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సభలో యూనియన్ నాయకులు హైమావతి, శాంతామణి, కె.వి.హేమలత, కె.సుజాత, జె.కాంచన, భూలక్ష్మి, చంద్రమౌళి, మాధవి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సెలవులు మంజూరు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను సీనియర్ ఆశా వర్కర్ జి.పార్వతి ఆవిష్కరించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా అధ్యక్షురాలు డి.ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ యాప్ల భారం తగ్గించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశాలుగా మార్పు చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆశాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వేతనాలు పెంపుదల చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలిగా కె.నాగమణి, అధ్యక్షురాలిగా డి.ధనలక్ష్మి, ఉపాధ్యక్షులుగా డి.దమయంతి, పి.జయలక్ష్మి, జి.పార్వతి, ప్రధాన కార్యదర్శిగా జి.అమరావతి, సహాయ కార్యదర్శులుగా పి.ప్రేమలత, స్వర్ణలతా పట్నాయక్, ఎం.లావణ్య, కోశాధికారిగా వై.సుజాతతో పాటు 35 కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్.వి.రమణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ద్రాక్ష పొందూరు: లోలుగు కేజీబీవీ విద్యార్థిని ఎం.ద్రాక్ష జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–18 విభాగంలో జిల్లా స్థాయిలో షాట్పుట్లో మొదటి స్థానం, డిస్కస్ త్రోలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 27 నుంచి 29 వరకు ఏలూరు జిల్లా అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి, పీఈటీ రూపవతి తెలిపారు. -
‘అపరాజిత–2025’ వెలువరించాలి
జయపురం: చరిత్రాత్మక జయపురం దసరా వేడుకుల సందర్భంగా దసరా సావనీర్ ‘అపరాజిత–2025’ వెలువరించాలని దసరా మహోత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ అధ్యక్షుడు, జయపుం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి నివాసంలో ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవ సావనీర్ ‘అపరాజిత–2025’ లో జయపురం చరిత్ర, ప్రాధాన్యత, గౌరవం, పరిశోధనలు, రచనలు పొందుపరచటం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అపరాజిత –2025 సావనీర్కు రచయిత, పరిశోధకులు డాక్టర్ పరేష్ రథ్ ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తారన్నారు. ఈయనతోపాటు సంపాదక కార్యవర్గంలో జయపురం సాహితీ పరిషత్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ దాస్, సభ్యులు నవకృష్ణ రథ్, జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్, రచయిత డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్, సాహితీవేత్త శ్రీనాథ్ మిశ్ర, కాంగ్రెస్ నేత నిహార రంజన్ బిశాయి ఉంటారని వెల్లడించారు. విజ్ఞానులు, రచయితలు, పరిశోధకులు, కవులు, చరిత్రకారులు, జయపురం, చరిత్ర, జయపురం దసరా ఉత్సవాల ప్రాధాన్యతపై వ్యాసాలు, రచనలు, పరిశోధన వివరాలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
ఆయుష్మాన్భవ కార్డుదారులను.. దోచుకుంటున్న దళారీలు
జయపురం: కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు అందించే వైద్య సేవలు ఉచితంగా పొందేందుకు వృద్ధులు, ప్రజలకు ఆయుష్మాన్భవ కార్డులు సమకూర్చింది. ఈ కార్డుదారులపైన కొంతమంది దళారుల కన్ను పడింది. రోగులకు దగ్గరుండి వైద్యం చేయిస్తామని, అంబులెన్స్లు తీసుకువచ్చి పక్క రాష్ట్రానికి తీసుకువెళ్తున్నారు. అయితే వారికి ఎటువంటి వైద్యం చేయించకుండానే హాస్పిటల్ వర్గాలతో చేతులు కలిపి ఆయుస్మాన్భవ కార్డులలోని డబ్బులు కాజేస్తున్నారని జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కుంద్రా సమితి అసన గ్రామ పంచాయతీలో పకనగుడ గ్రామానికి ఛత్తీష్గఢ్ నుంచి శుక్రవారం రెండు అంబులెన్స్లు రోగులను తీసుకువెళ్లేందుకు వచ్చాయన్న అనుమానంతో గ్రామస్తులు వాటిని అడ్డగించి అందులో ఉన్న దళారీని పట్టుకున్నారు. ఈ విషయం కొట్పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బిప్రనారాయణ ఆచార్యకు తెలియజేయగా.. ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంద్ర పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సనాతన శుశాణ, కానిస్టేబుల్ రవీంద్ర పూజారీ వచ్చి ఆ రెండు అంబులెన్స్లను, దళారిని స్టేషన్కు తీసుకువెళ్లారు. గ్రామ వాసుల ఆరోపణ ప్రకారం కొద్దిరోజులుగా స్థానిక గురునాథ్ కమర సహకారంతో ఫూల్భట్ట గ్రామ పంచాయతీలో ఆయుష్మాన్భవ కార్డులున్న కొంత మంది వ్యక్తులను ఛత్తీష్గడ్లోని బస్తర జిల్లా జగదల్పూర్కు తీసుకువెళ్తున్నారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించిన సంఘటనపై ప్రజలకు అనుమానం వచ్చింది. ఒడిశాలో రోగులకు వైద్య చికిత్స కొరకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నా.. ఛత్తీష్గఢ్లో ఏ సౌకర్యాలు ఉన్నాయని తీసుకువెళ్తున్నారన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానంతోనే గ్రామస్తులు రెండు అంబులెన్స్లను అడ్డుకున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ఫూల్భట్ట గ్రామం నుంచి ఆయుశ్మాన్భవ కార్డులు గల దాదాపు 25 మంది రోగులను ఛత్తీష్గఢ్లో ఒక ప్రైవేట్ చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య చికిత్సలు చేయకుండా కేవలం భోజనం పెట్టి వారి ఆయుష్మాన్భవ కార్డులు అడిగి తీసుకొని వారి ఫోన్లకు వచ్చే ఓటీపీ అడుగుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. తద్వారా వారికి చికిత్సకు ఖర్చు అయినట్లు చూపించి ఆయుస్మాన్భవ కార్డులలో డబ్బులు తీసుకుంటున్నారన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణపై పూర్తి దర్యాప్తు జరిపిన తరువాత వాస్తవాలు బయట పడతాయని పోలీసు అధికారి అశ్వినీ పట్నాయక్ వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కొట్పాడ్ సమితి చందిలిలో గల చికిత్సాలయం పీఆర్ఓ కర్ణ భొత్రను పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే కెరమటి గ్రామం దళాల్ నినిబాబు కుమార్ కూడా ఈ ప్రాంత రోగులను రాయపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్తూ ఒక్కొక్క రోగి వద్ద వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడని ఆరోపణలున్నాయి. నినిబాబు రాయపూర్ తీసుకువెళ్లిన శ్రీధర పూజారి, ఖగునతి అనే వ్యక్తలకు కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని, వారికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. వారు చికిత్స చేయించుకోకుండా ఇళ్లకు తిరిగివచ్చారు. దళారులు పట్టుబడిన తరువాత అనేక విషయాలు బయటపడుతున్నాయని ప్రజలంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి అశ్వినీ పట్నాయక్ పత్రికల వారికి వెల్లడించారు. చత్తీష్గఢ్కు రోగులు తరలింపు వారి కార్డుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం రంగంలోకి దిగిన పోసులు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ తరువాత వివరాలు వెల్లడి -
నార్త్జోన్ టోర్నీలో సిక్కోలుకు మరో విజయం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏసీఏ నార్త్జోన్ అంతర్జిల్లాల క్రికెట్ టోర్నీలో శ్రీకాకుళం జట్టు మరో విజయాన్ని నమోదుచేసింది. జిల్లా జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమష్టిగా రాణించడంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తూర్పుగోదావరితో జరిగిన మల్టీడేస్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో సాధించిన 59 పరుగుల కీలకమైన ఆధిక్యతంతో శ్రీకాకుళం జయభేరి మోగించింది. విజయనగరం జిల్లా వేదికగా ఏసీఏ నార్త్జోన్ అంతర్ జిల్లాల త్రీడేస్ (మల్టీడేస్) పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్ వారం రోజుల కిందట మొదలైన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్లో తూర్పుగోదావరితో శ్రీకాకుళం తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్లో 241 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్స్పిన్నర్ మొదలవలస పూర్ణచంద్ర అత్యద్భుతమైన బౌలింగ్ చేసి ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు మూడోరోజు ఆటముగిసే సమయానికి 310 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో ఆధిక్యంతో మ్యాచ్ ప్యాయింట్లను శ్రీకాకుళం నిలబెట్టుకుని విజయం సాధించినట్టయింది. జిల్లా జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ బొద్దంకి జగదీశ్వరరావు 106 పరుగులతో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ నంబళ్ల సుశాంత్ 72 పరుగులతో రాణించాడు. జట్టు క్రీడాకారులకు అభినందన.. నార్త్జోన్ అండర్–23 మల్టీడేస్ క్రికెట్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేయడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు క్రీడాకారులను అభినందించారు. స్వయంగా మైదానం వద్దకు చేరుకుని క్రీడాకారులకు మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా జట్లు సమస్టిగా రాణించడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ అమ్మద్, కోశాధికారి మదీనాశైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్ హర్షం వ్యక్తంచేశారు. జిల్లా జట్టుకు సెలక్టర్గా జయశంకర్, కోచ్ కమ్ మేనేజర్గా రవితేజ వ్యవహరిస్తున్నారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి.. శ్రీకాకుళంలో మహిళా క్రికెట్ విస్తరణ, అభివృద్ధి కోసం జిల్లా క్రికెట్ సంఘం మరో అడుగుముందుకేసింది. బాలికల క్రికెట్ సబ్సెంటర్ను శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం కోసం పాఠశాల హెచ్ఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. క్రీడామైదానంలో సగభాగాన్ని క్రికెట్ విస్తరణకు వినియోగించనున్నారు. -
ఘనంగా హిందీ దినోత్సవం
జయపురం: మన రాష్ట్ర భాష హిందీ అని, ఆ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తులు అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అఖిల భారతావణిని జాగృత పరచి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడిందని వక్తలు వెల్లడించారు. ఆదివారం హిందీ దివస్(హిందీ దినోత్సవం)ను జయపురం సిటీ హైస్కూల్ సభాగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ట్రాన్స్లేటర్ మహేంద్ర కుమార్ శామంతరాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా రామన్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రముఖ కళాకారుడు దిరెన్ మోహన్ పట్నాయక్, విశ్రాంత హిందీ ఉపాద్యాయులు రాధామోహన్ పండా, తెలుగు సాంస్కృతి సమితి అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్, సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్ పట్నాయక్,ౖ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులలో వ్యాస రచన, గేయ రచన, వక్తృత్వ పోటీలు, గీత పఠనం, పోస్టర్లు తయారు చేయటం, కథలు చెప్పే పోటీలు తదితవి నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థి ఆయుష్ పట్నాయక్ కీబోర్డుపై బ్రాండ్ మాతరమ్ సంగీతం వినిపించాడు. హిందీ పద్యాలు చదివే పోటీలలో సాయి సర్జిమ్, అభశ్రీ పట్నాయక్, దేవాంశీ పట్నాయక్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. సుధాలేఖన పోటీలలో చైత్రిక, నటరాజ్ బబ్యాంశి సాహు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ పోస్టర్ మేకింగ్ పోటీలలో ఎ.మౌనిక, ఎ.సాయిశ్రాద ఆచారి, సభ్నమ్ ప్రవీన్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. సీనియర్ కవిత రచన పోటీలలో వై.గంగోత్రి, సి.హెచ్.సుప్రియ, స్వేతా సింగ్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. వక్తృత్వ పోటీలలో సి.హెచ్.సుప్రియ, ఎ.హరిణి, ఎల్. రాజేశ్వరరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. సిటీ స్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు కల్పన రత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు పపిత ప్రధాన్, 2025 హెచ్.ఎస్.సి పరీక్షలలో హిందీలో 95 శాతం మార్కులు సాధించిన అమిత యాదవ్, ఆశిష్, కె.మోనికను సన్మానించారు. -
అరసవల్లిలో భానుసప్తమి సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భానుసప్తమి సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలను కిటకిటలాడాయి. ఆరోగ్య ప్రదాతకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతివ్వడంతో సజావుగా దర్శనాలు చేసుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయం బయట భక్తుల కోసం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో టెంట్లు వేసినప్పటికీ.. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఏర్పాట్లు సరిపడలేదనే విమర్శలు వినిపించాయి. కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకుని ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసుకుని దర్శనాలకు బారులు తీరారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కారాల పూజలను చేయించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ కలిగిన భక్తులకు మాత్రమే అనుమతించారు. పలువురు భక్తులు తమ పెద్దల పేరిట ఆలయ అభివృద్ధికి, అలాగే నిత్యాన్నదాన పథకానికి విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ నాయకురాలు జె.సుభద్ర కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను ఇచ్చారు. వేదాశీర్వచనాన్ని అర్చకులు అందజేసారు. ఆదాయం రూ.6.24 లక్షలు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి భానుసప్తమి సందర్భంగా ఒక్కరోజులో రూ.6,24,188 వరకు ఆదాయం లభించింది. దర్శనాలకు వివిధ రకాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3.18 లక్షలు, విరాళాల ద్వారా రూ.80,188, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.26 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈవో ప్రసాద్ వివరించారు. -
స్కూల్లో గొడవ.. పోలీస్స్టేషన్లో పంచాయితీ!
● విద్యార్థి, కుటుంబ సభ్యులపై దాడి చేయించిన టీడీపీ నేత ● అధికార పార్టీ కావడంతో కేసు నమోదులో పోలీసుల తాత్సారం శ్రీకాకుళం రూరల్ : పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలు టీడీపీకి చెందినవి కావడంతో రాజీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. చాపురం పంచాయతీకి చెందిన ఓ టీడీపీ సీనియర్ నాయకుడు.. రాగోలులో నివాసముంటున్న ఆమదాలవలసకు చెందిన మరో టీడీపీ నాయకురాలి పిల్లలు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఓ విషయమై ఇద్దరు పిల్లలు పాఠశాలలో గొడవపడ్డారు. ఈ విషయాన్ని చాపురంలో ఉంటున్న టీడీపీ నేతకు కుమారుడు చెప్పడంతో వారంతా వెళ్లి రాగోలులో నివాసముంటున్న టీడీపీ సభ్యురాలిపైన, ఆమె కుమారుడిపైన దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్ను ఆశ్రయించారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదు. తీవ్రంగా గాయపడిన మహిళ మాత్రం దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్లో తిష్టవేసింది. అయినప్పటికీ పోలీసులు రాజీచేసే దిశగా చేస్తున్నారే తప్ప కేసు నమోదు చేయడంలో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక ఎస్ఐ రాము వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. -
తమిళనాడులో పర్యటిస్తున్న కొరాపుట్ జెడ్పీ బృందం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పరిషత్ బృందం తమిళనాడు రాష్ట్రంలో అధికారిక పర్యటన చేస్తుంది. ఆదివారం కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు సస్మితా మెలక నేతృత్వంలో జిల్లా పరిషత్ సభ్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలసి పలు సంక్షేమ పథకాలు పరిశీలించారు. చైన్నెలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లాలో ఉత్పత్తులు, కొట్పాడ్ వస్త్రాలు ఆ ప్రభుత్వ అధికారులకు అందజేశారు. చెంగల్ పట్టు జిల్లాలో పంచాయతీ రాజ్ సహాయంతో 150 మంది మహిళలు తయారు చేస్తున్న కళాఖండాల తయారీ కేంద్రం పరిశీలించారు. కాంచీపురం జిల్లాలో మహిళలచే నిర్వహించబడుతున్న చిన్న స్థాయి పరిశ్రమలు పరిశీలించారు. అనంతరం కంచిలోని కామాక్షి దేవాలయం, పాండిచేరి రాష్ట్రం సందర్శించారు. -
సమాచార హక్కు దుర్వినియోగం
● ఏడాది పాటు దరఖాస్తుల దాఖలు నిషేధం భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సమాచార కమిషన్ ఒక వ్యక్తిని ఒక సంవత్సరం పాటు సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తులు చేయకుండా నిషేధించింది. సతొపురి గ్రామానికి చెందిన చిత్తరంజన్ సెఠి అనే దరఖాస్తుదారుడు మెయితిపూర్ గ్రామ పంచాయతీ, నిమాపడా మండల కార్యాలయం నుంచి ఒకే అంశంపై సమాచారం కోరుతూ వరుసగా 61 సార్లు దరఖాస్తు చేశాడు. నెలవారీగా, సంవత్సరం వారీగా ఆదాయం, ఖర్చు మరియు అభివృద్ధి పనుల వివరాలను కోరుతూ ఈ దరఖాస్తులు దాఖలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర సమాచార కమిషనర్ సుశాంత కుమార్ మహంతి ఈ నిషేధ ఆదేశాలు జారీ చేశారు. సమాచార హక్కు చట్టపరంగా దరఖాస్తుల పట్ల అనుబంధ వర్గాలు ప్రతిస్పందించడంతో సంబంధిత దస్తావేజులు, పత్రాలను ప్రత్యక్షంగా తనిఖీ చేయడానికి అవకాశాలు కల్పించినప్పటికీ చిత్తరంజన్ సెఠి పదే పదే దరఖాస్తులు దాఖలు చేయడం కొనసాగించారని సమాచార హక్కు విచారణ పీఠం పేర్కొంది. ఈ పరిశీలన ఆధారంగా అప్పీలుదారు, ఫిర్యాదుదారు దాఖలు చేసిన 61 కేసులను ఇందు మూలంగా కొట్టివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పైన పేర్కొన్న వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, దరఖాస్తుదారుడి ప్రవర్తన సమాచార హక్కు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని కమిషన్ తేల్చింది. అతని చర్య దుర్వినియోగానికి స్పష్టమైన సూచన. భారత పౌరుడిగా, దరఖాస్తుదారుడు సమాచార హక్కు చట్టం, 2005 కింద సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉన్నా ఎవరైన దేశ చట్టాన్ని, విధానాన్ని పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అంకితమైన ఏ సంస్థ కూడా అలాంటి పవిత్రమైన చట్టాన్ని అసమానంగా, ఇష్టానుసారం ఉపయోగించడాన్ని అంగీకరించదు. ప్రస్తుత సంఘటనలో దరఖాస్తుదారుడిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అర్హుడు అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బీపీఎల్ కార్డును ఉపయోగించి దరఖాస్తుదారుడు విచక్షణారహితంగా దరఖాస్తు దాఖలు చేసినట్లు సమాచార హక్కు విచారణ బృందం ధృవీకరించింది. కలెక్టర్, పూరీ జిల్లా మేజిస్ట్రేట్ దరఖాస్తుదారుని బీపీఎల్ కార్డు వాస్తవికత, ప్రస్తుత స్థితిని ధృవీకరించి తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 7(9) ప్రకారం అతని నుండి పునరావృతం అయ్యే లేదా భారమైన ప్రశ్నలను తిరస్కరించాలని రాష ్ట్రవ్యాప్తంగా సంబంధిత శాఖలకు సలహా జారీ చేయాలని కమిషను పేర్కొంది. -
నూతన కార్యవర్గం ఎన్నిక
కొరాపుట్: కొరాపుట్ జిల్లా స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎస్యూజే) సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. జిల్లా కేంద్రంలోని స్కిల్ డవలప్మెంట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో జిల్లా అధ్యక్షుడిగా తరుణ్ కుమార్ మహాపాత్రో (రుణా), ఉపాధ్యక్షుడిగా రమేష్ సాహు, కార్యదర్శిగా శిశిర్ ఆచార్య, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ బిసోయిలు ఎన్నికయ్యారు. ఇటీవల నారాయాణపట్న ధరిత్రి విలేకరి రాజ్ కిషోర్ జెన్నా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం జరిగింది. దీంతో అతనికి ఆర్థిక సాయం అందజేయాలని సమావేశం నిర్ణయించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కీర్తిచంద్ర సాహు, జిల్లా మాజీ అధ్యక్షుడు బిజయ చౌదరి, సీహెచ్ శాంతాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు నిర్వహించం
కొరాపుట్: ఇకపై తాము బాల్య వివాహాలను ప్రోత్సహించమని వివిధ దేవాలయాల అర్చకులు పేర్కొన్నారు. ఈ మేరకు నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల వద్ద స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. దేవాలయాల్లో బాల్య వివాహాలను అనుమతిమంచమని, అలాగే బాల్య వివాహాలను ప్రోత్సహింహించమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎవరైనా తమను సంప్రదిస్తే అధికారులకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. పట్టణంలోని బండారు ఘరణి, జగన్నాథ, పాత శివాలయం, హనుమాన్, సత్యానారాయణ స్వామి దేవాలయాల వద్ద ప్రతిజ్ఞలు చేశారు. కార్యక్రమంలో శోభ సంస్థకి చెందిన ఉమా సత్నమి,తపస్ రంజన్ డంగ్రి, భువనేశ్వర్ దిశారి తదితరులు పాల్గొన్నారు. -
హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం
● టీచర్ల భర్తీ, ఇతర అంశాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ● రాజభాషకు ప్రోత్సాహం కరువు ● నేడు జాతీయ హిందీ దివాస్ శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ భాష హిందీపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందీ భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీతోపాటు లాంగ్వేజ్ టీచర్లను సైతం నియమించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైఎస్సార్ సీపీ పాలనలో హిందీ భాషాభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. హిందీ సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. గత డీఎస్సీలో హిందీ పోస్టులను సైతం భారీగా భర్తీ చేశారు. ప్రస్తుతం హిందీ భాష పట్ల, హిందీ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రాజ భాషగా హిందీని ప్రోత్సహించాలని హిందీమంచ్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేటి నుంచి పక్షోత్సవాలు.. ఈ నెల 14న జాతీయ హిందీ దివాస్ సందర్భంగా.. ఆదివారం నుంచి పక్షోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు 15 రోజులపాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఐదు రోజులు పాటు హిందీ దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంచ్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోనే శ్రీధర్ నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. హిందీ ఫోరం, హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో విద్యార్ధులను హిందీపై ఆసక్తిపెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా కసరత్తులు చేశారు. మరోపక్క హిందీ సులేఖన్ పోటీలను పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు. -
టీ షాపులో అగ్ని ప్రమాదం
పర్లాకిమిడి: స్థానిక గాంధీ జంక్షన్ వద్ద ఒక టీ షాపులో అగ్ని ప్రమాదం జరిగి సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన సామగ్రి కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం గాంధీ జంక్షన్ వద్ద సాహు టీ దుకాణంలో కొత్త రిఫ్రిజరేటర్కు కనెక్షన్ ఇచ్చాడు. అయితే శనివారం వేకువజామున దుకాణం నుంచి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. కానీ అప్పటికే షాపులో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.షాలిని పండిట్ బదిలీ భువనేశ్వర్: ఒడిశా క్యాడర్ 2001 సంవత్సరపు ఐఏఎస్ అధికారి షాలిని పండిట్ కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక సేవల శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ పరిధిలోని క్యాబినెట్ నియామక కమిటీ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 5 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు పేర్కొన్నాయి. బాధ్యతలు స్వీకరించిన నుంచి పదవీ కాలం పరిగణిస్తారు. షాలిని పండిట్ ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వ పాఠశాలలు మరియు సామూహిక విద్య విభాగం కమిషనర్ కమ్ సెక్రటరీగా పని చేస్తున్నారు. -
● పాఠశాలల సందర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా నోడల్ అధికారి, ఒడిశా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ స్మృతి స్నిగ్దామిశ్రా జిల్లాలో గుసాని, రాయఘడ, ఆర్.ఉదయగిరి బ్లాకుల్లోని పలు ఉన్నత పాఠశాలలను శనివారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న 5టీ పథకం అమలు తీరు పరిశీలించారు. నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయిగిరి ఉన్నత పాఠశాల, మహేంద్రగడ, కెరండీ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై తనిఖీ చేశారు. జిల్లాలోని ఉన్నత విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5టీ పథకం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ అంపోలు రవిబాబు తదితరులు ఉన్నారు. -
దసరా ఉత్సవాలకు సన్నాహాలు
జయపురం: పట్టణంలో చారిత్రాత్మక దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దసరా ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాగంగా ఆదివారం శుభరాట వేసేందుకు నిర్ణయించారు. అనంతరం ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలను చేపట్టనున్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమికస్థాయి నుంచే హిందీబోదన జరగాలి..
ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ నుంచే హిందీ బోధన సాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో అలా జరగడంలేదు. కనీసం 2, 3వ తరగతుల నుంచైనా హిందీ బోధన మొదలుకావాలి. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, హిందీ భాషాపండితులను నియమించాలి. డీఎస్సీ ద్వారా హిందీ పండిట్పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేయాలి. – కోనే శ్రీధర్, ఉత్తరాంద్ర సమన్వయకర్త, హిందీ మంచ్ హిందీ భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాలి. జాతీయ భాషగా హిందీకి తగిన గుర్తింపు ఇప్పటికీ లభించలేదనే చెప్పాలి. హిందీ భాషాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు పండిట్ ట్రైనింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. – కనుగుల సత్యం, జిల్లా అధ్యక్షుడు, హిందీ మంచ్ హిందీ మన దేశ జాతీయ భాష. జాతీయ సమైక్యతను ఇనుమడింపజేసే భాష హిందీయే. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో హిందీకి 17 సెక్షన్ల తర్వాతే రెండో పోస్టును భర్తీ చేస్తుండటం తగదు. ఇది తీరని అన్యాయం. హిందీ లెక్చరర్లను నియమించాలి. పదోన్నతులతో భర్తీచేయాలి. – ఇమ్మిడిశెట్టి సంతోష్కుమార్, హిందీ ఫోరం జిల్లా కన్వీనర్● -
పూర్తి అవగాహనతో వైద్యం అందించాలి
అరసవల్లి:గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా పూర్తి అవగాహనతోనే వైద్యం అందించాలని గ్లోబల్ న్యూరో కేర్ అధినేత డాక్టర్ దేవరెడ్డి గౌతమ్ సూచించారు. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా శనివారం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో గ్లోబల్ న్యూరోకేర్ ఆసుపత్రిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో మితిమీరిన వైద్యం, మందుల వినియోగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శిష్టు అనిల్, బండి గౌతమ్, గీతాప్రియదర్శిని, మార్కెటింగ్ హెడ్ సీహెచ్ స్వామి, రెడ్క్రాస్ మేనేజర్ రమణ పాల్గొన్నారు. నేడు ఎన్జివో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు జిల్లా కార్యవర్గం ఆదివారం ఆత్మీయ సత్కారం చేయనుందని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంత్ సాయిరాం, చల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా జెడ్పీ గేట్ నుంచి సమావేశ మందిరం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఉద్యోగవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. గంజాయితో ముగ్గురి అరెస్టు ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో 5 కేజీల గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం వద్ద శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకి చెందిన ముత్తుకుమార్, ఉదయ్కుమార్, ముత్తురామలింగంలు 5 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరుకు చెందిన గంజాయి వ్యాపారి పాండ్యరాజు సూచన మేరకు ఒడిశా రాష్ట్రం మోహన బ్లాక్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకొన్నారు. అనంతరం రైలులో తమిళనాడు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్ట్చేసి రిమాండ్కి తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో గంజాయిని విక్రయించిన కుమార్, గంజాయిని తీసుకురావాలని సూచించిన పాండ్యరాజ్పైనా కేసులు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి రణస్థలం: లావేరు మండలం బొంతుపేట శ్మశానవాటిక వెనుక ఉన్న పొలంలో సుమారు 65 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతదేహం పక్కనే చేతి కర్ర ఉందని, వివరాలు తెలిసిన వారు 63099 90851 నంబరుకు తెలియజేయాలని లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు కోరారు. మద్యానికి బదులు గడ్డి మందు తాగి.. బూర్జ: మద్యం మత్తులో గడ్డి మందు తాగిన బూర్జ మండలం తోటవాడ పంచాయతీ టి.ఆర్.రాజుపేటకు చెందిన కొంగరాపు ప్రభాకరరావు (45) శనివారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకరరావు మద్యానికి బానిసయ్యాడు. గురువారం వేకువజామున బాటిల్ తేడా గమనించక గడ్డి మందు తాగాడు. శుక్రవారం ఉదయం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు గమనించి 108 అంబులెన్సులో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే ప్రభాకరరావుకు భార్య కేసరమ్మ, కూమారుడు దుర్గాప్రసాద్, వివాహమైన కుమార్తె ఉన్నారు. కేసరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ సేవలు ప్రారంభం
భువనేశ్వర్: అవిభజిత ఆగ్నేయ రైల్వే సిబ్బంది సహకార సంస్థ (అర్బన్ బ్యాంక్) ఆన్లైన్ సేవలను శనివారం ప్రారంభించారు. నాగపూర్లో శనివారం జరిగిన రైల్వే అర్బన్ బ్యాంకు 96వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ సదుపాయంతో ఖాతాదారులు ఉన్న చోట నుంచి హాలిడే హోం బుకింగ్, రుణ దరఖాస్తు దాఖలు, పొదుపు ఖాతా తాజా వివరాలు, కేవైసీ నమోదు తదితర అర్బన్ బ్యాంకు సంబంధిత సేవలను పొందగలుగుతారని ఖుర్దారోడ్ మండలం ప్రతినిధి లక్ష్మీధర మహంతి తెలిపారు. కార్యక్రమానికి నాగపూర్ మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) దీపక్ కుమార్ గుప్తా, తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు తదితరులు హాజరయ్యారు. -
పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు
కొరాపుట్: యువత పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు అధిరోహించవచ్చని గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పశ్చిమ ఒడిశా ప్రధాన కేంద్రం సంబల్పూర్ జిల్లా కేంద్రంలో శనివారం ఆయన పర్యటించారు. జిల్లాలో బుర్లాలోని వీరేంద్ర సాయి టెక్నికల్ యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, డీఎస్సీ, డిలీట్, పీహెచ్డీ ఇతర డిగ్రీలు అందజేశారు. అంతకుముందు పశ్చిమ ఒడిశా ఆరాధ్య దేవత మా సమలేశ్వరి శక్తి పీఠం సందర్శించారు. ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూరజ్ సూర్యవంశీ, సంపత్ చంద్ర స్వయ్, ఎమ్మెల్యేలు రబినాయక్, జయ నారాయణ మిశ్ర తదితరులు ఉన్నారు. -
దండు మారెమ్మ గుడిలో దసరా ఉత్సవాలు
పర్లాకిమిడి: పట్టణంలో డోలా ట్యాంకు రోడ్డు దండుమాలవీధిలో ఉన్న దండు మారెమ్మ అమ్మవారి తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే అదీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పదిహేనురోజుల ముందు తెరుచుకునే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం వెనుక పెద్ద పాముపుట్ట ఉంటుంది. దసరా శరన్నవరాత్రులు ముగిసిన పిమ్మట విజయదశమి నిశిరాత్రి అమ్మవారికి కొబ్బరికాయ, పండ్లు నైవేద్యం పెట్టి అఖండ దీపం వెలిగించి తలుపులు మూసి వేస్తారు. తిరిగి తర్వాతి సంవత్సరం విజయదశమి ముందు గుడి తలుపులు తెరుస్తారు. అమ్మవారి వద్ద ఉన్న దీపం వెలుగుతూనే వుండటం విశేషం. అలాగే అమ్మవారి దగ్గర ఉంచి కొబ్బరి కాయ హోమంలో కాల్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు. శరన్నవరాత్రుల కోసం దండు మారెమ్మ మందిరానికి రంగులు వేసి చుట్టు పక్కలా అమ్మవారు, విఘ్నేశ్వరుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్న ప్రసాదాలకు ప్రత్యేక షెడ్డును నిర్మించారు. చత్తీస్గఢ్ రాష్ట్రం బిళాయి, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి దండు మారెమ్మ ఉత్సవాలు చూడటానికి వస్తుంటారు. అనేక మంది భక్తులు ఇటీవల ఈ మందిరానికి ఇతోధికంగా విరాళాలు ఇవ్వడంతో దండుమారెమ్మ ముఖద్వారం నిర్మించారు. ఈ ఏడాది ఎప్పటిలాగే దండుమారెమ్మ ఉత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. -
బస్సు ఓనర్ల సంఘ వార్షిక సమావేశం
పర్లాకిమిడి: గజపతి ప్రైవేటు బస్సు ఓనర్లు సంఘం వార్షిక సాధారణ సమావేశం స్థానిక పీడబ్ల్యూడీ.బంగ్లాలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం కార్యదర్శి ఇంజా వెంకట రమణ అధ్యక్షత వహించగా అధ్యక్షులు ఛిత్రి సింహాద్రి గత సమావేశం వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా బస్సు ఓనర్లు ఆర్టీవో అధికారుల వల్ల ఎదుర్కుంటున్న సమస్యలను పలువురు ఓనర్లు కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు వివరించారు. అలాగే ప్రస్తుత సంఘం కార్యవర్గం వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కొనసాగించేలా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు డి.గజపతిరాజు, కిల్లారి యుగంధర్, కోశాధికారి గణేష్ సాహుకార్, పి.రాంబాబు, శ్రీను సాహుకార్, కిల్లారి గోపి, ఇంజా రవి పాల్గొన్నారు. -
ఎరువుల సంక్షోభంపై 17న బీజేడీ ధర్నా
భువనేశ్వర్: రాష్ట్రంలో ఎరువుల కొరతపై తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్తో విపక్ష బిజూ జనతా దళ్ ఈ నెల 17న రాజ్ భవన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనుంది. స్థానిక శంఖ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేడీ ఉపాధ్యక్షుడు సంజయ్ దాస్ బర్మా చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ మాట్లాడారు. ఎరువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చేస్తున్న వాదనను తోసిపుచ్చారు. సరఫరాల శాఖ నుంచి అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తమ వాదనను తెరపైకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉందన్నారు. అవసరాలు, సరఫరా మధ్య భారీ అంతరాలు అధికారిక సమాచారంలో వెల్లడైనట్లు వివరించారు. గంజాం జిల్లాలో 19,561 మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం రైతులు ఆరాటపడుతుండగా మొక్కుబడిగా 10,640 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశారు. భద్రక్ జిల్లాలో రైతాంగం ఎరువుల కొరతతో అల్లాడుతున్నారు. సాగు పనుల కోసం 6,188 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా కోసం అభ్యర్థించగా 863 మెట్రిక్ టన్నులు సరఫరా చేసి అసంతృప్తకి గురి చేసినట్లు బీజేడీ ఆరోపించింది. బాలాసోర్ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2,600 మెట్రిక్ టన్నుల ఎరువులు ఆశిస్తున్న రైతులకు నామ మాత్రంగా 900 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. అంగుల్ జిల్లా రైతాంగం రైతాంగం 8,100 మెట్రిక్ టన్నులు కోరగా 4,954 మెట్రిక్ టన్నులు అందజేశారు. ఈ తరహా కొరతను నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తున్నారని బిజూ జనతా దళ్ నాయకులు వెల్లడించారు. అయితే ప్రభుత్వం ‘సంక్షోభం లేదు’ అని చాటుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. 36 నెలల్లోపు తాల్చేర్ ఎరువుల కర్మాగారం పనిచేయిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకుండా కాలక్షేప ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా మండలం స్థాయి ఆందోళనలు చేపడతామని విపక్ష బిజూ జనతా దళ్ హెచ్చరించింది. -
బీజేడీ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా కామాఖ్యనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ మల్లిక్ను బిజూ జనతా దళ్ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. ఢెంకనాల్ జిల్లా కామాఖ్యనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ మల్లిక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు బిజూ జనతా దళ్ నుంచి తక్షణమే సస్పెండ్ చేశామని బిజూ జనతా దళ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయ ఉపాధ్యక్షుడు ప్రతాప్ జెనా శుక్ర వారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ జెనా మాట్లాడుతూ ప్రఫుల్ల కుమార్ మల్లిక్ను ఈ శతాబ్దంలో అత్యంత అవకాశవాద నాయకుడు అని తీవ్రంగా విమర్శించారు. ప్రఫుల్ల కుమార్ మల్లిక్ బిజూ జనతా దళ్ టికెట్పై 4 సార్లు ఎన్నికయ్యారు. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్వయంగా ఆయన తరఫున ప్రచారం చేశారని జెనా అన్నారు. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కిందని, పనులు, గనులు వంటి కీలక శాఖలు అప్పగించారని అన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత, తన రాజకీయ జీవితాన్ని పోషించిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడని, ఇది అతని అవకాశవాదాన్ని స్పష్టంగా బయటపెడుతుందని ప్రతాప్ జెనా వ్యాఖ్యానించారు. -
పేదలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధులకు నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె తదితర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతీ నెల నిరుపేదలకు తమ సంస్థ ద్వారా నిత్యావసరాలను పంపణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. అదేవిధంగా అనాథ ఆదివాసీ విద్యార్థులకు ట్రస్టు ద్వారా ఉచితంగా చదివించడంతో పాటు ఆశ్రమంలో భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. పిడుగు పడి వ్యక్తి మృతి మల్కన్గిరి: మల్కన్గిరి సమితి చాలాన్గూడ పంచాయతీ తాళపోదర్ గ్రామంలో శుక్రవారం పిడుగు పడి గ్రామానికి చెందిన ఉంగ కార్తమి(46) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తాళపోదర్ గ్రామానికి చెందిన ఉంగ కార్తమి తన భార్య, కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం తమ పొలంలో కలుపు మొక్కలు తీయడం కోసం వెళ్లారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో గాలివాన వచ్చింది. ఆ సమయంలో పిడుగు పడడంతో ఉంగ కార్తమి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలియడంతో మల్కన్గిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టీకా వేయడంతో చిన్నారి మృతి..? మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి తుమ్కిమాడకా గ్రామంలో శుక్రవారం టీకా వేసిన కొన్ని గంటల్లో 4 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. దేవ మడ్కమి నాలుగు నెలల కుమార్తెకు గత రెండు రోజులుగా జ్వరం ఉంది. అయితే ఈ విషయం ఆరోగ్య సిబ్బందికి చెప్పినా సరే ఏమీ కాదని అంటూ చిన్నారికి టీకా వేశారు. అయితే టీకా వలనే తన బిడ్డ మృతి చెందిందని తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దినబంధు మహానంద ఖండించారు. టీకా వలన ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. జ్వరం ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ముందునుంచి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోక్సో కేసులో ఆర్ఐకు 20 ఏళ్ల జైలు పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరిలో 2020 జనవరి 25న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శతృశల్యకు శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసును 2020లో అప్పటి ఆర్.ఉదయగిరి పోలీసు ఇన్స్పెక్టర్ మమతా నాయక్ పోక్సో చట్టం కింద రిజిస్టర్ చేశారు. ఈ కేసును పర్లాకిమిడి ఏడీజే కోర్టులో స్పెషల్ పీపీ ఆర్.జనార్ధనరావు ప్రాసిక్యూట్ చేశారు. అలాగే శిక్షపడిన ఆర్ఐ జిల్లా న్యాయసేవా ప్రాధికరణకు నష్టపరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించాలని కూడా జడ్జి తీర్పు నిచ్చారు. పిడుగుపాటుతో ముగ్గురు మృతి రాయగడ: పిడుగు పాటుతో ముగ్గురు మృతి చెందగా మరొకరు గాయాలకు గురైన సంఘటన శుక్రవారం సాయంత్రం బిష్ణుగుడ గ్రామంలో చోటు చేసుకుంది. ముగ్గురు పనిచేసుకుంటూ ఉండగా పిడుగు పడంది. బిష్ణుగుడ గ్రామానికి చెందిన సంబారి పిడిక (32) మృతి చెందిన వారిలో ఉండగా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మరొకరు గాయాలతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి..
జయపురం: ఆ వృద్ధుడి వయసు 80 ఏళ్లు. 72 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూలి పనుల కోసం వలస వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడా ఆచూకీ కూడా లేకపోవడంతో ఆయన చనిపోయాడనే కుటుంబ సభ్యులంతా భావించారు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత అతడు గురువారం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేశారు. రాజస్థాన్కు చెందిన రెండు స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆ వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు. జయపురం సబ్డివిజన్ కుంధ్రా సమితి కెరమిటి గ్రామ పంచాయితీ కెంధుగుడ గ్రామం అగాదు శాంత(80) ఎనిమిదేళ్ల కిందట ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు. తమ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారందరినీ ఆరా తీశారు. కానీ అగాదు జాడ తెలియరాలేదు. అయితే ఆగస్టు 12వ తేదీన రాజస్థాన్కు చెందిన ఇద్దరు స్వచ్ఛంద సేవకుల నుంచి అశ్వినీ కుమార్ సింగ్, ఆటోడ్రైవర్ బాసు భాయ్లకు ఫోను వచ్చింది. ఒక నిస్సహాయ వృద్ధుడు అగాదు శాంత రాజస్థాన్ రాష్ట్ర జయపూర్ జిల్లా చిత్రకూట్ పోలీసు స్టేషన్ పరిధి పురాణిచుంగ్లో ఉన్నాడని చెప్పారు. వారు అక్కడకు చేరుకుని అగాదుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయపురం సబ్డివిజన్ కుంధ్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆగస్టు 20న రాజస్థాన్లో పురాణచుంగికి వెళ్లారు. అయితే వీరు వెళ్లేటప్పటికి అగాదు వేరే చోటకు వెళ్లిపోయారు. అక్కడ కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నిరాశ చెంది వచ్చేశారు. ఈ విషయం కుంధ్ర గ్రామంలో బీజేపీ నేత సుమిత్ సాహుకు తెలుపగా అతడు ఈ నెల 6వ తేదీన అగాదు కుటుంబ సభ్యులను పట్టుకుని రాజస్థాన్లోని పురాణచుంగి గ్రామానికి వెళ్లారు. అక్కడ స్వచ్ఛంద కార్యకర్తలు అశ్వినీ కుమార్ సింగ్, డ్రైవర్ బాసు భాయిలను కలిశారు. అగాది శాంత ఆచూకీ కనుగొని గురువారం గ్రామానికి తీసుకువచ్చారు. అగాదు శాంతను తమ ఇంటికి చేర్చేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన కొట్పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, బీజేపీ నేత ప్రకాశ్ పట్నాయిక్, తుషార్ భట్, బేణూధర పాత్రో, టిలోచన గౌఢ్ లు కెందుగుడ వెళ్లి అగాది శాంతను పరామర్శించారు. -
నిరసన గళం
బాకై ్సట్ తవ్వకాలపై..● తవ్వకాలు ఆపాలని ప్రజల డిమాండ్ ● లక్ష్మీపూర్లో భారీ ర్యాలీ రాయగడ: కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్లో వేదాంత కంపెనీ ద్వారా జరుగుతున్న కొడింగమాలి బాకై ్సట్ తవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం నాడు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా లక్ష్మీపూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయగడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పండ నేతృత్వంతో జరిగిన ఈ ర్యాలీలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత, రాయగడ శాసనసభ మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి, కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు జిన్ను హికక, కొడింగమాలి సురక్షా సమితి సభ్యులు, బాధిత గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదాంత కంపెనీ కొనసాగిస్తున్న బాకై ్సట్ తవ్వకాలను నిలిపివేయాలని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీపూర్లో గల ఒడిశా మైనింగ్ కార్యాలయం(ఔంసి) ఎదుట నిరసన తెలియజేశారు. కర్మాగారం ఏర్పాటైతేనే.. వేదాంత కంపెనీ గత కొద్ది ఏళ్లుగా కొడింగిమాలిలో గల బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుని వెళ్లిపోతోందని, అయితే కర్మాగారం ఏర్పాటైన తర్వాత తవ్వకాలను కొనసాగిస్తే బాగుండేదని కానీ ఎలాంటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయకుండా బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుంటూ పోతే పర్యావరణం కలుషితం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు దూరమవుతాయని రాయగడ మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి అన్నారు. ఇప్పటికే 3 మిలియన్ల మెట్రిక్ టన్నుల బాకై ్సట్ను తవ్వేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారని, మరో 6 మిలియన్ల టన్నుల బాకై ్సట్ను తవ్వుకునేందుకు ప్రభుత్వంతో ఒప్పందానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. కర్మాగారం ఏర్పాటైతేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, కానీ కర్మాగారం ఏర్పాటు కాకుండా ఇలా బాకై ్సట్ నిక్షేపాలను తవ్వుకుపోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కొడింగిమాలి బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకుని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలే తప్ప వేదాంత కంపెనీతో లాలూచీ పడి ఒప్పందం కుదుర్చుకుంటే తామంతా కలసి తవ్వకాలను అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పండ అన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల కోసం ప్రభుత్వం కృషి చేయాలే తప్ప జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను ధారాదత్తం చేస్తే సహించబోమని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ, హరిజన ప్రజలతో గల కొరాపుట్, రాయగడ జిల్లాల్లో పరిశ్రమ ఏర్పాటుతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్షుడు, కొరాపుట్ లొక్సభ మాజీ సభ్యులు జిన్ను హికక అన్నారు. పరిశ్రమల ఏర్పాటును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, ఖనిజ సంపదలను ఇలా దుర్వినియోగం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మిగిలేది మట్టి మాత్రమేనని అన్నారు. కొడింగిమాలిలో సుమారు 428 హెక్టార్ల విస్తీర్ణంలో బాకై ్సట్ తవ్వకాలకు ప్రభుత్వం యోచిస్తోందని, అందులో భాగంగా రాయగడ జిల్లా పరిధిలో గల కాశీపూర్ ప్రాంతంలో 21 శాతం మిగతా కొరాపుట్ జిల్లాలొని లక్ష్మీపూర్ ప్రాంతంలో బాకై ్సట్ తవ్వకాలకు వేదాంత కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోందని ఓఎంసీ డిప్యూటీ జనరల్ మేనేజరు హేమంత కుమార్ బెహరా తెలియజేశారు. -
మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులేవీ?
● సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఇచ్ఛాపురం రూరల్: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు జిల్లాకు మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందజేశామని చెబుతున్నారని, అవి ఎప్పుడు వచ్చాయి.. ఎంత మంది రైతులకు అందజేశారో తెలియజేయాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన ఎంపీడీఓ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారి పి.పి.వి.వి.అజేయ్కుమార్ వ్యవసాయ సమీక్షలో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు దక్కత ఏకాంబరి కలగజేసుకొని కేంద్ర మంత్రి జిల్లాకు 3వేల టన్నుల ఎరువులు అందజేశారని, ప్రతిపక్షం కావాలనే ఆరోపణలు చేస్తోందన్నారు. మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సర్పంచ్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువులకు కొరత ఉండేది కాదని, కూటమి ప్రభుత్వంలో మాత్రం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ఒడిశాలో వెయ్యికి చొప్పున బస్తా యూరియాను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్కు సంబంధించి ఇప్పటి వరకు ఈ–క్రాప్ చేయలేదని, పంటలు నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. జెడ్పీ చైర్పర్సన్ విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు ఎరువులు అందించామని, కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఆ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో బాహుదానదిపై సుమారు రూ.20 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అంచనా విలువలు, ఆమోదం పూర్తయితే కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తులు ఆంధ్రాలో ప్రయోజనం పొందుతున్నారని, అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదని, పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే సరుకులను అంగంట్లో అమ్మేస్తున్నారని సభ్యులు దక్కత ఏకాంబరి, దున్న గురుమూర్తిలు ఆరోపించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.రామారావు, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
సోదరభావంతో మెలగాలి
జయపురం: సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం, మత మౌఢ్యం మొదలగు రుగ్మతలకు సరైన చికిత్స చెప్పగలిగేది సార్వత్రిక సోదరత్వమే నని స్వామీ వివేకానంద 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో చేసిన ప్రసంగంలో ఉద్బోధించారని ప్రముఖ విద్యావేత్త , ప్రసిద్ధ రచయిత నళిణీ రంజన్ రథ్ అన్నారు. యూనివర్షల్ బ్రదర్హుడ్ డే(సార్వత్రిక సోదర దినోత్సవం) సందర్భంగా గురువారం రాత్రి స్థానిక నెహ్రూనగర్లోని అగ్రసేన్ భవనంలో వివేకానంద కేంద్రం, కన్యాకుమారి వారి , జయపురం శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మానవులు వ్యత్యాసాలను విడిచి సోదరులుగా ఏకమై నడచినప్పుడు సమాజం ప్రగతి పథం పయనిస్తోందన్నారు. సోదరభావమే సమసమాజ నిర్మాణానికి,శాంతి స్థాపనకు, ప్రగతికి పునాది అన్నారు. కార్యక్రమంలో వివేకానంద కేంద్ర జయపురం శాఖ కోఆర్డినేటర్ ప్రమోద్ కుమార్ రౌళో, కేంద్ర సభ్యురాలు బణిత పండ, ఆల్ ఇండియ రేడియో జయపురం విశ్రాంత అధికారి నరేంద్రనాథ్ పట్నాయక్, స్వామి వివేకానంద కేంద్ర కమిటీ సభ్యురాలు విజయలక్ష్మీ రాయ్, నయన బిశాయి, జున్ను పండ, రేణుకదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ప్రమోద్ కుమార్ రౌళో బహుమతులు అందజేశారు. -
పక్షుల విడిదిలో.. సమస్యల కొలువు
తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రంలో చెట్లపై ఉన్న పక్షులు (ఫైల్) టెక్కలి రూరల్ : ప్రముఖ పర్యాటక స్థలం, విదేశీ పక్షుల విడిది తేలినీలాపురంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఏటా శీతాకాలం ఆరంభంలో సైబీరియా దేశం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే వలస పక్షులు టెక్కలి మండలం తేలినీలాపురంలోని విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి తమ పిల్లలతో కలిసి వెల్లిపోతాయి. ఈ ఈ పర్యాటక కేంద్రం వద్ద చింతచెట్లపై చేసే విన్యాసాలు, కేరింతలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కేంద్రంలో ఇటు పక్షులకు అటు పర్యాటకులకు అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధాన ఇబ్బందులివే.. ఏటా ఇక్కడి పక్షులను చూసేందుకు వచ్చే వారికి అనేక సమస్యలు స్వాగతిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. అరకొరగా ఉన్న మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోవడంతో నిరుపయోగంగా మారాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన క్రీడా సామగ్ర సైతం పాడైపోయాయి. పక్షులను చూసేందుకు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నిర్మాణం జరిగి దశాబ్దాలు పూర్తికావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కింద పడిన పక్షులకు సైతం సరైన సంరక్షణ ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రాన్ని సందర్శించి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృధ్ది చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారని, ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తేలినీలాపురంలో కనీస సౌకర్యాలు కరువు శిథిలావస్థకు వాచ్టవర్ మౌలిక వసతులు లేక పర్యాటకుల అవస్థలు -
జాతీయస్థాయి షూటింగ్లో గోల్డుమెడల్
● సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధినీ అసమాన ప్రతిభ పర్లాకిమిడి: అఖిల భారత థాల్ సైనిక్ క్యాంపు 2025 పోటీలలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో తోమ్మిదవ తరగతి చదువుతున్న మౌసమీ సిమలాయి (14)కు జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్లో గోల్డు మెడల్ సాధించి గజపతి జిల్లాకు ఖ్యాతి తెచ్చింది. మౌసమీ సిమలాయి గజపతి ష్టేడియం వద్ద చేపలు అమ్ముకునే మోనికా, బలాఐ చంద్ కూతురు. స్థానిక 14 వార్డు సంజయ్ గాంధీ కాలనీలో వుంటున్న ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడినా కూతురు మౌసమీని సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. ఎన్.సి.సి.క్యాడెట్ల రైఫిల్ షూటింగ్ న్యూ ఢిల్లీ థాల్ సైనిక్ క్యాంపు సెప్టెంబరు 2 నుండి 11 వరకూ జరిగాయి. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 17 ఎన్.సి.సి.డైరక్టరీస్లలో, 1546 మంది క్యాడెట్లు న్యూఢిల్లీ థాల్ సైనిక్ క్యాంపులో పాల్గోన్నారు. వారిలో 1200 మంది గర్ల్స్ జూనియర్ వింగ్ రైఫిల్ షూటింగులో మౌసమీ సిమలాయి సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ద్వారా పోటీలలో పాల్గోని అసమాన ప్రతిభ చూపి గోల్డు మెడల్ సాధించింది. ఆమె విజయం పట్ల సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి, వర్శిటీ రిజిష్ట్రారు డా.అనితాపాత్ర్, డైరక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, ప్రాంతీయ సంచాలకులు సంబిత్ పాత్రోలు అభినందనలు తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్ పరిధి డొంబొసర గ్రామంలో ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన రంజిత త్రిపాఠి (32)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్కు తరలించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గుణుపూర్ ఆదర్శ పోలీస్స్టేషన్ ఐఐసీ కేకేబికే కుహరో తెలియజేసిన వివరాల ప్రకారం.. డొంబొసొర గ్రామానికి చెందిన నరసింహ త్రిపాఠితో 2007వ సంవత్సరంలో రంజితకు వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి రంజితకు అత్తవారింట్లో వేధింపులు కొనసాగుతుండేవని ఆరోపిస్తున్నారు. -
నిన్న టాపర్.. నేడు లంచగొండి
భువనేశ్వర్: ఒడిశా సివిల్స్ పోటీ పరీక్షల్లో టాపర్గా నిలిచిన నిన్నటి యువ అధికారి నేడు లంచగొండిగా రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. సంబల్పూర్ జిల్లా బమ్రా తహసీల్దార్ అశ్విని కుమార్ పండా రూ.15,000 లంచం తీసుకుంటుండగా అరెస్టు శుక్రవారం చేశారు. మ్యుటేషన్ కేసులో వ్యవసాయ భూమిని ఇంటి స్థలంగా మార్చడానికి అతడు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం వ్యూహాత్మకంగా తన కార్యాలయ డ్రైవర్ పి.ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.15,000 లంచం తీసుకుంటుండగా అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా డ్రైవరు ప్రవీణ్ కుమార్ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం కింద గుంజిన సొమ్ముని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆనాడు 29 ఏళ్ల యువకుడి విజయగాథ లక్షలాది మంది ఆశావహ యువతకు ప్రేరణగా నిలిచింది. నేడు లంచం వ్యవహారం తాజా చర్చలకు దారితీసింది. ధర్మశాల మండలం ఖేత్రపాల్ గ్రామానికి చెందిన అశ్విని కుమార్ పండా ఒడిశా సివిల్ సర్వీసెస్లో ఎలాంటి శిక్షణ లేకుండానే 2019 ఒడిశా సివిల్స్ పరీక్షల్లో తన మొదటి ప్రయత్నంలోనే తహసీల్దార్గా ఎంపికై అగ్రస్థానంలో ఉత్తీర్ణత సాధించాడు. -
పాఠశాల తరలింపుపై నిరసన
బూర్జ: అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని, వేరే పాఠశాలలో విలీనం చేయవద్దని కోరుతూ సర్పంచ్ జడ్డు మహేష్, విద్యార్థుల, తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇంత వరకు ఆన్లైన్లో హాజరు నమోదు చేయకపోవడం తగదన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం సమగ్ర శిక్ష ఏఎంఓ చిగురుపల్లి సుధాకరరావు, సీఎంఓ బొడ్డేపల్లి శ్రీధర్, ఐఈసీఓ గోవిందరావు వద్ద సమస్య వివరించారు. ఇక్కడి 3, 4, 5వ తరగతులను పాలవలస ప్రైమరీ మోడల్ స్కూల్కు, 6, 7, 8వ తరగతులను పాలవలస జెడ్పీ హైస్కూల్కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగావళి నది ఒడ్డున ఉన్న పాలవలస వెళ్లాలంటే సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని, అంతదూరం చిన్నారులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నిరసన కార్యక్రమంలో సర్పంచ్తో పాటు విద్యాకమిటీ చైర్మన్ మురపాక శంకరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీ్త్ర ఆరోగ్యంపై అవగాహన, చికిత్స, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎన్.సి.డి స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి, పిల్లల రక్షణ కార్డ్, ఇమ్యునైజేషన్, రక్తహీనత స్క్రీనింగ్, రుతు పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. -
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: భారత ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఢిల్లీలో పలు ప్రభుత్వ, సంస్థాగత కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు భారత దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పవిత్ర పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు అంకిత భావంతో పూర్తి పదవీకాలం సద్వినియోగం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జేపీ నడ్డాతో చర్చ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ చీఫ్ – కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె. పి. నడ్డాను కలిశారు. రాష్ట్రంలో మంత్రి మండలి విస్తరణ ఉత్కంఠ నెలకొని ఉన్న సమయంలో జాతీయ శాఖ అధ్యక్షునితో భేటీ చర్చనీయాంశమైంది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఈ భేటీ బలమైన సంకేతంగా పరిగణిస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్ర నిర్వహణ కార్పొరేషన్లకు అధిపతుల జాబితాను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కీలక నిర్ణయాలను రూపొందించడంలో పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చలు కీలకమైనవిగా భావిస్తున్నారు. చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి ఒడిశా ప్రభుత్వం యొక్క ప్రజా కేంద్రీకత చొరవలు, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో మౌలిక ఆరోగ్య సదుపాయాల అభివద్ధి మరియు రాష్ట్ర ఆరోగ్య రంగం భావి రూపకల్పనపై వివరణాత్మక చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం
భువనేశ్వర్: పూరీ జిల్లా జట్నీ–పిప్పిలి మార్గం డెలాంగ్ చౌరస్తా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. దంపతులు ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్త పరిస్థితి విషమంగా కొనసాగుతుంది. మృత మహిళ డెలాంగ్ ప్రాంతం రత్తొపొడా గ్రామానికి చెందిన మమతా పరిడాగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త దిలీప్ పరిడా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. భూఆక్రమణ అడ్డగింత సరుబుజ్జిలి: చిగురువలస పంచాయతీ శ్రీరాంవలస రెవెన్యూ గ్రామంలో 9–1, 9–3 సర్వే నంబర్లలో ఎకరా 60 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ గ్రామకంఠం భూమిని కొందరు స్థానికులు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తికి అనధికార విక్రయం చేసినట్లు సమాచారం. దీంతో కొనుగోలుదారుడు సదరు భూమిని చదును చేస్తుండగా చిగురువలస గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. స్థలం ప్రధాన గేటుకు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను ఇష్టార్యాజ్యంగా విక్రయాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు వెంటనే పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తహశీల్దార్ మధుసూదన్ వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి సుధాకరరావు అన్నారు. శుక్రవారం జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశ మందిరంలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంపై వలంటీర్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా వలంటీర్లు బోధన చేయాలన్నారు. వయోజన విద్యా జిల్లా ఉప సంచాలకుడు ఎ.సోమేశ్వరరావు మాట్లాడుతూ 11207 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి లక్షా 12 వేల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో ట్రైనర్లు కె.వెంకటరమణ, పి.వెంకటరమణ, డీఎల్డీఓ చంద్రకుమారి, వయోజన విద్యా ఏపీఓ బాలచంద్ర, పర్యవేక్షకులు ఎల్.రవణమ్మ పాల్గొన్నారు. ఎరువుల కోసం ఆందోళన చెందవద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు రెండవ సారి ఎరువులు ఇంకా అందలేదని, ఎరువులు ఎప్పుడు వస్తాయని పలువురు రైతులు కలెక్టర్ను అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంత వరకు యూరియా తీసుకోని రైతులకు సంబంధిత మండల వ్యవసాయ అధికారులు వెంటనే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేపటి నుంచి హిందీ పక్షోత్సవాలు శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ నెల 14న జాతీయ హిందీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో 15 రోజులపాటు హిందీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు హిందీ వికాస వేదిక అధ్యక్షుడు మందపల్లి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఖడంగా శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, కవుల వేషధారణలు, కవితాగానం, దేశభక్తి గేయాలు, చిత్రలేఖనం, ఉపాధ్యాయులకు ఉత్తరాలు, స్నేహితులకు లేఖలు, అందమైన చేతిరాత(సులేఖన్) పోటీలు, ఏకపాత్రాభినయం, నాటికలు, జాతీయ సమైఖ్యతాదాపకాల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని రామకృష్ణారావు, నిరంజన్ పేర్కొన్నారు. వివరాలకు 94416 49118 నంబర్ను సంప్రదించవచ్చన్నారు. 16న పీడీఎస్ బియ్యం వేలం కొత్తూరు: మండలంలో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ డీటీల తనిఖీల్లో పట్టుబడి సీజ్ చేసిన 390.50 కింటాళ్ల బియ్యాన్ని ఈ నెల 16న తహశీల్దార్ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు తహశీల్దర్ కె.బాలకృష్ణ శుక్రవారం తెలిపారు. సీజ్ చేసిన బియ్యం సరుబుజ్జిలి మండలం ఎంఎల్ఎస్ పాయింట్లో ఉందని, కిలో ధర 42.5గా నిర్ణయించామని చెప్పారు. ఎటువంటి డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
పూరీ జగన్నాథ ఆలయంపై డ్రోన్ చక్కర్లు
మహానదిలో చిక్కుకున్న ఏనుగుల గుంపు భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న పూరీ శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. వరుసగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం శ్రీమందిరం శిఖరంపై నిత్యం రెపరెపలాడే పతిత పావన పతాకంపై ఒక డ్రోన్ ఎగురుతున్న దశ్యం సందర్శకుల దృష్టికి వచ్చింది. శ్రీ మందిరం శిఖరం ఈ స్థలాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించినప్పటికీ తరచూ అక్కడ డ్రోన్ చక్కర్లు కొట్టడం అనేది పెద్ద ప్రశ్న. ప్రసిద్ధ ఆలయంపై తరచుగా డ్రోన్లు ఎగురవేయడం వల్ల ఆలయ భద్రతపై తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయి. -
చంద్రగిరిలో బీజేడీ సమావేశం
పర్లాకిమిడి: జిల్లాలో మోహన బ్లాక్ చంద్రగిరి టిబెటియన్ ఎంటీసీఎస్ బంగళాలో గురువారం బిజూ జనతా దళ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ అధ్యక్షత వహించగా, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అతిథిగా విచ్చేశారు. మోహన బ్లాక్లో విద్య, ఆరోగ్యం, ఎన్ఆర్జీఎస్, ఉపాధి పనుల అమలుపై ముఖ్యంగా చర్చించారు. గత ప్రభుత్వంలో ఉపాధి పనులు ఏడాదికి 300 రోజులు కల్పించగా, ప్రభుత్వం మారిన తర్వాత వంద రోజులుకు కుదించినట్టు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బిజేడీ పార్టీ అధ్యక్షులు ప్రదీప్ నాయక్ అన్నారు. సమావేశానికి బిజేడీ మాజీ అధ్యక్షులు జగబంధు దాస్, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
పర్లాకిమిడి: పర్లాకిమిడి జిల్లా అటవీశాఖ డివిజనల్ కార్యాలయం ఆవరణలో గురువారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు విచ్చేసి అటవీ అమరవీరుల స్థూపానికి జ్యోతిని వెలిగించి, పూలమాలలు వేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బందికి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఏసీఎఫ్ అరుణ్ కుమార్ సాహు, ఏసీఎఫ్ షైనీశ్రీ దాస్, దేవగిరి, మహేంద్రగిరి, చంద్రగిరి అటవీ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం వహించారు. తదనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ నాగరాజు మాట్లాడుతూ, కర్తవ్య నిర్వహణలో అటవీ సంపద, వన్యమృగాలను కాపాడతానని సిబ్బందితో ప్రమాణం చేయించారు. -
సైబర్ ఉచ్చులో మహిళ
● బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.92 లక్షలు మాయం రాయగడ: సైబర్ ఉచ్చులో ఒక మహిళ చిక్కుకొని తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.1.92 లక్షలను పోగొట్టుకున్న ఘటన జిల్లాలోని టికిరి పోలీస్స్టేషన్ పరిధి ఉపొరొకొటింగ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆమె తన భర్తతో కలిసి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజు సాహు అనే వ్యక్తి భార్య సునేమా సాహు సెల్ఫోన్కు ఈనెల 2వ తేదీన ఆర్టీవో.ఏపీకే ఫైల్ మెసేజ్ ద్వారా వచ్చింది. దీంతో ఆమె ఆ యాప్ను డౌన్లోడ్ చేసింది. వెంటనే కొంత సమయం తర్వాత ఎటువంటి ఓటీపీ లేకుండా యాప్ ద్వారా అకౌంట్ నుంచి ఏడు పర్యాయాలు రూ.1.92 లక్షలను సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి తన సొమ్ము కనిపించకపోవడంతో సంబధిత బ్యాంకు శాఖ అధికారులతో సంప్రదించింది. దీనిపై తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో పాటు కొరాపుట్లోని సైబర్ సెల్ను ఆశ్రయించాల్సిందిగా సూచించారు. కొరాపుట్లోని సైబర్ సెల్ను ఆశ్రయించి తమ గోడును వినిపించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో బాధితులు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. సచ్చిదానందకు బిషప్గా పదోన్నతి జయపురం: ఎలోహిమ్ క్రిస్టియన్ చర్చ్ జయపురం వారు గురువారం సచ్చిదానందకు పదోన్నతి కల్పిస్తూ బిషప్గా నియమించి పవిత్ర అభిషేకం నిర్వహించారు. ఎలోహిమ్ బెలియవర్స్ చర్చిలో ఆయన అందించిన సేవలపై గురుత్పూర్ణ సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా సచ్చిదానందను సత్కరించారు. సమావేశంలో బిషప్ డాక్టర్ రాజకిశోర్ దిగాల్, బిషప్ డాక్టర్ దిలీప్ కుమార్ బల్, బిషప్ ప్రతాప్ ప్రధాన్, బిషప్ అమసాన్ మల్లిక్, బిషన్ ప్రభాష్ చంధ్ర గోండ్, బిషప్ రాజేష్ పాత్ర, బిషప్ జయ మహంతి, బిషప్ కృష్ణదాన్ నాగ్, బిషప్ సందీప్ బిశ్వాసీ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల నిరసన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రైతుల వద్ద కోనుగోలు చేసిన వరి విత్తనాలకు ఇప్పటివరకూ ప్రభుత్వం ఇన్పుట్ బోనస్ డబ్బులు ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13న రైతులంతా కలిసి ఛలో భువనేశ్వర్ నినాదంతో రాజధానికి వెళ్లి ఎండీ ఒడిషా సీడ్ కార్పొరేషన్ను కలిసి తమ విన్నవించామని గజపతి జిల్లా కృషక్ సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ పట్నాయిక్ గురువారం జిల్లా వ్యవసాయ శాఖ విత్తన విక్రయ కేంద్రం వద్ద తెలియజేశారు. సుమారు జిల్లా 40మంది రైతులకు ఇన్పుడ్ బోనస్ అందలేదని తెలియజేశారు. -
భారత్ మాల ప్రారంభం
శుక్రవారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రానున్న మార్చికి.. కొరాపుట్: రానున్న 2026 మార్చి ఆఖరు లోపల భారత మాల రోడ్డుని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ప్రకటించారు. గురువారం సాయంత్రం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సద్భావన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడార్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కవల టన్నెల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ టన్నెల్స్ను తాను సందర్శించానని చెప్పారు. వీటి వల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతున్నారు. ఈ టన్నెల్స్ ఒక ఇంజినీరింగ్ అద్భుతమని, తాను కూడా ఇంజినీరింగ్ చదివానని గుర్తు చేశారు. ఈ భారత్ మాల వల్ల ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొరాపుట్ జిల్లాలో దేవమాలి పర్వతం ఒక అద్భుతమని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులు వస్తున్నందున అక్కడ ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో తాను చేసిన పర్యటన మరపురానిదని పేర్కొన్నారు. కొరాపుట్ జిల్లాలో రాజపుట్ వద్ద గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి లక్షపతి పథకానికి గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కొరాపుట్ జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని అభివృద్ధిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. కొరాపుట్ జిల్లాలో వైద్య సదుపాయాలు చాలా ఉన్నాయన్నారు. అవసరమైతే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల మద్దతు కూడా ఉంటుందన్నారు. అంతకుమించిన వైద్యసదుపాయాలు ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో నాల్కో, హాల్ వంటి పరిశ్రమలు ఉన్నాయని, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆదివాసీల హక్కుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. కొఠియాకు కూడా పరిష్కారం వస్తుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ అటవీ భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనన్న పీఎం మోదీ స్వప్నం సాకారమవుతుందన్నారు. మల్కన్గిరి జిల్లాలో సీతా కుండ్ పర్యటక ప్రాంతం అభివృద్ధికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి బ్యాంకుల పనితీరుపై సమీక్ష చేశానని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ముద్ర లోన్ విజయ వంతం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇరు జిల్లాలోనూ ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అంతకు ముందు మల్కన్గిరి, కొరాపుట్ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నాయకుడు రామ చంద్ర ఖడం కొరాపుట్ జిల్లా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ సత్యవాన్ మహాజన్ కొరాపుట్ సంప్రదాయ కళాఖండాలతో గవర్నర్ని సత్కరించారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న గవర్నర్ పర్యటన సంప్రదాయాలు పక్కన పెట్టి ఆయన ప్రతి ప్రజా విజ్ఞప్తిని స్వీకరించారు. మీడియా సమావేశం ప్రారంభ సమయంలో చినుకులు పడడంతో పాత్రికేయుల ఇబ్బంది పడడం చూసి వెంటనే సమావేశం నిలిపి వేయించారు. తనతో వారిని కాన్ఫరెన్స్ హాల్ లోనికి తీసుకొని వెళ్లి సమావేఽశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పవిత్ర శాంత, రుపుధర్ బోత్ర, రాంచంద్ర ఖడం, రఘురాం మచ్చో, డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, ఎస్పీ రోహిత్ వర్మ, జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు హరిశ్చంద్ర, భీమ భూమియ -
పాముకాటుతో ఇద్దరు మృతి
నరసన్నపేట: నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన తోలాపి రమణమ్మ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 5న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో రమణమ్మకు పాము కరిచింది. కొద్ది సమయం గమనించిన రమణమ్మ కుటుంబ సభ్యులకు చెప్పడంతో నరసన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రమణమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లుకలాపు రవి, నడగాం సర్పంచ్ జల్ల శిల్పా మాధురి సంతాపం వ్యక్తం చేశారు. బసవరాజుపేటలో.. హిరమండలం: ఎల్ఎన్పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు (38) గురువారం పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గ్రామ సమీపంలోని పొలంలో ఎరువులు వేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే హిరమండలం పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య కుమారి, కుమార్తెలు చేతన, చైతన్య ఉన్నారు. -
క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు
ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు లభించింది. ఐబీఎం క్వాంటమ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చి క్విస్కిట్ఫాల్ ఫెస్ట్–2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీని ఎంపిక చేసింది. ఈ మేరకు డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 వర్సిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయని చెప్పారు. యేల్ యూనివర్శిటీ, యూసీఎల్ఏ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్జీయూకేటీ ఐఐఐటీ శ్రీకాకుళం ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఫెస్ట్ నిర్వహణ బృందంగా కటం నిఖిల్తేజ, కాశిం, వాలి, దుదేకుల ప్రవీణ్కుమార్, చెరుకూరి జాన్బాబు, చదువుల గుణశ్రీ కిమ్మిడి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, అకడమిక్స్ డీన్ డాక్టర్ శివరామకృష్ణ, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, హెచ్ఓడీ రమేష్బాబు, పీఆర్వో షణ్ముఖరావు తదితరులు అభినందించారు. -
బకాయిల చెల్లింపుల్లో జాప్యం.. చేనేతకు శాపం
● ఆప్కో బకాయిలు రూ.1.23 కోట్లు పొందూరు : జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లించాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో చేనేత సొసైటీలతో పాటు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహకారం సంఘాల నిర్వహణ కష్టతరమవుతోంది. దీంతో సొసైటీలపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు సకాలంలో అందాల్సిన మజూరీ డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాలన్నీ వస్త్రాలను తయారు చేసి ఆప్కోకు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఆప్కో 14 సహకార సంఘాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆప్కో ఇచ్చిన ఆర్డర్ల మేరకు సాధారణ, ఇతర రకాల వస్త్రాలు తయారవుతున్నాయి. సహకార సంఘాలు ఇచ్చిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపట్టాల్సిన ఆప్కో జాప్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాభాల్లో ఉన్న సొసైటీలు సైతం బకాయి సొమ్ములు రాకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నాయి. బకాయిలు ఇలా.. ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో జిల్లాలోని సహకార సంఘాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాది నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం డివిజన్, విజయనగరం జిల్లాలోని రాజాం డివిజన్ పరిధిలో రూ.1.23 కోట్లు బకాయిలు అందాల్సి ఉంది. పొందూరు సాయిబాబా సొసైటీకి రూ.17 లక్షలు, అంపోలు అగస్తేశ్వర సహకార సంఘానికి రూ.18 లక్షలు, లావేరులో సహకార సంఘానికి రూ.19 లక్షలు, తోలాపిలో గౌరీశంకర చేనేత సహకార సంఘానికి రూ.లక్ష, అక్కుపేట సంఘానికి రూ. 2 లక్షలు, సోంపేట సంఘానికి రూ.లక్ష, పెనుబాక విశ్వేశ్వర చేనేత సహకార సంఘానికి రూ.18 లక్షలు, రాజాం శ్రీమల్లికార్జున వీవర్సు సొసైటీకి రూ.17 లక్షలు, సురవరం సంఘానికి రూ.79 వేలు, మామిడిపల్లి సంఘానికి రూ.76 వేలు, పాలకొండ సంఘానికి రూ.7 లక్షలు, బైరిసారంగిపురంలో సంఘానికి రూ.11 వేలు బకాయిలు అందాల్సి ఉంది. చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండు రోజుల్లో సొసైటీలకు సంబందించిన ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. – టి.జనార్ధన, ఆప్కో ఇన్చార్జి డీఎం, శ్రీకాకుళం -
ధర్మాన సావిత్రమ్మకు నివాళులు
శ్రీకాకుళం రూరల్/పోలాకి: ధర్మాన సోదరుల మాతృమూర్తి ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి కార్యక్రమం పెదపాడు పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. సావిత్రమ్మ చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం షణ్ముఖప్రియ, హరిప్రియ సిస్టర్స్ శాసీ్త్రయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాధరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్సార్ సీపీ యువనాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గుండ లక్ష్మీదేవి తదితరులు న్నారు. అంతకుముందు పోలాకి మండలం మబగాంలోని ధర్మాన సావిత్రమ్మ స్మృతివనంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కుమారులు కృష్ణదాస్, ప్రసాదరావు, రాందాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం అయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలసి అలయ ప్రాంగణం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. -
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : పెరిగిన ఎస్సీ జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాల, రెల్లి, అనుబంధ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నందున ప్రభుత్వాలు పునారాలోచన చేయాలని కోరారు. క్రిమిలేయర్ రద్దు చేయాలని, ప్రైవేటు రంగాల్లోనూ ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో పాదయాత్ర చేపట్టారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో చేపట్టిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకూ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు తొల్లిబిల్లి అశోక్బాబు, డాక్టర్ చెన్నకేశవులు తదితరులు అంబేడ్కర్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, జిల్లా దళిత సంఘాల జేఏసీ నేతలు కళ్లేపల్లి రామ్గోపాల్, బడియా కామరాజు, కంఠ వేణు, ముంజేటి కృష్ణ, యజ్జల గురుమూర్తి, పొన్నాడ రుషి, దళిత ఉద్యోగుల సంఘ నేతలు ఆర్.వేణుగోపాల్, బోనెల రమేష్ , చల్లా రామారావు, న్యాయవాదులు మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకి, నేతల అప్పారావు, సుంకు రమణ, పెయ్యల చంటి, అరుబారిక రాజు, లక్ష్మణ, రాము, సూర్యనారాయణ, బుడుమూరు రామారావు, పంకు మహేష్, పంకు మురళీ, అబ్బాస్, శంకర్ , భాస్కరరావు, లింగాల మల్లేశరి, శీర రాజేశ్వరి, హారతి పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
మందస: బుడార్సింగి పంచాయతీ కొరడాలు గ్రామానికి చెందిన సీర రమేష్(35) గురువారం తన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడు ఆత్మహత్య ఎచ్చెర్ల : ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సీపాన రామకృష్ణ (27) అలియాస్ రాకీ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ వరకు చదివిన రామకృష్ణ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సంస్థ వద్ద సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. తల్లి లక్ష్మీ వ్యవసాయ పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కుమారుడు ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. రామకృష్ణ తండ్రి జగన్నాథం పదిహేనేళ్ల క్రితం నుంచి ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. తల్లి అన్నీ తానై కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ లోక్ అదాలత్ రేపు శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 13న జరగనున్న అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కక్షిదారులు ఎలాంటి విభేదాలు లేకుండా సఖ్యతతో సమస్యలను ముగించుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందువల్ల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు కూడా ఉన్నారు. -
హత్య చేసి.. బంగారం తాకట్టుపెట్టి..
● వీడిన చంద్రయ్యపేట మహిళ మృతి కేసు మిస్టరీ ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆమదాలవలస : పట్టణంలోని చంద్రయ్యపేటలో ఆగస్టు 30న జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసులు చాకచక్యంగా విచారణ జరిపి హత్య కేసుగా నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పోలీస్స్టేషన్లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ (45)కు సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్తో పరిచయం ఉంది. నవీన్ తరచూ ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఆగస్టు 30న ఓ యువతిని తీసుకొని రమణమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమెను పంపించేసిన తర్వాత రమణమ్మను కూడా బలవంతం చేయగా అందుకు నిరాకరించింది. కోపోద్రుక్తుడైన నవీన్ రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న 98 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయాడు. కొంత బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకొని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్సాలు చేశాడు. మిగతా బంగారం, వెండిని తన ఇంట్లోనే దాచిపెట్టాడు. మరోవైపు, పోలీసులు రమణమ్మ మృతదేహానికి పోస్ట్మార్టం చేయగా ఊపిరి ఆడకపోవడంతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రమణమ్మ మొబైల్ కాల్ డేటా ఆధారంగా నవీన్ కోసం గాలించగా ఆ విషయం నిందితుడికి తెలిసి సరుబుజ్జిలి రెవెన్యూ అధికారి వద్ద లొంగిపోయాడు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న బంగారం, నిందితుడి ఇంటి వద్ద ఉన్న ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పర్లాకిమిడి నుంచి బస్సులో గంజాయితో వచ్చి కాశీబుగ్గ బస్టాండ్లో బుధవారం దిగారు. అక్కడి నుంచి పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి అనుమానంతో తనిఖీ చేశారు. అందులో 10.815 కిలోల గంజాయిని గుర్తించడంతో వెంటనే అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు గురువారం విలేకరులకు తెలియజేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అల్గాపూర్కు చెందిన రోహిత్, ఉన్నా జిల్లాకు చెందిన నూర్ దీన్ ఉన్నారు. వీరు ఒడిశారాష్ట్రం బడగర్త్ బిట్ కాలనీ చెందిన సుమన్ మానిక్ నుంచి గంజాయి తెచ్చారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
17న నిరుద్యోగుల ఆవేదన సదస్సు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల ఆవేదన సదస్సు’ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించి అన్ని ప్రాంతాలవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్, అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను అన్ని విభాగాల్లోనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్లను కొనసాగిస్తూ విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని, పేద నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, ప్రతినిధులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మధ, ప్రశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
నరసన్నపేట: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులు, డీఎస్సీ –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కో కన్వీనర్ అంబటి లక్ష్మణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పాత తాలూకా కేంద్రం నరసన్నపేటలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాడాన రాజు, టి.జనార్దనరావు, రమణ, చిరంజీవి, వాసు, ఉమాశంకర్, సురేష్కుమార్, రజిని, రమేష్, లక్ష్మి, శాంతి, కమలకుమారి, రోజామణి,రామారావు, తవుడు, వాసుదేవరావు, తాతన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై మార్కెట్ కమిటీ చైర్మన్ దాడి
జలుమూరు: శ్రీముఖలింగంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చింతం రాంబాబుపై జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, సోదరుడు కృష్ణ గురువారం దాడి చేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గతంలో రాంబాబు తన వీధిలో వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టగా బలరాం తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అది వివాదంగా మారింది. పాత కక్షల నేపథ్యంలో గురువారం శ్రీముఖలింగంలో వేరే గొడవ జరుగుతుండగా అదే చోటకు వచ్చి తనపై దాడి చేశారని, కర్రతో తలపై బలంగా కొట్టారని రాంబాబు ఆరోపించారు. దీనిపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బుడితి సీహెచ్సీలో చికిత్స తీసుకున్నానని పేర్కొన్నారు. జూలైలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బలరాంతోపాటు మరి కొందరు సామాజిక కార్యకర్త, అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్పై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్తో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇది విచారణలో ఉండగా మళ్లీ ఈ గొడవ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఫిర్యాదుపై జలుమూరు ఎస్.ఐ అశోక్బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వెళ్లిపోతే ఏంటి?
నెక్కంటి.. ● ఆయన రాజీనామాతో పార్టీకి ఒరిగిందేమీ లేదు ● పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డారు ● మాజీ మంత్రి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుతో పాటు అతని మద్దతుదారులు బీజేడీ పార్టీకి రాజీనామాలు చేసినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మాజీ మంత్రి, బిజూ జనతా దళ్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక స్పష్టం చేశారు. స్థానిక కై లాస్ హోటల్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 ఏళ్ల బీజేడీ హయాంలో నెక్కంటి ఎన్నో పదవులను అధిరోహించి ఉన్నత స్థాయికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నమ్మక ద్రోహం చేసింది నెక్కంటే గానీ బీజేడీలో ఉన్న అదృశ్య శక్తి ఏమాత్రం కాదన్నారు. ముసలి కన్నీరు కార్చి పార్టీపై నిందలు మోపినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరని చెప్పారు. ఆదివాసీ హరిజన జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడలో జిల్లా అధ్యక్ష పదవిని ఈసారి తనకు దక్కడం నెక్కంటి జీర్ణించుకోలేకపొతున్నారని అన్నారు. ఒక ఆదివాసీ నాయకుడికి పదవి వచ్చిందని సంతోషించాల్సింది పోయి పార్టీపై దుమ్మెత్తి పోయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయన పార్టీలో లేకపొవడం ఎంతొ శుభపరిణామమని అన్నారు. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతున్నానని చెప్పుకుంటున్న నెక్కంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. మరింత శక్తివంతంగా పార్టీ.. బీజేడీ త్వరలో మరింత శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించి తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేలా తాను శాయశక్తులా కృషి చేస్తానని సరక తెలిపారు. కలుషిత , కుతంత్ర రాజకీయాలకు తావులేకుండా నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలే పార్టీ విజయానికి సోపానాలుగా మారాయని, అంతేతప్ప నెక్కంటి వల్ల పార్టీకి గత ఐదేళ్లలో కీడే జరిగింది తప్పా ఏమాత్రం మంచి జరగలేదనడానికి గత సాధారణ ఎన్నికలే నిదర్శనమన్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో నెక్కంటి జిల్లాలోని మూడు శాసన సభ నియోజకవర్గాలతో పాటు కొరాపుట్ లోక్సభ స్థానాన్ని గెలిపించలేకపొయారని, అందుకు ఆయన స్వయంకృత అపరాధంతో పాటు కుటిల రాజకీయాలే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. 50 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీ పరంగా అనేక ప్రయోజనాలు పొంది లాభపడ్డారే తప్పా అతను నష్టపోయిందేమీ లేదని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలు తగవు.. స్వచ్ఛమైన రాజకీయాలతో మాత్రమే పార్టీ మనుగడ కొనసాగుతుంది తప్ప కుఠిల రాజకీయాలతో ఏమాత్రం ముందుకు సాగలేదని పార్టీ సీనియర్ నాయకుడు, బీజేడీ జిల్లా మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్ అన్నారు. పార్టీలో లాభపడిన భాస్కరరావు రాజీనామా డ్రామా చేయడం పార్టీకి వెన్నుపోటులాంటిదన్నారు. అతని రాజీనామతో కార్యకర్తల్లో కొత్త ఆనందం వెలుగు చూస్తోందన్నారు. పార్టీకి రాజీనామ చేసిన అతని బిజు స్వాభిమాన్ మంచ్ అనే సామాజిక వేదికగా కార్యకలాపాలు కొనసాగిస్తామని బహిరంగంగా ప్రకటించారని, నవీన్ తండ్రి బిజూ పేరును ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. బిజూ పేరుతొ మళ్లీ రాజకీయాల్లో చెలామణి అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతమవ్వదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రా పండా, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు పట్నాన గౌరీ శంకరరావు, గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగో, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎరువులు ఇవ్వండి మహాప్రభో!
భువనేశ్వర్: ఎరువుల కొరతతో రాష్ట్ర రైతాంగం తల్లడిల్లుతోంది. అందుబాటులో ఉన్న అరకొర ఎరువుల కోసం అన్నదాతలు బారులు తీరుతున్నారు. పశ్చిమ ఒడిశా బొలంగీర్ జిల్లా దేవగడ్ ప్రాంతంలో రైతులు బుధవారం యూరియా అందజేయాలని కోరుతూ జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డు పొడవునా ఆధార్ కార్డులు పేర్చి పంచాయతీ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వరుసలో గుమిగూడారు. బుధవారం ఉదయం బొలంగీర్ జిల్లా దేవగడ్ మండలం గౌడొగొఠొ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రుణం తీసుకున్న రైతులకు ముందుగా యూరియా ఎరువులు అందించాలని నిబంధన విధించినందున, రుణం తీసుకోని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, రైతుల అవసరానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో లేవని అనుబంధ అధికార వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ప్రసవ వేదన
రాయగడ : గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపొవడంతో అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో నిండు గర్భిణి ఆస్పత్రిని నడిపించుకుని తీసుకువెళుతుండగా మార్గమధ్యలోనే పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన కళ్యాణసింగుపూర్ సమితి చంచడా గ్రామంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. చంచడా గ్రామానికి చెందిన సునీల్ ప్రస్కా భార్య వనితా ప్రస్తా నిండు గర్భిణి. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఆశా కార్యకర్త అంబులెన్స్కు సమాచారం అందించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో కొద్ది దూరంలో అంబులెన్స్ నిలిచిపోయింది. కుటుంబ సభ్యులు వనితాను నడిపించుకుని తీసుకొస్తుండగా మార్గమధ్యలో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
పోక్సో, నల్సా చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం పోక్సో, నల్సా చట్టం– 2018పై విద్యార్థులకు అవగాహన శిబిరాన్ని జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (జిల్లా కోర్టు) రాజేష్ కుమార్ మిశ్రాలు మాట్లాడారు. పోక్సో చట్టం ద్వారా విద్యార్థినులు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగితే కోర్టులు ఎలా ప్రతిస్పందిస్తాయి, వారికి తగిన విధంగా న్యాయం చేకూర్చడమే కాకుండా నల్సా చట్టం కింద పీడిత మైనర్ బాలికలకు నష్ట పరిహారం ఇప్పించడంపై డీఎల్ఎస్ఏ కార్యదర్శి బిమళ్ రవుళో వివరించారు. సమావేశంలో సీనియర్ ఆడ్వకేట్ ఆర్.బాబూరావు, బి.చిట్టిబాబు, బార్ అసోసియేషన్ సభ్యులు డి.అనుప్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. -
గజపతి జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
పర్లాకిమిడి: గజపతి జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా గజపతి జిల్లాలో అయిదు రోజులుగా పర్యటిస్తున్న సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి పర్లాకిమిడిలోని సాయి ఇంటర్ నేషనల్ హోటల్లో మేధావులతో బుధవారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో ఏడు మండలాల్లో పర్యటించిన తర్వాత జిల్లా అభివృద్ధికి మేధావులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు సలహాలు ఇవ్వాల్సిందిగా రఘువీరా రెడ్డి కోరారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వ్యవసాయం, వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్, పండ్ల సాగుకు అనుకూలమైన గజపతిలో వాటిని ఎగుమతి, శీతల గిడ్డంగులు, ఆదివాసీ విశ్వవిద్యాలయం ఏర్పాటు, రైల్వే లైన్ పొడిగింపు, హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ రైళ్ల నడపడం ద్వారా ఉపాధి కల్పన కల్పించాలని పలువురు సూచించారు. ప్రతి సమితి కేంద్రంలో పలువురి కలుసుకుని వాటి తుది నివేదిక ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సమర్పించనున్నానని సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. మేధావుల సమావేశంలో మోహానా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో, అప్సాన శ్రీనివాసరావు, పీసీసీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే చిన్మయి బెహారా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నిరుపమ పాత్రో, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ ఛత్రపతి పాల్గొన్నారు. -
ఖరీఫ్ రుణాలు రూ.514 కోట్లు
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ జయపురం (కె.సి.సి.బ్యాంక్) ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.645 కోట్ల మేరకు రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.514 కోట్లు అందజేసినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని రాయగడ, మల్కనగిరి, నవరంగపూర్, కొరాపుట్లలో 20 శాఖలు ఉండగా మల్కనగిరి జిల్లా మత్తిలి, బలిమెల కేసీసీ శాఖలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో నూరు శాతం లక్ష్యాన్ని అధికారులు తెలిపారు. ఈ నెల 30లోగా అన్ని బ్రాంచ్లు వంద శాతం లక్ష్యం చేరుకోవాలని చెప్పారు. కూలిన తరగతి గది పైకప్పు భువనేశ్వర్: స్థానిక యూనిట్–9 బాలుర ఉన్నత పాఠశాల సముదాయంలో బుధవారం తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి రాలాయి. అదృష్టవశాతు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తరగతి గది పైకప్పు నుంచి పెచ్చులు ఊడి నేలకు రాలాయి. ఇటీవల 5టీ చొరవ కింద ఈ పాఠశాలను పునరుద్ధరించారు. 340 కిలోల గంజాయి పట్టివేత మల్కన్గిరి: ఎకై ్సజ్ సిబ్బంది దాడుల్లో 340 కిలోల గంజాయి పట్టుబడింది. మల్కన్గిరి జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారి బింభధర్ పండా ఆదేశాలతో మంగళవారం రాత్రి ప్రత్యేక బృందం చిత్రకొండ సమితి పెప్పరమేట్ల పంచాయతీ సారుకుబొంద గ్రామ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుతుందనే ముందస్తు సమాచారంతో ఎకై ్సజ్ అధికారి బింబధర్ తన సిబ్బందిని పంపారు. అయితే ఎకై ్సజ్ సిబ్బంది రాకను గమనించి గంజాయి మాఫీయ బస్తాలతో రవాణాకు సిద్ధంగా ఉంచిన గంజాయి విడిచిపెట్టి అక్కడ నుంచి పరారైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలను ఎక్సెజ్ సిబ్బంది చిత్రకొండ కార్యాలయానికి తరలించారు. బుధవారం తహసీల్దార్ సమక్షంలో చిత్రకొండ ఎక్సెజ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ బళ ఇతర సిబ్బంది కలిసి గంజాయిని తూకం వేయగా 340 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. దీని విలువ 35 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగిసిన జూనియర్ రెడ్క్రాస్ శిక్షణ శిబిరం మల్కన్గిరి: మల్కన్గిరి సమితి ఎంవీ–7 గ్రామం వద్ద జగన్నాధపల్లి ఉన్నత పాఠశాలలో మూడు రోజులు జరిగిన జిల్లాస్థాయి రెడ్క్రాస్ శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. చివరి రోజున ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రహి హాజరై మాట్లాడారు. శిక్షణలో ఇచ్చిన విషయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీటీ కార్తీక్ చంద్ర బెహరా, జిల్లా జూనియర్ రెడ్క్రాస్ కోఆర్డినేటర్ దేవరాజ్ సేఠీ పాల్గొన్నారు. శిక్షణ పొందిన 61 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. -
టాయిలెట్లో ప్రసవం
మల్కన్గిరి: కలిమెల సమితి ఆరోగ్య కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలగ్రంధి గ్రామానికి చెందిన పాడియా కస్బ భార్య సింఘే కస్బకు నెలలు నిండటంతో సోమవారం సాయంత్రం కలిమెల ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంగళవారం ప్రసవం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున టాయిలెట్కు వెళ్లిన సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ లెట్రిన్ ట్యాంక్లో చిక్కుకోవడంతో ఓ మహిళ వచ్చి బిడ్డను బయటకు తీసింది. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో తల్లీబిడ్డలు కోలుకున్నారు. -
రైతు సమస్యలపై వినతి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా అదనపు మాజిస్ట్రేట్ ఫల్గుని మఝికి బుధవారం నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర కోఆర్డినేటరు శేష దేవ్ నోందో, రంజిత్ పట్నాయక్ బుధవారం వినతిపత్రం అందజేశారు. నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ సభ్యులు ప్రభాత్ మహాలిక, దండాసి ఖండువాల్, రంజిత్ పట్నాయక్లు సబ్ కలెక్టర్తో భేటీ అయ్యారు. జిల్లాలో యూరియా కోరత, నల్లబజారకు తరలింపు, పత్తిపంటకు మండీల ఏర్పాటు, అన్ని సమితి కేంద్రాల్లో శీతల బండారాలు నిర్మాణం, పంట పొలాలకు సాగునీరు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ వంటి పలు సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై అధికారులు, ప్రభుత్వం ప్రతిస్పందించకుంటే గజపతి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. -
భూతల స్వర్గం కొరాపుట్
కొరాపుట్: ప్రకృతి అందాలతో నిండిన కొరాపుట్ జిల్లా భూతల స్వర్గం వంటిదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అభివర్ణించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి అంతర్జాతీయ ప్రాకృతిక పర్యాటక కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మేఘాలు కొండలను తాకుతూ వెళ్తున్న దృశ్యాలు వీక్షించారు. అనంతరం మొక్క నాటారు. దేవమాలిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో విశాఖపట్నం–రాయ్పూర్ మధ్య నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడార్ని సందర్శించారు. ఈస్ట్రన్ ఘాట్స్ను చీల్చుకుంటూ నిర్మించిన భారీ టన్నెల్లో పర్యటించారు. సొరంగం ప్రాముఖ్యతను ఎన్హెచ్ అధికారులు గవర్నర్కు వివరించారు. సునాబెడలో హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హాల్)ని సందర్శించి అక్కడ సుఖోయ్ యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ విభాగం పరిశీలించారు. ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపారు. పుంగార్లోని ఏకలవ్య మోడల్ విద్యాలయం బాలలతో సంభాషించారు. కేంద్రియ విశ్వ విద్యాలయంలో ఉన్నత స్థాయి అధికారుల నియామకం చాలా కాలంగా జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరాపుట్లో పలు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల అభివృద్ధిపై వినతి పత్రాలు సమర్పించారు. కొన్ని చోట్ల గిరిజనులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో కలెక్టర్ సత్యావాన్ మహాజన్, ఎస్ఫి రోహిత్ వర్మ తదితరులు న్నారు. -
భవితకు నిచ్చెన..!
● వెల్డింగ్తో ఉపాధికి విస్తృత అవకాశాలు ● జిల్లాలో 250 వరకు శిక్షణ సంస్థలు ● విదేశాల్లో మంచి జీతాలు ● మోసపోవద్దని పోలీసుల సూచన వెల్డింగ్ శిక్షణ..మా శిక్షణ సంస్థలో నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. విదేశాలకు వెళ్లేందుకు యువతకు సూచనలతో పాటు అక్కడ చట్టాలు, తదితర అంశాలను వివరిస్తాం. స్వయంగా అభ్యర్థులు విశాఖ, ఇచ్ఛాపురం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలకు హాజరై విదేశాలకు వెళ్లి వస్తున్నారు. నేను పదేళ్లు విదేశాల్లో పనిచేశాను. టిగ్, ఆర్క్, గ్యాస్ కటింగ్లో అనుభవం ఉంది. మా ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శిక్ష సంస్థ ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ ఉన్న శిక్షణ సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలి. మోసాలు బారిన పడకుండా చూసుకోవాలి. సబ్ ఏజెంట్లు, మోసగాళ్లను నమ్మి మోసపోకుండా చూసుకోవాలి. – కర్ని భీమారావు, దుర్గా గణపతి వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, పూండి నేను సింగపూర్, మలేషియా, దుబాయ్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాను. సొంతంగా శిక్షణ సంస్థ పెటుకున్నాను. దేశీయంగా వివిధ ప్రాజెక్టులు, కంపెనీల్లో నైపుణ్యత కలిగిన యువత కావాలని చాలా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా మూలపేట పోర్టు, స్టీల్ప్లాంట్, ఎన్ఎండీసీ, తదితర కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. వెల్డింగ్లో 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్ వెల్డింగుల్లో శిక్షణ ఇచ్చి సొంతంగా ఉపాధి అవకాశాలు కలిగేలా సూచనలు చేస్తున్నాం. సాంకేతిక విద్యలో స్కిల్ ఉంటే ఎక్కడైనా మంచి పొజిషన్ లభిస్తుంది. – జి.వైరెడ్డి, శిక్షణ సంస్థ యజమాని, దేవునల్తాడ వజ్రపుకొత్తూరు: నేటి యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కొలువులే కాకుండా వెల్డింగ్ రంగంపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారు. సాంప్రదాయ వెల్డింగ్తో పాటు హైటెక్ ఆటోమేటెడ్ పరికరాలను ఉపయోగించే పరిశ్రమలకు ఉపయోగపడే ప్రొఫెషనల్ వెల్డింగ్లోనూ నైపుణ్యం సాధిస్తున్నారు. వెల్డింగ్లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సొంతంగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, ఫ్యాబ్రికేషన్లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మరికొంతమంది విదేశాల బాట పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులతో సమానంగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఉత్తమ ఉపాధి అవకాశాలు చేతిలో పని(స్కిల్) ఉంటే ఎలాంటి సంస్థలైనా ఉపాధి కల్పిస్తాయని తెలుసుకుని ఇప్పుడు శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో జీతం నెలకు రూ.3.50 లక్షల వరకు సంపాదించే యువత కూడా ఉద్దానం ప్రాంతంలో ఉన్నారు. రష్యా, ఇటలీ, జపాన్, పోలెండ్ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో యువకులు ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. రేపటి బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, హరిపురం, పలాస, పూండి, నరసన్నపేట, శ్రీకాకుళం, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 250కి పైగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నాయి. స్కిల్ ఉన్నవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తారని తెలుసుకుని యువకులు పోటీతత్వంతో ముందుకు సాగుతున్నారు. వీరికి వెల్డింగ్ రంగం గొడుగు పడుతోంది. సర్టిఫైడ్ కోర్సులకు డిమాండ్ ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం ఉపాధి కోసం సాంకేతిక విద్యను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వెల్డింగ్, గ్యాస్ కటింగ్లపై శ్రద్ధ చూపిస్తున్నారు. వెల్డింగ్లో సెర్టిఫైడ్ కోర్సులను అభ్యసించి ఇండియాలో స్టీల్ప్లాంట్, ఇతర ప్రాజెక్టుల్లో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడంలో విశాఖ, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పూండి ప్రాంతాల్లోని వెల్డింగ్ శిక్షణ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఆరు నెలలు, ఏడాది పాటు శిక్షణ పొందితే చాలు ఏ సంస్థ అయినా వెల్డర్గా పనిలోకి తీసుకుంటుంది. ఇది నిరుద్యోగులకు వరంగా నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఉద్యోగం సాంపాదించడం కోసం వెల్డింగ్ నేర్చుకుని సింగపూర్, దుబాయ్, అబుదాబి, అమెరికా, ఆస్ట్రేలియా, పోలెండ్, రష్యా, అజర్బైజాన్, కత్తర్, థాయ్లాండ్, బ్యాంకాక్, మలేషియా వెళ్లిన యువకులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. అధికంగా యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో వారి అవసరాలకు అనుగుణంగా వెల్డింగ్ శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 250 వరకు శిక్షణ సంస్థలు 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్, మిగ్ వెల్డింగ్లో శిక్షణ అందిస్తున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్, ఐటీఐ చేసిన వారిలో ఎక్కువ మంది వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ, క్యూసీ రంగంలో ఆసక్తి కనబరుచుకుని ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఆటోక్యాడ్ ఇతర సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందినవారితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం, టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తుండడంతో వెల్డింగ్కు విశేష ఆదరణ లభిస్తోందని శిక్షణ సంస్థల నిర్వహకులు చెబుతున్నారు. కాగా విదేశీ ఉద్యోగాల మోజులో యువత కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులను నమ్మి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలను వారి చేతిలో పెట్టి టూరిస్టు విసాలతో వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గుర్తింపు పొందిన వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ అసోసియేషన్లలో నమోదైన సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా యువత పెడచెవిన పెట్టి ఉద్దానం, తీర ప్రాంత గ్రామాల్లోని విదేశీ ఏజెంట్ల వలలో చిక్కిపోతున్నారు. నకిలీ వీసాలతో పాటు కంపెనీ కాంట్రాక్టు కాపీలు, జీతం, వసతి అలవెన్సులు తదితర విషయాల్లో సైతం మోసాలకు పాల్పడుతుండడంతో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. -
అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలి
● ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా నోడల్ కార్యదర్శి తిరుమల నాయక్ సమీక్షపర్లాకిమిడి: గజపతి జిల్లాలో గ్రామీణ భవనాలు, తాగునీటి పథకాలు, విద్య, వైద్య, అంగన్వాడీ భవనాలు, గోపబంధు జన ఆరోగ్య యోజన పథకాల పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా నోడల్ కార్యదర్శి, బీడీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తిరుమలనాయక్ అన్నారు. గజపతి జిల్లాలో రెండు రోజులపాటు గుమ్మా, కాశీనగర్, ఆర్.ఉదయగిరి, నువాగడ, మోహనా సమితుల్లో పర్యటించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 3,79,071 మంది గోపబంధు జన ఆరోగ్య యోజనా పథకం కింద దరఖాస్తు చేసుకోగా, కేవలం 2,23,238 మందికి మాత్రమే ఆరోగ్య కార్డులు అందజేశారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియజేయాలని జిల్లా ముఖ్య వైద్యాధికారి, డీిహెచ్ఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీని ప్రశ్నించారు. కాశీనగర్ బ్లాక్లో అల్లగ గ్రామంలో ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని, ఖండవ వద్ద నిర్మించిన మెగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిన సమయానికి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అంత్యోదయ గృహాలు నిర్మాణం, పర్లాకిమిడి పట్టణంలో శంకర్బాస్ చెరువు పుణరుద్ధరణ పనులు, రోడ్లు, ఆహార కేంద్రాల నిర్వహణ మెరుగుపరచాలని పురపాలక ఈఓ లక్ష్మణ ముర్మును ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా హెడ్క్వార్టర్ ఆస్పత్రిలో డాక్టర్లు కొరత వెంటాడుతుందని దీనిని సకాలంలో నియామకాలు చేపట్టాలని డా.ఎన్.తిరుమల నాయక్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మధుమిత, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, డీఎఫ్ఓ కె.నాగరాజు, ఆదనపు సీడీఓ ఫృఽథ్వీరాజ్ మండళ్, ఏడీఎం ఫల్గుణీ మఝి, తదితరులు పాల్గొన్నారు. -
5 గంటలు శ్రమించి..పొట్టలో దిగిన బాణం తొలగింపు
● కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో శ్రస్తచికిత్స కొరాపుట్: పొట్టలో దిగిన బాణాన్ని వైద్యులు తొలగించారు. మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి పొకనాగుడ గ్రామ పంచాయతీ నాయక్గుడ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ అటవీ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో అతని తమ్ముడు విశ్వనాథ్ గౌడ తమ సంప్రదాయ విల్లుతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. సరదాగా విల్లు నుంచి బాణం విడిచిపెట్టాడు. అది నేరుగా లక్ష్మణ్ గౌడ పొట్టలో దిగింది. వెంటనే స్థానికులు బాధితుడిని మత్తిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యుల సూచనతో బాధితుడిని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అభిషేక్ పాత్ర, సర్జరీ విభాగాధిపతి మియొంజయ్ మల్లిక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ నాయక్ బృందం సుమారు 5 గంటలపాటు చేసిన శాస్త్ర చికిత్సతో బాణం పొట్టనుంచి బయటకు తీశారు. బాణం 8 అంగులాలు పొట్టలో చొచ్చకుపోయింది. అనేక చోట్ల పేగులు కత్తిరించబడ్డాయి. శరీరం నుంచి ఒకటిన్నర లీటర్ రక్తం బయటకుపోయింది. వైద్యుల కృషితో శస్త్ర చికిత్స విజయవంతం అయింది. డాక్టర్ల బృందానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
బీఆర్ఏయూ రిజిస్ట్రార్గా అడ్డయ్య
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా వర్సిటీ సీనియర్ అధ్యాపకుడు ఆచార్య బి.అడ్డయ్య నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజని నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. ఇప్పటివరకు అడ్డయ్య వర్సిటీ రెక్టార్గా వ్యవహరించడమే కాకుండా, పలుమార్లు ఇన్చార్జి రిజిస్ట్రార్గా సేవలను అందించారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఎం.పాపారావు ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాపారావు భార్య కుమారి పాలు మరిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలోనే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కుమారి భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు వచ్చి తడి గోనె సంచులు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, పరిశీలించి తగు సూచనలు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. 28 పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలంలోని ఎన్హెచ్–16పై సుభద్రాపురం జంక్షన్లో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్లలో తరలిస్తున్న 28 పశువులను(గేదెలను) లావేరు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు కొత్తూరు : నివగాం గ్రామానికి చెందిన బి.కమలహాసన్, బి.రాజేష్లు వెలుగు కార్యాలయంలోకి వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని ఏపీఎం లలిత పోలీస్లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ బుధవారం తెలిపారు. -
బోండా గిరిజనుల అభివృద్ధికి కృషి
● రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోండా ఘాటీలో బుధవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తొలిసారి పర్యటించారు. ఆదిమ బోండా గిరిజనుల పురోభివృద్ధిపై ప్రసంగించారు. ముందుగా కోరాపూట్ నుంచి మల్కన్గిరి జిల్లా గోవిందపల్లి వరకు వచ్చి అక్కడి నుంచి బోండాఘాటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. బోండాఘాటీ పవిత్ర సీతకుండ శ్రీరామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బోండా డెవలప్మెంట్ ఏజెన్సీని సందర్శించారు. బోండా నైపుణ్యభివృద్ధి కేంద్రం, టైలరింగ్ యూనిట్, మల్టీప్రాసెసింగ్ యూనిట్, బోండా సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాల తయారీ పరిశీలించారు. స్వయం సహాయక గ్రూపుల మహిళలు, ఆదిమ బోండా గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 15 మంది గిరిజనులకు భూపట్టాలు అందజేశారు. పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, ఎస్పీ వినోద్ పటేల్, డీఎఫ్ఓ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కులు తెలియజేయాలి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సమచార హక్కు కమిషన్ చారిత్రాత్మక ఆదేశం జారీ చేసింది. ఎంపిక పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మార్కుల వివరాలు తెలియజేయాల్సిందేనని ఆదేశించింది. ప్రభావిత అభ్యర్థి అభ్యర్థన మేరకు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం. 2022లో సహాయ ఉపాధ్యాయుని పదవికి ఎంపిక కాని అభ్యర్థికి ఇంటర్వ్యూ మార్కులు వివరాలు కావాలని ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్సీ)ను అభ్యర్థించారు. అది సాధ్యం కాదని ఓపీఎస్సీ అభ్యర్థిని నిరుత్సాహానికి గురిచేసింది. భద్రక్ జిల్లాకు చెందిన మీనతి రాణి మహాపాత్రో చరిత్ర విభాగం సహాయ ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసి అనుబంధ పరీక్షలకు హాజరైంది. ఆ ఉద్యోగ భర్తీకి అర్హత సాధించేందుకు కెరీర్ మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారని నోటిఫికేషన్ పేర్కొంది. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 జూన్లో విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మీనతిరాణి మహాపాత్రో పేరు కనిపించలేదు. ఫలితాలతో అసంతృప్తి చెంది తన కెరీర్ రేటింగ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కోరుతూ 2022 డిసెంబర్లో సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థన పత్రం దాఖలు చేసింది. ఆ అభ్యర్థన పట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాక్షికంగా స్పందించింది. అభ్యర్థి కోరిన ప్రకారం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెరీర్ మార్కులు మంజూరు చేసి ఇంటర్వ్యూ మార్కులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సమాచార కమిషన్ ముందు విచారణ సందర్భంగా.. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి ఆ ఉద్యోగ ఎంపికకు ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు నమోదు చేయలేదు, కనీస మార్కుల ప్రామాణికత నిర్ణయించలేదని వివరించారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వం, మాట్లాడే శైలి, నైపుణ్యాలు, మొదలైన వాటిని పరిశీలించే ప్రక్రియ మాత్రమే. ఇంటర్వ్యూలో పరిశీలన ఆధారంగా మాత్రమే అర్హత నిర్ణయించబడుతుందని సమాచార కమిషన్కు తెలియజేశారు. అభ్యర్థులు తగినవారో, కాదో మాత్రమే వారికి తెలియజేస్తారు. అభ్యర్థులకు నిర్ధిష్ట మార్కులు ఇవ్వబడవు, ఎటువంటి మెరిట్ జాబితా ప్రచురించబడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మనోజ్ పరిడా తన చారిత్రాత్మక తీర్పులో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సమాచార హక్కు చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో పొందిన మార్కులను తెలుసుకునే హక్కు అభ్యర్థికి ఉంది. ఇది తదుపరి ప్రయత్నంలో తన పని తీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి అభ్యర్థికి, ముఖ్యంగా పరీక్షలో విఫలమైన అభ్యర్థికి, తాను ఏ ప్రాతిపదికన విజయం సాధించలేకపోయానో తెలుసుకునే హక్కు ఉంది. ఈ విషయంలో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులను అంధకారంలో ఉంచకూడదు. సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 22 కింద దరఖాస్తుదారులకు సమాచారం అందించడంలో అన్ని ఇతర చట్టాలు, నిబంధనలను అధిగమిస్తుందని తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన విధానాన్ని మార్చుకోవాలని, అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను అందించాలని స్పష్టంగా ఆదేశించింది. -
500 కిలోల గంజాయి స్వాధీనం
● జిల్లా వ్యాప్తంగా అబ్కారీశాఖ దాడులు ● గంజాయి, నాటుసారా, మద్యం పట్టివేత ● ఐదుగురు అరెస్టు పర్లాకిమిడి: గజిపతి జిల్లా కలెక్టర్ మధుమిత ఆదేశాల మేరకు జపతి జిల్లా అబ్కారీశాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గంజాయి, సారాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీరిలో ఒక మహిళ ఉంది. జిల్లాలో గుసాని సమితి గారబంద పి.ఎస్.పరిధిలో అడాసింగి, రాయఘడ బ్లాక్ మర్లబ, గుమ్మా బ్లాక్ సెరంగో పి.ఎస్.పరిధిలో బారై తదితర గ్రామాల్లో 500 కిలోల గంజాయి, 20 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆర్.ఉదయగిరి అబ్కారీ శాఖ అధికారి మోన్ను ఆయాల్, మోహనా ఎస్ఐ కె.బాలాజీ, పర్లాకిమిడి సదర్ ఎకై ్సజ్ ఎస్ఐ ప్రశాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. -
గజపతి జిల్లాలో అధికారుల పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో జిల్లా నోడల్ సెక్రటరీ, భువనేశ్వర్ డెవలప్మెంట్ ఆథారిటీ (బీడీఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తిరుమల రెండు రోజుల పర్యటనలో ఆర్.ఉదయగిరి ఇండోర్ స్టేడియంలో అంత్యోదయ పథకం గృహాలు లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. అనంతరం నువాగడ బ్లాక్లో ఖోజురిపద బ్లాక్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ రోగులకు ఉత్తమ చికిత్స అందజేయాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. రాయఘడ బ్లాక్లో జయ్మా మిషన్ శక్తి కుట్టుమిషన్ల కేంద్రాన్ని సందర్శించి అక్కడ మహిళా స్వయం సహాయక గ్రూపులతో మాట్లాడారు. తర్వాత రాయఘడ బ్లాక్లో డంబాపూర్ వద్ద అంగన్వాడీ కేంద్ర నిర్మాణ పనులను సందర్శించి, సుభధ్ర పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. నోడల్ సెక్రటరీ వెంట జిల్లా కలెక్టర్ మధుమిత, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఆదనపు కార్యనిర్వాహణ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, ఒడిశా జీవనోపాదుల పీడీ టిమోన్ బోరా, ఆర్.ఉదయగిరి, నువాగడ, రాయగడ బీడీఓ ఉన్నారు. -
హోటల్పై దుండగుల దాడి
జయపురం: జయపురం సదర్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో కొంత మంది దుండగులు హోటల్పై దాడి చేసి యజమానిని, పనివారిని కొట్టి సరుకులను ధ్వంసం చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస పాత్రో రౌత్ మంగళవారం తెలిపారు. హోటల్ యజమాని వాల్మీకి మహాపాత్రో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన కొంతమంది దుండగులు హోటల్కు వచ్చి రూ.5 వేలు అడిగారని, డబ్బులు ఇవ్వకపోతే హోటల్ మూసివేయాలని హెచ్చరించారు. దుండగులను యజమాని, హోటల్ పనివారు ఎదిరించటంతో వారిపై మారణాయుధాలతో కొట్టారు. సమగ్రిని ధ్వంసం చేశారు. మహాపాత్రో మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయారు. దుండగులను పట్టుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు. ట్యాంకర్ను ఢీకొన్న అమొ బస్సు భువనేశ్వర్: ఖుర్ధా జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై అమొ బస్సు ప్రమాదానికి గురైంది. టంగి ప్రాంతం ఛొటిలో గొడొ కూడలి సమీపంలో మంగళవారం ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు గాయ పడ్డారు. వారిలో 15 మంది గాయపడ్డారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సత్వర ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. టంగి ఠాణాలో పోలీసులు ఘటనా స్థలం చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్లో సదస్సు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్జెండర్లు, గిరిజనులు, అసంఘటిత కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాల అధికారులు తాము అందిస్తున్న పథకాలను వివరించగా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమాజానికి తాము చేస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో డీసీపీవో రమణ, ఎల్ఏడీసీ ప్రధాన అధికారి కె.ఆఫీసు పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎచ్చెర్ల : ఏపీ ఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించిన బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీ–పార్మసీ, ఫార్మాడీ, బీ టెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిందని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయకర్త కె.నారాణరావు మంగళవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రోసెసింగ్ కోసం ఈ నెల 11 నుంచి 16 వరకూ రుసుము చెల్లించాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 17లోగా ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి ఆన్లైన్ పరిశీలన, 13 నుంచి 18 వరకూ కళాశాలల కోర్సుల ఎంపికకు వెబ్ ఆప్షన్లు, 19న వెబ్ ఆప్షన్ల మార్పు, 21న కళాశాలలు, కోర్సుల కేటాయింపు జాబితా వెల్లడించనున్నట్లు వివరించారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేసుకోవాలన్నారు. నిరసన ర్యాలీ విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: విజయవాడ ధర్నాచౌక్ వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు జామి శ్రీకాంత్బాబు మంగళవారం పిలుపునిచ్చారు. లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కొన్ని సంవత్సరాలుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక వయస్సు కూడా దాటిపోయి మానసిక సంఘర్షణ, ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. మెరుగైన ఫలితాలే లక్ష్యం పాతపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఉంటుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్.సురేష్కుమార్ అన్నా రు. మంగళవారం పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని, విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దుర్గారావు, ప్రిన్సిపాల్ టి.హేమసుందరరావు, అధ్యాపకులు ఉన్నారు. గంజాయి కేసులో పదేళ్ల జైలుశిక్ష ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం వద్ద 2022లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన గణశ్యామ్ బెహరా, రెయ్యి త్రినాథ్, పైల వాసులకు పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూయల జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పి.భాస్కరరావు తీర్పు వెల్లడించారని సీఐ మీసాల చిన్నంనాయుడు మంగళవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీఐ పేర్కొన్నారు. బంగారం చోరీపై కేసు నమోదు మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో దుక్క మధుసూదన్ రెడ్డి ఇంట్లో బంగారం చోరీకి గురైంది. ఎస్సై పిన్నింటి రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. మధుసూదన్ రెడ్డి ఇంట్లో కొద్దిరోజుల కిందట నగదు, బంగారం మాయమైంది. అయితే ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అనుమానంతో ప్రశ్నించగా ఏమీ తెలియదని సమాధానం ఇచ్చింది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చిక్కుముడి!
బాల్యానికి.. ● జిల్లాలో ఆగని బాల్య వివాహాలు ● రాష్ట్రంలో మూడో స్థానం ● చదువుకు దూరమవుతున్న బాలికలు ● జీవితాంతం వెంటాడుతున్న రుగ్మతలు హిరమండలం: బడిబాట పట్టాల్సిన బాలికలు పెళ్లిపీటలెక్కుతున్నారు. తెలిసీ తెలియని వయసులో వారిని మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో గర్భం దాల్చుతున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లిచేసి అత్తారింటికి పంపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కవగా చిన్ననాటే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో చాలావరకూ బాల్య వివాహాలు అదుపులోకి వచ్చాయి. అవగాహన ఉన్నవారు తమ పిల్లల విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, నిరక్షరాస్యులు మాత్రం ఆడపిల్లలను భారంగా పరిగణించి బాల్య వివాహాలు చేసేస్తున్నారు. సమాచారం అందుకుంటున్న అధికారులు 2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 144, 2023–24లో 96, 2024–25లో 28 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2025–26కు సంబంధించి 18 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక భారంతో.. శ్రీకాకుళం ప్రధానంగా వలసల జిల్లా. చాలా గ్రామాల్లో భార్య, భర్త ఇద్దరూ పనికి వెళితే గానీ పూటగడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో పదో తరగతి వరకూ ఆడపిల్లలను చదివించి వెంటనే వివాహాలు జరిపించేస్తున్నారు. ఇలా చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటున్నారే తప్ప.. బాల్య వివాహాలతో తమ పిల్లలను అనారోగ్య కూపంలోకి తోసివేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆ జాబితాలో జిల్లా.. రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల్లోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. బాల్యంలో తల్లులు కావడం అనేది గతంతో పోల్చుకుంటే తగ్గినప్పటికీ.. బాల్య వివాహాలు మాత్రం ఆగకపోడం ఆందోళన కలిగిస్తోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. 15 నుంచి 19 ఏల్ల వయసులోపు బాలికలు నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉంటారు. తల్లిగా మారే సమయంలో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గడంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిర్యాదు చేయవచ్చు.. బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా 1098, 100, 181 వంటి టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా కూడా బాల్య వివాహాల సమాచారం చేరవేయవచ్చు. అయితే, ఇటీవల ఫేక్ ఫిర్యాదులు చేస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వచ్చి తప్పకుండా అడ్డుకుంటారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎటువంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్య వివాహాలతో అనారోగ్యం తప్పదు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. దీనిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం – ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ, శ్రీకాకుళం ఎల్ఎన్పేట మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. సన్నాహాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహం జరిపితే కలిగే అనర్థాలను వివరించారు. దీంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. హిరమండలానికి ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి చదువుతున్న కుమార్తెకు వివాహం జరపాలని నిర్ణయించారు. బాలికకు పెళ్లి ఇష్టం లేదు. దీంతో స్నేహితుల ద్వారా చైల్డ్లైన్ అధికారులను ఆశ్రయించింది. వారు వచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. -
టీటీఈలకు బయోమెట్రిక్ హాజరు
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం రైలు టికెట్ తనిఖీ సిబ్బంది (టీటీఈ)కి బయోమెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థని ప్రవేశ పెట్టారు. రైల్వే కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం దిశలో ఈ చర్య చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చొరవతో సిబ్బంది విధుల నిర్వహణ ఆరంభం, ముగింపు రెండు దశల్లో (సైన్–ఇన్ మరియు సైన్–ఆఫ్) బయోమెట్రిక్ వ్యవస్థని అనుసరించాల్సి ఉంటుంది. ఈ విధానం తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఖుర్దారోడ్ మండలం అధికారులు తెలిపారు. సిబ్బంది విధుల హాజరు వ్యవస్థ క్రమబద్ధీకరణ పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఖుర్దా రోడ్, పూరీ, భువనేశ్వర్, భద్రక్, జాజ్పూర్ కెంజొహర్ రోడ్, కటక్, బలుగాంవ్, బరంపురం, పలాస, ఢెంకనాల్, అంగుల్, పారాదీప్ 12 స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ టీటీఈ లాబీలలో బయోమెట్రిక్ ఆధారిత లాగ్ ఇన్, లాగ్ ఆఫ్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. ఖుర్దారోడ్ రైల్వే మండలం పరిధిలో దాదాపు 550 మంది టికెటు తనిఖీ సిబ్బంది హాజరుని ఈ వ్యవస్థ అధునాతన సాంకేతిక విధానంలో పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థని 950 పైబడి ప్రదేశాల్లో విజయవంతంగా అమలు చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అధీనంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ – డీఏసీ) సమన్వయంతో బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ ఆధార్ ఆధారిత వేలిముద్ర ప్రామాణీకరణ పరికరాలను ఉపయోగిస్తుంది, యూడీఏఐ, ఎస్టీక్యూసీ ధృవీకరణతో ఈ–ప్రమాణ్ పోర్టల్ అనుసంధానంతో పని చేస్తుంది. న్యూ ఢిల్లీ టీటీఈ లాబీలో ప్రయోగాత్మకంగా అమలు చేసి కార్యాచరణ ధృవీకరించి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అంచెలంచెలుగా ప్రవేశ పెడుతున్నారు. బయో మెట్రిక్ హాజరు నమోదు రైలు ప్రయాణికుల సౌకర్యాల రంగంలో అనుబంధ సిబ్బంది సామర్థ్యం మరియు పారదర్శకతను బలోపేతం చేసి ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందజేసేందుకు దోహదపడుతుంది. -
ఎమ్మెల్యే దృష్టికి తడమ పంచాయతీ సమస్యలు
రాయగడ: రాయగడ శాసన సభ నియోజకవర్గం పరిధిలోని తడమ పంచాయతీలో నెలకున్న సమస్యలను ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక విన్నారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో సరిగ్గా వైద్యులు ఉండటం లేదని మహిళలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యులు సకాలంలో వైద్య సేవలు పొందలేకపొతున్నామని ఎంఎల్ఏకు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో అత్యవసర పరిస్థితిలో చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రిపై ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన ఎంఎల్ఏ ఈ సమస్య వైద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పంచాయతీలోని వివిధ గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఇచ్ఛాపురం : విశాఖపట్నం సీతమ్మధారలో మూగబాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్–1 ఉలాల భారతి దివ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నేరస్తులను వెంటనే పట్టుకుని ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. -
ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ పదవీ కాలం పొడిగింపు
భువనేశ్వర్ : ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ ఉద్యోగ పదవీ కాలం మూడేళ్లు పొడిగించారు. ఈ పొడిగింపు తక్షణమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 9 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు మూడేళ్ల వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించింది. ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఆయన ఇంతకు ముందు ఒడిశా వ్యవసాయ అభివృద్ధి, పెట్టుబడుల సంస్థ (ఏపీఐసీఓఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. విద్యా రంగంలో పటిష్టమైన పాలన దక్షత కలిగి ఉన్నారు. లోగడ ఓయూఏటీలో డీన్ (ఎక్స్టెన్షన్), డీన్ (వెటర్నరీ) మరియు డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్, మానిటరింగ్, మూల్యాంకనం వంటి వివిధ కీలక పదవుల్లో బాధ్యతలను దక్షతతో నిర్వహించారు. బోధన, పరిశోధన, అధికారిక పాలన రంగంలో విస్తృత అనుభవంతో, ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ రౌల్ వైస్ చాన్స్లర్గా చక్కటి పనితీరు ప్రదర్శించారు. -
విన్నపాలు వింటూ..
● ప్రజలతో మమేకమవుతూ గవర్నర్ పర్యటన కొరాపుట్: గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రజలతో మమేకమవుతూ తన పర్యటన సాగిస్తున్నారు. నిబంధనలు పక్కన పెట్టి మంగళవారం రెండో రోజు కొరాపుట్లో ఆయన పర్యటన సాగింది. విపక్ష పార్టీల నేతలతో కూడా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత గవర్నర్ల కంటే విభిన్నంగా ఈ పర్యటన సాగడం విశేషం. ఉదయం ఆయన ఒడిశా కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. విశ్వ విద్యాలయంలో వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. చాన్స్లర్ హోదాలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల అమలు తీరుపై నివేదికలు పరిశీలించారు. ఇదే వేదిక వద్ద అఖిల పక్ష పార్టీల నాయకులు గవర్నర్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ దగ్గరకు పిలిపించుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత లేఖని గవర్నర్కు అందజేశారు. లక్ష్మీపూర్ సమితిలో కొడింగా మాలి వద్ద గనుల తవ్వకాలు, తాము చేస్తున్న పోరాటం వివరించారు. అక్కడ గిరిజనులకు ఫెరి ఫెరి డెవలప్మెంట్ నిధులు ద్వారా సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. మొదట పేర్కొన్న విధంగా కాకుడా గనుల రెట్టింపు తవ్వకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమస్యను గవర్నర్ కూలంకషంగా తెలుసుకున్నారు. ఈ బృందంలో బీజేడీకి చెందిన జిల్లా అధ్యక్షుడు జిన్ను హిక్కా తదితరులు ఉన్నారు. అనంతరం రాజ్పుట్లో గిరిజన మహిళలు నిర్వహిస్తున్న మిలెట్ మిషన్ని సందర్శించారు. మిలెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రభుత్వ సహకారంతో మహిళలు అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ వివిరించారు. అక్కడ గిరిజన మహిళలను పిలిపించుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెక్కలు నాటి వన యజ్ఞం ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాం చంద్ర ఖడం, బీజేపీ ఎమ్మెల్యేలు రూపుధర్ బోత్ర, రఘురాం మచ్చో, ఎస్పీ రోహిత్ వర్మలు పాల్గొన్నారు. -
విద్యుత్ పొరుగు సేవల ఉద్యోగుల నిరసన
పర్లాకిమిడి: విద్యుత్ ఉద్యోగుల నాలుగు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అఖిల భారత ఒడిషా విద్యుత్ మజ్దూర్ మహాసంఘ్ పేరిట మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. తొలుత మెడికల్ జంక్షన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యుత్ ఉద్యోగుల మహాసంఘం కలెక్టరేట్కు చేరుకుని నినాదాలు చేశారు. టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న లైన్మెన్లు, హెల్పర్లు, కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గ్రేడ్పే పెంచాలని, ఎన్పీసీ, యూపీఏకు బదులు పాతపింఛను విధానం అమలుచేయాలని, హరియాణా రాష్ట్ర అవుట్ సోర్సింగ్ మోడల్ అమలు, ఇంటర్ జోన్ బదిలీలు, ఒడిశాలో కేంద్ర పీఆర్సీ 2019 అమలు వంటి పలు డిమాండ్లతో ఆందోళన జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ మఝి, ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పేరిట అడ్రస్ చేసిన వినతి పత్రాన్ని అదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝికి తన కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, విద్యుత్ మజ్దూర్ మహాసంఘ్ కార్యదర్శి సత్యబ్రత పరిడాలు కలిసి అందజేశారు. ఆందోళనలో కోశాధికారి మున్నాదామి, జిల్లాలోని పలు సబ్ డివిజన్లలో పనిచేస్తున్న విద్యుత్ లైన్మెన్లు, పోరుగుసేవల ఉద్యోగులు పాల్గొన్నారు. -
కాటేసిన అంధ విశ్వాసం
● పాముకాటు వైద్యం అందక అక్కా తమ్ముడు మృతి కొరాపుట్: బరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సమితి రాజ్పూర్ గ్రామంలో మంగళవారం వేకువజామున ఇంటిలో నిద్రపోతున్న అమిత హరిజన్ (11), ఆమె తమ్ముడు పూజరాజ్ హరిజన్ (9 నెలలు)ను పాము కాటేసింది. దీంతో ఇద్దరు పిల్లలు ఏడవడంతో మేలుకున్న కుటుంబ సభ్యులు పామును గుర్తించి చంపేశారు. కానీ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా మంత్రగత్తె వద్ద పూజలు చేయించారు. కానీ అప్పటికే బాలలు ఇద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఇది గమనించిన గ్రామ యువకులు వెంటనే అంబులెన్స్ను రప్పించి బాలలను ఉమ్మర్ కోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాము కాటు జరిగిన వెంటనే ఆస్పత్రికి తెచ్చి ఉంటే బాలలిద్దరూ బతికేవారని వైద్యులు పేర్కొన్నారు. -
మాజీ ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠికి ఘనంగా నివాళి
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠి 46వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో సదాశివ త్రిపాఠి పార్క్లో సదాశివ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్మృతి సభ నిర్వహించారు. సమావేశంలో నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రసంగిస్తూ రాష్ట్రంలో భూ సంస్కరణలు సదాశివ త్రిపాఠి కఠినంగా అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాక ముందు రెవెన్యూ మంత్రిగా పని చేసినప్పడు తనకు చెందిన 700 ఎకరాలు భూమిని ప్రభుత్వ పరంచేసిన ఘనత సదాశివకి చెందుతుందన్నారు. అంతకు ముందు సదాశివ సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, చైర్మన్ కును నాయక్, ఏపీపీ సంతోష్ మిశ్ర, కేదార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో మంగళవారం రత్న వేదికపై చతుర్థా మూర్తుల సర్వ దర్శనానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. మందిరం లోపలి ప్రాంగణంలో ఉమ్మి వేసినట్లు దృష్టికి రావడంతో ఆకస్మికంగా మూల విరాట్లకు శుద్ధి స్నానం చేయించాల్సి వచ్చింది. ఇదో గోప్యమైన ఆచారం కావడంతో ఈ ప్రక్రియ ముగిసేంత వరకు భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. దాదాపు గంటన్నర పాటు సర్వ దర్శనం స్తంభించి పోయింది. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినప్పుడు నిర్వహించే ముఖ్యమైన శుద్ధీకరణ కర్మ మహా స్నానంగా పేర్కొంటారు. ఈ ఆచారం సమయంలో, ఆధ్యాత్మిక స్వచ్ఛతను పునరుద్ధరించడానికి రత్న వేదికపై కొలువు దీరిన జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలను ఆచారబద్ధంగా శుద్ధి చేస్తారు. మొబైల్ దుకాణంలో చోరీ రాయగడ: జిల్లాలోని బిసంకటక్లో నేతాజీ క్లబ్ సమీపంలోఉన్న ఒక మొబైల్ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు దుకాణం తాళాలు విరగ్గొట్టి లొపలకు చొరబడి విలువైన వివిధ బ్రాండ్ల మొబైళ్లను దొంగింలించారు. అయితే తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు దుకాణంలోని సీసీ కెమెరాలను విరగ్గొట్టడంతో పాటు హార్డ్ డిస్క్ను తమ వెంట తీసుకువెళ్లిపొయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం యజమాని అరుణ్ పాత్రో మంగళవారం ఉదయం మొబైల్ దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లగా తలుపులు విరిగి పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. లోనికి వెళ్లి చూడగా నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే 22 మొబైళ్లు చోరీకి గురైనట్టు పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో వలస కార్మికుడు మృతి రాయగడ: తిరుపతిలో వలస కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి పరిధి బంకాంబ పంచాయతీలొని మంకొడొజొల గ్రామానికి చెందిన ఉమాశంకర్ మాఝి (21)గా గుర్తించారు. కొద్ది నెలల క్రితం నుంచి స్నేహితులతో కలసి ఉమాశంకర్ తిరుపతిలోని ఒక పైపుల కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఈ నెల ఆరో తేదీన అస్వస్థతకు గురైన అతడు ఆదివారం మృతి చెందినట్లు కంపెనీ వర్గాలు అతని కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు సొమవారం తిరుపతి వెళ్లారు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్య మల్కన్గిరి: మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి చితాపారి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. సవిత (30) ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన పూర్ణచంద్ర ముదిలీ కుమారై సవిత రోజూ ఉదయాన్నే లేచి తండ్రికి టీ చేసి ఇవ్వడం అలవాటు. మంగళవారం ఉదయం ఇవ్వకపోవడంతో తండ్ర వెళ్లి గదిలోకి చూడగా సవతి ఫ్యాన్కు వేలాడుతూ చనిపోయి కనిపించింది. దీంతో బలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ దీరాజ్ పట్నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. సవితకు కొన్ని సంవత్సరాల క్రితం వీరకిశోరపూర్ గ్రామానికి చెందిన పవిత్రో ఖీలోతో వివాహం జరిగింది. అయితే కొద్ది నెలల తరువాత భర్తతో తగాదా రావడంతో అతన్ని విడిచిపెట్టేసి తండ్రి పూర్ణచంద్ర ముదిలి వద్దకు వచ్చేసి ఉంటుంది. ఆ తరువాత చితాపారికు చెందిన ఖగపతి కిర్సనీ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో సవిత ఆత్మహత్యకు పాల్పడం అనుమానాలకు తావిస్తుంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
బీజేడీకి నెక్కంటి గుడ్బై
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేశారు. బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట ఇకపై తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్థానిక తేజస్వి హోటల్ సమీపంలోని మైదానంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బిజూ పట్నాయక్ 1974లో తనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని, అనంతరం ఆయన తనయుడు నవీన్ పట్నాయిక్తోనూ పనిచేశానని తెలిపారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో అధిష్టానం తనను విస్మరించడం జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నానని వివరించారు. జిల్లాలో ఎందరో తనను ఆదరిస్తున్నారని, వారి వెనుక నిలబడేందుకే బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట సామాజిక వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇది కేవలం సేవకు మాత్రమేనని, రాజకీయాలకు కాదని స్పష్టం చేశారు. పెద్దల సలహాతో.. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీజేడీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాను మరొకరికి ఇవ్వడం నెక్కంటికి నచ్చలేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, తన మద్దతుదారుల్లో అసంతృప్తి పెరగడం కూడా ఈ వేదిక ఏర్పాటుకు మరో కారణమని అన్నారు. రాష్ట్ర స్థాయి పెద్దలతో, తన సహచరుల సలహాతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన బిజూ స్వాభిమాన్ మంచ్ వేదికకు అందరి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం మంచ్ లోగోను ఆవిష్కరించారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలోనే.. జిల్లాలో ఎందరో తనను ఆదరించారని నెక్కంటి తెలిపారు. పార్టీలో అనేక హోదాల్లో కొనసాగిన తాను జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేశానని పేర్కొన్నారు. తనను పార్టీ అవమానించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన రక్తాన్ని పంచుకుపుట్టిన ఇద్దరు అన్నదమ్ములను ఒక సందర్భంలో కోల్పొయినప్పటికీ బీజేడీ ఆశయ సాధన కొసం, జిల్లా అభివృద్ధి కోసం పనిచేసినట్లు గుర్తు చేశారు. ఎవరినీ నిందించడం లేదు తాను ఏర్పాటు చేసిన బిజూ స్వాభిమాన్ మంచ్ కేవలం ప్రజా సంక్షేమం కోసమేనని నొక్కి చెప్పారు. అయితే అందుకు ఎవ్వరిని నిందించడం లేదని స్పష్టం చేశారు. త్వరలో మంచ్ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. బీజేడీకి నెక్కంటి మద్దతు దారులు, అనుయాయులు, కార్యకర్తలు సామాహికంగా రాజీనామాలు చేశారు. అందరి సమక్షంలో ఈ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గంగాధర్ పువ్వల, బీజేడీ యువ నాయకులు బినాయక్ కర్, అమయ స్వాయి, అవినాష్ బిశొయి, తదితర పార్టీ ప్రముఖులు బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట కార్యకలాపాలు -
మంచినీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం
రాయగడ: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీటి సౌకర్యార్ధం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన పనుల్లో జాప్యమెందుకు చోటు చేసుకుంటుందని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ప్రశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులపై ఆయన మండిపడ్డారు. అధికారులు కాగితాల మీదే ప్రాజెక్టులకు సంబంధించిన పనులను లెక్కలు చూపించడం కాదని, వాస్తవ పరిస్థితులను తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ దానిని విస్మరిస్తున్నారని అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్షించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్టు విమర్శలు వస్తున్న నేపథ్యంలో పనులు బాగా చేపట్టాలన్నారు. గత కొద్ది రోజుల క్రితం జిల్లాలోని బిసంకటక్ కోర్టు సమీపంలొ మేగా తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పైపు లైన్ పగిలి నీరు వృథా అవ్వడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకమీదట పనుల్లో నాణ్యత కనిపించకపొతే చర్యలు చేపట్టడం ఖాయమని అన్నారు. అదేవిధంగా కొనసాగుతున్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో తదితరులు పాల్గొన్నారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఆమదాలవలస: పట్టణంలోని డాబాలవారి వీధికి చెందిన గూడాడ ఉపేంద్ర (27) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మునగవలస గ్రామానికి చెందిన ఉపేంద్ర సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామానికి చెందిన కొంచాడ సునీత అనే వివాహితతో మూడేళ్లుగా పట్టణంలోని డాబాలవారి వీధిలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జిల్లా కేంద్రంలోని ఒక జిరాక్స్ షాపులో పనిచేస్తుండగా, వివాహిత మహిళా సునీత పట్టణంలోని కిరాణా దుకాణంలో పనిచేస్తూ సహ జీవనం చేసేవారు. అయితే మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తల్లి గూడాడ పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
సకాలంలో వినతులు పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 75 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సకాలంలో అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ శాఖలకు చెందిన 75 వినతులు స్వీకరించారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23 దరఖాస్తులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 16, మున్సిపల్ శాఖకు 5, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 4 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా నీటి వనరులు, సర్వే సెటిల్మెంట్స్, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెరో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ (డీఎంపీసీ) టి.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30,000ల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆటో డ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. ఫ్రీ బస్సు పథకం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీల కు అప్పులతో ఆటోలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ● సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు గ్రామ పంచాయతీ బొంతుగూడ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు. ● ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్లు, మౌఖాన్ల గౌరవ వేతనాలు చెల్లించాలని జిల్లా మైనారిటీ సెల్ కమిటీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం తగదన్నారు. బూర్జ మండలంలోని నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లు పాడైపోయి 5 గ్రామ పంచాయతీల పరిధిలోని 800 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామంలో ఇదివరకే ఒక శ్మశానవాటిక ఉంటుండగా, రాజకీయ కారణాలతో రెండో శ్మశానవాటిక ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు నిలుపుదల చేయాలన్నారు. పొందూరు మండలంలోని చాలా గ్రామాల్లో రైతులకు ఎరువులు అందలేదని, సక్రమంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయనతో పాటు పలువురు రైతులు ఉన్నారు. -
ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు
రాయగడ: చంద్ర గ్రహణం కారణంగా ఆదివా రం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో మూసివేసిన మందిరాలు సోమవారం యథావిధిగా తెరుచుకున్నాయి. ముందుగా మందిరా ల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అభిషేకాలు, పూజలు నిర్వహించి న అర్చకులు అనంతరం భక్తులకు స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా స్థానిక బాలాజీనగర్లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు విగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల గ్రౌండ్లో సోమవారం జోనల్ స్థాయిలో వివిధ ఉన్నత విద్యాలయాల క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 12 విద్యాలయాలు, కళాశాలల నుంచి అండర్ 14, అండర్ 17 బాలబాలికలు పోటీపడ్డారు. వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, వివిధ పోటీలకు సుమారు 180 మంది పోటీ పడ్డారు. ఈ క్రీడాంశాలను జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు ఆదేశాల మేరకు నిర్వహించారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి క్రీడా పతాకం ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. జిల్లా ఇన్చార్జి క్రీడా అధికారి సురేంద్ర నాథ్పాత్రో క్రీడాకారులతో శపథం చేయించారు. ఈ పోటీలను ఉపాధ్యాయుడు జగన్నాథ పట్నాయక్, క్రీడా శిక్షకులు ధీరేంద్ర కుమార్ సామల్, ఢీల్లేశ్వర్ తృణ, రాజకిశోర్ పాత్రో, సుదీప్త బారిక్ తదితరులు పర్యవేక్షించారు. నలుగురు వ్యక్తులకు రిమాండ్ ఆమదాలవలస: మండలంలోని చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణకు పట్టణంలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. అయితే పూర్ణను అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరుకుంది. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు కారణమైన భర్త మధుసూదనరావు, మామ లక్ష్మణ, అత్త సరస్వతీ, మరిది ఈశ్వరరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. నలుగురి ముద్దాయిలను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎస్.బాల రాజు పాల్గొన్నారు. గంజాయితో నలుగురు అరెస్టు పలాస: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి నెల్లూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పలాస రైల్వేస్టేషన్లో ఆదివారం నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 6.115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో సోమవారం తెలియజేశారు. దీంతో నెల్లూరు జిల్లా బుజబుజ గ్రామానికి చెందిన సయ్యద్ సుల్తాన్, బి.అరుణకుమార్, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన సాయిక్ జాఫర్, తమిళనాడు రాష్ట్రం అనిస్నగర్కు చెందిన విచిత్రదేవిలపై కేసు నమోదు చేశామన్నా రు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. వీరి నుంచి గంజాయితో పాటు ఒక సెల్ఫోను, రూ.1,020ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా బీజేడీ
భువనేశ్వర్: ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన బి జూ జనతా దళ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా వెలుగొందుతుంది. పలు జాతీయ సంక్లిష్ట పరిస్థితుల్లో భిన్నమైన వ్యూహాలతో తనదైన ఉనికిని చాటుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో తొలి సారిగా విపక్ష హోదాతో సరికొత్త పోకడని చాటుకుంటుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రదర్శించిన వ్యూహాత్మక నిర్ణయం చర్చనీయాంశమైంది. విభిన్న శైలితో సమాన దూరం.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ ఎన్డీయే, ఇండి కూటమి నుంచి సమాన దూరం వ్యూహాన్ని విభిన్నంగా ప్రదర్శించింది. బిజూ జనతా దళ్ 2012లో తొలి సారిగా అనుసరించిన మునుపటి సమదూర విధానం 2022 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విభిన్నంగా ప్రదర్శించింది. 2012లో రాష్ట్రపతి పోటీ కోసం పి.ఎ.సంగ్మా పేరును నవీన్ పట్నాయక్ ప్రకటించి బీజేడీ తరఫున మద్దతు అందించారు. అదే సంవత్సరం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరమై ఎన్డీఏకు చెందిన జస్వంత్ సింగ్, యూపీఏకు చెందిన హమీద్ అన్సారీలో ఏ ఒక్కరికి మద్దతు ప్రకటించ లేదు. 2017లో ఎన్డీఏకు చెందిన రామ్ నాథ్ కోవింద్ను రాష్ట్రపతి గా, యూపీఏకు చెందిన గోపాలకృష్ణ గాంధీని ఉప రాష్ట్రపతిగా మద్దతు ఇవ్వడం ద్వారా బీజేడీ తన వైఖరిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకుంది. తద్వారా రెండు జాతీయ కూటమిల నుంచి సమాన దూరాన్ని వ్యూహాత్మకంగా ప్రదర్శించి ఔరా అనిపించింది. ఆ తర్వాత 2022లో, ఎన్డీఏ అభ్యర్థులైన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్లకు మద్దతు ఇచ్చి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసింది. బీజేడీ వైఖరి స్పష్టమైన మార్పుతో ఊహాతీతంగా స్పందించింది. దీంతో బీజేపీ, బీజేడీ లోపాయికారీ మిత్ర కూటమి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చెలరేగాయి. అయితే ఈ వైఖరి తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైపరీత్యాన్ని ప్రేరేపిస్తాయని కొన్ని వర్గాలు చేసిన వ్యాఖ్య లు 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎదుర్కొన్న ఊహాతీత పరిణామాలు రుజువు చేశాయి. వక్ఫ్ బిల్లును ఆమోదించడంతో మరోసారి బీజేడీ శిబిరంలో తీవ్ర మనస్పర్దలు తలెత్తాయి. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా తాజాగా జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్కు దూరం కావాలని నిర్ణయించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తొలి రాజకీయ వ్యూహ రచనగా రాజకీయ పటిష్టతని ప్రతిబింబిస్తోంది. -
సమస్యలకు పరిష్కారం చూపాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ భుభుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖి పరిపాలన, స్పందన కార్యక్రమం నిర్వహించారు. అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫాల్గుని మఝి, జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, ముఖ్యకార్యనిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్ శంకర్ కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. భుభని పంచాయతీతో సహా సెరంగో, అజయగడ, తుమ్ములో గ్రామాల నుంచి 62 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 18 కాగా, గ్రామ సమస్యలకు సంబంధించినవి 43 ఉన్నాయి. వీటిని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని ఏడీఎం మఝి ఆదేశించారు. గ్రీవెన్స్కు గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండల్, బీడీఓ దులారాం మరాండి, తహసీల్దార్ శరత్ శోబోరో, సీడీఎంఓ డాక్టర్ ఎం.ఎం.ఆలీ, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మాన్యంకొండలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మాన్యంకొండ పంచాయతీలో సోమవారం జిల్లా కలేక్టర్ సోమేశ్ ఉపాధ్యయ్ గ్రీవెన్స్ నిర్వహించారు ప్రజాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధింత అధికారులకు ఆదేశించారు. అనంతరం మాన్యంకొండ పంచాయతీలో పర్యటించి గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవిశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ అశ్ని, కలిమెల బీడీఓ, సహ జిల్లా ఎన్నికల అధికారి ఆశోక్ చక్రవర్తి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ శభరో, పలుశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు నడగాం విద్యార్థి
నరసన్నపేట: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని నడగాం గ్రామానికి చెందిన బొత్స మనోహర్నాథ్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 27 నుంచి 30వ తేదీ వరకూ రాంచీలో యోగా స్పోర్ట్స్ చాంపియన్–2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో మనోహర్నాథ్ పాల్గోనున్నట్లు తండ్రి కేదారనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో ఏపీ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు తిరుమలలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో మనోహర్నాథ్ కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరుపున పాల్గోనున్నట్లు వివరించారు. కాగా తమ గ్రామానికి చెందిన బాలుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామానికి చెందిన నాయకులు లుకలాపు రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. -
బాణం దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి నాయకగూఢ పంచాయతీ పాకనగూఢ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గ్రామస్తుల మధ్య వివాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ గూడ్, విశ్వనాథ్ గూడ్ మధ్య మాటమాటా పెరగడంతో బాణాలతో దాడి చేసుకున్నా రు. ఈ సంఘటనలో లక్ష్మణ్ గూడ్ పొట్టలోకి బాణం దూసుకుపోయింది. దీంతో కుటుంబీకులు వెంటనే అతన్ని పాండ్రీపాణి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ వైద్యులు మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి రిఫ ర్ చేశారు వైద్యులు శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అయితే పరిస్థితి మరింత విషంగా ఉండడంతో అంబులెన్స్లో కోరాపూట్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మల్కన్గిరి పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఐఐసీ రీగాన్కీండో కేసు నమోద్ చేసి బాణంతో దాడి చేసిన విశ్వనాఽథ్ కోసం గాలిస్తున్నారు. -
ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది: గవర్నర్
● కొరాపుట్లో గవర్నర్ పర్యటన ప్రారంభంకొరాపుట్: ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాపై మీడియా ప్రశ్నించగా బదులిచ్చారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో పర్యటిస్తారా అని ప్రశ్నించగా తన పర్యటన కొరాపుట్, మల్కన్గిరి జిల్లాలలో అనుకున్న విధంగా సాగుతుందన్నారు. అనంతరం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కాఫీ బోర్డుని సందర్శించారు. అక్కడ కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ కాఫీ బోర్డు ప్రాముఖ్యత వివరించారు. కాఫీ మొక్కలు, గింజలు, వాతావారణం గవర్నర్ పరిశీలించారు. కొరాపుట్లో పండిన కాఫీ గింజలతో చేసి న కాఫీని ఆస్వాదించి, రుచి అద్భుతంగా ఉందన్నారు. అనంతరం రైతులతో సంభాషించారు. కొరాపుట్ కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకు న్న విషయం కాఫీ బోర్డు ఉన్నతాధికారులు గవర్నర్కి వివరించారు. అంతకు ముందు భువనేశ్వర్ నుంచి జయపూర్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న గవర్నర్కు అధికారులు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన రోడ్డు మార్గాన కొరాపుట్ పట్టణానికి చేరుకున్నారు. సాయంత్రం భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో), హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హల్), కోట్స్, సెంట్రల్ యూనివర్సిటీ, ప్రభుత్వ షహీద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాత్రి ప్రసిద్ధ శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ మందిరాన్ని దర్శించుకున్నారు. పర్యటనలో ఎస్పీ రోహిత్ వర్మ, కొట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సునాబెడా, సిమిలి గుడ, పొట్టంగి సమితుల్లో పర్యటించనున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దేవమాలిని సందర్శిస్తారు. 10న మల్కన్గిరి జిల్లా, 11న తిరిగి కొరాపుట్ జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరగనుంది. -
పీసీసీ సోషల్ మీడియా కమిటీ సభ్యుడిగా అస్లామ్ ఖాన్
రాయగడ: రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా అస్లామ్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కమిటి రాష్ట్ర శాఖ చైర్మన్, గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో కమిటీ సభ్యుల వివరాలను పత్రికలకు సోమవారం విడుదల చేశారు. యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఖాన్కు సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా నియమించడంపై ఆయన అభిమానులు, మద్దతుదారులు అభినందించారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఖాన్ వెల్లడించారు.నాటుసారా కలిగి ఉన్న వ్యక్తి అరెస్టుజయపురం: నాటుసారా కలిగి ఉన్నవ్యక్తిని జయపురం అబ్కారీ సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జయపురం సమితి నీలాగుడ గ్రామానికి చెందిన హరిజన్ అని ఎౖక్సైజ్ అధికారి శశిఽకాంత దత్త సోమవారం వెల్లడించారు. నిందితుడి నుంచి నాటుసారా తో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనతో పాటు సిబ్బంది ఆదివారం రాత్రి పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో సౌరాగుడ మార్గంలో ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా రావడంతో అనుమానించి అతన్ని తనిఖీ చేయగా నాటుసారా బయటపడిందన్నారు. హరిజన్పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచినట్టు పేర్కొన్నారు. బలిజాత్రకు ఇసుక సేకరణ జయపురం: ఆదివాసీ ప్రజలు జరుపుకునే ముఖ్యమైన వ్యవసాయ సంబంధిత పండగ బలిజాత్ర. బలిజాత్ర కోసం బొయిపరిగుడ సమీప చికిటి నాళా (చికిటి నది)లో ఇసుక సేకరించారు. బొయిపరిగుడ సమీప ప్రసిద్ధ బీరఖంభ మందిర పూజారి బలిజాత్ర పూజా కమిటీ సభ్యులు ఇసుక సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చికిటినాళ నుంచి సేకరించిన ఇసుకకు పూజ చేసి తమ గ్రామంలో గల గ్రామ దేవత మందిరంలో బుట్టలో వేసి పూజలు చే స్తామని అనంతరం బుట్లలో ఉన్న ఇసుకను గ్రామస్తులకు పంచుతామని వారు బుట్టలలో గల ఇసుకలో వివిద రకాల విత్తనాలు చల్లి దేవ త గుడిలో ఉంచుతారని అర్చకులు తెలిపారు. ఈ నెల 12న బలిజాత్ర జరుగుతుందని తెలిపారు. ఘనంగా హనుమాన్ మందిర వార్షికోత్సవం జయపురం: జయపురం లింగరాజనగర్లో ఆ ప్రాంత ప్రజలచే స్థాపించబడిన శ్రీరుద్రవీర హనుమాన్ మందిర నాలుగో వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో బాబూ బాయ్ భజరంగ్ బృందం పాల్గొని 108 హనుమాన్ చాలీశా భక్తులకు వినిపించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ చాలీశా విని తరించారు. ఈ సందర్భంగా నిరుపేద బ్రాహ్మణ పిల్లలకు ఉచితంగా ఉపనయనం జరిగింది. అలాగనే రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మందిర కమిటీ అధ్యక్షులు చిత్తరంజన్ పండ, కోఆర్డినేటర్ బిజయరాయ్ జెనాదేవ్, ఆలయ ట్రస్టీ విప్రచరణ నాయిక్, రాం ప్రసాద్ పట్నాయక్, శ్యామఘణ మహాపాత్రో, జితేంద్ర పాణిగ్రహి, ప్రమోద్ కుమార్ జైన్, అజిత్ దాస్ పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. -
గుణుపూర్లో చోరీ
● రూ. ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం అపహరణరాయగడ: జిల్లాలోని గుణుపూర్ బృందావతి కాలనీలో నివసిస్తున్న ఆకాష్ కుమార్ పొరొచ్ఛా ఇంట్లో చోరీ జరిగింది. ఆకాష్ కుమార్ ఆరు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి బయట తాళాలను విరగ్గొట్టిన దుండగులు లోనికి చొరబడి అలమరలో ఉంచిన ఒకలక్ష రూపాయల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలతోపాటు కొంత వెండి ఆభరణాలను దొంగిలించారు. దీనిపై బాధితుడు గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలానికి క్లూస్ బృందంతో చేరుకుని దొంగల ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని రైతు దుర్మరణం
జయపురం: జయపురం సమితి బి.సింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి టింగిరిపుట్ గ్రామంలో మోటార్ సైకిల్ ఢీకొని రైతు దుర్మరణం చెందాడు. మరణించిన రైతు టింగిరిపుట్ గ్రామానికి చెందిన బలరాం నాయిక్ (50)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం బలరాం నాయిక్ గ్రామ సమీపంలోని పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లడు. బాగా పొద్దుపోయిన తరువాత బలరాం ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తులు అతన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బలరాం తలకు బలమైన గాయమైంది. కదల్లేని స్థితిలో రోడ్డుపై పడ్డాడు. బైక్పై వస్తున్న రుకదర నాయిక్, ఉమా పొరజ, గోపాల్లు బైక్తో పాటు పంట పొలంలో పడిపోయారు. ఆ ప్రమాదాన్ని చూసిన ఆ ప్రాంతంలో ఉన్న వారు సంఘటనా ప్రాంతానికి వచ్చి బలరాం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బలరాంను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ బలరాం అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ప్రమాదంపై బి.సింగపూర్ పోలీసులకు మృతుని కుటుంబ సభ్యులు లిఖిత ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బైక్పై వస్తున్న ముగ్గురు మద్యం తాగి ఉన్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బైక్ను సీజ్ చేశారు. -
నువాపడా ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా కన్నుమూత
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలో ప్రముఖ రాజకీయ నాయకునిగా వెలుగొందిన రాజేంద్ర ఢొలొకియా (68) కన్ను మూశారు. మూత్రపిండాల సంబంధిత అనారోగ్యంతో చైన్నెలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చర ణ్ మాఝి, విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్య క్షుడు నవీన్ పట్నాయక్, ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. శాసన సభ ముంగిట అంతిమ దర్శనం చైన్నె ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన రాజేంద్ర ఢొలొకియా భౌతిక కాయాన్ని ఆకాశ మార్గంలో తరలించి రాష్ట్ర శాసన సభ ముంగిటకు మంగళవారం చేర్చనున్నారు. ఈ సందర్భంగా తోటి సభ్యులు, నాయకులు, సహచరులు, ఇతర ప్రముఖులు, అధికారులు అంతిమ దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వతంత్ర పోరాటం రాజేంద్ర ఢొలొకియా వరుసగా 4 సార్లు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. పశ్చిమ ఒడిశా నువాపడా నియోజక వర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహించారు. బిజూ జనతా దళ్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం శ్రీకారం చుట్టడం విశేషం. ఇటీవల ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి 61,822 ఓట్లతో విజయం సాధించి రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన 2004 నుంచి 2009 వరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కొనసాగారు. తదుపరి బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 2 సార్లు జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. 2009 నుంచి 2014, 2019 నుంచి 2024 వరకు నువాపడా నియోజక వర్గం నుంచి బిజూ జనతా దళ్ సభ్యునిగా కొనసాగారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయన బిజూ జనతా దళ్ టికెట్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1956 నవంబర్ 20న జన్మించిన రాజేంద్ర ఢొలొకియా తన రాజకీయ జీవితాన్ని స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో తొలి విజయం సాధించి రాష్ట్ర శాసన సభలో మొట్టమొదటి సారి అడుగిడారు. తర్వాత ఆయన బీజేడీలో చేరి 2009, 2019 2024లో మరో మూడు వరుస విజయాలు సాధించి పశ్చిమ ఒడిశా నుంచి కీలక నాయకుడిగా ఎదిగారు. -
జయపురంలో ఆపరేషన్ ప్రహార్
జయపురం: గుట్కా, గంజాయి, టొబాకో తదితర మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసు అధికారులు చేపట్టిన ఆపరేషన్ ప్రహార్ జయపురంలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాలు, ధర్మ సంస్థల పరిసరాల్లో గుట్కా, టొబాకో తదితర వస్తువులు విక్రయించే దుకాణాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్లో గుట్కా, పొగాకుతో తయారు చేసే వస్తువులు అమ్మితే వ్యాపారులపై ఆపరేషన్ ప్రహార్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ తెలిపారు. -
55 మంది మాస్టర్ శిక్షకులకు ప్రశంసా పత్రాలు
పర్లాకిమిడి: స్థానిక జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (డైట్)లో జిల్లా స్థాయి ఆదికర్మయోగి శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి జిల్లా సమగ్ర గిరిజనాభివృధ్ధి శాఖ పీఓ అంశుమన్ మహాపాత్రో అధ్యక్షతన జరగ్గా జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వహణాధికారి పృథ్వీరాజ్ మండల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మాన్ రైకా తదితరులు పాల్గొన్నారు. వారంరోజులుగా జరిగిన ఆదికర్మయోగి శిక్షణ శిబిరంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశువికాస్, పంచాయితీరాజ్, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులకు బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. 2036 కల్లా వికసిత్ ఒడిషా, 2047 కల్లా వికసిత భారత్ అనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీఓ సంస్థలు కలసి పనిచేయాలన్న లక్ష్యంతో ముందుకుపోవాలని ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో అన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా ఏడు సమితి కేంద్రాల నుంచి 55 మంది సమితి మాస్టర్ ట్రైనర్లుగా నియమించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా అనేకమంది మాస్టర్ శిక్షకులకు సర్టిఫికెట్లను నోడల్ అధికారి అంశుమాన్ మహాపాత్రో ప్రదానం చేశారు.