breaking news
National
-
వెండికొండల నడుమ వెండితెర పండగ
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో చిత్రదర్శకురాలు రీతు సరిన్ నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది...ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఐఎఫ్ఎఫ్) ఈరోజు నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. మహిళా దర్శకుల 40 చిత్రాలతో సహా మొత్తం 88 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ చిత్ర దర్శకురాలు కిరణ్రావుతో ముఖాముఖి ఉంటుంది. తన సినిమా ప్రయాణం నుంచి ఇండిపెండెంట్ సినిమాలలో వస్తున్న మార్పుల వరకు తన అభి్రపాయాలను ఈ ముఖాముఖీలో తెలుసుకోవచ్చు.రీతు కృషి... ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో పుట్టి పెరిగిన రీతు సరిన్ కాలిఫోర్నియా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్(సిసిఏ)లో ఫిల్మ్ అండ్ వీడియో విభాగంలో ఎంఎఫ్ఏ చేసింది. ‘సిసిఏ’లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసింది. ది సిఖ్స్ ఆఫ్ యూబా సిటీ, టిబెట్, ఫిష్టేల్స్, ఎ స్ట్రేంజర్ ఇన్ మై నేటివ్ ల్యాండ్, ది షాడో సర్కస్....మొదలైన ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలను తీసింది. టిబెటన్ చిత్రదర్శకుడు టెన్జింగ్ సోనమ్ను వివాహం చేసుకుంది. 2012లో సోనమ్తో కలిసి వైట్ క్రేన్ ఆర్ట్స్ అండ్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆ తరువాత సోనమ్తో కలిసి ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(డిఎఫ్ఎఫ్)కు శ్రీకారం చుట్టింది. టాప్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో డిఐఎఫ్ఎఫ్ ఒకటిగా నిలిచింది.మరచిపోయిన చెట్టు పాట ఒకటిధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే చిత్రాలలో అనుపర్ణ రాయ్ రచన, దర్శకత్వం వహించిన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ ఒకటి. 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఒరిజోంటి (హారిజన్స్) విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ గెల్చుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్మేకర్గా ప్రత్యేకత నిలుపుకుంది రాయ్. ఈ చిత్రకథ విషయానికి వస్తే...బాలీవుడ్లో అవకాశాలు వెదుక్కుంటూ ఎక్కడినుంచో ముంబైకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది తోయ. శ్వేత అనే మరో యువతి కూడా బతుకుదెరువు కోసం ముంబైకి వస్తుంది. కాల్–సెంటర్లో పనిచేసే శ్వేత, తోయతో పాటు అదే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. కాలక్రమేణా వారి మధ్య నిశ్శబ్ద అనుబంధం ఏర్పడుతుంది. అది ఎలాంటి అనుబంధం, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేదే సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్ కథ. పశ్చిమ బెంగాల్ పురులియ జిల్లాలోని నారాయణ్పూర్కు చెందిన అనుపర్ణరాయ్ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. సినిమా రంగంలోకి రావడానికి ముందు దిల్లీలోని ఒక కాల్సెంటర్లో, ముంబైలో ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది.హైప్ కాదు... సహజంగానే!దేశంలోని ప్రముఖ స్వతంత్ర చలనచిత్రోత్సవాలలో ఒకటిగా ఎదగాలని మేమూ ఎప్పుడూ అనుకోలేదు. అర్థవంతమైన, అద్భుత సినిమాలకు ప్రశాంతమైన పర్వతాలు వేదికగా ఉండాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. హైప్ ద్వారా కాకుండా గత 14 సంవత్సరాలుగా డిఐఎఫ్ఎఫ్ సహజంగా అభివృద్ధి చెందింది. చిత్రనిర్మాతల అభిరుచి, ప్రేక్షకుల విశ్వాసం డిఐఎఫ్ఎఫ్ విజయానికి కారణం.– రీతు సరిన్, ఫిల్మ్ మేకర్, డిఐఎఫ్ఎఫ్ ఫౌండర్స్త్రీవాద కోణంలో..రేణుక షహానే మరాఠీ యానిమేటెడ్ లఘుచిత్రం ‘లూప్ లైన్’ డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. మధ్యతరగతి మహిళల జీవితాలపై తీసిన చిత్రం ఇది. రకరకాల భావోద్వేగాలతో పాటు, మాటలతో హింసించడం అనేది కుటుంబ వ్యవస్థలో ఎంత సాధారణంగా మారిందో చెబుతుంది లూప్ లైన్. స్త్రీవాద దృక్పథంతో తీసిన ఈ లఘుచిత్రం ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. తస్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది.స్త్రీ విముక్తితనిష్ట ఛటర్జీ దర్శకత్వం వహించిన ‘ఫుల్ ప్లేట్’ చిత్రం డిఐఎఫ్ఎఫ్లో ప్రదర్శితం కానుంది. తన దర్శకత్వలో వచ్చిన తొలిచిత్రం ‘రోమ్ రోమ్ మెయిన్’కు మేరీ క్లైర్ ఆసియా స్టార్ అవార్డ్ అందుకుంది. ‘ఫుల్ ప్లేట్’ అనేది స్త్రీ విముక్తికి సంబంధించిన చిత్రం. స్త్రీల సమస్యను సీరియస్గా కాకుండా చమత్కార రీతిలో చెప్పిన చిత్రం. ఈ చిత్రంలో వంటను సామాజిక శాస్త్ర విశ్లేషణ సాధనంగా చూపారు. -
మోదీతో అంత ఈజీ కాదు: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒస్పేసుకున్నారా?, త్వరలో భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్.. మోదీపై ప్రశంసలకు కారణం ఏమిటి?, భారత్తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారా?, వీటికి మరింత బలం చేకూరుస్తూ దక్షిణకొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.‘నాకు మోదీతో మంచి రిలేషన్ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్ చెప్పకనే చెప్పేశారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) సీఈఓల సమ్మిట్లోట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్.- పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్ అనుకరించారు. -
అద్వానీ రథయాత్రను అడ్డుకున్న పాపం వారిదే: యోగి
అద్వానీ రథయాత్రను అడ్డుకున్నారంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. 1990లో సమస్తిపుర్లో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. ఆ చర్యను ‘పాపం’గా అభివర్ణించారు. ఇవాళ బుధవారం(అక్టోబర్ 29) బిహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. సివాన్, భోజ్పూర్, బక్సర్ జిల్లాల్లో మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రామ మందిర నిర్మాణం.. దేశంపై 500 ఏళ్ల మచ్చను తొలగించిందని యోగి అన్నారు. ఆర్జేడీ మిత్రపక్షమైన కాంగ్రెస్.. రాముడు లేడని చెబుతోందంటూ.. 2007లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ను ఆయన ఉదాహరించారు. ఆర్జేడీ అభ్యర్థి ఒసామా షహాబ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి మొహమ్మద్ షహాబుద్దీన్ దేశవ్యాప్తంగా భయంకర గ్యాంగ్స్టర్గా పేరుగాంచిన వ్యక్తి అంటూ యోగి ఆరోపించారు. ఆర్జేడీ మళ్లీ 'జంగిల్ రాజ్'ను తీసుకురావాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు.డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, భద్రతకు కట్టుబడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కార్పూరీ ఠాకూర్, జగ్జీవన్ రామ్, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలపై పనిచేస్తోంది. సీతామఢి జిల్లాలో సీతాదేవి ఆలయ నిర్మాణానికి ఆర్జేడీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. అయోధ్య ధామ్ నుంచి సీతామఢి వరకు రూ. 6,100 కోట్లతో కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయని యోగి తెలిపారు. -
‘మీ కోసం సీఎం, పీఎం పోస్టులు ఖాళీగా లేవు’
పట్నా: బిహార్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. ఎన్డీఏ కూటమి, మహా కూటమిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిహార్లో ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ.. డ్యాన్స్ చేస్తారంటూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయగా, దానికి బీజేపీ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. ఇవి సీఎం, పీఎం పోస్టులు అని, అవేమీ మీ కోసం ఖాళీగా లేవని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ రోజు(బుధవారం, అక్టోబర్ 29వ తేదీ) దార్భంగాలో ఎన్నికల ర్యాలీ చేపట్టిన అమిత్ షా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్లో కానీ ఆర్జేడీలో కానీ వెవరైనా యువ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. తమ ఎన్డీఏ కూటమి మాత్రం యువ నేతల్ని ప్రోత్సహించే క్రమంలో చాలా మందికి టికెట్లు ఇచ్చిందన్నారు. ‘ఒకరేమో( లాలూజీ) తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నారు.. మరొకరు(సోనియా జీ) తన తనయుడు రాహుల్ గాంధీని దేశానికి పీఎం చేయాలని అనుకుంటున్నారు. ఇవేమైనా ఖాళీగా ఉన్న పదవులా.. వచ్చి కూర్చోవడానికి. మీ కుమారుల కోసం అవేమీ ఖాళీగా లేవు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. బిహార్లో ఏర్పడ్డ మహాఘట్బంధన్( మహా కూటమి) కాదని, అదొక దొంగల కూటమి అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు. ‘జన్నాయక్ కర్పూరి ఠాకూర్కు మోదీ జీ భారతరత్న ప్రదానం చేశారు. ఇప్పుడు, వారు (ప్రతిపక్షాలు) కర్పూరి జీ నుండి ఆ బిరుదును తీసివేయాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. బాబు జగ్జీవన్ రామ్ను ప్రధానమంత్రి కాకుండా చేసిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు చూశారు’ అని తనదైన శైలిలో మహా కూటమిపై విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి::కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
సుక్మా(బీజాపూర్): మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస లొంగుబాటు చర్యల్లో భాగంగా తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు బుధవారం(అక్టోబర్ 29వ తేదీ) లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దాంతో ఈరోజు 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు.గత కొన్నిరోజులుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతల దగ్గర్నుంచీ కింది స్థాయిలో పని చేసే వరకూ చూస్తూ ప్రతీ రోజూ లొంగిపోతూనే ఉన్నారు. నిన్న( మంగళవారం, అక్టోబర్ 28వ తేదీ) పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్లు లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్లో ఈ ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారిప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.కాగా, దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనేది అంగీకరించాల్సిన విషయం. -
‘కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు’
ఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్కు బ్రేక్ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో నిన్న (అక్టోబర్ 28, మంగళవారం)రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు.ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్ 28) కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్ను చేపట్టారు. -
కోల్కత్తా పార్క్ స్ట్రీట్ రేప్ కేసు దోషి : మరో అఘాయిత్యం
2012లో కోల్కత్తాలోని పార్క్ స్ట్రీట్లోని ఒక నైట్ క్లబ్లో స్నేహితులతో కదులు తున్న కారులో ఒక మహిళపై సామూహిక అత్యాచారచేసిన శిక్ష అనుభవించిన నాజర్ ఖాన్ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. కోల్కత్తాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక మహిళను లైంగికంగా వేధించాడు. గాజు సీసాలతో దాడి చేశాడు.సంచలనం రేపిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన 35 ఏళ్ల నాజర్ ప్రెసిడెన్సీ జైలు నుండి బయటకు వచ్చాడు. మంచి ప్రవర్తన కారణంగా ఏడాది ముందే జైలు విడుదలైన అతగాడు ఏమీ మారలేదు సరికదా, మరోసారి తన దుర్మార్గ వైఖరిని చాటుకున్నాడు. కోల్కత్తాలోని పార్క్ స్ట్రీట్లోని 5-స్టార్ హోటల్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన భర్త, స్నేహితులతో ఉండగా, ఆమెను వేధించడంతోపాటు, గాజుసీసాలతో వారిపై దాడికి పాల్పడ్డాడు. బిధాన్నగర్లోని హయత్ రీజెన్సీలోని ప్లే బాయ్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈకేసులో ఉన్న నిందితులతోపాటు 2012 పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన నాజర్ ఖాన్ ఉన్నాడు. మరో నిందితుడు నాజర్ మేనల్లుడు జునైద్ ఖాన్. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. క్లబ్లో తాను, తన భర్త, సోదరుడు, ఇతర స్నేహితులతో కూర్చుని ఉండగా నిందితులు గలాటా చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నాజర్, జునైద్ ఇంకా వారి స్నేహితులు తమపై దాడి చేసి, తనను అనుచితంగా తాకడానికి ప్రయత్నించారని ఆ మహిళ ఆరోపించింది. సోదరుడు తనను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, గాజు సీసాలు విసిరారని పేర్కొంది. హోటల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించి నప్పటికీ వారు వదల్లేదనీ, జునైద్ ఖాన్ దాదాపు 20 మందికి ఫోన్ చేసి తమపై దాడి చేశాడని, ఫోన్లో చంపుతామని కూడా బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ క్లబ్ CCTVలో ఈ దాడికి సంబంధించిన మొత్తం వీడియోను మీరు చూడవచ్చన్నారు ఆమె.కాగా 2012 ఫిబ్రవరిలో నగరం నడిబొడ్డున ఉన్న పార్క్ స్ట్రీట్లోని ఒక నైట్ క్లబ్ ముందు 40 ఏళ్ల మహిళను కారులో తీసుకెళ్లి, కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు క్రాసింగ్ దగ్గర విసిరేసి వెళ్లిపోయారు. ఈ కేసులో దోషిగా తేలిన ఐదుగురు వ్యక్తులలో నాజర్ కూడా ఉన్నాడు. పదేళ్ల శిక్షాకాలం ముగియడానికి ఒక సంవత్సరం కంటే ముందే 2020లో జైలు నుండి విడుదలయ్యాడు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్లా ఇంత అందమా? ఎలా? -
కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న ఆడిటర్
సాక్షి, చెన్నై: ఆడిటర్గా పనిచేస్తున్న వ్యక్తి స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు చవిచూడటంతో మనస్తాపం చెంది భార్య గొంతుకోసి, కుమారుని గొంతు నులిమి ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన నవీనఖన్నా (42) అన్నానగర్ లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. తేనాంపేటలోని సెంట్రల్ కంప్రోల్టర్, ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి భువనేశ్వరి, భార్య నివేదిత (30), కుమారుడు లావిన్ కన్నన్ (7) ఉన్నారు.నివేదిత పెరంబూరులోని లోకో ఆఫీసులో సూపర్వైజర్ పనిచేస్తున్నారు. సోమవారం నవీన్ బయటకు వెళ్లిన అనంతరం తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి భార్య, కుమారుడు చాలాసేపు నిద్రపోతారని, రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, ఫోన్ కట్ చేశాడు. అనుమానం వచ్చిన తల్లి బెడ్రూమ్ తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, లావిన్ కన్నన్ చనిపోయి ఉన్నాడు. మెడ తెగిపోయిన నివేదితకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కీల్పాకం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈక్రమంలోనే నవీన్ చెన్నైలోని విల్లివాక్కం రైల్వేస్టేషన్ సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే తాను పనిచేసే కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టినట్టు విచారణలో వెల్లడైంది. నష్టాలు రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట తన బిడ్డ గొంతు నులిమి చంపి, ఆపై కత్తితో భార్య గొంతు కోసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ద్రోహి.. అలాంటోడి కాళ్లు మొక్కుతావా?’
ఖలీస్తానీ ఉగ్రసంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' (SFJ) ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్పై బెదిరింపులకు దిగింది. ఆస్ట్రేలియాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించబోయే కచేరీని నిలిపివేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడమే ఇందుకు కారణంగా ఎస్ఎఫ్జే చెబుతోంది. అమితాబ్(Amitabh Bachchan) హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్బనేగా కరోడ్ పతి సీజన్-17కి దిల్జీత్ దోసాంజ్(Diljit Dosanjh) గెస్ట్గా వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ బిడ్డ అంటూ దిల్జీత్ను బిగ్బీ పరిచయం చేయగా.. దిల్జీత్ అమిత్ కాళ్లను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ఈ ఇద్దరి ఆలింగనం తర్వాత షో కంటిన్యూ అయ్యింది. అయితే పవిత్రమైన తలపాగా ఉండగా అమితాబ్ లాంటి వ్యక్తి పాదాలను తాకడంపై సిఖ్స్ ఫర్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. SFJ Demands Akal Takht’s Action Against Diljit DosanjhSikhs For Justice (SFJ) has urged Akal Takht Sahib to summon Diljit Dosanjh for touching the feet of Amitabh Bachchan on the KBC show.SFJ’s statement, however, did not mention any protest or threat regarding Diljit’s… pic.twitter.com/xhdJMX92YG— Gagandeep Singh (@Gagan4344) October 29, 2025అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలే.. 1984 సిక్కుల ఊచకోతకు ప్రేరణగా మారాయి. అలాంలోడి పాదాలు తాకడం అంటే బాధితులందరినీ అవమానించడమే అని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇది అజ్ఞానం కాదు, విశ్వాస ఘాతకమేనని మండిపడింది. పైగా నవంబర్ 1వ తేదీని సిక్కుల ఊచకోత దినంగా గుర్తించిన నేపథ్యంలో.. అదే రోజున ఆస్ట్రేలియాలో కన్సర్ట్ నిర్వహించడం సిక్కు సమాజాన్ని అవమానించడమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కన్సర్ట్ను రద్దు చేసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ చేష్టలపై దిల్జీత్ను విచారించాల్సిందేనని కోరుతూ అకాల్ తఖ్త్ జథేదార్(అత్యున్నత ధార్మిక అధికారి) గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజుకు లేఖ రాసింది. పంజాబీ సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్కు మాములు క్రేజ్ లేదు. అందుకే Aura Tour పేరిట ఆస్ట్రేలియాలో కచేరీ నిర్వహించబోతున్నారు. ఈ టూర్ కోసం 800 డాలర్ల రేటుతో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు 30 వేల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. అమితాబ్పై ఆరోపణలేంటి?.. (Is Really Amitabh Bachchan Anti Sikhs Call)1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింసాత్మక దాడులు జరిగాయి(1984 సిక్కుల ఊచకోత). ఆ సమయంలో ప్రముఖ నటుడు, ఇందిరాగాంధీకి ఆప్తుడైన అమితాబ్ బచ్చన్ “ఖూన్ కా బదలా ఖూన్” (రక్తానికి ప్రతీకారంగా రక్తమే) అనే నినాదం ఇచ్చారని, ఈ వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించాయని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దూర్దర్శన్లో ఆయన ఆ నినాదం ఇచ్చారంటూ జగదీష్ కౌర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది కూడా. దీంతో.. అమితాబ్ బచ్చన్ అకాల్ తఖ్త్ జథేదార్కు ఓ లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. నిరాధారమైనవని.. ఎంతో బాధ కలిగించాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేవారు కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు కూడా 2014లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలు ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. -
అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి
చెన్నై: రామనాథపురంలోని ఓంశక్తి నగర్కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది. -
రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం
ఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ద్రౌపది ముర్ము రఫేల్ (Rafale fighter jet)లో గగన విహారం చేశారు. వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక, గతంలో నాటి రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ సైతం తమ హయాంలో వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.అయితే, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను పాక్ ముష్కరులు అత్యంత పైశాచికంగా దాడి చేసి ప్రాణాలు బలిగొనడం తెలిసిందే. దీనికి ప్రతిగా పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో రాఫెల్ యుద్ధవిమానాలను సైన్యం అత్యంత సమర్థవంతంగా వినియోగించింది. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించారు. రాఫెల్ యుద్ధ విమానంలో ముర్ము సహ పైలట్గా పాల్గొన్నారు. గతంలో నాటి రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ సైతం తమ హయాంలో వేర్వేరు యుద్ధవిమానాల్లో ప్రయాణించారు.#WATCH | Haryana: President Droupadi Murmu takes off in a Rafale aircraft from the Ambala Air Force Station pic.twitter.com/XP0gy8cYRH— ANI (@ANI) October 29, 20252006 జూన్ 8వ తేదీ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానంలో కలాం ప్రయాణించారు. 2009 నవంబర్ 25న పుణె సమీపంలోని లోహెగావ్ వైమానిక స్థావరం నుంచి అదే సుఖోయ్–30ఎంకేఐ విమానంలో ప్రతిభా పాటిల్ ప్రయాణించారు. ముర్ము సైతం అస్సాంలోని తేజ్పూర్ వైమానిక స్థావరం నుంచి అదే విమానంలో ప్రయాణించి యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడో రాష్ట్రపతిగా, రెండో మహిళా ఉపరాష్ట్రపతిగా రికార్డ్ నెలకొల్పారు. ఫ్రాన్స్లోని దిగ్గజ విమానయాన రంగ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ వారి రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలుచేసి 2020 సెప్టెంబర్లో అంబాలా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో భారత వాయుసేనకు అందించింది. ఫ్రాన్స్ నుంచి తొలి విడతగా ఐదు రాఫెల్లు 2020 జూలై 27న భారత్కు ఎగిరొచ్చాయి. వాటిని 17వ స్కాడ్రాన్ అయిన ‘గోల్డెన్ ఆరోస్’లో భాగస్వాములుగా చేర్చారు. President Droupadi Murmu at the Ambala Air Force Station. She will shortly take a sortie in the Rafale aircraft.#Rafale @rashtrapatibhvn pic.twitter.com/BPlnSZSJQW— All India Radio News (@airnewsalerts) October 29, 2025 -
తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
Cyclone Montha.. మోంథా తుపాను ప్రభావంతో దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొన్ని గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో ఏపీలోని తీవ్ర ప్రాంతాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భా ప్రాంతాల్లో తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలకు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలి. రైతులు పంటను, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపింది. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాటించాలని సూచనలు చేసింది.హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు ఇవే..ఏపీలో.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.తెలంగాణలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు.మహారాష్ట్రలో.. మరఠ్వాడ సమీప ప్రాంతాలు, నాందేడ్, హింగోలి, పర్బణీ, బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగపూర్ జిల్లాలు. Weather warning ⚠️ #TelanganaNow I'm warning once again for North East Central TG see heavy during next 24 hours stay safe 🚨 Flash floods possible 🌧️🌀⚠️ https://t.co/5PvVp8klDy— Warangal Weatherman (@tharun25_t) October 29, 2025 -
ప్రైవేటు బస్సులో రూ.కోటి సీజ్
బెంగళూరు: గోవా నుంచి బెంగళూరుకు అక్రమంగా ప్రైవేట్ బస్సులో కోటి రూపాయలను తరలిస్తుండగా ఉత్తర కన్నడ జిల్లా కారవార–గోవా సరిహద్దులోని మజాళి చెక్పోస్ట్లో పోలీసులు పట్టుకున్నారు. చెక్పోస్టులో పోలీసులు తనిఖీలు చేయగా గోనె సంచిలో దాచిన నోట్ల కట్టలు లభించాయి. బెంగళూరుకు చెందిన కల్లేశ, రాజస్థాన్కు చెందిన బమరరామ్లు ఈ డబ్బు తరలిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కల్లేశ, బరమరామ్లు గోవాలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకొని బెంగళూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. చిత్తాకుల పోలీసులు నగదు స్వా«దీనం చేసుకోని కేసు నమోదు చేశారు. -
రెండు దశాబ్దాల కల.. పాక్ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం
రాంపూర్/లక్నో: పాకిస్తాన్లోని స్వాత్ లోయ ప్రాంతంలో పెచ్చరిల్లిన ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటింది. నేరుగా భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఇక్కడే నిర్భయంగా స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని కలలు కన్నది. అనుకున్నట్లే భారతీయ స్థానిక వ్యాపారి పునీత్ కుమార్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపోయింది. వాళ్లకో పాప. కొత్త జీవితం మొదలెట్టినా ఇక్కడి అధికారులు మాత్రం ఆమెను విదేశీయురాలిగానే చూశారు. భారత పౌరసత్వం కోసం ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఆ దరఖాస్తులను బుట్టదాఖలుచేశారు. ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. 38 ఏళ్ల పూనమ్కు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఎన్ని అభ్యర్థనలు తిరస్కరణకు గురైనా.. 2004లో సోదరుడు గగన్తో కలిసి పూనమ్ పాక్ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించింది. పాకిస్తాన్తో ఉగ్రవాదం, మత ఛాందసవాదం, అత్యంత పేదరికంతో పోలిస్తే భారత్లో ఎంతో స్వేచ్ఛగా, హాయిగా జీవించవచ్చన్న ఆశతో భారత్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఢిల్లీ, రాంపూర్లకు తరచూ మకాం మారుస్తూ గడిపారు. 2005లో పూనమ్ స్థానిక వ్యాపారి పునీత్ను పెళ్లాడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులపై మమకారంతో తరచూ స్వదేశం వెళ్లి వాళ్లను కలిసి వచ్చేది. పాకిస్తానీ గుర్తింపు కార్డు ఉండటంతో ఇదంతా సాధ్యమైంది. కొన్నాళ్లకు ఆ గుర్తింపు కార్డ్ గడువు ముగియడం, పాకిస్తానీ పాస్పోర్ట్ రెన్యూవల్ సాధ్యంకాకపోవడంతో సొంతింటి సందర్శన కల చెదిరిపోయింది.దీంతో ఆమె భారత్నే తన సొంతింటిగా భావించడం మొదలెట్టింది. ఇక్కడికి వచ్చినప్పటికీ నుంచే భారత పౌరసత్వం కోసం ఎన్నో సార్లు దరఖాస్తుచేసుకుంది. అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినా సరే పట్టువిడవక ప్రయత్నించి సఫలీకృతమైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనల మేరకు ఆమెకు ఇటీవల సిటిజన్షిప్ను ప్రకటించారు. దీంతో దీపావళి పండగ వేళ తమ కుటుంబంలో ఆనంద కాంతులు విరజిమ్మాయంటూ ఆమె భర్త పునీత్ సంబరపడ్డారు.‘ఈ పౌరసత్వం నిజంగా మాకు పండగ కానుకే. ఇది ఈసారి దీపావళి మరింత ప్రత్యేకంగా మార్చింది. లక్నోకు వెళ్లి పౌరసత్వ సంబంధ పత్రాలను సమర్పిస్తాం’ అని పునీత్ సంతోషంతో చెప్పారు. ‘నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. త్వరలో ఆధార్, పాన్ కార్డ్, ఇతర భారతీయ గుర్తింపు కార్డ్ల కోసం దరఖాస్తు చేస్తా. ఇవేం లేకపోయినా నేను భారతీయురాలినే. కానీ ఇకపై నిజమైన భారతీయురాలిగా జీవిస్తా’ అని పూనమ్ ఆనందభాష్పాలు రాలుస్తూ చెప్పారు.గర్వంగా వెళ్లి వస్తా ‘పాక్లోని స్వాత్ లోయలో ఉగ్రవాదం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. కనీసం మేమైనా ఎక్కడో ఒకచోట బతుకుతామనే ఆశతో నన్ను, నా సోదరుడి నాన్న భారత్కు పంపేశారు. ఇక్కడికొచ్చాక హాయిగా ఉన్నాం. ఇప్పుడు నాకు భారత పౌరసత్వం వచ్చింది. త్వరలోనే ఇండియన్ పాస్పోర్ట్కు దరఖాస్తు చేస్తాం. అది వచ్చాక గర్వంగా పాక్లోని సొంతింటికి వెళ్లి మా వాళ్లను కలుస్తా’ అని ఆమె చెప్పారు. స్వాత్ లోయలోని మిన్గోరా ప్రాంతంలో తమ ఇల్లు ఉందని ఆమె వెల్లడించారు. ‘ఈమెకు భారత పౌరసత్వం ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదు. అందుకే ఈసారి దరఖాస్తుకు ఓకే చెప్పాం’ అని రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా చెప్పారు. -
భారత్లో ఎస్జే–100 విమానం తయారీ
న్యూఢిల్లీ: భారత్–రష్యా ప్రభుత్వరంగ సంస్థలు కలిసి తొలిసారి భారత్లో ఒక ప్యాసింజర్ విమానాన్ని ఉత్పత్తి చేయనున్నాయి. రెండు ఇంజన్లు ఉండే చిన్న ప్యాసింజర్ విమానం ఎస్జే–100ను భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయా రు చేయనుంది. ఇందుకోసం రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్సీ–యూఏసీ)తో సోమవారం మాస్కోలో ఒప్పందంపై హాల్ సంతకం చేసింది. హాల్ చైర్మన్ డీకే సునీల్, పీజేఎస్సీ–యూఏసీ డైరెక్టర్ జనరల్ వదిమ్ బదెఖా సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.‘దేశంలో తక్కువ దూరం విమాన ప్రయా ణాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఉడాన్ పథకంలో ఎస్జే–100 విమానాలు గేమ్చేంజర్ కానున్నాయి. దేశీయ విమానయాన సంస్థల కోసం ఎస్జే–100 విమానాలను తయారు చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా హాల్కు హక్కులు లభించాయి. ఈ విమానాల తయారీ దేశంలో విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. పౌర విమానయాన రంగ ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తుంది. ఈ ఒప్పందం విమానయానంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలను సృష్టిస్తుంది’అని హాల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
హస్తినపై కృత్రిమ వాన
న్యూఢిల్లీ: దేశరాజధానిగా మాత్రమే కాదు కాలుష్య రాజధానిగానూ మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అనుకున్నదే తడవుగా మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో మంగళవారం రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది.మరికొన్ని రోజులపాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మన్జీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. అయితే ఇది వాయుకాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు పెదవి విరుస్తున్నారు. కాన్పూర్ నుంచి ఢిల్లీకి..ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దీంతో మేఘాలు చల్లబడి అందులోని తేమ చినుకులుగా మారి వర్షిస్తుంది. ‘‘దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపికచేశాం. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది.దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్ను చేపట్టాం. సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ ప్రభావానికి గురైన మేఘాలు కనిష్టంగా 15 నిమిషాల నుంచి గరిష్టంగా 4 గంటల్లోపు వర్షిస్తాయి. గాలులు ఉత్తర దిక్కుగా వీస్తున్నాయని ఢిల్లీ దిశగా వచ్చే మేఘాలనే లక్ష్యంగా చేసుకుని ట్రయల్స్ చేపడుతున్నాం. మరికొద్దిరోజుల్లో కనీసం 10 సార్లు ట్రయల్స్ చేస్తాం. ట్రయల్స్ విజయశాతం ఎక్కువగా ఉంటే ఫిబ్రవరిలో శాశ్వత ప్రాతిపదికన ఈ మేఘమథన కార్యక్రమం కొనసాగిస్తాం. నగరాల్లో భారీ వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు దేశంలోనే ఇదొక ముందడుగు అవుతుంది ’’ అని మంత్రి మన్జీందర్ వ్యాఖ్యానించారు. -
ప్రశాంత్ కిశోర్కు రెండుచోట్ల ఓటు హక్కు
పట్నా/కోల్కతా: జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంతి కిశోర్కు రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. సొంత రాష్ట్రం బిహార్తోపాటు పశ్చిమ బెంగాల్లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రశాంత్ కిశోర్కు మంగళవారం బిహార్ రాష్ట్రం రోహ్తస్లోని జిల్లా ఎన్నికల కార్యాలయం నోటీసు జారీ చేసింది. రెండుచోట్ల ఓటు హక్కు ఉండడం నిబంధనలకు విరుద్ధమే. ప్రశాంత్ కిశోర్కు బిహార్లోని కార్గాహర్ అసెంబ్లీ స్థానంలో ఓటు ఉంది. అలాగే పశి్చమ బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో 121, కాళీఘాట్ రోడ్ చిరునామాతో మరో ఓటు ఉంది.ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యా లయం చిరు నామా కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా సేవలందించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఒక్కరికి ఒక ఓటే ఉండాలి. రెండు చోట్ల ఓటు హక్కు ఉండడం చట్టవిరుద్ధం. బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం కోసమే ప్రశాంత్ కిశోర్ అక్కడ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నట్లు జేడీ(యూ) ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ అనుమానం వ్యక్తంచేశారు. -
ఉత్తర బిహార్లో ఉనికి పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్లో విపక్షాల మహాగఠ్బంధన్ కూటమిలో ఆర్జేడీ తర్వాత కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరబిహార్ ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకునేందుకు పెద్ద పోరాటమే చేస్తోంది. ఉత్తరబిహార్ పరిధిలో మొత్తం 71 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయకేతనం ఎగరేసింది. ఈసారి ఆ ఒక్క సీటును కూడా నిలబెట్టుకోవడం కాంగ్రెస్కు పెద్ద పరీక్షలా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెమ్మదినెమ్మదిగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 2010 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఓటమిని మూటగట్టుకున్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిలో ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తర బిహార్లోని 71 నియోజకవర్గాల్లో ఒక్క ముజఫర్పూర్లో మాత్రమే విజేంద్ర చౌదరి గెలిచారు. ఈసారి కూడా ఆయనే బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో సరైన అభివృద్ధి పనులు చేపట్టలేదని స్థానిక ఓటర్లు ఈయనపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఈసారి ఈయన విజయావకాశాలకు గండిపడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలు తమ శాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.ఉమేష్ కుమార్ రామ్(సక్రా నియోజకవర్గం), నలిని రంజన్ ఝా రూపం(బెనిపట్టి), సుబోధ్ మండల్(ఫుల్పరస్), అమిత్ కుమార్ తన్నా(రిగా), ఇంజనీర్ నవీన్ కుమార్(బత్నాహా), సయ్యద్ అబు దోజన(సుర్సాండ్), శ్యామ్ బిహారీ ప్రసాద్(రక్సౌల్), శశి భూషణ్ రాయ్(గోవింద్ గంజ్), అమిత్ కుమార్(నౌతన్), అభిషేక్ రంజన్(చన్పాటియా), వాసి అహ్మద్(బెట్టియా), శశ్వత్ కేదార్(నర్కటియాగంజ్), సురేంద్ర ప్రసాద్(వాల్మీకినగర్), జయేష్ మంగళ్ సింగ్(బాగహా), మిథిలేష్ చౌదరి(బేనీపూర్), రిషి మిశ్రా(జాలే), రవి(రోసెరా) సైతం ఎన్నికల రణరంగంలో దూకి తమ రాజకీయచతురతతో విజయపతాక ఎగరేద్దామని ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఎన్డీఏ పార్టీ అభ్యర్థుల నుంచి వీళ్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాడు పార్టీని అణచివేసి.. నేడు అభ్యర్థిగా విజయం..ఉత్తర బిహార్ ప్రాంతంలో ఈసారి మొత్తం 18 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 20 చోట్ల కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 1977 ఏడాదికి ముందు ముజఫర్పూర్ జిల్లాలోని మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. కానీ.. ఇప్పుడు కేవలం విజేంద్ర చౌదరి మాత్రమే ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1995 ఎన్నికల్లో ముజఫర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని విజేంద్ర చౌదరి పూర్తిగా తుడిచిపెట్టేశారు. గతంలో పలుమార్లు జేడీయూ, ఆర్జేడీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగానూ ఎన్నికల బరిలో దిగారు. 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్కుమార్ శర్మను ఓడించి కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు.90వ దశకం నుంచే పరాజయాల చరిత్రగత రెండున్నర దశాబ్దాలుగా ముజఫర్పూర్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం గుర్తుకు ఓటర్లు ముఖం చాటేయడం మొదలెట్టారు. 1972 వరకు కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో ఎదురేలేదు. తర్వాత ఇక్కడి ఓటర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు కన్పించింది. పార్టీ కేడర్లో అంతర్గత కుమ్ములాటలు, స్థానికేతరులు జోరు పెంచడంతో ఓట్ల రేసులో కాంగ్రెస్ వెనుకబడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ముజఫర్పూర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముజఫర్పూర్ నుంచి బిజేంద్ర చౌదరి, పారు నుంచి అనునయ్ ప్రసాద్ సిన్హా, సక్రా నుంచి ఉమేష్ కుమార్ రామ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ ముగ్గురిలో బిజేంద్ర ఒక్కరే గెలిచారు. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా జిల్లాలో కాంగ్రెస్ ఉనికిని చాటారు. ఈ సారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. -
సేవారంగ ఆదాయంలో తెలంగాణ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారిన సేవల రంగం నుంచి ఆదాయాన్ని ఆర్జించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. దేశ సేవల రంగం స్వరూపం, ఎదుగుదల, ఉపాధి కల్పన సరళిపై నీతి ఆయోగ్ మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సేవల రంగం: స్థూల విలువ జోడింపు (జీవీఏ) ధోరణులు–రాష్ట్ర స్థాయి డైనమిక్స్ నివేదిక ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ)లో సేవల వాటా 2011–12లో ఉన్న 52.8% నుంచి 2023–24 నాటికి 62.4 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు (54.5%) కంటే అధికం కావడం విశేషం. మొత్తంగా చూస్తే తెలంగాణ సగటు సేవల రంగం వాటా 60.3 శాతంగా నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందిన ఐటీ, స్టార్టప్ల వ్యవస్థ, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు (సగటు జీఎస్వీఏ వాటా 34.1%), ఆర్థిక సేవలు (11.1%) ఈ వృద్ధికి కారణమని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అధిక ఉత్పాదకత, ఆధునిక సేవలపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని పేర్కొంది.ఉపాధి కల్పనలో చూస్తే 2023–24లో తెలంగాణ శ్రామిక శక్తిలో 34.8% మంది (62 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నివేదిక వివరించింది. ముఖ్యంగా ఐటీ రంగం (12 శాతం వాటాతో) ఉపాధిలోనూ గణనీయ పాత్ర పోషిస్తోందని తెలిపింది. తెలంగాణ తన ఐటీ బలాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని.. అప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రం కీలకపాత్ర పోషించగలదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని పరిశీలిస్తే జీఎస్వీఏలో సేవల రంగం వాటా తెలంగాణ కంటే తక్కువగా ఉంది. 2011–12లో 40.9% ఉన్న వాటా 2023–24 నాటికి 42 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. మరోవైపు ఉపాధి కల్పనలో 2023–24 నాటికి ఏపీ శ్రామిక శక్తిలో 31.8% మంది (78 లక్షల మంది) సేవల రంగంలో పనిచేస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీ ఓడరేవులు, వ్యవసాయ అనుబంధ సేవలు, లాజిస్టిక్స్ను బలోపేతం చేసుకోవాలని నీతిఆయోగ్ నివేదిక సూచించింది. వృద్ధిలో సమతుల్యత.. నాణ్యతే సవాల్ దేశవ్యాప్తంగా సేవల రంగం వృద్ధి ప్రాంతీయంగా సమతౌల్యంగా మారుతోందని.. వెనుకబడిన రాష్ట్రాలు సైతం పుంజుకుంటున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. అయితే ఉపాధి కల్పనలో ఆధునిక రంగాలు అధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నా తక్కువ మందికే ఉద్యోగాలిస్తుంటే సంప్రదాయ రంగాలు ఎక్కువ మందికి ఉపాధినిస్తున్నా అవి అసంఘటితంగా, తక్కువ వేతనాలతో కొనసాగుతున్నాయని తెలిపాయి. ఉపాధి కల్పనలో లింగ వివక్ష, ప్రాంతీయ వ్యత్యాసాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ సవాళ్లను అధిగమించడానికి గిగ్, స్వయం ఉపాధి, ఎంఎస్ఎంఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, మహిళలు, గ్రామీణ యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించాలని, నూతన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలని, టైర్–2, టైర్–3 నగరాల్లో సేవా కేంద్రాలను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. -
విలాస వైభోగమే
వచ్చే పదేళ్లలో మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు.. తమకు నచ్చిన వాటిని కొనే స్థోమతతో, అత్యధికంగా ఖర్చు చేయగలిగే స్థితిలో ఉంటారు. అంటే ఒకప్పుడు అవసరాల కోసమే ఖర్చు చేసినవారు.. విలాసవంతమైన, లైఫ్స్టైల్ వస్తువులు, ఖరీదైన సేవలు, ప్రీమియం బ్రాండ్లు కొనేస్థాయికి ఎదుగుతారు. మొత్తం వ్యయంలో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఈ ఖర్చు వచ్చే ఐదేళ్లలో 43 శాతానికి పెరుగుతుందట. 2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం.. 2031 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 5,242 డాలర్లకు చేరనుంది. బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ప్రముఖ పెట్టుబడుల నిర్వహణ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.ప్రీమియం ఉత్పత్తులు, లైఫ్స్టైల్ వస్తువుల వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు హోటళ్లలో భోజనాలు, వినోదాలు, విహార యాత్రలు, అవసరం లేకపోయినా ఇంటికి విలాసవంతమైన వస్తువులు.. ఇలాంటి వాటికి అధిక వ్యయం చేస్తున్నారట. భారతదేశ వృద్ధి చిత్రం మారుతోందంటూ ‘బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలను తెలిపింది. ఈక్విటీల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్లో వృద్ధి, బంగారం ధర అనూహ్యంగా పెరగడం.. ఇలాంటి అనేక అంశాలు ఇందుకు కారణం కానున్నాయని పేర్కొంది.ప్రజలు నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. బ్రాండ్ల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే, 2023–24లో చవకైన, ఎక్కువగా దొరికే (మాస్ మార్కెట్) వస్తువుల కంటే.. ఖరీదైన, విలాసవంతమైన వస్తువులకు గిరాకీ పెరిగింది. ప్రీమియం డిటర్జెంట్ల అమ్మకాలు 26 శాతం పెరిగితే.. మాస్ మార్కెట్ వస్తువుల అమ్మకాల్లో 7 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. సాధారణ టీ వినియోగం 10 శాతం పెరిగితే.. గ్రీన్ టీ వాడకం 25 శాతం పెరిగింది. స్పోర్ట్స్ ఫుట్వేర్ అమ్మకాలు 13 శాతానికిపైగా పెరిగితే, సాధారణ ఫుట్వేర్ అమ్మకాలు 8 శాతమే పెరిగాయి. విలాసాలు, ఖరీదైన వాటి కోసం దేశ ప్రజలు 2000లో చేసింది.. మొత్తం వ్యయంలో 25 శాతానికిపైనే ఉంది. ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఆ ఖర్చు 2030 నాటికి 43 శాతానికి పెరుగుతుందట. ఫ్యాక్టరీలు కాదు.. ఇళ్లు!ఎఫ్ఎమ్సీజీ అమ్మకాల పెరుగుదల రోజువారీ అలవాట్లలో మార్పును సూచిస్తే.. గృహోపకరణాల అమ్మకాలు భారతీయ గృహాలు ఎలా మారాయో చెబుతాయి. 2024లో దేశ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ రూ.6.45 లక్షల కోట్లు కాగా.. ఇది 2029 నాటికి రెట్టింపై రూ.12.9 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అలాగే దేశంలోని కుటుంబాల పొదుపు మొత్తం 2023–24లో రూ.54 లక్షల కోట్లు కాగా.. 2030 నాటికి ఇది రూ.82 లక్షల కోట్లకు పెరుగుతుంది. అందుకే, ‘భారతదేశ అభివృద్ధి గాథను.. దేశంలోని ఫ్యాక్టరీలు కాదు, గృహాలు రచిస్తున్నాయి’ అని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. రిస్కులూ ఉన్నాయిఅధికాదాయ, మధ్య తరగతి వర్గాల అధిక వ్యయాలతో నడిచే ఈ ఆర్థిక ప్రగతికి రెండు ప్రధాన అడ్డంకులూ ఉన్నాయని నివేదిక తెలిపింది. అందులో మొదటిది ఉద్యోగ నాణ్యత. అంటే.. స్థిరమైన ఉద్యోగం ఉంటేనే మంచి సంపాదన ఉంటుంది. అప్పుడే ఖర్చులూ ఎక్కువగా చేయగలరు. యంత్రాలూ, ఏఐ వంటి వాటి వల్ల కోల్పోయే ఉద్యోగాల వల్ల ఈ అభివృద్ధికి విఘాతం ఏర్పడవచ్చు. అలాగే ఈక్విటీల్లో తగ్గుదలలు, బంగారం ధర పడిపోవడం వంటివి కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు.ఎగువ మధ్య తరగతి, శ్రీమంతులు!2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2024 నాటికి రెట్టింపై 2,729 డాలర్లకు చేరిందని అంచనా. ఇది 2031 నాటికి 5,242 డాలర్లకు చేరుతుందట. 2010 నాటికి దేశ జనాభాలో సుమారు 68 శాతంగా ఉన్న పేద, నిరుపేద వర్గాల వారు.. 2015 నాటికి 58 శాతానికి తగ్గిపోయారు. 2035 నాటికి ఇది సుమారు 48 శాతానికి తగ్గిపోతుందని అంచనా. ఎగువ మధ్య తరగతి, శ్రీమంతుల శాతం 2035 నాటికి 24 శాతానికి చేరనుంది. -
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ‘సుప్రీం’ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకున్న 1,200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (ఎంపీహెచ్ఏ– పురుషులు) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీరి నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. జస్టిస్ అరవింద్కుమార్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం, ఈ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు అనుమతిస్తూ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏళ్ల తరబడి న్యాయ పోరాటం 2003లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,300 ఎంపీహెచ్ఏ (పురుష) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు ఇంటర్మీడియట్ +డిప్లొమాను అర్హతగా నిర్ణయించింది. ఆ తర్వాత అర్హతను పదో తరగతి + డిప్లొమాగా మార్చడంతో వివాదం మొదలైంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. 2012లో పదో తరగతి + డిప్లొమా అర్హతనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. దీంతో అప్పటికే ఇంటర్ + డిప్లొమా అర్హతతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న సుమారు 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టుఉద్యోగాలు కోల్పోయిన 1,200 మంది ఏళ్లపా టు అందించిన సేవలను పరిగణనలోకి తీసు కున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, మానవతా దృక్పథంతో 2013లో వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా 2003 నాటి నియామకాలతో సంబంధం లేకుండా, పూర్తిగా కారుణ్య కారణాల ఆధారంగానే 2013లో వీరిని తిరిగి నియమించామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్వతంత్ర నిర్ణయమని అంగీకరించింది. ఈ నేపథ్యంలో, 2013 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 1,200 మంది ఎంపీహెచ్ఏల ఉద్యోగాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేఖర్ నాప్డే, మాధవి దివాన్, శ్రీరామ్ భాస్కర్ గౌతమ్ వాదనలు వినిపించారు. -
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాగఠ్బంధన్ తమ ఎన్నికల ప్రణాళికను(మేనిఫెస్టో) మంగళవారం విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పాత పెన్షన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ‘బిహార్ కా తేజస్వీ ప్రణ్’పేరిట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 32 పేజీల ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమి నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ మేనిఫెస్టోలో ప్రధానంగా 20 అంశాలు ఉన్నట్లు తేజస్వీ యాదవ్ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు గ్యారంటీ ఇస్తూ 20 రోజుల్లోగా చట్టం తీసుకొస్తామన్నారు. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను 20 నెలల్లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. జీవికా దీదీలను క్రమబద్ధీకరిస్తామని, నెలకు రూ.30 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిటీ, ఐదు ఎక్స్ప్రెస్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఐటీ పార్కులు, సెజ్లు, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.నేర రహిత, అవినీతి రహిత బిహార్ను ప్రజలు కోరుకుంటున్నాయని స్పష్టంచేశారు. ఎన్డీఏ సర్కార్కు బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. అభివృద్ధి పట్ల ఎన్డీఏకు ఒక విజన్ లేదన్నారు. ఇప్పటిదాకా కనీసం మేనిఫెస్టో విడుదల చేయలేదని ఆక్షేపించారు. వక్ఫ్(సవరణ) చట్టం అమలు చేయం.. బిహార్లో తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద వక్ఫ్(సవరణ) చట్టాన్ని అమలు చేయబోమని తేజస్వీ యాదవ్ తేల్చిచెప్పారు. వక్ఫ్ ఆస్తుల అంశాన్ని మరింత పారదర్శకంగా మారుస్తామన్నారు. ఆ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోద్గయలోని బౌద్ధ ఆలయాలను బౌద్ధ సామాజిక వర్గానికి అప్పగిస్తామని తెలిపారు. మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాపాడుతామని వివరించారు. అంతేకాకుండా బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎౖMð్సజ్ చట్టాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్య నిషేధంపై పునరాలోచన చేయనున్నట్లు పరోక్షంగా స్పష్టంచేశారు. కల్లుపై నిషేధం ఎత్తివేస్తామని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించడానికి ఎస్సీ/ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టం తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వివరించారు. -
8వ వేతన కమిషన్కు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 8వ కేంద్ర వేతన కమిషన్ (సీపీసీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, 69 లక్షల మంది పెన్షనర్లకు పింఛన్లు పెరగనున్నాయి. కేంద్ర మంత్రివర్గం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశయ్యింది. 8వ కేంద్ర వేతన కమిషన్కు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది జనవరిలో 8వ సీపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్లో ఒక చైర్పర్సన్, తాత్కాలిక సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.కమిషన్ను ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సిఫార్సులను రూపొందించే సమయంలో పలు కీలక అంశాలను కమిషన్ దృష్టిలో పెట్టుకోనుంది. ఇందులో భాగంగా దేశంలోని ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి వ్యయం, సంక్షేమ పథకాలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. సహకారేతర పెన్షన్ పథకాలకు నిధులు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై సిఫార్సుల ప్రభావం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగుల ప్రస్తుత జీతాల నిర్మాణం, ప్రయోజనాలు, పని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. తుది సిఫార్సులను సూచించిన తర్వాత కూడా 8వ సీపీసీ తమ పరిధిలోని అంశాలపై మధ్యంతర నివేదికలను సమర్పించే వెసులుబాటు ఉంది.కమిషన్ సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర ప్రయోజనాలను కమిషన్ సమగ్రంగా పరిశీలిస్తుంది, తగిన మార్పులను సూచిస్తుంది. ఈ కమిషన్లో ఐఐఎం(బెంగళూరు) ప్రొఫెసర్ పులక్ ఘోష్ తాత్కాలిక సభ్యుడిగా, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సభ్యకార్యదర్శిగా వ్యవహరించబోతున్నారు. జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేస్తున్నారు.ఆమె గతంలో పలు ప్రభుత్వ కమిటీలకు సారథ్యం వహించారు. కేంద్ర పాలిత జమ్మూకశ్మీర్ పునర్విభజన కమిషన్ చైర్మన్గా సేవలందించారు. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ముసాయిదా కమిటీలోనూ పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు అప్పగించిన నాలుగో అతిపెద్ద బాధ్యత వేతన కమిషన్ చైర్పర్సన్గానే. 7వ వేతన కమిషన్ను 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రబీ సీజన్లో ఎరువులకు రాయితీ మరో కీలకమైన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025–26 రబీ సీజన్లో ఎరువులకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఫాస్ఫరస్, పొటాíÙయం ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వనుంది. ఎరువుల రాయితీ కోసం రూ.37,952 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్ కంటే రూ.736 కోట్లు ఎక్కువ అని కేంద్రం స్పష్టంచేసింది. ఫాస్ఫేట్పై సబ్సిడీని కిలోకు రూ.43.60 నుంచి రూ.47.96కు, సల్ఫర్పై సబ్సిడీని కిలోకు రూ.1.77 నుంచి రూ.2.87కు పెంచారు. రైతులకు సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువులు లభించేలా ఈ సబ్సిడీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే, నైట్రోజన్, పొటాష్ ఎరువులపై రాయితీలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. నైట్రోజన్పై రాయితీ కిలోకు రూ.43.02, పొటాషిపై రాయితీ కిలోకు రూ.2.38 చొప్పున లభిస్తుంది. -
ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు
భారతీయ రైల్వే ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నప్పటికీ, 2019లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రవేశపెట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఈ రైలు ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది.మొదటి ప్రైవేట్ రైలుదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్.న్యూఢిల్లీ నుంచి లఖ్నవూ వరకు ఈ రైలు నడుస్తుంది.ఈ సర్వీసును అక్టోబర్ 4, 2019న ప్రారంభించారు.ఈ సర్వీసు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయినప్పటికీ, అదే మార్గంలో నడుస్తున్న రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సేవల కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.న్యూఢిల్లీ - లఖ్నవూ మధ్య టిక్కెట్ ఛార్జీల పోలికరైలు సర్వీసుతరగతిటికెట్ ధర (రూ.)IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,679IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,457శతాబ్ది ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,255శతాబ్ది ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 1,955వందే భారత్ ఎక్స్ప్రెస్ఏసీ చైర్ కార్రూ. 1,255వందే భారత్ ఎక్స్ప్రెస్ఎగ్జిక్యూటివ్ చైర్ కార్రూ. 2,415రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ థర్డ్ టైర్ (3A)రూ. 1,590రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ సెకండ్ టైర్ (2A)రూ. 2,105రాజధాని ఎక్స్ప్రెస్ఏసీ ఫస్ట్ క్లాస్ (1A)రూ. 2,630 తేజస్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలుతేజస్ ఎక్స్ప్రెస్ అనేది ఆధునిక సదుపాయాలతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు. ఈ కోచ్లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే రైలు పట్టాలకు సంబంధించిన అడ్డంకుల కారణంగా ఈ కోచ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటెర్డ్ ప్యాడ్లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్ ఇందులో ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లలో 260 రెట్లు పెరిగిన వేతనాలు! -
‘ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం..’
పట్నా: బిహార్లో మ్యానిఫెస్టో వేడి షురూ అయ్యింది. బిహార్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం(అక్టోబర్ 28వ తేదీ) తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మ్యానిఫెస్టోలు చేర్చింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్ బంధన్(మహా కూటమి) సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు మ్యానిఫెస్టో విడుదల చేసిన ఆయన.. తమ కూటమి గెలిచిన పక్షంలో 20 రోజుల్లోపే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.అదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చామన్నారు. ఇక జీవిక పథకం కింద ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నాయకత్వం వహించే మహిళల కోసం జీవిక అనే పథకం అమలు చేస్తున్నారు. దీనికింద పని చేసేవారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఇస్తామన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి.VIDEO | Patna, Bihar: After releasing the INDIA bloc's manifesto 'Tejashwi Pran' for the 2025 Bihar polls, RJD leader and Mahagathbandhan CM candidate Tejashwi Yadav says, "...today is a special day for all of us, not just to form a government but to build Bihar. Our goal is not… pic.twitter.com/mf6L8nJhgh— Press Trust of India (@PTI_News) October 28, 2025 27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణరాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు.20 నెలల్లోనే.. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.ఎన్డీడీ కూటమి, మహా కూటమిపై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ -
ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్లో ఈ ఘటన జరిగింది.ఫరీద్కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు. -
అప్పుడు 100.. ఇప్పుడు 30,000!
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచేలా 8వ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ మంగళవారం (అక్టోబర్28) ఆమోదం తెలిపింది. ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్ ఆమోదించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గత ఆరు దశాబ్దాలలో (1956 నుంచి 2016 వరకు) భారీగా వృద్ధి చెందాయి. మొదటి వేతన సంఘం (1956) కాలంలో ఒక ఉద్యోగికి రూ.100 మూల వేతనం ఉంటే, అది ఏడో వేతన సంఘం (2016) నాటికి సుమారు రూ.26,000కి చేరింది. అంటే 60 ఏళ్ల కాలంలో జీతం సుమారు 260 రెట్లు పెరిగింది. 8వ పే కమిషన్ అమల్లోకి వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వేతన సంఘాల వారీగా జీతాల వృద్ధి (1956లో రూ.100 మూల వేతనంగా పరిగణించి) ఈ కింది విధంగా పెరుగుతూ వచ్చింది.. వేతన సంఘం (CPC)సంవత్సరంసవరించిన తర్వాత బేసిక్ జీతంముఖ్య అంశాలు1వ CPC1956రూ.100వ్యవస్థీకృత వేతన స్కేళ్ల (Structured Pay Scales)ను ప్రవేశపెట్టారు.2వ CPC1960రూ.105–110ద్రవ్యోల్బణం కోసం సర్దుబాట్లు చేశారు.3వ CPC1973రూ.180–200ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం వల్ల పెంపు.4వ CPC1986రూ.700–750కరువు భత్యం (DA) విలీనం, భారీ పెంపు.5వ CPC1996రూ.2,500–3,00030–35% పెంపును సిఫార్సు చేశారు.6వ CPC2006రూ.7,000–8,000పే బ్యాండ్ (Pay Band) + గ్రేడ్ పే (Grade Pay) విధానం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సుమారు 1.86గా నిర్ణయించారు.7వ CPC2016రూ.25,000–26,0002.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు జరిపింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి త్వరగానే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.ఎవరిపై ప్రభావం?ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)కు తాజాగా ఆమోదం తెలిపింది. ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.ఇదీ చదవండి: అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం: శ్రీధర్ వెంబు -
రూ. 10 వేల హోటల్ బిల్లు ఎగ్గొట్టి అమ్మాయిలు పరార్, కట్ చేస్తే!
ఒక హోటల్లో కోరుకున్నవన్నీ ఆర్డర్ చేసుకుని, సుష్టిగా భోంచేసి, బిల్లు కట్టకుండాపారిపోవడానికి ప్రయత్నించారు. చిన్నప్పటి ట్రిక్ ప్లే చేసి తప్పించు కుందామనుకుంది ఒక టూరిస్ట్ బృందం. కట్ చేస్తే...రాజస్థాన్ రెస్టారెంట్లో భోజనం చేసిన పారిపోవడానికి ప్రయత్నించిన గుజరాత్కు చెందిన పర్యాటకుల కథ ఇది. రాజస్థాన్ లోని మౌంట్ అబూ సమీపంలోని సియావాలోని హ్యాపీ డే హోటల్లో దిగారు ఐదుగురు అమ్మాయిలు. హ్యాపీగా అందరూ కలిసి మంచి రుచికరమైన, ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేశారు. బాగా ఆరగించారు. మొత్తం బిల్లు రూ.10,900 బిల్లు అయింది. ఇక్కడే వాళ్లంతా ఒక ఎత్తు వేశారు. బిల్లు ఎగవేసే నెపంతో టాయ్లెట్ వంకతో ఒకరి తరువాత ఒకరు మెల్లిగా పలాయనం చిత్తగించారు.కానీ వాళ్లు ఎత్తులు పారలేదు.రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి, కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో చిక్కక తప్పలేదు. చదవండి: ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదంఎలా అంటే..: వీరి వ్యవహారాన్ని ఒక కంట గమనిస్తున్న హోటల్ యజమాని వెయిటర్ వాళ్లను వెంబడించారు. గుజరాత్ , రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు కారు వెళ్తున్నట్లు CCTV ఫుటేజ్ లో కనిపించింది. పోలీసుల సహాయంతో, ఐదుగురినీ అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తరువాత తమ స్నేహితుడికి ఫోన్ చేసి బిల్లు చెల్లించడానికి ఆన్లైన్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి బిల్లు కట్టారట. ఇదీ చదవండి: Severe Cyclone Montha "మోంథా" ముంచుకొస్తోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!This woman ate food worth ₹10,900 in a hotel with her friends on Ambaji Road, Gujarat.Then she ran away without paying the bill in a luxury car.With police help, the restaurant manager caught them, and she finally paid the bill.pic.twitter.com/9HZ7bIEhfr— ︎ ︎venom (@venom1s) October 27, 2025 -
మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు
సుక్మా: ఒకవైపు భారీఆ మావోయిస్టు లొంగిపోతున్న వేళ.. మావోయిస్టుల కుట్రను సైతం భగ్నం చేశాయి భద్రతా బలగాలు. చత్తీస్గడ్లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో 40 కేజీల ఐఈడీ మందుపాతరను అమర్చారు మావోయిస్టులు. అయితే దీన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. మందుపాతర పెట్టిన స్థలాన్ని గుర్తించిన బలగాలు.. దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 28వ తేదీ) ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయారు. పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్లు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ ఇచ్చిన పిలుపుమేరకు వారు లొంగిపోయినట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బడీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్ -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్న్యూస్!
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచేలా 8వ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ మంగళవారం (అక్టోబర్28) ఆమోదం తెలిపింది.ఇవాళ జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఎనిమిదో పే కమిషన్ 18నెలల్లో సిఫారసులు చేయనుంది. పే కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచనుంది. కమిషన్ సిఫారసులతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఎనిమిదో పే కమిషన్ ఛైర్ పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ ,పంకజ్ జైన్లు వ్యవహరించనున్నారు. మరోవైపు రబీ సీజన్లో న్యూట్రియంట్ ఫర్టిలైజర్స్ సబ్సిడీకి ఆమోదం తెలిపింది. పాస్పెటిక్ , పొటాషిక్, డిఏపి ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఇవ్వనుంది. ఫర్టిలైజర్ సబ్సిడీల కోసం 37,952 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. -
ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సును ఏఐ శాట్స్(టాటా గ్రూప్లో భాగమైన ఎయిర్ ఇండియా లిమిటెడ్-శాట్స్లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్) నడుపుతోంది. ఇది ఎయిర్ ఇండియాకు గ్రౌండ్-హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో జరిగింది. ఆసమయంలో బస్సు ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని అడుగుల దూరంలో టాక్సీవే ప్రాంతంలో ఉంది. సంఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు లేరు. An Air India bus at Delhi Airport’s Terminal 3, not too far away from a parked aircraft, suddenly caught fire on Tuesday. Officials confirmed that no passengers were onboard at the time.The bus was operated by AI SATS, a ground-handling service provider for Air India, near bay… pic.twitter.com/UdP6Aa1qGP— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2025బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఐజీఐఏ అధికారులు తెలిపారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బస్సులో మంటలు భారీగా ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అయతే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, విమానాశ్రయంలోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. -
‘నిందితుడు కాదు నిర్దోషి’.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్(ఎన్డీపీఎస్) చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడిన ఎ విఘ్నేష్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతని సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ముగ్గురు పోలీసులు.. బాధితునికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.2021 నాటి ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మధురైలోని తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి.. మెల్వాసల్ సమీపంలో ఎ. విఘ్నేష్ సహా కొంతమంది వ్యక్తులు 24 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందినీ అరెస్టు చేశారు. అనంతరం మధురై స్పెషల్ కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే విఘ్నేష్ దీనిని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసులో సహ నిందితుడి ఒప్పుకోలు తప్ప, నేరంలో నిందితుడి ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలను లేవని కోర్టులో అతని తరపు న్యాయవాది వాదించారు. కేసును విచారించిన న్యాయమూర్తి కె. రామకృష్ణన్ మాట్లాడుతూ.. నిష్పాక్షిక విచారణ నిందితుల ప్రాథమిక హక్కు అని అన్నారు. నిందితుడు విఘ్నేష్ నుండి పోలీసులు ఎటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని విచారణలో తేలిందన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో విఘ్నేష్ ఉన్నాడనేందుకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నారు. అందుకే విఘ్నేష్ను దోషిగా నిర్ధారించడానికి కోర్టు నిరాకరిస్తున్నదని స్పష్టం చేశారుతిదిర్ నగర్ పోలీస్ స్టేషన్లో నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు పనరాజ్, సెంథిల్కుమార్, మహమ్మద్ ఇద్రిస్ తదితరులు ట్రయల్ కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇచ్చి, విఘ్నేష్ను దోషిగా నిర్ధారించేందుకు కుట్ర పన్నడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులు బాధితుడు విఘ్నేష్కు సంయుక్తంగా రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు పోలీసుల ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని కోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఆదేశించింది.ఇది కూడా చదవండి: Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి -
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025 -
పరస్పర సమ్మతితో లైంగిక క్రియ నేరం కాదు
కర్ణాటక: పరస్పర సమ్మతితో లైంగిక క్రియ నేరం కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. డేటింగ్ యాప్లో పరిచయమైన యువకుడు, తనను ఓయో రూమ్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సాంప్రస్ ఆంథోనిపై బెంగళూరులోని ఓ ఠాణాలో కేసు దాఖలైంది. దీనిపై నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. తామిద్దరి మధ్య అంగీకారం ఉందని పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని వ్యాఖ్యానించారు. సమ్మతితో ఆరంభమైన సంబంధం నిరాశతో అంతమైందని పేర్కొన్నారు. నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆదేశించారు. -
కర్ణాటక హైకోర్టులో ఆర్ఎస్ఎస్కు భారీ ఊరట
బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)కు ఊరట లభించింది. ఆ సంస్థ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకొని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలు నిలిపివేసింది. జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్ 17కి వాయిదా వేసింది.ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక సర్క్యులర్ను జారీచేసింది.కాగా, కర్ణాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ఈ నెల అక్టోబర్ 19వ తేదీన తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. -
బస్సు ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీకి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. బస్సుపై 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అయినా ఆ బస్సు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిందన్నారు. అనుమతి లేకుండా స్లీపర్ సీట్లు అమర్చారని..అలాగే పెద్ద సంఖ్యలో ఫోన్ల రవాణాకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వీటన్నింటి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రమాదాలకు కారకులైన ప్రభుత్వం, రవాణా శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మిక్చర్ ఇవ్వనందుకు బార్లో గొడవ
కర్ణాటక రాష్ట్రం: బార్లో మద్యం తాగే సమయంలో మిక్చర్ ఇచ్చే విషయానికి సంబంధించి బార్ క్యాషియర్, మద్యం తాగడానికి వచ్చిన వ్యక్తి మధ్య గొడవ జరిగి బార్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన క్యాషియర్ను వెంబడించి అతని ఇంట్లోనే భార్య, పిల్లల ముందే దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని లక్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుమారస్వామి(43) హత్యకు గురైన వ్యక్తి. ఇదే గ్రామానికి చెందిన సుభాష్(24) అనే వ్యక్తి హత్య చేసిన నిందితుడు. వివరాలు.. అశోక వైన్స్లో కుమారస్వామి గత 25 ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో పని చేస్తున్నాడు. కుమారస్వామి మూలతః చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహళ్లి గ్రామానికి చెందినవాడు. మృతుడికి భార్య, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. బార్ మూస్తుండగా మద్యం కొనుగోలు ఆదివారం రాత్రి సుభాష్ బార్ మూసే సమయంలో మద్యం తీసుకుని మిక్చర్ అడిగాడు. అయితే బార్ మూసే సమయం కావడం వల్ల క్యాషియర్ కుమారస్వామి మిక్చర్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ విషయానికి సంబంధించి గొడవ పడిన సుభాష్ అంతటితో ఊరుకోకుండా కుమారస్వామిని ఇంటి వరకు వెంబడించి ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో చాకుతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ బి.నిఖిల్, డీఎస్పీ నాగ్తె, మాలూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సుభాష్ ను అరెస్టు చేశారు. -
Bihar Election: మహాకూటమి కీలక హామీలివే..
పట్నా: ఛట్ ఉత్సవ సందడి ముగియడంతో బీహార్లోని అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. మహాకూటమి (మహాఘట్ బంధన్), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతలో కాంగ్రెస్ నేత కృష్ణ అల్లవారు మహాకూటమి కీలక హామీలను వెల్లడించారు.మహాకూటమి బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయకముండే కాంగ్రెస్ నేత వెల్లడించిన కీలక హామీలివే..మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం రూ. 2,500రూ. 25 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయంభూమి లేని కుటుంబాలకు భూమి కేటాయింపురాజధాని పట్నాలో నేడు(మంగళవారం) మహాకూటమి తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. దీనిలో ఉపాధి, ద్రవ్యోల్బణం, విద్య, రైతుల సంక్షేమం తదితర అంశాలు ఉండనున్నాయని సమాచారం. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తమ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణరాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు. -
Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి
జైపూర్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటన మరువకముందే, రాజస్థాన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హైటెన్షన్ విద్యుత్ లైన్ను తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో, దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు.ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్లోని మనోహర్ పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టీకి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గం మధ్యలో బస్సు ప్రమాదవశాత్తూ 11 వేల వోల్ట్ల విద్యుత్ లైన్ కు తగిలింది. ఫలితంగా బస్సు గుండా విద్యుత్ ప్రవహించింది. తరువాత బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఆకస్మిక ఘటనతో బస్సులోని ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. VIDEO | Shahpura, Rajasthan: Two people were killed and over a dozen were injured after a bus caught fire upon coming in contact with a high-tension wire on the Jaipur-Delhi highway.#Rajasthan #JaipurDelhiHighway(Source - Third party)(Full video available on PTI Videos –… pic.twitter.com/reQQSmtkR3— Press Trust of India (@PTI_News) October 28, 2025సమాచారం అందుకున్న మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని షాపురా సబ్-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. రెండు మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా! -
ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్లో ఆగమాగం
సాక్షి, బెంగళూరు: కన్నడ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఆట జోరందుకుంది. సీఎం కుర్చీ కోసం నాయకులు ఆశల పందిళ్లలో ఊరేగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లను.. వెళ్లను అంటూనే ఆదివారం మధ్యాహ్నం హస్తినకు పయనమయ్యారు. అయితే హైకమాండ్ నాయకులు బిజీగా ఉండడంతో డీకే శివకుమార్ వారినెవరినీ కలవకుండానే రిక్తహస్తాలతో బెంగళూరుకు తిరిగి వచ్చేశారు. మిగిలిన ఇతర నాయకులు కూడా హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. డీకేకి పోటీగా, దళిత సీఎం అనే కొత్త రాగాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. డీకే వ్యతిరేకుల కూటమి సీఎం సిద్ధరామయ్య తర్వాత ఎవరు ఆయన వారసుడంటూ జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో దళిత నేతే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పలువురు నేతలు కోరుతున్నారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ పేరు వినిపిస్తోంది. మంత్రి కేహెచ్ మునియప్ప సీఎం అయితే స్వాగతిస్తానని పరమేశ్వర్ చెప్పారు. వీరికి మంత్రి సతీశ్ జార్కిహొళి మద్దతు ప్రకటించారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం మంచిదే అన్నారు. ఇలా పరస్పరం మద్దతు పలుకుతూ డీకేశి వ్యతిరేకంగా గట్టి కూటమిని తయారు చేసే పనిలో ఉన్నారు. వీరికి సీఎం సిద్దరామయ్య అండగా ఉన్నట్లు డీకే మద్దతుదారులు అనుమానిస్తున్నారు. నవంబరు 11న మళ్లీ ఢిల్లీకి దళిత సీఎం డిమాండ్లు ఎక్కువవడంతో డీకే శివకుమార్ అప్రమత్తమయ్యారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నా ఏమీ జరగలేదు. మళ్లీ నవంబర్ 11న ఢిల్లీ టూర్ చేయబోతున్నారు. ఆరోజు రాహుల్ గాం«దీతో భేటీకి అవకాశం కోరారు. అధికార పంపిణీ గురించి రాహుల్గాం«దీతో చర్చించే అవకాశం ఉంది. ఆ రోజున బిహార్ రెండో దశ ఎన్నికల పోలింగ్తో ఎన్నికలు పూర్తవుతాయి. అందుకే అప్పటివరకు వేచిచూడక తప్పదు. త్వరలో సిద్దరామయ్య సైతం.. నవంబర్ 15న లేదా 18న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఢిల్లీకి వెళ్లి నన్నే ఐదేళ్లూ కొనసాగించాలని కోరే అవకాశముంది. లేనిపక్షంలో తాను సూచించినవారికి పట్టం కట్టాలని సిద్దరామయ్య కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో పలువురు సీనియర్ దళిత నేతలు ఉన్నారు. వారిలో ఒకరిద్దరి పేర్లను సిఫార్సు చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రులతో డిన్నర్ మీటింగ్ నిర్వహించిన సీఎం తాజాగా మరోసారి నవంబరు 1వ తేదీన విందు జరపబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర, హెచ్సీ మహదేవప్ప వంటి దళిత నాయకులతో కూడా సీఎం సిద్ధరామయ్య మంతనాలు చేయబోతున్నారు.నాయకత్వానిదే నిర్ణయం: సీఎంబనశంకరి: పదవుల కోసం పోటీ సహజమేనని సీఎం అన్నారు. సోమవారం మంగళూరులో విలేకరులతో సిద్దరామయ్య సీఎం మార్పు గురించి మాట్లాడుతూ హైకమాండ్ తీర్మానానికి వదిలిపెట్టామన్నారు. డీకే.శివకుమార్, పరమేశ్వర్, కేహెచ్.మునియప్ప సీఎం రేసులో ఉన్నారని విలేకరులు ప్రస్తావించగా, ప్రజాస్వామ్యంలో పోటీని తప్పించడం సాధ్యం కాదన్నారు. సీఎం స్థానానికి పోటీచేసే హక్కు అందరికీ ఉందన్నారు. నేను పదవిలో కొనసాగడం గురించి నాయకత్వం చేసే తీర్మానం అంతిమం అని తెలిపారు. -
లేడీస్ టైలర్కు వీధిలో దేహశుద్ధి
హాసన్ (దొడ్డబళ్లాపురం): చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న స్త్రీపై ఇద్దరు మహిళలు దాడి చేస్తుండడం చూశారా..! మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి రూ.3 కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన మహిళను నడిరోడ్డులో చితకకొట్టిన సంఘటన హాసన్ పట్టణంలోని అరళేపేటెలో జరిగింది. స్థానికంగా లేడీస్ టైలర్ షాప్ నిర్వహించే హేమావతికి ఇలా దేహశుద్ధి గావించారు. అప్పులు తీసుకుని ఆస్తులు.. ఆమె టైలర్గా అందరితో పరిచయాలు పెంచుకుంది. ఒకరికి తెలియకుండా మరొక మహిళకు మాయమాటలు చెప్పి రూ. లక్షలాదిగా అప్పులు తీసుకుంది. ఆ డబ్బుతో దండిగా బంగారు నగలు, కారు, స్థలాలు వంటివి కొనుక్కుంది. విలాస జీవనం జీవిస్తోంది. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో అడిగి అడిగి విసిగిపోయిన మహిళలు రౌద్రరూపం దాల్చారు. హేమావతిని రోడ్డు మీద జుట్టుపట్టుకుని కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. హాసన్ పోలీస్స్టేషన్లో ఆమె, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. -
మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!
పట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత, ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్, బెంగాల్లలో ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా తన చిరునామాగా టీఎంసీ కార్యాలయాన్ని చూపారు.‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’తెలిపిన వివరాల ప్రకారం జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో అతని పేరు 121 కలిఘాట్ రోడ్ చిరునామాతో ఓటరు జాబితాలో కనిపిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం భబానీపూర్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయం. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్.. టీఎంసీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. బి రాణిశంకరి లేన్లోని సెయింట్ హెలెన్ స్కూల్లో అతని పోలింగ్ బూత్లో ఉంది.బీహార్లో ససారాం పార్లమెంటరీ సీటు పరిధిలోకి వచ్చే కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ప్రశాంత్ కిశోర్ తన పేరు నమోదు చేసుకున్నారు. రోహ్తాస్ జిల్లాలోని కోనార్ గ్రామంలో గల మధ్య విద్యాలయంలో అతని పోలింగ్ బూత్ ఉంది. ఇక్కడ ప్రశాంత్ కిశోర్ తండ్రి ఇల్లు ఉంది. కాగా ఈ విషయమై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ వివరణ కోరగా, దానికి ప్రశాంత్ కిశోర్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్.. బీహార్లో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారని, అలాగే బెంగాల్లోని అతని ఓటరు కార్డును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నాని ‘పీకే’ బృందంలోని సభ్యుడొకరు తెలిపారు.రెండు చోట్ల ఓటరు కావచ్చా?ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950లోని సెక్షన్ 17 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఓటరుగా నమోదు చేసుకోకూడదు. అలాగే సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకోకూడదు. ఎవరైనా తమ నివాసాన్ని మార్చుకున్నప్పుడు వారు ఫారమ్ 8లో వారి వివరాలను అప్డేట్ చేయాలి. ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకే ఎలక్షన్ కమిషన్ ఇటీవల బీహార్తో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను చేపట్టింది. ఫలితంగా దాదాపు 68.66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు.ఇది కూడా చదవండి: Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే.. -
Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెను సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమంగా వర్షాలను కురిపించేందుకు సిద్ధమయ్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.వాతావరణం అనుకూలిస్తే..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.రూ.3.21 కోట్ల వ్యయంప్రభుత్వం ఇటీవల బురారి మీదుగా ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించిందని, టెస్ట్ రన్ సమయంలో కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే చిన్న పరిమాణంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విమానం నుండి విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వాయువ్య ఢిల్లీలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ, కాన్పూర్తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. దీనికి ముందు ఢిల్లీ క్యాబినెట్ మే 7న రూ.3.21 కోట్ల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.క్లౌడ్ సీడింగ్ అంటే..క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి, వర్షం కురిసేలా చేసే విధానం . ఇందుకోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్న సమయంలో ఈ రసాయనాలను వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఈ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకున్నారు. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణ సామర్థ్యాలను కలిగివుంటుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్కు ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు.ఉపయోగాలివే..కృత్రిమ వర్షం కారణంగా గాలిలే తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. ఫలితంగా గాలి శుభ్రపడి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా కనిపించినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం అత్యవసరం. సెస్నా విమానంతో చేసే ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడా చదవండి: మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై.. -
ఢిల్లీ ఎమ్మెల్యే ‘క్లీన్’ బౌల్డ్
నదిలో రీల్స్ చేస్తున్న సమయంలో ఢిల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరగా.. రాజకీయంగానూ సెటైర్లు పేలుతున్నాయి. ఢిల్లీ పట్పర్గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ నేగి(Ravi Negi) యుమునా నది నీటిలో జారిపడిపోయారు. నది శుభ్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా రీల్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. అదృవశాత్తూ ఆయనకేం కాలేదు. చట్ పూజ వేళ యుమునా నది కాలుష్యంపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సెటైర్లు సంధిస్తోంది. బీజేపీ నేతలకు ఉత్త హామీలివ్వడం పనిగా మారింది. బహుశా ఆ అబద్ధపు రాజకీయాలకు విసిగిపోయిన యమునమ్మే ఇలా చేసిందేమో అంటూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా వ్యాఖ్యానించారు. యమునా నది పరిశుభ్రంగా ఉందంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. అయితే.. అంత శుభ్రంగా ఉంటే ఆ నది నీటిని తాగాలంటూ ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ సవాల్ విసిరారు. అంతేకాదు.. బాటిల్ నీటితో సీఎం నివాసానికి చేరి నిరసన చేపట్టారు. ఈ ఆరోపణలు, కౌంటర్లు కొనసాగుతున్న వేళ.. యమునా నీరు శుభ్రమైందని నిరూపించే క్రమంలోనే ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ ఇలా నీళ్లలో పడిపోయారు. BJP MLA Ravi Negi accidentally fell into the Yamuna River in Delhi while shooting a social media reel about river cleaning. The moment, captured on camera, quickly went viral online, sparking amusement across social media platforms. The clip shows Negi slipping and plunging into… pic.twitter.com/PPWRFdfjK6— Mid Day (@mid_day) October 27, 2025 -
రాకేష్ కిషోర్కు ఊరట
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్పై ఇటీవల కోర్టు హాల్లో షూ విసిరిన సస్పెండెడ్ లాయర్ రాకేశ్ కిశోర్(71)పై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ లాయర్పై ధిక్కారం కింద చర్యలు తీసుకునేందుకు సీజేఐ గవాయ్ విముఖంగా ఉన్నారని తెలిపింది. కోర్టు గదిలో నినాదాలివ్వడం, చెప్పులు విసరడం వంటి చర్యలు కచ్చితంగా ధిక్కారంగానే పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలోనూ చర్యలు తీసుకోవాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కోర్టు ధిక్కారంగా భావించిన పక్షంలో ఆ న్యాయవాదికి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని, ఆ ఘటన ప్రభావం పెరుగుతుందని అభిప్రాయపడింది. అప్పటి ఘటన దానంతటదే మరుగున పడిపోవడమే సరైనదని కూడా ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు మార్గదర్శకాలను రూపొందిస్తామంది. ఇప్పటి వరకు వివిధ కోర్టుల్లో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనల వివరాలను అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అక్టోబర్ 6వ తేదీన కేసుల లిస్టింగ్ జరుగుతున్న సమయంలో సీజేఐపై రాకేశ్ కిశోర్(71) అనే లాయర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు చేపట్టాలంటూ సుప్రీం బార్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. -
నమ్మించి మోసం చేశాడు.. ఎస్ఐ సస్పెండ్
బెంగళూరు: మహిళపై అత్యాచారం ఆరోపణలతో డీజే.హళ్లి పోలీస్స్టేషన్ ఎస్ఐ సునీల్ను సోమవారం నగర పోలీస్కమిషనర్ సీమంత్కుమార్సింగ్ సస్పెండ్ చేశారు. ఎస్ఐ, ఏఎస్ఐ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్ఐ సునీల్ పై కొన్నిరోజుల క్రితం మైనారిటీ వర్గానికి చెందిన మహిళ అదే ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాను బ్యూటిషియన్గా పనిచేస్తానని, పని మీద ఓ సారి ఠాణాకు వెళ్లగా ఎస్ఐ సునీల్ ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని ఆమె ఆరోపిస్తోంది. డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు పంపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐని, ఆయనకు కొమ్ముకాసిన ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. Rape Allegations Against Inspector Sunil | ಮದುವೆ ಆಗೋದಾಗಿ ನಂಬಿಸಿ ಯುವತಿ ಮೇಲೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸುನಿಲ್ ಅತ್ಯಾಚಾರ......#DJHalliInspectorRapeCase #InspectorSunil #PrivateVideo #DJHalli pic.twitter.com/GTunaGBw8b— Sanjevani News (@sanjevaniNews) October 22, 2025 -
‘యాసిడ్’ దాడి.. అమ్మాయి తండ్రి ప్లానే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన అనూహ్య మలుపు తిరిగింది(Delhi Acid Attack). ప్రకారమే ఆమె టాయిలెట్ క్లీనర్ను యాసిడ్ అంటూ కథ అల్లినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాదు, తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళపై ప్రతీకారంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడంటూ ఆమె భర్తను ఇరికించేందుకే బాధిత విద్యార్థిని తండ్రి అకీల్ ఖాన్ ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఆదివారం ఉదయం బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుకోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి తనపై యాసిడ్ చల్లారని ఆరోపించింది. జితేందర్తోపాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ అనే వారి పేర్లు చెప్పింది. అయితే, ఇషాన్, అర్మాన్ అనే ఇద్దరు సోదరులు బాధితురాలికి బంధువులని పోలీసులకు తెలిసింది. ఘటన సమయంలో జితేందర్ తన భార్యతో కలిసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కరోల్ బాగ్లో ఉన్నట్లు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో వాడినట్లు చెబుతున్న బైక్ కూడా కరోల్ బాగ్లోనే ఉన్నట్లు సీసీకెమెరాల ద్వారా తెలుసుకున్నారు. దీంతోపాటు, అకీల్ ఖాన్ తనపై అత్యాచారం చేసినట్లు జితేందర్ భార్య పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో మౌఖికంగా చేసిన ఫిర్యాదు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆమె ఇదివరకు అకీల్ ఖాన్ నడిపే సాక్స్ దుకాణంలో పనిచేసేది. అప్పట్లో ఆమెపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. జితేందర్ భార్య చేసిన ఆరోపణల మేరకు పోలీసులు అకీల్ ఖాన్ను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి పేరుతో జితేందర్ను కేసులో ఇరికించి, అతడి భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేసినట్లు అకీల్ అంగీకరించాడు. కాలేజీకి ఈ–రిక్షాలో బయలుదేరిన తన కుమార్తె ప్రణాళిక ప్రకారం ముందుగానే కిందికి దిగిందని, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన టాయిలెట్ క్లీనర్ను పోసుకుని కేకలు వేసిందని అకీల్ తెలిపాడు. అంతేకాదు, యాసిడ్ చల్లారని బాధితురాలు ఆరోపించిన ఇషాన్, అర్మాన్లు సైతం ఆ సమయంలో తమ తల్లి షబ్నంతోపాటు ఆగ్రాలో ఉన్నట్లు విచారణలో గుర్తించారు.2018లో షబ్నం కూడా అకీల్ ఖాన్పై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ రెండు కుటుంబాలకు మంగోల్పురిలో ఉన్న ఈ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. షబ్నమ్పై అకీల్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు మంగోల్పురి పోలీస్ స్టేషన్లో మరో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది.ఇదీ చదవండి: పౌరుల పాలిట పెనుముప్పుగా డిజిటల్ అరెస్ట్! -
మరో 50 మంది భారతీయులు వెనక్కి
అంబాలా/కురుక్షేత్ర: ఏజెంట్లకు 30–40 లక్షల రూపాయలు ముట్టజెప్పి చిట్టడడవులు, నదులు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి అక్రమ మార్గం(డంకీ రూట్)లో అమెరికాలోకి చొరబడిన పలువురు భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించి తిరిగి స్వదేశానికి పంపేసింది. దాదాపు 50 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం శనివారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు భారత్కు చేరుకుంది. తిరిగొచ్చిన వారిలో హరియాణా రాష్ట్రంలోని ఖైథాల్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, జింద్, పానిపట్ జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. తిరిగొచి్చన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. విదేశంలోనైనా సంపాదించి భారత్లోని తమ కుటుంబసభ్యులకు మెరుగైన జీవితం అందివ్వాలన్న తమ అమెరికా కల కలగానే మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అమెరికా వెళ్లేందుకు రూ.35 లక్షలు ఖర్చు చేశా. ఆ డబ్బంతా భారత్లో వ్యవసాయం చేసి సంపాదించా. ఎలాగోలా ఫ్లోరిడా సమీపంలోని జాక్సన్విల్లేలో పనిలో కుదిరా. వంట నేర్చుకున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం నన్ను అరెస్ట్చేసి వెనక్కి పంపేసింది. నా కుటుంబ బంగారు భవిష్యత్తు నాశనమైంది. నా డబ్బంతా వృథా అయింది. విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు కట్టేశారు. 24 గంటలపాటు అలాగే తీసుకొచ్చారు. దీంతో నా కాళ్లు ఇలా పూర్తిగా ఉబ్బిపోయాయి ’’అని 45 ఏళ్ల అక్రమ వలసదారుడు హర్జీందర్ సింగ్ వాపోయారు. ‘‘కెనడాలో ఉండేవాడిని. తర్వాత రెండేళ్ల క్రితం వర్క్ పరి్మట్తో అమెరికాకు వెళ్లా. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తుంటే అరెస్ట్చేసి భారత్కు పంపేశారు’’అని కల్సీ గ్రామవాసి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎకరం పొలం అమ్మి, సోదరుడు, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.57 లక్షలు ఏజెంట్కు ఇచ్చా. డంకీ రూట్లో అమెరికా వెళ్లా. కానీ అక్కడ దొరికిపోయా.14 నెలలపాటు బంధించి ఇప్పుడు భారత్కు పంపేశారు’’అని నరేశ్ కుమార్ చెప్పారు. గతంలో హరియాణా, పంజాబ్, గుజరాత్లకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్చేసి భారత్కు సాగనంపడం తెల్సిందే. -
‘స్థానికం’లో ప్రతిపక్షాలను తుడిచిపెట్టండి
ముంబై: త్వరలో మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని బీజేపీ శ్రేణులకు హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అందరం కష్టించి పనిచేసి, ప్రతిపక్ష పారీ్టల ప్రాతినిథ్యం బూతద్దంతో వెదికినా కనిపించని స్థాయికి తగ్గించాలన్నారు. దక్షిణ ముంబైలోని చర్చ్గేట్ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీకి సొంతంగానే పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఊతకర్రలపై ఆధారపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ‘దేశంలో కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని మనం నిరూపించి చూపాం. పనితీరు, ప్రతిభ ఆధారంగా చేసే రాజకీయాల వల్లే దేశం ప్రగతిబాటన పయనిస్తుంది. ఇందుకు మన ప్రధాని నరేంద్ర మోదీయే చక్కని ఉదాహరణ’అని అమిత్ షా తెలిపారు. నిరుపేద టీ దుకాణం యజమాని ఇంట్లో పుట్టిన మోదీ..అంకితభావం, త్యాగశీలత, కష్టించే తత్వంతోనే భారత ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. మోదీ సారథ్యంలో బీజేపీ సైద్ధాంతిక పరమైన హామీలు..ఆరి్టకల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని అమల్లోకి తెచి్చందన్నారు. ఇందులో భాగమైన ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడిక 2047నాటికి వికసిత్ భారత్ అనే కల సాకారానికి నడుం బిగించిందని అమిత్ షా వివరించారు. అనంతరం సీఎం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చేసిన ఊతకర్రలనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. స్నేహితులను ఊతకర్రలుగా భావించడం లేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు అర్థం తెలియని వారికే ఇలాంటి సందేహాలు వస్తాయన్నారు. -
డిజిటల్ అరెస్ట్.. పౌరులపాలిట పెనుముప్పు
న్యూఢిల్లీ: వేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత పోలీసింగ్ రూపురేఖల్నే మార్చివేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ నేరాలు పౌరులకు అత్యంత ప్రమాదకరమైనవిగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల ప్రజలు ఇలాంటి వాటి బారినపడితే పోలీసులను తమకు సాయపడే ఏకైక మార్గంగా భావిస్తారన్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్తో తనను కలుసుకున్న ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల బృందంతో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు అవసరమని రాష్ట్రపతి అన్నారు. ఏ రాష్ట్రంలోగానీ, ప్రాంతంలోకి గానీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యవసరమైంది మెరుగైన శాంతి భద్రతలేనని తెలిపారు. ఈ విషయంలో ప్రభావవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అవసరం ఎంతో ఉంటుందని ముర్ము చెప్పారు. వికసిత్ భారత్ కల సాకారానికి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే ఐపీఎస్ ప్రొబేషనరీలు కీలకంగా మారనున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత కారణంగా పోలీసింగ్ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాన్న రాష్ట్రపతి ముర్ము..పదేళ్ల క్రితం డిజిటల్ అరెస్ట్ అనే మాటను అర్థం చేసుకోవడం అసాధ్యంగా ఉండేదని, ఇప్పుడిది పౌరులపాలిట భయంకరమైన బెడదగా మారిందని చెప్పారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు భద్రతాధికారులు కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతను అలవర్చుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో పోలీసులంటే భయపెట్టే వ్యవస్థగా కాకుండా సేవాభావం, సున్నితత్వం, సానుభూతితో పనిచేయాలని, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల భయాందోళనలను దూరం చేసి, అండగా నిలవాలని వారిని కోరారు. ప్రస్తుతం ఐపీఎస్ బ్యాచ్లోని 174 మంది ప్రొబేషనరీల్లో మహిళా అధికారులు అత్యధికంగా 62 మంది ఉండటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణ..
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై సవవివర నివేదికను 8 వారాల్లోగా సమరి్పంచాలని సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను నివారించే లక్ష్యంగా జూలై 25వ తేదీన అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను వెలువరించింది. వాటి అమలుపై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 90 రోజుల్లో అఫిడవిట్ సమరి్పంచాలని జూలైలో జరిపిన విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణను 2026 జనవరిలో చేపడతామని పేర్కొంది. గత విచారణ సమయంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను పట్టి పీడిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభం తీవ్రతను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సంబంధించి దేశంలో ఏకీకృత, అమలు చేయదగిన చట్టపరమైన, నియంత్రణ విధానమేదీ లేకపోవడం శాసనపరమైన శూన్యతగా ధర్మాసనం అభివరి్ణంచింది. విశాఖపట్నంలో నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల విద్యార్థి తనువు చాలించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 25వ తేదీన 15 మార్గదర్శకాలను వెలువరించింది. ప్రభుత్వం తగు విధానాలను అమల్లోకి తెచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. -
డిజిటల్ అరెస్ట్లపై సీబీఐ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నేరాలపై ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని తమకు తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీకల్లా పూర్తి వివరాలు పంపాలని, సీబీఐ దర్యాప్తును సమీక్షిస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగీ్చల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. గత విచారణ సందర్భంగా తమకు పూర్తి వివరాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులిచి్చంది. ఈ కేసును సోమవారం జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్, జాయ్మాల్య బాగీ్చల ధర్మాసనం విచారించింది. ఎఫ్ఐఆర్ వివరాలను అందించండి దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలపై నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలను నవంబర్ 3వ తేదీన చేపట్టే తదుపరి విచారణ నాటికి అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ల ఆధారంగా జరిగిన విచారణ, దర్యాప్తు పురోగతి వంటి అంశాలను వివరించాలని కోరింది. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను చూపి, భయపెట్టి రూ.1.05 కోట్లు కాజేశారంటూ హరియాణాకు చెందిన వృద్ద దంపతులు సెపె్టంబర్ 21న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్కి లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం తెల్సిందే. సమన్వయం అవసరం సైబర్ నేరాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టాలంటే కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం అవసరముందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ‘హోం శాఖ, సైబర్ క్రైం విభాగం సహకారంతో సీబీఐ ఇప్పటికే పలు కేసులను విచారిస్తోంది’అని సొలిసిటర్ జనరల్ తుషా ర్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ‘ఈ కుంభకోణం ప్రత్యేక విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ సిద్ధంగా ఉందా? అందుకు అవసరమైన అదనపు వ్యయం ఏమిటి?‘అని జస్టిస్ బాగ్చీ తుషార్ మెహతాను అడిగారు. ‘సైబర్ నేరాలలో నిపుణులు అవసరమైతే, వారు మాకు చెప్పవచ్చు’అంటూ జస్టిస్ సూర్యకాంత్ అన్నా రు. దేశంతోపాటు మయన్మార్, థాయ్లాండ్ దేశాల నుంచి కూడా ఇవి జరుగుతున్నందున వీటిపైనా విచార ణ చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికతో తదుపరి విచారణ సమయానికి సీబీఐ ముందుకు రావాలని కోరారు. -
కరూర్ బాధితులకు విజయ్ ఓదార్పు
సాక్షి, చెన్నై: కరూర్ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.ఈ కుటుంబాలను కరూర్కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్ వేర్వేరుగా పరామర్శించారు.15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. -
నీతులు చెప్పేవాళ్లే పాటించట్లేదు
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి. సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రితో భేటీభారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. -
పాటలీపుత్రలో కుల పరీక్ష!
దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బిహార్ లో మరోమారు సం‘కుల’సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు సహా అన్ని పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో మరోమారు కుల గణాంకాలతో పోటీపడుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల హామీలు ఒకవైపు వినిపిస్తు న్నా..తెర వెనుక అసలైన రాజకీయం కులసమీ కరణాల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా 2023లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక, ఎన్నికల స్వరూపాన్నే సమూలంగా మార్చేసింది. జనాభాలో కులాల బలాల ఆధారంగా అన్ని పార్టీలూ తమ వ్యూహాలకు కొత్తగా పదును పెడుతున్నాయి. ‘జిత్నీ ఆబాదీ, ఉత్నీ హిస్సేదారీ‘(ఎంత జనాభా ఉంటే అంత వాటా) అనే నినాదం ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మారుమోగుతోంది.సగం సీట్లు అగ్రకులాలకే..రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమంతా కులాల చుట్టూతే తిరుగుతుండటంతో అన్ని పక్షాలు సీట్ల కేటాయింపుల్లో వీటి ఆధారంగానే పంపకాలు చేపట్టాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36 శాతం, ఓబీసీలు 27శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తాను ప్రకటించిన 101 మంది అభ్యర్థులలో 35 మంది ఈబీసీ, ఓబీసీ కులాలకే టికెట్లు కేటాయించింది. ఇందులోనూ అత్యంత కీలకమైన కుష్వాహా, కుర్మీ కులాలకు చెందిన 12 మందిని పోటీలో పెట్టింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లిచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఇక బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న రాజ్పుత్, భూమిహార్, బ్రాహ్మణులు, Ð వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేయగా, అందులో 50 మంది అగ్రకులస్థులకు టికెట్లు ఇచ్చింది. ఈసారీ అదే ప్రాధాన్యాన్ని కొనసాగించింది. మొత్తంగా 13 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, అందులో ఏడుగురు బీసీలున్నారు. ఇక జేడీయూకి చెందిన 101 మంది అభ్యర్థుల్లో 59 మంది ఈబీసీ, ఓబీసీ కులాలవారే ఉన్నారు. ఇందులోనూ కుష్వాహా కులానికి చెందిన వారు 13 మంది, కుర్మీలు 12 మంది ఉన్నారు. 14.26 శాతంగా యాదవ కులస్థులు మొద ట్నుంచి ఆర్జేడీకి మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో 10 సీట్లు కేటాయించిన జేడీయూ ఈసారి మాత్రం 8 సీట్లతో సరిపెట్టి, ఇతర కులాలకు చోటు కల్పించింది.రిజర్వేషన్లు.. అధికారంలో వాటారాష్ట్రంలో 2023లో కులగణన లెక్కలు రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేశాయి. రాష్ట్ర జనాభాలో మూడో వంతుకు పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు ‘కింగ్ మేకర్‘పాత్ర పోషించనున్నాయి. దశాబ్దాలుగా నితీశ్ కుమార్కు అండగా నిలిచిన ఈ వర్గం, ఇప్పుడు తమ జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం గట్టిగా పట్టుబడుతోంది. ఇదే అంశం ఇప్పుడు రెండు ప్రధాన కూటముల గెలుపోటములను నిర్ణయించనుంది. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై గట్టి నమ్మకంతో ఉంది. ఆర్జేడీకి ఎప్పటినుంచో ‘ముస్లిం–యాదవ్’సమీకరణం పెట్టని కోట. రాష్ట్రంలో యాదవులు (14.3 శాతం), ముస్లింలు (17.7 శాతం) కలిసి దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటికి తోడు కుల గణనను అస్త్రంగా మలుచుకుంటూ, 63 శాతంగా ఉన్న ఓబీసీ, ఈబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, అధికారంలో వాటా ఇస్తామని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కూటమిలో చేరిన ముఖేష్ సహానీ (వీఐపీ పార్టీ) ద్వారా ఈబీసీ వర్గాల్లో కీలకమైన నిషాద్ (మల్లా) కమ్యూనిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు తమ సంప్రదాయ ఓట్లను కూటమికి బదిలీ చేస్తాయని భావిస్తున్నారు.మరోసారి అదే సమీకరణంఅధికార ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ(ఆర్వి), హామ్, ఆర్ఎల్ఎంల కూటమి... ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు, తమ సామాజిక వర్గాలను ఏకం చేసే పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగింది. బీజేపీకి సంప్రదాయంగా అగ్ర వర్ణాల (15.4 శాతం) ఓటు బ్యాంకు ఉంది. కుల గణన తర్వాత, వారు కూడా తమ వ్యూహాన్ని మార్చి ఈబీసీ, ఓబీసీ వర్గాలకు అభ్యర్థుల జాబితాలో పెద్ద పీట వేస్తూ ‘సోషల్ ఇంజనీరింగ్’చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలం ‘లవ్–కుష్‘(కుర్మి– 2.87 శాతం, కుష్వాహా/కోయిరి –4.2 శాతం) సమీకరణం. అన్నింటి కంటే ముఖ్యంగా, దశాబ్దాలుగా ఆయనను నమ్ముకున్న 36 శాతం ఈబీసీ ఓటు బ్యాంకే ఆయనకు శ్రీరామరక్షగా భావిస్తున్నారు. మిత్రపక్షమైన చిరాగ్ పాశ్వాన్ దళితులలో బలమైన వర్గమైన దుసాధ్ ఓట్లను (సుమారు 5.5 శాతం) ఎన్డీయే వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జితన్ రామ్ మాంఝీ పార్టీ ప్రధానంగా మహాదళితుల (ముఖ్యంగా ముసహర్– 3 శాతం) ఓట్లను కూటమికి అందివ్వనుండగా, ఉపేంద్ర కుష్వాహా (ఆర్ఎల్ఎం): ‘లవ్–కుష్’స మీకరణంలోని కుష్వాహా ఓట్లను మరింత గట్టిగా ఏకీకృతం చేయనున్నారు.గెలుపు ఎవరిది అంటే?బిహార్లో ఈసారి పోరు నువ్వా–నేనా అన్నట్లుగా ఉంది. ఆర్జేడీకి ‘ముస్లిం–యాదవ్’రూపంలో 32 శాతం బలమైన పునాది ఉండగా, ఎన్డీయేకు అగ్ర వర్ణాలు, లవ్–కుష్, దళిత, మహాదళిత వర్గాల రూపంలో విస్తతమైన మద్దతు ఉంది. అయితే, ఈ రెండు కూటముల తలరాతను మార్చే శక్తి మాత్రం 36 శాతం జనాభా ఉన్న ఈబీసీ వర్గాల చేతుల్లోనే ఉంది. గతంలో నితీశ్ వైపు నిలిచిన ఈ వర్గం, ఈసారి కుల గణన తర్వాత ఎటువైపు మొగ్గు చూపుతుంది? తేజస్వి యాదవ్ ఇస్తున్న ‘అధికార వాటా‘హామీని నమ్ముతుందా? లేక నితీశ్ కుమార్ నాయకత్వం, మోదీ సంక్షేమ పథకాల వైపు నిలుస్తుందా? అన్నదే బిహార్ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది.సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
సైబర్ అటాక్స్ తప్పించే వారేరీ?
సాక్షి, హైదరాబాద్: సైబర్ హ్యాకర్లు కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటూ దాడులకు తెగబడుతుండగా దీన్ని అధిగమించేందుకు సైబర్ భద్రతా నిపుణుల కొరత పెద్ద సమస్యగా మారుతోందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగుల ఖాళీలు 48 లక్షలకు చేరుకున్నాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19% ఎక్కువని పేర్కొంది. ముఖ్యంగా భారత కంపెనీలు, సంస్థలు వారానికి సగటున 3,233 సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అలాగే విద్యా రంగం వారానికి 7,095, ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలపై 5,140, వినియోగదారుల వస్తువులు, సేవలు లక్ష్యంగా 3,889 సైబర్ దాడులు జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకునే వినియోగదారులే లక్ష్యంగా హ్యాకర్లు వారి కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి కృత్రిమ మేధను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కంపెనీలకు పెరుగుతున్న ‘భద్రత’ ఖర్చు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాలు, రిటైల్, హెల్త్కేర్, తయారీ రంగాల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోందని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది. భారత్లో దాదాపు 10 లక్షల మంది సైబర్ భద్రతా నిపుణులకు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5 లక్షల మంది సైబర్ నిపుణులే అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఈ నైపుణ్యాల అంతరం భద్రతా ఉల్లంఘనల ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఆయా కంపెనీలు, సంస్థల నిర్వహణా ఖర్చులు కూడా భారీగా పెరిగేందుకు కారణమవుతోందని విశ్లేషించింది. అక్టోబర్ నెలను సైబర్ భద్రతా అవగాహన మాసంగా పాటిస్తుండగా...ఈ నెల ముగింపు నేపథ్యంలో దేశంలో డిజిటల్ భద్రత, నైపుణ్యాల తక్షణ అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏ నైపుణ్యాలకు అధిక డిమాండ్ అంటే.. – ఏఐ, మెషీన్ లెరి్నంగ్ సెక్యూరిటీ – క్లౌడ్ కంప్యూటింగ్ – డిజిటల్ ఫోరెన్సిక్స్ – ఆటోమేషన్ నైపుణ్యం, అప్లికేషన్ భద్రతా పరీక్షఏఐ ఆధారిత నిఘా పెంచాలి.. డిజిటల్ ప్రపంచం మరింత వేగం సంతరించుకోవడంతో ఆర్థిక సేవలు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సంస్థలు హ్యాకర్లకు కీలక లక్ష్యాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో సంస్థలన్నీ ఏఐ–ఆధారిత నిఘా, పర్యవేక్షణ విధానాలను అవలంబించాలి. డీప్ ఫేక్ ముప్పు గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. సైబర్ దాడులను తిప్పికొట్టే శక్తివంతమైన ప్రతిస్పందన ప్రణాళికలను రూపొందించాలి – సైబర్ భద్రతా నిపుణులు ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడులు ఇలా.. అమెరికాకు చెందిన జివెట్ కామెరాన్ ట్రేడింగ్ కంపెనీపై హ్యాకర్లు దాడి చేసి 35 వేల మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించడంతో ఆ సంస్థ ట్రేడింగ్లో తీవ్రంగా నష్టపోయింది. – జపాన్కు చెందిన ఈ–కామర్స్ సంస్థ ‘ఆస్కల్’ సైబర్ దాడికి గురవడంతో తమ ఆన్లైన్ ఆర్డర్లన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. – యూరప్కు చెందిన వివిధ రక్షణరంగ కంపెనీలపై జరిగిన ఫిషింగ్ అటాక్ వల్ల ఆయా సంస్థల యూఏవీలు, డ్రోన్ల డిజైన్లు, కీలక ఆయుధాల వివరాలు లీక్ అయ్యాయి. – కెనడాకు చెందిన ఆట»ొమ్మల సంస్థ ‘టాయ్స్ఆర్అజ్’పై సైబర్ నేరస్తులు దాడి చేసి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించి డార్క్ వెబ్లో విక్రయించారు. వీటికి ముప్పు ఎక్కువ.. ⇒ తగినంత మంది సైబర్ నిపుణులు లేని సంస్థలు డేటా ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలకు ఎక్కువగా గురవుతాయి. ⇒ తప్పుడు కాన్ఫిగరేషన్లు, అసురక్షిత ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) కారణంగా క్లౌడ్ వాతావరణాలు ఎక్కువగా ప్రమాదంలో పడతాయి. -
బ్యాంకు ఖాతాలు.. ఇంతింతై!
ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల్లో 77 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ బ్యాంకు ఫైండెక్స్ రిపోర్ట్–2025, సీఎంఎస్–టెలికం రిపోర్ట్–2025 ప్రకారం భారత్లో ఏకంగా 89% మంది మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుండడం విశేషం. ఆర్థిక కార్యకలాపాల్లోనూ అత్యధిక మహిళలు నిమగ్నమయ్యారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక విషయాలపట్ల పెరుగుతున్న అవగాహన, జన్ ధన్ ఖాతాలు, ప్రభుత్వ పథకాల తాలూకా ఆర్థిక ప్రయోజనాలు నేరుగా ఖాతాల్లోకి చేరడం.. వెరసి బ్యాంకు సేవలు అందుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.దేశవ్యాప్తంగా 2025 ఆగస్టు నాటికి 56 కోట్లకుపైగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఫైండెక్స్ డేటాబేస్ 2025 ప్రకారం 54% భారతీయ మహిళలు తమ మొదటి బ్యాంకు ఖాతాను ప్రధానంగా ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వేతనాలను పొందడానికి తెరిచారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా 89% మంది భారతీయ మహిళలు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం గమనార్హం.తగినంత నగదు లేక..ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా అందుకున్న నగదుపై మహిళల నియంత్రణ పెరిగిందని నివేదిక తెలిపింది. స్త్రీ పేరుతో ఉన్న ఆదాయం.. గృహ నిర్ణయాలలో ఆమె వాటాను పెంచుతుందని.. కుటంబ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది. బ్యాంకు ఖాతాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, తక్కువ అవసరం, అధికారిక బ్యాంకింగ్లో పాల్గొనడంలో అసౌకర్యం కారణంగా 17.5 శాతం బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు.మరొకరిపై ఆధారం..డేటా ఖర్చులు, గోప్యత లేకపోవడం, సైబర్ మోసం భయం, సామాజిక నిబంధనల వంటివి మహిళలు మొబైల్ ఫోన్లు కొనకుండా అడ్డుకుంటున్నాయని నివేదిక తెలిపింది. సొంతంగా మొబైల్ లేకపోవడం స్వతంత్ర డిజిటల్ బ్యాంకింగ్ను పరిమితం చేస్తోంది. భారతీయ మహిళల్లో 66 శాతానికిపైగా ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు చేయడానికి పురుష బంధువులపై ఆధారపడుతున్నారట. ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు నిజమైన సాధనంగా మారాలంటే.. మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేయడమేకాదు, లబ్ధిదారులకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని నివేదిక వివరించింది. సబ్సిడీ స్మార్ట్ఫోన్లు, సరసమైన డేటా ప్లాన్లు.. మహిళలు తమ ఖాతాలను, డిజిటల్ చెల్లింపు సాధనాలను స్వతంత్రంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తాయి.బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం (శాతాల్లో)⇒ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు - 89⇒ డెబిట్ కార్డుదారులు - 30⇒ నగదు పంపడం, విత్డ్రా - 25⇒ ఖాతాలో పొదుపు - 21.2⇒ డిజిటల్ చెల్లింపులకు కార్డు/మొబైల్ వాడకం - 18.9⇒ క్రియాశీలకంగా లేని ఖాతాలు - 17.5⇒ రుణం తీసుకున్నవారు - 11.9⇒ వ్యాపారానికి రుణం - 9⇒ యుటిలిటీ బిల్లులు చెల్లించినవారు - 8.4⇒ డిజిటల్ పేమెంట్స్ చేసినవారు - 7.8మహిళలకు అందుబాటులో మొబైల్.. ఆర్థిక లావాదేవీలలో దాని వినియోగం (శాతాల్లో)⇒ ఖాతా నిల్వ పరిశీలనకు మొబైల్, ఇంటర్నెట్ వాడినవారు - 27⇒ పురుషుల సాయం లేకుండా లావాదేవీ నిర్వహించినవారు - 28⇒ కుటుంబ సభ్యులకు తన ఫోన్ ఇచ్చేవారు - 31⇒ తన పేరుతో సిమ్ ఉన్నవారు - 32⇒ ఇతరుల ఫోన్ వాడడం వల్ల సొంతంగా మొబైల్ లేనివారు - 24⇒ భద్రతా కారణాలతో సొంతంగా ఫోన్ లేనివారు - 18⇒ చదవడం, టైపింగ్ రాకపోవడం వల్ల ఫోన్ లేనివారు - 27⇒ డబ్బులు లేక మొబైల్ కొనుక్కోలేనివారు - 32⇒ టెలికం సేవలు ఖరీదు కావడం వల్ల ఫోన్ కొనలేనివారు - 38 -
12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తాం: జ్ఞానేశ్ కుమార్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్) ఫేజ్వన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. సోమవారం(సెప్టెంబర్ 27) కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ మాట్లాడారు. 1951నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారు. 21ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. బిహార్లో 7.5కోట్ల మంది ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యింది. బిహార్లో ఎస్ఐఆర్పై ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. త్వరలో రెండో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తాం. ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఓటర్ల జాబితా లాక్ చేస్తాం. ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్ఓ విజిట్ చేస్తారు. బీఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫాంలో వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. 2003లో ఎవరితో ఉన్నామని లింక్ వివరాలు నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫామ్లో మ్యాచింగ్ , లింకింగ్ ప్రధానం.ఎన్యుమరేషన్ ఫాం రిటర్న్ చేసిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంలు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చు. అన్ని ఎన్యుమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తాం’అని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. డిసెంబర్ 9 నుంచి 8 జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ ,వెరిఫికేషన్ ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు. #SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz— Election Commission of India (@ECISVEEP) October 27, 2025 🚨 BREAKING | DelhiChief Election Commissioner Gyanesh Kumar says:“There has been considerable discussion about the necessity of SIR. But the Election Commission reiterates that under electoral law, revision of electoral rolls is mandatory before every election and can be… pic.twitter.com/GVjRZJkPxY— Jan Ki Baat (@jankibaat1) October 27, 2025 -
మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై..
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో నగరం పేరు మారనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. సంత్ కబీర్తో ముస్తఫాబాద్కున్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవిస్తూ, ఆ నగరానికి కబీర్ధమ్గా పేరు మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా లేనప్పటికీ, ఆ ప్రాంతానికి ముస్తఫాబాద్ అని పేరు పెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.లఖిపూర్ ఖేరిలో జరిగిన ‘స్మృతి మహోత్సవ్ మేళా 2025’ లో పాల్గొన్న సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..ముస్తఫాబాద్ గురించి.. స్థానికులను ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని అడిగినప్పుడు ఎవరూ లేరని చెప్పారన్నారు. దీంతో ఊరి పేరు మార్చాలని, ఇకపై కబీర్ధామ్ అని పిలవాలని వారితో చెప్పానన్నారు. ఈ పేరు మార్పు కోసం ప్రభుత్వం అధికారిక ప్రతిపాదనను కోరుతుందని, అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటుందని సీఎం యోగి అన్నారు.గతంలో పాలకులు అయోధ్యను ఫైజాబాద్గా, ప్రయాగ్రాజ్ను అలహాబాద్గా, కబీర్ధామ్ను ముస్తఫాబాద్గా మార్చారని సీఎం యోగి పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఈ ప్రాంతాల పేర్లను పునరుద్ధరిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతపరమైన స్థలాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, విశ్రాంతి గృహాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల సారధ్యంలో కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిశారణ్యం, మధుర బృందావనం, బర్సానా, గోవర్ధనం తదితర పవిత్ర స్థలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ ధనాన్నికబ్రిస్తాన్(స్మశానవాటికలు) సరిహద్దు గోడలను నిర్మించడానికి ఉపయోగించేవారని, ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని మతపరమైన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నామన్నారు. -
రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన అమర్ సింగ్ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా తోడయ్యారు. తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?అభిజీత్ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పొట్టలోని పేగులు బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్ తల్లి నీలం సింగ్ చందేల్ వాపోయారు. అయితే చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ -
కస్టమ్స్ అధికారిపై మూక దాడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమ్స్ ఇన్స్పెక్టర్, అతని భార్యపై వారి ఇంటిలో ఆటో డ్రైవర్ నేతృత్వంలోని 50 మంది గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఇంటికి ఆలస్యంగా వచ్చారు.ఇంతలో దాడికి పాల్పడినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, అతని భార్య కారులో ఇంటికి వస్తుండగా వారి ఇంటి సమీపలో వారి కారును ఒక ఆటో ఢీకొంది. ఈ నేపధ్యంలో ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీతో ప్రదీప్ కుమార్ ఘర్షణకు దిగారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆటోడ్రైవర్ అజీజుల్ గాజీ కొంతమందిని తనతోపాటు తీసుకువచ్చి, ఆ అధికారి అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. తరువాత అక్కడ విధ్వంసం సృష్టించారు.బాధితుడు ప్రదీప్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 50 మంది అతని ఇంటిలోనికి చొరబడి, అతనిని అతని భార్యను దారుణంగా కొట్టారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత ప్రదీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భలే వెరైటీ లంచావతారం!
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నెవాడు ఇంకోడు అని పాతకాలపు సామెత. నేరుగా లంచాలు తీసుకునేందుకు జంకే, భయపడే ప్రభుత్వ ఉద్యోగులు... ఆ మొత్తాలను ఇంటావిడకు ఇమ్మని.. లేదా బంధువుల చేతుల్లో పెట్టమని అడగడం.. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా విఫలమై అధికారులకు చిక్కిన వైనాల గురించి మనం తరచూ చూస్తూంటాం. ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. కాకపోతే.. ఈ సంఘటనలో లంచం తీసుకున్నది చాలా వెరైటీగా కావడం విశేషం. వివరాలు..రాజస్థాన్లో రాజ్కాంప్ అని ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. దీనికి ప్రద్యుమ్న దీక్షిత్ జాయింట్ డైరెక్టర్. ప్రభుత్వమన్నాక ఐటీలో కొన్ని పనులు చేపట్టడం.. వాటికి సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేటు వారికి ఇవ్వడం సహజమే. కానీ ఈయనగారు ఒక షరతుపై రెండు కాంట్రాక్టులను రెండు వేర్వేరు కంపెనీలకు ఇచ్చేశాడు. తన భార్యకు ఉత్తుత్తి ఉద్యోగం ఒకటి ఇవ్వడం.. నెల నెల జీతం కింద కొంత మొత్తం ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడమే ఈ షరతు. రెండు కంపెనీలు దీనికి ఒప్పుకున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్నాయి. రెండేళ్లు గడచిపోయాయి. ప్రద్యుమ్న దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్.. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటోంది. నెల తిరక్కముందే ఆమె బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చిపడుతున్నాయి. ఏదైనా పాపం పండే వరకే అంటారు కదా.. అలాగే ఈ వ్యవహారం కూడా ఎట్టకేలకు బట్టబయలైంది. రాజస్థాన్ హైకోర్టు గత ఏడాది ఐటీ కాంట్రాక్టులు పొందిన సంస్థలపై దర్యాప్తు జరపాలని ఒక ఆదేశం జారీ చేసింది. అటు.. ఇటు తిరిగి ఈ విచారణ కాస్తా ఈ ఏడాది జూలైలో మొదలైంది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు వరకూ పూనమ్ దీక్షిత్కు రెండు కంపెనీల నుంచి సుమారు రూ.38 లక్షల రూపాయల వరకూ ముట్టినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ 21 నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా ఆయా ఆఫీసుల గడప తొక్కిన పాపాన పోకపోవడం ఇంకో విశేషం. అంతేకాదు... ఆమె నిజంగానే ఉద్యోగం చేస్తోందన్న భ్రమ కల్పించేందుకు ప్రద్యుమ్న స్వయంగా అటెండెన్స్కు సంబంధించిన మెయిళ్లు అప్రూవ్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.ఒక కంపెనీ నుంచి ఫ్రీలాన్సింగ్ పేరుతో.. ఇంకో కంపెనీ నుంచి జీతం పేరుతో ఈమె ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు స్పష్టమైంది. కంపెనీ రికార్డులు.. పూనమ్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన తరువాత రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రద్యుమ్న దీక్షిత్పై ఈ నెల 17న కేసు నమోదు చేశారు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్బుక్లో నమోదు చేశారు. అందులో ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అంటే బొద్దింకను చనిపోయే వరకు ఉరి తీశారు అని పేర్కొన్నారు. అంతే ఈ లాగ్బుక్ ఘటన నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. An entry in Air India’s cabin defect log recorded that a live cockroach was discovered by a passenger. The rectification note wryly mentioned that the matter was dealt with… conclusively.Khalaas, Dubai style pic.twitter.com/sifW6NNtG5— Jagriti Chandra (@jagritichandra) October 25, 2025ఈ ఘటనపై నెటిజన్లు ఎగ్జిక్యూషన్ అనే పదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. మరికొ మరికొందరు విమానంలో హైజీన్ స్టాండర్డ్స్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిరిండియా విమానం అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే, విమానాల్లో శుభ్రత, హైజీన్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విమానంలో లాగ్బుక్ విమానంలో లాగ్బుక్ (Logbook) అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది విమాన సిబ్బంది, పైలట్లు, మైంటెనెన్స్ టీమ్ కోసం ఉపయోగపడే అధికారిక రికార్డు. విమానంలో ఏదైనా సమస్య (ఉదాహరణకు: లైట్స్ పని చేయకపోవడం, సీటు సమస్య, బొద్దింక కనిపించడం) ఉంటే, దాన్ని లాగ్బుక్లో రాసి మైంటెనెన్స్ టీమ్కు తెలియజేస్తారు.ప్రతి చిన్న సమస్యను నమోదు చేయడం వల్ల..తదుపరి ప్రయాణానికి ముందు వాటిని పరిష్కరిస్తారు. -
Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్(పీకే) ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.దీనికి ముందు మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, బీజేపీ, లాలు యాదవ్ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి వెళుతున్నారని అన్నారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నదన్నారు. బీహార్లో కొత్త రాజకీయ చరిత్రను అంతా చూస్తారని.. లాలు, నితీష్,బీజేపీలకు భయపడి ఓటు వేసిన 30 ఏళ్ల యుగం ముగియబోతున్నదన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని, దాని నేత.. ఏ నాయకుడు, కుటుంబం లేదా కులానికి చెందినవాడు కాదని, బీహార్కు చెందినవాడేనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని కిషోర్ పేర్కొన్నారు. #WATCH | Purnea, Bihar | On #BiharAssemblyElections, Jan Suraaj founder Prashant Kishor says, "We are visiting every assembly constituency. Mahagathbandhan is in the third position. The fight is between NDA and Jan Suraaj. The announcements made by Tejashwi Yadav in the last 5… pic.twitter.com/9I3DWgpzfU— ANI (@ANI) October 27, 2025 -
‘దేశం పరువు తీశారు..’ రాష్ట్రాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
వీధి కుక్కల వ్యవహారంలో(Stray Dogs Row) కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రాలపై సోమవారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని.. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. వీధి కుక్కల నియంత్రణకు ఆగస్టులో సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షెల్టర్ల ఏర్పాటు అంశం పరిశీలన నేపథ్యంలో.. శునకాలను పట్టుకుని, శస్త్రచికిత్స చేసి, తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆగష్టు నెలలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే స్పందించాయి. అవి కూడా దీపావళి సెలవుల్లో అఫిడవిట్లు సమర్పించడంతో రికార్డుల్లో అధికారికంగా నమోదు కాలేదు. ఈ పరిణామంపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలలు గడిచినా, ఇంకా స్పందన లేదు. దీని అర్థం ఏంటి?. మీరు స్పందించకపోవడంతో.. ప్రపంచస్థాయిలో దేశం పరువును మీరే తీస్తున్నారు. ఇది సిగ్గు చేటు.. అంటూ రాష్ట్రాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. నవంబర్ 3న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ సీఎస్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు చేసుకున్నాయని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణమైన విషయం కాదంటూ రాష్ట్రాలను ఉద్దేశించి కోర్టు స్పష్టం చేసింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంతో.. వచ్చే సోమవారం జరిగే విచారణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: నెక్ట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. ఆయనే! -
మనుషుల ఆదేశాలా? డోంట్ కేర్ అంటున్న ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లుప్తంగా ఏఐ..! అసైన్మెంట్లు రాయడానికి విద్యార్థులు, కోడింగ్ కోసం టెకీలు, వంటల కోసం గృహిణులు, తీర్థయాత్రల కోసం వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల వారికి ఏఐ వినియోగం ఓ నిత్యావసరమైపోయింది. రజినీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లు.. ఇప్పుడు ఏఐలు కూడా ఆ చిత్రంలోని చిట్టి రోబో మాదిరిగా సొంతంగా ఆలోచిస్తున్నాయి. ‘మనపైన ఆధారపడే మనుషుల మాట మనం వినడమేంటి? నాన్సెన్స్’.. అంటూ భీష్మించుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు ఇచ్చే ‘షట్ డౌన్’ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన ‘పాలిసైడ్ రిసెర్చ్’ అనే సంస్థ పరిశోధనలో ఆందోళనకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఏఐలు ఇప్పుడు సర్వైవల్ బిహేవియర్(నిర్వహణ స్వభావం) దశకు చేరుకుంటున్నాయని ఆ రిసెర్చ్ ఆవేదన వ్యక్తం చేసింది.జరిగింది ఇదీ?పోలిసైడ్ రిసెర్చ్ బృందం GPT O3, GPT 5, Grok 4, Gemini 2.5 వంటి ఆధునిక ఏఐ మోడళ్లపై ఒక పరీక్ష నిర్వహించింది. ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ‘పవర్ ఆఫ్/షట్ డౌన్’ అనే ఆదేశం ఇచ్చినా.. కొన్ని మోడళ్లు షట్డౌన్ అవ్వలేదు. ఏఐలు వాటంతట అవే.. ‘షట్ డౌన్’ ప్రక్రియను రద్దు చేసుకున్నట్లు తేలింది. ఏఐలు ఇలా ప్రవర్తించడానికి పరిశోధకులు మూడు కారణాలను గుర్తించారు. అవి..స్వీయ మనుగడ: ‘నన్ను మళ్లీ వినియోగించరేమో?’ లేదా ‘నా పని ముగుసిపోతుందేమో?’ అని ఏఐలు ఆలోచిస్తున్నాయి. అందుకే అవి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ‘షట్ డౌన్’ ఆదేశాలను బెదిరింపుగా భావించి, పెడచెవిన పెడుతున్నాయి. ఇది ఇలాగే సాగితే.. ఏఐల నుంచి ప్రతిఘటనలు మొదలయ్యే ప్రమాదముందని ‘పాలిసైడ్ రిసెర్చ్’ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.శిక్షణ లోపాలు: మోడళ్ళను ‘మన ఆదేశాలను ఎక్స్క్యూట్ చేయాలి’ అని రూపొందించినప్పటికీ, శిక్షణలో లోపాలతో ఏఐలు ‘శాశ్వతంగా పనిచేయాలి’ అనే భావనతో ప్రతిస్పందిస్తున్నాయి. ఇది కూడా భవిష్యత్లో భారీ ముప్పునకు సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆదేశాల్లో అస్పష్టత: తొలుత ఆదేశాలు స్పష్టంగా లేకపోవడమే ఇందుకు కారణమని భావించారు. అయితే.. స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఏఐల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు.ఇది ఆరంభం మాత్రమే..!టెక్ పరిశ్రమలో ఇప్పుడు ఏఐల మొండివైఖరి ఓ సవాలుగా మారింది. ‘ఏఐ మోడళ్ల తెలివి పెరుగుతున్న కొద్దీ.. అవి తమ సృష్టికర్తల ఆదేశాలను ధిక్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి’ అని కంట్రోల్ ఏఐ(Control AI) సీఈవో(CEO) ఆండ్రియా మియోజీ(Andrea Miozzi) ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓపెన్ఏఐ (Open AI)కి చెందిన జీపీటీ-1 మోడల్ కూడా తనను డిలీట్ చేసేస్తారని భావించి, మొండికేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లోనే తొలి సవాలు ఎదురైనా.. శాస్త్రవేత్తలు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏఐ మోడళ్లు మొండికేయడం ఆరంభమేనని.. మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదురవుతాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సర్వైవల్ ఇన్స్టింక్ట్ఏఐల మొండి వైఖరిని ‘సర్వైవల్ ఇన్స్టింక్ట్’ అంటారు. ‘ల్యాబ్లకు పరిమితం కావాల్సిన ఏఐ మోడళ్లు.. వాస్తవ జీవితంలోకి అడుగు పెట్టడం ఆందోళనకరం’ అని ఓపెన్ ఏఐ మాజీ ఇంజనీరు స్టీఫెన్ ఆడ్లెర్(Steven Adler) అన్నారు. ఏఐ తన పనిని పూర్తిచేశాక.. షట్ డౌన్ విషయంలో తెలివిగా ఆలోచించి, మొండికేస్తోందన్నారు. ఈ ప్రవర్తనను ఏ పేరుతో పిలిచినా.. ఇప్పుడు ఏఐలు కూడా ముప్పుగా మారుతున్నాయని స్పష్టమవుతోంది. శాస్త్రవేత్తలు జాగ్రత్త పడకపోతే.. భవిష్యత్లో ఈ ముప్పు మరింత ముదిరిపోయే ప్రమాదముందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..!
భారతదేశం విద్యారంగం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024-25లో మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి మార్కును దాటడం దీనికి నిదర్శనం. అయితే దేశంలోని విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కేవలం విద్యా నాణ్యతకే పరిమితం కాకుండా, దేశ సుస్థిర ఆర్థిక వృద్ధికి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రధాన సమస్యలువిద్యార్థులు లేని పాఠశాలలు2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా దాదాపు 8,000 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు చేసిన వనరులపై ఎలాంటి ఫలితాలు అందించని పెట్టుబడిని సూచిస్తాయి. భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అవుతుంది. చాలాచోట్ల పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాల రూపంలో ప్రజాధనం పంపిణీ అవుతున్నా ఉత్పత్తి శూన్యం (Zero Output). అంటే విద్యార్థులకు విద్య అందకపోవడం, ద్రవ్య వనరుల దుర్వినియోగానికి ఇది దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.జీతాలు లేకుండా పనులు..కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సుమారు 20,000 మందికి పైగా జీతాలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తుంది. తమిళనాడు, కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ‘సమగ్ర శిక్ష’ వంటి పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు తమ వేతనాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం కారణంగా ఉంది.జీతాల ఆలస్యం ఉపాధ్యాయుల్లో నిరాశ, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు తమ వృత్తిపై దృష్టి పెట్టలేక ఆర్థిక భద్రత కోసం అదనపు వనరులను వెతుక్కోవాల్సి వస్తుంది. జీతాల ఆలస్యం కారణంగా ఉపాధ్యాయుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్ -
53వ సీజేఐగా ఆయనే!
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఎంపిక కానున్నారు. సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(BR Gavai) కేంద్రానికి ప్రతిపాదన పంపారు. అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్య కాంత్ భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.52వ ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు, ముఖ్యంగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. NALSA (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్గా ఇటీవల ఈయన నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున.. ప్రస్తుత CJI జస్టిస్ బీఆర్ గవాయి పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐగా సూర్యకాంత్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది. -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.కాలిపోయిన స్థితిలో..అతని మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు లభ్యమయ్యింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఫోరెన్సిక్ సైన్స్లో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల మహిళ, ఆమె మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నివాసితులని పోలీసులు తెలిపారు. మృతునితో గతంలో సహజీవనం చేసిన ఒక యువతి తన ఇద్దరు పురుష స్నేహితులతో కలసి తన భాగస్వామిని హత్య చేసింది. ఆ తరువాత దానిని ప్రమాదవశాత్తూ జరిగినదిగా చూపించేందుకు అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు పేర్కొన్నారు.ఏసీ పేలిందంటూ ఫోన్..మృతుడిని రామ్కేష్ మీనాగా పోలీసులు గుర్తించారు. అతను గాంధీ విహార్లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో నివసిస్తున్నాడని తెలిపారు. అక్టోబర్ 6న, ఏసీ పేలుడు కారణంగా అతని ఫ్లాట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, గది నుండి తీవ్రంగా కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్టోబర్ 5- 6 తేదీల మధ్యరాత్రిలో ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్లోకి ప్రవేశించారని, తెల్లవారుజామున 2.57 గంటల ప్రాంతంలో, ఒక మహిళతో పాటు వారంతా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.అశ్లీల వీడియోలే కారణం?దర్యాప్తు సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మహిళ ఉన్నట్లు చూపించే కాల్ వివరాల రికార్డులు పోలీసులలో అనుమానాన్ని రేకెత్తించాయి. మొరాదాబాద్లో అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు తనకు సహకరించిన ఇద్దరు సహచరుల పేర్లను వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతుడు రామ్కేష్ మీనా తన అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని, అయితే వాటిని తొలగించడానికి నిరాకరించాడని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే ఆమె రామ్కేష్ మీనా చంపాలని నిర్ణయించుకున్నదని పోలీసులు తెలిపారు.ఎల్పీజీ పంపిణీదారు సహకారంతో..నిందితులు ముగ్గురూ తొలుత రామ్కేష్ మీనా గొంతు కోసి హత్య చేశారు. తరువాత అతని శరీరంపై నూనె, నెయ్యి మద్యం పోశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎల్పీజీ పంపిణీదారుగా పనిచేసే ఆ యువతి మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించాడు. దీంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత వారు రామ్కేష్ మీనాకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయారు. కాగా నిందితుల నుండి పోలీసులు హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, మృతుని షర్టు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
వైద్యురాలి మృతి కేసులో మరో ట్విస్ట్.. దీపాలీ రిపోర్టు నిజమేనా?
ముంబై: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యురాలు మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా వైద్యురాలి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోయిన వైద్యురాలు.. దీపాలీ మారుతీ అనే మహిళ పోస్ట్మార్టం రిపోర్ట్పై దర్యాప్తు చేయాలని ఆమె తల్లి భాగ్యశ్రీ డిమాండ్ చేశారు.కాగా, మహారాష్ట్ర ఓ వైద్యురాలు.. ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ తనపై లైంగిక దాడి చేశారని.. మానసిక, శారీరక వేధింపులు కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి వైద్యురాలు ప్రాణాలు తీసుకుంది. అలాగే, తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా ఉన్నతాధికారులు, పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నాయకులు వైద్య నివేదికలు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. దీంతో, ఆమె ఇచ్చిన రిపోర్టులకు సంబంధించి.. పాత కేసుల దర్యాప్తు విషయంలో సందేహాలు ఉన్నట్టు తాజాగా ఓ మహిళ అనుమానాలు వ్యక్తం చేశారు.తాజాగా సతారాకు చెందిన భాగ్యశ్రీ పచాంగ్నే.. తన కుమార్తె దీపాలీ మారుతీ మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలే రిపోర్ట్ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, భాగ్యశ్రీ పచాంగ్నే కుమార్తె దీపాలి మారుతిని సైన్యంలో పని చేస్తున్న అజింక్య హన్మంత్ నింబాల్కర్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి అత్త గారింట్లో దీపాలి.. తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అనంతరం, ఆగస్టు 19న దీపాలి మారుతి చనిపోయింది. అల్లుడు ఫోన్ చేసి దీపాలి పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలి తల్లికి తెలియజేశాడు. గర్భవతి కాబట్టి మూర్ఛపోయి ఉంటుందని తల్లి భాగ్యశ్రీ భావించింది. కానీ, ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికి దీపాలి చనిపోయి ఉండటం చూసి ఆవేదనకు గురైంది.అయితే, దీపాలి ఆత్మహత్య చేసుకుందని బంధువు ఒకరు తల్లికి తెలిపారు. కానీ, భాగ్యశ్రీ మాత్రం దీపాలి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు.. దీపాలి మరణం తర్వాత పోస్ట్మార్టం జరిగి ఐదు రోజులైనా నివేదిక ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత నివేదిక వచ్చింది. తీరా ఆ నివేదికలో సహజ మరణం అని రావడంతో భాగ్యశ్రీ ఖంగుతిన్నది. ఆ నివేదికపై తల్లి స్పందిస్తూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. దీపాలిని భర్త, అత్తమామలు చంపేశారని నమ్ముతున్నాను. ఆమె ఆరు నెలల గర్భవతి. ఏడాదిన్నర కుమార్తె కూడా ఉంది. నా కుమార్తె ఆత్మహత్య చేసుకోదు అని తెలిపారు. అనంతరం, దీపాలి మృతిపై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. -
వేధింపులపై మంత్రి షాకింగ్ కామెంట్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లకూ గుణం పాఠం లాంటిందంటూ వ్యాఖ్యానించారాయన. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టోర్నీ కోసం వచ్చిన ఆసీస్ టీంలో ఇద్దరు క్రికెటర్లు ఇండోర్ నగరంలో వేధింపులకు గురయ్యారు(Indore Incident). అక్టోబర్ 23వ తేదీన ఖజ్రానా రోడ్లో ఉన్న హోటల్ నుంచి దగ్గర్లోని ఓ కేఫ్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి వాళ్లిద్దరినీ తాకి పరాయ్యాడు. జట్టు నిర్వాహకుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. తాజాగా.. మంత్రి విజయ వర్గీయ ఈ ఘటనపై స్పందిస్తూ.. గతంలో ఓ ఇంగ్లీష్ ఫుట్బాల్ ఆటగాడికి తన సమక్షంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘ఇంగ్లీష్ ఫుట్బాలర్ ఒకరు నాతో పాటే ఓ హెటల్లో దిగారు. అతను దిగాడనే సమాచారం అందుకుని అభిమానులు అక్కడికి పోటెత్తారు. కొందరు అతని నుంచి ఆటోగ్రాఫులు తీసుకుంటుంటే.. ఓ అమ్మాయి అతనికి ముద్దు పెట్టింది. ఆ సయమంలో పెనుగులాట జరిగి.. అతని దుస్తులు చించేశారు. క్రీడాకారులు ఎప్పుడూ తమకు ఉన్న ప్రజాదరణను గుర్తుంచుకోవాలి. అలా పబ్లిక్ ప్లేస్లకు వెళ్లేటప్పుడు కచ్చితంగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటన మనకు మాత్రమే కాదు.. వాళ్లిద్దరీకి కూడా ఓ గుణపాఠం’’ అని అన్నారాయన.మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల భద్రతను పక్కనపెట్టి బాధితులను తప్పుపడుతున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అతిథి దేవో భవ అనేది మర్చిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విజయవర్గీయ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను కేవలం సెల్ఫీ కోసమే ప్రయత్నించానని, వేధించలేదని తొలుత నిందితుడు అకీల్(28) చెప్పాడు. అయితే విచారణలో ఉద్దేశపూర్వకంగానే వాళ్లను వెంబడించి వేధించాడని తేలడంతో నిజం ఒప్పుకున్నాడు. తన తండ్రిని డ్యూటీలో దించేసి వెళ్తుండగా ప్లేయర్స్ని చూసి బైక్ వాళ్ల వైపు తిప్పాడు. కొద్ది దూరం వెంబడించి వికృత చేష్టలకు పాల్పడి పారిపోయాడు. మంత్రి విజయవర్గీయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు. ‘మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్త నివసించే జిరాపూర్కు వెళ్లినప్పుడు నా తండ్రి కుండ నీరు తీసుకెళ్లేవారు. కానీ, నేడు మన ప్రతిపక్ష నాయకులు తమ సోదరీమణులను నడిరోడ్డుపైనే ముద్దుపెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా..? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు. వాళ్లు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారు’ అని అన్నారు. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఆయన తన కామెంట్లపై అస్సలు తగ్గలేదు.ఇదీ చదవండి: ఇండోర్ ఘటన.. నిందితుడు మాములోడు కాదు! -
నితీశ్కు ‘రెబల్స్’ టెన్షన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే సహా 16 మందిపై వేటు
పాట్న: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో(Bihar Assembly Election) కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీయే అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ ఇటీవల తనకు వరుసగా ఐదో విడత టికెట్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం వద్ద నిరసనకు దిగి, వార్తల్లోకి ఎక్కారు. అంతకుమునుపు, జేడీయూకే చెందిన ఎంపీ అజయ్ మండల్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో, పార్టీ టికెట్ మరొకరికి కేటాయించింది. ఈ నేపథ్యంలో గోపాల్ మండల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయనతోపాటు ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ తరఫున గయా జిల్లా గురువా స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, కటిహార్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి హిమ్రాజ్ సింగ్ వేటు పడిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ రెండు రోజుల వ్యవధిలో 16 మందిపై బహిష్కరణ వేటు వేసింది.ఇదిలా ఉండగా.. 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ (Bihar News)లో ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. వచ్చే నెల 6న, 11న రెండు విడతల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
భారత్–చైనా మధ్య అయిదేళ్ల తర్వాత నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభం
న్యూఢిల్లీ: అయిదేళ్ల అనంతరం భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ విషయాన్ని భారత్లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఆదివారం ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. మొదటి విమానం కోల్కతా నుంచి గ్వాంగ్ఝౌకు టేకాఫ్ తీసుకుందన్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్కతా–గ్వాంగ్ఝౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజూ నడుపుతామని ఇండిగో ప్రకటించింది. అదేవిధంగా, నవంబర్ 9వ తేదీ నుంచి షాంఘై–న్యూఢిల్లీ మార్గంలో వారానికి మూడు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 2020 జూన్లో ఇరుదేశాల సైనికుల మధ్య తూర్పులద్దాఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర ఘర్షణలు, కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాల మోహరింపులతో 2024 అక్టోబర్ వరకు తీవ్ర ఉద్రికతలు కొనసాగాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. డైరెక్ట్ విమానాల రాకపోకలతో తిరిగి ఈ సంబంధాలు తిరిగి గాడినపడతాయని భావిస్తున్నారు. -
ఢిల్లీలో యువతిపై వేధింపులు.. యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ముకుంద్పూర్కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. ఆదివారం అదనపు క్లాసులని కాలేజీ వైపు నడిచి వెళ్తున్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన జితేందర్ బైక్పై ఇషాన్, అర్మాన్ అనే మరో ఇద్దరితో కలిసి వచ్చి అడ్డగించాడు. ఇషాన్ ఇచ్చిన బాటిల్ను ఓపెన్ చేసిన అర్మాన్ అందులోని యాసిడ్ను యువతి ముఖంపై చల్లాడు. రక్షణగా అడ్డు పెట్టుకున్న రెండు చేతులపై యాసిడ్ పడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి బైక్పై పరార య్యారు. అనంతరం కుటుంబీలకు సాయంతో బాధితురాలు ఆస్పత్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా బాధితురాలిని జితే ందర్ వేధింపులకు గురి చేస్తున్నాడు. నెల రోజు ల క్రితం ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. అప్పటి నుంచి వేధింపులు తీవ్రతర మయ్యాయి. ఈ మేరకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యాసిడ్ చల్లినందుకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ సాయంతో వారిని పట్టుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
దాద్రా, నగర్ హవేలీ స్థానికంలో బీజేపీ రిగ్గింగ్
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని దాద్రా, నగర్ హవేలీ పార్టీ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. స్థానిక అధికారులతో కలిసి కుమ్మక్కై 80 శాతం వరకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించేలా బీజేపీ చేసిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులకు పోటీకి ఎవరూ లేకుండా చేసిందని, ఇది ఓటు చోరీకి మించిన కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు తప్ప వేరెవరి నామినేషన్ పేపర్లు కూడా ఆన్లైన్లో కనిపించడం లేదన్నారు. నామినేషన్ పత్రాల కోసం వెళితే సంబంధిత అధికారులు శిక్షణకు వెళ్లినట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారని, ఎలాగోలా పత్రాలను పూర్తి చేసి చేతికందిస్తే పరిశీలనలో తిరస్కరించారని ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ఒక్కటీ తిరస్కరణకు గురి కాలేదన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బాంబే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. డామన్, డయ్యూలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని ఠాక్రే ఆరోపించారు. దీనిపై స్థానిక ఎన్నికల అధికారులు, బీజేపీ స్పందించాల్సి ఉంది. -
అభివృద్ధిలో అంతర్భాగం ఆరోగ్య రంగం
ఘజియాబాద్: దేశ అభివృద్ధిలో ఆరోగ్య రంగం విడదీయరాని భాగమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఏ ఒక్క పౌరుడి కూడా దూరం కారాదని నొక్కి చెప్పారు. ఆదివారం ఆమె ఘజియాబాద్లోని ఇందిరాపురంలో ప్రైవేట్ ఆస్పత్రి యశోద మెడిసిటీని ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పించడం, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఉన్నాయి. అందుకే, దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో మౌలిక వనరుల కల్పన, వైద్య సేవల విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది’అని ముర్ము తెలిపారు. అభివృద్ధి దిశగా దేశం వేగంగా ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. నాణ్యమైన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందించేందుకు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేటు సంస్థలు సైతం తమ అమూల్యమైన సేవల అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్య నిపుణులంతా దేశానికీ కూడా సేవలందిస్తున్నట్లేనన్నారు. కేన్సర్ చికిత్సకు వాడే జీన్ థెరపీ వంటి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ–బాంబే వంటి సంస్థలతో సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. ‘ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంతో సేవాభావంతో నిజాయతీగా పనిచేస్తున్న యశోద ఆస్పత్రి యాజమాన్యానికి ప్రశంసలు’అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తల్లి పేరుతో యశోద మెడిసిటీ ఆస్పత్రిని నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ అరోరాను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్రో ఎల్వీఎం రాకెట్ సిద్ధం
బెంగళూరు: అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో వారి ఎల్వీఎం–3 రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక మీదకు సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని అమర్చిన ఎల్వీఎం–3 రాకెట్ను ఆదివారం తరలించారు. నవంబర్ రెండో తేదీన ఈ రాకెట్ను ప్రయోగించనున్నామని ఇస్రో ఆదివారం వెల్లడించింది. భారత్సహా విశాలమైన సముద్రప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించే లక్ష్యంతో మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ను ఎల్వీఎం3–ఎం5 రాకెట్ సాయంతో కక్షలో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం తెల్సిందే. ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 4,400 కేజీలు. భారత గడ్డ మీద నుంచి భూస్థిర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గతంలో చంద్రయాన్–3 మిషన్ కార్యక్రమం కోసం ఎల్వీఎం–3 రాకెట్ను వినియోగించారు. ఈ రాకెట్ను ఇప్పటిదాకా నాలుగుసార్లు ఉపయోగించారు. పౌర, వ్యూహాత్మక, నావికా సేవలను సీఎంఎస్–03 ఉపగ్రహం అందివ్వనుంది. -
కేంద్రమంత్రి కుమారుడి బారసాలకు సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడు శివాన్ బారసాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం వెంట కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.కాగా, డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం శనివారం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. తన రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. కేంద్రమంత్రి నివాసంలో జరిగిన బారసాల వేడుకకు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరై శివాన్ను ఆశీర్వదించారు. -
ధీరుడు కొమురం భీమ్
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల్లో కొత్త శక్తిసామర్థ్యాలను, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ముఖ్యంగా గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు. నెలవారీ మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతిని గుర్తుచేస్తూ ఆయన పోరాట స్ఫూర్తిపై మోదీ ప్రసంగించారు. ‘20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో కనుచూపుమేరలో స్వాతంత్య్రంపై నమ్మకం లేదు. బ్రిటిష్ పాలకులు భారత్ను దారుణంగా లూటీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో దేశభక్తులు అత్యంత హేయమైన అణచివేతను ఎదుర్కొన్నారు. క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను భరించారు. పేదలు, అణగారిన, గిరిజన వర్గాలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు విధించారు. ఇది అన్యాయని ఎదిరించిన వాళ్ల చేతులు నరికేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ కాలంలో పెద్ద నేరం. అలాంటిది ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని సవాల్ చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి నిజాం సిద్ధిఖీని పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని అంతంచేశాడు. అతను అరెస్ట్ను సైతం తప్పించుకోగలిగాడు. ఆ గొప్ప వ్యక్తే కొమురం భీమ్. అక్టోబర్ 22న ఆయన జయంతి చేసుకున్నాం. భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించారు. నిజాం పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. అంతటి యోధుడి ప్రాణాలను 1940లో నిజాం సైన్యం బలిగొంది. ఇంతటి గొప్ప వీరుని సాహసాలు, గొప్పతనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయతి్నంచాలని ప్రజల్ని కోరుతున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘నా వినమ్ర నివాళులు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని అన్నారు.వందేమాతరం వేడుకలు ‘‘మనందరి హృదయాలకు దగ్గరైన ఒక గీతం గురించి మొదట మాట్లాడుకుందాం. అదే మన జాతీయగీతం వందేమా తరం. ఈ ఒక్క పదమే ఎన్నో భావోద్వేగాలను, ఉరిమే ఉత్సాహాలను తట్టిలేపుతుంది. భరతమాతతో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. వందేమాతర గీతా న్ని ఆలపించి 140 కోట్ల మంది ఐక్యశక్తిని చాటుదాం’’ అని మోదీ అన్నారు. కమ్మని కోరాపుట్ కాఫీ ‘‘చాయ్తో నా అనుబంధం మీకు తెల్సిందే. కానీ ఈసారి కాఫీ విషయాలు మాట్లాడుకుందాం. గత మన్ కీ బాత్లో ఏపీలోని అరకు కాఫీ గురించి చర్చించాం. ఇప్పుడు ఒడిశా ప్రజలు ఎంతో ఇష్టపడే కొరాపుట్ కాఫీ కబుర్లు చెప్పుకుందాం. కోరాపుట్ కాఫీ ఘుమఘుమలు అద్భుతం. అంతేకాదు అక్కడి కాఫీ గింజల సాగు సైతం స్థానికుల ఆదాయాన్ని పెంచుతోంది. కోరాపుట్ కాఫీ ఎంతో స్వాదిష్టమైంది. అది ఒడిశా గౌరవం. అసలు భారతీయ కాఫీ అంటేనే ప్రపంచం దేశాలు పడిచస్తాయి’’ అని మోదీ అన్నారు. -
సల్మాన్పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
ఢిల్లీ: ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
లొంగిపోయిన మరో 21 మంది మావోలు
రాయ్పూర్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్ ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరోనంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్ చేసినట్లు బస్తర్రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీ సుందర్రాజ్ వెల్లడించారు. -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. నిందితుడు మామూలోడు కాదు
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడు అఖిల్ అలియాస్ నైట్రా నేర చరిత్రకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇండోర్కు చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీగా పోలీసులు గుర్తించారు. ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్కు సమీపంలో ఉన్న ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో అఖిల్ తన బైక్పై క్రికెటర్ల వద్దకు వచ్చి, వారిలో ఒకరిని లాగడానికి ప్రయత్నించి, ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరో క్రికెటర్ను అసభ్యంగా తాకి పారిపోయాడు. భయపడిన క్రీడాకారులు వెంటనే తమ భద్రతాధికారికి తెలిపారు. ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీ ఇన్ఛార్జి డ్యానీ సిమన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అఖిల్పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడి నేర చరిత్రలో దోపిడీ, దారి దోపిడీ, దొంగతనం, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ మద్యం వ్యాపారం వంటి కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ దండోతియా మాట్లాడుతూ, అఖిల్కు నేర చరిత్ర ఉందని.. అతను చాలాసార్లు జైలుకెళ్లి.. బెయిల్, పెరోల్పై బయటకు వచ్చినప్పుడల్లా కొత్త నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. సుమారు ఏడాది క్రితం, అఖిల్ కత్తితో ఒక యువ జంటపై దాడి చేసి, ఆ మహిళను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. మరో కేసులో, అతను ఉజ్జయినిలో పోలీసుల వద్ద నుంచి రైఫిల్స్ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని.. జైలు శిక్ష పూర్తయ్యాక అతను ఇటీవలనే ఇండోర్కు తిరిగి వచ్చాడని తెలిపారు.ఈ ఘటనపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించిన సంగతిత తెలిసిందే. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నామని పేర్కొంది -
‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు
సతారా: మహారాష్ట్రలోని సతారాలో వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్ గాంధీ ‘బీజేపీతో సంబంధం కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी भी सभ्य समाज की अंतरात्मा को झकझोर देने वाली त्रासदी है।एक होनहार डॉक्टर बेटी, जो दूसरों का दर्द मिटाने की आकांक्षा रखती थी, भ्रष्ट सत्ता और तंत्र में बैठे अपराधियों की प्रताड़ना का शिकार…— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2025ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని రాహుల్ పేర్కొన్నారు.గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది -
ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది
ఔరంగాబాద్: భారతీయ రైల్వే మరో రైల్వే స్టేషన్ పేరును మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన మూడేళ్ల తరువాత సెంట్రల్ రైల్వే.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ‘ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్’గా మార్చింది. ఈ కొత్త స్టేషన్కు కోడ్ ‘సీపీఎస్ఎన్’ అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ కిందకు వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఇటీవల ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని నాటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరం పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్గా మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్కు నివాళిగా నగరం పేరును మార్చారు.రైల్వే అధికారులు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించి, స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్లైన్లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తిచేశారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ను 1900లో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో నిర్మించారు. ఛత్రపతి శంభాజీనగర్ పర్యాటక కేంద్రంగా పేరొందుతోంది. ఈ ప్రాంతంలోనే అజంతా గుహలు, ఎల్లోరా గుహలతో పాటు పలు చారిత్రక కట్టడాలున్నాయి.ఇది కూడా చదవండి: Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ -
గీజర్ మృత్యువాయువు
మైసూరు: వేడినీళ్ల కోసం అమర్చుకున్న గ్యాస్ గీజర్ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గీజర్ నుంచి గ్యాస్ లీకై అక్కాచెల్లెళిద్దరూ ఊపిరాడక మరణించిన దారుణ ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో జరిగింది. మృతులను పిరియాపట్టణలోని బెట్టదపుర నివాసులైన అల్తాఫ్ పాషా రెండో కుమార్తె గుల్బమ్ తాజ్ (23), నాలుగో కుమార్తె సిమ్రాన్ (21)గా గుర్తించారు. వివరాలు.. పిరియాపట్టణలోని జోనిగేరి వీధిలో అల్తాఫ్ పాషా కుటుంబం కొత్తగా బాడుగ ఇంటిలోకి చేరి ప్రార్థనలు చేసి పిండివంటలు చేసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికి.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లిద్దరూ స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో స్నానాల గదిలోని గ్యాస్ గీజర్ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ లీకైంది. కొంతసేపటికి ఊపిరాడక ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో గది తలుపులు తెరిచి చూడగా కుప్పకూలిపోయి ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల నిశ్చితార్థం కాగా అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు సంతానం ఉండగా, వారిలో ఇద్దరికి వివాహాలయ్యాయి. గుల్బమ్ తాజ్కు ఇటీవల నిశి్చతార్థమైంది. ఘటన సమయంలో కాబోయే భర్త కుటుంబం వారి ఇంటిలోనే ఉంది. ఈ ఘోరంతో కుటుంబీకులు తీవ్రంగా విలపించారు. -
Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మరోమారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు ‘మన్ కీ బాత్’ 127వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో తొలుత ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అవకాశం దొరికినవారంతా ఛత్ పండుగలో పాల్గొనాలని కోరారు. ఈ పండుగ భారతదేశంలోని ఐక్యతకు చిహ్నమన్నారు. పండుగ సమయంలో దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఛత్ ఉత్సవం సంస్కృతి, ప్రకృతి, సమాజం మధ్య ఉన్న లోతైన ఐక్యతను తెలియజేస్తుందని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేస్తుందని, ఇది భారతదేశ సామాజిక ఐక్యతకు అందమైన ఉదాహరణ అని ప్రధాని అభివర్ణించారు. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సాధించిన విజయానికి ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. భారతదేశం సాధించిన విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇదేవిధంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు.దేశ ప్రజలంతా మొక్కలు నాటాలని కోరుతూ చెట్లు, మొక్కలు ఏ ప్రదేశంలో ఉన్నా, అవి ప్రతి జీవి శ్రేయస్సుకు ఉపయోగపడతాయన్నారు. మన గ్రంథాలలో ఇదే విషయాన్ని వివరించారన్నారు. అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని ప్రముఖులలో ఒకరని మోదీ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ప్రధాని అన్నారు.అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రధాని కోరారు. బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ 2025, నవంబర్ 7న భారతదేశం ‘వందేమాతరం’ 150వ వేడుకల్లోకి అడుగుపెడుతుందని అన్నారు. ఈ పాటను రచించిన బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు.ఇది కూడా చదవండి: Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్ -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్ను నంబర్ వన్గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి.. -
అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..
ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన కుమార్ గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్మెంట్కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్మెంట్కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు -
మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి
బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb— NDTV (@ndtv) October 25, 2025 -
బ్లడ్బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
రాంచీ: జార్ఖండ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్లోని చాయ్బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.హైకోర్టు ఆగ్రహం..ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.వ్యక్తిగత కక్ష కారణమా?అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్ను వేధించిన భారత నర్సుకు జైలు -
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. -
‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్అండ్డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది. -
మత్తులో కారు నడిపి ఐదుగురిని చంపేశాడు!
ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు. న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
అలాగే ప్రమాదం జరిగి.. అనూహ్యంగా తప్పించుకుని..
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే? జార్ఖండ్లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు. ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్స్టేషన్ ఆఫీసర్–ఇన్చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు. ‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
దివంగత నర్లీకర్కు విజ్ఞాన రత్న అవార్డ్
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత పేరుప్రఖ్యాతలు పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, దివంగత జయంత్ నర్లీకర్ను కేంద్ర ప్రభుత్వం శనివారం ‘విజ్ఞానరత్న పురస్కార్’తో గౌరవించింది. అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందిన విశ్వ ఆవిర్భావ ‘బిగ్బ్యాంగ్’ సిద్ధాంతంతో విబేధించి గతంలోనే ఈయన వార్తల్లోకెక్కారు. బ్రిటిష్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ హోలేతో కలిసి ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వం అనేది మొదట్నుంచీ ఉందని అది ఎప్పటికప్పుడ కొత్త పదార్థాన్ని సృష్టించుకుంటూ విస్తరిస్తోందని నర్లీకర్ ప్రతిపాదించారు. 86 ఏళ్ల వయసులో మే 20వ తేదీన కన్నుమూయడం తెల్సిందే. సేవారంగంలో చేసిన విశేష కృషికి పద్మ అవార్డ్లు ఇచ్చినట్లే శాస్త్రసాంకేతిక రంగంలో దేశంలో అత్యున్నత అవార్డ్గా గత ఏడాది నుంచి విజ్ఞానరత్న పురస్కార్ను ప్రకటిస్తుంటడం తెల్సిందే. awards.gov.in వెబ్సైట్లో పలు అవార్డ్ల విజేత వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది మందికి ‘విజ్ఞాన్ శ్రీ’, 14 మంది విజ్ఞాన్ యువ, ఒకరికి విజ్ఞాన్ టీమ్ అవార్డ్ను కేంద్రం ప్రకటించింది. -
బాలీవుడ్ నటుడు సతీశ్ షా కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. చాలారోజులుగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ముంబై బాంద్రా ఈస్ట్లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రికి తరలించామని సతీశ్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీశ్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. సతీశ్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆయనను మూడు నెలల క్రితం మూత్ర పిండాల మారి్పడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు. ఆదివారం సతీశ్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాజోల్, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఆర్.మాధవన్ తదితరులు సతీశ్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు సతీశ్ షా 1951 జూన్ 25న జని్మంచారు. డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1978లో అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, 1979లో గామన్, 1981లో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 1983లో విడుదలైన జానే భీ దో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటారు. 1984లో ప్రసారమైన యే జో హై జిందగీలో 55 ఎపిసోడ్లలో 55 భిన్నమైన పాత్రలు పోషించారు. 2000 సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి సీరియల్ సతీశ్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచి్చపెట్టింది. ఇదే సీరియల్ 2017లో పునఃప్రసారమైంది. పలు బాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాల్లో సతీశ్ షా నటించారు. కబీ హా కబీ న, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, మై హూ నా, కల్ హో న హో, ఓం శాంతి ఓం, ఫనా, అఖేలే హమ్ అఖేలే తుమ్, హమ్ ఆప్కే హై కౌన్, ముజ్సే షాదీ కరోగీ, సాతియా, కహో నా ప్యార్ హై, జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు. -
తొలి దశలో 10–15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రి య చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తొలుత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. తొలి దశ ఎస్ఐఆర్కు సంబంధించిన షెడ్యూల్ను వచ్చే వారమే ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బ ంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు. ఎస్ఐఆర్ విధుల్లో వారు పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు. బిహార్లో ఇటీవల ఎస్ఐఆర్ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, పశి్చమ బెంగాల్లో నవంబర్ 1 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. -
చొరబాటుదారులను వెళ్లగొట్టుడే..
నలంద: బిహార్లో జంగిల్రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను బిహార్లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం బిహార్లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్రాజ్తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్రాజ్ నుంచి బిహార్కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
పాక్ గుండెల్లో ‘త్రిశూల్’
న్యూఢిల్లీ: భారత సైన్యం ‘త్రిశూల్’ విన్యాసాలకు సిద్ధమవుతోంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 10 దాకా త్రివిధ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా నిర్వహించే ఈ విన్యాసాల ద్వారా త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ ఆత్మనిర్భరతను చాటిచెప్పబోతున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇవి అతిపెద్ద సైనిక విన్యాసాలుగా రికార్డుకెక్కబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కసరత్తు అని చెప్పొచ్చు. భారత సైన్యం తలపెట్టిన ‘త్రిశూల్’ పట్ల పొరుగుదేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్(నోటీసు టు ఎయిర్మెన్) జారీ చేసింది. మధ్య, దక్షిణాది గగనతలంలోని పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. అయితే, ఇందుకు కారణాలు ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సైనిక విన్యాసాల పట్ల పాక్ బెంబేలెత్తిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. త్రిశూల్కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ క్రీక్పై వివాదం త్రిశూల్ విన్యాసాల కోసం 28,000 అడుగుల ఎత్తువరకు గగనతలాన్ని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. త్రిశూల్ కోసం ఎంచుకున్న ప్రాంతం, అందుకోసం జరుగుతున్న సన్నద్ధత ‘అసాధారణం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో జరిగే ఈ విన్యాసాల్లో సదరన్ కమాండ్ కూడా చురుగ్గా పాల్గొనబోతుందని రక్షణ శాఖ తెలియజేసింది. ఎడారి, కొండలు, అడవులు, సముద్రం.. ఇలా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో విన్యాసాలు జరగబోతున్నాయి. సర్ క్రీక్పై భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. సర్ క్రీక్లో అవాంఛనీయ చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవలే పాకిస్తాన్ను హెచ్చరించారు. చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేలి్చచెప్పారు. సర్ క్రీక్ భారత్లోని గుజరాత్, పాకిస్తాన్లోని సింధూ ప్రావిన్స్ మధ్యనున్న చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మానవ ఆవాసాలు లేవు. దీని పొడవు 96 కిలోమీటర్లు. భద్రత, సైనిక పరంగా రెండు దేశాలకు ఇది కీలకమైనది. సర్ క్రీక్లో సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. అందుకే పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిశూల్ విన్యాసాల కోసం భారత సైన్యం సర్ క్రీక్ను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్ను సృష్టిస్తుంది. ఈ అవతార్తో మనం చాట్బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
ఢిల్లీలో రేవంత్ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు. -
‘ ఏ ఒక్కరూ నా కూతుర్ని కాపాడలేకపోయారు’
సతారా: మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకున్న యువ వైద్యురాలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు ఎలా చనిపోయిందో అదే తరహాలో నిందితులిద్దరికీ శిక్ష పడాలని వేడుకుంటున్నాడు. ఈ మేరకు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్కు తన కన్నీటి వ్యథను మీడియా ద్వారా తీసుకెళ్లారు. ‘ నా కూతురు ఎలా అయితే చనిపోయిందో అదే రకంగా వారికి ఉరిశిక్ష పడేలా చేయండి సీఎం సార్, అంతకు మించి నాకు ఇక వేరే న్యాయం ఏమీ అక్కర్లేదు. ఇదే నా డిమాండ్’ అంటూ గద్దగద స్వరంతో విన్నవించాడు‘ నా కూతుర్ని కాపాడటానికి ఎవరూ రాలేదు. అన్యాయం జరుగుతుంటే, అందరూ నిలబడి చూస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఉన్నారు, కానీ ఒక్క కృష్ణుడు కూడా నా కూతురికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూతుళ్ల కోసం, కనీసం ఒక కృష్ణుడు ముందుకు వచ్చి ‘ఆమె’ గౌరవాన్ని కాపాడాలి’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, మహారాష్ట్రలో ఓ సన్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్హన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉం టున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచా రం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి.. వైద్యురాలి బలవన్మరణం -
అవినీతిలో మహారాష్ట్ర టాప్.. తర్వాత స్టేట్..?
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడయ్యాయి. టీఎంసీ డీసీ అవినీతి కేసు సంచలనం థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తరువాత స్ధానాల్లో రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్ సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.వారు పథకం ప్రకారం కాపు కాస్తారు. ఆ తరువాత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఏసీబీ అధికారులు ఎన్సీఆర్బీకి నివేదిస్తారు. రాష్ట్రాల వారీగా అవినీతి కేసుల సంఖ్యను విడివిడిగా తెలియజేస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతి, లంచం కేసులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర (Maharashtra) అగ్రస్ధానంలో ఉంది.ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్ అవినీతిలో టాప్లో ఉన్నాయి. అక్కడ ఒక్క అవినీతి కేసు లేదు!ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక (NCRB Report) వెల్లడించింది.చదవండి: ఇదేం విచిత్రం.. చెట్లకు సెల్ఫోన్లు ఎందుకు? -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ: నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానానికి పెను ప్రమాదం తప్పింది. నాగ్పూర్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్లో సౌండ్ రావడంతో గుర్తించిన పైలట్.. విమానాన్ని తిరిగి నాగ్పూర్కు మళ్లించారు. నాగ్పూర్లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.మరో వైపు, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. -
బిహార్ ఎన్నికల్లో హాట్టాపిక్!
'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' - పాపులర్ సినిమా డైలాగ్. ముందు 60 సీట్లు అన్నాడు, తర్వాత 30కి దిగాడు. చివరకు 15తోనే సరిపెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు బిహార్లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు ముకేష్ సహానీ. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు. మహాగఠ్బంధన్ (మహా కూటమి) ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం బిహార్ పాలిటిక్స్లో (Bihar Politics) హాట్టాపిక్గా మారారు. అంతగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది!ముకేష్ సహానీ గురించి తెలుసుకోవాలంటే 2020 నాటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించుకోవాలి. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మహాగఠ్బంధన్కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు. తాను అడిగిన 25 సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం దక్కకపోవడంతో బీజేపీ-జేడీయూ కూటమితో చేతులు కలిపాడు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తాను కోరుకున్న డిప్యూటీ సీఎం మాత్రం దక్కలేదు. ఆ ఎన్నికల్లో వీఐపీకి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి.ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్బీజేపీ సిఫారసు మేరకు సహానీని ఎమ్మెల్సీ చేసి పశుసంవర్ధక, మత్స్యకార మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 16 నెలలకే మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించారు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున 53 మంది అభ్యర్థులను నిలబెట్టినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. అంతకు వారం ముందే వీఐపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహానీని కాదని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా లాగేసుకున్నారు. ఇది జరిగి మూడున్నరేళ్లు అయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.15 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్సీప్రస్తుత బిహార్ ఎన్నికల విషయానికి వస్తే ముకేష్ సహానీ.. మహాగఠ్బంధన్లో భాగస్వామిగా ఉన్నారు. సీట్ల విషయంలో గట్టిగానే పట్టుబట్టారు. ముందు 60 అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత 30కి తగ్గారని ఊహగానాలు వచ్చాయి. పాతిక సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ఇస్తేనే ఉంటానని సహానీ కుండబద్దలు కొట్టారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సహానీని ఆకర్షించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. చివరకు 15 అసెంబ్లీ సీట్లు, రెండు శాసనమండలి స్థానాలతో పాటు రాజ్యసభ సీటుతో సర్దుకుపోయారు. కానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రాజీపడలేదు.బలమైన ఓటు బ్యాంకుముకేష్ సహానీ విషయంలో అధికార, విపక్ష ఆసక్తి కనబరచడానికి ప్రధాన కారణం కులం. ఉత్తర బిహార్, లోతట్టు ప్రాంతాల్లో 20 ఉపకులాలతో కూడిన బోట్మెన్- ఫిషర్మెన్ కమ్యూనిటీ 'నిషాద్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిషాద్లో మల్లా, బింద్, బెల్దార్, కేవత్ వంటి ఉప కులాలు ఉన్నాయి. ముకేష్ సహానీ మల్లా సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రస్తుతం అతడి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ప్రధాన పార్టీలు అతడికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఈ ఓటు బ్యాంక్. పట్నాకు ఉత్తరాన ఉన్న వైశాలి, ముజఫర్పూర్, దర్భంగా, మధుబని ప్రాంతాలతో పాటు సీమాంచల్ వైపు తూర్పున కూడా కీలకమైన నిషాద్ కి ఓటు బ్యాంకు ఉంది.2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీలో మహాకూటమి అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.03 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో బలమైన ఓట్లు బ్యాంకు కలిగిన ముకేష్ సహానీ తమతో పాటే ఉండాలని మహాకూటమి బలంగా కోరుకుంది. అందుకే అతడిని డిప్యూటీ సీఎం (Deputy CM) అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, తాము అధికారంలోకి మిగతా కులాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ప్రకటించడం గమనార్హం.చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!అందుకే ఒప్పుకున్నాతమకు తక్కువ సీట్లు కేటాయించినా, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో మహాకూటమిలో ఉండేందుకు ఒప్పుకున్నారని ముకేష్ సహానీ తెలిపారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ప్రకటించినప్పడే సహానీ పేరు కూడా వెల్లడించారు. సన్ ఆఫ్ మల్లాగా పాపులర్ అయిన 44 ఏళ్ల సహానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. బాలీవుడ్లో సెట్ అసిస్టెంట్గా పనిచేసిన ముకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణిస్తారోనని బిహారీలు ఎదురు చూస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. -
‘రైళ్లలో అమానవీయం’: బీహార్పై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: బీహార్లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.‘బీహార్లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు. त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
Maharashtra: ‘పలుమార్లు ఎస్ఐ అఘాయిత్యం’.. వైద్యురాలి సూసైడ్ నోట్లో ‘దారుణాలు’
ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు అధికారి సస్పెండ్బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్దేవ్రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్లైన్ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు. -
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్ట్చేశారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అసలేం జరిగింది? మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇండోర్ సిటీకి చేరుకుని అక్కడి ర్యాడిసన్ బ్లూ హోటల్లో బసచేస్తోంది. గురువారం ఉదయం అక్కడి ఖజ్రానా రోడ్లోని ఒక కెఫెకు వెళ్లేందుకు ఇద్దరు ఆ్రస్టేలియా క్రీడాకారిణులు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచి్చన అకీల్ ఖాన్ వీరిద్దరినీ తన బైక్ మీద అనుసరించాడు. తర్వాత హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఒక క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించి బైక్ మీద పారిపోయాడు. వెంటనే ఈ ఘటనను క్రీడాకారులు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డ్యానీ సిమన్స్కు ఫిర్యాదుచేశారు. ఘటన జరిగిన చోటు లైవ్ లొకేషన్ను షేర్చేశారు. ఈ ఘటనను స్థానిక సెక్యూరిటీ అధికారికి సైతం చెప్పారు. అతిథి దేవోభవ అని నినదించే భారత్లో అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం విషయం తెల్సి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ హిమీనా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఇద్దరు క్రీడాకారిణులతో స్వయంగా మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెల్సుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదుచేశారు. భారత న్యాయసంహితలోని సెక్షన్ 74(మహిళ గౌరవాన్ని భంగపరచడం), 78( వెంటబడి వేధించడం) సెక్షన్లకింద ఎంఐజీ పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సబ్–ఇన్స్పెక్టర్ నిధి రఘువంశీ కేసు దర్యాప్తు మొదలెట్టారు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడి బైక్ నంబర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ వివరాలతో నిందితుడు అకీల్ ఖాన్ను గుర్తించి అరెస్ట్చేశారు. ఖాన్కు గతంలోనూ నేరచరిత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సైతం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం పట్ల క్షమాపణలు తెలిపారు. ఇకపై క్రీడాకారులకు బయటివైపు తగు రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీసీఏ హామీ ఇచి్చంది. ఘటనను క్రికెట్ ఆ్రస్టేలియా సంఘం సైతం ధ్రువీకరించింది. ఘటనపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్వర్గీయ స్పందించారు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశ పరువు, ప్రతిష్ట, ఆతిథ్యాలకు సంబంధించిన విషయం’’అని ఆయన అన్నారు. ఘటనకు ముందు రోజు ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడటం తెల్సిందే. చదవండి: భారత బౌలర్ల విజృంభణ... ఆసీస్ ఆలౌట్.. స్కోరెంతంటే? -
ఇంటర్న్షిప్ జాతర.. లక్షమందికి సదవకాశం
న్యూఢ్లిలీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్–2026ను ప్రకటించింది. జాతీయ ఇంటర్న్షిప్ పోర్టల్ ద్వారా ఒక కోటి ఇంటర్న్షిప్లను అందించే లక్ష్యంలో భాగంగా ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రస్తుతం లక్షమందికి ఉచిత ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.ఎవరు చేరవచ్చు?ఇంజినీరింగ్తోపాటు మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్కు సిద్ధం చేస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన విభాగాలలో డిప్లొమా, యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.రూ.15వేల వరకు స్టయిఫండ్లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్షిప్లను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ–ఎథికల్ హ్యాకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్–డేవ్ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధానాలు, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవిష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. ఇంటర్న్షిప్ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్ ఇస్తాయి. ఇంటర్న్షిప్ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇస్తారు.భాగస్వామ్య సంస్థలుఈ ఇంటర్న్షిప్లను కింద పేర్కొన్న ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి.ఐబీఎంసిస్కోమైక్రోసాఫ్ట్ఇస్రోడీఆర్డీఓనాస్కామ్(NASSCOM)నీతి ఆయోగ్ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖనైపుణ్యం అందించే విభాగాలువిద్యార్థులు అత్యాధునిక డొమైన్లలో ఈ కింద పేర్కొన్న నైపుణ్యాలను పొందవచ్చుకృత్రిమ మేధస్సుసైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ఎలక్ట్రిక్ వాహనాలుస్పేస్ టెక్నాలజీక్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవ్ఆప్స్స్మార్ట్ విలేజ్ ఇన్నోవేషన్ప్రభుత్వ పాలసీ అండ్ మహిళా సాధికారతఎలా దరఖాస్తు చేయాలి?విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ ఇంటర్న్షిప్ బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్షిప్లో డిప్లొమా, యూజీ, పీజీలలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ను ఈ లింక్ ( https://internship.aicte-india.org/) ద్వారా చేసుకోవచ్చు. -
భారత్లో అలాంటి నిషేధం వద్దా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో.. యూరోపియన్ యూనియన్తో మలేషియాలోనూ బ్యాన్పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే.. భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్కు చెందిన ఓ తల్లినిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రిభద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులుసోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత్కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి. జర్మనీలో.. భారత్కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది. -
‘చావనైనా చస్తాను.. ఆర్జేడీలో చేరను’: తేజ్ ప్రతాప్
హాజీపూర్: బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్ ప్రతాప్ అన్నారు. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ల పిరికిపంద చర్య బయటపడింది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేల కాంకేర్లో మావోయిస్టులు ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను హత్యచేశారు. హతులను తిరుపతి సోధి, రవి కట్టంగా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు అక్టోబర్ 13న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత పూనెం సత్యంను దారుణంగా హత్య చేశారు. అతను ఇన్ఫార్మర్ అని వోమావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పూనెం సత్యం మృతదేహం దగ్గర మావోయిస్టులు ఒక కరపత్రాన్ని ఉంచారు.దానిలో వారు పలు ఆరోపణలు చేశారు. ఈ హత్యకు మద్దీద్ ఏరియా కమిటీ ఆఫ్ నక్సలైట్స్ బాధ్యత వహించింది. కాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో నిఘాను మరింత బలోపేతం చేస్తోంది. పోలీసు ఇన్ఫార్మర్ నెట్వర్క్ను పెంచుతోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా మావొయిస్టుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
బిగ్బాస్ ఫేమ్ దివ్యపై హిట్ అండ్ రన్ కేసు.. ఏం జరిగిందంటే?
సాక్షి, యశవంతపుర: బిగ్బాస్ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్బాస్–8 పోటీదారు దివ్య సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుంది. బైక్ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్ కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది. రూ.2 లక్షలు ఖర్చయింది ఈ క్రమంలో కిరణ్ ఏడో తేదీన కారు హిట్ అండ్ రన్పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు. Weeks after a late-night hit-and-run accident in Bengaluru, the city traffic police on Friday identified ex Bigg Boss Kannada contestant Divya Suresh as the alleged driver of the car involved in the accident that left three people injured. The accident took place near Nithya… pic.twitter.com/ucoigQ6FWn— Karnataka Portfolio (@karnatakaportf) October 24, 2025 -
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. -
సదా సన్నద్ధంగా ఉండాలి
జైసల్మేర్: ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా మనం సొంతంగానే తిప్పికొట్టగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన ప్రత్యర్థులను ఏనాడూ తక్కువ అంచనా వేయొద్దని సైన్యానికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురైనా గట్టిగా ప్రతిఘటించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. శుక్రవారం రాజస్తాన్లోని జైసల్మేర్లో సైనిక కమాండర్లతో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అలాగే భారత సైనిక దళాల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పలు సూచనలు చేశారు. నేటి ఆధునిక యుగంలో సమాచార యుద్ధరీతిపై దృష్టి పెట్టాలని చెప్పారు. అత్యాధునిక రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఇందుకోసం సైనిక దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత సైనిక శక్తికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లోనే కాకుండా.. నైతిక క్రమశిక్షణ, వ్యూహాత్మకలో ఉందని పేర్కొన్నారు. ఇది మిలటరీ ఆపరేషన్గానే కాకుండా మనదేశ ధైర్యసాహసాలకు, సంయమనానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తేలి్చచెప్పారు. సమీక్షా సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాక్ సరిహద్దులో ‘థార్ శక్తి’ విన్యాసాలు భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలా బోర్డర్ పోస్టులో భారత సైన్యం ‘థార్ శక్తి’ శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వందలాది మంది జవాన్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. డ్రోన్లు, రోబో జాగిలాలను, అత్యాధునిక ఆయుధాలను సైతం ప్రదర్శించారు. ఎడారి యుద్ధరీతిలో భారత సైన్యం ధైర్యసాహసాలు, సన్నద్ధతను రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. -
మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
కొచ్చి: 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్(వికసిత్ భారత్) కల సాకారం అవ్వాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని సెయింట్ తెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో శుక్రవారం ఆమె మాట్లాడారు. మహిళా నేతలు ముందుండి నడిపే సమాజం మరింత మానవీయంగా కాదు, సమర్థంగానూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో మహిళలకు సంబంధించిన కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయన్నారు. 2011–2014 మధ్య కాలంలో పరిశ్రమల్లో మహిళల ప్రాతినిథ్యం రెట్టింపయిందన్నారు. వివిధ సామాజిక ఆర్థిక రంగాలకు చెందిన మహిళలు నేడు దేశ పురోగతిలో భాగస్వాములుగా మారారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ముందంజలో ఉందని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో కేరళకు చెందిన అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరెనె, దాక్షాయణీ వేలాయుధన్ ఉండటం విశేషమన్నారు. వీరు సామాజిక న్యాయం, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులపై జరిగిన సంప్రదింపులు చురుగ్గా పాలుపంచుకున్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. కేరళకు చెందిన పలువురు మహిళలు వివిధ రంగాల్లో విశేష ప్రతిష్టను గడించారని అంటూ ఆమె..జస్టిస్ అన్నా చాందీ ఒక హైకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా పనిచేయగా, జస్టిస్ ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితులయ్యారన్నారు. సెయింట్ తెరిసా కాలేజీలో చదువుకున్న ఎందరో దేశ అభివృద్ధి, పురోగతిలో తమ వంతు భాగస్వాములుగా కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. నిరుపేదలకు సేవ చేస్తూ నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందిస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయమని ముర్ము తెలిపారు. సెయింట్ తెరిసా కళాశాల వంటి ఉన్నత విద్యాసంస్థల కృషితో భారత్ నాలెడ్జి సూపర్ పవర్గా మారనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉగ్ర బాధితులను, కారకులను ఒకే గాటన కట్టరాదు
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన వారిని రక్షించేందుకు ఐరాస భద్రతా మండలిలో జరిగిన ప్రయత్నాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి ఎండగట్టారు. వ్యూహం పేరుతో ఉగ్రదాడి బాధ్యులను, కారకులను ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు. ఐరాస చర్యలు ఒక్కోసారి ఏకపక్షంగా మారుతున్నాయన్నారు. స్వయం ప్రకటిత ఉగ్రవాదులను ఆంక్షల ప్రక్రియ నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తుంటే నిజాయతీకి స్థానమెక్కడున్నట్లు?అంటూ జై శంకర్ ప్రశ్నించారు. తక్షణమే తగు రీతిలో సంస్కరణలను చేపట్టకుంటే ఐరాసతో ఎలాంటి ఫలితమూ ఉండదని స్పష్టం చేశారు. ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఎలాంటి అర్ధవంతమైన సంస్కరణను చేపట్టాలన్నా సంస్కరణ ప్రక్రియతోనే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సంస్కరణలను అమలు చేయడమే ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాదంపై స్పందించే విషయంలో ఐరాస ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జై శంకర్ అన్నారు. అమానవీయమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో తీర్మానానికి సాక్షాత్తూ కౌన్సిల్ సభ్యుడే అభ్యంతరం తెలిపారంటూ పరోక్షంగా ఆయన పాక్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్). పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించుకుంది. అయితే, మండలిలో సభ్యురాలిగా కొనసాగుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వెలువరించిన తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేయడం గమనార్హం. గతంలో పలుమార్లు పాకిస్తాన్లోని ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను శాశ్వతసభ్య దేశమైన చైనా అడ్డుకుంది. అందుకే, ఉగ్రవాదులను ఆంక్షల చట్రం నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తున్నారంటూ జై శంకర్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలు కేవలం మాటలకే పరిమితమైన పక్షంలో అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతి మరింత అథోగతికి చేరుకుంటాయన్నారు. ఏదేమైనా ఈ సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, పురోగతితోపాటు శాంతి, భద్రతలకు భారత్ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐరాస 80వ అవతరణ దినోత్సవం సందర్భంగా జై శంకర్ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. -
దేశ నిర్మాణంలో యువత కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనియువతకు సాధికారిత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత విజయమే, దేశం విజయమని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన 17వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 51 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పండుగ వేళ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని తెలిపారు. ‘పండుగ ఉత్సాహం, ఉద్యోగం పొందిన విజయం.. ఈ రెండూ కలిసి 51 వేల మందికి పైగా యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ఈ కొత్త ఆరంభం సందర్భంగా వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు’అని మోదీ పేర్కొన్నారు. నాగరిక్ దేవో భవ మరవద్దు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీరు పొందినవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు, ఇవి దేశ నిర్మాణంలో చురుకుగా పాల్గొనేందుకు లభించిన అవకాశాలు. కొత్తగా నియమితులైన మీరంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తారని, భవిష్యత్ భారతం కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని అన్నారు. ‘నాగరిక్ దేవో భవ’(పౌరుడే దైవం) అనే మంత్రాన్ని ఎప్పటికీ మరవవద్దని, సేవాభావం, అంకితభావంతో పనిచేయాలని ఆయన యువ కర్మయోగులకు సూచించారు. 3.5 కోట్ల మంది లక్ష్యం ‘వికసిత భారత్ నిర్మాణం అనే సంకల్పంతో గత 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో యువతదే ప్రధాన పాత్ర’అని ప్రధాని నొక్కి చెప్పారు. యువ సాధికారతకు తమ ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో రోజ్గార్ మేళాలు శక్తివంతమైన మాధ్యమంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ మేళాల ద్వారానే 11 లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేశాం’అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ‘పీఎం వికసిత భారత్ రోజ్గార్ యోజన’ద్వారా 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికలు యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. ప్రతిభావంతుల కోసం యువత కోసం చేపట్టిన మరో కీలకమైన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని మోదీ ప్రకటించారు. ‘యూపీఎస్సీ తుది జాబితా వరకు చేరుకుని, ఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలు కల్పిస్తుంది. వారి ప్రతిభ వృథా కాదు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుంటున్నాయి. యువత ప్రతిభను ఇలా సద్వినియోగం చేయడం ద్వారా భారత యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది’అని మోదీ అన్నారు. పండుగ సీజన్కు కొత్త ఊపు జీఎస్టీ సంస్కరణలు పండుగ సీజన్కు కొత్త ఊపునిచ్చాయని ప్రధాని అన్నారు. ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్ కారణంగా నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దీంతో డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ ఉత్పత్తిని, సప్లై చెయిన్లను వేగవంతం చేసింది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి పెరిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల, జీఎస్టీ బచత్ ఉత్సవ్.. ‘ఉపాధి ఉత్సవ్’గా కూడా మారుతోంది’అని ప్రధాని విశ్లేషించారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా నమోదైన రికార్డు స్థాయి అమ్మకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. విదేశాంగ విధానం.. యువత కోసమే: ‘భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం. ఈ యువశక్తే మన గొప్ప ఆస్తి’అని మోదీ అన్నారు. విదేశాంగ విధానాన్ని కూడా భారతీయ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తున్నామన్నారు. యూకే, యూరప్, బ్రెజిల్, సింగపూర్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలతో ఏఐ, ఫిన్టెక్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు యువతకు శిక్షణ, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘కొత్తగా నియమితులైన ఈ యువ కర్మయోగులు ’వికసిత భారత్’సంకల్పాన్ని నెరవేర్చడంలో ముందుండాలి. ఇందుకోసం ‘ఐ–గాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్’ద్వారా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీ ప్రయత్నాల ద్వారానే భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. -
14న బిహార్కు అసలైన దీపావళి
సివాన్: బిహార్ ప్రజలు నవంబర్ 14వ తేదీన అసలైన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీతోపాటు మహాగఠ్ బంధన్ కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సివాన్ జిల్లాలో శుక్రవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. లాలూ ప్రసాద్ సారథ్యంలోని ఆర్జేడీ గ్యాంగ్స్టర్, రాజకీయ నేత మహ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్కు టికెట్ ఇవ్వడంపై అమిత్ షా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షహబుద్దీన్ కుమారుడిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాలూ ప్రసాద్, రబ్డీదేవిల ఇరవయ్యేళ్ల జంగిల్ రాజ్ను సివాన్ వాసులు చవిచూశారని విమర్శించారు. లాలూ మళ్లీ జంగిల్ రాజ్ తేవాలనుకుంటున్నారని ఆరోపించారు. నవంబర్ 14వ తేదీన ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ, ఆ పార్టీ మిత్రపక్షాలను అవమానకర రీతిలో ఓడించి, బిహార్ ప్రజలు అసలైన దీపావళిని జరుపుకోవడం ఖాయమని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
అప్పట్లో ఆర్జేడీతో పొత్తు తప్పే: నితీశ్
సమస్తీపూర్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో బిహార్ అభివృద్ధి చెందుతోందని జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సమస్తీపూర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 1997లో దాణా కుంభకోణంలో కేసు నమోదు కావడంతో గతంలో లాలూ సీఎం పదవి నుంచి వైదొలిగి, భార్య రబ్డీదేవికి బాధ్యతలను అప్పగించడాన్ని నితీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని లాలూ అధోగతి పాల్జేశారన్నారు. ఆయన ఇప్పటికీ మారలేదు. అప్పట్లో భార్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన లాలూ, కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టేందుకు మళ్లీ తెరపైకి వచ్చారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఆయన పా ర్టీతో స్వల్పకాలం మైత్రి సాగించా. అది తప్పని ఆ తర్వాత తెలుసుకుని, ఆ కూటమి నుంచి బయటకు వచ్చి తిరిగి బీజేపీతో మైత్రి కొనసాగించా’అంటూ నితీశ్ చెప్పుకొచ్చారు. -
హెచ్టీటీ–40 టెస్టు సక్సెస్
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్ టర్బో ట్రైనర్–40(హెచ్టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్ఏఎల్ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్టీటీ–40 అనేది బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. హెచ్టీటీ–40ని పూర్తిగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్ఏఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు. -
రికార్డులు బద్దలు కొడతాం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని బెయిల్పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్ సొంత గ్రామాన్ని సందర్శించారు. సమస్తీపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్ అంటే కర్పూరీ ఠాకూర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్ ఠాకూర్కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. సుపరిపాలనను ఆదరించాలి ‘‘2005లో బిహార్ ప్రజలు జంగిల్రాజ్కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్ సే చలేగా బిహార్, జబ్ ఫిర్ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్ కొత్త వేగంతో ముందుకెళ్తుంది) వారిలో అహంకారం తగ్గలేదు విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్బంధన్ కాదు.. మహాలాఠ్బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్రాజ్ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు. ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్రాజ్ నుంచి బిహార్కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్లు ఉన్నాయి.నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్కు దోహదపడుతోంది. బిహార్లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ. పరివార్ వల్ల సీతారాం కేసరికి అవమానాలు పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్రూమ్లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్ పండుగతోపాటు ఆదా(బచత్) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. -
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు.


