breaking news
National
-
మరో ‘అమృత్ భారత్’కు పచ్చజెండా.. ఎక్కడి నుంచి? సమయాలేమిటి?
న్యూఢిల్లీ: దేశంలో నేటి(శుక్రవారం) నుంచి మరో అమృత్ భారత్ రైలు పరుగులు తీయనుంది. బీహార్లోని సీతామర్హిని ఢిల్లీకి అనుసంధానించే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు బీహార్లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే మధ్యతరగతి వర్గానికి ఆధునిక రైల్వే సేవల అనుభవాన్ని అందించనుంది.సీతామర్హి-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీతామర్హిలోని పునౌరా ధామ్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు 20 గంటల 45 నిమిషాల్లో దాదాపు 1,100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగుల తీయగలదు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది.ఇది శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి, ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతామర్హి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 10.15 గంటలకు సీతామర్హి నుండి బయలుదేరి, సోమవారం రాత్రి 10.40 గంటలకు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు 13 స్టాప్లున్నాయి. అవి ఘజియాబాద్, తుండ్ల, కాన్పూర్, లక్నో, గోండా, బస్తీ, గోరఖ్పూర్, కప్తాన్గంజ్, సిస్వా బజార్, బాగహా, సిక్తా, నర్కటియాగంజ్, రక్సౌల్ బైర్గానియా. -
తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025 -
Tamil Nadu: పొత్తుతో 50 సీట్లలో బీజేపీ పోటీ? ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు వ్యూహం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే వివిధ పార్టీలు ఉత్సాహంగా, తమ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకేలో పొత్తులో భాగంగా 50కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తోందని సమాచారం.2021 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 20 సీట్ల కంటే ఇది గణనీయమైన పెరుగుదల. నాడు బీజేపీ తమిళనాడులో కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై అటు బీజేపీ లేదా ఇటు ఏఐడీఎంకే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు బీజేపీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టడం చూస్తుంటే భవిష్యత్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోందని తెలుస్తోంది.ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ నాయకత్వం, అన్నాడీఎంకే రాష్ట్ర నాయకత్వంతో ఒకవేళ బీజేపీ కూటమి గెలిస్తే, ప్రభుత్వంలో కీలకంగా చేరాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నటుడు విజయ్ తన తమిళగా ‘వెట్రీ కజగం’తో రాజకీయాల్లోకి ప్రవేశించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో 2026 ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో అన్నాడీఎంకే ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని ప్రకటించారు.అయితే బీజేపీ ప్రతిష్టాత్మక సీట్ల డిమాండ్కు ఏఐడీఎంకే అంగీకరిస్తుందా ? అనేది ఇప్పడు ప్రశ్నగా మారింది. మరోవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. విజయ్ ‘తమిళగా వెట్రీ కజగం’ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఏఐడీఎంకే నంబర్ టూ పార్టీ అని సర్వేలు పలు చెబుతున్నాయి. ‘ఓట్ వైబ్ సర్వే’.. డిఎంకే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని, 2026 లో తిరిగి అధికారంలోకి రావచ్చని పేర్కొంది. 2021లో 234 సభ్యుల అసెంబ్లీలో డీఎంకె 159 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. -
ట్రంప్కు కంబోడియా మద్దతు.. అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబు
న్యూఢిల్లీ:ప్రపంచంలోని పలు దేశాలపై ఇష్టమొచ్చిన రీతిలో సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి భిన్నంగా కంబోడియా ట్రంప్కు మద్దతు పలుకుతోంది. పైగా ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబిచ్చింది. దీనివెనుక ప్రత్యేక కారణముంది.పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కంబోడియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా తాను ప్రపంచ శాంతిదూతను అని చెప్పుకుంటూ నోబెల్కు అర్హుడనని అంటున్నారు. ఇస్లామాబాద్, టెల్ అవీవ్ ఇప్పుడు కంబోడియాలోని మిత్రదేశాలు ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటూ ఒకే స్వరాన్ని ఆలపిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కంబోడియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. దీనితో నోబెల్ శాంతి బహుమతి డిమాండ్కు మద్దతు ఇస్తున్న మూడవ దేశంగా కంబోడియా నిలిచింది.ఈ అంశంపై కంబోడియా ప్రధాని హున్ మానెట్ మాట్లాడుతూ తాము ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నామని, కంబోడియా- థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదాన్ని నియంత్రించడంలో ఆయన అసాధారణ రాజనీతిజ్ఞతను చూపారని ప్రశంసించారు. అలాగే తమ దేశంపై సుంకాన్ని 49 శాతం నుంచి 19 శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్బుక్ పోస్ట్లో హున్ మానెట్ ఈ ప్రకటన చేశారు. ట్రంప్ జోక్యం అనేది ప్రపంచంలోని అత్యంత అస్థిర ప్రాంతాలలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, దోహదపడుతున్నదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఆయన పేరును పంపినట్లు పేర్కొన్నారు. జూలై 26న ట్రంప్ పిలుపు కారణంగా థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధ ప్రతిష్టంభన తొలగిందని, జూలై 28న కాల్పుల విరమణ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ ఘర్షణల్లో 43 మంది మృతిచెందగా, మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణలతో సహా ఆరు వివాదాలకు ట్రంప్ ముగింపు పలికేలా చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల అన్నారు. -
భారత్కు మరో షాకిచ్చిన ట్రంప్.. మోదీ కీలక భేటీ!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసి అదనపు సుంకాలు విధిస్తున్నారు. ఇక, తాజాగా భారత్ సుంకాలపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో భారత్తో చర్చలకు తాను సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. దీంతో, భారత్కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఇదిలా ఉండగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.#WATCH | Responding to ANI's question, 'Just to follow up India's tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?', US President Donald Trump says, "No, not until we get it resolved."(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd— ANI (@ANI) August 7, 2025ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Prime Minister Narendra Modi will chair a high-level Cabinet meeting at 1 pm on Friday to review the impact of the recent tariff hike imposed by the United States on Indian exports.— indian DOTS (@AMEERALIHU1807) August 8, 2025అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన..మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. -
రాఖీ అంటే ఈ రాష్ట్రాల్లోని మగువలదే..
న్యూఢిల్లీ: ఆగస్టు 9, శనివారం.. భారతదేశం అంతటా రక్షా బంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు ఆనందంగా రాఖీలు కట్టి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రాఖీని మరింత వేడుకగా చేసుకునేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించాయి.రాఖీ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మహిళలకు ఒక రోజు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మగువల కోసం ఫ్రీ బస్సులను నడుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆగస్టు 9న రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. కాగా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఏడాది పొడవునా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 8న ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు మహిళలకు యూపీఎస్ఆర్టీసీ, సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. పండుగ రద్దీని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. మహిళలు, పిల్లలకు హర్యానా ప్రభుత్వం ఆగస్టు 8 మధ్యాహ్నం నుండి ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించింది. ఢిల్లీ, చండీగఢ్లకు వెళ్లే అంతర్-రాష్ట్ర సర్వీసులలోనూ ఈ ఉచిత ప్రయాణం ఉంటుందని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆగస్టు 9, 10 తేదీల్లో రాష్ట్ర బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్షా బంధన్ రోజున రాజస్థాన్ ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్లలో ఆగస్టు 9న మహిళలకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మహిళలకు, పిల్లలకు రక్షాబంధన్ రోజున ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. -
‘బ్లూబర్డ్’ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం
సూళ్లూరుపేట: బాహుబలి రాకెట్గా పేరు గాంచిన ఇస్రో వారి ఎల్వీఎం3 మార్క్–5 రాకెట్ ద్వారా 6,500 కేజీల అత్యంత బరువైన బ్లూ బర్డ్ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. షార్లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. బ్లూబర్డ్ త్వరలోనే అమెరికా నుంచి భారత్కు చేరుకోనుంది. షార్ చరిత్రలో ఇది భారీ ప్రయోగమనే చెప్పాలి. బ్లూబర్డ్ ప్రత్యేకతలివీ.. ఇది అమెరికన్ కమ్యూనికేషన్ ఉప గ్రహం. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్ నుంచి పని చేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన వినూత్నమైన యాంటెన్నా ఉంటుంది. ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్కు ఇది ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ వినియోగదారులు భూమిపైని టవర్లపై ఆధారఫడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 ఎంహెచ్జడ్ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది 120 ఎంబీపీఎస్ వరకు గరిష్ట ట్రాన్స్మిషన్ వేగాన్ని అందిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యూలార్ బ్రాండ్బ్యాండ్ సేవలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు. -
రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును బాధితులకు ఈడీ అందజేసింది
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్ఎల్పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు. -
ఉత్తరకాశీ వరదల్లో 50 మంది గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాల్లో గురువారం మూడో రోజు సహాయక చర్యలు కొనసాగాయి. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 70 మందిని కాపాడామని, మరో 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆర్మీ తెలిపింది. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి, 8 మంది జవాన్లు ఉన్నారంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుబడి పోయిన 65 మందిని హెలికాప్టర్ల ద్వారా మాట్లి పట్టణానికి తరలించామని వివరించింది. తీవ్రంగా ప్రభావితమైన ధరాలి గ్రామంలో బురద మట్టి, రాళ్ల కింద ఇరుక్కుపోయిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాధన సంపత్తిని విమానం ద్వారా తరలించినట్లు తెలిపింది. సహాయక చర్యల్లో ఇంజినీర్లు, వైద్య బృందాలు, నిపుణులతో కూడిన 225 బలగాలతోపాటు రెస్క్యూడాగ్స్ పాల్గొంటున్నాయన్నారు. వాతావరణం మెరుగుపడినట్లయితే పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యాధునిక చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను డెహ్రాడూన్లో సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు. -
ఎస్ఐఆర్పై ఆగని ఆందోళన
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్ఐఆర్పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ఎస్ఐఆర్పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు. -
రహదారి విస్తరణకు కేంద్రం ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు.. మాస్టర్ ప్లాన్ ఆధారంగా లింక్ రోడ్ల నిర్మాణం అవసరమవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో నివాసితులు.. మున్సిపల్ కార్పొరేషన్లను లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలంటూ కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అయితే పట్టణ ప్రణాళిక బాధ్యత రాష్ట్రాలకే ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు గురువారం లోక్సభలో బీజేపీ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.రాష్ట్రాల సహాయార్థంగా కేంద్రం అమృత్ పథకం ద్వారా పలు పట్టణాల్లో ఏఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 461 పట్టణాల్లో ఈ పనులు చేపట్టగా, తెలంగాణలో 12 నగరాల్లో ఏఐ డేటాబేస్ సిద్ధమవగా.. వాటిలో 10 మాస్టర్ ప్లాన్లు రూపుదిద్దుకున్నాయి. కాగా, ఇప్పటి వరకు కేవలం మూడు మాస్టర్ ప్లాన్లకే అధికారిక అనుమతి లభించిందని వెల్లడించారు. అమృత్ 2.0 లో రెండో స్థాయి పట్టణాలు (జనాభా 50,000 నుంచి 99,999 మధ్య) కూడా మాస్టర్ ప్లాన్ల పరిధిలోకి వచ్చాయి.అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పట్టణం కోసం కూడా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదని కేంద్ర మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా లింక్ రోడ్ల నిర్మాణం కీలకమవుతుందని, అందుకు ప్రణాళికల దశ నుంచే సమగ్రంగా ముందుకు సాగాలని సూచించారు. ‘వికసిత భారత్ – 2047‘ లక్ష్యంతో పట్టణాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్టు మంత్రి స్పష్టం చేశారు. -
త్వరలో భారత్కు పుతిన్ రాక
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ గురువారం తెలిపారు. పుతిన్ ఆగస్ట్ ఆఖర్లో పర్యటించే అవకాశముందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. పర్యటన తేదీలు, సమయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. పర్యటన ఈ ఏడాది చివర్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్ పర్యటన అంశం తెరపైకి రావడం గమనార్హం. పుతిన్ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నెరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది. సరిగ్గా, ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్–రష్యాల మైత్రీ బంధం ఎంత బలమైందో చెప్పకనే చెబుతోంది. రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిందించడం, టారిఫ్ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ఏ ధోవల్ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్ స్పుతి్నక్ న్యూస్తో మాట్లాడారు. భారత్–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్ వివరించారు. ‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు. -
ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి ఫోన్
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి. -
ట్రంప్ టారిఫ్ దండయాత్ర ఆగదా?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న దేశాలపై టారిఫ్ క్షిపణుల్ని ప్రయోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమ్ముల పొదిని మరింతగా వాడబోతున్నారా?. గురువారం అధ్యక్షభవనం శ్వేతసౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానాలను చూస్తే అమెరికా టారిఫ్ల మోత ఇప్పట్లో ఆగేలా లేదని స్పష్టమవుతోంది. మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న ట్రంప్ను విలేఖరులు భారత్ సంబంధిత ప్రశ్న సంధించారు. ‘‘ రష్యాతో ఎన్నో దేశాలు ముడిచమురు వాణిజ్యం చేస్తోంటే కేవలం భారత్ను మీరు లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ మోపారు. రష్యాతో చైనా సైతం ఇదే తరహా వాణిజ్యంచేస్తోంది. మరి చైనాపైనా టారిఫ్ మరోసారి పెంచుతారా?’’ అని ప్రశ్నించగా ట్రంప్ సంచలన విషయం చెప్పారు. ‘‘ భారత్పై రెండో దఫా టారిఫ్లు పెంచి కేవలం 8 గంటలే గడిచాయి. అప్పుడే ఏం అయిపోయింది? మున్ముందు ఏం జరగబోతోందో మీరే చూస్తారుగా. పరోక్ష ఆంక్షలపర్వంలో భాగంగా రెండో దఫాలో మరింతగా టారిఫ్ను పెంచబోతున్నాం’’ అంటూ చైనాకు టారి‹ఫ్ వేడి తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పారు. గత కొన్నేళ్లుగా చైనాతో వైరం ముదరడంతో భారత్తో అమెరికా సత్సంబంధాలను పటిష్టంచేసుకోగా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మైత్రీబంధం కీలకమలుపు తీసుకుంది. రష్యాకు భారత్ వంటి దేశాలు కీలక వాణిజ్యభాగస్వాములుగా కొనసాగుతున్న తరుణంలో ఈ దేశాలపై సుంకాల కత్తి వేలాడదీసి రష్యాను ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించాలని అమెరికా యతి్నస్తోంది. ఇందులోభాగంగా భారత్పై మరో పాతిక శాతం టారిఫ్ను విధించడం తెల్సిందే. అమల్లోకి నూతన టారిఫ్ 60కిపైగా దేశాలపై ట్రంప్ మోపిన కొత్త టారిఫ్లు గురువారం అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా బ్రెజిల్, భారత్పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. సిరియా(41 శాతం), లావోస్(40), మయన్మార్ (40), స్విట్జర్లాండ్(39), ఇరాక్(35), కెనడా(35), సెర్బియా(35), బోస్నియా హెర్జ్గోవినా(30), లిబియా(30), దక్షిణాఫ్రికా(30), మెక్సికో(25), బంగ్లాదేశ్(20), శ్రీలంక(20), తైవాన్(20), వియత్నాం(20), కాంబోడియా(19), పాకిస్తాన్(19శాతం)పై విధించిన అదనపు సుంకాలు గురువారం అమల్లోకి వచ్చాయి. తమకు మిత్రులుగా ఉన్న జపాన్, దక్షిణకొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కేవలం 15 శాతం సుంకాలు ట్రంప్ విధించారు. బ్రిటన్పై కేవలం 10 శాతం టారిఫ్లు విధించారు. -
AI తో హోమ్వర్క్ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!!
సాక్షి, స్పెషల్ డెస్క్: హోమ్వర్క్లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ గురించే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీ స్టడీ మోడ్ను, గూగుల్ జెమినై గైడెడ్ లెర్నింగ్ టూల్ను ప్రారంభించి చాట్బాట్ను వ్యక్తిగత ట్యూటర్గా మార్చేశాయి. ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వంటి భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్స్ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్లోని ఎడ్టెక్ సంస్థలు, సంప్రదాయ కోచింగ్ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.గైడెడ్ లెర్నింగ్ ఇలా..అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్ లెర్నింగ్ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్లను ఉపయోగించి స్పందిస్తుంది. సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్ లెర్నింగ్ను రూపొందించినట్టు గూగుల్ తెలిపింది.» ‘హోమ్వర్క్ హెల్ప్’ ద్వారా విద్యార్థుల హోమ్వర్క్లను.. స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడమే.» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్లోడ్ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్గా, ఒక ప్రాక్టీస్ టెస్ట్గా,పాడ్కాస్ట్గా కూడా చేసి మన ముందు పెడుతుంది.» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్ వివరించింది.» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్క్లాస్రూమ్లో పోస్ట్ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.ఇంటర్నెట్ వచ్చాక సంప్రదాయ గైడ్స్కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్టెక్ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్ గైడెడ్ లెర్నింగ్, ఓపెన్ ఏఐ స్టడీ మోడ్ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.‘విద్యార్థులకు లాభదాయకమే’నిజానికి ఏఐ చాట్బాట్లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్ లెర్నింగ్ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్బాట్లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.ఇదీ ‘స్టడీ మోడ్’దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్లో చాట్ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత. ఏదైనా టాపిక్ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్బాట్ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది. » ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది. » వాయిస్, ఇమేజ్, టెక్స్›్టను సపోర్ట్ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్ అందుబాటులో ఉంది.కొన్ని సందేహాలుతమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్ ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.» విద్యార్థులు చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. » ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు. -
మృత్యు మేఘం..‘విస్ఫోట’ విలయం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్లోనూ చూశాం.ముందే చెప్పలేరా?వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు. 10 సెం.మీ. వర్షపాతంఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. కేదార్నాథ్ విలయంక్లౌడ్బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు. అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘చార్ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్లోని బార్కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. » పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.» 2021 అక్టోబర్లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత ప్రధాని మోదీదే
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. గురువారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన బీజేపీ, మిత్ర పక్షాల నేతల భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు జేడీయూ నుంచి లలన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి ఎల్. దేవరాయలు, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, ఇంకా అనుప్రియా పటేల్, ఉపేంద్ర కుష్వాహా, ఏఐఏడీఎంకే తదితర ఇతర చిన్న పార్టీల నేతలు సైతం పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బలపర్చాలనే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ నెల 12వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్ఏడీ పక్షాల మధ్య సమన్వయం కొనసాగింపుపై ఈ సమావేశం చర్చించిందన్నారు. -
రైతుల ప్రయోజనాలపై రాజీపడం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. తమ రైతన్నల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మత్స్య, పాడి పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. దేశీయంగా వ్యవసాయ, పాడి రంగాలకు నష్టం చేకూర్చే నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని స్పష్టంచేశారు. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గబోమని, తమపై టారిఫ్ బెదిరింపులు పనిచేయబోవని పరోక్షంగా వెల్లడించారు. అవసరమైతే వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్నదాతలతోపాటు మత్స్యకారులు, పాడి రైతులు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వారికి మేలు చేసే విషయంలో వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తనకు తెలుసని, అందుకు సిద్ధంగానే ఉన్నానని వివరించారు. మన వాళ్ల బాగుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ స్మారక నాణెం, తపాలా బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... పౌష్టికాహార భద్రత సాధించాలి ‘‘దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పౌష్టికాహార భద్రత సాధించడం అత్యవవసరం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయాలి. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచాలి. కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వరదలను తట్టుకొని అధిక ఉత్పాదకత ఇచ్చే వంగడాలను కృత్రిమ మేధ(ఏఐ), మెíషీన్ లెర్నింగ్తో రూపొందించాలి. పంటల ఉత్పత్తిని ముందుగానే అంచనా వేయడానికి, తెగుళ్లను గుర్తించడానికి, రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రియల్–టైమ్ వ్యవస్థలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలి. పంటల మారి్పడిపై పరిశోధనలు మరింత ఊపందుకోవాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు సాగు చేయాలో గుర్తించాలి. మట్టి పరీక్షల కోసం చౌక ధరల్లో దొరికే పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మోదీ అన్నారు.పథకాలతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం ‘‘దేశ ప్రగతికి పునాది రైతుల ప్రగతే. రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం–కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కృషి సించాయ్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన, పీఎం ధన్ ధాన్య యోజన వంటివాటిని వ్యవసాయం, అనుబంధాల రంగాల సమగ్రాభివృద్ధి కోసమే తీసుకొచ్చాం. 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేశాం. ఆయా పథకాలతో కేవలం ఆర్థిక తోడ్పాటే కాకుండా, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారి కోసం నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నాం. సహకార సంఘాలకు, స్వయం సహాయక గ్రూప్లకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది. పంటల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు అదే సమయంలో పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎం.ఎస్. స్వామినాథన్ పదేపదే సూచించారు. ఆయన నిర్దేశించిన బాటలో మనం నడవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ సౌమ్య స్వామినాథన్ పాల్గొన్నారు. మోదీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో చేనేత రంగం ప్రగతి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. 2,600 ఎగ్జిబిషన్ల ద్వారా 43 లక్షల మంది చేనేత కారి్మకులు, అనుబంధ కార్మికులకు నేరుగా మార్కెట్ సౌలభ్యం లభించిందని, రూ.1,700 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. 20కిపైగా దేశాలకు మన చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, వాటి విలువ రూ.21,000 కోట్లకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. మన సంప్రదాయ చేనేత కళ, వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్రెడ్డి హైదరాబాద్కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
స్కూటీ నడిపి.. చిక్కుల్లో పడ్డ డీకే.. అసలేంటీ వివాదం?
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం ఆయన హెబ్బాళ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తేలింది. ఆ స్కూటీని డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతలు సైతం ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దుమ్మెతిపోశారు...దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియో కొద్దిసేపటికే వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటిపై ఇప్పటికే 34 చలాన్లు ఉన్నట్లు తేల్చారు. డీసీఎం నడిపిన స్కూటీపై (నంబర్ KA 04 JZ 2087) పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ స్కూటీపై ట్రాఫిక్ పోలీసులు 34కి పైగా జరిమానాలు విధించగా.. రూ.18,500 వరకూ చెల్లించాల్సి ఉంది.The Hebbal flyover loop is set to open, easing traffic congestion and ensuring smoother and faster commutes as part of our government's commitment to building a better Bengaluru.#HebbalFlyover pic.twitter.com/HotJ61mUpx— DK Shivakumar (@DKShivakumar) August 5, 2025డీకే శివకుమార్ వీడియోపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. ప్రతిపక్షాలు.. డీకేపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్లతో హోరెత్తిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పబ్లిసిటీ కోసం రీల్స్పై దృష్టి పెట్టకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటూ ప్రతిపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. -
మరోసారి కపిల్ శర్మ కేఫ్పై కాల్పుల కలకలం
ఒట్టావా: ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కేఫ్పై మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెనడాలోని సర్రీలో ఉన్న ఈ ‘కాప్స్ కేఫ్’పై నిందితులు కాల్పులకు తెగబడ్డారు. అయితే,ఈ దాడికి పాల్పడింది తామేనని గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్,లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా ప్రకటించింది. ఈ కాల్పుల సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాప్స్ కేఫ్పై నిందితులు సుమారు 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపే సమయంలో.. నిందితులు సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘మేం మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశాం. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టే ఈ దాడికి తెగబడ్డాం.. ఇప్పుడు కూడా మా హెచ్చరికల్ని పట్టించుకోకపోతే.. మరో దాడి ముంబైలో జరుగుతుంది’ అని హెచ్చరించడాన్ని గమనించొచ్చు.సంభాషణ ఆధారంగా.. నిందితులు కపిల్ శర్మను కలిసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు ఏ విధంగా కపిల్ శర్మను సంప్రదించే ప్రయత్నం చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కపిల్ శర్మకు బెదిరింపులతో ముంబై పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు అప్రమత్తయ్యాయి. కాగా,కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన కాప్స్ కేఫ్పై తొలిదాడి గత జులై నెలలో జరిగింది. సిబ్బంది లోపల ఉండగానే జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం మాత్రం జరిగింది. తానే కాల్పులు జరిపానని ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్సింగ్ లద్ధీ ప్రకటించాడు. కపిల్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై అసంతృప్తితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
‘కబూతర్ ఖానా’ మూసివేతపై కన్నెర్ర.. ఏం జరిగింది?
ముంబై: దాదర్లోని ప్రముఖ కబూతర్ ఖానా మూసివేత వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కబూతర్ ఖానాను మూసివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై ముంబైకర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పావురాలకు దాణా వేయవద్దని బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా దాణా వేసే ప్రయత్నం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు కబూతర్ ఖానాపై పావురాలు వచ్చి వాలకుండా, పక్షుల ప్రేమికులు దాణా వేయకుండా ప్లాస్టిక్ షీట్ను కప్పారు. దీంతో కబూతర్ ఖానాకు ఎదురుగా ఉన్న జైన్ మందిరానికి వచ్చే భక్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన జైన్ సమాజం ప్రజలు ప్లాస్టిక్ షీట్ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.బీఎంసీ అధికారులు, సిబ్బంది, పావురాలకు దాణా వేయకుండా కాపలా కాస్తున్న పోలీసులు, జైన్ సమాజం ప్రజల మధ్య కొద్దిసేవు వాగ్వాదం నెలకొంది. కబూతర్ ఖానాను మూసివేయవద్దంటూ సాధారణ ప్రజలు, జైన్ వర్గం ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదర్ రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కబూతర్ ఖానా (Kabutar khana) చుట్టూ తిరిగి వచ్చే వాహనాలు కూడా ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయం విధులకు వెళ్లే వివిధ రంగాల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బాంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశాల మేరకే కబూతర్ ఖానాను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ వీరంతా ఆందోళనను ఆపలేదు. దీంతో కబూతర్ ఖానాను మూసియబోమని బీఎంసీ అధికారులు తాత్కాలికంగా ప్రకటించడంతో ఆందోళన విరమించారు. హైకోర్టు నిర్ణయం మేరకే మూసివేత: బీఎంసీముంబై నడిబొడ్డున ఉన్న దాదర్ ప్రాంతంలో కబూతర్ ఖానా ఉంది. దాదర్లో పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే, అక్కడి నుంచి సీఎస్ఎంటీ దిశగా వెళ్లే మెయిల్, ఎక్స్ప్రెస్, వందేభారత్, దురంతో వంటి ఆధునిక రైళ్లు ఆగుతాయి. అదేవిధంగా దాదర్ వివిధ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికులు, షాపింగ్లకు వచ్చే జనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. దాదర్ పశ్చిమ దిశలో సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన కబూతర్ ఖానా రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సుమారు వంద రెట్లు వాహనాలు, జనాల సంఖ్య పెరిగింది.ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందిముఖ్యంగా ఈ కబూతర్ ఖానావల్ల రాకపోకలు సాగించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పావురాలకు వేస్తున్న దాణా కుళ్లిపోవడం, వాటి రెట్టల వల్ల పరిసరాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటి శరీరంలో ఉన్న సుక్ష్మజీవులవల్ల ప్రజల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. రెట్టల వల్ల ఉత్పన్నమయ్యే సూక్ష్మజీవులతో వివిధ రకాల తీవ్ర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వివాదం ముంబై హైకోర్టు వరకు వెళ్లింది. దీంతో ఇటీవల జరిగిన విచారణలో మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడే అధికారం ఎవరికి లేదని, దాదర్తోపాటు ఉప నగరాల్లో ఉన్న కబూతర్ ఖానాలన్నీ మూసి వేయాలని ఇటీవలి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది.ఈ మేరకు పావురాలకు దాణా వేయకూడదని, ఒకవేళ వేస్తే చర్యలు తీసుకుంటామని బీఎంసీ (BMC) హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో బోర్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. బందోబస్తుకోసం పోలీసులను ఏర్పాటుచేసింది. అంతటితో ఊరుకోకుండా కబూతర్ ఖానా చుట్టూ ఆధునిక సీసీ టీవీ కెమరాలు ఏర్పాటు చేసింది. మూసివేసే ప్రయత్నంలో భాగంగా కబూతర్ఖానా చుట్టు ప్లాస్టిక్ షీట్ కప్పడంతో పక్షి ప్రేమికులు, సాధారణ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళన చేపట్టారు. మూసివేయబోమని తాత్కాలికంగా బీఎంసీ అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు.చదవండి: ఆటోలో రెండు రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం! -
‘ఓట్ చోరీ’ కామెంట్స్లో ట్విస్ట్.. తప్పని తేలితే రాహుల్ గాంధీకి శిక్ష
సాక్షి,బెంగళూరు: బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓట్ చోర్ పేరుతో గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్ఘతం చేశారు. అయితే రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవి తెలిపింది. ఎన్నికల సంబంధించిన అంశాలను న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.అదే సమయంలో రాహుల్ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరింది. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించింది. The Chief Electoral Officer of Karnataka confirmed a meeting with the INC delegation on August 8. In response to Rahul Gandhi’s remarks on alleged irregularities in the voter rolls, the CEO stated that electoral rolls were transparently shared in Nov 2024 and Jan 2025. No… pic.twitter.com/gRfO8Eq3Nd— IANS (@ians_india) August 7, 2025 ఆ నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు.. ఆధారాలివే ‘సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఫలితాలు తారుమారువడంపై మాకు అనుమానం వచ్చింది. గతేడాది 48 మహారాష్ట్ర లోక్సభ స్థానాల్లో సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును ఎందుకు దాటలేకపోయింది.మహరాష్ట్ర,కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసమే ఈసీ పనిచేసింది. అందుకు మా వద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయి. మేం అంతర్గతం చేపట్టిన సర్వేలో కర్ణాటకలో ఇండియా కూటమి 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది. కానీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఓడిపోయిన ఏడు స్థానాలపై దృష్టి సారించాం. అలా బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ స్థానమైన మహదేవపురలో ఓటమికి గల కారణాల్ని అన్వేషించాం. బెంగళూరు సెంట్రల్ లోక్సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి 6,58,915 ఓట్లు పోలవ్వగా.. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. ఇదే బెంగళూరు సెంట్రల్ లోక్సభలో మహదేవపుర అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే.. ఓట్ల చోరీ జరిగినట్లు గుర్తించాం. మహదేవపురలో కాంగ్రెస్కు 1,15,586 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ 2,29,632 ఓట్లు పోలయ్యాయి. బెంగళూరు సెంట్రల్లో సర్వజ్ఞనగర్,సీవీ రామ్ నగర్,శివాజీ నగర్,శాంతీ నగర్,గాంధీ నగర్,రాజాజి నగర్,చామ్రాజ్పేట అన్నీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక్క మహదేవపురలో ఓడిపోయాం.ఈ మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు రకాలుగా 1,00,250 నకిలీ ఓట్లు గుర్తించాం. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే ఇంటి అడ్రస్తో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇది నిజమా? కాదా? అని నిర్దారించేందుకు ఆ ఇంటి చిరునామాలకు వెళ్లాం. ఆ ఇంటి అడ్రస్లో ఉన్న ఓట్లను పరిశీలిస్తే.. అన్నీ నకిలీవేనని తేలింది’ అని ఆరోపించారు. -
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది. -
మా ఆఖరి పోరాటం పూర్తి చేశాం.. ఇక నిర్ణయం కేంద్రానిదే: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన(కిషన్ రెడ్డి) చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదు. బీసీ మొత్తానికి కలిపి 42 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్ఎస్ నైజం. లోకల్బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల దుర్మరణం
జమ్ము కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలతో చికిత్స పొందుతున్నారు.మొత్తం 23 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బంకర్ వాహనం బసంత్గఢ్ నుంచి గురువారం ఉదయం తిరుగు పయనం అయ్యింది. అయితే.. 10.30గం. ప్రాంతంలో కాంద్వా వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు కన్నుమూశారు. క్షతగాత్రులకు స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సదరు వాహనం 187వ బెటాలియన్కు చెందిందిగా నిర్ధారించారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారాయన. -
దొంగను పట్టించిన శివుని టాటూ.. ఎంపీ సుధకు ఊరట
న్యూఢిల్లీ: లోక్సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్పై బయటకు వచ్చాడు.ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్టీ కారిడార్ సమీపంలో బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుడు సోహన్ రావత్ ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్ మొబైల్ నంబర్ను అందించింది. ఫలితంగా రావత్ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా సీమంతం..అంతలోనే విషాదం!
నెలలు నిండాయి, ఇటీవలే ఘనంగా సీమంతం వేడుక చేశారు. కొడుకో, కూతురో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వారి ఆశలను తుంచేసింది.దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని తల్లీ బిడ్డ హైటెక్ ఆస్పత్రిలో ఘోరం చోటుచేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ, కడుపులో శిశువు మృత్యువాత పడ్డారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ కాటికి పోయారని ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. దొడ్డ తాలూకా సింగేనహళ్లి నివాసి సుశి్మత (24) మొదటిసారి గర్భం దాల్చింది. దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చూపించగా 7న కాన్పు తేదీ ఇచ్చారు. అయితే మంగళవారంనాడు సుస్మితకు ఊపిరి ఆడడం లేదని కుటుంబీకులు ఆస్పత్రికి తీసకువచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో నర్స్ మాత్రలు ఇచ్చి ఏమీ కాదని చెప్పింది. దీంతో వారు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం పొద్దున హఠాత్తుగా సుశి్మత ఆరోగ్యం క్షీణించి మరణించింది. త్వరలో కాన్పు అయి పండంటి బిడ్డను చూస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యుల న్లిక్ష్యం, సమయానికి డాక్టర్ లేకపోవడం వల్లే గర్భిణి, కడుపులోని బిడ్డ చనిపోయారని దుయ్యబట్టారు. తరువాత పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.బెంగళూరులో బాలింత.. యశవంతపుర: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రసవమైన గంటలో బాలింత మరణించిన ఘటన బెంగళూరులో జరిగింది. బాలింత మృతికి వైద్యుల అలసత్వం కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కోణనకుంట క్రాస్లోని అస్ట్రాం ఆస్పత్రిలో మంగళవారం మండ్యకు చెందిన తను (23) అనే గర్భిణి ప్రసవం కోసం చేరింది. వైద్యులు తనుకు సిజేరియన్ కాన్పు చేశారు. గంట తరువాత తను పరిస్థితి విషమించి కన్నుమూసింది. పుట్టిన గంటకే శిశువు అనాథ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. -
Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎదురుదెబ్బ
నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. నోట్ల కట్టల వ్యవహారంలో తన అభిప్రాయాన్ని విచారణ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, తనను తొలగించాలన్న ఆ కమిటీ నివేదిక చెల్లదని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని మార్చలేదని తెలిపిన సుప్రీం కోర్టు.. అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయడం రాజ్యాంగ వ్యతిరేకమేమీ కాదని వ్యాఖ్యానించింది.‘‘భారత ప్రధాన న్యాయమూర్తి, ఇన్హౌజ్ కమిటీ యధావిధిగా తమ ప్రక్రియను అనుసరించారు. అయితే ఈ కేసులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయకపోవడం అవసరం లేనిదే. అయితే అప్పట్లోనే మీరు దీనిని సవాల్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసినా దాని ప్రభావం లేకుండా పోయింది. ఇన్ హౌజ్ విచారణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది ఏం కాదు. ఇది న్యాయ వ్యవస్థలో నైతికతను కాపాడేందుకు రూపొందించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఒక పోస్ట్ ఆఫీస్ కాదు.. చర్యలకు తీసుకునే బాధ్యత సీజేఐకి ఉంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్లో జస్టిస్ యశ్వంత్ వర్మ.. పిటిషన్ను అజ్ఞాత పేరుతో దాఖలు చేశారు. అలాగే దర్యాప్తు కమిటీ తనను సరిగా విచారించలేదని, తన వాదనలకు అవకాశం ఇవ్వలేదని కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఈ విషయంలో న్యాయ ప్రక్రియ ఉల్లంఘించబడిందని, తాను మీడియా ట్రయల్కు(మీడియా కథనాలపై) లోనయ్యాను అని పిటిషన్లో తెలిపారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి ప్రముఖ లాయర్లు వాదనలు వినిపించడం గమనార్హం. అదే సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో భాగం కావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగి మరో బెంచ్కు బదిలీ చేశారు.కేసు నేపథ్యం:2025 మార్చి 14: ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పే సమయంలో నోట్ల కట్టలు కాలిన స్థితిలో ఓ రూమ్లో బయటపడ్డాయిసుప్రీం కోర్టు స్వయానా విడుదల చేసిన వీడియోలో నగదు ముద్దలు కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.న్యాయవ్యవస్థపై అవినీతి విమర్శలు రావడంతో తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయించి విచారణ జరిపించారు. ఈ కమిటీ మే 3న నివేదిక అందించగా.. మే 4న నివేదికను రాష్ట్రపతికి పంపించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. వర్మ తొలగింపు సిఫార్సు చేశారు.అభిశంసన ఇప్పట్లో కష్టమే!అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో విచారణ జరగడం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సెషన్లో ఆయన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారికంగా నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. నోటిఫికేషన్లోని వివరాల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీ.ఈ పత్రాలను ఆగస్టు 22న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీ.జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నిక తప్పనిసరి అయింది. ధన్ఖడ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన రాజీనామా లేఖలో క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ధన్ఖడ్ పదవీకాలం ఆగస్టు 2027లో ముగియనుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్సభ,రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీ విప్కి కట్టుబడి ఉండనవసరం లేదు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. ఈ కారణంగా ఎన్డీఏ తన అభ్యర్థిని సులభంగా ఎన్నుకోగలదు. రెండు సభల ప్రస్తుత బలం 786. అభ్యర్థి గెలవడానికి 394 ఓట్లు అవసరం. ఎన్డీఏకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు మొత్తం ఓట్ల బలం 422. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికం. -
దర్శన్, పవిత్ర బెయిలు బంతి.. సుప్రీంకోర్టులో
యశవంతపుర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటీనటులు దర్శన్, పవిత్రాగౌడ బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. బెయిలు రద్దు చేయరాదని ఇరువురి తరఫు వకీళ్లు లిఖితపూర్వకంగా వాదనలను సమర్పించారు. హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. ఇరువైపులా న్యాయవాదుల బలమైన కారణాలను పేర్కొన్నారు. అసలు రేణుకాస్వామిని అపహరించినట్లు, హత్య చేసినట్లు దర్శన్పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన లాయర్లు పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వాదనలు ఇలా ప్రభుత్వ న్యాయవాదుల వాదనల్లో.. మృతుడు రేణుకాస్వామి దర్శన్ అభిమాని. దర్శన్ పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నాడని కోపగించి అవహేళన సందేశం పంపాడని రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులో పట్టణగెరె వద్ద ఒక షెడ్డులో హత్య చేశారు. నిందితులందరూ హత్య చేసిన స్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడి మట్టి నమూనాలు అందరి పాదరక్షలలోను ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది అంటూ పలు కారణాలను పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. -
జంగ్లీ మహారాజ్ రోడ్ ... ఇంకా డ్రీమ్ గర్ల్ బుగ్గల్లానే నునుపుగా!
దేశంలో ఏ మూల చూసినా రోడ్ల గోసే ... నెల క్రితం వేసిన జాతీయ రహదారులు సైతం గుంతలు పడుతున్నతీరు.. ఇక గ్రామాలు.. జిల్లా రోడ్లు అయితే మరీను... ఎక్కడ అడుగుపెడితే అక్కడ మోకాలి లోతు గొయ్యి.. బండి నడపడం అంటే సర్కస్ తో సమానం. సైకిళ్ళు అయితే వెంటనే ఫోర్క్ విరిగిపోవాల్సిందే.. కార్లు అయితే గుంతల్లో పడి మరిక ముందుకు కదల్లేని పరిస్థితి.. ఇక్కడ కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వాలు కూడా ఈ దుస్థితికి కారణమే అని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లలో చేపలు పడుతూ.. వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఆధునికత సంతరించుకున్న ఈరోజుల్లేనే ఇలా ఉంటె ఆరోజుల్లో రోడ్లు ఇంకెలా ఉండేవో అనే సందేహం మనకు తప్పక వస్తుంది. కానీ ఆరోజులే అద్భుతం.. అప్పట్లో పుణేలో వేసిన రోడ్డు ఇంకా నునుపుగా .. కనీసం పింపుల్ కూడా లేని డ్రీమ్ గర్ల్ బుగ్గల్లా ఉన్నాయ్. దీనికి అప్పటి కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం పుణేలో రెండున్నర కిలోమీటర్ల పొడవునా జంగ్లీ మహారాజ్ రోడ్డును నిర్మించారు. ఎనిమిదో శతాబ్దంలో రాష్ట్రకూట మహారాజులు శివును పేరిట నిర్మించిన జంగ్లీ మహారాజ్ ఆలయం ఈ రోడ్డుసమీపానే ఉంది. అందుకే ఈ రోడ్డుకు జంగ్లీ మహారాజ్ రోడ్డు అని పేరుపెట్టి అప్పట్లో రూ. 15 లక్షలతో నిర్మాణం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరలో రెకాండో (Recondo) అనే ముంబై కి చెందిన నిర్మాణ సంస్థ 1976లో ఈ రోడ్డును నిర్మించింది. అప్పట్లో ఆ రోడ్డుకు ఆ నిధులు ఎక్కువే కానీ సదరు సంస్థ నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. అంతేకాకుండా వచ్చే పదేళ్లలో రోడ్డుకు ఎక్కడైనా చిన్న గుంత పడినా.. ఇంకేదైనా మరమ్మతు వచ్చినా రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా తాను మళ్ళీ రోడ్డును పునర్నిర్మిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యంగా ఇరవై.. ముప్పై ఏళ్లయినా ఆ రోడ్డు అప్పడు నిర్మించినట్లే కొత్తగా తళతళ మెరుస్తూ ఉంది. ఇప్పటి కాంట్రాక్టర్లను.. వారిని పర్యవేక్షించే అధికారుల అవినీతిని వెక్కిరిస్తూనే ఉంది.అప్పటి పూణే మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ షిరోలే ఈ రోడ్డుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి రోజులే వేరు.. కాంట్రాక్టర్ గొప్ప చిత్తశుద్ధితో ఎక్కడా రాజీపడకుండా రోడ్డును నిర్మించారు. అందుకే ఇన్నేళ్లయినా చెక్కుచెదరకుండా ఉంది అన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ గా శ్రీకాంత్ శిరోలే ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పని గొప్పగా పూర్తయ్యేలా అకుంఠిత దీక్షతో దాన్ని చేపట్టారు. సదరు నిర్మాణ సంస్థ కూడా అంతే శ్రద్ధతో దాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత పుణె నగరం జనసమ్మర్థంగా మారడం, ట్రాఫిక్ పెరగడంతో ప్రభుత్వం ఆ రోడ్డును మరింత విస్తరించింది. కానీ అప్పటి నాణ్యతను మాత్రం ప్రజలన స్మృతిపథం నుంచి చెరపలేకపోయింది. ఇప్పటికీ ఆ రోడ్డు కు ఇరువైపులా మిరుమిట్లు గొలిపే దుకాణాలతో షాపింగ్ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఆశ్చర్యం ఏమంటే ఆ తరువాత సదరు రెకాండో (Recondo) అనే నిర్మాణ సంస్థకు మరెక్కడా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు దక్కలేదు. అదేంటో దేశంలో పని బాగా చేసేవాళ్లకు ఉద్యోగాలు దొరకవు.. నిజాయితీగా ఉండే నేతలకు అసెంబ్లీ టికెట్లు దొరకవు.. నిజాయితీగా నాణ్యతతో పని చేసే కాంట్రాక్టు సంస్థలకు కొత్త కాంట్రాక్టులు దక్కవు. :::సిమ్మాదిరప్పన్న Junglee Maharaj Road, Pune: This road is legendary for being pothole free.Built by a contractor Recondo run by 2 Parsi brothers in the 1970’s.It employed the best technique & materialsAnd gave a guarantee to repair it for free for 10 years.They never got a road contract again pic.twitter.com/qrZHpYS4hD— Vishal Bhargava (@VishalBhargava5) August 5, 2025 -
రాజీ పడే ప్రసక్తే లేదు.. ట్రంప్ ‘టారిఫ్ వార్’పై ప్రధాని మోదీ స్పందన
భారత్పై టారిఫ్ వార్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని.. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. దేనికైనా సిద్ధమని ప్రకటించారాయన. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో.. మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ను బుధవారం ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరాయి. ఆ మరుసటిరోజే.. అంటే గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకూ తెలుసు. అయినా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని ట్రంప్ టారిఫ్ వార్ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారాయన. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్ చేసే 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు), తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి ఎగమతులపై అదనపు టారిఫ్ భారం ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే.. భారతదేశం నుంచి పత్తి, మిర్చి, జీడిపప్పు, మామిడి, బంగాళదుంపలు, చేపలు, డెయిరీ ఉత్పత్తులపై అధిక సుంకాలు పడనున్నాయి.భారత్ పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25శాతం టారిఫ్ ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21రోజుల తరువాత(ఆగస్టు 27) అదనపు 25శాతం భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. దీంతో.. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరుకుపై ఈ అదనపు 25శాతం సుంకాన్ని విధించబోరు. అదేవిధంగా బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం ఉండదు. సెప్టెంబర్ 17వ తేదీ అర్థరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు.ఇదీ చదవండి: భారత్కు ట్రంప్ ఆంక్షల వార్నింగ్ -
బీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా, కానీ..: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ల బాధ్యత తానే తీసుకుంటానని అన్నారాయన. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘‘రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా? రేపు లంబాడాలను కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?. అసలు ఆయనే కన్వర్టెడ్ కాంగ్రెస్. మజ్లిస్ కనుసన్నల్లో కాంగ్రెస్ పని చేస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఒవైసీ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. వచ్చేఎన్నికల్లో రేవంత్ ఓటమి ఖాయం.. .. గతంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను తెలంగాణ హైకోర్ట్ కొట్టేసింది. మజ్లిస్ కనుసైగలతో కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు 34 శాతం నుంచి 27 శాతం రిజర్వేషన్ తగ్గించారాయన. అలాంటప్పుడు ఇప్పుడెలా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తారు. మత రిజర్వేషన్లతో దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది.... అసలు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ బాధ్యత నేనే తీసుకుంటా. రాష్ట్రపతి, ప్రధానితో కూడా మాట్లాడతా అని కిషన్ రెడ్డి అన్నారు. .. బీసీలకు వెన్నుపోటు పొడవడంలో తెలంగాణ రోల్ మోడల్. బీసీలను మోసం చేయడంలో, అక్రమాలు చేయడంలో మేము నిరక్షరాస్యులం. కేసీఆర్ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో నాన్ బీసీలు మాత్రమే గెలిచారు. కాంగ్రెస్ తెచ్చిన బిల్లుతో బీసీలకు కేవలం 32 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. ఇది బీసీలను మోసం చేయడమే. రాజ్యాంగ సమస్యల వల్లే గవర్నర్ రాష్ట్రపతికి బీసీ బిల్లు పంపారు అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు. దీనిపై సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారాయన. -
31న చైనాకు ప్రధాని మోదీ.. దౌత్య సంబంధాలపై చర్చ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్లు 31న చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తరువాత ప్రధాని మోదీ చైనాకు వెళుతున్న తొలి పర్యటన ఇది. తూర్పు లడఖ్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగని ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనున్నారు. ఈ సమావేశం టియాంజిన్లో జరగనున్నది. ఈ ఉన్నత స్థాయి దౌత్య భేటీ రెండు ఆసియా దిగ్గజాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచనున్నది. తూర్పు లడఖ్లో సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజింగ్లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం.. ఇటీవలే పూర్తి సభ్యత్వం పొందిన రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్లతో సహా ఎనిమిది సభ్య దేశాల నేతలను ఒకచోట చేర్చనుంది. మోదీ చేస్తున్న ఈ పర్యటన పర్యటన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో వ్యక్తిగత సమావేశానికి మార్గం సుగమం చేయనుంది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత వీరి మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి.ఈ ఇరువురు నేతలు ఇటీవల జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో తారసపడినప్పటికీ, ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చర్చలు జరగనున్నాయి.2020 మేలో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా కూడా కొందమంది సైనికులను కోల్పోయింది. అయితే వారి సంఖ్యను చైనా బహిరంగంగా వెల్లడించలేదు. కాగా త్వరలో జరగబోయే ద్వైపాకక్షిక సమావేశంలో భారత్- చైనా మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను తిరిగి ప్రారంభించడంపై చర్చ జరగనున్నదని సమాచారం. అలాగే వీసాలను సులభతరం చేయడానికి, సరిహద్దుల్లో నదులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రతిపాదనలు జరగనున్నాయని తెలుస్తోంది. -
ఎస్ఐ తల నరికి చంపేశారు!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. నిందితుల కోసం ఆరు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగియం పట్టికి చెందిన షణ్ముగ వేల్ కుడిమంగళం పోలీసు స్టేషన్లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులలో ఉండగా 100కు వచ్చిన కాల్తో విచారణ నిమిత్తం అదేగ్రామంలోని ఓ ఎస్టేట్ తోటకు వెళ్లారు. విచారణకు వెళ్లిన షణ్ముగ వేల్ దారుణ హత్యకు గురైన సమాచారం బుధవారం ఉదయాన్నే పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలను విచారణకు నియమించారు. విచారణలో సంబంధిత ఎస్టేట్ మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్కు చెందినదిగా తేలింది. భద్రత కోసం వచ్చి హతమయ్యాడు.. ఈ ఎస్టేట్లో దిండిగల్కు చెందిన మూర్తి (65), ఆయన కుమారులు తంగపాండి, మణిగండన్ పనిచేస్తుండడం, వారు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణలో ఈ తండ్రి కొడుకులు మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్నట్టు, మంగళవారం రాత్రి కూడా ఘర్షణకు దిగినట్టు వెలుగు చూసింది. ఒకర్ని మరొకరు కర్రలతో కొట్టుకుంటుండటంతో 100కు ఫోన్ వెళ్లింది. దీంతో షణ్ముగ వేల్ భద్రత నిమిత్తం అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నట్టు తేలింది. ఈ సమయంలో మణి గండన్ కొడవలితో షణ్ముగ వేల్పై దాడి చేసి నరికి పడేశాడు. తప్పించుకునేందుకు షణ్ముగ వేల్ యతి్నంచినా వదలకుండా హత్యకు పాల్పడ్డాడు. దీనిని షణ్ముగ వేల్తో పాటూ వాహనంలో వెళ్లిన డ్రైవర్ గజరాజు చూడడంతో అతడి మీద కూడా దాడికి యతి్నంచారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్లో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ పోలీసులు ఆ ఎస్టేట్లోకి పరుగులుతీశారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తును పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేయించారు. ఈ సమాచారంతో ఎమ్మెల్యే మహేంద్రన్ ఎస్ఐ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు. ఇక సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేíÙయో ప్రకటించారు. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం షణ్ముగ వేల్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయం వద్ద డీజీపీ శంకర్జివాల్తో పాటూ ఉన్నతాధికారులు నివాళులరి్పంచారు. కాగా, పోలీసులకే రాష్ట్రంలో భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఎస్ఐఆర్పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు ఎస్ఐఆర్పై లోక్సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. రాజ్యసభలోనూ అదే అలజడి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు. -
బిహార్లో నివసిస్తున్న ట్రంప్ !!
సమస్తీపూర్: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్కు రెసిడెన్సీ సర్టీఫికేట్ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు. అనుకున్నదే తడవుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు రెసిడెన్సీ సర్టీఫికేట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేశాడు. ఇప్పటికే బిహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో బిజీగా ఉన్న అధికారుల కంట్లో ఈ దరఖాస్తు పడింది. హసన్పూర్లో ట్రంప్ నివసిస్తున్నట్లుగా ఈ అప్లికేషన్లో పేర్కొనడం చూసిన అధికారులు హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆ దరఖాస్తును ఆగస్ట్ నాలుగో తేదీన బుట్టదాఖలు చేశారు. జులై 29వ తేదీన ఈ దరఖాస్తు వచ్చింది. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్లాయిడ్ అని నిజమైన పేర్లనే పేర్కొనడం విశేషం. -
హిమాచల్లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్ప్రదేశ్నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా హిమాచల్లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. -
ప్రజలే కేంద్రంగా పారదర్శక పాలన
న్యూఢిల్లీ: ప్రజాసేవే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో గత 11 ఏళ్లుగా పారదర్శక, స్పందించే, పౌరులే కేంద్రంగా ఉన్న పరిపాలనా విధానం కొనసాగుతోందని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందుకోసం స్పష్టమైన విజన్తో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో కర్తవ్య భవన్–03ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతోపాటు మరిన్ని ఇతర మౌలిక సదుపాయాలు భారతదేశ గ్లోబల్ విజన్కు ప్రతీక అని ఉద్ఘాటించారు. బ్రిటిష్ కాలం నాటి భవనాల్లో ప్రభుత్వ యంత్రాంగం దశాబ్దాలుగా పని చేస్తోందని, అవి చాలావరకు కాలం చెల్లిపోయాయని అన్నారు. ఆయా భవనాల్లో సరైన వసతులు, గాలి, వెలుతురు కూడా లేవని చెప్పారు. అందుకే నేటి అవసరాలకు అనుగుణంగా అందుకే కర్తవ్య భవనాలు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తం 10 భవనాలు నిర్మిస్తున్నామని, వీటితో ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.1,500 కోట్లు ఆదా అవుతాయని స్పష్టంచేశారు. విజయ గాథలు లిఖించాలి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజయ గాథలను లిఖించడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అదే మనందరి సంకల్పం కావాలన్నారు. మన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించాలని, దేశంలో ఉత్పాదకత పెంచాలని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పానికి గుర్తు కర్తవ్య భవన్ అని వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది దశ దిశను నిర్దేశిస్తుందని ఉద్ఘాటించారు. మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న ప్రపంచవ్యాప్తంగా సమయంలోనే చాలా దేశాలు స్వాతంత్య్రం పొందాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆయా దేశాల తరహాలో మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆత్మసమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇప్పటి సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకోవడం మన బాధ్యత అని చెప్పారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించకూడదని స్పష్టంచేశారు. అత్యాధునిక వసతులతో కర్తవ్య భవన్–03 దేశ రాజధానిలో కర్తవ్య భవన్–03 అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 10 ఉమ్మడి కేంద్ర సచివాలయ(సీసీఎస్) భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్మాణం పూర్తయిన తొలి భవనాన్ని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కర్తవ్య భవన్–03లో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంఎస్ఎంఈ, పెట్రోలియం–సహాజవాయువు శాఖలు కొలువుదీరబోతున్నాయి. ముఖ్య శాస్త్రీయ సలహాదారు కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు బ్రిటిష్ కాలంతోపాటు 1950వ దశకంలో, 1970వ దశకంలో నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్లో పని చేస్తున్నాయి. ఆయా భవనాలు చాలావరకు బలహీన పడడంతో నూతన భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కర్తవ్య భవన్–03ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ భవనమంతా కలియదిరిగారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఈ భవనంలో యోగా రూమ్, మెడికల్ రూమ్ సహా అత్యాధునిక వసతులున్నాయి. కర్తవ్య భవన్–01, కర్తవ్య భవన్–02 నిర్మాణం వచ్చే నెలలో పూర్తికానుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని, వైస్ ప్రెసిడెంట్ కాంక్లేవ్ను నిర్మించిన సంగతి తెలిసందే. అలాగే విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ దాకా కర్తవ్య పథ్ను అభివృద్ధి చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్, కేబినెట్ సెక్రెటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్ నిర్మించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. మొదటి మూడు కర్తవ్య భవన్ల భద్రతకు కేంద్ర ప్రభుత్వం 735 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో 24 గంటల్లో మరోమారు భారత్పై దిగుమతి టారిఫ్లను పెంచుతానని మంగళవారం ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ భారత్పై అదనపు టారిఫ్లు మోపుతానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఇప్పటికే ఒకసారి 25 శాతం పెంచినా ప్రధాని మోదీ ఏమాత్రం ట్రంప్ను నిలువరించలేకపోయారు. దీని వెనుక అసలు కారణం ఇప్పటికైనా భారతీయు లకు తెలియాల్సి ఉంది. అదేంటంటే అమెరికాలో గౌతమ్ అదానీపై అక్కడి విచారణ సంస్థలు దర్యాప్తు కొన సాగిస్తున్నాయి. మోదీ, ఏఏ(అంబానీ, అదానీ), రష్యా ముడి చమురు కొను గోళ్ల వ్యవహారంలో అక్రమ ఆర్థిక సంబంధాలు బట్టబయలు చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అందుకే భారత్పై ఎంతటి టారిఫ్ల భారం పడుతున్నా ప్రధాని మోదీ చీమకుట్టినట్లయినా లేకుండా మౌనంగా ఉండిపోయారు. అదానీ దర్యాప్తు పేరు చెప్పి మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సంస్థనుంచిగానీ కేంద్రప్రభుత్వం నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి స్పందన, వివరణ రాలేదు. రష్యాతో ముడి చమురు వాణిజ్యాన్ని భారత్ మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. ఈ అక్కసుతోనే ఆయన భారత్పై అదనపు దిగుమతి టారిఫ్లను విధిస్తు న్నారు. ఇప్పటికే ఒక దఫా పెంచగా మరోదఫా మరికొన్ని గంటల్లో పెంచుతానని ప్రకటించడం, భారత్ ఘాటుగా బదులివ్వడం తెల్సిందే. -
బిహార్లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఎస్ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది. -
కొనసాగుతున్న ముమ్మర గాలింపు
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం) కారణంగా ఖీర్గంగా నదీ ప్రవాహం ఉప్పొంగి దిగువన ధరాలీ గ్రామా న్ని బురద ముంచెత్తడంతో అందులో కూరుకు పోయిన వారి జాడ కోసం యుద్ధప్రాతిపదికన గా లింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలో ఇప్పటికే ఐదుగురు సజీవ సమాధికాగా మరొకరి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. గ్రామంలో చిక్కుకుపోయిన 190 మందిని కాపాడారు. ఇంకా 100 మందికిపైగా జాడ గల్లతైంది. దీంతో ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు సహాయక, అన్వేషణ చర్యల్లో పూర్తిగా మునిగిపోయాయి. హార్సిల్లోని ఆర్మీ క్యాంప్కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియరాలేదు. గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు కేరళ నుంచి వచ్చిన 28 మంది యాత్రికుల బృందం జాడ గల్లంతైంది. దీంతో ఆ బృందసభ్యుల బంధువుల్లో ఆందోళనలు రెట్టింపయ్యాయి. ‘‘ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయల్దేరినట్లు నాతో ఫోన్లో చెప్పారు. వాళ్లు ప్రయాణిస్తున్న మార్గంలోనే కొండచరియలు పడ్డాయి. తర్వాత వాళ్లకు ఫోన్ చేస్తే అస్సలు కలవడంలేదు’’ అని ఒక బంధువు ఏడుస్తూ చెప్పారు. ‘‘ధరాలీలో మాకు ఇల్లు, హోటల్ ఉన్నాయి. అక్కడే నా సోదరుడు, భార్య, కుమారుడు ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంతవరకు నా సోదరుడు, అతని కుటుంబం జాడ తెలీడంలేదు’’ అని మరో వ్యక్తి వాపోయాడు.బురదలో కూరుకుపోయిన ప్రాచీన ఆలయంమంగళవారంనాటి బురదచరియలు దూసుకొచ్చిన ఘటనలో ధరాలీ గ్రామంలోని ప్రాచీన కల్ప్ కేదార్ శివాలయాన్ని బురద పూర్తిగా కప్పేసింది. ఈ ఆలయాన్ని సైతం కేదార్నాథ్ ఆలయం మాదిరే ‘కథూర్’ శైలిలో నిర్మించారు. దశాబ్దాల క్రితం జరిగిన ఇలాంటి ఘటనలోనూ కల్ప్కేదార్ ఆలయం చాలాభాగం మట్టిలో కూరుకుపోయింది. ఇన్నాళ్లూ శివాలయం పైభాగం మాత్రమే బయటకు కనిపించేది. దీంతో చిన్నపాటి మార్గం గుండా లోపలికి వెళ్లి భక్తులు దర్శనాలు చేసుకునే వాళ్లు. ఆలయ గర్భగుడిలో శివలింగంపై ఖీర్గంగా నదీజలం అభిషేకంచేస్తున్నట్లు పడేలా గతంలో ఏర్పాట్లుచేశారు. మంగళవారం నాటి ఉత్పాతంతో పూర్తిగా బురదలో కలిసిపోయింది. ఈ ఆలయాన్ని 1945లో తవ్వకాల్లో గుర్తించారు.పలు చోట్ల విరిగిపడిన కొండచరియలు..కొండచరియలు పడడంతో గంగోత్రి జాతీయ రహదారిపై పలు చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. గంగోత్రి జాతీయరహదారి వెంట లిమిఛా నదిపై గంగ్నానీ వద్ద నిర్మించిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ వైపు నుంచి వస్తున్న సహాయక బృందాలు ముందుకు కదల్లేక అక్కడే ఆగిపోయాయి. కొండచరియలు పడిన ప్రతిచోటా ఇదే పరిస్థితి. దీనికి తోడు భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి. వర్షం తగ్గాక ఆకాశమార్గంలో గాలింపు కోసం ఆర్మీ ఎంఐ–17, ఛినూక్ హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ‘‘ ధరాలీ గ్రామంలో సగభాగం సమాధిలా మారింది. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్స్టేలు, చెట్లు మొత్తం బురదలో కూరుకుపోయాయి. బాధితులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలను 160 మంది పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ చెప్పారు. బుధవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించారు. -
ట్రంప్ బుకాయింపులు
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. టారిఫ్ల బాంబులు పేలుస్తున్నారు. కానీ, అదే అమెరికా అదే రష్యా నుంచి యురేనియం, ఎరువులు, రసాయనాలు భారీగా దిగుమతి చేసుకుంటోంది. తమ అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతోంది. రష్యా నుంచి దిగుమతుల గురించి తనకేమీ తెలియదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అసలేం జరుగుతోందో తనిఖీ చేస్తానని అన్నారు. ట్రంప్ మాటల్లోని ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ శాఖ ఎండగట్టింది. ట్రంప్ బుకాయింపులు గణాంకాల సాక్షిగా బహిర్గతమయ్యాయి. నిజానికి అమెరికా–రష్యా మధ్య బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది. అణు ఇంధన పరిశ్రమల కోసం అమెరికా కంపెనీలు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ను దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియంను, వ్యవసాయం కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికా–రష్యా మధ్య 2024లో 5.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 3.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం సరుకులకు సంబంధించినదే. అమెరికా నుంచి రష్యాకు 528.3 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. రష్యా నుంచి అమెరికా 3 బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంది. అంటే రష్యాతో అమెరికాకు 2.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. 2025 ప్రథమార్ధంలో రష్యా నుంచి దిగుమతులు 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిస్ గణాంకాలు చెబుతున్నాయి నాలుగేళ్ల క్రితం ఇవి 14.14 బిలియన్ డాలర్లుగా ఉండేవి. అయినప్పటికీ 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి అమెరికా 24.51 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. → 2021లో రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయిన ఎరువుల విలువ 1.14 బిలియన్ డాలర్లు. 2024లో ఇది 1.27 బిలియన్ డాలర్లు. → 2021లో రష్యా నుంచి యూఎస్కు 646 మిలియన్ డాలర్ల విలువైన యురేనియం, ప్లుటోనియం వచ్చాయి. 2024లో 624 మిలియన్ డాలర్లకు తగ్గింది. → 2021లో 1.59 బిలియన్ డాలర్ల విలువైన పల్లాడి యం దిగుమతి చేసుకోగా, 2024లో 878 మిలియన్ డాలర్ల సరుకు దిగుమతి చేసుకుంది. → రష్యా నుంచి ఇండియా కంటే చైనా అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చైనాను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. → 2024లో చైనా ఏకంగా 62.6 బిలియన్ డాలర్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇండియా దిగుమతులు 52.7 బిలియన్ డాలర్లే. దీనిపై ట్రంప్ నోరు మెదపడం లేదు. -
‘సబ్ కా సాత్’ అంతా డొల్ల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడమంటే, దాన్ని నిరాకరించడమేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా పురస్కరించుకుని వారు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ సర్కారు కృషి: ఖర్గే ‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్ హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆమోదించింది. కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో.. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల. ఎందుకంటే ఈ బిల్లులకు, అణగారిన వర్గాల హక్కులకు మోదీయే అడ్డుగోడగా ఉన్నారు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల కోసమే ఈ పోరాటం: రాహుల్ గాంధీ ‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేశా యి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా ఈ బిల్లు ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’నేతలకు నా కృతజ్ఞతలు. రాష్ట్రపతి దీనిని గుర్తించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, హక్కుల కోసం జరుపుతున్న సమిష్టి పోరాటం.’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చరిత్రాత్మక బిల్లు ‘తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడే ఆగిపోయింది. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం తెలంగాణ పోరాటమే కాదు. అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం జాతి యావత్తు చేస్తున్న ఆందోళన. న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, దాన్ని తిరస్కరించడమే..’అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. -
ఉల్టా చోర్..
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి. అంతేగాక, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై టారిఫ్లను భారీగా పెంచేస్తానంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు బుధవారం అన్నంత పనీ చేశారు. టారిఫ్ను 50 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కానీ వాస్తవాల ఆధారంగా ఒకసారి పరిశీలన చేస్తే ఇలాంటి విషయాల్లో వర్ధమాన దేశాలకు నిత్యం సుద్దులు చెప్పే పెద్ద దేశాలు తమవరకూ వచ్చేసరికి మాత్రం ఎంతటి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తాయో తెలుస్తుంది. ట్రంప్ అనే కాదు, ఇలాంటి విషయాల్లో సంపన్న దేశాల స్వార్థపూరిత వైఖరి ఇట్టే కళ్లకు కడుతుంది... ఉక్రెయిన్పై ఏళ్లుగా సాగిస్తున్న మతిలేని యుద్ధానికి రష్యాకు అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్నీ ఒకరకంగా భారతే సమకూరుస్తూ వస్తోందన్నది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ కొద్దికాలంగా పాడుతూ వస్తున్న పాట. రష్యా నుంచి నానాటికీ పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు తార్కాణంగా అవి చూపిస్తున్నాయి. కానీ నిజానికి రష్యా నుంచి స్వీయ చమురు కొనుగోళ్లను నేటికీ ఆపని తెంపరితనం ఆ దేశాలది! ఇందుకు సంబంధించిన అన్ని విషయాలనూ ఒకసారి అంశాలవారీగా విశ్లేషిస్తే... ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే (దొంగే... దొం దొంగ అన్నట్టు) నానుడి ఈ దేశాల వైఖరికి అతికినట్టుగా సరిపోతుంది. రష్యా చమురే ముద్దు! ఉక్రెయిన్పై పాశ్చాత్య రష్యా యుద్ధానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ పొలోమంటూ దానిపై నానారకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అంతేకాదు, స్వయంగా అమెరికాతోపాటు ఆ దేశాలన్నీ నేటికీ రష్యా చమురును చంకలు గుద్దుకుంటూ కొనుక్కుంటున్నాయి. స్వీయ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు మాత్రం రష్యా చమురు కొనొద్దంటూ సుద్దులు చెబుతున్నాయి. ‘అలా ఎలా కొంటుం’దంటూ సన్నాయినొక్కులూ నొక్కుతున్నాయి. తెంపరితనానికి మారుపేరుగా మారిన ట్రంప్ అయితే ఆంక్షల రంకెలు వేస్తున్నారు. ధరపై పరిమితి మాత్రమేఇరాన్, వెనెజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికీ పూట గడవని పరిస్థితి! అందుకే తెలివిగా ప్రపంచంలోని ఏడు అతి సంపన్న, శక్తిమంతమైన దేశాల కూటమి అయిన జీ7, యూరోపియన్ రష్యా చమురుపై ‘ప్రైస్ క్యాప్’విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా జీ7, ఈయూ విధించిన ‘ప్రైస్ క్యాప్’కు లోబడే, వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా! ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ, చట్టాన్ని గానీ ఉల్లంఘించడం లేదు. మరి మనపై ఏడుపెందుకు? ఒక్కముక్కలో చెప్పాలంటే స్వీయ వంచన, పరవంచన! అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేనితనం!! స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. కేవలం ఆ ఒక్క కారణంగానే సంపన్న దేశాలన్నీ ఇలా ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నాయి. అదే సమయంలో తాము మాత్రం చడీచప్పుడూ లేకుండా అదే రష్యా నుంచి ‘ఓపెన్ మార్కెట్’ముసుగులో నిరి్నరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ అయితే శాపనార్థాలతో పాటు బెదిరింపులకు కూడా దిగుతున్నారు.పాశ్చాత్య దేశాల ‘గ్యాస్’ రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నంబర్వన్ స్థానంలో ఉన్నాయి! గత జూన్లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా 120 కోట్ల డాలర్లంటే నమ్మక తప్పదు! ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లొవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు, రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్ర స్థానం. స్వార్థానికి మారుపేరైన తుర్కియే అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26 శాతాన్ని సొంతం చేసుకుంటోంది! ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా సున్నా! వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే నిజానికి రష్యా యుద్ధ తంత్రానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా, పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది అక్షరసత్యం. ఆ లెక్కన ఈ విషయంలో భారత్పై వాటి ఏడుపు దొంగే, ‘దొంగా’అంటూ దొంగ అరుపులు అరిచిన చందమన్నది అంతర్జాతీయ నిపుణుల మాట. చైనా కంటే తక్కువే భారత్ తన చమురు అవసరాల్లో ఏకంగా 38 శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే. అది ఏకంగా 47 శాతం చమురు కొంటోంది. పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి.మనం తప్పుకుంటే..గగ్గోలు పుడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. బ్యారెల్ ఏకంగా 200 డాలర్లు దాటేస్తుంది. అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది అన్యాయం.. మా దేశంపైనే ఎందుకిలా?: ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ రియాక్షన్
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. .. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్.. చివరికి..
భువనేశ్వర్: భువనేశ్వర్లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేంద్రపారా జిల్లాలొ ఇవాళ (బుధవారం) ఉదయం 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో తీవ్రంగా కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని తానే నిప్పంటించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆ యువతిని కొంతకాలంగా ఆమె ప్రియుడు వేధించడంతో పాటు ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని కూడా బెదిరించాడంటూ తండ్రి ఆరోపించాడు. ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేయలేదని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా తెలిపారు.కాగా, గత నెల జూలై 12న బాలాసోర్లోని ఎఫ్ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్లో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన డిపార్ట్మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
వైరల్ వీడియో: జస్ట్ మిస్.. హరిద్వార్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఈ సమయంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ బైక్తో పాటు వారు కిందపడిపోయారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. వాళ్లను ఆ శిథిలాల నుంచి బయటకు లాగేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.కాగా, ధరాలీ గ్రామంపై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్స్టేలను భూస్థాపితం చేసింది. అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఉత్తరకాశీ జిల్లా మేజి్రస్టేట్ ప్రశాంత్ ఆర్య చెప్పారు. 50 మందికిపైగా జనం జాడ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు.Uttarakhand: Three youths on a bike narrowly escaped disaster as landslide debris fell over them in Haridwar. #Uttarakhand #UttarakhandNews pic.twitter.com/4gMHwbG25i— Siddharth (@Siddharth_00001) August 6, 2025జాతీయ భద్రత, నిఘా కార్యక్రమంలో భాగంగా సమీప హార్సిల్ లోయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారత ఆర్మీ 14 రాజ్రిఫ్ యూనిట్ బేస్క్యాంప్పైనా బురద దూసుకొచ్చింది. దీంతో 10 మంది జవాన్లు, ఒక సైన్యాధికారి(జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) జాడ సైతం గల్లంతైంది. తోటి జవాన్ల జాడ తెలీకుండాపోయినాసరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక, అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను ఘటనాస్థలి నుంచి సహాయక బృందాలు కాపాడాయి.హరిశీలా పర్వతం సమీపంలోని సత్తాల్ దగ్గరి కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా పెరిగిన ఖీర్గంగా నదీప్రవాహం హద్దులు దాటి దిగువక దూసుకొచ్చింది. ఈ వరదనీటితో పాటు వరద దిగువకు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చి అక్కడ ఉన్న ధరాలీ గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించింది. ప్రకృతి ప్రకోపం వార్త తెల్సి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక దళం, ఉత్తరాఖండ్ పోలీసులు, భారత ఆర్మీ బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలూ ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
31 నుంచి మోదీ చైనా పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారయ్యింది. ఆయన ఈ నెల 31, వచ్చేనెల 1వ తేదీల్లో చైనాలో పర్యటిస్తారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. తియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో మోదీ పాల్గొంటారు. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో రెండు దేశాల జవాన్ల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత ప్రధానమంత్రి చైనాలో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2018లో డ్రాగన్ దేశంలో పర్యటించారు. ఈసారి చైనా పర్యటన కంటే ముందు మోదీ ఈ నెల 30న జపాన్ను సందర్శించబోతున్నారు. ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు హాజరవుతారు. జపాన్ప్ర«దానమంత్రి ఫుమియో కిషిదాతో సమావేశమవుతారు. అక్కడి నుంచి చైనాకు చేరుకుంటారు. మోదీ పర్యటన కంటే ముందే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఎస్సీఓ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాను సందర్శిస్తారు. చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ అవుతారు. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనైన సంగతి తెలిసిందే. సంబంధాల పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు దాదాపు చివరి దశకు వచ్చాయి. మోదీ పర్యటనతో స్నేహ సంబంధాలు మళ్లీ పూర్వస్థితికి చేరడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ చైనా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియాతోపాటు ‘బ్రిక్స్’ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేస్తున్నారు. ఇండియా ఉత్పత్తులపై ఇప్పటికే 25 శాతం టారిఫ్లు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే మరిన్ని తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనాపై కూడా ట్రంప్ సుంకాల మోత మోగించారు. చైనా ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్లు విధించారు. మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధం నిలిపివేయాలంటూ రష్యాపై ఒత్తిడి పెంచుతున్నారు. రష్యాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్కు మరింత ఆయుధ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం, భారత ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్పింగ్తోపాటు రష్యా ప్రతినిధి హాజరుకానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. షాంఘై సహకార సంస్థలో చైనా, ఇండియా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ ఏడాది ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఏడాది జూన్లో చైనాలోని ఖింగ్డావోలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి ప్రస్తావన ఇందులో లేకపోవడమే కారణం. దాంతో ఉమ్మడి ప్రకటన విడుదల చేయకుండానే సదస్సు ముగిసింది. -
దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?
దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్ ధామి ఉత్తర కాశీలో ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 🚨 "𝗦𝘄𝗶𝗳𝘁 𝘁𝗼 𝗥𝗲𝘀𝗽𝗼𝗻𝗱, 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗱 𝘁𝗼 𝗣𝗿𝗼𝘁𝗲𝗰𝘁." 🪖📍Kheer Gad, Dharali Village | Uttarkashi | 1345 Hrs, 05 Aug 2025A massive mudslide struck #Dharali village in the #KheerGad area near Harsil, triggering sudden flow of debris and water through the… pic.twitter.com/FwPPMrIpqu— SuryaCommand_IA (@suryacommand) August 5, 2025 -
సీఎంల పేర్లు, ఫొటోలను పథకాలకు ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్పై దాడికి దిగారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
ఉచిత బస్సుల్లో చార్జీల వసూలా..?
అన్నానగర్: తమిళనాడు ప్రభుత్వం ’విడియల్ ప్రయాణం’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మహిళలు సాధారణ ఛార్జీల సిటీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిలో మహిళలు ప్రయాణించడానికి ఛార్జీలు లేవని రాసి ఉన్న బస్సు నుంచి డబ్బు తీసుకొని పురుషులకు మహిళలకు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇది ఏమిటి? అని ఓ మహిళ తన సోషల్ మీడియా పేజీలో టికెట్తో పోస్ట్ చేసింది. తిరుచ్చి నుంచి ముసిరి వరకు పురుషుడికి రూ. 42, ఇద్దరు వ్యక్తులకు రూ. 84 అని అందులో పేర్కొంది. చాలా మంది దీనిని షేర్ చేశారు. కొందరు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. దీని తరువాత, తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ విషయంలో, తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఫ్యాక్ట్ చెకింగ్ ఆఫీస్ ఓ పోస్ట్ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న బస్సు విడియాల్ ట్రావెల్ స్కీమ్ కింద ఉన్న బస్సు కాదు. ఇది తిరుచ్చి నుంచి ముసిరికి వెళ్లే –4 సబర్బన్ బస్సు (నీలం రంగు). దీనికి ప్రయాణ రుసుము ఉంది. ఎలక్ట్రానిక్ టికెట్లో ప్రయాణికుల వివరాలు స్త్రీ అని కాకుండా పురుషుడు అని పేర్కొంటూ బస్సు కండెక్టర్ పొరపాటున టికెట్ జారీ చేశారని బిజినెస్ పార్టనర్షిప్ (సేలం సబర్బన్ బస్) డిప్యూటీ మేనేజర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అని సూచించారు. -
అమిత్షా అరుదైన ఘనత.. ఎల్కే అద్వానీ రికార్డు బద్దలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా అరుదైన ఘనతను సాధించారు. ఆగస్టు 5 నాటికి దేశంలో ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన నేతల జాబితాలో గుర్తింపు పొందారు. ఆయన 2,258 రోజులు పదవిలో కొనసాగుతూ.. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రికార్డును (2,256 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో అమిత్ షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు.ఫలితంగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రికార్డును అమిత్ షా అదిగమించారు. 1998-1999, 1999-2004 వరకూ ఎల్కే అద్వానీకేంద్ర హోం మంత్రిగా దాదాపు 2,193 రోజులు ఈ పదవిలో కొనసాగారు. ఇక కేంద్ర హోం శాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తన హయాంలో ఆర్టికల్ 370 రద్దు, కొత్త న్యాయ చట్టాల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం, నక్సలిజం నిర్మూలన లక్ష్యం, ఉత్తర తూర్పు శాంతి ఒప్పందాలు, నార్కోటిక్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. -
మోదీజీకి స్పెషల్ రాఖీ.. పాక్ ముస్లిం సోదరి రాఖీ ఇదే..
ఢిల్లీ: అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా రక్షబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాఖీ పండుగ కోసం ప్రజలు సిద్దమవుతున్నారు. కాగా, రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాది కూడా రాఖీ కట్టేందుకు ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ ప్రత్యేక రాఖీని తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఆనందం వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లోని కరాచీలో 1981లో జన్మించిన ఖమర్ షేక్.. గుజరాత్కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో భారత్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 30 సంవత్సరాలుగా తాను మోదీజీకి రాఖీ కడుతున్నట్టు తెలిపారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా రాఖీ పంపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.VIDEO | As Rakshabandhan approaches, Qamar Mohsin Sheikh, a Pakistani-origin woman living in Ahmedabad, is once again preparing to tie a handmade rakhi to Prime Minister Narendra Modi, continuing a unique tradition that has lasted around 30 years.Every year, Sheikh crafts… pic.twitter.com/SMWi5iPyc6— Press Trust of India (@PTI_News) August 6, 2025ఈ సందర్బంగా ఖమర్ మొహ్సిన్ షేక్ మాట్లాడుతూ..‘ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోదీ చేతికి కడతానని చెప్పారు. మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోదీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్టు షేక్ చెప్పారు. అప్పుడు ఆయన నవ్వినట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి మోదీని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు -
భారత్కు ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. రష్యాకు అజిత్ దోవల్
సాక్షి,న్యూఢిల్లీ: భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్ .. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను రష్యాకు పంపించింది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అజిత్ దోవల్ రష్యా పర్యటన ముందుగానే ఖరారైంది. అయితే, రష్యాతో భారత్ సంబంధాల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరుణంలో అజిత్ దోవల్ పర్యటన చర్చకు దారి తీసింది. అజిత్ దోవల్ తన పర్యటనలో భాగంగా రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం,రక్షణ సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ కథనాల్ని వెలువరించింది. అదే సమయంలో భారత రాయబారి వినయ్ కుమార్, రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి కల్నల్-జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ మధ్య మాస్కోలో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి భారత్-రష్యాలు తమ నిబద్ధతను చాటిచెప్పాయి.రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. భారత రాయబారి అంతర్జాతీయ రక్షణ సహకారానికి బాధ్యత వహిస్తున్న కల్నల్-జనరల్ ఫోమిన్తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించాయి. భారత్-రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది. -
ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్లో తవ్వాల్సి ఉంది. -
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి తాత్కాలిక స్వేచ్ఛ లభించింది. కోర్టు 40 రోజుల పెరోల్మంజూరు చేయడంతో మంగళవారం హరియాణా రాష్ట్రం రొహతక్లోని జైలు నుంచి బాబా బయటకు వచ్చారని లాయర్ జితేందర్ ఖురానా తెలిపారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలోనే ఆయన వచ్చే 40 రోజులు గడపాల్సి ఉంటుందన్నారు. డేరా వద్దకు ఎవరూ రావద్దంటూ అనుచరులనుద్దేశించి విడుదల చేసిన వీడియోలో బాబా కోరారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో కోర్టు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ ఆయన ఫర్లో, పెరోల్పై బయటకు వచ్చారు. తాజా పెరోల్తో కలిపితే ఈ ఏడాది దాదాపు మూడు నెలలపాటు జైలు బయట గడిపినట్లవుతుంది. 2024, 2022 సంవత్సరాల్లోనూ ఆయనకు కోర్టు ఫర్లా వెసులుబాటు కలి్పంచింది. 2017లో జైలుకు వెళ్లిన తర్వాత కనీసం 13 సార్లు ఆయన బయటకు వచ్చారు. డేరా సచ్ఛా సౌదాకు హరియాణా, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అనుచరులున్నారు. -
రాజస్థాన్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్
జైపూర్: రాజస్థాన్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించాలంటూ కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు.బారికేడ్లను దాటి సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్ కెనన్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకేశ్ భాకర్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ జాకడ్ సహా 30 నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో అంతకుముందు పైలట్ మాట్లాడారు.Took part in the protest organised by the Rajasthan unit of the NSUI, along with @varunchoudhary2 and @VinodJakharIN - against the state’s BJP governmentNSUI’s long standing demand is that the student body elections be held in across universities and colleges in Rajasthan.… pic.twitter.com/FiEoCwdyLP— Sachin Pilot (@SachinPilot) August 5, 2025ఈ సందర్బంగా సచిన్ పైలట్.. ‘ఢిల్లీలోని ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. నిలిపివేసిన విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలను మాట్లాడకుండా చేసినట్లే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయాలు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని, గెలుపోటములు కాకుండా ఎన్నికల ప్రక్రియను చేపట్టడమే ముఖ్యమైన అంశమన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సైతం జరిపేందుకు భయపడుతోందని పైలట్ ఆరోపించారు. -
భారత్కు సుంకాల బెదిరింపు.. ట్రంప్పై నిక్కీ హేలీ సెటైర్లు
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిక్కుతోచని స్థితిలో భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంగళవారం (భారత కాలమాన ప్రకారం) భారత్పై సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ హెచ్చరికలపై మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. ట్రంప్పై విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయాల్లో ఇలా వ్యవహరిస్తే అమెరికా-భారత్ల మధ్య సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. కానీ రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి.. భారత్తో ఉన్న బంధాన్ని దెబ్బతీయకండి’ అని హితువు పలికారు.అమెరికా-భారత్ల సంబంధాలకు నిక్కీ హేలీ సుదీర్ఘంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండో-పసిఫిక్లోని ప్రజాస్వామ్య దేశాలతో, ముఖ్యంగా భారత్తో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో చైనా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తరచూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి అమెరికా-భారత్ సంబంధాలను హైలెట్ చేస్తూ.. సుంకాలు విధించే విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు.India should not be buying oil from Russia. But China, an adversary and the number one buyer of Russian and Iranian oil, got a 90-day tariff pause. Don’t give China a pass and burn a relationship with a strong ally like India.— Nikki Haley (@NikkiHaley) August 5, 2025 -
కల్యాణ్ బెనర్జీ రాజీనామా ఆమోదం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, అసమ్మతి గళాలను ఆ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం లోక్సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ సమరి్పంచిన రాజీనామాను ఆమె ఆమోదించారు. ఆవెంటనే, కల్యాణ్ బెనర్జీ స్థానంలో కకోలీ ఘోష్కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. లోక్సభలో పార్టీ ఉపనేతగా శతాబ్ది రాయ్ను నియమించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసమ్మతిని, తిరుగుబాటు వైఖరిని సహించే ప్రసక్తేలేదని దీనిద్వారా ఆమె చెప్పకనే చెప్పినట్లయింది.‘పార్టీ కంటే తామే మిన్న అని భావించే వారికి ఇదో హెచ్చరిక. వారికి ఇటువంటి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’అని టీఎంసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిõÙక్ బెనర్జీకి లోక్సభలో పార్టీ నేతగా సోమవారం బాధ్యతలు అప్పగించడం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాలకు సరిగ్గా రాని ఎంపీలను వదిలేసి, తనది సమన్వయ లోపమని టీఎంసీ చీఫ్ మమత తప్పుబడుతున్నారంటూ కల్యాణ్ బెనర్జీ సోమవారం బహిరంగంగా వ్యాఖ్యానించడం తెల్సిందే. కొంతకాలంగా కల్యాaణ్ బెనర్జీ, పార్టీకే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రాలు మధ్య సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. -
గురూజీకి కన్నీటి వీడ్కోలు
నెమ్రా: జార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ గురూజీకి కన్నీటి వీడ్కోలు పలికారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూ సోరెన్ సోమవారం ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.పార్దివదేహాన్ని తొలుత ఢిల్లీ నుంచి విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీలో శిబూ సోరెన్ పార్దివదేహం వద్ద గవర్నర్ సంతోష్ గంగ్వార్, స్పీకర్ రవీంద్రనాథ్ మహతో, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులరి్పంచారు. అనంతరం రామ్గఢ్ జిల్లాలోని శిబూ సోరెన్ స్వగ్రామం నెమ్రాకు భౌతికకాయాన్ని తరలించారు. కడసారి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. గురూజీ అమర్ రహే అంటూ నినదించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. శిబూ సోరెన్ చితికి ఆయన పెద్ద కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిప్పంటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాలేకపోయారు. వారు తొలుత విమానంలోని ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు.అక్కడి హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దాంతో రోడ్డు మార్గంలో సాయంత్రం కల్లా నెమ్రాకు చేరారు. హేమంత్ సోరెన్తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపం దినాలు ప్రకటించింది. మంగళవారం జార్ఖండ్లో పాఠశాలలు మూసివేశారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు సైతం నిరవధికంగా వాయిదా పడ్డాయి. -
ఎస్ఐఆర్పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నినాదాల హోరు లోక్సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.ఎస్ఐఆర్పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు. మేము ఉగ్రవాదులమా?: ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్కు రాసిన లేఖపై ప్రెస్నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. -
22 నెలల్లో సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు పూర్తి ‘కర్తవ్య భవన్’ నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్(సీసీఎస్)లోని అన్ని భవనాల నిర్మాణం 22 నెలల్లో పూర్తవుతుందని పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇవి పూర్తయితే ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల నడుస్తున్న శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి వాటిని 10 కొత్త భవనాల్లోకి తరలిస్తామన్నారు. సీసీఎస్లో భాగమైన మొదటి భవనం ‘కర్తవ్య భవన్’ను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కర్తవ్య పథ్లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు.కర్తవ్య భవన్–03 కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాజెక్టులోనిదే. ఇందులోని నిర్మాణంలో ఉన్న 1, 2 భవనాలు వచ్చే నెలలో పూర్తవుతాయి. సీసీఎస్–10 భవనం వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. సీసీఎస్–6, 7 భవనాల నిర్మాణం 2026 అక్టోబర్ నాటికి రూపుదిద్దుకుంటాయి. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల నడుస్తున్న శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్లను కూలి్చవేసేందుకు రెండు నెలల్లో టెండర్లను ఆహ్వానిస్తామని మంత్రి ఖట్టర్ తెలిపారు.ఈ భవనాల్లోని మంత్రిత్వ శాఖలను తాత్కాలికంగా కస్తూర్బా గాంధీ మార్గ్లోని నేతాజీ ప్యాలెస్కు తరలిస్తామన్నారు. ఇలా ఉండగా, యావత్ సెంట్రల్ విస్తా నుంచి నిర్మించే మెట్రో లైనును ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేస్తామని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కటికితల శ్రీనివాస్ చెప్పారు. కొత్త మెట్రో లైను సీసీఎస్ భవనాలు, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మీదుగా వెళ్తుందన్నారు. -
ప్రైవసీ కోసం.. ఆన్లైన్ షాపింగ్..!
ఆన్ లైన్ షాపింగ్ మన జీవితాల్లో భాగమైపోయింది. కొంతమందికి ఇది గేమ్–ఛేంజర్. కిరాణా సామగ్రి, దుస్తులు, ఆహారం, బహుమతులు, ఫర్నిచర్, ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లో లభిస్తున్నాయి. వీటిని కొనేవారి సంఖ్య నేడు కోట్లలో ఉంది. ఆన్ లైన్ షాపింగ్ అంటే సౌకర్యం, ఎంచుకోవడానికి లక్షలాది ఉత్పత్తులే కాదు.. కొందరికి వ్యక్తిగత గోప్యత కూడా. ఆన్ లైన్ అయితే మనం ఉన్నచోటు నుంచే 24 గంటల్లో ఎప్పుడైనా షాపింగ్ చేయవచ్చు. మరొకరి అభీష్టాలతో కాకుండా సొంత నిర్ణయంతో తమకు నచ్చినవి చేజిక్కించుకోవచ్చు. జనం మధ్యలో కొనాల్సి వస్తోందన్న ఒత్తిడి లేదు. ట్రాఫిక్, ప్రయాణం వంటి అడ్డంకులూ లేవు.కొంత మంది జనంలో కలవడానికి ఇష్టపడరు. మరి కొందరు అధికంగా అవసరానికి మించి కొనుగోలు చేస్తారు. ఖర్చు ఎక్కువగా పెడితే షాపులోని వాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారో అని పదేపదే ఆలోచించి ఒత్తిడికి గురి అవుతారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ షాపింగ్ గొప్ప ఉపశమనం. వీరు తమ గురించి ఇతరులు అంచనా వేయకూడదని అనుకోవడం, సామాజిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటి లోతైన మానసిక భావాలను కలిగి ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు.కొంతమందికి బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ను ఇష్టపడే వ్యక్తులు సౌలభ్యం, సమయం, ఆచితూచి ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది అంతర్ముఖులు ఉంటారు. వీరు ఏకాంతంగా ఆన్ లైన్ లో షాపింగ్ ఇష్టపడతారు.ఇలాంటివి నచ్చక..ఆన్ లైన్ షాపింగ్లో ఏం కొనాలనేది మన నియంత్రణలో ఉంటుంది. ఏం కొన్నామో మరొకరికి తెలియదు. సురక్షితం అన్న భావన ఉంటుంది. నెమ్మదిగా, కావాల్సినంత సమయం షాపింగ్ చేయవచ్చు. 24 బై 7.. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా కొనుక్కోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచనే రాదు. మనకు ఇష్టమైన వెరైటీలు చూడొచ్చు, ధరలను పోల్చవచ్చు, కావలసినదాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఈ సౌలభ్యాలేవీ ఆఫ్లైన్ లో ఉండవు. మన రూపం, ఎంపికలు, బడ్జెట్ ఆధారంగా దుకాణదారులు కస్టమర్లను అంచనా వేస్తారు. ఏం కొనాలనేది కస్టమర్ల అభీష్టం. అలాంటిది ‘మీకు ఈ డ్రెస్ బాగుంటుంది’, ‘తక్కువ రేటే’ అంటూ షాప్వాళ్లు చేసే సూచనలు / సలహాలు చాలామందికి నచ్చవు. ఇవి కూడా ఆన్ లైన్ లో ఉండవు. దేనికి, ఎంతకు షాపింగ్ చేస్తున్నారో ఇతరులెవరూ కనుక్కోలేరు. అందువల్ల ఒకరి షాపింగ్ తీరుపై మరొకరు కామెంట్ చేసే అవకాశమూ ఉండదు.అపరాధ భావన ఉండొద్దని..ఆన్ లైన్ లో షాపింగ్ చేసినప్పుడు డబ్బు ఖర్చులోనూ ఇబ్బందులు ఉండవు. సంప్రదాయ నగదు మార్పిడి ఉండదు. చెక్అవుట్ వద్ద ఇబ్బందికరమైన స్వైప్ ఉండదు. ఖర్చు చేశామన్న అపరాధ భావన ఉండకూడదని ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారూ లేకపోలేదు. ఇతరులు వారి అభిప్రాయాలను రుద్దకుండా, జన సమూహం లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ పూర్తి చేయవచ్చు. అయితే అవసరం లేకపోయినా కొంత మంది.. ఏమీ తోచక లేదా వెబ్సైట్లో ఏదో డిస్కౌంట్ సేల్ అని ప్రకటించగానే కొనుగోళ్లు చేస్తున్నారట.కొనేసిన తరవాత.. అవసరానికి మించి కొన్నామన్న అపరాధ భావన వీరిలో ఉంటోందట. క్రెడిట్ కార్డ్తో షాపింగ్ చేసేవారిలో ఇది ఎక్కువగా ఉంటోందట. ఆన్లైన్ షాపింగ్ చేసే.. అంతర్ముఖ స్వభావం ఉండే వ్యక్తుల్లో మరో ప్రత్యేకత కూడా ఉంటుందట. ఒక ప్లాట్ఫామ్లో షాపింగ్ చేస్తున్నప్పుడు అది ఏదో సందర్భంలో నచ్చకపోతే.. దానిమీద కోపంతో మరో ప్లాట్ఫామ్కు వెళ్లిపోతారు. అంతేకాదు, ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరేది / క్వాలిటీ లేని వస్తువు వచ్చినా.. రిటర్న్ పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా కూడా వీరు వేరే వేదికను ఎంచుకుంటారట. తాము బహిష్కరించినట్టు భావించే మొదటి ప్లాట్ఫామ్ను కొన్నాళ్లు వదిలేస్తారు.ఈ సమస్యలూ ఉన్నాయిబయటకు వెళ్లి, ట్రాఫిక్లో విసుక్కుంటూ ప్రయాణించి, దుకాణాల్లో షాపింగ్ చేయడానికి కొన్ని గంటలు సమయం పడుతుంది. దీనివల్ల కొందరిలో అలసిపోయిన భావన ఉంటుంది. అదే పనిని కొన్ని క్లిక్లతో సాధ్యం చేసే మరింత అనుకూల అవకాశం ఉన్నప్పుడు అటువైపు మొగ్గు చూపేవారూ ఉంటారు. కానీ అధిక ఆన్ లైన్ షాపింగ్ కొన్నిసార్లు సామాజిక ఆందోళన లేదా అనవసరపు ఖర్చులకు దారితీయవచ్చు. ఆన్లైన్ షాపింగ్కి పరిమితమవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. జనానికి దూరం అవుతారు. నిశ్శబ్దంగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు ఆన్ లైన్ షాపింగ్ తలుపులు తెరిచే అవకాశమూ లేకపోలేదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.⇒ ఆన్ లైన్ షాపింగ్ శత్రువు కాదు. ఇది మారుతున్న జీవితాలు, అలవాట్లు, ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తుంది. కొంతమందికి ఇది సహాయకారి. సమయం ఆదా చేయడం, నచ్చినన్ని వెరైటీలు చూసుకునే వెసులుబాటు.. ఇలాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. అదే సమయంలో జీవితం మరింత డిజిటల్గా మారుతున్న కొద్దీ వాస్తవ ప్రపంచ అనుబంధాల విలువను, ఉనికిని మర్చిపోకూడదు. మనల్ని మనమే ఒంటరిని చేసుకోకూడదు అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.⇒ సమస్యల నుంచి తప్పించుకోవడానికి..: తక్కువ ఆత్మస్థైర్యం లేదా ఆత్మన్యూనత లేదా అంతర్ముఖత్వం కారణంగా దుకాణాలకు వెళ్లకుండా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవాళ్లు కూడా ఉంటారు. ఆ భావనను కప్పిపుచ్చుకునేందుకు లేదా అధిగమించే ప్రయత్నంలో.. తెలిసి కొందరు, తెలియక కొందరు అనవసరపు ఖర్చులు చేస్తుంటారని మానసిక వైద్యులు అంటున్నారు. -
సెల'వంటే' పండగ!
సెలవొచ్చిందంటే సువెన్ చక్ర ఇల్లు సందడిగా ఉంటుంది. బంధువులో, స్నేహితులో వస్తారని కాదు. సెల‘వంటే’ ఆ ఇంట పండగ. అవును.. వంటల పండగ. ఆ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు, సరుకులు పొద్దున్నే తెచ్చుకోవడం మొదలు.. భోజనం అయ్యేదాకా ఇంటిల్లిపాది చేయిపడాల్సిందే. ‘అమ్మ చేతి వంట. భార్య చేతి వంట ఎప్పుడూ ఉండేదే.. రెస్టారెంట్కు వెళ్లి విందు ఆరగించడం, నిమిషాల్లో ఇంటికొచ్చే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లూ కొత్త కాదు. వారంలో ఒక్కరోజే అందరూ కలిసి ఉండేది. కాబట్టి సెల‘వంటే’ పండగ అని అంటారు చక్ర. – సాక్షి, స్పెషల్ డెస్క్సెలవు రోజును ఎలాగైనా ప్రత్యేకంగా మలుచుకోవాలి. ఆ మధుర క్షణాలు వారమంతా గుర్తుండాలి. సెలవు మళ్లీ ఎప్పుడొస్తుందా అని కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూడాలి. ఇదంతా సాధ్యం చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్.. అందరూ కలిసి ‘వంట’ చేయడమే. యస్.. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పైగా వారం వారం కొత్త రుచులను ఆస్వాదించే చాన్ ్స వస్తే ఎవరు కాదనుకుంటారు? ఇంటర్నెట్ వచ్చాక వంట చేయడం చాలా సులభం అయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో విహరించి కొత్త వంటకం నిర్ణయిస్తాం. ఉద్యోగం చేసే మగవాళ్లు సెలవు రోజు వంట చేయడం పాత కాన్సెప్ట్. ఇంటిల్లిపాదీ కలిసి వంట చేయడంలో కొత్త ట్రెండ్. అందరూ కలిసి..ఆడవాళ్లే వంట చేయాలన్న మూస పద్ధతికి స్వస్తి పలకాల్సిందే. కుటుంబం అంటేనే సమిష్టి బాధ్యత. కనీసం సెలవు రోజైనా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వంట చేస్తే? ఒక్కసారి చేసి చూడండి. ఆదివారం, సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం మీ వంతు అవుతుంది. ఇలా అందరూ కలిసి వంట చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.తినేది తెలుస్తుందిబంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనూ, వారాంతాలు, పండుగలప్పుడు రెస్టారెంట్లకు వెళ్లడం పరిపాటి అయింది. వంట చేసే సమయం లేకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేస్తున్నారు. మనకు నచ్చినవి తింటున్నాం సరే.. ఆ ఆహారం ద్వారా చక్కెరలు, నూనెలనూ పరిమితికి మించి తీసుకుంటున్నాం. అలాకాకుండా మనమే వంట చేస్తే ఈ పదార్థాలను మితంగా వాడొచ్చు. ఇంట్లోని పిల్లలు, పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వంట చేస్తాం. అవసరమైతే ఉప్పూ, కారం తక్కువగా ఉన్నవి ముందు తీసిపెడతాం. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వాడకం మన చేతుల్లో ఉంటుంది. మితంగానూ వాడొచ్చు.. పూర్తిగా వాడకుండానూ ఉండొచ్చు. ఇంటిల్లిపాదికీ ఎంత ఆరోగ్యం!ఖర్చు తగ్గుతుందిరెస్టారెంట్లు గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. వినూత్న వంటకాలు, రుచులతో ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయి. ఖర్చూ అలాగే ఉంటోంది. నలుగురున్న కుటుంబానికి ఓ మోస్తరు రెస్టారెంట్లో భోజనానికి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిందే. కానీ, కాస్త మనసు పెట్టి.. ఇంట్లోని అందరూ తలో చేయి వేసి వండిన భోజనం.. అంతకు మించిన రుచి అందిస్తుంది. పైగా రెస్టారెంట్లో అయిన ఖర్చులో సగం కూడా కాదు. ప్రతీవారం రెస్టారెంట్కు వెళ్లే కుటుంబం నెలకు ఎంతకాదన్నా ఓ రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చన్న మాట.ఆరోగ్య ప్రయోజనాలుబయట ఎక్కువగా తిన్నా, ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఆర్డర్ చేసినా.. ఆ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ ఫుడ్లో రుచి కోసం ఏం కలిపారో తెలియదు. తాజాగా చేసిందో.. వేడి చేసి పంపిందో తెలీదు. ఏ నూనెలు వాడారో తెలియదు. అదే, ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే.. ఇంట్లో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా.. పిల్లలకు కూడా నచ్చినట్టుగా.. మనమే జాగ్రత్తగా ‘స్వయంపాకం’ చేసుకోవచ్చు. ఇంట్లోని అందరూ నిర్భయంగా ఇంటి ఫుడ్ని తీసుకోవచ్చు. అందరితో ఎంజాయ్ చేస్తూ రుచులు ఆస్వాదించొచ్చు.పరిమితాహారంఎంత రుచికరంగా ఉన్నా మితంగా తినాలన్నది పెద్దల మాట. మనం రెస్టారెంట్కి వెళ్లేటప్పుడు తెలియకుండానే అపరిమితంగా తినేస్తాం. డబ్బులు పెట్టాం కదా అని టేబుల్ మీద మిగిలిన ఆహారాన్ని, లేదా స్విగ్గీ /జొమాటో ద్వారా ఇంటికి వచ్చిన ఫుడ్ను పాడేయకుండా ఆ కాస్తా మనమే లాగించేస్తాం. అంటే మన స్థాయికి మించి అతిగా తింటాం అన్నమాట. దాంతో అనారోగ్య సమస్యలూ మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఇంట్లో వంట అయితే ఎంత తినాలనేది మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా వండుకుంటాం. వృథా పోదు.. అపరిమితంగా మన పొట్టలోకీ పోదు.బంధాలు బలంగాఈ సెల‘వంట’ద్వారా అందే అతి ముఖ్యమైన రహస్య పోషకాహారం.. బంధాలు మరింత బలపడటం. భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో వంట చేయడం, కలిసి తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఒకవేళ అప్పటివరకూ నామమాత్రంగా ఉంటే.. బలంగా అతుక్కోవడం మొదలవుతుంది. పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఇదో మంచి స్ట్రెస్ బస్టర్ అవుతుంది. పిల్లలకు పనులు అలవాటవుతాయి. కూరగాయలు, సరుకులపై అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు కరువవుతున్న నేటి రోజుల్లో.. ప్రతివారం వంటతో పండగ చేసుకుంటే.. కుటుంబ బలం పెరుగుతుంది.ఎన్నో ప్రయోజనాలు» వృథా ఉండదు, మితంగా తింటాం, ఖర్చూ తగ్గుతుంది » అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా వండుకోవచ్చు» ఒత్తిడి నుంచి ఉపశమనం» వారంలో 6 రోజులూ వండిపెట్టిన శ్రీమతికి మీ చేత్తో వండి పెట్టారన్న సంతృప్తిషరతు: వంట చేస్తున్నంతసేపూ.. దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తున్నంతసేపూ.. స్మార్ట్ ఫోన్ని (వంటల కోసం చూడాల్సి వస్తే తప్ప) దూరంగా పెడితే.. ఈ వంటకి మరింత ప్రేమానుభూతుల ‘రుచి’ చేకూర్చినవాళ్లవుతారు. -
24 గంటల్లో సుంకాల మోత
న్యూయార్క్/మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితితో భారత్పై తన ఆగ్రహాన్ని టారిఫ్ల రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ మంగళవారం ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్పై తన అక్కసును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని సీఎన్బీసీ స్క్వాక్ బాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు.భారత్ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్ మరోమారు నోరుపారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాగి్నకి ఆజ్యంపోస్తోందని ఆరోపించారు. ‘‘భారత్ ఇప్పటికీ మంచి వాణిజ్య భాగస్వామిగా ఎదగలేకపోయింది. భారత్ మాతో పెద్దస్థాయిలో వ్యాపారం చేస్తోందిగానీ మేం వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు.అందుకే ఇప్పటికే ఇటీవల 25 శాతం టారిఫ్ను విధించా. మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా. దీనికి ప్రధాన కారణం వాళ్లు రష్యా ముడి చమురును కొనుగోలు చేయడమే. అక్కడ ఇంధనాన్ని కొంటూ రష్యాకు నగదు ఇంధనాన్ని సమకూర్చుతున్నారు. ఆ ఇంధనంతో రష్యా యుద్ధయంత్రంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పద్దతి వాళ్లకు నచ్చుతుందేమోగానీ నేనైతే అస్సలు సంతోషంగా లేను’’అని అన్నారు.భారత్తో వాణిజ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా సరకులపై భారత్ అత్యంత ఎక్కువ టారిఫ్లను మోపుతోంది. మేం టారిఫ్లు పెంచడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం’’అని చెప్పారు. ‘‘మా ఈ సుంకాల మోత తర్వాత భారత్ దిగిరావొచ్చు. మా సరకులపై సున్నా దిగుమతి సుంకాన్ని ఆఫర్చేయొచ్చు. కానీ ఇది మాకు ముఖ్యం కాదు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్ల అంశమే మాకు ప్రధానం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. -
రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు?తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.పదేళ్లు చదివినానాన్ లోకల్ అవుతున్నాంప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. -
సంబంధాలు ఉన్నత స్థాయికి
న్యూఢిల్లీ: భారత్, ఫిలిప్పీన్స్ దేశాలు ఇష్టపూర్వకంగా మిత్రులుగా, విధిలిఖితం వల్ల భాగస్వాములుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్తో భేటీ అయ్యారు. భారత్–ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు.మోదీ, ఫెర్డినాండ్ సమావేశం సందర్భంగా తొమ్మిది ఒప్పందాలపై భారత్, ఫిలిప్పీన్స్ సంతకాలు చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటన, అమలు.. రెండుదేశాల సైన్యాల మధ్య చర్చలకు సంబంధించిన నియమ నిబంధనలు.. అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఫెర్డినాండ్ మీడియాతో మాట్లాడారు. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ సముద్రం దాకా రెండు దేశాలు ఉమ్మడి విలువలతో ఐక్యంగా పని చేస్తున్నాయని మోదీ ఉద్ఘాటించారు.యాక్ట్ ఈస్ట్ పాలసీతోపాటు ‘మహాసాగర్’లో ఇండియాకు ఫిలిప్పీన్స్ అత్యంత కీలకమైన భాగస్వామి అని స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సౌభాగ్యానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో–పసిఫిక్లో నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. భారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని నిర్ణయించడం పట్ల చాలా గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక స్టాంప్ విడుదలభారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక తపాలా బిళ్లను మోదీ, ఫెర్డినాండ్ విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఉత్తరాఖండ్లో బురద విలయం
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్స్టేలను భూస్థాపితం చేసింది. అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది.ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఉత్తరకాశీ జిల్లా మేజి్రస్టేట్ ప్రశాంత్ ఆర్య చెప్పారు. 50 మందికిపైగా జనం జాడ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ భద్రత, నిఘా కార్యక్రమంలో భాగంగా సమీప హార్సిల్లోయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారత ఆర్మీ 14 రాజ్రిఫ్ యూనిట్ బేస్క్యాంప్పైనా బురద దూసుకొచ్చింది. దీంతో 10 మంది జవాన్లు, ఒక సైన్యాధికారి(జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) జాడ సైతం గల్లంతైంది. తోటి జవాన్ల జాడ తెలీకుండాపోయినాసరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక, అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను ఘటనాస్థలి నుంచి సహాయక బృందాలు కాపాడాయి. డజన్ల కొద్దీ హోటళ్లు భారీ బురదలో కూరుకుపోయాయి. సమీప హెలిప్యాడ్ సైతం నాశనమైంది. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రీ ధామం సమీపంలోని ధరాలీ గ్రామంపైకి ఎగువ ప్రాంతాల వరద ముంచెత్తిన వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. హరిశీలా పర్వతం సమీపంలోని సత్తాల్ దగ్గరి కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా పెరిగిన ఖీర్గంగా నదీప్రవాహం హద్దులు దాటి దిగువక దూసుకొచి్చంది. ఈ వరదనీటితోపాటు వరద దిగువకు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చి అక్కడ ఉన్న ధరాలీ గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించింది. ప్రకృతి ప్రకోపం వార్త తెల్సి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక దళం, ఉత్తరాఖండ్ పోలీసులు, భారత ఆర్మీ బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలూ ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. బురదలో కూరుకుపోయిన ఇళ్ల నుంచి మట్టిని తొలగిస్తున్నారు. బురదలో చిక్కుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ చెప్పారు. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం తలెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రస్థాయిలో క్లౌడ్బరస్ట్ కుండపోత వర్షం కారణంగా ఈ బురద ముంచెత్తిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఘటన తర్వాత కేదార్నాథ్ వైపు యాత్రికుల రాకను తాత్కాలికంగా ఆపేశారు. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని సహాయక, అన్వేషణ చర్యల్లో పురోగతిపై ఆరా తీసేందుకు సీఎం ధామీకి ప్రధాని ఫోన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఫోన్చేసి వివరాలు ఆరాతీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనంగా జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలను పంపిస్తున్నట్లు సీఎంకు అమిత్షా చెప్పారు. ‘‘ధరాలీ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఈ విషాదఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నా. గ్రామస్థులకు అన్నిరకాలుగా సాయపడేందుకు మా ప్రభుత్వం సదా సిద్ధంగాఉంది’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. మృతుల కుటుంబాలకు రక్షణమంత్రి రాజ్నాథ్, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్లో నిమగ్నమై బాధితులకు సాయపడాలని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా కోరారు.ఎటు చూసినా బురదమయమే మెరుపు వరద ధాటికి గ్రామం చాలా వరకు ధ్వంసమైంది. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. కొండవాలు కింద ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు తప్పించుకునే అవకాశంలేకుండా పోయింది. పలువురిని బురద సజీవంగా కప్పేసింది. సమీప కొండ మీద నుంచి ఒకవ్యక్తి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. అద్భుతం జరిగినట్లుగా ఆ బురదలోంచి ఒకరిద్దరు బయటికొచ్చి శక్తినంతా కూడదీసుకుని ముందుకు కదిలారు. అప్పటికే అలసిపోయి నాలుగు అడుగులేసి అక్కడే కుప్పకూలిపోయారు.మరో వ్యక్తి కాస్తంత బలం కూడదీసుకుని ఎగువ ప్రాంతం వైపు నడక ప్రారంభించాడు. ‘‘నీ దగ్గర్లో పడిపోయిన ఆ వ్యక్తిని కూడా పైకి లాక్కొని రా’’అని కొండ మీద జనం అరుస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఒకతను సాయం చేయండండూ ఆ బురద మధ్యలో ఏడుస్తూ కనిపించాడు. కొందరు తమ వాళ్లకు వీడియోకాల్స్ చేసి తాము ఎక్కడ చిక్కుకుపోయామో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘అంతా ముగిసిపోయింది’’అని ఒకతను మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటికొచి్చంది. కొందరు ఊపిరిబిగబట్టిమరీ తమ వారి జాడ కోసం వెతుకుతూ కనిపించారు.డెహ్రాడూన్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం నుంచి సహాయక, అన్వేషణ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. సమీప హార్సిల్, సుఖీ లోయ ప్రాంతాలనూ వరదనీరు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో అక్కడి స్థానికులను పాలనాయంత్రాంగం అప్రమత్తంచేసింది. తక్షణం ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధరాలీ విలయవార్త తెలిసి సమీప దిగువ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సుఖీ గ్రామంలోనూ కుండపోత వర్షం కురిసింది. అక్కడ కొండచరియలు విరిగిపడడంతో హార్సిల్, ధరాలీ మధ్యలో అప్పటికప్పుడు ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది.ఇందులోని నీరు పెరిగితే దిగువ ప్రాంతాలకు కొత్త ముప్పు ఏర్పడనుంది. 20–30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేవలం 60 నిమిషాల్లోపు 10 సెంటీమీటర్ల స్థాయి వర్షపాతం నమోదైతే దానిని క్లౌడ్బరస్ట్గా చెబుతారు. వీటిని ముందస్తుగా ఊహించడం చాలా కష్టం. క్లౌడ్బరస్ట్ కారణంగా స్వల్ప వ్యవధిలోనే అపారజలరాశి వర్షపు నీటిబిందువుల రూపంలో స్వల్పప్రాంతంలో పడటంతో అక్కడ వరద పోటెత్తుతుంది. కొండప్రాంతమైతే కొండమట్టి నీటితో తడిసిపోయి మెత్తబడి కొండచరియలు విరిగిపడతాయి. దీంతో దిగువ ప్రాంతాల్లో అపార ప్రాణ, ఆస్తినష్టం సంభవించవచ్చు.ప్రకృతి ఒడిలో ప్రశాంత గ్రామం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం ఒక్కసారిగా మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో అసలు ఈ గ్రామం ఎక్కడుంది? అని చాలా మంది గూగుల్లో వెతకడం మొదలెట్టారు. యాపిల్స్కు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రంలోని హర్సిల్ లోయ సమీపంలో ధరాలీ గ్రామం ఉంది. గంగోత్రి ధామాన్ని దర్శించే వాళ్లు కాసేపు విడిది కోసం మార్గమధ్యంలో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఈ గ్రామ సమీపంలో భాగీరథి నది ప్రవహిస్తోంది. గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో ఇక్కడి పర్వతమయ ప్రకృతి సుందర దృశ్యాలను చూసేందుకు ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ ఆగుతారు.చార్ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సమయాల్లో ఈ గ్రామానికి పెద్దసంఖ్యలో జనం వస్తారు. ఇక్కడ అతిథి గృహాలు, లాడ్జీలు ఎక్కువ. అది కూడా తక్కువ ధరలకే విడిది సౌకర్యాలు లభిస్తుండటంతో సందర్శకులు, భక్తులు, యాత్రికులు ఈ గ్రామంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సముద్రమట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తులో ఈ గ్రామం ఉంది. ఈ ఘటనకు తోడు సమీపంలో కొండచరియలు విరిగి పడినఘటనల్లో ఐదు జాతీయరహదారులు సహా 163 చోట్ల రోడ్లపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.ఏడు రాష్ట్రరహదారులు, రెండు సరిహద్దు రోడ్లపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం సైతం భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. నైనిటాల్, చంపావత్, ఉధమ్సింగ్ నగర్, బగేశ్వర్, పౌరీ తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హిమాలయ దిగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు సర్వసాధారణం. మిగతా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాఖండ్లో క్లౌడ్బరస్ట్ ఘటనలు మరీ ఎక్కువ. -
సాగర గర్భంలో.. రహస్యాల అన్వేషణ
చంద్రుడు, అంగారకుడి గురించి తెలిసినంతగా మనకు సముద్రాల గురించి అవగాహన లేదు. అత్యంత స్వచ్ఛమైన, మనిషి నీడ కూడా తాకని వాతావరణాలే కాదు.. మనకు తెలియకుండా దాగి ఉన్న విలువైన వనరులు సైతం విశాలమైన సముద్రాల్లో నిక్షిప్తమై ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సముద్రం లోపల ఉన్న ఈ విస్తారమైన ప్రాంతాలను అన్వేషించే ప్రయత్నంలో మనదేశం సాహసోపేత ‘డీప్ ఓషన్ మిషన్ ’కు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లాను పంపినట్టే.. సముద్ర గర్భంలోకి మనుషులను పంపే దిశగా సముద్రయాన్ ప్రాజెక్టుతో అడుగు ముందుకేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత సముద్ర జలాల పరిధిలో విలువైన ఖనిజాలు, ఇంధన వనరులు, ప్రత్యేక జీవవైవిధ్యం వెలికితీయడం లక్ష్యంగా సముద్రయాన్ ప్రాజెక్టు ప్రారంభం అయింది. లోతైన సముద్ర అన్వేషణకు సంబంధించి సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ ఐఓటీ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు మత్స్య–6000 వాహనం అభివృద్ధి చేశారు. ఇటీవలే ఈ వాహనానికి కీలక వెల్డింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. లక్ష్యాన్ని సాధించడానికి..: ‘ప్రస్తుతం మహాసముద్రాల గురించి మనం అర్థం చేసుకున్నది కేవలం 5 శాతమే. 95 శాతం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. విశాలమైన సముద్రపు అడుగుభాగాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అన్వేషణలు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత్కు సముద్రయాన్ మిషన్ తోడ్పడుతుంది’ అని మిషన్ ను చేపట్టిన భారత ప్రభుత్వ భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ మిషన్ లో భాగంగా మనుషులను సముద్రమట్టానికి 6,000 మీటర్ల లోతుకు పంపుతారు. గుండ్రని సబ్మెర్సిబుల్ నౌక అయిన మత్స్య–6000 ద్వారా సముద్రపు లోతుల్లోకి వెళ్లి పరిశోధనలు సాగిస్తారు. నౌక వ్యాసం 2,260 మిల్లీ మీటర్లు. 80 మిల్లీ మీటర్ల మందంతో నౌక గోడ తయారైంది. టైటానియం–మిశ్రమంతో రూపొందిన గోడలు తీవ్రమైన బాహ్య ఒత్తిళ్లను, –3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. ఇప్పటికే పలు పరీక్షలు..: సముద్రంలో జీవ, నిర్జీవ వ్యవస్థలను అంచనా వేయడానికి, లోతైన సముద్ర పర్యాటకానికి గల అవకాశాలకు కొత్త దారులు తెరుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం దశలవారీగా చేపట్టేలా ప్రణాళిక రచించారు. సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి, ఫిబ్రవరిలో పలు పరీక్షలు పూర్తి చేశారు. 500 మీటర్ల లోతుకు వెళ్లే కీలక పరీక్ష 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పరిధిలో మత్స్య–6000 వాహనం వెళ్లి రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ముఖ్యమైన ఇంధన, ఖనిజ వనరులు అయిన మీథేన్ , కోబాల్ట్ అన్వేషణ సైతం సాగిస్తారు.రూ.4,077 కోట్ల నిధులు..డీప్ సీ మైనింగ్ మెషీన్ డిజైన్ సైతం పూర్తి అయింది. గత ఏడాది అండమాన్ సమీపంలో 1,173 మీటర్ల లోతుకు వెళ్లి 100 కిలోలకుపైగా కోబాల్ట్ ఆధారిత పాలీమెటాలిక్ నోడ్యూల్స్ను (లోహపు రాళ్లు) ఈ మెషీన్ సేకరించింది. ఈ ప్రాంతంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. ఇక సర్వే, అన్వేషణ కోసం పరిశోధన నౌక నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కేవలం ఈ నౌక కోసం రూ.1,277 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సముద్ర జీవశాస్త్ర అధ్యయనం కోసం అధునాతన మెరైన్ సెంటర్ రూ.692 కోట్లతో తమిళనాడులో ఏర్పాటుచేస్తున్నారు. కేంద్రం డీప్ ఓషన్ మిషన్ కు 2021–2026 మధ్య రూ.4,077 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నాటికి సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశారు. హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చ.కి.మీ. పరిధిలో సర్వే, అన్వేషణ కొనసాగిస్తారు. » మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది.» హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే, అన్వేషణ చేపడతారు.» సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు పరీక్షలు పూర్తి చేశారు.» అండమాన్ సమీపంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.» దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది.2026 చివరినాటికి..మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది. అలాగే లోతైన నీటి పరిశీలన, అన్వేషణను నిర్వహించడానికి అత్యవసర సమయాల్లో 96 గంటల వరకు పనిచేయగలిగే సామర్థ్యమూ దీని ప్రత్యేకత. దేశీయంగా అభివృద్ధి చేసిన వెయ్యికి పైగా విడి భాగాలు, వందలాది సాంకేతికతలు వాహన తయారీలో వినియోగించారు. 25 టన్నుల బరువుండే ఈ అత్యాధునిక వాహనంలో ముగ్గురు ప్రయాణించొచ్చు. దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది. డీఆర్డీఓ, ఐఐటీలు, భారత నావికా దళం, మిశ్ర ధాతు నిగమ్ తదితర సంస్థలు కూడా ఈ మిషన్ లో పాలుపంచుకున్నాయి. -
Uttarakhand: కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్!
ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయినట్లు సమాచారం. ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 12 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.కాగా, ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఉత్తరకాశీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి.రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో పేర్కొంది. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.#uttarkashicloudburstNature’s Fury at its worst. Horrifying footage of the moment.A #Cloudburst led to #flashfloods and #Landslide in the High Altitude village in #Dharali, #Uttarkashi in #UttarakhandPeople seen running away but are swept away in secondsSeveral houses… pic.twitter.com/DPG9JDr3yF— Surya Reddy (@jsuryareddy) August 5, 2025 -
Uttarakhand: క్లౌడ్ బరస్ట్.. షాకింగ్ వీడియో వైరల్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ముంచేసిన వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది."భాగ్ భాయ్ భాగ్, అరే భాగ్ భాగ్! (పరిగెత్తు.. పరిగెత్తు) అంటూ దూరం నుంచి అరుస్తున్నవారి మాటలు వీడియోలో వినిపిస్తాయి.. ఒక వ్యక్తి బురద నీటిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు.हर्षिल से झकझोर देने वाला दृश्य-मलबे में दबे जीवन की आखिरी कोशिश।एक व्यक्ति रेंगते हुए खुद को बचाने की जद्दोजहद में,तो दूसरा भागकर ऊपर चढ़ता दिखा।ऊपर से आवाज आई “उसे भी खींच लो!”लेकिन जब जान पर बनी हो,तो दूसरों की फिक्र बहुत पीछे छूट जाती है।#cloudburst #DisasterRelief pic.twitter.com/chvrssd1Fy— Adarsh Katiyar official (@Adarshkatiya) August 5, 2025ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో తెలిపింది. మరో వైపు స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. బురదను తొలగించి.. బాధితులను బయటకు తీసుకురాడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వర్షాలు కారణంగానే ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
భారత్కు ‘టారిఫ్’ షాక్.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. భారత్తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ మేము వారితో వ్యాపారం చేయం. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమరు కొనుగోళ్లను ఆపకపోతే మరో 24 గంటల్లో టారిఫ్ను భారీ ఎత్తున పెంచబోతున్నాను’అని అన్నారు. భారత కాలమాన ప్రకారం.. సోమవారం (ఆగస్టు 4)ట్రంప్.. భారత్కు హెచ్చరికలు పంపించారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత్కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్కు ఇవేం పట్టవు. అందుకే భారత్పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు.మరోమారు దిగుమతి టారిఫ్ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు.అయినా సరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్ను, విద్యుత్వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది. -
‘మీరంతా స్వర్గానికే’.. వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: అనూహ్యంగా సంభవించే వరదల కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోతుంటారు. తాజాగా, అలా సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఉత్తరప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 402 గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరద బాధితుల్ని మంత్రి సంజయ్ నిషాద్ పరామర్శించారు. ఓ ప్రాంతానికి వెళ్లిన ఆయనకు వరద బాధితులు తమ బాధల్ని చెప్పుకున్నారు. వరదల కారణంగా తాము కట్టు బట్టలతో సహా అన్నీ కోల్పోయామని వాపోయారు.అయితే అందుకు మంత్రి సంజయ్ నిషాద్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనంతో వారు స్వర్గానికి వెళతారు. విపక్షాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని అన్నారు.ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వరద బాధితులు మంత్రి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సదరు మంత్రి వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఏ ప్రాంతానికి వచ్చామనే సోయిలేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఎందుకంటే ఆయన సందర్శించిన గ్రామాలు గంగా నది వద్ద కాకుండా యమునా నది ఒడ్డున ఉన్నాయని చెబుతూ విస్తుపోతున్నారు. కాగా రాష్ట్రంలో 402 గ్రామాలకు వరద ముంపుకు గురయ్యారు. గంగా, యమునా వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. कानपुर देहात------वाह मंत्री जी गजब तरीका निकालेव हो भोले भाले ग्रामीणों को चुप कराने का,,,,बाढ़ ने गांवों में इस कदर तबाही मचाई है गांव वालो चैन सुकून सब खत्म हो गया तो माननीय जी कह रहे ""गंगा मैया गंगा पुत्रो का पैर धुलने आती है""आदमी सीधा स्वर्ग जाता""मंत्री जी यहाँ गांव… pic.twitter.com/oqIasyyikX— राम दीक्षित/Ram Dixit (@RamDixi72228341) August 4, 2025 -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
సువేందు అధికారి కాన్వాయ్పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
కూచ్ బెహార్: పశ్చిమబెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ కూచ్ బెహార్లో నిర్వహించిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఇటీవల బెంగాల్లో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ సర్కార్కు వ్యతిరేకంగా ఆయన ర్యాలీ నిర్వహించగా.. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్పై రాళ్లు విసిరారు. దాడులకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఖగ్రాబారి ప్రాంతంలో సువేందు అధికారి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న నిరసన కారులు ‘వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ధ్వంసమైంది. ఆ సమయంలోనే అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామాగా అంటూ టీఎంసీ నేతలు అభివర్ణిఇంచారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష గళాన్ని అణచివేయాలనే కుట్ర అంటూ బీజేపీ మండిపడింది. బుల్లెట్ప్రూఫ్ కారులో ఉండడం వల్లే సువేందు ప్రాణాలతో బయటపడినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
గ్రామంపై విరిగిపడిన కొండచరియలు.. 60మంది గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వరద బీభత్స సృష్టించింది. గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్ని ధ్వంసమయ్యాయి. శిధిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ 60మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్థులు కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగగా.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక, క్లౌడ్ బరస్ట్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌబ్ బరస్ట్ జరిగిందని తెలిపారు.BREAKING: Dehradun: Massive flood in the Khir Ganga river in Uttarkashi. Water carrying silt cascades into Tharali village. Many feared trapped. Disaster teams rushed. pic.twitter.com/wtXVrqYBzL— Rahul Shivshankar (@RShivshankar) August 5, 2025క్లౌడ్ బరస్ట్ కారణంగా హర్సిల్లోని ఖీర్ఘడ్లో నీటి స్థాయిలు భారీగా పెరుగుతున్నట్లు ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ బరస్ట్తో భారీగా నష్టపోయిన ధరాలీకి పోలీసులు,ఎస్డీఆర్ఎఫ్,విపత్తు బృందాలు మొహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశిలోని ధరావలిలో క్లౌడ్ బరస్ట్ గురించి నాకు సమాచారం అందింది. మేం ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. అతని ఎక్స్ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆర్కే పురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.మాలిక్ 1970వ దశకంలో ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయ నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. పశ్చిమ యూపీలోని బాగ్పట్కు చెందిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళ్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్దళ్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ 1984లో కాంగ్రెస్లో చేరి 1986లో రాజ్యసభకు వెళ్లారు.ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఆయన ఏడాది కాలం పని చేశారు. గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్గా పని చేసిన సత్యపాల్ మలిక్ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లను హెలికాప్టర్లో తరలించాలన్న తన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించి ఉంటే పుల్వామా ఘటన జరిగేదే కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గామ్ దాడి విషయంలోనూ ఆయన మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నిఘాలోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈ ప్రభుత్వం సిగ్గులేనిదని అంటూనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.पूर्व गवर्नर चौधरी सत्यपाल सिंह मलिक जी नहीं रहें।#satyapalmalik— Satyapal Malik (@SatyapalMalik6) August 5, 2025జమ్మూ కశ్మీర్ గవర్నర్గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత 2024లో మాలిక్ నివాస స్థలంతోపాటు సుమారు 30 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇందులో రూ.21 లక్షల నగదును, కొన్ని డిజిటల్ పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లంచం తీసుకున్న కేసులో ప్రశ్నించేందుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది కూడా. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని మాలిక్ స్పష్టం చేశారు. గవర్నర్గా ఉండగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో సీబీఐ మాలిక్తోపాటు మరో ఐదుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సుమారు రూ.2200 కోట్ల సివిల్ కాంట్రాక్ట్ల జారీ విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణ. -
‘దృఢ సంకల్పం, దూరదృష్టి గల నాయకత్వం’: ప్రధాని మోదీకి ఎంపీల అభినందన
న్యూఢిల్లీ: ఉగ్రదాడికి తగిన ప్రతీకారం తీర్చుకునే విషయంలో భారత నెగ్గిందని, ఉగ్రవాదం ఓడిందని.. దృఢ సంకల్పం, దూరదృష్టి గల నాయకత్వం ఇందుకు సారధ్యం వహించిందని ఎన్డీఏ తీర్మానించింది. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్లో సైనికుల శౌర్యానికి ఎన్డీఏ సభ్యులు అభినందనలు తెలిపారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎన్డీఏ ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు.నేడు (మంగళవారం) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నిర్వహించిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్లు విజయవంతమైన నేపధ్యంలో సభ్యులు ప్రధాని మోదీని హర్షద్వానాలతో ఆహ్వానించారు. ‘హర్ హర్ మహాదేవ్’అంటూ నినాదాలు కూడా చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు మోదీని ఘనంగా సత్కరించారు. #WATCH | Delhi: PM Narendra Modi was welcomed and felicitated with a thunderous applause amid chants of 'Har Har Mahadev', after the success of Operation Sindoor and Operation Mahadev, at the NDA Parliamentary Party Meeting. pic.twitter.com/DO4SjNPOAh— ANI (@ANI) August 5, 2025ఆపరేషన్ సిందూర్పై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం ప్రత్యేక తీర్మానం చేసింది. అనంతరం లైబ్రరీ బిల్డింగ్ నుంచి పార్లమెంట్ కి ఎన్డీఏ ఎంపీలు మార్చ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీని ఎన్డీయే ఎంపీలు సన్మానించారు. పీఎం మోదీ నేతృత్వాన్ని ఎన్డీఏ సభ్యులు ప్రశంసించారు. కాగా ఏప్రిల్ 22న పాకిస్తాన్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పహల్గామ్లో దారుణ దాడికి పాల్పడి,26 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ నేపధ్యంలో ‘భూమి పై ఎక్కడ ఉన్నా ఉగ్రవాదుల్ని వెతికి, శిక్షిస్తాం’ అంటూ ఏప్రిల్ 24న ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆ హెచ్చరిక మే 6-7 మధ్య రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ గా కార్యరూపం దాల్చింది. పాక్, పీఓకేలో ఉగ్ర శిబిరాలపై కచ్చితమైన దాడులు జరిగాయి. ఉగ్రదాడికి తగిన ప్రతీకారం జరిగింది. భారత నెగ్గింది. ఉగ్రవాదం ఓడింది అని ఎన్డీఏ తీర్మానం చేసింది. -
నేటి నుంచి ఆర్టీసీ బంద్!
కర్ణాటక: ప్రజా రవాణాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు మంగళవారం బంద్ అయ్యే అవకాశముంది. పలు డిమాండ్లపై సర్కారుతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు 38 నెలల వేతన బకాయిల చెల్లింపుతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. రవాణాశాఖ ఒక్కోట నాయకులు సీఎం సిద్దరామయ్య సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం నుంచి బస్సులు రోడ్ల పైకి వెళ్లవు. ఉదయం 6 నుంచి సమ్మె చేస్తామని రవాణా మండలి కార్మిక సంఘాల జాయింట్ క్రియా సమితి అధ్యక్షుడు అనంత సుబ్బారావ్ తెలిపారు. 14 నెలల బకాయిలిస్తాం: మంత్రి ఉద్యోగులకు 14 నెలల వేతన బకాయిలను ఇవ్వడానికి సీఎం సమ్మతించారని రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. విధానసౌధ వద్ద విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడుతూ బకాయిల కింద రూ.718 కోట్లు చెల్లిస్తామని అన్నారు. వాయిదాకు హైకోర్టు సూచన రవాణా సమ్మెను ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్.ముదగల్, ఎంజీఎస్.కమల్ ధర్మాసనం ఉద్యోగులకు సూచించింది. సమ్మె వల్ల జనజీవనం అస్తవ్యస్తమౌతుందని బెంగళూరువాసి జే.సునీల్ తదితరులు పిల్ వేశారు. విచారించిన జడ్జిలు ఒకరోజు వాయిదా వేయాలని సూచించారు. రవాణా ఉద్యోగులు సెలవులు రద్దు ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా శాఖ ఉద్యోగులు సెలవుల రద్దుచేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా కట్టడి చేసింది. ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, వీలైతే వారం సెలవు కూడా రద్దుచేయాలని అధికారులను ఆదేశించింది. గైర్హాజరయ్యే ఉద్యోగులు వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది. సమ్మె విరమించండి: సిద్దరామయ్య ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో సీఎం సిద్దరామయ్య విధానసౌధలో సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్లను తీర్చడానికి గడువు ఇవ్వాలని, సమ్మె యోచనను విరమించాలని కోరారు. కానీ ఉద్యోగులు మాత్రం డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. సమ్మె వల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశముంది. -
Dharmasthala case: బయటపడిన ఎముకలు, పుర్రె.. హత్యలు నిజమే?
ధర్మస్థళ: కర్ణాటకలోని మంగళూరు జిల్లాలోగల ధర్మస్థళ పుణ్యక్షేత్రం పరిధిలో సామూహిక ఖననాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను వందలాది మృతదేహాలను ఇదే ప్రాంతంలో ఖననం చేశానంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన దరిమిలా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది.11 వ సమాధి స్థలంలో..ఈ నేపధ్యంలో సిట్ అధికారులు తాము ఈ ప్రాంతంలో ఆరో రోజున సోమవారం కూడా తవ్వకాలు జరిపామన్నారు. ఈ తవ్వకాల్లో పలు ఎముకలు, ఒక పుర్రె లభ్యమయ్యిందని వెల్లడించారు. 11వ సమాధి స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే, ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి, సమీపంలోని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడన్నారు. అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అనేక ఎముకలు, ఒక పుర్రె దొరికాయన్నారు. తాము భోజన విరామం తీసుకోకుండా, గంటల తరబడి తవ్వకాలు జరిపామని సిట్ అధికారులు తెలిపారు. అయితే లభ్యమైన ఎముకలు, పుర్రెకు సంబంధించిన వివరాలపై వారు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సిట్ అధికారులు తాము గుర్తించిన 13 సమాధులలో తవ్వకం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న 11 వ సమాధి స్థలంలో తవ్వకాలు పూర్తయ్యాయా? లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తాజాగా లభ్యమైన ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.మరో ఫిర్యాదు..ఇదిలా ఉండగా, మంగళూరు జిల్లాలోని ఇచిలంపాడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త టి. జయంత్ సోమవారం సిట్ అధికారులకు ఒక ఫిర్యాదు సమర్పించారు. చట్టపరమైన విధానాలను పాటించకుండా మైనర్ బాలిక మృతదేహాన్ని ఒక పోలీసు అధికారి ఇక్కడ పూడ్చిపెట్టారని ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని, భయం కారణంగా ఆ సమయంలో ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు.. ఫిర్యాదుదారు జయంత్ను దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని సూచించారు.ఫోరెన్సిక్ పరీక్షలకు ఎముకలుసిట్ తాజాగా నేత్రావతి నది సమీపంలో జరిపిన తవ్వకాల్లో మానవ ఎముకలు లభ్యమయ్యాయి. నాలుగు అడుగుల లోతున 15 ముక్కలుగా ఉన్న ఎముకలను కనుగొన్నారు. అవి పురుషునికి చెందినవిగా భావిస్తున్నారు. వయస్సు, లింగం, మరణానికి కారణాన్ని నిర్ధారించేందుకు ఆ ఎముకలను ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలకు పంపారు. దీనికిముందు 2000–2015 మధ్యకాలంలో ఇక్కడ చోటచేసుకున్న మరణ రికార్డులను బెల్తంగడి పోలీసులు తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగించింది. మరోవైపు ఈ ఘటనపై యూట్యూబ్ ఛానళ్లు వివరాలను నివేదించేందుకు అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు మీడియా గ్యాగ్ ఆర్డర్ను ఎత్తివేసింది. మరోవైపు సిట్ మంగళూరులో తమ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. స్థానికుల సలహాలు, సూచనల కోసం హెల్ప్లైన్ను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆధారాలపై షాకిచ్చిన ఆర్టీఐ సమాధానం -
బస్సు నంబర్ 70 కనిపించడం లేదు
చెన్నై: బస్సు నంబర్ 70 కనిపించడం లేదు. గంటల తరబడి వేచి ఉన్నా ఏక్కడా కనిపించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆవడి నుంచి వండలూరుకు సిటీ బస్సు రూట్ నంబర్ 70 నడుస్తోంది. ఈ బస్సు 1982 సంవత్సరం నుండి నడుస్తోంది. అప్పటి నుండి ప్రతిరోజూ 35కి పైగా సర్వీసులు నడపబడుతున్నాయి. ఆ తర్వాత ఈ మార్గంలో 70వ నంబర్ బస్సులను అకస్మాత్తుగా నిలిపివేశారు. ఈ బస్సులను అకస్మాత్తుగా ఆపడానికి ఎటువంటి కారణం చెప్పలేదు. దీని తరువాత ప్రయాణికులు 70వ నంబర్ బస్సులను నడపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఈ బస్సులు మళ్లీ ఆవడి–వండలూరు మధ్య నడపబడ్డాయి. కానీ బస్సుల సంఖ్యను 35 నుండి 15కి తగ్గించారు. ప్రస్తుతం ఆ 15 సర్వీసులు కూడా నడపడం లేదు. రోజురోజుకూ బస్సుల సంఖ్య తగ్గుతోంది. బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో రోడ్లపై బస్సులు కనిపించడం లేదు. దీని కారణంగా అంబత్తూరు ప్రాంత ప్రజలు బస్సు నంబర్ 70 కోసం వెతుకుతున్నారు. అది కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ విషయంపై అంబత్తూరు ప్రాంత ప్రజలు మాట్లాడుతూ ఆవడి–వండలూరు మధ్య సిటీ బస్సు రూట్ నంబర్ 70ను పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉపయోగించేవారు. అయితే సంఖ్య తగ్గించబడింది. ప్రయాణికుల అవసరం దృష్ట్యా అదనపు బస్సులను నడపాలని అధికారులను అభ్యర్థించామన్నారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ బస్సులను తక్కువగా నడుపుతున్నామని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. అలాగే పాడి ప్రాంతంలో నివశించే చాలా మంది బస్సు నంబర్ 70పై ఆధారపడుతున్నారు. వారు ఈ బస్సులో తాంబరంతో సహా ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. దక్షిణ రైల్వే ప్రస్తుతం తాంబరం నుండి దక్షిణ జిల్లాలకు అనేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. దీని కారణంగా ఎక్స్ప్రెస్ రైలు పట్టుకోవడానికి వెళ్లేవారు. తాంబరం వెళ్లడానికి వారు బస్సు నంబర్ 70 బస్సులను ఉపయోగిస్తున్నారు. అందుకే బస్సు నంబర్ 70 అదనపు బస్సులను నడపాలి అని కోరుతున్నారు. -
శనిమందిరంలో దొంగబాబా తిష్ట.. మూడు ‘ఆధార్’లో పట్టుకున్న పోలీసులు
పట్నా: దేశంలో దొంగ బాబాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో పోలీసులకు పట్టుబడుతున్న నకిలీ బాబాల గణాంకాలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా మరో దొంగబాబా పోలీసులకు చిక్కాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇమాముద్దీన్ అన్సారీ(55) బెంగాలీ బాబా అలియాస్ బాలక్నాథ్ పేరుతో చలామణీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగబాబా ఏకంగా మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డుతో పోలీసులకు చిక్కాడు.ఉత్తరప్రదేశ్లోని షామ్లీలోని థానా భవన్ పరిధిలోని మంతి హసన్పూర్ గ్రామంలోగల శని మందిర్లో బెంగాలీ బాబా తిష్ట వేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతని అసలు గుర్తింపు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం అతనిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అన్సారీ నుండి పోలీసులు మూడు ఆధార్ కార్డులు, ఒక పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆధార్ కార్డులో బంగాలీ నాథ్ పేరు, సహరాన్పూర్లోని ఒక ఆలయానికి సంబంధించిన చిరునామా ఉంది. మిగిలిన రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులలో అతని అసలు పేరు ఇమాముద్దీన్ అన్సారీ , పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ జిల్లాలోని చిరునామా ఉన్నాయి.ఎస్పీ రాంసేవక్ గౌతమ్ మాట్లాడుతూ, నకిలీ పత్రాలు కలిగివుండటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమనే ఆరోపణలతో నిందితునిపై కేసు నమోదు చేశామన్నారు. అతనిని కైరానా కోర్టు ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారని తెలిపారు. అన్సారీకి సంబంధించిన వివరాలను సేకరించేందుకు యూపీ పోలీసులు పశ్చిమ బెంగాల్కు ఒక బృందాన్ని పంపారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటన స్థానిక హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇలాంటివారిపై పోలీసులు కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఎర్రకోటలో నిఘా వైఫల్యం.. బంగ్లాదేశీయులు అరెస్ట్.. అధికారులు సస్పెండ్
ఢిల్లీ: భారత స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమవుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. డమ్మ బాంబును భద్రతా అధికారులు గుర్తించకపోవడం ఒక కారణం అయితే.. ఎర్రకోటలోకి ఐదుగురు బంగ్లా దేశీయులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ కార్యaక్రమం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోటలో స్పెషల్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు భద్రతాధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. మొత్తం ఏడుగురు సస్పెండ్ కాగా.. వారిలో హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఉన్నారు. 7 police personnel, including constables and head constables, deployed for the security of the Red Fort, have been suspended due to negligence in security. The Delhi Police conducts daily drills as part of preparations for the program scheduled for 15th August. A team of the…— ANI (@ANI) August 4, 2025ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లాదేశ్కు చెందిన ఐదుగురు యువకులు.. ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్ట తెలిపారు. 20-25 ఏళ్ల వయసున్న వీరంతా అక్రమ వలసదారులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఎర్రకోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. Delhi Police arrested 5 Bangladeshi nationals who tried to forcibly enter the Red Fort premises. All of them are illegal immigrants. @Sreya_Chattrjee with more details.#news #ITVideo @anchorAnjaliP #RedFort #Delhi pic.twitter.com/JD56T6Mc5W— IndiaToday (@IndiaToday) August 5, 2025 -
భారత్ హెచ్చరించినా పట్టించుకోని పాక్.. పీఓకేలో దాయాది దుశ్చర్య!
న్యూఢిల్లీ: ఓవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంతటా 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ప్యాడ్లు ఏర్పాటయ్యాయి.పాకిస్తాన్ ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా, ఇప్పుడు వారి నెట్వర్క్లను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి కీలక ప్రదేశాలలో శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు. అదనంగా, జమ్మూ ప్రాంతంలోని మస్రూర్, చాప్రార్ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు లాంచ్ప్యాడ్లు, షకర్గఢ్లోని డ్రోన్ సెంటర్ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చిన్న శిబిరాల ఏర్పాటు.. భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత్ ప్రకటిస్తుండటంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతున్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి, ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది.అధునాతన సాధనాలతో పునరుద్ధరణ.. ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని వర్గాలు చెబుతున్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందింది. ఈ శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్ను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఈ పునర్నిర్మాణానికి ఐఎస్ఐ 100 కోట్లకు పైగా పాకిస్తాన్ రూపాయలను కేటాయించింది. -
తేజస్వీ యాదవ్పై కేసు నమోదు
పట్నా: బిహార్లో ఓటరు జాబితా ముసాయిదాపై వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్పై పట్నాలో కేసు నమోదైంది. ఓటరు గుర్తింపు కార్డులు రెండింటిని కలిగి ఉన్న తేజస్వీ యాదవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ లాయర్ రాజీవ్ రంజన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు గుర్తింపు కార్డు, అధికారికంగా అందజేసింది కాదని దానిపై విచారణ జరిపేందుకు తమకు అందజేయాలంటూ పట్నాలోని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారి ఆదివారం తేజస్వీని కోరడం తెల్సిందే. ఈసీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్పై చట్టపరంగా ముందుకెళతామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. -
ఒడిశా విద్యార్థి ఆత్మహత్య కేసులో ఏబీవీపీ నేత సహా ఇద్దరు అరెస్టు
భువనేశ్వర్: బాలాసోర్లో కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శితో సహా ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని నిప్పంటించుకున్నప్పుడు ఏబీవీపీ నాయకుడు సుభత్ సందీప్ నాయక్, జ్యోతి ప్రకాష్ బిస్వాల్ అక్కడే ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమావేశంలో విద్యార్థినిపై ఒత్తిడి చేశారు. అంతేకాదు.. యువతిపైనే చర్యలు తీసుకోవాలంటూ కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి నిందితుడు సాహూ విద్యార్థుల బృందాన్ని సమీకరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్, హెచ్ఓడీ సాహూను గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు పురికొలి్పన ఇద్దరు ఏబీవీపీ నేతలను ఇటీవల అరెస్టు చేశారు. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ చదువుతున్న 20 ఏళ్ల యువతి.. డిపార్ట్మెంట్ హెడ్ సమీర్ కుమార్ సాహూ తనను లైంగికంగా వేధిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది పెద్దగా పురోగతి సాధించలేదు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ను కలిసిన ఆమె.. కొద్దిసేపటికే క్యాంపస్లోనే నిప్పంటించుకుంది. ఆమెను మొదట బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, తరువాత ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె ప్రాణాలతో పోరాడింది. పరిస్థితి విషమించడంతో జూలై 14న మరణించింది. వేధింపుల కారణంగా యువతి బాధపడుతోందని తోటి విద్యార్థులు తెలిపారు. సాహూ అనుచిత డిమాండ్లు చేసేవాడని, అంగీకరించకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడన్నారు. -
‘మాస్క్డ్ బూబీ’ ముంబైలో ప్రత్యక్షం
ముంబై: ఉష్ణమండల ప్రాంతాల్లో తీరానికి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మాస్క్డ్ బూబీ పక్షి ముంబైలో ప్రత్యక్ష మైంది. ఇవి జన సంచారం ఉన్న చోట కనిపించడం చాలా అరుదు, అనూహ్యమని నిపుణులు అంటున్నారు. గోరెగావ్ ఈస్ట్లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని భవానీ బిల్డింగ్లో బుధవారం సాయంత్రం బూబీ బర్డ్ వాలింది. ఎన్నడూ చూడని పక్షి కావడంతో స్థానికులు సునీల్ గుప్తా అనే వన్యప్రాణి సంరక్షకునికి సమాచారమిచ్చారు. ఆయన దానిని జాగ్రత్తగా పట్టుకుని తదుపరి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అందజేశారు. సునీల్ గుప్తా గత పదిహేనేళ్లుగా వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘బుధవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో రెసిడెన్షియల్ సొసైటీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ భవనంలోకి ఓ కొత్తరకం పక్షి వచ్చి వాలిందని చెప్పారు. సాయి మొండ్కర్ అనే మరో సంరక్షకునితో కలిసి ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లాను. పరిశీలించి చూడగా అది అరుదైన జాతికి చెందిన మాస్క్డ్ బూబీ పక్షిగా తేలింది’అని గుప్తా చెప్పారు. ‘ఇవి సముద్రంలో మారుమూల దీవుల్లో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తుంటాయి. చేపలు వీటి ఆహారం. తరచూ సమూహాలుగా సంచరిస్తుంటాయి. బలమైన గాలుల తాకిడికో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి ఉంటుంది. మనుషులంటే వీటికి చాలా భయం. కాకులు వెంటాడటంతో మరో దారి లేక ఇక్కడికి వచ్చి ఉంటుంది’అని వివరించారు. ‘బూబీ అనే పేరు బోబో అనే స్పానిష్ మాట నుంచి వచ్చింది. బోబో అర్థం హాస్యగాడు. చూడటానికి ఇవి నవ్వు తెప్పించేలా ఉంటాయి. అందుకే వీటికా పేరు వచ్చి ఉంటుంది’అని గుప్తా వివరించారు. రూపం, లక్షణాలు మాస్క్డ్ బూబీల తల, ఆపై భాగం బూడిద–గోధుమ రంగులో ఉంటుంది. రెక్కలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ముక్కులు పసుపు రంగులో కనిపిస్తాయి. వీటి ముఖం నీలం–బూడిద రంగులోనూ, కళ్లు ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి. పెద్దవయ్యేకొద్దీ ఈకలు ప్రధానంగా తెల్లగా మారుతాయి. ఈ జాతి పక్షులు బలమైన ముక్కు, పొడవైన, కోణాల రెక్కలకు ప్రసిద్ధి చెందింది. సముద్రంలోకి డైవ్ చేసి ఎరను పట్టుకోవడానికి ఇవి మాస్క్డ్ బూబీలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. -
చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా
కోల్కతా: లోక్సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ టీఎంసీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. సభలో ఎంపీల మధ్య సమన్వయం లేదంటూ అన్యాయంగా తనను నిందిస్తున్నారంటూ ఆవేదన చెందారు. పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు లోక్సభ సమావేశాలకు రావడమే అరుదని చెప్పారు. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం పార్టీ ఎంపీలతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటరీ విభాగంలో సమన్వయం కొరవడిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంటరీ పార్టీలో సమన్వయం లేదంటూ వర్చువల్ మీటింగ్లో దీదీ(మమత)అన్నారు. అందుకు నేనే కారణం. అందుకే, రాజీనామా చేస్తున్నా’అని వివరించారు.పార్లమెంట్కు తరచూ డుమ్మాకొట్టే వారిని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని వదిలేసి ప్రతిదానికీ తననే తప్పుపట్టడంపై కల్యాణ్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇంతకుముందు, మరో ఎంపీ కీర్తి ఆజాద్తో కల్యాణ్ బెనర్జీ వివాదం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఘటనే తాజా పరిణామాలకు దారి తీసిందని చెబుతున్నారు. ఓ ఎంపీ తనను వ్యక్తిగతంగా అవమానించినా పార్టీ నాయకత్వం మౌనందాల్చిందంటూ పరోక్షంగా మహువా మొయిత్రా నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘లోక్సభ ఎంపీల మధ్య పోట్లాటలు, తగవులు జరుగుతున్నాయని దీదీ అంటున్నారు. నన్ను దూషించిన వారిని వదిలేయాలా? ఈ విషయం నేను నాయకత్వానికి చెప్పినా, నాదే తప్పంటున్నారు. మమతా బెనర్జీని ఆమె ఇష్టమొచ్చినట్లుగా పార్టీని నడుపుకోనివ్వండి’అంటూ నిర్వేదం చెందారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో కీలక మార్పు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధిష్టానం పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు జరిగాయి. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి లోక్సభ నేతగా బాధ్యతలు అప్పగించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తిరిగి వచ్చే వరకు ఆయన స్థానంలో అభిషేక్ కొనసాగనున్నారు. -
ఎస్ఐఆర్పై చర్చకు పట్టు స్తంభించిన లోక్సభ
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. -
మళ్లీ సుంకాలు పెంచుతా!: ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్/ న్యూఢిల్లీ: భారతీయ సరకులపై కొత్తగా 25 శాతం దిగుమతి సుంకాల మోత మొదలై వారమన్నా గడవకముందే ట్రంప్ తన తెంపరితనాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య బెదిరింపులకు చిరునామాగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్పై తన ఆగ్రహజ్వాలలను టారిఫ్ల రూపంలో వెళ్లగక్కనున్నారు. చమురును రష్యా నుంచి భారత్ విపరీతంగా కొనుగోళ్లు చేస్తుండటంతో రష్యాకు లాభాల పంట పండుతోందని, ఇందుకు భారతే ప్రధాన కారణమని ట్రంప్ మరోమారు ఆరోపించారు. రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్పై మళ్లీ టారిఫ్లను విధిస్తానని ట్రంప్ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్చేశారు. భారత్పై 25 శాతం దిగుమతి సుంకాలు ఐదు రోజుల క్రితమే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ‘‘రష్యా నుంచి భారత్ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. సొంత అవసరాల కోసం మాత్రమే కాదు ఇతర దేశాలకు తిరిగి రీసేల్ చేసేందుకూ రష్యా నుంచి ఆయిల్ను కొంటోంది. ఇలా కొన్న ఆయిల్ను అక్రమంగా ఓపెన్మార్కెట్ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది. భారత్ తన లాభాలను చూసుకుంటోందిగానీ రష్యా ఏ స్థాయిలో లాభాల పంట పండిస్తోందో భారత్ పట్టించుకోవట్లేదు. భారత్కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్కు ఇవేం పట్టవు. అందుకే భారత్పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి పూర్వం భారత చమురు దిగుమతుల్లో రష్యావాటా కేవలం 0.2 శాతం కాగా ఆతర్వాతి రోజుల్లో అది 35 నుంచి 40 శాతానికి ఎగబాకడం విశేషం. ఈ నేపథ్యంలోనే రష్యా, భారత్ చమురు వాణిజ్య బంధాన్ని తెంపేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. జూలైలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 36 శాతంగా ఉండటం గమనార్హం. తీవ్రంగా ప్రతిస్పందించిన భారత్ మరోమారు దిగుమతి టారిఫ్ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం. భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది. అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్ను, విద్యుత్వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది. -
టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్
ముఖం చూసి బొట్టు పెట్టడమనేది స్థాయీభేదాలను సూచించే సామెత! ఇప్పుడు ఆ బొట్టు అమెరికాలోనూ ఆక్షేపణీయమైంది.. సొలిసిటర్ జనరల్ పదవికి! దాంతో ఆధునిక నాగరికతకు ఆనవాలంగా భ్రమపడే అమెరికా మరొక్కసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మథుర శ్రీధరన్ అమెరికాలోని ఒహైయో రాష్ట్ర 12వ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. అంతే నిరసనలు, ట్రోల్స్తో నిండిపోయింది ఎక్స్. మథుర ప్రజ్ఞాపాటవాల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ.. ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో! ‘సొలిసిటర్ జనరల్గా ఒక ఇండియన్ ఏంటీ? ఒహైయోలో అమెరికన్స్ కరువయ్యారా?’ అంటూ ఒకరు, ‘నుదుటన పర్మినెంట్ చుక్క పెట్టుకుని మరీ వచ్చిందండీ కొలువుకి’ అంటూ మరొకరు, ‘జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటీ?’ అంటూ ఇంకొకరు, ‘బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేతకాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేమో’ అంటూ వేరొకరు ఎక్స్లో కామెంట్లు గుప్పించారు. ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తిసామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే.. ఆ ట్రోల్స్, కామెంట్స్కి జవాబుగా ఒహైయో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ స్పందిస్తూ ‘చాలామంది మథుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు. కానీ ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అమెరికా పౌరురాలే! అంతేకాదు అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సొలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్ఫెక్ట్ అభ్యర్థి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు కూడా! ఇవికాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు.. మీ మెదళ్లలో ఉంది’ అని పోస్ట్ చేశారు. మథుర శ్రీధరన్.. ఎమ్ఐటీ (మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్గ్రాడ్యూయేట్. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ (జేడీ) పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదనా పటిమ ఆమె సొంతం. ఆ ప్రతిభే ఆమెను సొలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది. -
భారత్పై రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై రెచ్చిపోయారు. భారత్పై మరోసారి సుంకాన్ని భారీ మొత్తంలో విధిస్తామని హెచ్చరించారు.గత వారం ట్రంప్ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా పెనాల్టీ విధించారు. తాజాగా, రానున్న రోజుల్లో భారత్పై మరింత సుంకాల్ని విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చమురును కొనుగోలు చేయడమే కాదు.. దానిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. రష్యా వార్ మెషిన్తో ఎంతమంది ఉక్రెయిన్లు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే భారత్పై గణనీయంగా సుంకాలు విధిస్తామని’ పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో మరోసారి టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. పలు జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భారత్పై 25శాతం ట్రంప్ సుంకం విధించారు. ట్రంప్ నిర్ణయం అనంతరం భారత్ సంస్థలు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయని.. ఆ నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారనేది సదరు మీడియా కథనాల సారాశం. ఈ కథనలపై కేంద్రం స్పందించినట్లు సమాచారం. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ శక్తులు. జాతీయ ప్రయోజనాల కోసం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘటించింది. భారత చమురు సంస్థలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది.ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధంలో రష్యా ఆదాయ మార్గాలను అరికట్టేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్-రష్యా స్థిరమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని వెల్లడించింది. -
‘పోయింది అనుకున్న మ్యాచ్ గెలిచారు.. నన్ను క్షమించండి’
ఇంగ్లండ్పై ఓవల్ వేదికగా అనూహ్య విజయం సాధించిన టీమిండియాపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. మన చేతుల్లో మ్యాచ్లో లేదు.. పోయింది అనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతం చేశారన్నారు. తాను కూడా మ్యాచ్ మన నుంచి చేజారిపోయిందనే అనుకున్నానని, అయితే అది తప్పు అని నిరూపించి మన ఆటగాళ్లు అద్భుతమే సృష్టించారని పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉందని తాను చెప్పిన దానికి బదులుగా టీమిండియా సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు శశిథరూర్.Words fail me….WHAT A WIN! 🇮🇳🏏 Absolutely exhilarated & ecstatic for #TeamIndia on their series-clinching victory against England! The grit, determination, and passion on display were simply incredible. This team is special. I am sorry that I expressed a spasm of doubt about…— Shashi Tharoor (@ShashiTharoor) August 4, 2025 ‘మ్యాచ్ను టీమిండియా కోల్పోతుందనే అనుకున్నా. ఓటమి ఖాయమని చెప్పాను. అయితే అది తప్పైంది. మన మీద మనం నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టించవచ్చనే దానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి’ అంటూ శశిథరూర్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు. ఇంగ్లండ్తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచనల విజయం సాధించింది.లార్డ్స్ టెస్టులో బ్యాట్తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ టెస్టులో విజయం సిరీస్ను భారత్ 2-2తో సమం చేసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
అందుకు శ్రీకృష్ణ భగవానుడే తొలి మధ్యవర్తి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 150 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన పురాతన బాంకే బిహారీ ఆలయానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం-ఆలయ ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఉన్నత స్థాయి కమిటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బృందావన్లో ఉన్న బాంకే బిహారీ కృష్ణ దేవాలయం అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా రూ. 500 కోట్లను ఆలయ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి యూపీ ప్రభుత్వం సిద్ధం కాగా, ఆలయ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఆలయ నిధులను అభివృద్ధికి వాడటానికి మే 15వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, తాజా తీర్పులో ఆ వివాదాన్ని ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సెటిల్ చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గత తీర్పును ఉపసంహరించుకోవాలని ధర్మాసనం మౌఖికంగా ప్రతిపాదించింది ప్రస్తుత ధర్మాసనం.తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే..బాంకే బిహారీ ఆలయం-యూపీ ప్రభుత్వం వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ‘ బృందావన్లోని బాంకే బిహారీ టెంపుల్కు తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోండి. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ట్రస్టు బోర్డుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. గత సుప్రీంకోర్టు తీర్పులో కొంత భాగాన్ని నిలుపుదల చేద్దాం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేక సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జి ఇరు పక్షాలకు ధర్మకర్తగా ఉంటారు’ అని స్పష్టం చేసింది. ఇదీ ఆలయ చరిత్ర..1862లో నిర్మించబడిన ఈ ఆలయం రాజస్తానీ శైలిలో నిర్మించబడిందిఉత్తరప్రదేశ్లోని బాంకే బిహారీ ఆలయం బృందావన్లో ఉన్న శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి.ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం.ఇక్కడ శ్రీ బాంకే బిహారీగా పూజించబడే కృష్ణుడు, బాలరూపంలో దర్శనమిస్తాడు.ప్రత్యేకత: ఈ ఆలయంలో గంటలు మోగించరు, హారతులు ఇవ్వరుఇది భక్తి శ్రద్ధలకు అడ్డురాకుండా ఉండేందుకు అనాదిగా వస్తున్న ఆచారం.ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులు దేవుని పాదాలను దర్శించగలుగుతారు.వివాదం ఇలా.. ఆలయ అభివృద్ధికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఆలయ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. రూ. 500 కోట్లను కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ అభివృద్ధి కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంతో బాంకే బిహారీ టెంపుల్ ట్రస్టు మధ్య వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి కారణం రూ. 500 కోట్ల కారిడార్ ప్రాజెక్ట్. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకురాగా, ఆలయ ట్రస్ట్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత తీర్పును మౌఖికంగా నిలుపుదల చేస్తూ దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీన్ని హైకోర్టు లేదా, జిల్లా కోర్టు మాజీ జడ్జిల ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించడమే సరైన మార్గంగా పేర్కొంది. ఆలయ వారసత్వం దెబ్బతింటుందనే..యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలయ అభివృద్ధి-నిధులు ఆర్డినెన్స్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు ఆలయ ట్రస్ట్ అభ్యంతరంతో పాటు స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో మరమ్మత్తులు చేపడితే ఆలయ వారసత్వం, వాస్తవికత దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇది సున్నితమైన అంశం కావడంతో పాటు ఆధ్యాత్మిక వైభవం, సంప్రదాయాల సమతుల్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..
నాన్న అంటే త్యాగం, బాధ్యత. వాటిని పక్కనపెట్టి తన సౌఖ్యం చూసుకుంటే కుటుంబం ఏవిధంగా చిన్నాభిన్నమవుతుందో అనేందుకు ఉదాహారణే ఈ ఘటన. తండ్రి కుటుంబానికి ప్రధాన ఆధారం అదే గాడి తప్పితే..దాన్ని బేసి చేసికుని ఉన్నవన్ని తునాతునకలేపోతాయి. తండ్రి స్థానం ఎంత బాధ్యతయుతమైనదో..అది దారితప్పితే ఫలితం తట్టుకోవడం అనితరసాధ్యమైనది. ఎంత ప్రయత్నించిన సరిద్దుకోలేని విధంగా ఉంటుంది. 'నాన్న' అని పిలుపుకి దూరమయ్యేలా వ్యధ మిగులుతుంది.ఈ విషాదకర ఘటన ఘజియాబాద్లోని గోవింద్పురంలో చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అవినాష్ అతడి సోదరి అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 22 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని తండ్రి కారణంగా ఆ పిల్లల పడ్డ బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది. అంతేగాదు తమ మరణానికి కన్న తండ్రి, సవతి తల్లి రీతులే కారణమని పేర్కొంది సూసైడ్ నోట్లో. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు గత గురువారం చనిపోగా, వారి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులకు చెప్పారు కుటుంబసభ్యులు. అయితే అనుమానస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితుల ఇంటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా, డైరీలో రాసిన 26 పేజిల అంజలి సూసైడ్నటి బయటపడింది. అందులో అంజలి తన వ్యథను వివరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన సవతి తల్లి రీతు, తండ్రి సుఖ్వీర్ సింగ్ తమను ఎంతగానో మానసింగా వేధిస్తున్నట్లు తెలిపింది. తన తండ్రి రెండో వివాహం కోసం కన్న పిల్లల గొంతు నొక్కేశాడని, వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపించింది. అలాగే సవతి తెలివితేలు ముందు సుఖ్వీర్ సింగ్ వివరణ పూర్తిగా నిజాయితీ లేనిదని ఆరోగపించింది. ఆయన తన సవతితల్లినే నమ్ముతాడని కూడా ఫిర్యాదు చేసింది. తన సవతి తల్లి రీతూ తన గురించి తప్పుగా మాట్లాడి అవమానించినట్లు పేర్కొంది. ఆ మాటలను తన తండ్రి ఖండించను లేదు, పైగా తననే తప్పు పట్టడం తట్టుకోలేకపోయానని వాపోయింది. తన సవతి తల్లి నీడలో 16 ఏళ్లు తాను తన సోదరుడు ఎంత నరకయాతన అనుభవించామో చెప్పుకొచ్చింది. తన డైరీలో రాసిన సూసైడ్ నోట్ని చింపివేయొద్దని తను ఒంటరిగా చనిపోతే పలు ప్రశ్నలు లెవనెత్తాతారని వేడుకుంది. తన సవతి తల్లి తెలివితేటలు గురించి తెలుసునని అందుకే ముందు జాగ్రత్తగా దీన్ని ఫోటో తీసి వాట్సాప్లో చాలామందికి పంపినట్లు తెలిపింది. ఇక తమ మృతదేహాలను తన తండ్రి తాకడానికి వీలు లేదని తన స్నేహితుడు మహీనే తమ అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పింది. పైగా తన ఖాతాలో డబ్బు కూడా తీసుకోమని, మిగిలిన డబ్బుని తన కుటుంబసభ్యులకు ఇవ్వమని పేర్కొంది. తన స్నేహితుడు మహీనే తనను అర్థం చేసుకున్నాడని, అందకుగాను తాను ఇస్తున్న చిన్న మొత్తం ఇది అని లేఖలో తెలిపింది. అలాగే ఆ లేఖలో తన మేనమామలు, దేవేంద్ర, అనిల్లను ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు మా బాగోగులు గురించి కనీసం వాకబు కూడా చేయలేదు, మీరు బంధువులేనా అని ప్రశ్నించింది. తన అన్నయ్య, తాను చాలా మానసిక ఒత్తడిలో ఉన్నాం..ఇక భరించలేక ఈ పనికి ఒడిగట్టాం అని లేఖలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆ మృతుల తల్లి కమలేష్ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆమె చనిపోయిన ఆరు నెలలకే తన స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడంటూ బావమరిది సుఖ్వీర్సింగ్పై ఫిర్యాదు చేశారు అంజలి మేనమామలు. ఇక బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్, తన భార్య తాను ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నామని, అదంతా ఎవరికోసం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల మరణంతో చచ్చిన శవంగా అయిపోయానంటూ విలపించాడు. తన కూతురు అంజలి ఇలా తన పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తనకు తెలియదని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్. ఇక మృతులు అవినాష్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారి కాగా, అంజలి నోయిడాలోని ఎగుమతి సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నట్లు మేనమామ దేవేంద్ర వెల్లడించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై మరింత కూలంకషంగా దర్యాప్తు చేయడమేగాక దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్) -
మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలకు భద్రత కరువవుతున్నదనే మాట తరచూ వినిపిస్తుంటుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్కు వెళుతూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉదయం నడకకు వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ, ఆమె మెడలో నుంచి చైన్ లక్కెళ్లిన దొంగ అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. తమిళనాడు భవన్ నుండి ఎంపీ సుధ.. మరో మహిళా పార్లమెంటు సభ్యురాలు రాజతి వాకింగ్కు వెళుతూ, రాయబార కార్యాలయం సమీపంలో ఉన్నప్పుడు ఒక స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఎంపీ సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఇద్దరు ఎంపీలు అతనిని గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో ఎంపీ మెడకు గాయాలయ్యాయి. -
తీవ్ర చిక్కుల్లో అనిల్ అంబానీ.. బ్యాంక్లకు ఈడీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా ఈ కేసులో పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబధించి పలు వివరాలు కోరింది. వీటిల్లో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉన్నాయి. మొత్తం 12-13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో వీటిల్లో పబ్లిక్ సెక్టార్తోపాటు ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింద్ బ్యాంక్ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అనిల్ అంబానీ కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు బ్యాంక్ అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిని లోన్ క్లియరెన్స్లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్, రికవరీ చర్యలను అడగనున్నట్లు తెలుస్తోంది. కాగా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇటీవల అనిల్ అంబానీుకి నోటీసులు ఇవ్వగా తాజాగా మరో ఆరుగురికి కూడా నోటీసులు కూడా ఇచ్చింది. గత వారం రూ.3,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్ను ఈడీ అరెస్టు చేసింది. -
డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!
అన్యాయాలను నిలదీసిన తండ్రిని తన చిన్నతనంలోనే వడ్డీవ్యాపారులు గుండాల సాయంతో హత్య చేయించడం కళ్లారా చూశారాయన. అయితే ఆ ఘటనే శిబుసోరెన్ జీవితాన్ని మార్చేసింది. గిరిజనుల తరఫున పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. స్వరాష్ట్ర సాధన, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సగానికిపైనే గడిచిపోయింది.జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం(ఆగస్టు 4, 2025) తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిపై తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.గౌరవనీయులైన డిషోమ్ గురు(Dishoom Guru) మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు హేమంత్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆదివాసీల, పేదల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అంటూ వ్యాఖ్య చేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం మరువలేనిది’ అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం శిబు సోరెన్ మృతికి నివాళులర్పిస్తున్నారు.డిషోమ్ గురుగా..శిబు సోరెన్ను ఆయన మద్దతుదారులు డిషోమ్ గురూ అని సంబోధిస్తుంటారు. డిషోమ్ గురూ.. అంటే పోరాటాలకు సిద్ధంగా ఉండే గురువు.. భూమి పుత్రుడు, దేశ నాయకుడు అనే అర్థాలు వస్తాయి. ఆదివాసీల హక్కుల కోసం, భూదోపిడీ.. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టాయి.1973లో జేఎంఎం ఆవిర్భవిస్తే.. 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా, స్వరాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అయితే ఆ మూడు పర్యాయాల్లోనూ రాజకీయ ఒడిదుడుకులతో ఆయన ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్హం. 2005లో కేవలం 9 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. రెండోసారి.. అగష్టు 2008లో సీఎంగా బాధ్యతలు చేపట్టి జనవరి 2009లో ఆ పదవి నుంచి దిగిపోయారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్లో సీఎంగా బాధ్యత చేపట్టినా.. ఐదు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే..1980 నుంచి 2005 మధ్య ఆయన లోక్సభ ఎంపీగా.. అటుపై మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఆయన పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పని చేశారు.తండ్రి హత్య చూసి..1944 జనవరి 11న నెమ్రా జిల్లా(ప్రస్తుత జార్ఖండ్)లోని సంతల్ గిరిజన కుటుంబంలో జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీవ్యాపారుల గుండాల చేతుల్లో తండ్రి దారుణ హత్యకు గురికావడం కళ్లారా చూశారాయన. బడీ ఈడు పిల్లాడిగా ఉన్న ఆయన్ని ఆ ఘటనే రాజకీయ పోరాటాల వైపు అడుగులేయించింది. ఆదివాసీల హక్కుల కోసం ఉదృత పోరాటాన్ని చేయించింది.18 ఏళ్ల వయసులో సంతల్ నవయువక్ సంఘ్ను స్థాపించి.. 1972లో బెంగాల్ మార్కిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట ఏకే రాయ్, బినోద్ బీహారీ మహాటో నేత కుర్మి మహాటోతో శిబుసోరెన్ చేతులు కలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన స్వరాష్ట్ర ఉద్యమం చేపడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. అలా మొదలైన పోరాటం.. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పాటుతో(బీహార్ నుంచి విడిపోయి) నెరవేరింది. ప్రజల కోసం నిర్భయంగా, నిబద్ధతతో నిలబడిన నాయకుడిగా గుర్తింపు పొందారాయన.కుటుంబమంతా రాజకీయాల్లోనే..రూపీ సోరెన్ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జేఎంఎం ఒడిషా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.శిబుసోరెన్ మీడియా ముఖంగా నవ్వే సందర్భాలు చాలా అరుదు. అందకు ఆయన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉండేది. 15వ ఏట తండ్రి మరణం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు వల్ల తాను నవ్వడం మానేశాని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుండేవారాయన. రాజకీయాల్లో సాదాసీదా నేతగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. శిబు సోరెన్.. జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే అదే సమయంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. గతంలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. అలాగే చిరుదిహ్ ఊచకోత, మాజీ కార్యదర్శి శశినాథ్ జా హత్య కేసులతో పాటు అక్రమాస్తుల ఆరోపణలు ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కించాయి.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఎయిర్ ఇండియా విమానంలో.. ‘దురదృష్టవశాత్తూ’ బొద్దింకలు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్లైన్ తెలిపింది.ఎయిర్ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు సౌకర్యవంతంగా కూర్చున్నారు.ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. -
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో నిలిపివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతికపరమైన లోపం కారణంగా టేకాఫ్ను నిలిపివేసింది. ఆటో-థ్రోటిల్ పనిచేయడంలో విఫలం కావడంతో, విమానం తిరిగి తనిఖీల కోసం నిలిచిపోయింది. సోమవారం ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంకేతికపరమైన లోపం తలెత్తింది.విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రన్వే 29ఆర్లో ప్రారంభమైన టేకాఫ్ రోల్ సమయంలో ఆటో-థ్రోటిల్ వ్యవస్థ ఆశించిన విధంగా పనిచేయలేదు. దీంతో కెప్టెన్ దాదాపు 60 నాట్ల వేగంతో టేకాఫ్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సంబంధిత ఇంజనీర్లతో సంప్రదించి, నిర్దిష్ట నిర్వహణ విధానం కింద తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డౌన్లోడ్ కోసం విమానాన్ని తిరిగి దాని స్థానికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పరిశోధించేందుకు ప్రస్తుతం ఇంజనీరింగ్ తనిఖీలు జరుగుతున్నాయి. #Flight stopped at the time take off due to technical problems164 passengers are in flightNo information about alternative arrangementsJustice Battu Devanand, Judge of AP High Court is travelling in the flight. pic.twitter.com/po4wPHYzKe— endla janardhan (@endlajanardhana) August 4, 2025సాంకేతిక లోపం తో ఢిల్లీ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో.. ఈ ఘటన జరిగిన సమయంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. విమానంలో వృద్దులు, చిన్నారులు , మధుమేహ రోగులు ఉన్నారని, వీరికి తక్షణం ఆహారం అందించాలని విమాన సిబ్బందిని ఆయన కోరారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆహారం అందించారు. -
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీరు (రాహుల్)ఎలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరువు నష్టం దావా కింద క్రిమినల్ కేసు వేశారు. అయితే ఈ ఫిర్యాదులో విచారణ పై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని ప్రశ్నించింది. ప్రతిపక్షనేత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది.కాగా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా..2,000 కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 జూన్లో లబ్దఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ ప్రభు త్వం చైనాకు లొంగిపోయిందని, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు. అయితే రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని మండిపడింది. ఈ కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ.. రాహుల్కు మాత్రం నోటీసులు జారీచేసింది. -
శిబూ సోరెన్కు నివాళులు.. లోక్ సభ మ.2 గంటలకి వాయిదా
ఢిల్లీ: ప్రతిపక్షాల గందరగోళం మధ్య లోక్సభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై చర్చ జరపాలని విపక్షాల పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనికి సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు నిబంధనలను గుర్తు చేస్తూ ఈ అంశంపై చర్చించలేమని అన్నారు.దీనికి ముందు ఇండియా బ్లాక్ నేతలు బీహార్ ప్రత్యేక ఓటరు సవరణ నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పెద్దగా పురోగతి సాధించిందే లేదు. ఇండియా బ్లాక్ నిరసనలతో అంతరాయం కలుగుతోంది.లోక్సభలో వర్షాకాల సమావేశాలు సోమవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ గందరగోళం కారణంగా సభా కార్యకలాపాలు ముందుకు కొనసాగలేదు. స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను వారి స్థానాలకు వెళ్లి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గందరగోళం కారణంగా సభ ప్రారంభమైన 10 నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. #WATCH | Rajya Sabha members pay tribute to member of Parliament, former Jharkhand CM and founding patron of JMM, Shibu Soren, who passed away at Sir Ganga Ram Hospital in Delhi today after prolonged illness. Video source: Sansad TV/YouTube pic.twitter.com/qpje78kVrj— ANI (@ANI) August 4, 2025ఇక నేటి రాజ్యసభ కార్యకలాపాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ శిబు సోరెన్ మృతిపై సభలో సభ్యులంతా సంతాపం వ్యక్తం చేశారు. తరువాత ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. తమ కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా, ఆగస్టు 8 ఉదయం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రతిపక్షాలు మార్చ్ నిర్వహించనున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో పార్లమెంటు సభ్యుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. -
ఢిల్లీలో మార్నింగ్ వాక్.. కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేసిన దొంగ
న్యూ ఢిల్లీ: రోజురోజుకీ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని బైక్పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఈ అనుభవం ఓ మహిళా ఎంపీకి కూడా ఎదురైంది కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధా రామకృష్ణన్ చైన్ దొంగతనానికి గురైంది. ఢిల్లీలో ఉదయం వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని గొలుసు దొంగలు కొట్టేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉదయం 6 గంటల సమయంలో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో తోటి శాసనసభ్యడు, డీఎంకేకు చెందిన రాజాతితో కలిసి వాకింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. దొంగ తనా మెడ నుంచి గొలుసును లాగడంతో, ఆమె మెడపై గాయాలయ్యాయని, తన చుడిదార్ కూడా చిరిగిపోయిందని ఫిర్యాదులో తెలిపారు.అదే విధంగా ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. స్కూటర్పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లాడని ఆమె పేర్కొన్నారు. కాగా సుధా రామకృష్ణన్ తమిళనాడులోని మైలదుత్తురై నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. -
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్(81) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈయన తనయుడు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. అనంతరం జార్ఖండ్కు ఆయన మూడుసార్లు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్సభ నియోజక వర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కీలకంగా పని చేయడంతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. చిరుదిహ్ హత్య కేసు శిబు సోరెన్ రాజకీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్గా మారింది. 2004లో, శిబు సోరెన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న టైంలో.. చిరుదిహ్ గ్రామంలో తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కారణంగా ఆయన జూలై 24, 2004న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఒక నెల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. సెప్టెంబర్ 8న బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. చివరికి శిబు సోరెన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఎన్ఆర్సీ ఎఫెక్ట్: బంగ్లాకు పంపుతారని వృద్ధుని బలవన్మరణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.కోల్కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్గంజ్ నుండి కోల్కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్ చేసింది.అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ అమలు తర్వాత బంగ్లాదేశ్కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
35 మెడిసిన్స్ ధరలను తగ్గించిన కేంద్రం
రోగులకు మందులను కొంత తక్కువ ధరలకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు విక్రయించే 35 ముఖ్యమైన ఔషధాల రిటైల్ ధరలను తగ్గించింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఈ ఉత్తర్వును జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. మెడిసిన్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నవారికి ఇదొక ఉపశమనం.ధరలు తగ్గిన మెడిసిన్స్ జాబితాలో.. ఈ ఫార్ములేషన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియోవాస్కులర్, యాంటీబయాటిక్, యాంటీ-డయాబెటిక్ మరియు సైకియాట్రిక్ ఔషధాలతో పాటు అసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్, అమోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ వంటి కొత్త నోటి యాంటీ డయాబెటిక్ కూడా ఉన్నాయి.అకుమ్స్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ తయారు చేసి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మార్కెట్ చేస్తున్న అసెక్లోఫెనాక్ పారాసెటమాల్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ టాబ్లెట్ ధర ఇప్పుడు రూ.13, కాడిలా ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ చేస్తున్న అదే ఫార్ములేషన్ ధర ఇప్పుడు రూ.15.01గా ఉంది.ఇదీ చదవండి: ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్లోకిహృదయ సంబంధ వ్యాధులకు ఉపయోగించే అటోర్వాస్టాటిన్ 40 mg, క్లోపిడోగ్రెల్ 75 mg టాబ్లెట్ ధర రూ. 25.61. పిల్లల ఉపయోగం కోసం ఓరల్ సస్పెన్షన్లు - సెఫిక్సిమ్, పారాసెటమాల్, విటమిన్ డి సప్లిమెంటేషన్ కోసం కోలెకాల్సిఫెరోల్ డ్రాప్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి ముఖ్యమైన మందులతో పాటు, దీని ధర మి.లీ.కు రూ. 31.77గా నిర్ణయించారు.రిటైలర్లు, డీలర్లు ఈ కొత్త ధరల జాబితాలను మెడికల్ షాపులలో తప్పకుండా ప్రదర్శించాలి. కొత్త ధరలను అనుసరించి విక్రయాలు జరపకుంటే.. జరిమానా విధించడంతో పాటు, అధిక ఛార్జ్ చేసిన మొత్తాలను వడ్డీతో సహా రికవరీ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. -
భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం.. కుటుంబ సభ్యుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా.. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ, ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో మనోహర్ లోధీ, ద్రౌపది భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో ద్రౌపదికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు.. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అనంతరం, ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని భర్త సహా కుటుంబం కోరింది. అయితే, తాను మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేనని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడతాను అంటూ వారినే బెదిరించింది. దీంతో, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకయ్యారు.ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త మనోహర్.. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరిగాయి. ద్రౌపది ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో.. కలత చెందిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా హాట్టాపిక్గా మారింది. -
అన్సారీ ఆస్తుల కోసం కుమారుని దొంగ పత్రాలు.. కోర్టులో బెడిసికొట్టిన ప్లాన్
లక్నో: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను తిరిగి దక్కించుకునేందుకు అతని కుమారుడు ఉమర్ అన్సారీ చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఇందుకోసం నకిలీ పత్రాలను ఆధారాలుగా చూపిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఉదంతంపై ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో.. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో యూపీలోని బండాలో గల ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ కన్నుమూశాడు. తాజాగా తన తండ్రి ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ అతని కుమారుడు ఉమర్ అన్సారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకోసం అతను తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలు కలిగిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించాడని సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా పరారీలో ఉన్న ఉమర్ అన్సారీపై రూ.50 వేల రివార్డు ఉంది. ఉమర్ అన్సారీ మోసపూరిత చర్యలు బయటపడిన దరిమిలా అతనిపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా ఘాజీపూర్ పోలీసుల బృందం లక్నో నుండి ఉమర్ అన్సారీని అరెస్టు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
వరద నీటిలో బాహుబలి సీన్ రిపీట్.. వరద నీటిలో పోలీసు అధికారి స్విమ్మింగ్
లక్నో: బాహుబలి సినిమాలో నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఒంటిచేత్తో పసిబిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి పాత్ర గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే నదీ ప్రవాహంలో నిజమైన నయా బాహుబలి ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. దాదాపు భుజం ఎత్తులో ప్రయాగ్రాజ్ నగరాన్ని గంగానదీ ప్రవాహం ముంచెత్తడంతో తమ బిడ్డను ఒక జంట ఇలా పైకెత్తి పట్టుకుని భద్రంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆదివారం ప్రయాగ్రాజ్ నగర వీధిలో తీసిందీ ఫొటో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయాగరాజ్లో గంగా నది నీళ్ల తన ఇంటి వద్దకు చేరడంతో యూపీకి చెందిన పోలీసు అధికారి ఒకరు.. వరద నీటికి పూజ చేశారు. అనంతరం, తన ఇంటి రెండో అంతస్తు నుంచి వరద నీటిలో దూకి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Ganga river has entered the residential areas or residential areas have encroached the Ganga river area? pic.twitter.com/PAiel3Fcqw— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025 Sub-inspector saab has upper his game - Dive from first floor. - Two camera set-up- Audience https://t.co/kksn2GCchs pic.twitter.com/4HT0EpJl3G— Piyush Rai (@Benarasiyaa) August 3, 2025 -
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
భారతీయ మహిళా వ్యాపారులు పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు, నిర్వహణలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో సుమారు 40 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే కావడం విశేషం. అత్యధికంగా 30 లక్షలపైచిలుకు మహిళా పారిశ్రామికవేత్తలతో దేశంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, మొత్తం ఎగుమతుల్లో 45% వాటా ఎంఎస్ఎంఈలదే అంటే ఇవి ఏ స్థాయిలో పురోగతి సాధించాయో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 37.54%కి చేరింది. దేశవ్యాప్తంగా 2025 జూలై 24 నాటికి 6,57,97,647 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 39.59 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే. దేశంలోని మొత్తం ఎంఎస్ఎంఈల్లో సూక్ష్మ, చిన్న తరహావే 99.99%. సూక్ష్మ కంపెనీల్లో 39.79 శాతం, చిన్న తరహా కంపెనీల్లో 11.63 శాతం మహిళలు నెలకొల్పినవి ఉన్నాయి.ప్రభుత్వ ప్రోత్సాహంతో..ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) సూక్ష్మ సంస్థల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఇది 9.87 లక్షలకు పైగా యూనిట్లకు సహాయం అందింది. 2023 సెప్టెంబర్లో రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తుల వారి నైపుణ్యాలను, మార్కెట్తో అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025 జూన్ 26 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది.2020లో ప్రవేశపెట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎంఎస్ఎంఈలకు ఉచిత, పేపర్ రహిత రిజిస్ట్రేష¯Œ కు వీలు కల్పిస్తోంది. అనధికారిక వ్యాపారాలకు అధికారిక ప్రయోజనాలను విస్తరించడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ 2023లో అందుబాటులోకి వచ్చింది. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి మార్గదర్శనం చేసేందుకు ‘యశస్విని’ అనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వస్తు, సేవల్లో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి సేకరించాలని ప్రభుత్వ సేకరణ విధానం నిర్దేశించింది. దీనికింద ఇందులో 3 శాతం మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల నుండి కొనుగోలు చేయాలి. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మహిళలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.ఉద్యోగాల్లో 18.73%ఉపాధి: ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉద్యమ్ పోర్టల్లో నమోదిత మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా సృష్టించిన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 18.73%పెట్టుబడి: మొత్తం పెట్టుబడిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల వాటా 11.15%టర్నోవర్: మొత్తం టర్నోవర్లో వాటా 10.22%కేంద్రం విడుదల చేసిన ‘ఎమ్ఎస్ఎమ్ఈ వార్షిక నివేదిక 2024–25’ ప్రకారం..⇒ ఎమ్ఎస్ఎమ్ఈలు.. వ్యవసాయం తరవాత అతిపెద్ద ఉద్యోగ కల్పనా రంగం.⇒ మొత్తం సృష్టించిన ఉద్యోగాలు 24.4 కోట్లు⇒ మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో సూక్ష్మ పరిశ్రమలు 98.6 శాతం.⇒ 2024 డిసెంబరు 31 నాటికి.. మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో మహిళలు యజమానులుగా ఉన్న వాటి శాతం 28.8. -
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
సాక్షి, న్యూఢిలీ: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) విషయంలో విపక్ష ‘ఇండియా’కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం కావాలని విపక్ష కూటమి నేతలు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈ విందు భేటీ జరుగనుంది. ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేస్తారని సమాచారం. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు 70–80 సీట్లు రిగ్గింగ్కు గురయ్యాయని రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. నరేంద్ర మోదీ అత్యంత తక్కువ మెజారీ్టతో ఈసారి ప్రధానమంత్రి అయ్యారని, రిగ్గింగ్ జరగకపోయి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్, భారత్పై అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం తదితర అంశాలు విందు భేటీ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నారు. ‘ఇండియా’కూటమి నేతలు చివరి సమావేశం జూలై 19న వర్చువల్గా జరిగింది. -
రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇరువురు నేతలు గంటల వ్యవధిలోనే రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అయితే భేటీకి కారణాలు, చర్చించిన అంశాల గురించి వివరాలు బయటికి తెలియలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రపతిని ఆదివారం కలిశారని రాష్ట్రపతి భవన్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. పార్లమెంట్ సమావేశాలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
చిరుత 'పల్లె' కరింపు
ఆత్మకూరురూరల్: చిరుత పులి ఎలాంటి ప్రాంతంలోనైనా ఉండగలదు. దట్టమైన నల్లమలలలోను, చిట్టడవులు మాత్రమే ఉన్న ఎర్రమలలోను, కంప చెట్లు, రాతి కొండలు ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పశి్చమ ప్రాంలో హాయిగా బతికేస్తున్నాయి. అలాగే హైదరాబాదు, బెంగళూరు, ముంబయ్ లాంటి నగరాల శివార్లలోనూ జీవించ గలుగుతున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల చిరుతల సంచారం కనిపించడం, ప్రజల్లో కొంత ఆందోళన కలగడం జరుగుతోంది ఆహారం కోసమే..గ్రామాల పరిసరాల్లో చిరుతలు సంచరించడం సహజమైనదే. చిన్నపాటి దాక్కునే ప్రదేశం ఉన్నా చిరుతలు తమనుతాము దాచుకుని ఎవరికి కనిపించకుండా మనుగడ సాగించగలవు. పంట పొలాల్లో ఉండే కుందేళ్ళు, అడవి పందుల పిల్లల వంటి వన్యప్రాణులతో పాటు గ్రామాల్లోని కుక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఇటీవలి కాలంలో రాళ్ల కొండల్లో, పొదల్లో చిరుతల ఆహారం తగ్గి పోవడంతో అనివార్యంగా గ్రామాల వైపు చిరుతలు వస్తూ జనం కంట పడుతున్నాయి. గొర్ల మందల వద్ద ఉన్న కుక్కలను, ఆవుల మందల్లో ఉండే దూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతలు ఆహార సేకరణ చేస్తుంటాయి.ఇదీ కారణం.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఇటీవల చిరుత పులులు కాలనీల్లోని ఇళ్లలోకి కూడా వచ్చాయి. దీన్ని సునిశితంగా పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు దీనికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ సంబంధిత వ్యాధి కారణమని తేల్చారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ పందులలో సంక్రమిస్తుంది. సున్నిపెంటలో కొందరు నడుపుతున్న పందుల ఫాంలోకి బెంగళూరు నుంచి తెచ్చిన పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చేరింది. ఈ పందులనుంచి ఆ వైరస్ అడవి పందులపై ప్రభావం చూపడంతో పెద్ద సంఖ్యలో అడవి పందులు మరణించాయి.పంది పిల్లలే ముఖ్య ఆహారంగా తీసుకునే చిరుతలకు దీనివల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీంతో చిరుతలు అనివార్యంగా కుక్కలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని శ్రీశైలంలోకి తరుచూ వచ్చేవి. శ్రీశైలం దేవస్థానం వారు చిరుత ఆహారపు కొరతను గమనించకుండా పుణ్యక్షేత్రంలో సంచరించే కుక్కలను పట్టి వేరే ప్రాంతంలో వదిలారు. దీంతో చిరుతలు సున్నిపెంటల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్స్, ఇతర పెంపుడు జంతువులకోసం ఏకంగా ఇళ్ళలో ప్రవేశించ సాగాయి. రైతులకు ఎంతో మేలుచిరుత పులులు అడవి పందులను తిని రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అడవి పందులు తమ సంతతిని విపరీతంగా పెంచుకుని మైదాన ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇవి రైతుల పంటలను సర్వ నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అయితే అడవి పంది పిల్లలను అమిత ఇష్టంగా వేటాడి తినడం చిరుత ప్రత్యేకత. అందుకే చిరుత పులులు రైతుల పొలాల వెంట సంచరిస్తూ పంది పిల్లల కోసం మాటు వేస్తుంటాయి. అలా పందులసంఖ్యను నియత్రించడం ద్వారా చిరుతలు రైతులకు మేలు చేస్తుంటాయి. కాగా.. చిరుత పులి తన ఆహార జంతువుల జాబితాలో మనిíÙని ఎంచుకోలేదు. రెండు కాళ్ల జంతువులు పులుల ఆహారపు మెనూలోనే లేవు. కోసిగి ప్రాంతంలో ఇటీవల ఒక చిరుత పంట పొలాల్లో మత్తుగా పడి ఉండడం స్థానికులు గమనించారు. దాన్ని వెంటాడి బంధించే ప్రయత్నం చేశారు. ఆ చిరుత పులి ఆ తరువాత మరణించింది. దాన్ని పోస్ట్మార్టం చేసిన వైద్యులు తేలి్చన సత్యం ఏమిటంటే అది ఏదో జంతువును వేటాడినపుడు ఎముక ఒకటి దాని పేగులకు పొడుచుకుని ఇన్ఫెక్షన్కు గురైంది. అది పడుకుని ఉండగా బంధించే యత్నం చేయడంతో ఆ జంతువు ఆందోళనకు గురై హృదయ స్పందన ఆగి మృతిచెందింది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. అడవిలో ఆహారపు కొరతతోనే అవి గ్రామాలవైపు వస్తున్నాయి.కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ శివారులో ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడం ఇటీవల సంచలనం రేపింది. తాను వేటాడిన ఆహారాన్ని దాచుకునేందుకు చిరుతలు చెట్లు ఎక్కుతుంటాయి. అలాగే ఇతర జంతువుల నుంచి ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా చెట్లు ఎక్కుతుంటాయి. అయితే తిప్పలదొడ్డి వద్ద ప్రజల సందడికి భయపడి రక్షణ కోసం చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది. -
త్వరలో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు సేవలు
భావ్ నగర్: దేశంలోని తొలి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీంతో అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అయోధ్య ఎక్స్ప్రెస్, రేవా–పుణే ఎక్స్ప్రెస్, జబల్పూర్–రాయ్పూర్ ఎక్స్ప్రెస్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం భావ్నగర్ టెర్మినస్లో వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ముంబై–అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై, గుజరాత్లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర గుండా అహ్మదాబాద్కు వెళ్తుంది. గంటకు 320 కి.మీ. వేగంతో నడవనుంది. ఈ సందర్భంగా మంత్రి పలు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజక్టుల గురించి పంచుకున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లలో 34వేల కి.మీ.ల కొత్త రైల్వే ట్రాక్లను వేసింది, దేశంలో రోజుకు దాదాపు 12 కి.మీ కొత్త ట్రాక్లను నిర్మించిందని చెప్పారు. దేశంలో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని, ఇది ఇంతకుముందెప్పుడూ చేయని పనని ఆయన కొనియాడారు. ఈ క్రమంలో వస్తున్న సవాళ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దార్శనికతతో ప్రధాని మోదీ స్టేషన్ల పునరుద్ధరణ చేయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించామని, వాటిలోనూ వందే భారత్వంటి సౌకర్యాలు కలి్పంచామని, అయినా ఛార్జీలు మాత్రమే తక్కువగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ రైళ్లను కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారని, వీటిలో ప్రయాణిస్తున్న వారు గొప్ప భావోద్వేగాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. -
కాలువలో పడిన కారు.. 11 మంది మృతి
గోండా: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు. గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రిజిస్టర్డ్ పోస్ట్ ఇక కనుమరుగు
న్యూఢిల్లీ: కోట్లాది మందికి చిరపరిచితమైన పోస్టల్శాఖ వారి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ ఇక కనుమరుగు కానుంది. దేశవ్యాప్తంగా గత 50 సంవత్సరా లుగా కీలకమైన సర్టిఫికేట్లు, ఉద్యోగ నియామక పత్రాలు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేసిన పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ సేవలను కొనసాగించబోమని ‘ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్’ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇన్నాళ్లూ అందించిన సేవలనే స్పీడ్పోస్ట్ లేదంటే ఇతర సేవల్లో భాగంగా అందించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆ పేరు మాత్రమే ఇకపై వినియోగించబోరని పోస్టల్శాఖ వర్గాలు తెలిపాయి. తక్కువ ఖర్చులో, అత్యంత విశ్వసనీ యమైన, అత్యంత అనువైన తపాలా సేవగా గత యాభై ఏళ్లుగా రిజిస్టర్డ్ పోస్ట్ జనం మదిలో నిలిచిపోయింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే అది దాదాపు రిజిస్టర్డ్ పోస్ట్లో రావాల్సిందే. ఉత్తరప్రత్యుత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్కు ఎనలేని విలువ ఉండేది. 2011–12 కాలంలో దేశవ్యాప్తంగా 24.44 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్లను తపాలా శాఖ పంపించగా 2019–20 కాలానికి వచ్చేసరికి కేవలం 18.46 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్లే పంపించగల్గింది. అంటే ఏకంగా 25 శాతం రిజిస్టర్డ్ పోస్ట్లు తగ్గిపోయాయి. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ కీలకమైన పీడీఎఫ్, ఇతర ఫైళ్లు, పత్రాలను పౌరులు నేరుగా సెకన్ల వ్యవధిలో పంపే సంస్కృతి పెరగడంతో రిజిస్టర్డ్ పోస్ట్కు ఆదరణ తగ్గిపోయిందని తెలుస్తోంది. -
తేజస్వీ యాదవ్కి రెండు ఓటర్ ఐడీలా?
పట్నా: బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)అనంతరం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు గల్లంతయిందంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన తీవ్ర ఆరోపణలను ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఓటరు ఐడీ నంబర్ మారిందని తేజస్వీ శనివారం వ్యాఖ్యానించగా ఈసీ వెంటనే ఖండించడం తెల్సిందే. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వీ పేరు ఉందని స్పష్టం చేసింది. తేజస్వీ చూపుతున్న ఓటరు ఐడీ కార్డు తాము జారీ చేసిందేనని భావించడం లేదని, దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని పట్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, దిఘా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి త్యాగరాజ పేర్కొన్నారు. ఈ మేరకు తేజస్వీకి ఆయన ఒక నోటీస్ పంపారు. కొత్త ఓటరు కార్డును తమకు అందజేయాలని కోరారు. రెండు వేర్వేరు నంబర్లతో కూడిన రెండు కార్డులను ఆయన కలిగి ఉండటంపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 204 పరిధిలో ఓటరు సీరియల్ నంబర్ 416 తేజస్వీదేనని వివరించింది. ఆయన ఓటరు కార్డు నంబర్ ఆర్ఏబీ0456228 అని పేర్కొంది. ‘మీరు మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు ఐడీ నంబర్ ఆర్ఏబీ2916120. ఆ ఎపిక్ నంబర్ మేం అధికారికంగా జారీ చేసింది కాదని దర్యాప్తులో వెల్లడైంది. మీరు చూపిన ఆ ఎపిక్ కార్డు ఒరిజినల్ కాపీని మాకు అందజేయండి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది’ అని ఈసీ ఆ నోటీసులో తేజస్వీని కోరింది. తేజస్వీపై కేసు పెట్టాలి: బీజేపీరెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్న తేజస్వీ యాదవ్ నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. అధికారికంగా వెల్లడించిన ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తేజస్వీ మీడియా ఎదుట ప్రదర్శించిన కార్డు నంబర్ ఒక్కటి కాదని తెలిపింది. ‘ఈ వ్యవహారం ఆర్జేడీ, కాంగ్రెస్ల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఎన్నికల కమిషన్కు అబద్ధాలు చెప్పి, వాగ్దాన భంగానికి పాల్పడ్డారు’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. శనివారం తేజస్వీ మీడియాకు చూపిన ఓటరు ఐడీ నంబర్ 2020లో జారీ చేసిన ఓటరు ఐడీ నంబర్ ఒక్కటి కాదన్నారు. రెండు ఓటరు ఐడీలు కలిగి నేరానికి పాల్పడిన తేజస్వీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 65 లక్షల మంది అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించడం, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగడం తెల్సిందే. -
‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు. -
భర్తను కడతేర్చిన భార్య.. పోలీసులే షాకయ్యేలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు. గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జైలు గోడల మధ్య ప్రజ్వల్..‘నేను హైకోర్టుకు వెళతా’అంటూ ఆవేదన..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రజ్వల్ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శిక్షలో భాగంగాప్రజ్వల్ తొలిరోజే.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని జైలు సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది.జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..జీవిత ఖైదు శిక్షలో భాగంగా తొలిరోజు రాత్రంతా ఒత్తిడితో గురయ్యారు. వైద్య పరీక్షల సమయంలో తనకు జైలు శిక్ష పడడంపై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక, ప్రజ్వల్ రేవణ్ణకు జైలు అధికారులు ఖైదీ నంబర్ 15528 కేటాయించారు. రోజువారీ వేతనం రూ. 524 చెల్లించనున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు జైల్లో బేకరీ, తోటపని, హస్తకళలు వంటి విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.ఇక జైలు నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో ఆయన తీవ్ర వేదనకు గురైనా.. ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. మాజీ ఎంపీ కాబట్టి హై-సెక్యూరిటీ సెల్లో ఉంచారు. ప్రిజన్ యూనిఫాం ధరించారు.ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏంటంటే?కాగా ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు.పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని ఈ శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే.కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యార్థిని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి.బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్షీట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. -
‘రెండు రూపాయల డాక్టర్’ ఇకలేరు
తిరువనంతపురం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్ధ సేవకుడు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ అలియాస్ ‘రెండు రూపాయల డాక్టర్’ ఆదివారం (ఆగస్టు 3న) కన్నుమూశారు. ఉత్తర కేరళలోని కన్నూర్లో వేలాది మంది జీవితాల్లో నిస్వార్థ సేవ చేసిన డాక్టర్ గోపాల్ పేదలు,అణగారిన ప్రజలకు దశాబ్దాలుగా(ఒక దశాబ్ధం అంటే 10ఏళ్లు) రెండు రూపాయిలకే వైద్యం అందించారు.డాక్టర్ ఏకే రైరూ గోపాల్ 50 ఏళ్ల పాటు అతి తక్కువకే రూ.2కే వైద్యం చేసేవారు. అందుకే ఆయనను అందరూ ‘రెండు రూపాయల డాక్టర్..రెండు రూపాయల డాక్టర్’ అని పిలుస్తుంటారు. ఇతర డాక్టర్లు ఒక్క ఓపీకి వందల్లో ఛార్జ్ చేస్తుంటే డాక్టర్ గోపాల్ మాత్రం పేషెంట్ స్థోమతను బట్టి రూ.40, రూ.50 మాత్రమే తీసుకునేవారు.అలా వైద్యం ఖరీదైన తరుణంలో డాక్టర్ గోపాల్ మాత్రం వైద్యంలో దాతృత్వం, నీతికి చిహ్నంగా నిలిచారు. వైద్యుడిగా సేవలందిస్తుండగా.. ఓ రోగి దారుణమైన పరిస్థితిని చూసి చలించిపోయారు. అలా ఆయన ప్రయాణం స్వచ్ఛంద సేవతో ప్రారంభమైంది. నాటి నుంచి ముఖ్యంగా రోజూవారి దినసరి కూలీలు, విద్యార్థులకు, పేదలకు అందుబాటులో సరసమైన వైద్యాన్ని అందించేందుకు తనని తాను అంకితం చేసుకున్నారు.విధులు నిర్వహించే సమయంలో తన మిత్రులు, కుటుంబ సభ్యులు,ఇంకెవరైనా తనని కలిసేందుకు వస్తే రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. తన ఇంటి గేటుకు ఓ బోర్డు తగిలలించారు. ఆ బోర్డులో రోగులకు చికిత్స చేసే సమయంలో తనకోసం ఎవరూ రావొచద్దు. ఒక వేళ రావాలని ప్రయత్నం చేస్తారేమో.. రావద్దు. చిరునవ్వుతో తిరిగి వెనక్కి వెళ్లిపోండి అని రాసి ఉంచారు. అంతలా తన వైద్య సేవల్ని అందించడంలో నిమగ్నమయ్యేవారు.ఆయన ఎందుకంత ప్రత్యేకం50 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో సేవ చేసిన ఆయన రూ.2 రూపాయలకే వైద్యం పొందేలా అవకాశం కల్పించారు. దినసరి కూలీలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ అర్ధరాత్రి 2:15 నుండే రోగుల కోసం వైద్య సేవలు ప్రారంభించి.. ఇలా ప్రతి రోజు 300-400 మంది వరకు రోగులకు చికిత్స అందించేవారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే మందులే సూచించేవారు. గోపాల్కు తోడుగా ఆయన సతీమణి డాక్టర్ శకుంతల, సహాయకులు మందులు పంపిణీ చేయడంలో సహాయపడేవారు.డాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గానుడాక్టర్ గోపాల్ చేసిన సేవలకు గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నుండి కేరళలో ఉత్తమ ఫ్యామిలీ డాక్టర్ అవార్డు పొందారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన సేవలను ప్రశంసిస్తూ “ప్రజల డాక్టర్” అని అభివర్ణించారు. ఆయన దగ్గరకు వెళ్లడం అంటే మందు (మెడిసిన్) కోసం కాదు, ప్రేమ కోసం అని స్థానికులు చెబుతుండగా..‘ఆయనను కలిస్తే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుందనేది రోగుల నమ్మకం. డాక్టర్ గోపాల్ తదనంతరంతో ఆయన సోదరులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాజగోపాల్లు వైద్య సేవల్ని కొనసాగించనున్నారు. Dr. #RairuGopal, a dedicated doctor, succumbed to age-related health issues today. For over 50 years, he selflessly served the community at Lakshmi Home Clinic, providing medical care to the poor at a nominal fee of Rs 2 per consultation. His daily routine involved treating… pic.twitter.com/qjA61cubat— Harish M (@chnmharish) August 3, 2025 -
నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
నాగపూర్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్స్క్వాడ్.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్పుర్ తులసి బాగ్ రోడ్లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence. On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ— ANI (@ANI) August 3, 2025 -
దవడ పగిలింది.. వెన్నెముక విరిగింది..!
న్యూఢిల్లీ: పరిమితికి మించిన లగేజీతో వచ్చినందుకు అదనంగా ఫీజు చెల్లించాలని కోరిన స్పైస్జెట్ సిబ్బందిపై ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెలరేగిపోయారు. నలుగురు ఉద్యోగులను చితకబాదడంతో వెన్నెముక విరగడం, దవడ పగలడం వంటి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో జూలై 26వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ రితేశ్ కుమార్ సింగ్ గుల్మార్గ్లోని హై అల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ పనిచేస్తున్నారు. ఆయన జూలై 26వ తేదీన ఢిల్లీ వెళ్లే స్పైస్జెట్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. క్యాబిన్లోకి ప్రయా ణికులు కేవలం 7 కిలోల బరువైన లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కల్నల్ సింగ్ మాత్రం 16 కిలోల బరువున్న రెండు బ్యాగులతో వచ్చారు. అదనపు బరువుకు నిబంధనల ప్రకారం అదనంగా చార్జీ ఉంటుందని సిబ్బంది చెప్పగా చెల్లించేందుకు నిరాకరించిన సింగ్ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఊగిపోయారు. వారిని నెట్టేసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై సైన్ బోర్డు స్టీల్ స్టాండుతో దాడికి దిగారు. SHOCKING “MURDEROUS” Assault on SpiceJet Staffers at Srinagar Airport Passenger attacks 4 SpiceJet Staffers with whatever he cud get hold off— 2 grievously injured. Jaw & Spine injured. July 26th incident, FIR Filed Pax - allegedly an army officer - put on NO FLY List 1/2 pic.twitter.com/g79eiuSy3P— Amit Bhardwaj (@tweets_amit) August 3, 2025ఒక ఉద్యోగి స్పృహ తప్పి పడిపోగా, ఆయన్ను కాలితో తన్నారు. ముఖంపై పంచ్ ఇవ్వడంతో మరో ఉద్యోగి దవడ ఎముక విరిగింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. మరో ఉద్యోగి వెన్నెముక చిట్లింది. సీఐఎస్ఎఫ్ అధికారి కలుగ జేసుకుని ఆయన్ను తిరిగి గేట్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత నలుగురు ఉద్యోగులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం..ఆ అధికారి పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఆ ప్రయాణికుడిపై తగు చర్యలు తీసుకోవాలని పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది. -
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్పై కొత్త చర్చ మొదలైంది.బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025 -
ధర్మస్థళ మిస్టరీ: ఆధారాలపై షాకిచ్చిన ఆర్టీఐ సమాధానం
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళలో సామూహిక ఖననాల మిస్టరీ అంతకంతకూ బిగుసుకుంటోంది. వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన వ్యాఖ్యల దరిమిలా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) ఈ ఘటనపై ముమ్మర విచారణ చేపట్టింది. తాజాగా ఈ ఉదంతంలో ఆర్టీఐ జోక్యంతో మరో మలుపు తిరిగింది.ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ ప్రాంతంలో ఒక యువతిని అక్రమంగా ఖననం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు, ఒక కుక్కను పాతిపెట్టినట్లు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఐర్టీఐని కోరిన దరిమిలా, కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెల్తాంగాడి పోలీసులు 2000-2015 మధ్య చోటుచేసుకున్న అసహజ మరణ రికార్డులను తొలగించారని ఆర్టీఐ తెలుపడంతో, ధర్మస్థళ సామూహిక ఖననాలపై నెలకొన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బెల్తాంగాడి పోలీసులు నాటి అసహజ మరణ రికార్డులను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ కార్యకర్త జయంత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)కు చేసిన ఒక ఫిర్యాదులో ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా ఖననం చేసినట్లు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రోటోకాల్లు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆ సమయంలో పలువురు అధికారులు దీనికి సాక్ష్యంగా నిలిచారని కూడా ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించిన సిట్ త్వరలోనే తన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తుందని భావిస్తున్నానని అన్నారు.ఆర్టీఐని ఆశ్రయించిన జయంత్ బెల్తాంగాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన, వ్యక్తుల డేటా, ఫొటోలను తాను కోరినట్లు తెలిపారు. అయితే దీనికి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాధానంలో.. బెల్తాంగాడి పోలీసులు నాటి పోస్ట్మార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు గుర్తింపులేని మృతదేహాలకు సంబంధించిన ఫోటోలను సాధారణ పరిపాలనా ఉత్తర్వుల మేరకు నాశనం చేశారని వెల్లడయ్యింది. ఈ సందర్బంగా జయంత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 2 న నేను సిట్కు ఫిర్యాదు చేశాను.. ఈ ఫిర్యాదు నేను వ్యక్తిగతంగా సేకరించిన సాక్ష్యంతో ఆధారపడి వుంది. యువతి ఖననం సమయంలో హాజరైన ప్రతి ఒక్కరి పేరు నేను తెలియజేశాను. నాడు చట్టపరమైన విధానాలన్నింటినీ ఉల్లంఘించారు. వారు ఒక కుక్కను పాతిపెట్టినట్లుగా ఆ యువతి మృతదేహాన్ని ఖననం చేశారు. అందుకే నేను దీనిపై ఫిర్యాదును దాఖలు చేశాను’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆ ఏటీఎం, పాన్ కార్టులు ఎవరివంటే.. -
Operation Akhal: మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం
కుల్గామ్: ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మరీ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఆక్హాల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా సమీపంలో ఆదివారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమవ్వగా, ఒక సైనికుడు గాయపడ్డారు. నిన్న రాత్రి నుంచి భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి(ఆదివారం, ఆగస్టు 3) ఉదయం ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో శని, ఆదివారాల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరినట్లుఉ పేర్కొన్నారు. శనివారం సైతం ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఉగ్రవాదులు కుల్గామ్ పారెస్ట్ ఏరియాలో మకాం వేసినట్లు తమకు అందిన సమాచారం మేరకు ఆపరేషన్ అక్హాల్ చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఈ రెండు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుఉ పేర్కొన్నారు. వీరు ద రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. -
శశిథరూర్ కొత్త ట్విస్ట్.. రాహుల్ వ్యాఖ్యలపై వింత సమాధానం!
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై హస్తం పార్టీ ఎంపీ శశిథరూర్ వింత సమాధానంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడంపై శశిథరూర్ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్కు ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా మీడియా ప్రశ్నలపై స్పందిస్తూ.. భారత్కు వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా అమెరికా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య సముచిత వాణిజ్య ఒప్పందం కుదిరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక, ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్కు మరేమైనా కారణాలు ఉండొచ్చు. అయితే, రాహుల్ అభిప్రాయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల శశిథరూర్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య అభిప్రాయభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్పై థరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో, థరూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.‘He Has His Reasons.….’ 😂😂😂Shashi Tharoor Reacts To Rahul Gandhi's Remark On Trump TariffsShashi Tharoor responded cautiously after Rahul Gandhi agreed with U.S. President Donald Trump’s “dead economy” remark on India. Tharoor said he wouldn’t comment on his party leader’s… pic.twitter.com/OXHodiXvdy— Augadh (@AugadhBhudeva) August 2, 2025మరోవైపు.. భారత్ టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు భారత్ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్.. వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకోనీయండంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందనే కారణం చూపుతూ.. భారత నుంచి దిగుమతులపై 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధించారు. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్యం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఇరు దేశాలు ఆర్థికవ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ఈ క్రమంలో వివాదం నెలకొంది. -
West Bengal: ‘బీహార్లా బెంగాల్..’ : సువేందు సంచలన డిమాండ్
హౌరా (పశ్చిమ బెంగాల్): బీహార్లో అమలు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో కోటి మందికిపైగా రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు అక్రమంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. హౌరాలో జరిగిన కన్యా సురక్ష యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య సువేందు అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు, నకిలీ ఎంట్రీలు, నకిలీ ఓటర్లు, రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితా విశ్వసనీయతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం అక్రమ ఓటర్ల పేర్లను తొలగించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు.కాగా బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. తుది ముసాయిదాలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. పోల్ బాడీ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24, 2025 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే దానికి భిన్నంగా 7.24 కోట్ల గణన ఫారమ్లు (ఈ ఎఫ్)లు రావడం విశేషం. బీజేపీ ఆదేశాల మేరకే ఈ కసరత్తు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం వివాదాస్సదంగా మారింది. బీహార్ అసెంబ్లీ, పార్లమెంటులో దీనిపై తీవ్ర నిరసనలు జరిగాయి. కాగా బెంగాల్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ సువేందు రాష్ట్రంలో కన్యా సురక్ష యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. -
ధర్మస్థళ మిస్టరీ: ఆ ఏటీఎం, పాన్ కార్టులు ఎవరివంటే..
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మరణాల మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ధర్మస్థళ సమీప ప్రాంతాల్లో వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా, ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) విచారణ చేపట్టింది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. వీటిలో ఒక చోట తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ దొరికిన పాన్, ఏటీఎం కార్డులు విచారణ అధికారులకు బెంగళూరులోని ఒక ఇంటికి దారి చూపాయి.ఆ ఏటీఎం కార్డు బెంగళూరు రూరల్ ప్రాంతంలోని నేలమంగళలో నివసిస్తున్న సిదాలక్షమ్మకు చెందినదని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే ఆ పాన్ కార్డు ఆమె కుమారుడు సురేష్ కు చెందినదని, మద్యానికి బానిసైన అతను గత మార్చిలో మృతిచెందాడని తేలింది. ధర్మస్థళ సందర్శన సమయంలో సురేష్ తన కార్డులు పోగొట్టుకున్నాడని, అవి నేత్రావతిలో కొట్టుకుపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తన కుమారుడు తాగుడుకు బానిస అయిన కారణంగా ఇంటి నుంచి తరచూ వెళ్లగొట్టేదానినని సిదాలక్షమ్మ అధికారులకు తెలిపింది.తన కుమారుడు మూడేళ్ల పాటు కామెర్ల వ్యాధితో బాధపడ్డాడని, ఈ సమయంలో అతను ఎక్కడకూ వెళ్లలేదని, అయితే జీవనోపాధి చూసుకోవాలని తామే అతనిని ఇంటికి దూరంగా ఉంచామని సిదాలక్షమ్మ తెలిపింది. తాము ఐదేళ్ల క్రితం కుటుంబ సమేతంగా ధర్మస్థళికి వెళ్లామని, అప్పట్లో తన కుమారుడు తన ఏటీఎం వినియోగిస్తున్నాడని, నాడు ఎటీఎం, పాన్ కార్డులు పోయాయని తనకు చెప్పాడని సిదాలక్షమ్మ వివరించింది. ఈ సంగతి చెప్పగానే తాను ఏటీఎం కార్డు బ్లాక్ చేయించానన్నది. తన కుమారుడు సురేష్ చనిపోయాక ఖననం చేశామని, ఆమె తెలిపింది. మాజీ పారిశుధ్య కార్మికుడు సూచించిన 13 ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టినప్పుడు అధికారులకు ఏటీఎం, పాన్ కార్డులు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని సిట్ అధికారులు గతంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు? -
ఒడిశా బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్
భువనేశ్వర్: 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన ఒడిశా బాలిక నిన్న(శనివారం, ఆగస్టు 2వ తేదీ) మృతిచెందింది. గత నెల 19 వ తేదీన కాలిన గాయాలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లోచికిత్స అందించిన ఆ బాలికను ఆపై ఎయిర లిఫ్ట్ చేసి ఢిల్లీ ఎయిమ్స్కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు మాట మార్చారు. ఇందులో ఎవరు ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిందని ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, లేనిపోని కామెంట్లు చేసి ఇరకాటంలో పడొద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఆ బాలిక ఘటన అనంతరం ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ స్పందించారు. ఆ యువతిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నం చేశామని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా బ్రతికించలేకపోయామని సీఎం మాఝీ తెలిపారు ఇదొక దురదృష్టకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. అంటించలేదు.. అంటించుకుంది..!తన కూతురు మృతిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘ నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మానసిక స్థితి బాలేని కారణంగానే ఆమె ఇలా చేసింది. నా కూతుర్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం చాలానే చేసింది.. ఫలితం లేకుండా ప్యోఇంది. దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. అదే నా కూతురి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ఆందోళనజూలై 19 వ తేదీన ఆ బాలిక 70 శాతం గాయాల బారిన పడింది. దీనిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం దీనిపై ఆందోళన చేపట్టారు. ఒడిశాలో బాలికలపై ఈ తరహా దాడులు అధికమవుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ఒడిశాలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు కూడా రోడ్లపైకి రావడంతో ప్రతిపక్షాలకు బలం చేకూరునట్లయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు, ఆమె తండ్రి చెప్పడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు..ఆమెను ఆస్పత్రిలో చేర్చిన క్రమంలోనే వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. దానిలో భాగంగానే ముగ్గురు యువకుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ బాలిక మృతి చెందిన రోజు వ్యవధిలోనే ఇందులో ఎవరి ప్రమేయ లేదని తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ముంబై: మహారాష్ట్ర శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై ప్రియాంక విరుచుకుపడ్డారు. భారత సైనికుల ప్రాణాలు, ప్రజల రక్తం కంటే.. బీసీసీఐకి డబ్బే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆసియాకప్లో భారత్, పాక్ మ్యాచ్ విషయమై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ‘బ్లాక్బస్టర్ ఫిక్సర్.. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు. అలాగే, మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్లో కూడా దాయాదులు తలపడే అవకాశం ఉంది. ఇది న్యాయమేనా?. భారత సైనికుల రక్తం, త్యాగం.. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైనప్పుడు ఇలాంటివి ఉంటాయి. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దుతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.“Blockbuster Fixture: India vs Pakistan scheduled for 14 September, 2025 with potential rematches during Super Four and Final”When money is more important than the blood of our fellow Indians and our men in uniform. Shame on GoI for being a hypocrite on Operation Sindoor. And… pic.twitter.com/AJG4xruesB— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 3, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఎఫెక్ట్ ఇరుదేశాల క్రీడా సంబంధాలపైనా పడింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది. ఆసియాకప్లో కూడా భారత్-పాక్ మ్యాచ్లను నిర్వహించాలనుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆసియాకప్ షెడ్యూల్ విడుదల కావడంతో పలువరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్గా సోషల్ మీడియా ఖాతాలు, క్రికెటర్ల యూట్యూబ్ చానెల్స్ సైతం బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. -
కుక్క ముట్టిన మధ్యాహ్న భోజనం.. 78 మంది పిల్లలకు రాబీస్ టీకా
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్షక్ష్యమే ఈ ఘటనకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఏమిటనుకుంటున్నారా? అదే.. ‘మధ్యాహ్న భోజనాన్ని కుక్క ముట్టడం’ వివరాల్లోకి వెళితే..ఛత్తీస్గఢ్లోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికితోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం(ఎస్హెచ్జీ) ఈ ఆహారమేమీ కలుషితం కాలేదంటూ విద్యార్తులకు వడ్డించింది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్చ్జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మంది విద్యార్థులకు యాంటీ రాబీస్ టీకాలు ఇప్పించింది. ఈ ఘటన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల నిర్వహణ కమిటీని నిలదీశారు. ఎస్హెచ్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఎస్హెచ్జీ సభ్యులు అధికారుల దర్యాప్తులో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు ముఖ్యమంత్రి విష్ణు డియో సాయికి లేఖ రాశారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులంటే.. వాళ్లకేంటి బాబూ లక్షల్లో జీతం.. వీకెండ్స్ హాలీడేస్.. కాస్మోపాలిటన్ వర్క్ కల్చర్.. విలాసవంతమైన జీవనం అని ఠక్కున అనేయకండి. నాణేనికి రెండో వైపులాగే ఐటీ ఉద్యోగులను తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. జీవనశైలి, అధిక పని ఒత్తిడితో రకర కాల వ్యాధుల బారినపడుతున్నారు. హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ (ఐటీ) ఉద్యోగులలో 84% మంది ఫ్యాటీ లివర్ (కాలేయంలో అధిక కొవ్వు) బారిన పడ్డారని ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్సభలో ప్రకటించారు. ఇదొక నిశ్శబ్ద మహమ్మారిగా మారిందని, దీనిని నియంత్రించేందుకు అన్నివర్గాల సమన్వయంతో తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పారు. 2025లో నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని కేంద్ర మంత్రి ఉదహరించారు.క్రమం తప్పిన జీవన శైలిఐటీ పరిశ్రమలో ఉండే పని ఒత్తిడికి తోడు క్రమం తప్పిన పని వేళలు, ఆహార అలవాట్లతో ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటంతో జీవక్రియ దెబ్బతింటోంది. దానివల్ల కాలేయంలో కొవ్వు (ఫ్యాటీ లివర్– ఎంఏఎఫ్ఎల్డీ) పెరిగిపోయి వ్యాధులకు దారితీస్తోంది. హైదరాబాద్లో సర్వే చేసిన ఐటీ ఉద్యోగులలో 71 శాతం మందికి ఊబకాయం, 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు ఉన్నట్లు తేలింది. వీటి వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమ స్యలు పెరుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఈ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా హృద్రోగం, మధుమేహం, కేన్సర్, శ్వాస సంబంధ సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్ సీడీ)లన్నీ 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి. కానీ, ఐటీ ఉద్యోగుల్లో మాత్రం అవి 30 ఏళ్ల లోపే వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, రెడీమేడ్ ఆహారం తీసుకోవటం, కదలకుండా గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవటం కూడా ఈ అనారోగ్యాలకు కారణాలని సర్వేలో తేలింది.యోగా బ్రేక్ తప్పనిసరి..సంస్థల యాజమాన్యాలకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా యువ, పట్టణ శ్రామిక శక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత కీలకం. అందుకే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్పీ–ఎన్సీడీ) కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంపెనీల యాజ మాన్యాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులకు తప్పని సరిగా 5 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో కూడిన ‘యోగా బ్రేక్’ఇవ్వాలని ఆదేశించింది. ఇది శారీరక, మానసిక శ్రేయ స్సుకు అత్యవసరం. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్ప కుండా వ్యాయామం, బరువు నియంత్రణ, చక్కెర, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్లోని గన్నౌర్లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్లోని రోహిత్ ఆ ఫోన్ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్లు ప్రీతమ్ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్కు డబ్బులు ఇచ్చిందన్నాడు.ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్ను రోహిత్కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు. -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులైన రహదారులు
న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) ఉదయం నుంచి రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్లు ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గురుగ్రామ్లో భారీ వర్షాల కారణంగా జలమయమైన ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై జనం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. VIDEO | Heavy rains caused severe waterlogging in parts of Delhi. Visuals from Deoli Vidhan Sabha. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/kR0s9gewpZ— Press Trust of India (@PTI_News) August 2, 2025విజయ్ చౌక్, కన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జి, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచకుయన్ మార్గ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతమయ్యింది. జనపథ్, లజ్పత్ నగర్, మింటో బ్రిడ్జిలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. డియోలి ప్రాంతానికి చెందిన దృశ్యాలు వర్షం తీవ్రతను చూపించాయి. ఈ మార్గాలలో రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పంచకుయన్ మార్గ్కు సంబంధించిన వీడియో ఫుటేజ్లో వర్షం కారణంగా వాహనాలు నీటిలో నడుస్తున్నట్లు, ట్రాఫిక్, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడాన్ని చూపిస్తున్నాయి. సరోజినీ నగర్, కన్నాట్ ప్లేస్లలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi | Waterlogging in parts of the national capital following a spell of rain. (Visuals from Panchkuian Marg) pic.twitter.com/Im77ERO6Ps— ANI (@ANI) August 2, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం బహదూర్గఢ్, మనేసర్ తదితర ఎన్సీఆర్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ బల్లభ్గఢ్లతో సహా ఢిల్లీ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi: Rain lashes several parts of the National Capital.(Visuals from Sarojini Nagar) pic.twitter.com/gXlpXwmsJh— ANI (@ANI) August 2, 2025ఢిల్లీలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణ సగటు కంటే 1.1 డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.4 డిగ్రీలు తక్కువ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సంతృప్తికరమైన వర్గంలోనే ఉంది శనివారం సాయంత్రం 6 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 84గా నమోదైంది. -
తెరచుకోనున్న అమృత్ ఉద్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ పరిధిలోని అమృత ఉద్యానంలో వేసవి పూల ప్రదర్శన ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు ‘అమృత్ ఉద్యాన్’తోటను సందర్శించవచ్చు. సాయంత్రం 5:15ల తర్వాత ప్రధాన ద్వారం దాటి లోపలికి అనుమతించబోమని రాష్ట్రపతి భవన్ సచివాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తోట నిర్వహణ నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్కు సెలవు ప్రకటించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీన క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ లేదా కియోస్క్ ద్వారా నమోదు సందర్శకులు నార్త్ అవెన్యూ రోడ్లోని 35వ నంబర్ ద్వారం ద్వారా ఉద్యనవనంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రవేశం ఉచితమే అయినా ముందస్తుగా రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. visit. rashtrapatibhavan. వెబ్సైట్ ద్వారా టికెట్ను బుక్ చేసుకోవచ్చు. ముందస్తు ప్రణాళికలేకుండా వచ్చే సందర్శకులు గేట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫ్ సరీ్వస్ కియోస్్కల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఉద్యానంలోకి మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ కీలు, పర్సులు, హ్యాండ్బ్యాగ్లు, నీళ్ల సీసా, బేబీ మిల్క్ బాటిళ్లు, గొడుగులు మాత్రమే తీసుకెళ్లే వీలుంటుంది. ఇతర వస్తువులపై నిషేధం విధించారు. కొత్తగా బాబ్లింగ్ బ్రుక్ సందర్శనలో భాగంగా మొత్తం తోటలో బాలవాటిక, ఔషధ వనం, బొన్సాయ్ తోట, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, వలయాకార తోట వంటి ఎన్నో ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ప్రతి గార్డెన్లో కీలకమైన మొక్క, చెట్టు వద్ద ఈసారి క్యూఆర్ కోడ్లను ఏర్పాటుచేశారు. ఈ మొక్క, చెట్లు విశిష్టత తెలియాలంటే ఆ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి వివరాలు పొందొచ్చు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా రూపొందించిన ‘బాబ్లింగ్ బ్రుక్’సందర్శకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇందులో భాగంగా నీటి ప్రవాహాలు, శిల్ప రూపకల్పనలతో కూడిన స్పాట్స్, స్టెప్పింగ్ స్టోన్లు, రిఫ్లెక్టింగ్ పూల్ ఉన్నాయి. మర్రి చెట్ల తోటలో పంచతత్వ ట్రైల్స్, రిఫ్లెక్సాలజీ మార్గాలు, ప్రకృతి శబ్దాల అనుభూతి కల్పించనున్నారు. వీటితో పాటు ఔషధ మొక్కలతో పాటు ప్లూమేరియా పుష్పజాతుల చెట్లు సందర్శకులను అలరించనున్నాయి. -
గణనీయంగా తగ్గిన రైల్వే ప్రమాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వేల్లో ప్రమాదాల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక ఆధునిక సాంకేతిక పద్ధతులు, మౌలిక వసతుల అభివృద్ధి చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘2014–15 ఏడాదితో పోలిస్తే 2024–25లో ప్రమాదాలు 77 శాతం తగ్గాయి. 2024–25లో కేవలం 31 ప్రమాదా లు సంభవించాయి. 2025–26లో జూన్ చివరివరకు కేవలం 3 ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. 2014–15 ఏడాదిలో ప్రతి 10,00,000 కిలోమీటర్ల రైలు ప్రయాణాలకు 0.11 శాతం మాత్రమే ప్రమాదాలు సంభవించాయి. 2024–25లో ఇది మరింతగా తగ్గి 0.03 శాతానికి దిగొచ్చింది. అంటే రైలు ప్రమాదాలు ఏకంగా 73 శాతం తగ్గాయి. 2004–14 కాలంలో 1,711 రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 904 మంది మృతి చెందారు. 3,155 మంది గాయపడ్డారు. 2014–24 కాలంలో 678 ప్రమాదాలు సంభవించాయి. మొత్తంగా 748 మంది మరణించారు. 2,087 గాయపడ్డారు’’అని మంత్రి తెలిపారు. ప్రమాద బాధితులకు రూ. 67.59 కోట్ల పరిహారం ‘‘2020 నుంచి ఇప్పటివరకు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి లేదా గాయపడినవారికి రూ. 37 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాం. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా తేలిన పరిహారంగా రూ.30.59 కోట్లు చెల్లించాం. ట్రిబ్యునల్ పరిహారం ఎక్స్గ్రేషియాకు అదనం. ఇది న్యాయ ప్రక్రియ ప్రకారం మాత్రమే కల్పిస్తాం’’అని మంత్రి అన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ‘‘భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించాం. దేశవ్యాప్తంగా 6,635 రైల్వే స్టేషన్లలో ఎల్రక్టానిక్ ఇంటర్లాకింగ్ అమలు చేశాం. 2020 ఏడాదిలో కవచ్ వ్యవస్థ ఆమోదం పొందింది. 2025 జూలై 30 నాటికి కోటా–మథురా మా ర్గంలో 324 కిలోమీటర్ల మేర కవచ్ను కొత్తగా అమల్లోకి తెచ్చాం. 2014లో 90 మాత్రమే ఉన్న ఫాగ్ సేఫ్టీ డివైజ్ల సంఖ్యను 2025 నాటికి 25,939 యంత్రాలకు పెంచాం. 2004–14 కాలంలో కొత్తగా 14,985 కిలోమీటర్ల మేర ట్రాక్ను వేశాం. 2014–24 కాలంలో ఇది 34,428 కి.మీకు పెరిగింది. బ్రిడ్జిలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల సంఖ్య 4,148 నుంచి 13,808కి పెరిగింది. ఐసీఎఫ్ కోచ్ల స్థానంలో ఆధునిక ఎల్హెచ్బీ కోచ్లకు మార్చాం. అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల్లో 2019 నాటికి అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ల ఇబ్బందులను పూర్తిగా తొలగించాం’’అని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. -
మతరాజ్యంగా మార్చే కుట్ర
న్యూఢిల్లీ: మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శల నిప్పులు గుమ్మరించారు. గణతంత్ర రాజ్యంగా వెలుగొందుతున్న భారత్లో రాజ్యాంగాన్ని బందీచేసి, మతసిద్దాంతాలతో దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రకు బీజేపీ పాలకులు తెగించారని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ బీజేపీపై సోనియా పలు విమర్శలు చేశారు. ‘‘బీజేపీ దేశ రాజ్యాంగాన్ని తక్కువ చేసేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పార్లమెంట్లో, కోర్టుల్లో, వీధుల్లో ప్రతి వేదికపై రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. ఇది కేవలం రాజకీయపరమైన పోరాటం కాదు ప్రతి ఒక్క భారతీయుడి గౌరవానికి సంబంధించిన కీలకాంశం. బీజేపీ పాలనలో ఇప్పుడు రాజ్యాంగం బందీఖానాలో బంధింపబడింది. స్వతంత్రభారతం కోసం ఏ ఒక్కరోజూ పోరాటం చేయని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ద్వయం ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా రాజ్యాంగ మూలసూత్రాలను సర్వనాశనం చేసేందుకు అధికారాన్ని దురి్వనియోగం చేస్తున్నాయి. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నమ్మే మనుస్మృతి మన త్రివర్ణపతాకాన్ని తిరస్కరించింది. వాళ్లు కేవలం హిందూ దేశాన్ని కోరుకుంటున్నారు. మత రాజ్యంలో ప్రజాస్వామ్యం మిథ్యగా, చట్టాలు చట్టబండలుగా మిగిలిపోతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేశారు. అసమ్మతి తెలిపితే వాళ్లపై నేరాలుమోపారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, పేద శ్రామికులను మోసగించారు. పౌరసత్వంలో సమానత్వానికి బాటలుపరచాలని ఆశించిన మహోన్నత నేత అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగంలో చేర్చిన సామ్యవాదం, లౌకికవాదంపదాలనుసైతం పెకిలించివేయాలని బీజేపీ పాలకులు తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి చర్యలు సంస్కరణలు అనిపించుకోవు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని శక్తివంతమైన వ్యక్తుల చెప్పుచేతల్లో నడిచే మతరాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు’’అని సోనియా వ్యాఖ్యానించారు. -
ఆయన చేతిలో తోలుబొమ్మ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. బిహార్లో బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చేందుకు ప్రధాని మోదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని దురి్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ ‘‘భారతరాజ్యాంగం అనేది కేవలం చట్టపరమైన పత్రం కాదు. అది మన ప్రజాస్వామ్య ఆత్మ. ప్రతి భారతీయుడికి రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రసాదించింది. అలాంటి రాజ్యాంగం ఇప్పుడు మోదీ సర్కార్ ఏలుబడిలో ప్రమాదంలో పడింది. రాజ్యాంగంలో సవరణలు చేయాలన్న దుస్సాహసానాకి నేటి పాలకులు తెగిస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో బీజేపీ పెను మార్పులు చేసేది. కానీ ప్రజాశీస్సులు లేని ఎన్డీఏ కూటమికి అన్ని సీట్లు రాలేదు. ఓటర్లు 400సీట్లు అని పాటపాడి వారి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘనత అంతా కాంగ్రెస్ నేత రాహుల్గాందీకే దక్కుతుంది. రాజ్యాంగంలో మార్పులు చేస్తామన్న ఎన్డీఏ సర్కార్కు ఎదురునిలిచి నెలలతరబడి పోరాటంచేశారు. ప్రతి సమావేశంలో రాజ్యంగ ప్రతిని చేతబూని రాజ్యాంగ గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేశారు’’అని ఖర్గే అన్నారు. ఏకంగా 65 లక్షల ఓట్లు ఎలా తీసేస్తారు? ‘‘బిహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) వేళ 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు దరఖాస్తును మరోసారి సమర్పించంత మాత్రాన అంత మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి ఈసీ ఎలా తొలగిస్తుంది?. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ఈ ఓటర్ల ఓటు హక్కులను ఈసీ ఉద్దేశపూర్వకంగా లాగేసుకుంటోంది. బీజేపీ పాలనతో విసిగిపోయిన కాంగ్రెస్కు ఓటేస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్న ఓటర్ల ఓట్లను తొలగించాలన్న కుట్ర జరుగుతోంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ‘మార్పులు’జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు జరిగాయనేదానిపై ఇప్పుడు కాంగ్రెస్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒక్క గదిలో 9 ఓట్లు, ఒకే హాస్టల్లో 9,000 ఓట్లు ఎలా ఉంటాయి? ఇలాంటి అక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘమా? లేదంటే మోదీ చేతిలో కీలుబొమ్మనా?’’అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులను వివక్షకు గురిచేయడం నిత్యకృత్యమైంది. ఎన్నికల వేళ కేవలం ఒక పక్షానికి అనుకూలంగా ప్రధాని ప్రకటనలు చేస్తూ భారత్లో ఏకధృవ సమాజాన్ని సృష్టించాలని ఆయన ఆశపడుతున్నారు. తరచూ చికెన్, మొఘలులు, మంగళసూత్రం అంశాలపై మోదీ మాట్లాడుతూ సమాజంలో విభజన తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడనే ఆయనను ప్రజలు ఎన్నుకుంటే ఆయనను ఏకంగా రాజ్యాంగ విలువలనే కాలరాస్తున్నారు’’అని ఖర్గే ఆరోపించారు. మోదీకి చురక ‘‘పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చి ఆయన ఆఫీస్లోనే కూర్చుంటారు. టీవీలో రాజ్యసభ, లోక్సభ చర్చలు, సభా కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారాలు చూస్తారు. పార్లమెంట్ ప్రోసీడింగ్స్ తెలియాలంటే అలా టీవీలో చూడకుండా నేరుగా సభలోకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ప్రత్యక్ష అనుభవం కల్గుతుంది’’అని మోదీకి ఖర్గే చురక అంటించారు. రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్నూ.. ‘‘రాజ్యసభలో నాటి డెప్యూటీ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్నూ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. రాజ్యసభలో వి పక్షాల గొంతు నొక్కేందుకు ధన్ఖడ్నూ ఓ పా వులా వాడుకున్నారు. విపక్ష నేతలకు ధన్ఖడ్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆయన సభా కార్యకలాపాలను పర్యవేక్షించినప్పుడు పెద్దసంఖ్యలో విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేశారు. చిట్టచివర్లో ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుందామని భావించినా ఆయనపై ప్రభుత్వ పెద్దలు మరింత ఒత్తిడి పెంచారు’’అని ఖర్గే వ్యాఖ్యానించారు.సామ్యవాదం, లౌకికవాదంను తొలగించాలనుకున్నారు ‘‘రాజ్యాంగ పీఠికలో దశాబ్దాల క్రితం చేర్చిన సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించాలని బీజేపీ ప్రభుత్వం నిశ్చయంగా ఉందిన ఆ పార్టీ కీలక నేతలే సెలవిస్తున్నారు. రాజ్యాంగం నుంచి ఈ పదాలను తీసేయాలని చూస్తున్న ఇదే పార్టీ తమ సొంత పార్టీ సిద్ధాంతాలు, నియమనిబంధనల్లో మాత్రం సామ్యవాదం, లౌకికవాదం పదాలను కొనసాగించడం విడ్డూరం. ఆ పదాలను బీజేపీ–ఆర్ఎస్ఎస్ శక్తులు తొలగించలేవు. ఎందుకంటే అంతటి శక్తిని వాళ్లకు ప్రజలు కట్టబెట్టలేదు’’అని ఖర్గే అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే పవిత్రబాధ్యతలు రాజ్యాంగం న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషిన్, మీడియాకూ ఇచ్చింది. కానీ ఒక మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్జీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక క్రతువు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం కంటే నియంతృత్వం ఉందనడం నయం’’అని అన్నారు. -
తుది దశకు ‘డెంగీఆల్’ క్లినికల్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మరణాలకు ప్రబల హేతువైన డెంగీ వ్యాధిని తుదముట్టించేందుకు భారత్లో జరుగుతున్న సుదీర్ఘ పరిశోధనలు కీలకదశకు చేరాయి. తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘డెంగీ ఆల్‘వ్యాక్సిన్పై కీలక క్లినికల్ పరీక్షలు తుది దశలోకి ప్రవేశించాయి. ఈ వ్యాక్సిన్కు సంబంధించి భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో మూడో దశ క్లినికల్ పరీక్షలు మొదలెట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 10,000 మంది వలంటీర్లు ఈ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో భాగస్వాములుకానున్నారు. ఇప్పటకే 70 శాతానికి పైగా వలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో దేశంలోని 20 కేంద్రాల్లో ఈ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, కర్ణాటకలో మైసూరు జేఎస్ఎస్ మెడికల్ కళాశాల, బెంగళూరు మెడికల్ కాలేజీల పరిధిలోనూ ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 5,73,563 డెంగీ కేసులు నమోదైనట్టు వ్యాధుల నియంత్రణ కేంద్ర సంస్థ (ఎన్సీడీసీ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డెంగీ కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ సైతం ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెరోటైప్– డీఈఎన్వీ 1, 2, 3, 4 రకం డెంగీ వైరస్ జాతులు విజృంభిస్తున్నాయి. ఒకే వ్యక్తిలోనూ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వైరస్ రకాలు సోకే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే దేశంలోని భిన్న ప్రాంతాల ప్రజలకు సరిపడేలా దేశవ్యాప్తంగా వేర్వేరు వాతావరణ జోన్లలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికీ డెంగీను ముందస్తుగా నివారించేలా పూర్తి దేశీయంగా తయారైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేకంగా యాంటీవైరల్ ఔషధం లేదు. ప్రస్తుతం ఉన్న చికిత్సలన్నీ డెంగీ సోకిన తర్వాతే లక్షణాలను తగ్గించి, రోగిని మామూలు స్థితికి తీసుకుని రావడానికి అక్కరకొస్తున్నాయి. డెంగీ కేసులపై తక్షణ పర్యవేక్షణ, నివారణ చర్యలపై ఎన్సీవీబీడీసీ, డీజీహెచ్ఎస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చురుకుగా వ్యవహరిస్తున్నాయి. డెంగీ కట్టడి కోసం ప్రతి రాష్ట్రానికి నిధులు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన చట్రాలు, ఫాగింగ్, ఇంటి వద్ద దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అంతేగాక సెంటినెల్ సర్వేలెన్స్ హాస్పిటల్స్, అపెక్స్ ల్యాబ్లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.