breaking news
National
-
ఉగ్రవాదులకు సిమ్ కార్డులు.. సతీష్ కోసం ఎన్ఐఏ గాలింపు చర్యలు
కోలారు: కోలారు తాలూకా భట్రహళ్లి నివాసి సతీష్ గౌడ అనే వ్యక్తి కోసం ఎన్ఐఎ అధికారులు రావడం కలకలం రేపింది. అతడు లేకపోవడంతో విచారణకు రావాలంటూ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న మొబైల్ సిమ్ కార్డును గతంలో సతీష్గౌడ యాక్టివేషన్ చేసిచ్చాడనే ఆరోపణలున్నాయి. నిందితుడు భట్రహళ్లిలోని భార్యతో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. బెంగుళూరు కోరమంగలలోని ఓ ప్రైవేటు టెలికాం కంపెనీలో పనిచేశాడు, అప్పుడు ఇతడు యాక్టివేట్ చేయించిన సిమ్ కార్డులనే ఉగ్రవాదులు ఉపయోగించారని 2023లో ఎన్ఐఎ అధికారులు గుర్తించి సతీ‹Ùగౌడకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి విచారణకు వచ్చారు. నా భర్త అమాయకుడు ఎన్ఐఎ అధికారులు వస్తున్నట్లు తెలిసి సతీష్గౌడ ఇంటి పరారైనట్లు తెలిసింది. దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీచేసిన ఎన్ఐఎ అధికారులు బెంగళూరు ఇందిరనగరలో ఉన్న ఎన్ఐఎ ఆఫీసుకు రావాలని నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సతీష్ గౌడ భార్య హేమావతి.. నా భర్త ఏ తప్పు చేయలేదు. కంపెనీ వారు రోజూ కొన్ని సిమ్లు యాక్టివేట్ చేయాలని టార్గెట్ ఇచ్చేవారు, కంపెనీ చెప్పినట్లు చేశాడు, ఆ కంపెనీలో ఉద్యోగం వదిలిన తరువాత వేరే కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడే ఏ పనీ లేకుండా ఇంట్లో ఉంటున్నారని తెలిపింది. నిరపరాధి అయిన భర్త అరెస్టు చేస్తారనే భయంతో ఫోన్ కూడా స్విఛాప్ చేసుకుని ఎక్కడికి వెళ్లారో తెలియదని విలపించింది. -
ప్రియురాలిని రూమ్లో లాక్ చేసి.. ఆపై ప్రియుడు..
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది. కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్జ్యోతి తలుక్దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారువీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. -
శశిథరూర్ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్పై.. ఆ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేరు ప్రస్తావించడకుండా సెటైర్లు వేశారు. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ప్రాజెక్ట్ సిండికేట్లో ఎంపీ శశిథరూర్ గెస్ట్కాలమ్ రాశారు. అందులో ఇందిరా గాంధీ పాలనలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్, స్లమ్ తొలగింపు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ ‘పక్షి చిలుకైందే’ అంటూ శశి థరూర్ బీజేపీ లైన్ను అనుసరిస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.When a Colleague starts repeating BJP lines word for word, you begin to wonder — is the Bird becoming a parrot? 🦜Mimicry is cute in birds, not in politics.— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 10, 2025 ‘పక్షి చిలుకైందే’ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. ఇతరుల మాటలు యథాతథంగా పలికే చిలుకలా మారింది. పక్షులు ..చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా పేర్కొన్న శశిథరూర్ నాటి దుర్భుర పరిస్థితుల్ని గెస్టు కాలంలో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించారు.పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయడం, న్యూఢిల్లీలాంటి నగరాల్లో మురికి వాడల్లో నివాసాల్ని కూల్చివేయడం, అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. ఫలితంగా వేలాది మంది నిట్ట నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025ఇలా ఇప్పుడే గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ శశిథరూర్ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవీ.. ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆకాశం ఏ ఒక్కరిది కాదని ట్వీట్ చేశారు.అందుకు మాణిక్యం ఠాకూర్ మరో ట్వీట్లో ఎగిరేందుకు అనుమతి అడగొద్దు.‘పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు.. కానీ ఈ రోజుల్లో, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగల్స్ ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు. ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు’బదులిచ్చారు. Don’t ask permission to fly. Birds don’t need clearance to rise…But in today even a free bird must watch the skies—hawks, vultures, and ‘eagles’ are always hunting.Freedom isn’t free, especially when the predators wear patriotism as feathers. 🦅🕊️ #DemocracyInDanger… pic.twitter.com/k4bNe8kwhR— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 26, 2025 -
స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్!
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి చక్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలనొప్పిగా మారిన కుటుంబ వివాదాన్ని చక్కదిద్దారు. డీఎంకే పార్టీకి ఇబ్బందికరంగా మారిన మారన్ సోదరుల ఆస్తి గొడవకు ముగింపు పలికారు. సరైన సమయంలో కల్పించుకుని అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, హిందూ దినపత్రిక మాజీ సంపాదకుడు ఎన్ రామ్ సహాయంతో మారన్ సోదరుల మధ్య సయోధ్య కుదిర్చారు. మారన్ కుటుంబంతో పాటు డీఎంకేలోనూ అలజడి రేగకుండా కాచుకున్నారు.భారీగా దయా'నిధి'ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా కోసం అన్న కళానిధి మారన్పై కోర్టుకెక్కిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్కు భారీగానే నిధి దక్కినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల నగదు.. అంతే విలువైన చెన్నైలోని ఎలైట్ బోట్ క్లబ్ ప్రాంతంలో ఎకరం భూమిని పొందారని మారన్ కుటుంబం, డీఎంకే ఉన్నత వర్గాలు వెల్లడించినట్టు 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' తెలిపింది. మొత్తానికి దయానిధి మారన్ (Dayanidhi Maran) తాను అనుకున్నది సాధించారని సన్నిహిత వర్గాలు గుసగసలాడుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల వివాద పరిష్కారానికి తనకు రూ. 1500 కోట్లు ఇవ్వాలని అంతకుముందు ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది.అసలేంటి గొడవ?తన అన్నయ్య కళానిధికి జూన్ ప్రారంభంలో దయానిధి లీగల్ నోటీసు పంపడంతో మారన్ సోదరుల వివాదం బయట ప్రపంచానికి తెలిసింది. సన్ టీవీ నెట్వర్క్ షేర్లను అక్రమంగా తన పేరు మీద బదలాయించుకున్నారని దయానిధి ఆరోపించారు. సన్ టీవీ నెట్వర్క్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు.. మోసపూరిత వాటా కేటాయింపులు, కార్పొరేట్ దుష్పరిపాలన, ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అన్నపై దావా వేశారు. అయితే దయానిధి రూ.1500 కోట్లు చెల్లించాలని కోరగా, కళానిధి రూ.500 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతోనే ఆస్తుల గొడవ రచ్చకెక్కిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, తనపై తమ్ముడు చేసిన ఆరోపణలను కళానిధి కొట్టిపారేశారు. జూన్ 20న స్టాక్ ఎక్స్ఛేంజ్కు అధికారికంగా వివరణ ఇచ్చారు. పబ్లిక్ లిస్టింగ్కు ముందు సన్ నెట్వర్క్ కంపెనీకి చెందిన లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగతంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.స్టాలిన్ చొరవ.. సమసిన గొడవమారన్ సోదరుల మధ్య ఆస్తుల వివాదం ముదిరి పాకాన పడక ముందే పరిష్కరించాలని భావించిన సీఎం స్టాలిన్.. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆయన రూటు మార్చారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వీరమణి, ఎన్. రామ్లతో మంత్రాంగం నడిపించారు. ఇందులో భాగంగా మూడు దఫాల చర్చలు జరిగాయని.. వాటిలో రెండు వ్యక్తిగతంగా, ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. అయితే అన్నదమ్ముల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మొదట మారన్ కుటుంబానికి వీరమణి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. వివాదం గురించి ఇరు వర్గాలు మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగాలని మధ్యవర్తులు సూచించార'ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం కారణంగా డీఎంకే, మారన్ కుటుంబానికి ప్రతిష్టకు కలిగే భంగం.. ఎక్కువ కాలం వ్యాజ్యం కొనసాగడం వల్ల కలిగే నష్టం, కోర్టు ఖర్చుల గురించి కూడా చర్చల్లో పెద్దలు ప్రస్తావించినట్టు సమాచారం.వారిద్దరే ఎందుకు?మారన్ సోదరుల ఆస్తుల గొడవ పరిష్కారానికి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యూహాత్మకంగా రాజకీయ కురువ`ద్ధుడైన వీరమణి, ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎన్. రామ్లను ఎంచుకున్నారు. ఈ డిసెంబర్లో 93వ ఏట అడుగుపెట్టనున్న వీరమణి తమిళ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. అంతేకాదు ద్రవిడ ఉద్యమంలో గౌరవనీయమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది. ఇంకో కీలక అంశం ఏమిటంటే సన్ నెట్వర్క్తో ఆయన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. స్టాలిన్ కుటుంబానికి మాత్రం ఇందులో 20 శాతం వాటా ఉంది. మారన్ కుటుంబానికి బంధువైన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ (N Ram) సైద్ధాంతికంగా డీఎంకేకు దగ్గరగా ఉన్నారు. మీడియాలో విశ్వసనీయత ఆధారంగా మధ్యవర్తిత్వానికి ఆయనను స్టాలిన్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న భావనతో పరిస్థితిని చక్కదిద్దడానికి స్టాలిన్ జోక్యం చేసుకున్నారని డీఎంకే నేత ఒకరు వెల్లడించారు.వేర్వేరు రంగాల్లో..కళానిధి, దయానిధి తండ్రి దివంగత మురసోలి మారన్ (Murasoli Maran) కరుణానిధి మేనల్లుడు. డీఎంకే పార్టీ అండతో ఆయన పలు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన బతికున్నంత కాలం మారన్ కుటుంబంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. ఇద్దరు కుమారులు వేర్వేరు రంగాల్లోకి ప్రవేశించి ముందుకెళ్లారు. కళానిధి 1993లో సన్ టీవీని ప్రారంభించి ప్రాంతీయ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దయానిధి మారన్ తండ్రి వారసత్వాన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి ప్రవేశించి 2000లో కేంద్ర టెలికాం మంత్రి అయ్యారు.అక్కడి నుంచే మొదలు..మారన్ కుటుంబ వార్తాపత్రిక దినకరన్ కార్యాలయంపై 2007లో డీఎంకేలోని ఎంకే అళగిరి (MK Alagiri) మద్దతుదారులు దాడికి పాల్పడడం అప్పట్లో సంచలనంగా మారింది. స్టాలిన్ను కరుణానిధి రాజకీయ వారసుడిగా పేర్కొంటూ దినకరన్ పేపర్లో రావడంతో కోపోద్రిక్తులైన అళగిరి మద్దతుదారులు హింసాత్మకంగా స్పందించారు. పెద్ద కొడుకునైన తనను కాదని స్టాలిన్ను రాజకీయ వారసుడిగా వర్ణించడంతో అళగిరి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం కొనసాగుతోంది. తాజాగా మారన్ సోదరులు ఆస్తుల కోసం కోర్టుకెక్కడం తమిళ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. చదవండి: ఇందిరా గాంధీపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు -
గుండెపోటు భయాలు.. ఆ ఒక్క ఆస్పత్రికే వేలమంది క్యూ!
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV— News Karnataka (@Newskarnataka) July 8, 2025VIDEO Credits: News Karnatakaఅయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. -
మీకు తక్కువ ధరకే బంగారం కావాలా?
దొడ్డబళ్లాపురం: మాజీ ఎంపీ డీకే సురేశ్, తదితర ప్రముఖ రాజకీయ నాయకులు బాగా తెలుసని చెబుతూ ఐశ్వర్యగౌడ అనే కిలాడీ కోట్లాది రూపాయల బంగారం, నగదు వసూలు చేయడం తెలిసిందే. ఆ కేసుల్లో ఆమె అరెస్టయి ఈడీ విచారణను ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటిదే మరొకటి బయటపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాగా తెలుసని చెప్పుకొని రూ.30 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన కేడీ లేడీని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్టు చేశారు.బాగా డబ్బు కలిగిన మహిళలను కిట్టీ పార్టీ పేరుతో ఇంటికి పిలిచి విందు వినోదాలు నిర్వహించేది. వారు పూర్తిగా నమ్మారని తెలిశాక అదను చూసుకుని ఏదో కారణం చెప్పి లేదా తక్కువ ధరకు బంగారం ఇస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేది. తనకు సీఎం, డీసీఎం, స్పీకర్ ఇంకా చాలామంది రాజకీయ నాయకులు తెలుసని చెప్పుకునేది.స్పీకర్ ఖాదర్తో సహా పలువురు వీఐపీలతో తీసుకున్న ఫోటోలు చూపించేది. ఇలా 20 మంది నుండి రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది. చాలా రోజుల తరువాత మోసపోయామని తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవితను అరెస్టు చేశారు. గోవిందరాజనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కూడా ఈమెపై కేసు నమోదైంది. -
14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం ..
కొన్ని అరుదైన ఘటనలు కోటిలో ఇద్దరో ఒక్కరో తల్లిదండ్రులుకే అలాంటి అదృష్టం దక్కుతుంది. మనం పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన పిల్లల చేత అందరూ గౌరవమన్ననలను అదుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ అనుకోకుండా పిల్లల ఉద్యోగ బాధ్యతల నడుమే మన తల్లిదండ్రులనే కలిసి అవకాశం లభిస్తే..ఆ ఆనందమే వేరు. పైగా సగర్వంగా వాళ్ల గురించి మనం చెబుతుంటే ఆ మాటలు వింటున్నా..లేదా ఆ అత్యున్న హోదాలో మనల్ని చూసినా..మన తల్లిందండ్రుల కళ్లల్లో ఉప్పొంగే ఆ ఆనంద క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేం. అలాంటి ఆనంద క్షణాలే ఓ మాజీ మంత్రికి దక్కాయి. నెట్టింట ఆ విషయం తెగ వైరల్ అవ్వడమే గాక కొందరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం అని అంతా కొనియాడుతున్నారు ఆ తండ్రి కూతుళ్లను. అసలేం జరిగిందంటే..చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్కు అరుదైన స్వాగతం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్గా ఉన్నారు. అది తెలుసుకున్న కూతురు గౌరీ ధవళికర్ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ..వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా చెబుతుంది. "ఈ రోజు నేనే నా తండ్రితో కలిసి ఈ విమానంల ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రే ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు." పైలట్ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణకులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు. ఎవరీ దీపక్ ధవళికర్..గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మార్కైమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. View this post on Instagram A post shared by Prudent Media Official (@prudentmediagoa) (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
‘మేం వాళ్లలా కాదు’: గుజరాతీయుల బాషా మర్యాద
న్యూఢిల్లీ: దేశంలో బాషా వివాదాలు నడుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో అవి తారాస్థాయికి చేరాయి. రాజకీయాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ బాషాభిమానం పొంగిపొర్లుతున్న వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడిన గుజరాతీయులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గుజరాత్కు సంబంధించిన ఈ వీడియోలో గుజరాతీ బాష తెలియని వ్యక్తితో స్థానికులు హృదయపూర్వకంగా హిందీలో మాట్లాడటం కనిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ జై పంజాబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అతను గుజరాత్కు చెందిన పలువురిని ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఇంటర్వ్యూ ప్రారంభంలో, తాను గుజరాత్లో నివసిస్తున్నప్పటికీ, తనకు గుజరాతీ బాష మాట్లాడటం రాదని, అర్థం చేసుకోలేనని అతను స్పష్టంగా చెబుతాడు.ఈ సమయంలో అతను ఇంటర్వ్యూ చేసిన ప్రతీ ఒక్కరూ హిందీలో మాట్లాడేందుకు అంగీకరించారు. వారు హిందీలో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి వచ్చే అతిథులకు గుజరాతీ రాకపోయినా, వారిని స్వాగతించడం గుజరాతీయుల విధి అని అన్నారు. మీకు గుజరాతీ తెలియదు కనుకనే తాము హిందీలో మాట్లాడుతున్నామని, లేనిపక్షంలో గుజరాతీలో మాట్లాడేవారిమని తెలిపారు. ఇతరులతో హిందీలో మాట్లాడేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గుజరాతీయులు స్పష్టం చేశారు. View this post on Instagram A post shared by Jai Punjabi (@jaipunjabii) -
ఎన్నికల ముందే ‘సవరణ’ ఎందుకు?
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను యథాతథంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. బిహార్లో 60 శాతం ఓటర్ల తనిఖీ పూర్తయ్యిందని చెప్పారు. ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఉద్దేశం, నిజాయతీని తాము శంకించడం లేదని, ప్రత్యేక సవరణ చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోవాలని భావించడం లేదని తెలిపింది. ప్రత్యేక సవరణతో సమస్య లేదని, చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరం ఏమిటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని.. కానీ, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారో చెప్పాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా చేపట్టలేమా? ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన విషయమని చెప్పడంలో సందేహం లేదని, ఇది ప్రజాస్వామ్య మూలాలు, ఓటుకు ఉన్న శక్తికి సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సూచించింది. ‘‘నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బిహార్లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ప్రారంభించడం వెనుక ఔచిత్యం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. ప్రత్యేక సవరణపై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. పౌరసత్వం నిర్ధారణ మీ పనికాదు ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 326 ప్రకారం ప్రతి ఓటర్ తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని రాజేశ్ ద్వివేది బదులిచ్చారు. ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదని, అది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టంచేసింది. నిజంగా పౌరసత్వాన్ని తేల్చాలని అనుకుంటే ఆ ప్రక్రియను గతంలోనే ప్రారంభిస్తే బాగుండేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంది. అందుకే అర్హులైన ఓటర్లను నిర్ధారించడానికి ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. -
విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: అవకాశం వచ్చినప్పుడల్లా తన సొంత పార్టీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. 1975లో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో క్రమశిక్షణ, శాంతి పేరుతో ఎన్నో దారుణాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మలయాళ పత్రిక ‘దీపిక’లో రాసిన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీపై శశి థరూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారితీశాయని, అవి క్షమించరాని తప్పులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని తేల్చిచెప్పారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన దారుణాలకు పెద్ద ఉదాహరణగా నిలిచిందని స్పష్టంచేశారు. గ్రామాల్లో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడం కోసం హింస, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ఢిల్లీ వంటి నగరాల్లో పేదల గుడిసెలను నేలమట్టం చేసి వేలాది మంది ప్రజలను నిరాశ్రయులుగా మార్చారని ఆక్షేపించారు. ఇళ్లు కోల్పోయిన పేదల పునరావాసం, సంక్షేమం గురించి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపలేదని వెల్లడించారు. అప్పటి దురాగతాలకు ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు పలికారని ఆరోపించారు. ప్రత్యర్థులను జైల్లో పెట్టడం, ప్రజల ప్రాథమిక హక్కులను హరించడం, పత్రికలపై ఆంక్షలు విధించడం, చట్టాలను ఉల్లంఘించడం వంటివి మన రాజకీయాల్లో ఒక మచ్చగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSyn https://t.co/QZBBidl0Zt— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 2025ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడరాదని, ఇది మనకు దక్కిన విలువైన సంపద అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనదేశం 1975లోని భారత్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని... మనం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, మరింత అభివృద్ధి సాధించామని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నామని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థే మన బలమని ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయని వివరించారు. అధికారాన్ని ఒకచోటే కేంద్రీకరించడం, విరుద్ధ స్వరాలను అణచివేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం వంటి దుష్పరిణామాలు మళ్లీ వేరే రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రయోజనాలు, సుస్థిరత అనే సాకులతో అలాంటి వాటిని సమర్థించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితి మనకు ఎప్పటికీ ఒక పెద్ద హెచ్చరిక అని శశి థరూర్ తేల్చిచెప్పారు. మరోవైపు ఎమర్జెన్సీ పట్ల శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.డి.సతీశన్, కె.మురళీధరన్ స్పందించారు. ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శశి థరూర్ వ్యవహార శైలిపై తమ పార్టీ నాయకత్వం తగిన సమయంలో స్పందిస్తుందని పేర్కొన్నారు. -
అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో పోకిరి హల్చల్.. తర్వాత ఏమైందంటే?
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.దీంతో, గురుప్రీత్ సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
ఐఏఎస్ కల చెదిరింది
కర్ణాటక: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ ఆప్తులు కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 24 గంటల్లో పలు జిల్లాలలో 7 మంది వరకూ హఠాన్మరణం పాలయ్యారు. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా చందనకేరాలో మెహసిన్ ఒశా పటేల్ (22) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలాడు. ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఇతనికి గత నెల 15న పెళ్లయింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు విలపించారు. కాగా, కలబురగి జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల నుంచి గుండెసమస్యలతో 40 మంది వరకు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 15 మంది 45 ఏళ్ల లోపువారు. సివిల్స్ కలలు భగ్నంహుబ్లీ: సివిల్స్ పరీక్షల్లో పాస్ కావాలి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్సీ అగ్రిక ల్చర్ చదువుతున్న జీవిత యూపీఎస్ఈ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. పారిశ్రామికవేత్త కొడుకు.. దావణగెరె నగరంలోని జయనగరలో పారిశ్రామికవేత్త రేఖా ముర్గేశ్ కొడుకు అక్షయ్ (22) ఇంటిలో గుండెపోటుతో కిందపడి మరణించాడు. ఇతడు కాలేజీలో చదివేవాడు. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిసింది. బెళగావిలో రైతు.. బెళగావి జిల్లా సవదత్తి పట్టణంలోని ఎపిఎంసీలో వాహన డ్రైవర్ అశోక్ జీరిగవాడ (40) కుప్పకూలి మృతి చెందారు. రైతు అయిన అశోక్ తన పొలంలో పెసర్లను అమ్మడానికి వచ్చి ప్రాణాలు విడిచాడు. కనకపురలో అటవీ ఉద్యోగి కనకపుర తాలూకా కోగ్గె దొడ్డి గ్రామానికి చెందిన మాదేశ్ నాయక్ (30) ఫారెస్ట్ గార్డ్గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎద నొప్పి వచ్చి కింద పడి మృతి చెందారు. తరగతిలో బాలుడు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబగెరి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న మనోజ్కుమార్ (9) అనే బాలుడు తరగతిలోనే కన్నుమూశాడు. పాఠం వింటూ కుప్పకూలాడు. మనోజ్ ఇప్పటికే గుండెలో రంధ్రం పడి చికిత్స పొందుతున్నాడు. అవుల కాపరి.. బెంగళూరు దక్షిణ జిల్లా గోల్లరదొడ్డికి చెందిన పశువుల కాపరి గిరీశ్ (25) గుండెపోటుకు బలయ్యాడు. గత మూడు రోజుల నుంచి గిరీశ్ ఎద నొప్పి అని కుటుంబీకులకు చెప్పేవాడు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. -
ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు
న్యూఢిల్లీ: దేశారాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని క్షణాలపాటు బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రత నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్లో భూకంప తీవ్రత కనిపించింది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపాన్ని గుర్తించినంతనే జనం భయాందోళనలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే జనం రోజువారీ కార్యకలాపాల్లో మునిగివున్న సమమంలో ఈ భూకంపం సంభవించింది.యూపీలోని ఘజియాబాద్కు చెందిన ఒక వ్యక్తి భూకంపం సమయంలో తన అనుభవాన్ని వివరిస్తూ, అప్పుడే తాను నిద్రలేచానని, భూ ప్రకంపనలు చూసి భయపడ్డానని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇలానే భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. #WATCH | An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9.04 am IST. Strong tremors felt in Delhi-NCR. A man in Ghaziabad, UP says, "...I had woken up just at the time when there was a jolt. I was scared. There was another earthquake… pic.twitter.com/YHDyGq7Oaa— ANI (@ANI) July 10, 2025ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోనూ బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. జనం భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది.జజ్జర్లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్)తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం జజ్జర్కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. #earthquakeOnly elvish Bhai can save Delhi ncr from Earth quake ☠️❤️🔥😭👀 pic.twitter.com/TQTqSqtAbI— Yash Pratap (@yash_pst) July 10, 2025 -
ఎమ్మెల్యే ‘పాచిపోయిన పప్పు’ వివాదం.. క్యాంటీన్ లైసెన్స్ సస్పెండ్
ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్డీఏ చర్యలు చేపట్టింది.ఎఫ్డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ ఉల్లంఘించించింది. హాస్టల్లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది. #WATCH | Mumbai: Food and Drug Administration (FDA) officials took food samples from the Akashvani MLA canteen. Shiv Sena MLA Sanjay Gaikwad thrashed a canteen employee here yesterday, alleging poor quality of food"Samples of paneer, Schezwan chutney, oil and toor dal have been… pic.twitter.com/SZw4hhBRuS— ANI (@ANI) July 9, 2025శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్లో ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. హోటల్పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్కు నోబెల్ ఇవ్వాల్సిందే.. ఏ కేటగిరి అంటే.. బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో వీకే సక్సెనా తరచూ తమ పరిపాలనకు అడ్డు తగులుతున్నాసరే విజయవంతంగా ప్రభుత్వపాలన కొనసాగించినందుకుగాను తాను కూడా నోబెల్ బహుమతికి అర్హుడినేనని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అసమర్థత కేటగిరిలో నోబెల్ ఉంటే కేజ్రీవాల్కు అవార్డు వచ్చేందని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు.ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. అసమర్థత, అరాచకం, అవినీతికి సంబంధించిన కేటగిరిలో నోబెల్ ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా ఒక అవార్డు లభించేది అని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో ఆప్ పాలనలో జరిగిన అక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సులలో పానిక్ బటన్లు, తరగతి గది నిర్మాణం, మహిళలకు పెన్షన్ పథకాలు, మద్యం లైసెన్సింగ్, షీష్ మహల్ గురించి వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆప్ నేతలు తిరిగి కౌంటరిచ్చారు. సచ్దేవా వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ..‘వీరేంద్ర సచ్దేవా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కేవలం మాట్లాడటం కాదు. పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాల రోజులు ముగిశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఆప్ హయాంలో పాఠశాలలు నిర్మించాం. ఆసుపత్రుల్లో వసతులను మెరుచుపరిచాం. ఉచిత విద్యుత్ ఇచ్చాం. అవినీతిని అరికట్టాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులే దోచుకుంటున్నారు’ అని ఆరోపించారు.కేజ్రీవాల్ వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. అంతకుముందు పంజాబ్లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్ కేజ్రీవాల్ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్లను ఆప్ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్లను కూల్చివేశారు. వారికి ఏం లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్లను కూల్చివేసింది’ అని అన్నారు.మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మొహల్లా క్లినిక్లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు. -
నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?
సనా: అరబ్ దేశం యెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సుకు ఎందుకు ఉరిశిక్ష? కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్ ఏర్పాటు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్ రాజధాని సనా సిటీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సైతం 2023 నవంబర్లో ట్రయల్ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. శిక్ష తప్పే మార్గం ఉందా? బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. బిహార్లో అలా జరగనివ్వం
పట్నా: 2024లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలో బిహార్లో జరిగే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈసీ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర పన్నిందన్నారు. పట్నాలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఇండియా కూటమి పార్టీలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ మహారాష్ట్రలో బోగస్ ఓట్లను భారీగా చేర్పించడం ద్వారా ఫలితాలను అనుకూలంగా మార్చుకుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ప్రజల ఓట్లు, ముఖ్యంగా యువత నుంచి ఓటు హక్కును దొంగిలించేందుకు ఈసీ చేసే ప్రయత్నాలను తాము కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ ప్రసంగించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు చేపట్టిన జాతీయ స్థాయి నిరసనల్లో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ మాదిరిగా తయారైందని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితా నుంచి ఇప్పుడు పేర్లు తీసేస్తున్నారు..ఆ తర్వాత రేషన్, పింఛను కూడా రాకుండా చేస్తారంటూ నితీశ్ సర్కార్పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్కార్కు ఘోర పరాజయం తప్పదన్నారు. అనంతరం సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య కూడా మాట్లాడారు. -
‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలు అందించేందుకుగాను సంస్థకు కీలక అనుమతులు వచ్చాయి. భారత్లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టేందుకు అవసరమైన అనుమతులను భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ‘ఇండియన నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ మంజూరు చేసింది. 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్లింక్ అనుమతులు పొందిన విషయం తెల్సిందే. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్ లింక్కు మార్గం సుగమమైంది. -
గుజరాత్లో ఘోరం
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది.బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదనబ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు. నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీదుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు. 1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
యూఎస్లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.ప్రాసెసింగ్కు సమయం.. విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.మనవాళ్లే ఎక్కువ.. వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. తనిఖీలు కఠినం ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు. విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది. -
కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు
విండోహెక్: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు. ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు. సంబంధాలు బలోపేతం చేసుకుందాం ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్హౌస్లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.నాలుగు ఒప్పందాలపై సంతకాలు నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్షిప్ డెవలప్మెంట్ సెంటర్, సీడీఆర్ఐ ఫ్రేమ్వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెలి్వవిషియా మిరాబిలిస్’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు. -
నమ్మించి మోసం..!
సాక్షి, స్పెషల్ డెస్క్: నమ్మితేనే కదా మోసం చేయగలిగేది.. అని సినిమా డైలాగ్. ఇది అక్షరాలా నిజ మని మరోసారి రుజువైంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో! ఆడిటింగ్, ట్యాక్స్, అడ్వైజరీ సేవల్లో ఉన్న ప్రముఖ కంపెనీ కేపీఎంజీ నివేదిక ‘గ్లోబల్ ప్రొఫైల్స్ ఆఫ్ ద ఫ్రాడ్స్టర్’ ఇదే చెబుతోంది. బయటి వ్యక్తులు కాదు.. సంస్థలో సుదీర్ఘకాలంగా, నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులే మోసాలకు తెగబడుతున్నారట.మరీ ముఖ్యంగా ఈ మోసాల్లో మగాళ్లదే అందెవేసిన చేయి. కంపెనీలూ, ఆఫీసుల్లో ఇలా మోసం చేయడంలో మాత్రం అతివలు మగాళ్లతో పోలిస్తే చాలా వెనకబడ్డారనే చెప్పాలి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో జరి గిన మోసాలకు సంబంధించిన 669 వాస్తవ కేసుల ఆధారంగా కేపీఎంజీ రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. -
కమిషనర్ రాకపోతే.. డీజీపీని రప్పిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విచారణకు పోలీసు కమిషనర్ కదా హాజరు కావాల్సింది? ఏసీపీ గారూ మీరెందుకు వచ్చారు? అధికారులకు ఈమాత్రం తెలియదా?’అని సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. 15 రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే తదుపరి విచారణ తేదీకి రాష్ట్ర డీజీపీని రప్పిస్తామని హెచ్చరించింది. సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విచారణ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఈ హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 26న రెట్రో సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య సమస్యను ప్రస్తావించే క్రమంలో గిరిజనులను కించపర్చే అర్థం వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గిరిజన సంఘం నాయకుడు అశోక్కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ కుమార్ రాథోడ్ జాతీయ ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయటంతో కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ బుధవారం విచారణ చేపట్టారు. విచారణకు పోలీస్ కమిషనర్ కాకుండా మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ హాజరు కావటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షల మందిని ప్రభావితం చేసే ఒక నటుడు ఒక వర్గాన్ని కించపర్చేలా ఎలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలపై మీరు కేసు నమోదు చేశారు బాగానే ఉంది. ఈ రోజు (బుధవారం) విచారణకు పోలీసు కమిషనర్ హాజరు కావాలని మేం నోటీసులు ఇచ్చాం కదా? ఆయన కదా హాజరు కావాల్సింది? మీరెందుకు వచ్చారు?’అని నిలదీశారు. మరో 15 రోజుల్లో విచారణకు కమిషనర్ హాజరై హీరో విజయ్ దేవరకొండపై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. ఆ రోజు కమిషనర్ రాకపోతే డీజీపీని రప్పిస్తామని హెచ్చరించారు. -
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు. సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది. అమిత్ షా రాజకీయ ప్రస్థానం.. 1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా యూటర్న్!
సాక్షి,ఢిల్లీ: రాజకీయ దుమారం రేపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (rekha gupta) అధికారిక నివాసం రెన్నోవేషన్ (Home Renovation) కాంట్రాక్ట్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ఢిల్లీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. పునరుద్దరణ పనులను సైతం నిలిపివేసింది. ఇంటి రెన్నోవేషన్ కోసం టెండర్లకు ఆహ్వానించిన మూడు రోజుల తర్వాత పీడబ్ల్యూడీ విభాగం తాజా నిర్ణయం తీసుకుంది.సీఎంగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సివిల్ లైన్స్లోని రాజ్ నివాస్ మార్గంలో రెండు బంగ్లాను కేటాయించింది. వాటిల్లో బంగ్లా వన్లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. బంగ్లా 2లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా ఉండనున్న ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు కానుంది.అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన ఓటీజీ (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్, రూ.91 వేల విలువైన ఆరు గీజర్లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేసే పనుల్ని కాంట్రాక్ట్ ఇచ్చేందుకు పీడబ్ల్యూడీ విభాగం టెండర్లకు ఆహ్వానించింది.అయితే, రేఖా గుప్తా నివాసం రెన్నోవేషన్పై రాజకీయ దుమారం చెలరేగింది. శిష్ మహల్ (Sheesh Mahal) అంటూ కేజ్రీవాల్ నివాసంపై విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే రీతిలో ఖర్చు చేస్తుందా?’అంటూ ఆమ్ ఆద్మీ విమర్శలు గుప్పించింది. ప్రజలు నీటి కొరత, ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఏసీలు,టీవీలు కొనుగోలు చేయడంలో మునిగిపోయిందని కాంగ్రెస్ ద్వజమెత్తింది. ఈ క్రమంలో రేఖా గుప్తా ఇంటి రెన్నోవేషన్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పీడబ్ల్యూడీ విభాగం ప్రభుత్వానికి సమాచారం అందించడం కొసమెరుపు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుంది. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు .ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు. -
ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. #WATCH | Heavy rain lashes parts of Delhi. Visuals from the GRG Road, which is waterlogged. pic.twitter.com/EOVN69XZRQ— ANI (@ANI) July 9, 2025నగర వ్యాప్తంగా పలు అండర్పాస్లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals near Kartavya Path. pic.twitter.com/vPgcg2iuiU— ANI (@ANI) July 9, 2025VIDEO | Delhi: Heavy rain lashes parts of the national capital, bringing relief from heat. Visuals from Constitution Club. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#Delhi pic.twitter.com/vsrcgn1i7Q— Press Trust of India (@PTI_News) July 9, 2025 -
అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025 -
అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!
గుజరాత్లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్ స్పాట్గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా. -
కరెక్ట్ కాదు.. గైక్వాడ్ వీడియోపై ఫడ్నవిస్ స్పందన
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ ఆపరేటర్ను గైక్వాడ్ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్ స్పందించారు. ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్ మీడియాతో అన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ— YourDailyNews (@yourdailynews9) July 9, 2025మరోవైపు సంజయ్ గైక్వాడ్ దాడి వీడియోపై ఉద్దశ్ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్ గైక్వాడ్కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్ గెలుపొందారు.2024 సెప్టెంబర్లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.2024 ఏప్రిల్లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్నాథ్ షిండేకు ఫోన్ చేశారు. ఆపైన గైక్వాడ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్ గైక్వాడ్ మీద కేసు నమోదైంది.తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది. -
నితీష్ కుమార్ సంచలన ప్రకటన
పట్నా: బిహార్లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. మహిళా సాధికారతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. బిహార్లో శాశ్వత నివాసితులు అయిన మహిళలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ‘‘అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాల్లో బిహార్కు చెందిన మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 35% రిజర్వేషన్ అందిస్తాం’’ అని నితీష్ కుమార్ అన్నారు.అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ సేవల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించి పరిపాలనలో కీలక పాత్ర పోషించేలా చూడటం ఈ నిర్ణయం లక్ష్యమని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. పట్నాలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా యువజన కమిషన్అంతేకాదు.. రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వ సహకారాన్ని మరింత పెంచుతూ కొత్తగా బిహార్ యువజన కమిషన్ (Bihar Youth Commission) ఏర్పాటు చేయనున్నట్లు నితీష్ ప్రకటించారు. 'బిహార్ యువతకు శిక్షణ ఇచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించి.. సమర్థులుగా మార్చడానికి మా ప్రభుత్వం బిహార్ యువజన కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింద'ని నితీశ్ తెలిపారు.యువత అభ్యున్నతికి తోడ్పాటు..బిహార్ యువజన కమిషన్లో ఒక చైర్పర్సన్, ఇద్దరు వైస్-చైర్పర్సన్లు, ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా 45 ఏళ్లలోపు వారే ఉంటారు. రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న బిహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు పాటు పడుతుంది. రాష్ట్రంలోని యువత సాధికారత, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.చదవండి: ఎన్నికల వేళ.. బిహార్కు కనీవినీ ఎరుగని వరాలు -
నేను చాలా సెల్ఫిష్.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా
సామాన్యులకు సేవ చేయడం కోసం రంగుల ప్రపంచాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు ఎంతోమంది. అందులో సక్సెస్ అయినవారు కొందరైతే విఫలమైన వారు మరికొందరు! కానీ, బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ప్రజల కోసం పనిచేస్తానంటూ బింకాలు పలికారు. కానీ, ఏడాది తిరిగేసరికి రాజకీయ జీవితమే విసుగొచ్చిందంటున్నారు.ఈ పంచాయితీ ఏంది?కంగనా రనౌత్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను, కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు. కొందరు నాలా ధ్వంసమైందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. పంచాయతీ స్థాయిలోని సమస్యలను నా ముందు ఏకరువు పెడతారు. PM పదవి కోసం పోటీ?నేను ఎంపీనన్న విషయమే లెక్క చేయరు. రోడ్లు బాలేకపోయినా నాకే చెప్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నా సరే.. నీ దగ్గర డబ్బులున్నాయిగా.. వాటితో బాగు చేయించమని డిమాండ్ చేస్తారు. రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్లాలనైతే నేను అనుకోవడం లేదు. ప్రధానమంత్రి పదవికి పోటీపడేంత సమర్థురాలిని కాను. ఆ పోస్ట్ కోసం పోటీపడేంత అర్హత లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. నేను సెల్ఫిష్సామాజిక సేవ అనేది నా లైఫ్లో లేదు. నేను చాలా సెల్ఫిష్ జీవితాన్ని గడిపాను. పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు ఉండాలనుకున్నాను. అందంగా కనిపించాలనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లే బతికాను. కానీ, దేవుడు నన్ను ఇటువైపు ఎందుకు నడిపించాడో తెలియడం లేదు. నా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేను. పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం నాకిష్టం లేదు. అలా జరగాలని కూడా నేను కోరుకోను అని కంగనా చెప్పుకొచ్చారు.సినిమాకంగనా.. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్.. మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్గా నటించారు. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఆమె చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో కంగనా నటించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోంది.చదవండి: అమెరికాలో ప్రియుడితో సమంత చెట్టాపట్టాల్?! -
రాజస్థాన్లో కూలిపోయిన ఎయిర్ఫోర్స్ విమానం
జైపూర్: రాజస్థాన్లో ఎయిర్ఫోర్స్కు ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. ఛుర్ జిల్లా రతన్ఘర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, ఆర్మీ అధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక, ప్రమాద స్థలంలో ఎయిర్ఫోర్స్ జెట్కు సంబంధించిన శకలాలు పడిపోయి ఉన్నాయి. ఈ వీడియో బయటకు వచ్చింది. BREAKING: Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh; rescue team on the spot pic.twitter.com/071ADfWGH5— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2025Rajasthan: INDIAN Fighter jet crashes in Ratangarh, Churu. pic.twitter.com/LEEJ3KmrXd— THE UNKNOWN MAN (@Theunk13) July 9, 2025 -
శ్మశానంలో చంపి.. నదిలో శవాన్ని పారేసి..
రాయచూరు రూరల్(కర్ణాటక): నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో రేణుక స్వామి హత్య కేసు మాదిరిగా రాష్ట్రంలో అలాంటిదే మరో హత్య కలబుర్గిలో జరిగింది. రేణుక స్వామి హత్య షెడ్డులో జరగగా, ఈ కేసులో రాఘవేంద్ర నాయక్ను గురురాజ్, అశ్విని, లక్ష్మీకాంత రావులు కలిసి శ్మశానంలో చంపి రాయచూరు సమీపంలోని కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలబుర్గిలో మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. అశ్విని, రాఘవేంద్ర నాయక్ మొదటి నుంచి స్నేహితులు. అశ్విని మరొకరితో స్నేహం చేయడంతో రాఘవేంద్ర నాయక్ కస్సుబుస్సుమనేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవ పడ్డారు. ఆమెను వదిలి పెట్టని రాఘవేంద్ర నాయక్ మొబైల్లో అశ్వినికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడం చేశాడు. దీనిని సహించలేక గురురాజ్ అనే మిత్రుడికి ఆమె విషయం తెలిపింది. రాఘవేంద్ర నాయక్ను తుదముట్టడించడానికి ప్రణాళిక రచించారు. అతనిని కారులో కిడ్నాప్ చేసి కలబుర్గి కృష్ణానగర్ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లారు. మర్మాంగాన్ని కోసి హత్య అతడిపై మారణాయుధాలతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. సాక్ష్యం లభించరాదని భావించి రాయచూరు తాలూకా శక్తినగర సమీపంలో కృష్ణా నది వంతెన పైనుంచి నదిలోకి పారేసి చేతులు దులుపుకున్నారు. రాఘవేంద్ర నాయక్ కారవార నుంచి వచ్చి కలబుర్గిలో సురేఖను పెళ్లి చేసుకొని అక్కడే గణేష్ నగర్లో నివాసం ఉన్నారు. సూపర్ మార్కెట్ వద్ద హోటల్లో పని చేస్తున్న రాఘవేంద్ర నాయక్ను మార్చి 12న కిడ్నాప్ చేసి హత్య చేశారు. 14వ తేదీన మృతదేహం లభించింది. ఈ విషయంలో భర్త రెండు నెలలు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె మే 25న స్టేషన్ బజార్ పోలీçస్ స్టేషన్లో తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాఘవేంద్ర నాయక్ తనకు భార్య ఉన్నా మరొకరితో అనైతిక సంబంధం పెట్టుకోవడంతో అది వికటించగా, అశి్వనికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడంతో తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
Bharat Bandh Updates: ఢిల్లీ నుండి కేరళ వరకు..
న్యూఢిల్లీ: నేడు(బుధవారం) కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రం కేరళ వరకు పలు ట్రేడ్ యూనియన్లతో సంబంధం కలిగిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చిన తమ నిరసన తెలియజేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు ట్రేడ్ యూనియన్ల నేతలు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేరళ, తమిళనాడులలో కూడా ట్రేడ్ యూనియన్ కార్మికులు నిరసనల్లో పాల్గొన్నారు. దేశంలోని 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఈ బంద్లో మొత్తం 25 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని వివిధ యూనియన్లు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు.. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తూ, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. #WATCH | Kozhikode, Kerala | Effects of 'Bharat Bandh' called by a joint forum of 10 central trade unions, alleging the central govt of pushing "pro-corporate" policies. pic.twitter.com/AesjtEoO9O— ANI (@ANI) July 9, 2025కేరళలోని కోజికోడ్లో భారత్ బంద్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. యూపీలోని సాహిబాబాద్, ఘజియాబాద్లోని లింక్ రోడ్లో కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలోని జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రేడ్ యూనియన్లు బంద్ చేపట్టాయి. కోల్కతాలో వామపక్ష పార్టీల యూనియన్ భారత్ బంద్లో భాగంగా పాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను బలహీనపరిచే ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాలు యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా, పదవీ విరమణ చేసిన వారిని తిరిగి నియమించుకుంటున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో కార్మిక సంఘం ప్రతినిధి సఖాయం మాట్లాడుతూ, తూత్తుకుడి కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఒక రోజు సమ్మె చేశారని అన్నారు. అయినా దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కాగా భారత్ బంద్లో భాగంగా కోల్కతాలోని జాదవ్పూర్ రైల్వే స్టేషన్లో వామపక్ష సంఘం రైల్వే ట్రాక్ను దిగ్బంధించింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతున్నదని తెలిపింది. బీహార్లో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక నిరసనలకు పిలుపునిచ్చింది. -
దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు. -
‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. అదే ‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’. రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన అనంతరం వారు అల్లోపతి మందులను సూచించేందుకు అనుమతినిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది.ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రోగుల భద్రత, వైద్య ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో హోమియోపతి ప్రాక్టీషనర్లు కొన్ని షరతులతో ఆధునిక మందులను సూచించడానికి అనుమతించేలా చట్టంలో పలు సవరణలు చేసింది.దీని ప్రకారం, ఫార్మకాలజీలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులు, అల్లోపతి మందులను సూచించడానికి అర్హులు అవుతారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ)ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎంఏ ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హోమియోపతి వైద్యులకు అల్లోపతి మందులను సూచించే అధికారం ఇవ్వడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఐఎంఏ పేర్కొంది.ఆరు నెలల కోర్సుతో హోమియో వైద్యులు ఆధునిక వైద్యం నేర్చుకోవడం సాధ్యం కాదని, వైద్య ప్రమాణాలు దిగజారే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకమైన క్రాస్ ప్రాక్టీస్ అని, ఫలితంగా వైద్య రంగంలో గందరగోళం ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆధునిక ఫార్మకాలజీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులకు మాత్రమే అల్లోపతి మందులను సూచించే అధికారం ఉంటుందని ఎఫ్డీఏ పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. -
ప్రకాశ్రాజ్.. ఆంధ్ర రైతుల సంగతి చూడు
కర్ణాటక: ప్రముఖ నటుడు, సామాజిక అంశాలపై గళమెత్తే ప్రకాశ్రాజ్, కాంగ్రెస్ సర్కారు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లిలో పరిశ్రమలకు భూములు సేకరించడాన్ని ఖండిస్తూ రైతుల ధర్నాలో ఆయన పాల్గొనడాన్ని ఓ మంత్రి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు ఇస్తున్నారని, భూ స్వాదీనం తప్పనిసరి అని పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్.. ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో భూముల స్వాధీనం జరుగుతోందని, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.ప్రకాశ్రాజ్ కర్ణాటకలో కంటే ఆంధ్ర, తమిళనాడులో బాగా ఫేమస్ అన్నారు. రాష్ట్రంలో హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ కోసం 1200 ఎకరాల భూమి మాత్రమే స్వాదీనం చేసుకుంటుంటే, ఇదే అవసరానికి ఆంధ్రప్రదేశ్లో మడకశిర నుంచి పెనుకొండ వరకూ 10 వేల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ అవసరాల పేరుతో అన్నదాతల నుంచి 45 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని, విశాఖ పట్నంలో 95 పైసలకు ఒక ఎకరాను కట్టబెడుతున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రకాశ్ రాజ్ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి సవాల్కు ప్రకాశ్రాజ్ ఏమని స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది. -
పప్పు చెడిపోయిందని క్యాంటిన్ కాంట్రాక్టర్పై దాడి
ముంబై: పాడైపోయిన భోజనం పెట్టారన్న కారణంతో క్యాంటిన్ కాంట్రాక్టర్పై అధికార కూటమి ఎమ్మెల్యే దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ముంబైలోని ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటిన్లో రాత్రి భోజనం కోసం వచ్చారు. ఆయనకు వడ్డించిన పప్పు చెడిపోయినట్లు గుర్తించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్యాంటిన్ కాంట్రాక్టర్ను పిలిపించారు. పప్పు వాసన చూడాలంటూ కాంట్రాక్టర్ను ఒత్తిడి చేశారు. ఇది ఎలా తినాలంటూ మండిపడ్డారు. సహనం కోల్పోయి కాంట్రాక్టర్ చెంప చెల్లుమనిపించారు. ముఖంపై గట్టిగా కొట్టారు. దెబ్బల తీవ్రతకు కాంట్రాక్టర్ ఒక్కసారిగా కింద పడిపోయారు. పైకి లేచేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Meet Shah Sena’s MLA Sanjay Gaikwad. Last year he had threatened&announced 11 lakh rupees to anyone who cuts off Sh. Rahul Gandhi’s tongue. Now the man is seen beating up a poor helpless canteen worker. But wait no news TV outrage here since its a BJP ally pic.twitter.com/XVwnEzJFSU— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 9, 2025శివసేన స్టైల్ ఇదే ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనుచిత ప్రవర్తన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. ఇలాంటి ఘటనలు ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఫడ్నవీస్ అన్నారు. హింసను తాను సమర్థించబోనని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇతరులను అకారణంగా కొట్టడం సరైంది కాదన్నారు. మరోవైపు తన వ్యవహార శైలిని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సమర్థించుకున్నారు. శివసేన స్టైల్ ఇదేనని తేల్చిచెప్పారు. క్యాంటిన్లో ఆహారం నాణ్యంగా లేదని చాలాసార్లు ఫిర్యాదు చేశానని, ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. తన ఫిర్యాదును లెక్కచేయనప్పుడు ఇంకేం చేయాలి? చచ్చిపోవాలా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ను కొట్టడం పట్ల తానేమీ విచారించడం లేదన్నారు. సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగాంచారు. -
నల్ల చట్టాలను విరమించుకోవాలి!
139 సంవత్సరాల క్రితం కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు సాకారం అయ్యాయి. ఆ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలూ నేటి పాలకుల నల్ల చట్టాల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర పాలకులు తీసుకువచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు ఆ యా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఏపీలో పనిదినాన్ని 9–10 గంటలుగా నిర్ణయించారు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవ రణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైమ్ కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రిపూట పని చేయడా నికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలనీ... కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్ళను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్లు ఇస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలి గిస్తూ ఆ యా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆ యా రాష్ట్రాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలూ, కార్మిక ఉద్యోగ సంఘాలూ జూలై 9న (నేడు) దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి!కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి.-జూలకంటి రంగారెడ్డిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ -
ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి..
గాంధీనగర్: గుజరాత్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కొందరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. గుజరాత్లోని ఆనంద్ పట్టణం, వడోదరలను కలుపుతూ మహిసాగర్ నదిపై పద్రా వద్ద గంభీర వంతెన ఉంది. బుధవారం ఉదయం గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే.. సహాయక బృందాలు అక్కడి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. Gujarat’s Gambhira Bridge Collapse Kills Nine, Severs Key Vadodara–Anand Routehttps://t.co/aYn6KEELhi— DeepNewz (@deepnewzcom) July 9, 2025 #WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk— ANI (@ANI) July 9, 2025అయితే, వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025#BREAKING 2 people dead in Gujatat bridge collapse A portion of the decades-old Gambhira bridge, connecting Vadodara & Anand near Padra has collapsed over the Mahisagar river The 45yr old structure gave way while vehicles were passing over it, plunging at least four into… pic.twitter.com/VwVJXxym8p— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025 -
పుల్వామా దాడికి ‘ఈ-కామర్స్’ సాయం.. సంచలన వివరాలు వెల్లడి
న్యూఢిల్లీ: పుల్వామా దాడి(2019)కి పాల్పడిన ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్ఫారం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించడం, తరలించడం చేశారని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) తెలిపింది. ఉగ్రవాద సంస్థలు ఇటీవలి కాలంలో డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలను విరివిగా వినియోగిస్తున్నాయని, నిధులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం మొదలైనవాటికి ఈ-కామర్స్ ప్లాట్ఫారంలను ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది.2019 నాటి పుల్వామా దాడి, 2022 నాటి గోరఖ్ నాథ్ ఆలయ సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ సాయంతో పేలుడు పదార్థాలను సేకరించారని, 2022లో గోరఖ్నాథ్ ఆలయంపై జరిగిన దాడి ఘటనలో ఐఎస్ఎస్ నిధులు సమకూర్చడానికి ‘పేపాల్’, వీపీఎన్లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఫుల్వామా ఉగ్రదాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)ల పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన పదార్థాలను ఉగ్రవాద సంస్థలు ఈ కామర్స్ ప్లాట్ఫారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయని తేలింది.పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడింది.ఈ దాడిలో లాజిస్టిక్స్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ప్రత్యేక పాత్ర పోషించాయని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో గోరఖ్ నాథ్ ఆలయంపై ఐఎస్ఎస్ ప్రేరేపిత వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితుడు ‘పే పాల్’ సాయంతో రూ. 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అలాగే నిందితుడు తాను రహస్యంగా ఉండేందుకు వీపీఎన్ సేవలను వినియోగించుకున్నాడని పేర్కొంది. -
భగ్గుమన్న బీహార్.. ఒకవైపు బంద్.. మరోవైపు ‘ఇండియా’ నిరసనలు
పట్నా: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో బీహార్ భగ్గుమంటోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పాటు నూతన కార్మిక నియమావళికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్లో యాక్టివ్గా పాల్గొంటున్నాయి. భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) రూపొందించిన ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా పట్నాలో నిరసనలు మొదలయ్యాయి. VIDEO | Bihar Bandh: Congress workers stage protest on railway tracks at Sachiwalay Halt in Patna.RJD, Congress, and other Mahagathbandhan opposition parties have called for a bandh in protest against the special intensive revision of electoral rolls in the state.(Full video… pic.twitter.com/s2Klx5nyvt— Press Trust of India (@PTI_News) July 9, 2025ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. లంబార్లోని ఆదాయపు పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు జరిగే నిరసన ప్రదర్శనల్లో రాహుల్ పాల్గొననున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. రాష్ట్రంలోని హాజీపూర్, సోన్పూర్లలో పోలీసుల సమక్షంలో నిరసనలు జరిగాయి. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా ఆర్జేడీ, ఇతర మహాఘటబంధన్ మిత్రపక్షాలు బీహార్లోని రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాలుస్తూ, రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. జెహానాబాద్లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే పట్టాలపై నిరసనలకు దిగింది.VIDEO | Bihar Bandh: Barricades installed and security heightened at the Election Commission Office in Patna in view of a protest by the opposition parties against the special intensive revision of electoral rolls in the state. RJD leader Tejashwi Yadav and Congress MP Rahul… pic.twitter.com/l24KTT9PtO— Press Trust of India (@PTI_News) July 9, 2025లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లు సంయుక్తంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ఈ ఇరువురు నేతలు నూతన కార్మిక నియమావళిని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వికాస్షీల్ ఇన్సాన్ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీహార్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
Bharat Bandh: సమ్మెకు దిగిన 25 కోట్ల కార్మికులు.. ప్రజాసేవలకు విఘాతం
న్యూఢిల్లీ: ఈరోజు(బుధవారం) దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనులు, ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది.కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు దేశవ్యాప్త భారీ సమ్మెకు సిద్ధమయ్యారు. రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతుతో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక భారత్ బంద్కు పిలుపునిచ్చింది.ఈ రంగాల్లో తీవ్ర ప్రభావంబ్యాంకింగ్,బీమా సేవలుపోస్టల్ కార్యకలాపాలుబొగ్గు గనులు, పారిశ్రామిక ఉత్పత్తిప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణాప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ యూనిట్లుగ్రామీణ ప్రాంతాల్లో రైతుల నిరసనలుస్వల్ప ప్రభావంపాఠశాలలు, కళాశాలలుప్రైవేట్ కార్యాలయాలురైలు సేవల్లో స్వల్ప ఆటకందేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారని ఏఐటీయూసీ నేత అమర్జీత్ కౌర్ తెలిపారు. ప్రభుత్వం తమ 17 అంశాల డిమాండ్ జాబితాను విస్మరించిందని, గత పదేళ్లలో ఒక్క వార్షిక కార్మిక సమావేశాన్ని కూడా నిర్వహించలేదని కౌర్ పేర్కొన్నారు. భారత్ బంద్ దేశవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం కలిగిస్తుందని, ముఖ్యంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ మీడియాకు తెలిపారు.సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లుఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ (CITU)హింద్ మజ్దూర్ సభ (HMS)స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)మద్దతు పలుకుతున్న సంఘాలుసంయుక్త కిసాన్ మోర్చా తదితర రైతు సంఘాలుగ్రామీణ కార్మిక సంఘాలురైల్వేలు, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఉక్కు పరిశ్రమల ప్రభుత్వ రంగ సిబ్బందిపార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కోడ్ల కారణంగా కార్మికుల హక్కులు దెబ్బతింటాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ మొదలైన విధానాలను కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి. 2020, 2022, 2024లలో జరిగిన ఈ తరహా దేశవ్యాప్త సమ్మెలలో లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. -
‘మీడియాను టచ్ చేయొద్దు’: రాజ్థాక్రే కీలక ఆదేశాలు
ముంబై: మహారాష్ట్రలోని థానేలో మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) దాడి చేసిన దరిమిలా రాష్ర్టంలో బాషా వివాదం మరింతగా ముదిరింది. ఈ నేపధ్యంలో పార్టీ చీఫ్ రాజ్థాక్రే.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీచేశారు. తన అనుమతి లేకుండా పార్టీలోని ఎవరూ కూడా మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయవద్దని కోరారు.మీడియాతో మాట్లాడే బాధ్యత కలిగిన పార్టీ నేతలు, సభ్యులు ఏదైనా కమ్యూనికేట్ చేసేముందు తన అనుమతి తీసుకోవాలని రాజ్థాక్రే సూచించారు. అయితే వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలియజేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేష్మా తపసే బాషా వివాదంపై వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. రాజ్థాక్రే ఈ విధమైన ఆదేశాలు జారీచేశారు. మరాఠీని గౌరవించని ఎవరిపైన అయినా పార్టీ దేశద్రోహం కేసులు నమోదు చేస్తుందని రేష్మా తపసే పేర్కొన్నారు. "Do Not Talk To Media": Raj Thackeray's Message To MNS Leaders https://t.co/dU1pAWiIkb pic.twitter.com/xEgDwN0e4e— NDTV (@ndtv) July 8, 2025భాష పేరుతో పోరాటం చేస్తున్న తమ నేతలు, కార్యకర్తలు పలు కేసులు ఎదుర్కొంటున్నారని తపసే పేర్కొన్నారు. తనపై కూడా ఇటువంటి కేసులు ఉన్నాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఇక్కడికి వచ్చి, స్థిపడిపడివారు మరాఠీలో మాట్లాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలన్నారు. కాగా విలేకరి ఆమెను మీరు కర్నాటక వెళితే కన్నడ మాట్లాడుతారా? అని అడగగా, ఆమె తనకు కన్నడ బాష రాదని, కర్నాటకకు ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. -
నేడో, రేపో రోడ్డు ప్రారంభం.. ఇలా కొట్టుకుపోవడంతో..
జైపూర్: రాజస్థాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మించిన కాంట్రాక్టర్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో కొత్తగా నిర్మించిన రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయపూర్వతిలోని బఘులి అనే ప్రాంతం గుండా వెళ్ళే కట్లి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ ప్రాంతంలో 86 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో, వరద ప్రవాహం ధాటికి రోడ్డు కొట్టుకుపోయింది. రహదారిని గండిపడిపోయింది.కట్లి నది.. సికార్ ఝుంఝును, చురు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ నదిలో ఆక్రమణలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి రహదారులు కోతకు గురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🔴 Rajasthan Shocker | Heavy rains wash away newly built road in Jhunjhunu just days after completion.Locals outraged, question quality of construction and demand accountability from officials.pic.twitter.com/xafp8RHgIA— The News Drill (@thenewsdrill) July 8, 2025 -
ఆరో తరగతిలోనూ ఎక్కాలు రావు!
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా ఉందో కేంద్ర విద్యాశాఖ సర్వేలో తేటతెల్లమయ్యింది. మూడో తరగతి చదువుకున్న విద్యార్థుల్లో 55 శాతం మంది మాత్రమే ఒకటి నుంచి 99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చగలరు. ఆరో తరగతి చదువుతున్న వారిలో కేవలం 53 శాతం మందికే ఒకటి నుంచి పది దాకా ఎక్కాలు వచ్చు. గత ఏడాది డిసెంబర్ 4న ఈ సర్వే నిర్వహించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 781 జిల్లాల్లో 74,229 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.15 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించారు.వీరిలో మూడు, ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో 58 శాతం మంది కూడికలు, తీసివేతలు చేయగలరని తేలింది. మూడో తరగతి, ఆరో తరగతిలో గణితం సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడయ్యింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.అలాగే అన్ని తరగతుల విద్యార్థులు లాంగ్వేజ్(భాష)లో ఎక్కువ, గణితంలో అతి తక్కువ మార్కులు సాధిస్తున్నారు. విద్యార్జన విషయంలో రూరల్–అర్బన్ అనే వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. గ్రామాల్లోని మూడో తరగతి విద్యార్థులు మ్యాథ్స్, లాంగ్వేజ్లో పట్టణాల్లోని విద్యార్థుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారు. పట్టణాల్లోని ఆరు, తొమ్మిది తరగతి విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పల్లెల్లోని విద్యార్థుల కంటే మిన్నగా చదువుతున్నారు. -
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. శతాబ్దాలుగా వినియోగం గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.గంజిలో ఉండే ఐనోసైటోల్ అనే కార్బోహైడ్రేడ్ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్న్, మిథియోనైన్లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్ మాస్్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే. గంజిని ఎలా వాడాలి? రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్ చేయండి.దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం పరంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్, పింఛన్ పెంపు వంటి పథకాలతో ప్రజల మనసుల్లో వైఎస్సార్ శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. ‘రాహుల్ గాం«దీని దేశ ప్రధాని చేయాలని వైఎస్సార్ కలలు కన్నారు.ఆయన ఆశయ సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అలాగే, మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్ రెడ్డి, పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్రెడ్డి పాల్గొన్నారు. -
పోషకాహార లోపాన్ని.. ఏఐ పట్టేస్తుంది
దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 50 శాతంపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి ఆరు వారాలు కీలక సమయం. చాలా మంది శిశువులకు ఈ సమయంలో ఆరోగ్య సంబంధ తనిఖీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేదలుండే ప్రాంతాలలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఎదుగుతున్న తీరు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నదీ లేనిదీ సరైన సమయంలో గుర్తించి సమస్యను పరిష్కరించలేకపోవడంతో శిశువులు పోషకాహార లోపం బారిన పడుతున్నారు. దీనికి విరుగుడుగా పలు సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాలతో రంగంలోకి దిగాయి. వీటిలో ఐఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతమై, పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి వస్తే ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు పడినట్టే.శిశువులు పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం.. బాల్యంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శిశువులు ఎదుగుదల నిలిచిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో కేలరీల లోపం వల్ల సన్నబడడం; ప్రొటీన్ లోపం వల్ల కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఈ సమస్యలను గుర్తించడం ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం. శిశువు పుట్టిన మొదటి ఆరు వారాలలో తరచూ పర్యవేక్షణ చేపట్టడం వల్ల సమస్య ఏదైనా ఉంటే.. ఆలస్యం కాకముందే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు ఏఐ తన వంతు సాయం చేస్తోంది.ఐఐఐటీ హైదరాబాద్ సైతం..నవజాత శిశువులు మొదలుకుని అయిదేళ్లలోపు పిల్లల వరకు ఏఐ సాంకేతిక సాయంతో బరువు, పొడవు, ఎత్తు.. అలాగే తల, ఛాతీ కొలతల ఆధారంగా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి.. వారిని ఆరోగ్యవంతంగా ఎదిగేలా చేయాలన్నది ఈ ప్రాజెక్టుల లక్ష్యం. పిల్లల ఎత్తు, బరువు కొలిచేందుకు సంప్రదాయ సాధనాల అవసరం లేకుండా తక్కువ సమయంలో, కచ్చిత సమాచారాన్ని అందించడంలో ఈ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్లకు పని భారం సైతం తగ్గుతుండడం కలిసి వచ్చే అంశం. వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ, రెవల్యూషనైజ్, వెల్ట్ హంగర్ లైఫ్ / మైక్రోసాఫ్ట్తోపాటు ఐఐఐటీ హైదరాబాద్ సైతం ఈ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థల జాబితాలో ఉంది.శిశు మాపన్ : వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ శాస్త్రవేత్తలు ఈ యాప్ను రూపొందించారు. 42 రోజుల లోపు వయసున్న నవజాత శిశువుల బరువు, పొడవు, తల, ఛాతీ చుట్టుకొలతను ఈ యాప్ ద్వారా తెలుసుకుంటారు. ఈ యాప్ను ఇంటర్నెట్ లేకపోయినా వాడొచ్చు. శిశువును ఓ వస్త్రంపై పడుకోబెట్టి, పక్కన స్కేల్ ఉంచి షార్ట్ వీడియో తీస్తే చాలు.. వివరాలు యాప్లో ప్రత్యక్షం అయిపోతాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ , తక్కువ వెలుతురులోనూ ఇది పనిచేస్తుంది. డామన్ –డయ్యూలో 2024 నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇప్పటికే 30,000 పైచిలుకు పిల్లల కొలతలను తీసుకున్నారు. గృహ – ఆధారిత నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆశ కార్యకర్తలు ఇంటికే వచ్చి పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. పోషకాహార లోపం గుర్తిస్తే ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాలతో తల్లులను అనుసంధానిస్తారు.ఎంఏఏపీ: పోషకాహార లోపం అంచనా, కార్యాచరణ ప్రణాళిక పేరుతో రెవల్యూషనైజ్ అనే కంపెనీ రాజస్తాన్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల నుంచి అయిదేళ్ల వయసున్న పిల్లల ఎత్తును అంచనా వేయడానికి, పోషకాహారలోప ప్రమాదాలను గుర్తించడానికి స్మార్ట్ఫోన్ తో తీసిన ఫొటోలను ఉపయోగిస్తారు. ఎత్తు, పోషకాహార స్థాయికి తగ్గట్టుగా ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. దీనికి కూడా ఇంటర్నెట్ అవసరం లేదు. ఆరోగ్య కార్యకర్తలు మారుమూల పల్లెల్లో కూడా వెళ్లి పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను గుర్తించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. ప్రభుత్వ వైద్య శాఖలకు ఈ యాప్ను ఉచితంగా అందజేస్తామని కంపెనీ చెబుతోంది.ఐఐఐటీ–హైదరాబాద్: నవజాత శిశువులతోపాటు అయిదేళ్లలోపు పిల్లలు.. వెయింగ్ మెషీన్, హైట్ చార్టుల వద్ద ఉన్నప్పుడు ఫొటోలు తీస్తారు. వాటిని యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఎత్తు, బరువులు ఆరోగ్యకరమైనవి ఉన్నాయా లేదా అని విశ్లేషిస్తారు. ఈ యాప్ను ఐ–సాక్షమ్ సహకారంతో తెలంగాణలో పరీక్షిస్తోంది. ప్రొటోటైప్ ప్రస్తుతం పైలట్ దశలో ఉంది.వెల్ట్ హంగర్ లైఫ్ /మైక్రోసాఫ్ట్: ఈ సంస్థలు అభివృద్ధి చేసిన చైల్డ్ గ్రోత్ మానిటర్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల ఎత్తు, బరువు, శరీర కొలతల కోసం 3డీ ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 10,000కు పైచిలుకు స్కాన్ ్స పూర్తి చేశారు. గ్రోత్ మానిటర్ ఫలితాల్లో కచ్చితత్వం ఉంది. హార్డ్వేర్ ఖరీదు కావడం, సెన్సార్లపై ఆధారపడి పని చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో వినియోగాన్ని పరిమితం చేస్తోంది. -
స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు
కడలూర్: పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి, వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కడలూరు–అలప్పక్కం రైలు మార్గంలో 170వ నంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులున్న ఆ వ్యాను పల్టీలు కొట్టింది. అనంతరం విల్లుపురం–మైలాదుతురై ప్యాసింజర్ రైలును డ్రైవర్ నిలిపివేశారు. నుజ్జునుజ్జయిన వ్యానులోంచి స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు.ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. వ్యాను డ్రైవర్, 12వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూలుకు ఆలస్యమవుతుందని, గేట్ తెరిచే ఉంచాలని వ్యాన్ డ్రైవర్ ఒత్తిడి చేయడం వల్లే గేటును తెరిచి ఉంచానని గేట్ కీపర్ అంటుండగా, తాము వచ్చేసరికే గేటు ఓపెన్ చేసి ఉందని వ్యాన్ డ్రైవర్, క్షతగాత్రుడైన విద్యార్థి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ గేట్ కీపర్పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. కాగా, స్కూలు విద్యార్థులను బయటకు తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెగిన విద్యుత్ తీగను తాకి షాక్కు గురయ్యారు.అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రజలను క్షమాపణ కోరింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. -
67 మంది ప్రాణాలు కాపాడిన శునకం
మండి: విపత్తులు జంతువులకు ముందే తెలుస్తాయంటారు. అది నిజమని మరోసారి నిరూపించిందో శునకం. హిమాచల్లో వరదలను ముందుగా హెచ్చరించి 67 మంది ప్రాణాలను కాపాడింది. హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నది తెలిసిందే. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కనీసం 78 మంది మరణించారు. 50 మంది కొండచరియలు విరిగిపడటంతో మృత్యువాత పడగా.. 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.అయితే.. మండిలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో 67 మంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సియాతి నివాసి నరేంద్ర ఇంట్లో ఓ శునకం ఉంది. ప్రమాదం సంభవించిన జూన్ 30న అది ఇంట్లోని రెండో అంతస్తులో పడుకుంది. బయట బోరున వర్షం. ఉన్నట్టుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది విని.. నరేంద్ర నిద్ర నుంచి లేచాడు. రెండో అంతస్తుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయి. నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి అందరినీ నిద్రలేపాడు. ఇళ్లనుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోవాలని అందరినీ కోరాడు.వాళ్లు అలా వెళ్లిన కొద్దిసేపటికే, గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పదికి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పుడు నాలుగైదు ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి కొండచరియల శిథిలాల కింద ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. శునకం అప్రమత్తం చేయకుండా ఉంటే.. అంతమంది ప్రాణాలు నిద్రలోనే పోయేవని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఉగ్రవాదంపై ఒక్కటే మాట
బ్రసీలియా: ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేశాయి. ‘‘ఉగ్రవాదాన్ని సహించబోం. ఆ భూతంపై పోరులో మాది ఒకే బాట, ఒకే మాట. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాల మాటే లేదు. ఒకే విధానంతో ముందుకెళ్తాం’’ అని బ్రిక్స్ వేదికగా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ ఆలోచనాధోరణి ఒకేలా ఉందంటూ వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉదంతం తర్వాత భారత్కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్కు, డసిల్వాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.విస్తృతాంశాలపై చర్చలువాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా వసతులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలకాంశాలపై మోదీ, డసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన, నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లు అంశాల్లోనూ సహకారం పెంపొందించుకోవడంపై చర్చించారు. 12 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ రూపాంతరీకరణ, ఉగ్రవాదంపైపోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.కార్నివాల్.. ఫుట్బాల్.. సాంబా‘‘భారత్, బ్రెజిల్ సంబంధాలు కార్నివాల్లాగా వర్ణరంజితంగా ఉండాలి. ఫుట్బాల్ క్రీడలాగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సాంబా నృత్యంలాగా ఇరుదేశాల ప్రజల హృదయాలను రంజింపజేయాలి. ఇరుదేశాల వీసా కేంద్రాల వద్ద పొడవాటి క్యూ వరసలు మాయమయ్యేలా వీసాప్రాసెసింగ్ వేగంగా జరగాలి. అన్నింటా అదే స్ఫూర్తి కనపడాలి’’ అని మోదీ అన్నారు. పశ్చిమాసియా ఎక్కడైనా సరే, వివాదాలకు చర్చలు, సంప్రదింపులతో పరిష్కారాలు కనుగొనాలన్నారు. ‘‘బ్రెజిల్తో రక్షణ రంగ ఒప్పందం అనేది ఇరుదేశాల మధ్య లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతీక.రక్షణరంగ పరిశ్రమల మధ్య మరింత అనుసంధానం కోసం కృషిచేస్తాం. వ్యవసాయం, పశుసంవర్ధనలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సహకారం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగ పరిశోధన, ఆహార శుద్ధి రంగాలకూ దీనిని విస్తరిస్తాం. ఆరోగ్యరంగంలోనూ పరస్పర సహకారం అందించుకుంటాం. పర్యావరణం, శుద్ధ ఇంధనం అనేవి రెండు దేశాలకూ కీలకమే. నేటి ఒప్పందాలు మా హరిత లక్ష్యాలను నెరవేరుస్తాయి. యూపీఐ చెల్లింపు వ్యవస్థను బ్రెజిల్లోనూ అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తాం. ఆయుర్వేదం, భారత సంప్రదాయ వైద్యం సైతం బ్రెజిల్కు చేరువచేస్తాం’’ అని మోదీ అన్నారు.మోదీకి అత్యున్నత పౌర పురస్కారంమోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అధ్యక్షుడు స్వయంగా మోదీ మెడలో వేశారు. ఈ సందర్భంగా డసల్వా, మోదీ కరచాలనం, తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘ నాకీ అవార్డ్ దక్కడం ఎంతో గర్వంగా, ఉద్వేగంగా ఉంది. ఇది నాకు మాత్రమేకాదు 140 కోట్ల భారతీయులకు దక్కిన పురస్కారం’’ అని మోదీ సంయుక్త ప్రకటన వేళ వ్యాఖ్యానించారు. 2014 మేలో ప్రధాని అయ్యాక మోదీకి ఇలా విదేశాల్లో మొత్తంగా 26 అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి. -
ధ్వంసం చేస్తూ.. దిశ మార్చుకుంటూ
అహ్మద్నగర్: వేగంగా దూసుకెళ్తూ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ గురిచూసి లక్ష్యాలను ఛేదించే అధునాతన శతఘ్ని విభాగంలో భారత్ మరో ఘనత సాధించింది. తొలిసారిగా గరిష్టస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశవాళీ శతఘ్ని (మౌంటెడ్ గన్ సిస్టమ్–ఎంజీఎస్)ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రకటించింది.తద్వారా శతఘ్నుల్ని వేగంగా మోహరించే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆరి్టలరీ గన్ సిస్టమ్(ఏటీఏజీఎస్)లో భారత్ మరో ముందడుగువేసింది. త్వరలో ఈ ఎంజీఎస్ను పూర్తిస్థాయి పరీక్షల కోసం భారత సై న్యానికి అప్పగించనున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ పరీక్షల్లో ఎంజీఎస్ తన సత్తాను చాటితే ఆ తర్వాత దీనిని సైన్యంలో విలీనం చేస్తారు. బాలాసోర్, పోఖ్రాన్లో దీనిని విజయవంతంగా పరీక్షించి చూశా మని వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (వీఆర్డీఈ) చీఫ్ జి.రామమోహనరావు చెప్పారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు⇒ 155ఎంఎం/52 కాలిబర్ మందుగుండును పేల్చే సామర్థ్యంతో ఈ అధునాతన శతఘ్నిని రూపొందించారు. డీఆర్డీవోకు చెందిన అహ్మద్నగర్లోని వీఆర్డీ దీనిని తయారు చేసింది. ⇒ 85 సెకన్ల వ్యవధిలోనే వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్ చేసుకోగలదు. ఒక నిమిషంలో ఆరుసార్లు బాంబులను ప్రయోగించగలదు. ⇒ మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువులకు తెలీకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకుని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. ఒక చోట ఉండి భిన్న దిశలో బాంబులను ప్రయోగించగలదు. ⇒ ఇందులోంచి మందుగుండును పేల్చే గన్ బరువే ఏకంగా 30 టన్నులు. ⇒ గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దీని క్యాబిన్ను పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కవచంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు సైనికులు ప్రయాణించవచ్చు. ⇒ ఈ శతఘ్నిలో దాదాపు 85 శాతం పరికరాలు భారత్లో తయారైనవే. ⇒ దిగ్గజ ఫ్రాన్స్ సీజర్, ఇజ్రాయెల్ అ ట్మోస్ 2000 సిస్టమ్ల తరహాలో ఈ శ తఘ్నిని రూపొందించారు. ఒక్కో యూనిట్ ధర తో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ. -
ఇదండీ బాబు సర్కారు తీరు..కిలో మామిడికి నాలుగు రూపాయలిస్తే చాలట!
ఢిల్లీః: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమో ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడూ రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. మరోసారి కూడా అదే పునరావృతం చేసింది. తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతుంటే.. బాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్ అయ్యింది. తాజాగా ఈరోజు(మంగళవారం. జూలై 08) ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాట ధర రూ. 4 ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు? వినతి పత్రం ఇవ్వడం ఎందుకు? అనే విమర్శ వినిపిస్తోంది. కనీసం కర్ణాటకకు ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా లేదు..ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు సర్కారుకు ఏపీలోని రైతులపై ఎంత శ్రద్ధం ఉందో అనే విషయం అవగతమవుతుంది. కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు రూ. 16గా ఉంది. మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్. మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండని అడగలేదు బాబు ప్రభుత్వం. దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్నెస్,సిన్సియారిటీ లేవని విషయం అర్థమైంది. మొక్కుబడిగా, హడావుడిగా..వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా, హడావుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. ఎంఐఎస్ స్కీం కింద కిలో నాలుగురూపాయల చొప్పున 260 కోట్లిస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్టను నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి. -
వైఎస్సార్ విజనరీ లీడర్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకుని ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్సార్పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ‘ వైఎస్సార్ విజనరీ లీడర్. ఏపీ ప్రజల సంక్షేమ కోసం తన జీవితాన్ని అంకింతం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు’ అని కొనియాడారు. Humble tributes to former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.A visionary leader who devoted his life to the welfare of the people of Andhra Pradesh and made countless contributions to their upliftment.He will always be… pic.twitter.com/D3BO9MZsCM— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2025 వైఎస్సార్ కృషి మరువలేనిది..రైతులు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ చేసిన కృషి మరువలేనదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఏపీ రాష్ట్ర ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మానవతా వాది వైఎస్సార్ అని కొనియాడారు. On his birth anniversary, we pay homage to Y. S. Rajasekhara Reddy, the Former Chief Minister of Andhra Pradesh.A truly compassionate leader, he devoted his entire life to the progress and well-being of the state. His remarkable contributions to public service, especially… pic.twitter.com/JYQOdeEthS— Mallikarjun Kharge (@kharge) July 8, 2025 -
వందమంది ఎమ్మెల్యేల మద్దతు.. సీఎంగా డీకే శివకుమార్?
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ను (D. K. Shivakumar) సీఎంను చేయాలంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు డీకేఎస్ వెంట ఉన్నారంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఈ క్రమంలో డీకేఎస్ సైతం హస్తినలో పర్యటించడం.. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే? 2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య(Siddaramaiah)కు సీఎం పదవి, డీకేఎస్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఆ సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై డీకేఎస్ వర్గం అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. పైకి మాత్రం సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, తర్వాత డీకే శివకుమార్ సీఎం అయ్యేలా ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల గడువు సెప్టెంబర్లో ముగియనుండటంతో, డీకే శివకుమార్ మద్దతు దారులు మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ మాట్లాడుతూ.. ‘అవును, చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎం చేయాలని కోరుతున్నారు. మా జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కు మద్దతుగా ఉన్నారు అని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చుకర్ణాటక రాజకీయంపై ఇప్పటికే ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala)కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు. కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు . గతంలో ఇదే వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం రణదీప్ సూర్జేవాలాను మధ్యవర్తిగా వ్యవహరించారు.అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంమరోవైపు తనని సీఎంను చేయాలంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లపై డీకే శివకుమార్ స్పందించారు. నా కోసం మాట్లాడమని నేను ఎవరికీ చెప్పలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదని అధికారికంగా ఆయనను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యను కొనసాగించాలనే వైఖరిలోనే ఉంది. కానీ డీకే శివకుమార్ వర్గం నుంచి వచ్చే ఒత్తిడి, ఎమ్మెల్యేల మద్దతు,2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోనని డీకే వర్గం భావిస్తోంది. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి మరి -
ప్రతీ ఏడాది అక్టోబర్ 3న మరాఠీ భాషా దినోత్సవం, ఆదేశాలు
ముంబై: గత ఏడాది మరాఠీకి శాస్త్రీయ భాష హోదా లభించిన నేపథ్యంలో ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ’శాస్త్రీయ మరాఠీ భాషా దినోత్సవం’గా జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, అక్టోబర్ 3 నుంచి 9 వరకు ప్రతి సంవత్సరం ’శాస్త్రీయ మరాఠీ భాషా వారోత్సవాలు’జరపాలని పేర్కొంటూ తీర్మానాన్ని విడుదల చేసింది. ప్రాచీన మరాఠీ భాషా, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలపై అవగాహన పెంపొందించడం, వాటిని సంరక్షించడమే ఈ తీర్మానం లక్ష్యమని పేర్కొంది. ఈ తీర్మాననుసరించి నిర్దేశిత వారంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఈ తీర్మానాన్న నుసరించి భాషా సంరక్షణకు సంబంధించి ఉపన్యా సాలు, సెమినార్లు, పురాతన గ్రంథాలు, శాసనాల ప్రదర్శనలు, క్విజ్లు, వ్యాస పోటీలు, ఇతర విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. పురాతన రచనల డిజిటలైజేషన్, శాస్త్రీయ గ్రంథాలను ఆధునిక మరాఠీలోకి అనువదించడం , భాషా సంరక్షణ పద్ధతులపై డాక్యుమెంటరీల ప్రదర్శనల వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిఉంటుంది. అరుదైన లిఖిత ప్రతులు, పురాతన రాగి ఫలక శాసనాల ప్రదర్శనలు విద్యార్థులు, ప్రజలను మరాఠీ భాష, సంప్రదాయంతో అనుసంధానించేందుకు ఎంతోగానో తోడ్పడతాయని జీఆర్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను మరాఠీ భాషా కమిటీలకు అధిపతులుగా నియమించారు. వీరు కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించాల్సి ఉంటుందని కోరారు. ప్రత్యేక వారంలో నిర్వహించిన కార్యకలాపాల వివరణాత్మక నివేదికలను అక్టోబర్ 31 నాటికి లాంగ్వేజ్ డైరెక్టరేట్కు సమరి్పంచాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకవసరమైన ఖర్చును సంబంధిత విభాగాలు, కార్యాలయాల సాధారణ బడ్జెట్ నుంచి కేటాయిస్తామని తెలిపింది. -
డాక్టర్ ఆకస్మిక మృతి.. చేతబడే కారణామా?
కర్ణాటక: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాలనాధికారిగా ఉన్న డాక్టర్ వసంతకుమార్ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి విదితమే. సోమవారం ఆయన ఉన్న కార్యాలయం గదిని సిబ్బంది తెరచిన సమయంలో గదిలో చేతబడి చేసిన గుర్తులు కనిపించి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. మాలూరు నగరంలోని ఆస్పత్రిలో డాక్టర్ వసంతకుమార్ కంటి వైద్య నిపుణులుగా గత 10 సంవత్సరాలుగా పని చేసి అనంతరం ఆస్పత్రి వైద్యాధికారిగా నియమితులయ్యారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత నెల 5వ తేదీన బెంగళూరు నుంచి రైలులో మాలూరుకు వస్తుండగా తీవ్ర గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలోని ఆయన గదిని తెరచిన సమయంలో చేతబడి చేసిన విషయం వెలుగు చూసింది. గదిలో మరణించిన రెండు గబ్బిలాలు, బీరువాలో చేతబడికి ఉపయోగించిన బొమ్మలు కనిపించాయి. విషయాన్ని వసంతకుమార్ కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వైద్యుడు వసంతకుమార్ గుండెపోటుతో మరణించడానికి చేతబడికి ఏదైనా సంబంధం ఉందా? చేతబడి ఎవరు చేశారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. -
కేంద్రం చేతికి ఎయిరిండియా ఘటన ప్రాథమిక నివేదిక
భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం✈️ ప్రాథమిక నివేదిక కేంద్రానికి చేరింది. త్వరలో ఇందులోని వివరాలను ప్రజల కోసం బహిర్గతం చేసే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం సెకన్ల వ్యవధిలోనే నేలకూలి పేలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు 270 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికార వర్గాలకు అందజేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఇప్పటిదాకా సేకరించిన విషయాలను, దర్యాప్తు తాలుకా వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాథమిక నివేదికలో ఏం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విమాన ప్రమాదానికి కారణాలు అందులో ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం చివర్లో ఈ నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. 📌 ప్రమాదం వివరాలు:తేదీ: జూన్ 12, 2025 మధ్యాహ్న సమయంవిమాన నంబర్: AI-171 (బోయింగ్ 787 డ్రీమ్లైనర్)స్థలం: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన వెంటనే, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందిమృతులు: 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు సహా మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు🧾 ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు?..బ్లాక్బాక్స్ డేటా విజయవంతంగా డౌన్లోడ్ చేసి విశ్లేషణ ప్రారంభించారుకాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారుపైలట్ మేడే కాల్లో “నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్” అని చెప్పిన ఆడియో రికార్డు దొరికింది✈️ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు జూలై 8న అందజేసింది.🔍 తదుపరి దర్యాప్తు:AAIB నివేదికను ఆధారంగా తీసుకుని పూర్తి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాల్సిందిగా కేంద్రం ఆదేశించిందిమరోవైపు ఎన్ఐఏ కూడా కుట్ర కోణంపై విచారణ ప్రారంభించింది -
ఆ కామాంధుడు.. కన్నతండ్రే!
చాప్రా: బీహార్లో వావివరుసలు మరచి ప్రవర్తించిన ఒక తండ్రి ఉదంతం కలకలం రేపుతోంది. రైలు టాయిలెట్లోని ఒక బ్యాగులో నవజాత శిశువు లభ్యమైన దరిమిలా పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రైలులోని టాయిలెట్లో శిశువు ఏడుపు విన్న ప్రయాణికులు, వెంటనే ఆ శిశువును బయటకు తీసి, మొరాదాబాద్లోని రైల్వే పోలీసులకు అప్పగించారు.పోలీసుల విచారణలో బీహార్కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైందని, అయితే వారి కుటుంబ సభ్యులు దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని తేలింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన సమాచారంలో.. తన తండ్రి మద్యం సేవించేవాడని, ఏడాదిగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గర్భవతి అయిన బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం రైలులో ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు శిశువుకు జన్మనిచ్చిందని వెల్లడయ్యింది.వారు ప్రయాణిస్తున్న రైలు వారణాసి సమీపంలో ఉండగా, ఆమె టాయిలెట్లో మగబిడ్డను ప్రసవించింది. అయితే కుటుంబ సభ్యులు ఆ శిశువును ఒక బ్యాగులో ఉంచి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్లో పడవేసి, రైలు నుంచి దిగిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బరేలీ సమీపానికి రైలు చేరుకున్నంతలో ప్రయాణికులు ఆ శిశువును గుర్తించారు. వెంటనేవారు ఆ శిశువును టికెట్ తనిఖీ సిబ్బందికి అప్పగించారు. వారు ఆ శిశువును ఎయిర్ కండిషన్డ్ కోచ్కు తరలించారు. తరువాత ఆ శిశువుకు మొరాదాబాద్లో వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.బాధిత బాలిక కుటుంబ సభ్యులు వదిలివెళ్లిన బ్యాగులో లభ్యమైన సిమ్ కార్డ్ ఆధారంగా పోలీసులు బాధితురాలి ఆచూకీ తెలుసుకున్నారు. తరువాత ఆమెను మొరాదాబాద్కు తీసుకువచ్చారు. అయితే బాధితురాలు అక్కడి అధికారులతో ఆ శిశువును తాను పోషించలేనని లిఖిత పూర్వకంగా తెలిపింది. బాధితురాలితో పాటు వచ్చిన బంధువులు కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు స్పష్టం చేశారని సమాచారం. దీంతో ఆ శిశువును మొరాదాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..హిమాచల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో.. మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట. -
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం?
సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ్య శక్తియోజన కింద మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. మూడేళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పురుషులు తాము కూడా ఓటు వేశామని, తామేం పాపం చేశామని చర్చించుకుంటున్న తరుణంలో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై అధిక టికెట్ ధరలను విధించినట్లు కూడా విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులు అటకెక్కించారని విమర్శలు ప్రజాకర్షక హామీలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్యారెంటీలను రద్దు చేస్తే అభివృద్ధి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ నిధి, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2000 ఇచ్చేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతోంది. బాంబు పేల్చిన బసవరాజ రాయరెడ్డి ఈ తరుణంలో సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. సోమవారం కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లుగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సమాలోచన చేస్తోందన్నారు. ఈ విషయంలో సాధక బాధకాలను పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వంలో నిధుల కొరత లేదని, గ్యారెంటీలను చక్కగా అమలు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు రూ.2 వేలు, ఉచిత బస్సు తదితర గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
రూ.200 మోసం .. 30 ఏళ్ల తరువాత అరెస్టు
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు. నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు. -
డీఎస్పీ వివాహేతర సంబంధం.. కేసు నమోదు
కర్ణాటక: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో శంకరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. భార్య ప్రశ్నించడంతో ఆమెను కొట్టి వేధించేవాడు. మరింత కట్నం తేవాలని బెదిరించడంతో పాటు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈశాన్య విభాగం మహిళా పోలీస్టేషన్లో శంకరప్ప పై కేసు నమోదైంది. -
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. పోలీసులు అదుపులో ఎంఎన్ఎస్ కార్యకర్తలు
థానే: మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలోని థానేలో చోటుచేసుకున్న ఒక బాషా వివాదంపై రాజ్థాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ సమయంలో నిరసనల్లో పాల్గొన్న ఎంఎస్ఎన్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మార్చ్కు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎంఎస్ఎన్కు నిరసన ప్రదర్శనలకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని కేటాయించారని, అయితే అది కాదని, వారు వేరే మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి మార్చ్ను అడ్డుకున్నారని వివరించారు.మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు దుకాణ యజమానిపై ఇటీవల ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా వ్యాపారుల నిర్వహించిన ఆందోళనను తిప్పికొట్టేందుకు ఎంఎన్ఎస్ ఈ మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎంఎస్ఎస్ కార్యకర్తల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ మీరా రోడ్దులో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని, తమకు ఇదే ప్రాంతంలో నిరసన నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ తమకు మార్చ్కు అనుమతించే వరకు విశ్రమించేది లేదని ఎంఎన్ఎస్ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్పాండే పేర్కొన్నారు.ఇటీవల మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఒక దుకాణ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన దరిమిలా వ్యాపారులు నిరసన చేపట్టారు. దీనిని ఖండిస్తూ ఈరోజు(మంగళవారం) ఎంఎన్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దీనికిముందు స్థానిక ఎంఎన్ఎస్ నేత అవినాష్ జాదవ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా రాష్టంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాషా వివాదాన్ని మరింతగా పెంచాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ భాషా సంఘాల నుండి వ్యతిరేకత వచ్చిన దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఎన్నికల వేళ.. బీహార్లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్యాదవ్ అనే షూటర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. -
‘మాతృభాష తప్పనిసరి’.. ఆ రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
న్యూఢిల్లీ: ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ, పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020 కింద కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ తరహా భాషా వివాదం తలెత్తింది. అయితే ఈ త్రిభాషా విధానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ విధానాలకు మద్దతు పలికే ఆర్ఎస్ఎస్ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఆర్ఎస్ఎస్ స్థానిక భాషలలో ప్రాథమిక విద్యను కొనసాగించాలన్న వాదనను సమర్థిస్తూ, ఈ అంశంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలు జాతీయ భాషలే అంటూ, ఇదే సంఘ్ వైఖరని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో సొంత భాషలోనే మాట్లాడుతుంటారు. అందుకే ప్రాథమిక విద్యను అదే భాషలో కొనసాగించాలని ఆయన అన్నారు. #WATCH | Delhi: On the recent language controversy, RSS Akhil Bharatiya Prachar Pramukh, Sunil Ambekar says, "Sangh has always had the stand that all languages of India are national languages. People speak their own languages in their own places. Primary education should be… pic.twitter.com/PUZhWyv19p— ANI (@ANI) July 7, 2025జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం కింద విద్యార్థులు తమ పాఠశాల విద్యలో మూడు భాషలు నేర్చుకోవాలి. జాతీయ ఐక్యతను సమతుల్యం చేస్తూ బహుభాషావాదాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాయి. ప్రాథమిక విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అవి పట్టుబట్టాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇదే ధోరణి ప్రదర్శించింది. అయితే ఈ తరహా భాషా సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, రాత్రికి రాత్రే జరగదని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. -
ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్ కోబ్రానే..
మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరుతెన్నులపై ఓ అవగాహన ఉంటుంది. అదే భారీ కింగ్ కోబ్రా.. ఎంత చురుగ్గా కదులుతుందో తెలిసిందే. కనిపిస్తేనే హడలిపోయి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఆ కోబ్రానే ఓ అటవీ అధికారిణి ఏ మ్రాతం భయం, బెరుకు లేకుండా పట్టుకున్న విధానం చూస్తే..వామ్మో అనిపిస్తుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేయడంతో నెట్టింట ఈ ఘటన వైరల్గా మారింది. ఆ వీడియోలో పరత్తిపల్లి రేంజ్కు చెందిన అధికారి జీఎస్ రోష్ని ఒక చిన్న కాలువ ప్రవాహం వద్ద భారీ కింగ్ కోబ్రా సంచరించడాన్ని చూశారు. వెంటనే పాములను పట్టే స్టిక్ని ఉపయోగించి ఆ కోబ్రాని పట్టే ప్రయత్నం చేశారు. ఆ కోబ్రా దగ్గర దగ్గర 16 అడుగుల భారీ పాము అది. అత్యంత విషపూరితమైన ఈ పాముని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆమె చాలా చాకచక్యంగా పట్టుకుని ఒక సంచిలో బంధించి మనుషుల సంచరానికి దూరంగా ఒక అటవీ ప్రదేశంలో వదిలేశారు. కేరళ అటవీ అధికారిణి రోష్ని ఇప్పటి వరకు సుమారు 800పైనే పాములను పట్టుకున్నారట. కానీ రోష్నికి ఇలా కింగ్ కోబ్రాను పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని ఆ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్లో పేర్కొన్నారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నందా. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె అంకితభావానికి ప్రశంసిస్తూ..ఐఏఎస్ ఆఫీసర్లకు అటవీ అధికారులు ఏ మాత్రం తీసిపోరని, వారికంటే ఎక్కువ గౌరవాన్ని పొందేందుకు అర్హులని పోస్టుల పెట్టారు. My salutations to the green queens & the bravery shown by them in wild🙏Beat FO G S Roshni, part of Rapid Response Team of Kerala FD rescuing a 16 feet king cobra.This was the 1st time she was tackling a king cobra though she is credited to have rescued more than 800 snakes… pic.twitter.com/E0a8JGqO4c— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 7, 2025 (చదవండి: ట్రెండ్ 'షేరెంటింగ్'! పిల్లల ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారా..?) -
ఎన్నికల వేళ.. బీహార్కు కనీవినీ ఎరుగని వరాలు
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర రైల్వే మంత్రి బీహార్లో కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు, రైలు ప్రాజెక్టులు, టెక్ పార్కుల గురించిన వివరాలను వెల్లడించారు.బీహార్లో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. బీహార్ను దేశంలోని పలు నగరాలతో అనుసంధానించే బహుళ రైలు సర్వీసుల ప్రణాళికలను ఆవిష్కరించారు.కొత్త రైళ్లుపట్నా నుండి ఢిల్లీ: పట్నా-ఢిల్లీ కారిడార్ను బలోపేతం చేస్తూ, కొత్తగా రోజూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు మంత్రి తెలిపారు.దర్భంగా నుండి లక్నో (గోమతి నగర్): వారంలో ఒక్కరోజు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం కానుంది.మాల్డా టౌన్ నుండి లక్నో (గోమతి నగర్): పశ్చిమ బెంగాల్- ఉత్తరప్రదేశ్లను బీహార్ ద్వారా కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నారు.జోగ్బాని నుండి ఈరోడ్ (తమిళనాడు): బీహార్ను దక్షిణ భారతానికి అనుసంధానించే రోజువారీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది.సహర్సా నుండి అమృత్సర్: పంజాబ్కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టనున్నారు.మౌలిక సదుపాయాలుభాగల్పూర్-జమాల్పూర్ మూడవ లైన్: రూ. 1,156 కోట్ల అంచనా వ్యయంతో 53 కి.మీ. మేరకు కొత్త మూడవ రైల్వే లైన్ త్వరలో మంజూరు కానుంది.భక్తియార్పూర్-రాజ్గిర్-తిలైయా డబ్లింగ్: రూ. 2,017 కోట్ల అంచనా వ్యయంతో 104 కి.మీ. కంటే ఎక్కువ ట్రాక్ల డబ్లింగ్ ఏర్పాటు కానుంది.రాంపూర్హాట్-భాగల్పూర్ డబ్లింగ్: రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 177 కి.మీ. మేరకు మరో డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు కానుంది.సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులురైల్వే మౌలిక సదుపాయాలతో పాటు, బీహార్లో సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రెండు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు. -
రేపటి భారత్ బంద్లో 25 కోట్ల కార్మికులు? ప్రజా సేవలకు తీవ్ర అంతరాయం?
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకింగ్, భీమా, పోస్టల్ సేవలు మొదలుకొని, బొగ్గు గనుల వరకు వివిధ రంగాలకు చెందిన కార్మికులు బుధవారం(జూలై 9) జరిగే భారత్ బంద్లో పాల్గొంటారని ఆయా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 10 కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది.కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేస్తున్న ‘భారత్ బంద్'గా కార్మిక సంఘాలు దీనిని పేర్కొన్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని దేశంలోని కార్మికులకు కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారని భావిస్తున్నామని, దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా నిరసనలో పాల్గొంటారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నేత అమర్జీత్ కౌర్ మీడియాకు తెలిపారు.‘భారత్ బంద్’ కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు ప్రభావితం కానున్నాయని హింద్ మజ్దూర్ సభకు చెందిన హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపారు. గత ఏడాది కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివిధ యూనియన్లు సమర్పించిన 17 డిమాండ్లను నెరవేర్చాలంటూ భారత్ బంద్ చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను విస్మరించిందని, గత దశాబ్ద కాలంగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడంలో విఫలమైందని పలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి.ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లు వారి హక్కులను హరించడానికి రూపొందించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కోడ్లు యూనియన్ కార్యకలాపాలను బలహీనపరచడం, పని గంటలను పెంచడం , కార్మిక చట్టాల ప్రకారం యజమానులను జవాబుదారీతనం నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. కాగా కార్మిక సంఘాలు గతంలో 2020, నవంబర్ 26న, 2022,మార్చి 28, 29 తేదీలలో, గత ఏడాది ఫిబ్రవరి 16న ఇదేవిధమైన దేశవ్యాప్త సమ్మెలను నిర్వహించాయి. -
తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్మేన్ పంకజ్శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025 -
Maharashtra: బాల్ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ హిందీని తప్పనిసరి చేస్తామని ప్రకటించిన దరిమిలా మరాఠీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రణాళికను.. బాల్థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే, అతని సోదరుడు (బాల్థాక్రే అన్న కుమారుడు) రాజ్ థాక్రేలు ఒకే వేదికపై చేరి, తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషంగా మారింది. ఆ వీడియోలో భుజంపై కాషాయ శాలువా ధరించిన బాల్థాక్రే ‘నేను మరాఠీ వాడినే కావచ్చు.. కానీ భారతదేశంలోని హిందువును’ అని పేర్కొనడాన్ని గమనించవచ్చు. అలాగే బాషా గుర్తింపుల కన్నా హిందుత్వాన్ని స్వీకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. "I may be Marathi in Maharashtra but I am Hindu in Bharat. We must embrace Hindutva over linguistic identities"Balasaheb Thackeray pic.twitter.com/KRrMVkGpYc— Kashmiri Hindu (@BattaKashmiri) July 5, 2025రెండు దశాబ్దాలుగా విబేధాలతో రగిలిపోతున్న ఉద్ధవ్, రాజ్ ముంబైలో ఒక వేదికపై చేరి, రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ అనంతరం సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియో ప్రత్యక్షమై వైరల్గా మారింది. కాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్ధవ్, రాజ్లు తమ ర్యాలీలో నినదించారు.తండ్రి రాజకీయ సిద్ధాంతానికి వారసునిగా గుర్తింపు పొందిన ఉద్ధవ్ థాక్రే కొంతకాలంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంపై పోరాడుతున్నారు. రాజ్, తాను కలిసి ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఇదే సమయంలో రాజ్ థాక్రే తన సోదరునికి మద్దతు పలుకుతూ, బీజేపీ ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేయడాన్ని తాము అనుమతించబోమని, ఈ ఉద్యమానికి మరాఠీ జనాభా ఐక్యంగా మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: ‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్ -
యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ సీఎం సంచలన లేఖ.. యమునపై కొత్త ట్విస్ట్!
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్ను ఆమె కోరారు. అక్రమ తవ్వకాల కారణంగా ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు.ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని యమునా నది వెంట అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి చేరడంతో ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. ఈ లేఖలో రేఖా గుప్తా.. యమునా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు నది కరకట్టలను బలహీనపరుస్తున్నాయి. దీంతో, దేశ రాజధానిలో వరదల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నది సహజ మార్గాన్ని కూడా మారుస్తాయి. ఇది నది పరిసర ప్రాంతాల్లో నివసించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ తవ్వకం వరద ప్రమాదాన్ని కలిగించడమే కాకుండా దీర్ఘకాలిక పర్యావరణ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అక్రమ మైనింగ్పై అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాన్ని తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఎన్జీటీ గుర్తించింది. అందుకే ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని కోరుతున్నాను. దీనిపై తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి’ అని యోగి ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని అన్నారు. దీని అమలు బాధ్యతలో గందరగోళాన్ని నివారించడానికి నది వెంబడి అధికార పరిధిని ఉమ్మడిగా గుర్తించడంతో సహా ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని అభ్యర్థించారు. -
లొంగిపోతారా?.. ఎన్కౌంటరై పోతారా?
బస్తర్: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి అలజడి రేగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలకు మరోసారి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో.. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లొంగి పోతారా? లేదంటే ఎన్కౌంటరై పోతారా? అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. గణపతి, హిడ్మా టార్గెట్గా.. సుమారు 25 వేల మందితో ఈ భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా.. కొండగావ్-నారాయణ్పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. వారిపై కలిపి రూ.13 లక్షల రివార్డులు ఉన్నాయి. భద్రతా బలగాలు ఏకే-47 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్పై స్పందించిన తరుణంలోనే బస్తర్ ఐజీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో 140 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. వీరిలో 123 మంది బస్తర్ డివిజన్లోనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఛత్తీస్గఢ్ బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారేం కాదు. నంబాల ఎన్కౌంటర్ తర్వాత.. ఆయనలాగే ఎన్కౌంటర్లో చనిపోవాలా? లేక లొంగిపోవాలా? అనేది మావోయిస్టు టాప్ లీడర్లే నిర్ణయించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఈ సంఘటన తర్వాత, మిగిలిన మావోయిస్టు నేతలకు ఇక బస్తర్లో తలదాచుకోవడానికి స్థలం లేకుండా పోయింది. గణపతి, దేవ్జీ, సోను, హిడ్మా, సుజాత, రామ్ చంద్ర రెడ్డి, బర్సే దేవా.. వీళ్లందరినీ కూడా ఇదే తరహాలో ఎదుర్కొంటాం. మావోయిస్టు గ్రూపుల్లో ప్రస్తుతం నాయకత్వ సంక్షోభం ఉంది. బసవరాజు మరణం మానసికంగా కూడా వారిని కుంగదీసింది అని ఐజీ సుందర్ ఆ టైంలో వ్యాఖ్యానించారు. -
బ్యాంకులోకి చేరిన వరద.. జనం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
శాంతంగా ఉండండి
ముంబై: న్యాయస్థానాల్లో వాడీవేడీగా వాదనలు జరుగుతుంటే సంయమనంతో ఉండాల్సిన న్యాయమూర్తులు సైతం పట్టరాని ఆవేశంతో లాయర్లపై విరుచుకుపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆవేశాలు కోర్టుల్లో ప్రశాంత పనివాతావరణాన్ని పాడుచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో బాంబే హైకోర్టులో కేసుల వాదోపవాదనల ప్రత్యక్ష ప్రసారాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని సీజేఐ గవాయ్ ప్రారంభించి తర్వాత ప్రసంగించారు. ‘‘బాంబే హైకోర్టులో న్యాయమూర్తులు వెలువర్చిన ఎన్నో తీర్పులను చూసి గర్వపడ్డా. తీర్పులను చాలా చక్కగా రాశారు. అయితే ఈ హైకోర్టు జడ్జీలపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయమూర్తులు కోపాన్ని నియంత్రించుకోలేక కోర్టుల్లోనే తిట్టేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. న్యాయమూర్తిగా పనిచేయడం అనేది మిగతా ఉద్యోగాల మాదిరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పనిచేసేది కాదు. సమాజం, దేశం కోసం చేసే అత్యుత్తమమైన సేవల్లో ఇదీ ఒకటి. ఇందుకు అంకితభావం, నిబద్ధత చాలా అవసరం. అయితే కొందరు జడ్జీలు తరచూ లాయర్లతో మర్యాదలేకుండా, పరుష పదజాలం ఉపయోగిస్తూ తిడుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ లాయర్లకు, కొందరు ఉన్నతాధికారులకు సమన్లు జారీచేస్తున్నారు. అనవసరంగా సమన్లు జారీచేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. జడ్జీలు ప్రశాంతంగా ఉంటే కోర్టుహాల్లో వాతావరణం హుందాగా ఉంటుంది. అలాంటప్పుడే లాయర్లుసహా అక్కడ ఉండేవాళ్లందరి రక్తపోటు, చక్కర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఇది న్యాయమూర్తులకూ వర్తిస్తుంది’’అని అనగానే అక్కడ ఉన్నవారంతా ఫక్కున నవ్వారు. పార్ట్టైమ్ జడ్జీల్లా తయారయ్యారు ‘‘కొందరు జడ్జీలు రోజువారీ విధులను సంపూర్ణంగా చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి పార్ట్టైమ్ జడ్జీలతో సమస్యే. కొన్ని ధర్మాసనాల్లో కొందరు జడ్జీల వైఖరిపై నాకు పక్కా సమాచారం అందింది. పేర్లు వెల్లడించనుగానీ వాళ్లు కోర్టు మొదటి సెషన్లో కొద్దిసేపు, తర్వాతి సెషన్లో కొద్దిసేపు అలా ధర్మాసనంపై కూర్చుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి పార్ట్టైమ్ జడ్జీల వైఖరి మంచిది కాదు. సమాజానికి, దేశానికి సేవచేస్తామని జడ్జీగా ప్రమాణంచేశాక ఇలాంటి ధోరణి ప్రదర్శించడం ఆ ప్రమాణాన్ని చిన్నచూపు చూడటమే అవుతుంది. ఇలాంటి చర్యలతో న్యాయస్థానాలకు చెడ్డపేరు తీసుకురావొద్దు. ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, లాయర్లు అంకితభావం, కృషితో సమున్నత స్థాయికి చేరిన న్యాయస్థానాల ఘనకీర్తికి మచ్చ తీసుకురాకండి’’అని హితవు పలికారు.కాలానుగుణంగా చట్టాలను అన్వయించుకోవాలి విస్తృతస్థాయిలో రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్కు ఉందంటూ ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై సీజేఐ మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో సమూలస్థాయిలో మార్పులు చేయాలన్న వాదనలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి రాజ్యాంగం అనేది సజీవ పత్రం. మారుతున్న కాలానుగుణంగా, సమాజ అవసరాలకు తగ్గట్లుగా పార్లమెంట్ రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు. సామాజిక, ఆర్థికాభివృద్దికి బాటలువేసేలా ఆ మార్పులు ఉండాలి. చట్టాలు, రాజ్యాంగాన్ని నేటి సమాజ సవాళ్లకు పరిష్కారాలు వెతికేందుకు అనువుగా మాత్రమే అన్వయించుకోవాలి. సమాజ అవసరాలు తీర్చేలా న్యాయవితరణలో న్యాయస్థానాలు చట్టాలు, రాజ్యాంగాన్ని ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి’’అని సీజేఐ అన్నారు. ‘‘జడ్జీ పోస్ట్లోకి సిఫార్సుచేసేముందుగా ఆయా అభ్యర్థులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే కొత్త సంస్కృతికి సుప్రీంకోర్టు తెరలేపింది. అయితే ఒక హైకోర్టులో అభ్యర్థులే ముందుగా చొరవతీసుకుని జడ్జీలను కలిసే ప్రయత్నంచేసినట్లు నాకు తెలిసింది. ఇలాంటి అనుచిత ధోరణి బాంబే హైకోర్టులో ఉండబోదనే ఆశిస్తున్నా’’అని ఆయన అన్నారు. -
బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం
న్యూఢిల్లీ: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన అద్దె బంగ్లాకు ఇప్పటికే కొంత సామాను కూడా పంపించామన్నారు. మిగతాది కూడా ప్యాకింగ్ పూర్తి చేసి స్టోర్ రూంలో ఉంచామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్లోని ఐదో నంబర్ బంగ్లాలో చంద్రచూడ్ దంపతులు దివ్యాంగులైన ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నారు. అయితే, అనుమతించిన సమయానికి మించి ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. ఈ అంశం వివాదాస్పదం కావడం తనకెంతో విచారం కలిగించిందన్నారు. ‘నా కుమార్తెలు ప్రియాంక, మహిలు నెమాలిన్ మయోపతి అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో కూడా వారిని అత్యంత పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఉంచాల్సి ఉంది. వారికోసం ప్రత్యేకంగా నర్సును ఏర్పాటు చేశాం. వారిని వీల్చైర్లో తిప్పేందుకు అనువుగా ఉండే ఇల్లు ఎంతో అవసరం. పెయిన్, స్పీచ్ థెరపీతోపాటు వారికి నిత్యం చెస్ట్, రెస్పిరేటరీ, న్యూరలాజికల్ థెరపీనీ చేయించాల్సి ఉంటుంది. కొత్త ఇల్లు సిద్ధమైందని చెప్పిన వెంటనే ఖాళీ చేస్తాం..అందుకు రెండు రోజులు, రెండు వారాలు కూడా పట్టొచ్చు..’అని చంద్రచూడ్ చెప్పారు. -
రీల్ కోసం పాకులాట
జైపూర్: రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిండుగా తొణికిసలాడుతున్న భరత్పూర్ జిల్లాలోని బంధ్ బరైతా రిజర్వాయర్పై ఉన్న ఇనుప ఫ్రేమ్పై భయపడుతున్న తన కూతురిని బలవంతంగా అతడు కూర్చోబెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ నెల 4న ఉమా శంకర్ తన భార్య, కుమార్తెతో జలాశయం వద్దకు వెళ్లాడు. వీడియో చిత్రీకరించేందుకు గాను ప్రమాదకరంగా ఉన్న ఇనుప ఫ్రేమ్పై తీవ్రంగా భయపడుతున్న తన కుమార్తెను గద్దించి కూర్చోబెట్టాడు. అక్కడ ఆమె కిందపడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటూ లేకపోవడం గమనార్హం. ఆ రిజర్వాయర్ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఇటీవల వర్షాలకు జలకళ సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉమా శంకర్ తీసి, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నిలదీశారు. దీంతో, ఉమా శంకర్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడు. పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు. -
బ్రహ్మపుత్రలో కొత్త చేప
దిబ్రుగఢ్: జీవవైవిధ్యానికి నెలవైన బ్రహ్మపుత్ర నదీజలాల్లో మరో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చతో ఉన్న ఈ చిన్న చేపకు శాస్త్రవేత్తలు వెంటనే పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే పేరుపెట్టేశారు. ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీజలాల్లో ఈ నూతన మత్స్యజాతిని గుర్తించారు. దిబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు. అందుకే దిబ్రూగఢ్ పేరు ధ్వనించేలా పేథియా దిబ్రూఘర్నేసిస్ అని పేరుపెట్టారు. ఈ మత్స్యం నెత్తల్లు వంటి చిన్నచేపలుండే సైప్రినిడ్ జాతికి చెందినదిగా వర్గీకరించారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంట ఉన్న భిన్నజాతుల చేపలు, వాటి సంతతి, వృద్ధి, ఇతర రకాల జలచరాల వివరాలను తెల్సుకునేందుకు సర్వే చేపట్టగా ఆ క్రమంలో అధ్యయనకారులకు ఈ చేప కంటబడింది. మిగతా చేపలతో పోలిస్తే కొత్తరకం చేప కాస్తంత భిన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు తాను ఈదుతున్న నీటిలో ఏదైనా షార్క్, డాలి్ఫన్, ఆక్టోపస్ వంటి శత్రుజలచరాలు కదిలితే నీటి తరంగాలతో వాటి కదలికలను కనిపెట్టి అప్రమత్తం చేసే జ్ఞానేంద్రియ రేఖ(లేటరల్ లైన్) ఈ చేపలో అసంపూర్ణంగా అభివృద్ధి చెందింది. ఈ కారణంగా దీనిని ఇతర జీవులు వేటాడటం సులభం అవుతుంది. ఇది పెద్దగా కష్టపడకుండానే వాటి నోటికి చిక్కుతుంది. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ దీని ప్రత్యేకత. తోక చుట్టూతా 10 పొలుసులు భిన్నంగా ఉన్నాయి. అదీకాకుండా పై భాగంలోని రెక్కకు, లేటరల్ లైన్కు మధ్యలో నాలుగు పొలుసుల వరసలు, అదే విధంగా కింది రెక్కకు, లేటరల్ లైన్కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. ‘‘పిల్లి మీసాల్లాగా చేప నోటి వద్ద ఉండే నిర్మాణం ఈ జాతి చేపకు లేదు. చేప కన్ను తర్వాత వెనక్కివెళ్లే కొద్దీ తొలుత కనిపించే ప్రాంతంలో దీనికంటూ ప్రత్యేకంగా ఎలాంటి మచ్చలు, రంగులు లేవు. కానీ తోక సమీపంలో విచిత్రంగా నల్లని, పొడవాటి మచ్చ ఉంది. ఈ జాతిచేపలన్నింటిలో ఈ మచ్చ ఉంది. బ్రహ్మపుత్ర జలాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలని ఈ చేప మరోసారి నిరూపించింది’’ అని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ‘‘ నదీ ప్రవాహం వెంట చిత్తడి నేలల పరిరక్షణ, మితిమీరిన చేపల వేటను తగ్గించడం వంటి చర్యలతో ఇలాంటి అరుదైన చిన్న కొత్త చేపలను పరిరక్షించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి’’ అని అధ్యయనకారులు సూచించారు. -
అందమైన శత్రువు..
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి.. పాదరసం కలిసిన సౌందర్య సాధనాల ఉత్పత్తులపై నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని జూన్17న జరిగిన సమావేశం మినిట్స్లో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ధ్రువీకరించింది. చట్టప్రకారం కాస్మెటిక్స్లో పాదరసం నిర్దేశిత మోతాదుపై ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. సౌందర్య సాధనాల తయారీపై నిఘాను కఠినతరం చేయనుంది. అసలింతకీ ప్రమాదకర లక్షణాలు పాదరసంలో ఏమున్నాయి.. ఇంతకూ దాన్ని సౌందర్య సంబంధ ఉత్పత్తుల్లో ఎందుకు వాడతారు? – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో కాస్మెటిక్స్ అన్నది సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం. అమ్మకాల పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ మనది. చాలా సౌందర్య సాధనాల్లో స్వల్ప స్థాయుల్లో పాదరసం వినియోగిస్తారు. అయితే పాదరసం మానవ ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ రెండింటినీ ప్రభావితం చేసే విషపూరిత మూలకం. అందుకే కాస్మెటిక్స్ తయారీలో ఈ లోహం వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.2013 ‘మినామాటా కన్వెన్షన్ ’..: పాదరసం, పాదరస సమ్మేళనాల హానికర ప్రభావాల నుండి మానవాళిని, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో 2013లో జపాన్ వేదికగా ‘మినామాటా కన్వెన్షన్ ’ (మినామాటా అంతర్జాతీయ ఒప్పందం) కుదిరింది. దాని ప్రకారం సౌందర్య సాధనాలలో 1 పీపీఎం (ఒక పార్ట్స్ పర్ మిలియన్ – అంటే 0.0001 శాతం) కంటే ఎక్కువ పాదరసం ఉండకూడదు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పరిమితి దాటి పాదరసం ఉన్న కాస్మెటిక్స్ ఎగుమతులను, దిగుమతులను, తయారీని, ఇంకా ఇతర లోపాలను గుర్తించేందుకు డీసీజీఐ 2024లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. మనదేశంలోని ప్రస్తుత కాస్మెటిక్స్ చట్టం.. ‘మినామాటా కన్వెన్షన్ ’ ఒప్పందానికి లోబడే ఉందని ఆ ఉపసంఘం నివేదిక పరిశీలించిన డీసీసీ స్పష్టం చేసింది.దిగుమతులే ఆధారంమనదేశం పాదరసం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశం 32.77 లక్షల డాలర్ల విలువైన 73,085 కిలోల పాదరసం దిగుమతి చేసుకుంది. మనకు ఎగుమతి చేసే ప్రధాన దేశాలు పెరు, థాయ్లాండ్, జపాన్, జర్మనీ, యూకే. మనదేశ నిబంధనల ప్రకారం కంటి ప్రాంతంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో కలిపే పాదరసం స్థాయి 70 పీపీఎంలకు (అంటే 0.007 శాతం) మించకూడదు. ఇతర సౌందర్య సాధనాలలో ఇది 1 పీపీఎంను దాటకూడదు.అన్ని రంగాల నిపుణులతో..‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేసిన సిఫారసుల కమిటీకి చైర్మన్గా – ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎన్. భట్టాచార్య, సభ్యులుగా ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగాల వైద్య నిపుణులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు. ‘అందానికి’ పాదరసం ఎందుకు?పాదరసాన్ని సాధారణంగా చర్మాన్ని తెల్లగా చేసే ఉత్పత్తుల్లో వాడతారు. చర్మాన్ని కాంతిమంతం చేసే క్రీములు; చర్మంపై చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను పోగొట్టే సౌందర్య సాధనాలు; వయసును కనపడనీయని యాంటీ–ఏజింగ్ సొల్యూషన్ లు, ఇంకా కొన్ని రకాలైన మేకప్ పదార్థాలు.. పాదరసాన్ని కాస్తయినా కలపకుండా తయారు కావు. చర్మం రంగు నల్లగా ఉండటానికి చర్మంలోని ‘మెలనిన్’ కారణం. పాదరసం ఆ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నల్లదనం తగ్గుతుంది. అలాగే పాదరసం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్లను చంపగలదు. కొన్ని సౌందర్య సాధనాలలో సంరక్షణకారిగానూ ఉపయోగపడుతుంది.చాలా ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ పాదరసాన్ని అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 రసాయనాల జాబితాలో చేర్చింది. పాదరసం కలిసి ఉన్న కాస్మెటిక్స్ను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాదరసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదరసం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. » ఒంటిమీద దద్దుర్లు, రంగు పోవడం» జీర్ణ సంబంధమైనవి» వ్యాధి నిరోధక శక్తి తగ్గడం» ఆందోళన, ఒత్తిడి» నాడీ సంబంధమైనవి» జ్ఞాపకశక్తి సమస్యలు» భావోద్వేగాల్లో అనూహ్యమైన మార్పులుభారీగా పెరిగిన కాలుష్యంపాదరస ఉద్గారాలు 1960తో పోలిస్తే 2021లో 3.3 రెట్లు పెరిగాయి. మొత్తం ఉద్గారాల్లో చైనా, భారత్, ఇండోనేషియా, పెరు, బ్రెజిల్ల వాటా దాదాపు 50 శాతం. – ప్రపంచంలో అత్యధిక పాదరస కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఆ తరవాతి స్థానంలో మనదేశం ఉంది.» బంగారు ఆభరణాల తయారీలో, బంగారం తవ్వకాలు వంటి వాటిలో పాదరసాన్ని విరివిగా వినియోగిస్తారు.» కొన్ని రకాల పరిశ్రమలు, సిమెంటు తయారీ, ఈ–వేస్ట్ వంటి చెత్తను కాల్చడం, బొగ్గును కాల్చడం.. ఇలా పాదరసం అనేక కారణాల వల్ల వాతావరణంలోకి చేరుతోంది.ఇలా చూసుకోవచ్చు|మనం కొనే ఉత్పత్తుల్లో మెర్క్యురస్ క్లోరైడ్, క్యాలొమెల్, మెర్క్యురిక్ అయోడైడ్ అనే పేర్లు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇవన్నీ పాదరస సంబంధమైనవే. -
డెలివరీ డేట్ను ప్లాన్ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు
న్యూఢిల్లీ: తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సీ–సెక్షన్(కోత) ఆపరేషన్తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్చేసి ఆపరేషన్ చేయించిన సందర్భాల్లో పుట్టిన చిన్నారులకు రక్త క్యాన్సర్ (లుకేమియా) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. బిడ్డ డెలివరీ సాధ్యంకాక ప్రసవవేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణికి మాత్రమే గతంలో సీ–సెక్షన్ విధానంలో కోతపెట్టి ఆపరేషన్ చేసేవారు. తదనంతరకాలంలో మంచిరోజు చూసుకుని, మరికొందరు తమకు వీలున్నప్పుడు, మరికొందరు సెలవుతేదీ ఇలా వేర్వేరు కారణాలతో డెలివరీ తేదీని ప్లాన్చేసుకునే ధోరణి ఎక్కువైంది. ఇలా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. స్వీడన్లో మెడికల్ బర్త్ రిజిస్ట్రర్ గణాంకాల ద్వారా సేకరించిన 1982–89, 1999–2015 కాలాల్లో జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.75 లక్షల మంది అంటే 15.5 శాతం మంది సీ–సెక్షన్ ద్వారా జన్మించారు. వీరిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకింది. సహజ ప్రసవం ద్వారా పుట్టిన చిన్నారులతో పోలిస్తే సీ–సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లల్లో అత్యత తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో పరిశోధకురాలు, ఈ పరిశోధనలో కీలక రచయిత క్రిస్టినా ఇమోర్ఫియా క్యాంపిస్టీ చెప్పారు. సహజ ప్రసవ సమయంలో ఒక్కోసారి ఉమ్మనీరు సంచి పగలిపోయి శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టినబిడ్డకు ఎంతో మంచిదని సైన్స్ చెబుతోంది. తొలినాళ్లలోనే బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను గుర్తించడం, భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ వంటి సమస్యలు రావని, చిన్నారుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి. -
పిల్లలది ప్రత్యేక పరిస్థితి.. అందుకే ఇల్లు మారడం కష్టమవుతోంది; మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: ఒక్క ఏడాది వెనక్కి వెళితే.. డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐ స్థానంలో కచ్చితమైన తీర్పులతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. ఇప్పుడు అదే చంద్రచూడ్ మాజీ సీజేఐ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాయడంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన చంద్రచూడ్.. మరోసారి తాను ఆ నివాసాన్ని ఇప్పటివరకూ ఎందుకు ఖాళీ చేయాలేకపోయాననే అంశంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కాస్త వివరంగా షేర్ చేసుకున్నారు.పిల్లల్ని ప్రత్యే పరిస్థితుల్లో పెంచుతున్నాం..‘మా పిల్లలు ప్రియాంక, మహిలను ప్రత్యేక పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది. 24 గంటలు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నేను, నా భార్య కల్పనా దాస్ ఇద్దరం కలిసి పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రత్యేకమైన డిజార్డర్తో బాదపడుతున్నారు. పిల్లల ఇద్దరికీ అరుదైన డిజార్డర్ కలిగి ఉన్నారు. నెమలైన్ మయోపతి(శరీరంలోని కండరాల సమస్యతో బాధపడుతున్నారు). దీనిపై భారత్తో పాటు విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఏమీ కూడా ప్రపంచంలో లేదు. ఇది మోటార్ స్కిల్స్ డిజార్డర్. దీనికి డెవలప్మెంటల్ కో ఆర్డినేషన్ డిజార్డర్(డీసీడీ) లేదా డైస్ప్రాక్సియా అని కూడా పిలుస్తారు. అందుకే ఖాళీ చేయలేకపోతున్నాంపిల్లలకు ఈ డిజార్డర్ నయం చేయడానికి ఎంతోమంది స్పెషలిస్టులతో సంప్రదిస్తూనే ఉంటాం. వారికి మంచి ప్రపంచాన్ని ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. వారిని వారు పనులు చేసుకునేలా, వారి కాళ్ల మీద వారు నిలబడలా చేయడమే మా ముందున్న కర్తవ్యం. ప్రపంచం వారి శ్రేయస్సు కోసం తిరుగుతోంది’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలొనే తాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన నివాసాన్ని ఖాళీ చేయలేకపోయామన్నారుప్రస్తుతం ప్రభుత్వం తమకు తాత్కాలికంగా అద్దెకు ఇచ్చిన బంగ్లాకు మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్టు దాన్ని డిజైన్ చేయించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఖాళీ చేసే పనిలోనే ఉన్నామని, అక్కడ ఇంకా పనులు జరుగుతున్నందున ఖాళీ చేయడం వీలు కాలేదన్నారు. -
నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
Mumbai:‘మెట్రో’లో జనం కిటకిట.. తొక్కిసలాట భయంలో..
మహారాష్ట్రలోని ముంబై మెట్రోలో సోమవారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ముంబై మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వెర్సోవా ఘట్కోపర్ లైన్ వన్లో మెట్రో రాకపోకల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. Crazy commuter woes thanks to 1 service withdrawn tech issues with mumbai metro line 1 Stampede like situation in ghatkopar station@Dev_Fadnavis @CMOMaharashtra act fast before lives are lost Line 1 needs 6 bogie rakes & 3 times current rakes@MandarSawant184@BHiren@impuni… pic.twitter.com/bn0ujkJhBT— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) July 7, 2025ప్రయాణికుల విపరీతమైన రద్దీ కారణంగా ఘాట్కోపర్ స్టేషన్లో తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడిందని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఒక యూజర్ ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెట్రో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రద్దీపై సోషల్ మీడియా యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈరోజు ఆఫీసుకు వెళ్లలేమని, వర్క్ ఫ్రమ్హోమ్ కావాలని బాస్లకు మెసేజ్ పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ముంబైలోని రైలు సేవలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. -
‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్
ముంబై: మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది. భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా, అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయివుండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా మహారాష్ట్రలోని రాయ్గఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్ రెవ్దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు, సముద్రతీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. -
బీహార్ ఓటర్ల జాబితా వివాదం.. అత్యవసర విచారణకు ‘సుప్రీం’ అంగీకారం
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఓటరు జాబితా వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. సోమవారం వీటిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 10న విచారణ చేపడతామని తెలిపింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో.. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. జులై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే... ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే ఈ రివిజన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకేనని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ.. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ ఆపివేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. -
అత్తపై కోడలు దాడి.. వీడియో తీసిన తల్లి
ఘజియాబాద్: అత్తాకోడళ్లకు సంబంధించిన వివాదాలను తరచూ వింటుంటాం. ఒకరికి ఒకరు పొసగని నేపధ్యంలో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇటువంటి వ్యవహారాలు వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. गाजियाबाद के गोविंदपुरम में बहू ने सास को गिरा-गिराकर पीटा।1 जुलाई की घटना, पूरी वारदात सीसीटीवी में कैद। pic.twitter.com/5ReTffAIcs— Greater Noida West (@GreaterNoidaW) July 6, 2025ఘజియాబాద్లోని గోవింద్పురం ప్రాంతంలో ఒక కోడలు అత్తపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలోని కంటెంట్ ప్రకారం కోడలు అత్తపై దాడి చేస్తుండగా, దానిని ఆ కోడలి తల్లి చిత్రీకరిస్తోంది.వారి ఇంటి బయట ఉన్న మెట్లపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ సమయంలో అత్త తన కోడలి తల్లి నుంచి ఫోన్ లాక్కోవడాన్ని కూడా గమనించవచ్చు. ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం కోడలి పేరు ఆకాంక్ష, అత్త పేరు సుదేష్ దేవి. ఈ ఘటన దరిమిలా సుదేష్ దేవి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ముంబై ఉగ్ర దాడులను ప్రత్యక్షంగా పర్యవేక్షించా
ముంబై: పదహారేళ్ల క్రితం ముంబైలో పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం వెనక తన పాత్ర ఉందని ఆ దేశానికి చెందిన ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా అంగీకరించాడు. ఆ క్రమంలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘ముంబై దాడుల వెనక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తముంది. నేను ముంబైలోనే ఉండి దాడులను పర్యవేక్షించా. పథకం ప్రకారమే ఆనాడు ముంబైలో ఉన్నా. భారత్లో ఉంటూ పాక్కు, ఆ దేశ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్గా పనిచేశా’’అని విచారణలో వెల్లడించాడు. కెనడా పౌరసత్వం, పాక్ మూలాలున్న రాణాను అమెరికా అరెస్టు చేసి విచారణ నిమిత్తం భారత్కు అప్పగించడం తెలిసిందే. తిహార్ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈ క్రమంలో అతను పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పక్కాగా లక్ష్యాల ఎంపిక తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై ఉగ్ర దాడి సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి పాక్లో లష్కరే ఉగ్ర శిక్షణ శిబిరాలకు పలుమార్లు హాజరైనట్టు రాణా వెల్లడించాడు. ‘‘మేమిద్దరం అక్కడ శిక్షణ తీసుకున్నాం. ముంబైలో పాగా వేసేందుకు అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయం పెట్టే ఆలోచన నాదే. దాని ముసుగులో పలు ఆర్థిక లావాదేవీలు జరిపా. 2008 నవంబర్ 26న మొదలైన ముంబై దాడుల వేళ నగరంలోనే ఉండి, మా ప్లాన్ సక్రమంగా అమలవుతోందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. ఎక్కడెక్కడ దాడులు చేయాలి, అందుకు ఏ ప్రాంతాలు అనువైనవి, ఎక్కడైతే ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నీ బేరీజు వేసుకున్నా. ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్ తదితరాలను దాడులకు ఎంపిక చేసుకున్నాం. అందుకు ఐఎస్ఐ సాయపడింది. పాక్ సైన్యానికి నమ్మినబంటును గనకే ఖలీజ్ యుద్ధం వేళ నన్ను సౌదీ అరేబియాకు పంపారు’’అని చెప్పాడు.హెడ్లీతో సహవాసం ‘‘హెడ్లీ, నేను 1974–79 మధ్య హసన్ అబ్దల్ క్యాడెట్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. సవతి తల్లి పోరు పడలేక తను అమెరికా పారిపోయి కన్నతల్లితో ఉండేవాడు. 2003–04 మధ్య హెడ్లీ, నేను లష్కరే ఉగ్రశిక్షణ తీసుకున్నాం. ఉగ్ర దాడుల కంటే నిఘా కార్యకలాపాల్లో లష్కరేది క్రియాశీల పాత్ర అని హెడ్లీ చెప్పాడు. ముంబైలో నేను తెరిచిన ఇమిగ్రేషన్ ఆఫీసు మా ఉగ్ర నిఘా కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. దాన్ని ఓ మహిళ నడిపేది. 2008లో దాడులకు వారం ముందు భారత్ వచ్చా. నవంబర్ 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో హోటల్లో దిగా. దాడులకు ముందే ముంబై వీడా. దుబాయ్ మీదుగా బీజింగ్ చేరుకున్నా. పాకిస్తాన్ అధికారులు సాజిద్ మిర్, అబ్దుల్ రహా్మన్ పాషా, మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు’’అని రాణా చెప్పాడు. హెడ్లీ తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో భారత్ రావడానికి రాణా సాయపడ్డట్టు దర్యాప్తులో తేలింది. -
కేరళ శారీలో పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్లను ఆమె తన యూట్యూబ్ ఛానల్తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.జరిగింది ఇదే.. జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి. 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది. 2025 ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్లోని పాక్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి. 2025 మే 16న హర్యానాలోని హిసార్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది. పాక్కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు. -
Madhya Pradesh: మొహర్రం ఊరేగింపులో ఉద్రిక్తత.. 16 మందిపై కేసు నమోదు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జిల్లా అధికారులు ఊరేగింపునకు అనుమతించిన మార్గంలో కాకుండా, నిషేధించిన మార్గంలో ఊరేగింపు నిర్వహించేందుకు కొందరు ప్రయత్నించిన దరిమిలా గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. ఊరేగింపు సమయంలో సింబాలిక్ గుర్రాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొందరు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో పోలీసులు అల్లరి మూకను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపమైన తాజియాను మోస్తున్న వారితో సహా పలువురు గుర్రాన్ని సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. ఈ ఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఒక నిర్వాహకునితో సహా 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. Ujjain : Muslims with Muharram procession broke police barricades and tried to force their way in a restricted route. Police had to use batons to control the situation.Just look at this video.... It's so scary.... pic.twitter.com/IcevP0AL98— Mr Sinha (@MrSinha_) July 6, 2025ఈ ఘటనకు మందు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పోలీసుల అధికారిక అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నారనే ఆరోపణలతో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఊరేగింపు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసిందని, స్థానిక వ్యాపారుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయని, స్వల్ప ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. వ్యాపారుల సమిష్టి ఫిర్యాదు ఆధారంగా ఊరేగింపు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: BJP MP from Mandi, Kangana Ranaut says, "The central government provided immediate relief operations by sending in the forces. At the local level, we provided relief material to the affected families... Even though the Prime Minister is on a foreign… https://t.co/VoW4I4Uh4X pic.twitter.com/G9BeCHHTjF— ANI (@ANI) July 6, 2025హిమాచల్ ప్రదేశ్కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ -
జమిలికి ఓకే.. కానీ సమస్యలను ఎత్తిచూపిన మాజీ సీజేఐలు
న్యూఢిల్లీ: లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానానికి పలువురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు మద్దతు ప్రకటించారు. అయితే ఎలక్షన్ కమిషన్కు అసాధారణ అధికారాలు కట్టబెట్టడం వంటి అంశాల్లో స్పష్టత, పారదర్శకత అవసరమని మాజీ సీజేఐలు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేఎస్ కేహార్, జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. జమిలీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చంద్రచూడ్ తాజాగా తన అభిప్రాయాలను నివేదించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి మద్దతిస్తూనే ‘జమిలీ’లో సవరించాల్సిన లోపాలున్నాయని వ్యాఖ్యానించారు. లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాల వాదనను తప్పుబట్టారు. అయితే ఈసీపై అజమాయిషికి తావులేకుండా అసాధారణ అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లులో చేసిన ప్రతిపాదనలను చంద్రచూడ్, గొగోయ్ తప్పుబట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు చంద్రచూడ్తోపాటు మరో మాజీ సీజేఐ జేఎస్ కేహర్ జూలై 11న అభిప్రాయాలను వినిపించనున్నారు. జమిలి కోసం అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి కట్టబెట్టాలన్న ప్రతిపాదనతో చంద్రచూడ్ విభేదించారు. మాజీ సీజేఐలు యు.యు.లలిత్, గొగోయ్ ఇప్పటికే అభిప్రాయాలను కమిటీ ఎదుట వెల్లడించారు. -
‘ఎన్నికల జాబితా’పై సుప్రీంకు మొయిత్రా
కోల్కతా: బిహార్లోని యువ ఓటర్లకు ఓటు లేకుండా చేసేందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు పూనుకుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బిహార్ తర్వాత ఈసీ తదుపరి లక్ష్యం 2026లో ఎన్నికలు జరిగే బెంగాల్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యకు నిరసనగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లోని నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950కి విరుద్ధంగా ఉన్నాయి మహువా పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ఈసీ ఎస్ఐఆర్ను నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలను ఈసీ జారీ చేయకుండా చూడాలని కోరానన్నారు. 1987 జూలై 1–2004 డిసెంబర్ 2వ తేదీల మధ్య జని్మంచిన వారు ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగా ఓటేసే హక్కుకు లక్షలాది మంది దూరమవుతారని ఆరోపించారు. బిహార్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలంటూ ఈసీ జూన్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేయడం తెల్సిందే. అనర్హులను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూడటమే ఈ ఆదేశాల లక్ష్యమని ఈసీ అంటోంది. ఈసీ ఆదేశాలపై ఏడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర సంఘాలు, కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, బిహార్లో ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని ఈసీ ఆదివారం స్పష్టం చేసింది. -
ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ప్రదేశ్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కంగ్రా జిల్లాలోని మెక్లియోడ్గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్ను కట్చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు. ‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు. శుభాకాంక్షలు తెలిపిన మోదీ దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం. ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు. -
మన రైతులకు కావాలి... రూ. 6.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్లో రైతులకు ఏకంగా 75 బిలియన్ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వాతావరణ స్మార్ట్ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్ అనుసంధానం కీలకం’’ అన్నారు. -
భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇప్పటిదాకా దుబాయ్లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు రూ.4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టి ఉండాలి. ఇవేమీ అవసరం లేకుండానే కేవలం ఫీజుతోనే వీసాను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా. పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్తోపాటు బంగ్లాదేశ్ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మున్ముందు ఈ పథకాన్ని చైనా వంటి ఇతర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కుదిరిన దేశాలకు దుబాయ్ ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
పని సంస్కృతిలో సాంకేతికత, అవసరాలు భాగం కావాలి: అమిత్ షా
ఆనంద్: సహకార రంగం విజయవంతం కావాలంటే పారదర్శకత, సాంకేతికత వినియోగం, సభ్యుల అవసరాలను పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రఖ్యాత అమూల్ డెయిరీ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంస్థలు ఈ మూడు సూత్రాలను తమ పని సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా చేసుకుని జమ్మూ కశీ్మర్ నుంచి అస్సాం వరకు, దేశంలోని ప్రతి గ్రామానికి వాటిని ప్రచారం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో 2 లక్షల ప్రాథమిక సహకారం పరపతి సంఘాలు(పీఏసీఎస్లు), మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ త్రిభువన్, డెయిరీ రంగంలో మూడు జాతీయ సహకార సంఘాలు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాలుగేళ్లలోని 60కి పైగా కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించామన్నారు. అమూల్ పాల సహకార వ్యవస్థ వార్షిక టర్నోవర్ ప్రస్తుతమున్న రూ.80వేల కోట్ల నుంచి వచ్చే ఏడాదికల్లా రూ.లక్ష కోట్లకు చేరుకోనుందని అమిత్ షా ప్రకటించారు. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకే అమూల్ అని పేరు. ఈ సంస్థ నిత్యం 36 లక్షల రైతుల నుంచి 3.20 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది. -
దేశ నేర రాజధానిగా బిహార్
న్యూఢిల్లీ: బిహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా పట్నా లోని ఆయన నివాసం వద్ద హత్యకు గురి కావడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి బిహార్ను దేశానికే నేర రాజధానిగా మార్చారన్న విషయం మరోసారి రుజువైందంటూ ధ్వజమెత్తారు. ‘లూటీలు, తుపాకీ కాల్పులు, హత్యలతో బిహార్ అట్టుడుకుతోంది. నేరాలు కార్యకలాపాలు సాధారణమై పోయాయి. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సోదరసోదరీమణులారా, ఈ అన్యాయాన్ని ఇక ఏమాత్రం సహించొద్దు. మీ పిల్లలను కాపాడలేని ప్రభుత్వానికి మీ భవిష్యత్తును గురించిన బాధ్యతలను అప్పగించొద్దు’అని కోరారు. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి హత్య, ప్రతి లూటీ, ప్రతి బుల్లెట్ మార్పునకు నాంది కావాలన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికే కాదు, రాష్ట్రాన్ని రక్షించేందుకు కూడా ఓటేయాలని కోరారు. శుక్రవారం పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని నివాసం వద్ద గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఖెమ్కా ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఖెమ్కా హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. -
రైల్వే స్టేషన్లో పురుడు!
ఝాన్సీ: భారత ఆర్మీ.. సేవకు, త్యాగానికి మారు పేరు. ఆ పేరును మరోసారి నిలుపుకొన్నారీ ఆర్మీ వైద్యుడు. ఝాన్సీ స్టేషన్లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఆర్మీలో వైద్యుడైన 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. పన్వేల్–గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్ లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూ తి వార్డుగా మార్చారు. చిన్న కత్తి, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, ధోతీ ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు. ప్రసవం తర్వాత మహిళకు, పురిటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్ను సైనిధికారులు కొనియాడారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
భారత్లో 81 కోట్ల మందికి ఉచిత ఆహారమే గతి!
భారత్.. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సంపదలో ప్రజల మధ్య అంతరం మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఇక పేదరిక నిర్మూలన అనేది సుదూర కల. ఎందుకంటే.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా చెప్పుకుంటున్న జీడీపీ వృద్ధిరేటు ఈ అసమానతలను తగ్గించడం లేదు. దీంతో ఆదాయ ఆసమానతలను రూపుమాపకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది. జీడీపీలో పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉచిత ఆహార పథకం మీద 81 కోట్ల మంది ఆధారపడి ఉన్నారంటే.. దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే.. కార్మి క చట్టాల అమలుతోపాటు అనేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ధనిక దేశంలో పేద విధానాలు దేశంలో విధానపరమైన లోపాలు పేద, ధనిక అంతరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిలో అగ్రవాటా దేశంలోని కేవలం 5శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొంటున్న భారత్లో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద.. 81.35 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు చెల్లించాల్సి వస్తుందంటే మన అభివృద్ది నమూనా ఎలాంటిదో అర్థమవుతుంది. అమలు కాని కనీస వేతన చట్టం.. కనీస వేతనాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) చట్టాల కింద యజమానులు సమర్పించిన రిటర్న్లు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇంకా కొన్ని విభాగాల్లోని కార్మికులు ఈ రెండింటిలో నమోదే కాలేదు. 1970 కాంట్రాక్ట్ లేబర్ నియంత్రణ, రద్దు చట్టం వచ్చింది. కానీ.. ఐదు దశాబ్దాలైనా పరిశ్రమల్లో అమలు కాలేదు. అంతర్–రాష్ట్ర వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భలంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం, ప్రయాణ చెల్లింపులు, వసతి, ఉచిత వైద్య సౌకర్యాలు వంటివి కాగితాలకే పరిమితమయ్యాయి. చెల్లింపులో లింగ అంతరం.. వేతనాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. జెండర్తో సంబంధం లేకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని 1976 సమాన వేతన చట్టం చెబుతున్నా... దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పులున్నా.. వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని రంగాలలో మహిళలు ఒకే పనికి పురుషుల కంటే తక్కువ సంపాదిస్తూనే ఉన్నారు. ఈ అంతరాలు పోవాలంటే.. విధానాలు, చట్టాల అమలులో కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అపరిమిత పని గంటలు.. దేశంలో జీడీపీ పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 17.9%, గ్రామీణ ప్రాంతాల్లో 13.7% ఉందని గణాంకాల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మే నెలలో తెలిపింది. కార్మికులకు 8 పని గంటలకోసం ఎన్ని ఉద్యమాలు జరిగాయో తెలిసిందే. అయినా.. ఇప్పటికీ అసంఘటిత, అనధికారిక రంగాల్లోని కార్మికులు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తారు. వీటికి అదనపు చెల్లింపులేమీ ఉండవు. చట్టం ప్రకారం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల పని గంటలను రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు పరిమితం చేస్తే ఎక్కువ మందికి ఉపాధిని కల్పించవచ్చు. పేదరికాన్ని తగ్గించాలంటే.. కనీస పెన్షన్ను పెంచాలంటున్నారు నిపుణులు. 2004లోనే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ దీనిని సిఫార్సు చేసింది. రెండు దశాబ్దాలు దాటినా.. పెన్షన్ రూ.1,000 దగ్గరే ఉంది. కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న సామాజిక పెన్షన్ రూ. 4,000 కంటే కూడా చాలా తక్కువ. ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్లు డిమాండ్ చేసినట్లుగా రూ. 7,000కి పెంచడం వల్ల లక్షలాది మంది జీవిత చరమాంకంలో గౌరవంగా జీవించగలుగుతారు. ఉపాధి హామీ పథకం పని రోజులను 150కి పెంచాలని, వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పనే చేయకుండా.. 12 ఏళ్లలో రూ.28 లక్షల జీతం
భోపాల్: ఓ కానిస్టేబుల్ 12 ఏళ్లపాటు ఎన్నడూ డ్యూటీ చేయకుండానే ఏకంగా రూ.28 లక్షల మేర వేతనం అందుకున్నాడు. వ్యవస్థ వైఫల్యం, యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ విడ్డూరం మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 2011లో ఓ వ్యక్తి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. భోపాల్ పోలీస్ లైన్స్లో పోస్టింగ్ సైతం ఇచ్చారు. కొన్ని రోజులకే ఆ బ్యాచ్లో మిగతా వారితో కలిపి అతడిని కూడా సాగర్ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్కు ప్రాథమిక శిక్షణ కోసం పంపించారు అధికారులు. ట్రెయినింగ్ సెంటర్కు వెళ్లకుండా, నేరుగా విదిశలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సెలవు కోరడం వంటివేమీ లేకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును పోస్టింగిచ్చిన భోపాల్ పోలీస్ లైన్స్ స్టేషన్కు పంపించాడు. వాటిని అందుకున్న అధికారులు అందులోని వివరాలను, అతడి హాజరీని, శిక్షణ స్టేటస్ను గురించిన వివరాలనుగానీ చూడనే లేదు. అది మొదలు అతడిని కొత్తగా రిక్రూటైన కానిస్టేబుల్గా పరిగణిస్తూ నెలనెలా ఠంచనుగా బ్యాంకు అకౌంట్లో వేతనం జమ చేస్తున్నారు. ట్రెయినింగ్ సెంటర్ అధికారులు గానీ, భోపాల్ పోలీస్ లైన్స్లో గానీ అతడిని ఎవరూ పట్టించుకోలేదు. ఇలా 12 ఏళ్లు గడిచాక 2023లో అసలు విషయం వెలుగు చూసింది. 2011వ బ్యాచ్ వారికి పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ సమయంలో అతడిని గురించి వాకబు చేయగా తామెన్నడూ చూడలేదని, ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదని చెప్పడంతో అవాక్కవడం అధికారుల వంతయింది. ఈ వ్యవహారంపై ఏసీపీ అంకితా ఖటెర్కర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ కానిస్టేబుల్కు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన అతగాడు తనకు మానసిక సమస్యలున్నాయని చెప్పాడు. ఇందుకు ఆధారాలను సమర్పించాడు. ప్రస్తుతం భోపాల్ పోలీస్ లైన్స్లోనే పనిచేస్తున్న ఇతడు రూ.1.5 లక్షలను తిరిగిచ్చేశాడు. మిగతా మొత్తాన్ని శాలరీ నుంచి ఇచ్చేందుకు అంగీకరించాడని ఏసీపీ అంకిత వివరించారు. -
‘గ్లోబల్ సౌత్’కు దారుణ అన్యాయం
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు. అవన్నీ నెట్వర్క్లేని ఫోన్లే ‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్సౌత్కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్కార్డు ఉన్నా నెట్వర్క్లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు ‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్డేట్ అవుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు. -
నేను మరాఠిలో మాట్లాడాలా.. ఇంగ్లిష్లోనా?: సీజేఐ
ముంబై: మహారాష్ట్రలో మరాఠీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో ఇప్పుడు ఆ భాష తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై సీజేఐ బీఆర్ గవాయ్ సరదాగా స్పందించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 6) ముంబైలోని తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్ను సందర్భించిన గవాయ్.. స్కూల్ పిల్లలతో సరదాగా గడిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడే క్రమంలో మరాఠీ భాషలో మాట్లాడాలా? లేక ఇంగ్లిష్లో మాట్లాడాలా? అనే సందిగ్ధత ఆయనకు కూడా ఏర్పడింది. ‘ఇప్పుడు నేను మరాఠీలో మాట్లాడాలా?, లేక ఇంగ్లిష్లోనా?’ అని అక్కడున్న టీచర్ను అడిగారు. మేడమ్ అయితే మరాఠిలో చక్కగా మాట్లాడారు. కానీ తాను మరాఠీలో మాట్లాడితే అంతా అర్థం చేసుకుంటారు కదూ..? అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారుదీని తరువాత సీజేఐ గవాయ్.. తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు. తాను మాతృభాషలో మాట్లాడటంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు .. ప్రశంసల సైతం అందుకున్నారు. గవాయ్ తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు, తన మాతృభాషలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అందరి దృష్టిని మరియు ప్రశంసలను పొందారు.మహారాష్ట్రలో మరాఠీ వాడకాన్ని అమలు చేయడం లేదా ప్రోత్సహించడం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యంగా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో కూడిన ఇటీవలి వివాదాల తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. తాను చదువుకున్న చికిత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలలోని తరగతి గదులను కూడా సందర్శించారు. ఇక్కడ తన పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు సీజేఐ. ఈ క్రమంలోనే మాతృభాషలో చదువుకోవడం వల్ల విషయం లోతైన అవగాహన ఏర్పడుతుందని, అది జీవితాంతం మనతో పాటే ఉండే అత్యంత అమూల్యమైనదిగా ఆయన అభివర్ణించారు. -
ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్?
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్లను భారత్కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్కు చెందిన ఆల్ జజీర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు. ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్!బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
పోంజీ స్కామ్.. ఫాల్కాన్ గ్రూఫ్ సీఈవో అరెస్ట్
బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి వేల కోట్ల పోంజీ స్కామ్కు పాల్పడిన సంస్థ సీఈవోని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ గ్రూప్ సీఈవో ఫాల్కన్ గ్రూప్ సీవోఓ ఆర్యన్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా పోలీసులు తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఫాల్కన్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐడీ చీఫ్ చారు సిన్హా తెలిపారు. ఫాల్కన్ గ్రూప్ అసలు పేరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం పేరిట దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించింది. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పి వేలకోట్లు వసూలు చేశారు. ఈ సంస్థ మోసం వెలుగులోకి రావడంతో ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్దీప్ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసి దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్ను ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.5 కోట్ల విలువైన కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇతర నిందితులు పవన్, కావ్య, రవికుమార్ తదితరులు పరారీలో ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు ఫాల్కన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ .. ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడుల పేరుతో డిపాజిట్లు స్వీకరించారు. మొత్తం 7,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బును 14 కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చారు. కొంతమందికి రూ.850 కోట్లు తిరిగి చెల్లించినా, ఇంకా అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కేసును తెలంగాణ సీఐడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్నాయి. -
కేరళలో బ్రిటిష్ ఎఫ్ 35 జెట్ ఎపిసోడ్.. మరో కీలక మలుపు
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది. బ్రిటన్కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.నిపుణుల బృందం.. ఆర్ఏఎఫ్ జెడ్ఎం 417 , ఏయిర్బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జెట్ను ఎయిర్పోర్ట్లోని ఒక ప్రత్యేక హ్యాంగర్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. -
'మరాఠీ మాట్లాడను, దమ్ముంటే మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లగొట్టండి'
మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్ షాప్ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండి అని సవాల్ విసిరారు భోజ్పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్ (Dinesh Lal Yadav). ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హమర్ నామ్ బా కన్హయ్య.చెత్త రాజకీయాలుఈ సినిమా ప్రమోషన్స్లో దినేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం.. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్ విసురుతున్నా.. నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి.నేర్చుకోకపోతే తప్పేం కాదునేను కూడా రాజకీయ నాయకుడినే.. పాలిటిక్స్ అనేవి.. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని దగా చేయడానికి కాదు. ఎవరికైనా పలు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష.. భోజ్పురి, తెలుగు, తమిళం, గుజరాతీ.. ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. అలాగే ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అంతేకానీ, ఫలానా భాష ఎందుకు నేర్చుకోలేదని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్ లాల్ యాదవ్ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్నారు.చదవండి: కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్ -
హిమాచల్లో 75 మరణాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, హిమాచల్లోని మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణాల వారి సంఖ్య 75కు చేరుకుంది. మరోవైపు.. పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది.హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి.Chamba, Himachal Pradesh: Heavy rain in Chamba district washed away the Kangela Nala bridge, cutting off a key route and disrupting local life. Authorities dispatched teams, plan alternative routes, and assured quick reconstruction to restore connectivity and ease difficulties… pic.twitter.com/IkQIjsmrMK— IANS (@ians_india) July 6, 2025రెడ్ అలర్ట్ జారీ..హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ విధించింది. అలాగే, రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పుర్, హమిర్పుర్, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. మరోవైపు.. సహాయక చర్యల్లో ఐటీబీపీ దళాలు పాల్గొంటున్నాయి. Himachal is in destruction again.Lives lost, homes destroyed, bridges collapsed.Pray for Himachal—and repost to urge the government to take immediate action. pic.twitter.com/DT8UAZpkba— Go Himachal (@GoHimachal_) July 4, 2025जिला ऊना के त्यूडी गांव में एक बारिश से पैदा हुए हालात।।खड्ड का रुख गांव की तरफ गांव जलमग्न।मानव निर्मित आपदा।#Una #himachalfloods #HimachalPradesh pic.twitter.com/MUbHPdDKcF— Gems of Himachal (@GemsHimachal) July 6, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
ముఠా నేత భార్యతో సభ్యుడు.. వెంటాడిన 40 మంది గ్యాంగ్స్టర్లు..
నాగపూర్: గ్యాంగ్స్టర్లు ప్రధాన పాత్రల్లో కనిపించే సినిమాను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది... గ్యాంగ్ నాయకుని భార్యతో అదే గ్యాంగ్లోని సభ్యుడు అఫైర్ నడిపితే.. ఆ విషయం గ్యాంగ్లోని అందరికీ తెలిస్తే.. ఇంతలో ఆ గ్యాంగ్ నాయకుని భార్య అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే... ఈ సీన్లన్నీ నిజంగా జరిగినవే.. మరి పర్యవసానం ఏమయ్యిందనే విషయానికొస్తే..మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇప్పా గ్యాంగ్లోని 40 మంది సభ్యులు నగరంతో పాటు, కాంప్టీ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ, తమ గ్యాంగులోని సభ్యుడైన అర్షద్ టోపీని అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. తమ గ్యాంగ్ లీడర్ భార్య మరణించాక.. వారంతా అర్షద్ టోపీని వెదుకుతున్నారు. అర్షద్ టోపీ ఆ పేరుమోసిన ముఠా నాయకుని భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరూ ఒక బైక్ వెళుతుండగా, ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ విషయం ముఠాలోని సభ్యులందరికీ తెలిసింది. గురువారం అర్షద్ టోపీ ఆ మహిళతో బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నాగ్పూర్ సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్పై ప్రయాణిస్తుండగా, వారి వాహనం జేసీబీని ఢీకొంది. అర్షద్ టోపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. కోరాడి థర్మల్ ప్లాంట్కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో, ఆమెను కాంప్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించారు.ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ వార్త తెలియగానే ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ముఠా నాయకుని భార్యను అర్షద్ టోపీని హత్య చేసివుండవచ్చని ఇప్పా గ్యాంగ్ సభ్యులు భావిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన అర్షద్ టోపీ పార్డిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్లాడు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్పీ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆ మహిళ ప్రమాదంలో మరణించిందా? లేక హత్యకు గురైందా అనేదానిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.ఇది కూడా చదవండి: ‘దళితులంటే అంత చులకనా? ‘జగద్గురువు’పై శశి థరూర్ విశ్లేషణ -
కేంద్రానికి సుప్రీం కోర్టు లేఖ.. చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయించాలంటూ..
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఆయన అధికారిక నివాసాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కోరుతూ లేఖలో పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. దీంతో, సదరు లేఖపై చంద్రచూడ్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. కాగా, ఈ బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఈ క్రమంలో.. బంగ్లాను జస్టిస్ డీవై చంద్రచూడ్ నుంచి ఆలస్యం చేయకుండా స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం. ఆయన పదవీ విరమణ అనంతరం బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా ఆరు నెలలు అవుతోంది అని సుప్రీంకోర్టు.. హౌసింగ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) శాఖ కార్యదర్శికి రాసిన లేఖ రాసింది.ఇక, సుప్రీంకోర్టు రాసిన లేఖపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ..‘కొన్ని వ్యక్తిగత అవసరాల కారణంగా ఆలస్యమైందన్నారు. త్వరలోనే బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తానన్నారు. కొన్ని పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందన్నారు. అలాగే, తుగ్లక్ రోడ్లోని బంగ్లా నంబర్ 14ను ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయ వసతిగా ఇప్పటికే కేటాయించినప్పటికీ.. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా అందులోకి మారలేదని వెల్లడించారు.భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు సేవలందించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 10న చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు. దీంతో, అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరూ కూడా అధికారిక నివాసంలోకి మారలేదు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు లేఖ రాసినట్టు తెలుస్తోంది. -
‘దళితులంటే అంత చులకనా? ‘జగద్గురువు’పై శశి థరూర్ విశ్లేషణ
‘చెప్పే మనిషి.. వినే టైమ్ను బట్టి విషయం విలువే మారిపోతుంది’.. ఈ డైలాగ్ ఒక సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినది. దీని అర్థాన్ని విశదీకరిస్తే.. ఏదైనా విషయాన్ని చెప్పే మనిషికున్న విలువకు.. అదే విషయాన్ని వివరించే కాలానికి అనుగుణంగా దాని అర్థం మారిపోతుందని.. అంటే ఒకే విషయం వివిధ సందర్భాలలో, అప్పుడున్న కాలానికి అనుగుణంగా అర్థం అవుతుందని.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ‘ఆది శంకరాచార్యులు’ గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుకువస్తుంది.‘జగద్గురువు’ ఆది శంకరాచార్యులు దళితుల విషయంలో ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని ఎంపీ శశిథరూర్ ఒక వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు. ఆది శంకరాచార్యులు 10వ శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుద్ధరించిన మహనీయుడని శశిథరూర్ తొలుత పేర్కొన్నారు. ఒకరోజు ఆది శంకారాచార్యులు ఒక ఇరుకైన నది దాటుతున్నప్పుడు ఆయనకు ఒక ఛండాలుడు(దళితుడు) అడ్డుగా వస్తాడు. వెంటనే శంకరాచార్యులు అతనని అడ్డు తొలగాలని ఆజ్ఞాపిస్తారు. తాను మహనీయుడననే ఉద్దేశంతో శంకరాచార్యుడు ఆ విధంగా ఆదేశిస్తారు. The more I hear him the more I like him. pic.twitter.com/3l2S8QQpMj— दीपक प्रभु (@ragiiing_bull) July 5, 2025అయితే ఆ ఛండాలుడు కదలకుండా అక్కడే నిలుచుని శంకరాచార్యులను ఇలా ప్రశ్నిస్తాడు. ‘మీరు నా శరీరాన్ని తొలగిపొమ్మంటున్నారా లేదా ఆత్మను తొలగిపొమ్మంటున్నారా? అని అంటూ.. మన ఇద్దరి ఆత్మ ఒక్కటే కదా?" అని అడుగుతాడు. ఈ ప్రశ్న శంకరాచార్యులను తీవ్ర ఆలోచనకు గురిచేస్తుంది. అనంతరం ఆయన ఆత్మ సమానత్వంపై అంగీకారం తెలియజేస్తారు. ఆత్మ స్థాయిలో అందరూ సమానమేనని, దళితుడు కూడా అందరితో సమానమేనని ఆది శంకరాచార్యులు గుర్తిస్తారు. వెంటనే శంకరాచార్యులు ఆ దళితుడి పాదాలకు ప్రణమిల్లుతూ.. నా బోధనలను నా శిష్యుల కంటే మీరు చక్కగా అర్థం చేసుకున్నారని ప్రశంసిస్తారు. ఈ సంఘటనను చెప్పిన శశిథరూర్ అన్ని జీవరాశులు ఒకే ఆత్మలోని భాగాలేనని, ఇవన్నీ బ్రహ్మలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. జన్మ ఆధారంగా వివక్షకు తావులేదని శశిథరూర్ స్పష్టం చేశారు. శశి థరూర్.. శంకరాచార్యులు జీవించిన కాలంలోని సామాజిక సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ కాలంలో కుల వ్యవస్థ బలంగా ఉండేదని, వాటి సంస్కరణల కోసం ఆయన చర్యలు తీసుకోలేదని, ఆయన దృష్టి ప్రధానంగా ఆధ్యాత్మిక, తాత్త్విక బోధనలపైనే ఉందన్నారు. ఆయన తాత్త్వికంగా సమానత్వాన్ని బోధించినప్పటికీ, సామాజిక ఆచారాలకు కొంతవరకు కట్టుబడి వ్యవహరించారని శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
ముగ్గురు పిల్లల తల్లి.. యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహితతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరుజిల్లా ఆర్కేపేట ఎస్వీజీపురం ప్రాంతానికి చెందిన కౌసల్య(35)కు వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం గ్రామానికి చెందిన పద్విన్తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగించాడు. ఈ క్రమంలోనే గత నెల 10 తేదీన పద్విన్ సెల్ఫోన్ను కౌసల్య పరిశీలించగా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించడంతో షాక్కు గురైంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించాడు. పోలీసులకు వెళితే హత్య చేస్తామని బెదిరించాడు. దీంతో కౌసల్య ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్స్పెక్టర్ జ్ఞానశేఖరన్, ఎస్ఐ రాకీకుమారి విచారణ చేపట్టారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆర్కేపేట పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితురాలు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్కు న్యాయవాదులతో కలిసి ఫిర్యాదు చేసింది. ప్రిది్వన్తోపాటు అతడి పిన్ని ఉమ, బంధువు పయణి, స్నేహితుడు అయ్యప్పన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వివరించింది. అలాగే మానవహక్కుల సంఘం, మహిళ కమిషన్, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి సైతం ఫిర్యాదు చేసినట్టు న్యాయవాదులు తెలిపారు. కాగా కౌసల్య ఫిర్యాదుపై అడిషనల్ ఎస్పీ హరికుమార్ విచారణ జరిపారు. కాగా ఆర్కేపేట పోలీసులు ఈ విషయమై వివరణ ఇస్తూ కౌసల్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, అయితే ప్రిది్వన్ సెల్ఫోన్ను స్వాదీనం చేసుకుని వీడియోలు, ఫొటోలను ల్యాబ్కు పంపి నిగ్గుతేలుస్తామన్నారు. ఇది ఇలా వుండగా పద్విన్కు ఇటీవల పెళ్లి చూపులు చూడడంతో కౌసల్యకు దూరం అయినట్టు తెలుస్తుంది. తనతోపాటు కలిసి జీవించాలని కౌలస్య కోరడం, అందుకు ప్రిది్వన్ నిరాకరించడంతోనే వివాదం మొదలైందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. -
Bihar: పోల్ బాడీ కీలక నిర్ణయం.. ప్రతిపక్షాలకు ఉపశమనం
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ‘పోల్ బాడీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల సమయమే ఉన్న ప్రస్తుత తరుణంలో అధికార ప్రభుత్వం ఓటర్ల జాబితాను తీర్చిదిద్దడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో ఎన్నికల సంఘానికి చెందిన పోల్ బాడీ ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గింది.రాష్ట్రంలో ఓటరు నమోదుకు తప్పనిసరిగా పేర్కొన్న పత్రాలను సమర్పించకపోయినా, స్థానిక దర్యాప్తు ఆధారంగా కూడా వారి ధృవీకరణపై నిర్ణయం తీసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న ఓటరు జాబితాలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రతిపక్షం గగ్గోలు పెట్టిన తరుణంలో ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పత్రాలను సమర్పించకుండానే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్లు ఓటర్ల జాబితాలో ధృవీకరణ పొందవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. పత్రాలు లేనిపక్షంలో స్థానిక స్థాయిలో దర్యాప్తు ఆధారంగా ఎలక్టోరల్ రిజిస్ట్రార్ అధికారి ధృవీకరణ చేయనున్నారు.బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ ప్రక్రియ బీజేపీ గెలిచేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించాయి. అయితే దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఒక సూచన చేస్తూ.. అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, గణన ఫారమ్ను పూరించి బూత్ స్థాయి అధికారికి అందించాలని పేర్కొంది. వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారితో మాట్లాడి, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇతర పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీహార్లో ఇప్పటివరకు 1.21 కోట్ల మంది ఓటర్లు గణన ఫారాలను నింపి సమర్పించారు. జూలై 25 నాటికి ఈ ఫారమ్లను సమర్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో భాగం అవుతారని పోల్ బాడీ పేర్కొంది.ఇది కూడా చదవండి: అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే.. -
సంపద కొందరి వద్దే.. పేదల సంగతేంటి?: గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటిది జరగరాదంటే సంపద వికేంద్రీకృతం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పారు.నాగ్పూర్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి గడ్కరీ వివిధ సామాజిక అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారేగాని, సంపద కేంద్రీకరణను ఆపే చర్యలను మాత్రం తీసుకోలేదని గడ్కరీ తెలిపారు. జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 22–24 శాతం, సేవా రంగం 52–54 శాతం వాటా కాగా, గ్రామీణ జనాభాలోని 65–70 శాతం మంది పాల్గొనే వ్యవసాయ రంగం వాటా కేవలం 12 శాతం మాత్రమేనని ఆయన వివరించారు.ఈ అసమతుల్యతను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ఆర్థిక రంగానికి చార్టెర్డ్ అకౌంటెంట్ల అవసరం ఎంతో ఉందని, వారు చోదకశక్తుల వంటివారని అభివర్ణించారు. రోడ్ల నిర్మాణం కోసం బీవోటీ(బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్)విధానాన్ని అమల్లోకి తెచ్చిన వారిలో తానూ ఉన్నానంటూ గడ్కరీ..ఇప్పుడిక రోడ్ల అభివృద్ధికి నిధుల కొరతనేదే లేదని వివరించారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల నుంచి ఏడాదికి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే రెండేళ్లలో ఇది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందన్నారు. -
‘సమానత’లో భారత్ ఘనత
న్యూఢిల్లీ: 2011–12 కాలం నుంచి చూస్తే 2022–23 నాటికి భారత్లో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ కీర్తించింది. అత్యంత పేదరికం స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్లో 2011–12 కాలంలో 16.2 శాతంగా ఉన్న ‘అత్యంత పేదరికం’.. 2022–23 ఏడాదికల్లా ఏకంగా 2.3 శాతానికి తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో భారత్లో చేపట్టిన పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా ఇంతటి మార్పు సాధ్యమైందని నివేదిక వ్యాఖ్యానించింది. సమానత్వం విషయంలో స్లోవాక్ రిపబ్లిక్(24.1), స్లోవేనియా(24.3), బెలారస్ (24.4)దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గినీ ఇండెక్స్ స్కోర్లో చైనా, అమెరికా, బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 25.5 స్కోర్తో భారత్ ప్రపంచంలో నాలుగో అత్యుత్తమ సమానత్వ దేశంగా ఆవిర్భవించిందని ప్రపంచబ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణీ అవుతోందన్న దానిని పరిగణనలోకి సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్ స్కోర్ను ఇస్తారు. ఇండెక్స్ స్కోర్గా సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. 98 స్కోర్ వస్తే దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు కడు పేదరికంలో ఉన్నట్లు అర్థం. 167 దేశాల స్కోర్లను ప్రపంచబ్యాంక్ ప్రకటించగా చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. 25.5 స్కోర్తో భారత్ అసమానత కేటగిరీ(25–30)లో దిగువ స్థాయిలో నిలిచింది. నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు కోరల నుంచి బయటపడ్డారు. తక్కువ అసమానతల కేటగిరీలో దాదాపు 30 దేశాలున్నాయి. ఇందులో పటిష్టమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న కొన్ని యురోపియన్ దేశాలు సైతం ఉన్నాయి. వీటిలో ఐస్ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియంలతోపాటు అభివృద్దిచెందుతున్న దేశం పోలండ్, సంపన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. -
ఆ ప్రబుద్ధుడిపై కోర్టు ధిక్కరణ చర్యలు!
అహ్మదాబాద్: ఇంట్లో టాయిలెట్ సీటుపై కూర్చొని న్యాయస్థానంలో జరిగిన విచారణకు వర్చువల్గా హాజరైన వ్యక్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ ఆరోపణల కింద ఆ ప్రబుద్ధుడిపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. జూన్ 20వ తేదీన కోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్.దేశాయ్ ఓ కేసులో విచారణ చేపట్టారు. ఇందులో కక్షిదారుగా ఉన్న ఓ వ్యక్తి పసుపు రంగు టి–షర్టు ధరించి ఇంటి నుంచే వర్చువల్గా హాజరయ్యాడు. కానీ, టాయిలెట్ సీటుపై కూర్చొని మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తిని సూరత్ జిల్లాలోని కిమ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమద్గా గుర్తించారు. అతడి ప్రవర్తనపై జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్టీ వచానీతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. వీడియోలో అభ్యంతరకరంగా కనిపించిన అబ్దుల్ సమద్పై సుమోటోగా విచారణ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు విచారణ జరిపి శిక్షించకూడదో ప్రశి్నస్తూ అతడికి నోటీసు జారీ చేయాలని పేర్కొంది. ఈ ఉత్తర్వును తాజాగా హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అబ్దుల్ సమద్ ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. సంబంధిత వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టంచేసింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి లాయర్లు, కక్షిదారులు వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు గుజరాత్ హైకోర్టు అనుమతి ఇస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో జరిగే విచారణను కోర్టు యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. -
బిహార్ యువతపై ఎన్నికల గాలం..!
సాక్షి, న్యూఢిల్లీ: మరో మూడు, నాలుగు నెలల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారారు. దీంతో, వానిపి ఆకట్టుకునేందుకు అధికార జేడీయూతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్లు పోటీ పడుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో వారికి గాలం వేసేందుకు తాపత్రయపడుతున్నాయి. కోటిన్నర మందికి పైగా ఉన్న యువ ఓటర్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు కొన్ని సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ప్రభుత్వం యువతకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. యువతపై హామీల వాన బిహార్లో ఉన్న 243 నియోజకవర్గాలు, 8 కోట్ల ఓటర్లలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంది. కొత్తగా నమోదైన ఓటర్లే 18 లక్షల వరకు ఉన్నారు. 18–35 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్ల సంఖ్య మొత్తం 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వయస్సు వారిలో 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్బంధన్కు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ వైపు కేవలం 0.76 శాతం మంది మాత్రమే అనుకూలంగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ తన పోటీదారుల కంటే బలమైన ఆధిక్యంలో ఉన్నారు. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ.4.000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ.5,000, ఇంటర్న్షిప్లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటే 2025–26 నుంచి 2030–31 వరకు రాష్ట్రంలోని లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్షిప్లు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకే ఏటా రూ.685 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అదనంగా యువతకు అధునాతన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి, నాయకత్వ అభివృద్ధి, బలమైన నెట్వర్కింగ్, కెరీర్ మెరుగుదలకు కొత్త అవకాశాలను అందించేందుకు అనేక పథకాలను ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వితంతువులు, వృద్ధాప్య పింఛన్ను రూ.400 నుంచి రూ.1,100కు పెంచారు. దీనిని ఎదుర్కొని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్జేడీ నేత తేజస్వీయాదÐవ్ ‘ఛత్ర యువ సంసద్’కార్యక్రమాలతో యువత మధ్యకు వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే యువజన కమిషన్ను ఏర్పాటు చేస్తామని, పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను అందిస్తామని ప్రకటించారు. సైన్స్, గణితం, ఇంగ్లిష్లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల కీలక ¯óతలు యువతను ఆకట్టుకునే ఏర్పాట్లలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు సైతం యువ ఓటర్లకు గాలం వేసేందుకు తన ప్రయత్నాలను మొదలుపెట్టాయి. -
మరో 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నా
ధర్మశాల: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటిస్తారన్న వార్తలకు చెక్పెడుతూ దలైలామా శనివారం తన మనసులో మాట వెల్లడించారు. మరో 30–40 ఏళ్లు జీవించాలనే ఆశ ఉందని, తుదిశ్వాస వరకు బుద్ధుని బోధనలను శక్తివంచలేకుండా వ్యాప్తి చెందిస్తానని ఆయన ప్రకటించారు. జీవించి ఉన్నంతకాలం తానే లామాగా కొనసాగుతానని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆదివారం తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోని సుగ్లాగ్ఖాంగ్ ఆలయంలో దలైలామా ఆయుష్ష బాగుండాలంటూ శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శక్తిస్వరూపిణిగా పేర్కొనే ‘ఒరాకిల్’.. దలైలామా చెంతకొచ్చి ఆయనను ఆశీర్వదించింది. ఒరాకిల్ ఆవాహనను ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మీడియాతో మాట్లాడారు. ‘‘కాలజ్ఞానం నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తోంది. నాపై అవలోకితేశ్వర ఆశీస్సులు కురుస్తున్నట్లు తోస్తోంది. ఇప్పటికే నా శాయశక్తులా కృషిచేశా. ఇలా బుద్దుని బోధనలను వ్యాప్తి చెందించేందుకు నేను మరో 30–40 సంవత్సరాలు జీవించాలని ఆశ పడుతున్నా. నాపై అవలోకితేశ్వర ప్రభావం చిన్నతనం నుంచే ఉంది. బౌద్ధధర్మాన్ని మరికొంత కాలం ప్రపంచానికి చాటిచెబుతా. అందులోభాగంగానే 130 ఏళ్లు వచ్చేవరకు జీవిస్తాననే భావిస్తున్నా’’అని అన్నారు. -
ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి!
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ను నిర్వహించాలనుకున్న భారత్ ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లుచల్లింది. ఈ విషయంలో భారత్కు ‘కనువిప్పు’ కలిగే రీతిలో సుతిమెత్తగా మందలించింది. ముందు మీ ‘ఇంటి’ని చక్కదిద్దుకోవాలంటూ చురకలంటించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సంస్థాగత పాలనా వైఫల్యాలు, లోపాలు, అవినీతి తాండవిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని సరిదిద్దుకోవాలంటూ హితవు పలికింది. అలాగే ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలు, డోపింగ్లో వారు పట్టుబడుతున్న వ్యవహారాలపైనా దృష్టిసారించాలని సూచించింది. స్విట్జర్లాండ్లోని లుసానేలో ఇటీవల నిర్వహించిన సమావేశానికి హాజరైన గుజరాత్ హోం, క్రీడల మంత్రి హర్‡్ష సంఘ్వీ, ఒకప్పటి భారత పరుగుల రాణి, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందానికి ఐఓసీ తేలి్చచెప్పింది. ఐఓసీతో చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతోపాటు పలు ఆంగ్ల వార్తా వెబ్సైట్లు ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. అయితే భవిష్యత్తులో విశ్వక్రీడల నిర్వహణ కోసం భారత్ తన ప్రయత్నాలను కొనసాగించొచ్చని ఐఓసీ సూచించింది. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో భారత్ రూ. 470 కోట్ల ఖర్చుచేసి 117 మంది క్రీడాకారులను పంపినప్పటికీ మనకు కేవలం 6 పతకాలే లభించాయి. దీనికితోడు స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఐఓఏకు అందించే గ్రాంట్లను ఐఓసీ గతేడాది అక్టోబర్ నుంచి నిలిపేసింది. మరోవైపు ఐఓఏ సీఈవోగా రఘురాం అయ్యర్ నియామకంపై అంతర్గతంగా కుమ్ములాటలు నెలకొన్నాయి. కాగా, ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2023 నాటి గణాంకాల ప్రకారం డోపింగ్ కేసుల్లో అత్యధికం భారత్వే. అర్హతలు ఉన్నా ఇవేం వ్యాఖ్యలు.. భారత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఐవోసీ కావాలనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తోందని భారత ప్రతినిధి బృందం వ్యాఖ్యానిస్తోంది. భారత్లో వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నారని.. వారంతా ప్రతిభావంతులేనని స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ కమిటీ దృష్టికి ఐవోఏ తీసికెళ్లినట్లు తెలిసింది. మరోసారి జరిగే సమావేశంలో ఈ అంశంపై తాము చర్చిస్తామని భారత కమిటీ పేర్కొంది. -
పటౌడీ కుటుంబానికి షాక్
జబల్పూర్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్తోపాటు ఆయన కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులకు వారసులు ఎవరన్నదానిపై మళ్లీ విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ ఆస్తులు పటౌడీ కుటుంబానికి (సైఫ్ అలీఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా అలీఖాన్, సబా అలీఖాన్) చెందుతాయంటూ 20 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, డిక్రీని హైకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ ద్వివేదితో కూడిన సింగిల్ బెంచ్ జూన్ 30న ఉత్తర్వు జారీ చేసింది. రూ.15,000 కోట్ల ఆస్తులకు వారసులు ఎవరో గుర్తించడానికి మళ్లీ విచారణ జరపాల్సిందేనని ట్రయల్ కోర్టుకు స్పష్టంచేసింది. అసలు ఏమిటీ వివాదం? భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా. ఆయనకు భార్య మైమూనా సుల్తాన్, ముగ్గురు కుమార్తెలు అబీదా, సాజీదా, రబియా ఉన్నారు. సాజీదా పటౌడీ సంస్థాన వారసుడు ఇఫ్తికార్ అలీఖాన్ను పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన క్రికెటర్గా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ను ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సబా అలీఖాన్ జని్మంచారు. నవాబ్ హమీదుల్లా పెద్ద కుమార్తె అబీదా దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. దాంతో సాజీదా భోపాల్లోని ఆస్తులకు వారసురాలయ్యారు. అనంతరం మన్సూర్ అలీఖాన్కు.. సైఫ్ అలీఖాన్, ఆయన సోదరీమణులకు ఆ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. దివంగత నవాబ్ హమీదుల్లా కుటుంబ సభ్యులైన బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు 1999లో కోర్టుకెక్కారు. ఆస్తుల్లో తమకు వాటా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిని భోపాల్ జిల్లా కోర్టు తిరస్కరించింది. ఆస్తులకు పటౌడీ కుటుంబమే యజమాని అంటూ 2000 ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నవాబ్ హమీదుల్లా వారసురాలిగా సాజీదాను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1962 జనవరి 10 సరి్టఫికెట్ జారీ చేసిందని, ఆ ఆస్తులన్నీ తమకే చెందుతాయని పటౌడీ కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. ఈ వాదనను పిటిషనర్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు ప్రాథమికంగా 1999లో దాఖలయ్యాయి కాబట్టి మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. -
శుభాంశు బిజీబిజీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్ఎస్లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు. నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్బేర్ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది. శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్ఎస్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు. -
వైవిధ్యమైన వాణిజ్యం
బ్యూనస్ ఎయిర్స్: తమ ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ నిర్ణయించుకున్నారు. అలాగే రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారు. మోదీ, జేవియర్ మిల్లీ శనివారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకొనేలా రెండు దేశాల నడుమ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రెండు దేశాల వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని మోదీ, జేవియర్ మిల్లీ తీర్మానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అర్జెంటీనాకు చేరుకున్నారు. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటిసారి. జేవియర్ మిల్లీతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యవసాయం, రక్షణ, ఇంధనంతోపాటు పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించామని తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, క్రీడలు తదితర రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేవియర్తో మిల్లీతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. భారత్–అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరుదేశాల ఉమ్మడి ప్రయాణం మరింత అర్థవంతంగా, ప్రగతిశీలకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు అంగీకరించారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అధికారులతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మారి్టన్ స్మారకం వద్ద మోదీ నివాళులరి్పంచారు. భారత్–అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా చక్కటి మైత్రి కొనసాగుతోంది. 2019లో అప్పటి అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రీ ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖణిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. -
ఒంటె కన్నీటి చుక్క విషానికి విరుగుడు!
బికనీర్: లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. దానిని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కల్గుతుంది. పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరికీ రక్షణగా సైతం నిలుస్తాయని తాజా అధ్యయనమొకటి గట్టిగా నమ్ముతోంది. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందని ఒక పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది. ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లే»ొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్లు చెబుతున్నారు. బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసంచేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు. ఎలా కనిపెట్టారు? ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనంచేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాముకాటు విరుగుడు తయారుచేస్తారు. అలా తయారుచేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటిలో యాంటీబాడీ పాళ్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రపంచస్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్, బికనీర్లో జరిగిన స్థాయిలో అన్నిచోట్లా పరిశోధనలు సత్ఫలితాలనిస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. భారత్లో ఏటా వేలాది మంది పాముకాటు కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే. -
ఖరీదైనవే కొంటున్నారు..
భారతదేశంలో ‘మాస్–మార్కెట్’ అన్నది క్రమంగా ‘పాష్–మార్కెట్’గా మారుతోంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు వినియోగదారులు ‘ఉన్నంతలోనే’ సరిపెట్టుకోవటం లేదు. ఖరీదైనవాటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఖరీదైన కార్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే పెరగడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్2025 జనవరి – ఏప్రిల్ మధ్య మొత్తం స్థూల అమ్మకాల్లో ఖరీదైన టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కన్జ్యూమర్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘నీల్సన్ఐక్యూ’ వెల్లడించింది. 2025 తొలి నాలుగు నెలల్లో 55 అంగుళాల 4కె రిజల్యూషన్ టీవీల అమ్మకాలు.. మొత్తం టీవీల మార్కెట్ అమ్మకాలలో 41 శాతం. గత ఏడాది ఇదే కాలానికి ఇది 38 శాతం. అలాగే 8 కిలోలు, ఆపై సామర్థ్యం గల ఫ్రంట్–లోడింగ్ వాషింగ్ మెషీన్ల అమ్మకాలు 11 నుండి 16 శాతానికి, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 9 శాతం 10 శాతానికి పెరిగాయని ‘నీల్సన్ ఐక్యూ’ తెలిపింది. ఫోనంటే అల్ట్రా ప్రీమియమే! ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ సంస్థ డేటా ప్రకారం స్మార్ట్ఫోన్ లలో ఈ ఏడాది జనవరి–మే మధ్యకాలంలో రూ.45,000కుపైగా ధర ఉన్న అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో 20 శాతం, రూ. 30,000కుపైగా ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్లో 2 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధోరణి అన్ని రకాల ఉత్పత్తుల సగటు అమ్మకపు ధర (ఎ.ఎస్.పి.) పెరగటానికి దోహదపడింది. స్మార్ట్ఫోన్ లలో ఈ ఎ.ఎస్.పి. ఈ ఏడాదిలో మొదటిసారిగా రూ.26 వేలకు చేరుకుంది. గతేడాది ఇది రూ.25వేలు. ధర తక్కువ కార్ల స్పీడు తగ్గిందిమరోవైపు – దిగువ, మధ్య ఆదాయ తరగతుల వారు.. తమ వేతనాల్లో తక్కువ పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా ఎంట్రీ–టు–మిడ్ సెగ్మెంట్ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవటంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎలక్ట్రానిక్స్, కార్ల మార్కెట్లలో అమ్మకాలు స్పల్పంగా తగ్గాయి. ఫలితంగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు జనవరి–మే కాలంలో.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 51.4 శాతానికి పడిపోయాయని ‘జాటో డైనమిక్స్’ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2024 మొదటి 5 నెలల్లో ఇది 53.4 శాతం.పుంజుకోనున్న అమ్మకాలు» ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటం, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రేట్లు తగ్గటం వంటి కారణాల వల్ల రాబోయే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటాయని మార్కెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. » అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ ఉన్న హై–ఎండ్ కార్ల అమ్మకాల వాటా 2023లో 2.8 శాతంగా ఉండగా, 2024లో ఐదింతలు పెరిగి 15 శాతానికి చేరుకుంది.» రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు 2020తో పోలిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు రెండింతలయ్యాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో 2020లో ఇవి 25 శాతమే. 2024లో 47 శాతానికి పెరిగాయి.» ఈ ఏడాది కార్ల మార్కెట్ స్వల్పంగా తగ్గటంతో పాటు, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు క్షీణతను చవి చూడటంతో మొత్తంగా ఎలక్ట్రానిక్ అమ్మకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. అయితే అదే సమయంలో కన్సూ్యమర్ ఫైనాన్స్ వచ్చి, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. -
సుప్రీంలో ఓబీసీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) సైతం రిజర్వేషన్లు కల్పించింది. సుప్రీంకోర్టులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాగే దివ్యాంగులు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన వారికి సైతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇందుకోసం సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్(కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ కాండక్ట్) రూల్స్లో సవరణ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేశారు. రిజర్వేషన్లు కల్పించే విషయలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 146 క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఆయన ఉపయోగించుకున్నారు. -
ఒకే గోడ.. 4 లీటర్ల పెయింట్.. 233 మంది కార్మికులు
భోపాల్: దేశంలో రకరకాలుగా అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతటి విడ్డూరాన్ని ఎన్నడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. మధ్యప్రదేశ్లోని షహ్డోల్ జిల్లాలో వెలుగుచూసిందీ అంకెల గారడీ. బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల రంగు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలు, 65 మంది తాపీ పనివారిని వినియోగించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ రూ.1.07 లక్షల బిల్లు చేశాడు. ఎలాంటి పరిశీలనలు లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, నగదు డ్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇలాంటిదే మరోటి..నిపనియా గ్రామంలోని స్కూలుకు 10 కిటికీలు, నాలుగు తలుపులకు 20 లీటర్ల రంగు వేసేందుకు 275 మంది కార్మీకులను, 150 మంది తాపీ పనివారిని పెట్టుకున్నారట. వీరికోసం కాంట్రాక్టర్ రూ.2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఓకే చెప్పేశారు. స్కూలు భవనం గోడలపై కనిపించాల్సిన వీరి పనితనం..ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాటుదేలింది. సుధాకర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలాంటి కాకి లెక్కలు చూపి మే 5వ తేదీన బిల్లు చేసింది. ఈ బిల్లును ఏప్రిల్ 4వ తేదీనే స్కూలు ప్రిన్సిపాల్ ఓకే చేసినట్లు రికార్డుల్లో ఉంది. రంగు వేయడానికి ముందు, తర్వాత ఫొటోలను బిల్లులకు జత చేయడం తప్పనిసరి. ఏ ఫొటోలు లేకుండానే ఈ కంపెనీకి బిల్లులు మంజూరైపోవడం మరో ఘనత. బిల్లుల వ్యవహారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పంచి స్పందిస్తూ... సకండి, నిపనియా స్కూళ్లకు వేసిన రంగుల బిల్లు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలుతీసుకుంటాం’అంటూ ముక్తసరిగా చెప్పేయడం విశేషం. -
బీఐఎస్ గుర్తింపు లేని హెల్మెట్లు వాడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో వాహనదారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం బీఐఎస్ గుర్తింపు గల ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు మాత్రమే వాడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. నాణ్యతలేని హెల్మెట్లు ప్రమాదాల సమయంలోరక్షణ కలి్పంచలేకపోవటంతో ప్రాణనష్టం పెరుగుతోందని తెలిపింది. దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య ఇప్పటికే 21 కోట్లకు పైగా ఉంది. ఈ వాహనదారుల భద్రతకు నాణ్యమైన హెల్మెట్లు కీలకం. అందుకే 2021 నుంచే బీఐఎస్ ప్రమాణం ఐఎస్ 4151:2015 కింద ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసింది. అయితే, రహదారుల పక్కన, స్థానిక మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 176 మందికే లైసెన్సులు హెల్మెట్ల నాణ్యత విషయంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠినంగా వ్వహరిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీఐఎస్ 30కి పైగా సెర్చ్ అండ్ సీజ్ దాడులు నిర్వహించింది. ఒక్క ఢిల్లీ నగరంలోనే లైసెన్స్ లేకుండా నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న 9 మంది తయారీదారుల నుంచి 2,500లకు పైగా హెల్మెట్లు స్వా«దీనం చేసుకుంది. 17 రిటైల్, రోడ్సైడ్ దుకాణాల్లో సుమారు 500 నాణ్యత లేని హెల్మెట్లు సీజ్ చేశారు. ప్రస్తుతం దేశంలో 176 మంది తయారీదారులకు మాత్రమే బీఐఎస్ నుంచి హెల్మెట్ల తయారీకి లైసెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జిల్లాధికారులు, కలెక్టర్లు హెల్మెట్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే చెన్నైలో ‘మానక్ మిత్ర’వలంటీర్ల ద్వారా ‘క్వాలిటీ కనెక్ట్’క్యాంపెయిన్ నిర్వహించి వినియోగదారులకు బీఐఎస్ గుర్తింపుపై ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్.. కట్ చేస్తే కటకటాల్లోకి!
రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్ యంగ్ ఆఫీసర్ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుని సంబురపడిపోయేది. కట్ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్ గ్రూప్లలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
పుష్ప సినిమా నేనూ చూశా.. గడ్డం ఉంటే డైలాగూ కొట్టేవాడిని!
శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ముంబై వేదికగా జరిగిన శివసేన-ఎంఎన్ఎస్ కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్ఫ సినిమాలోని డైలాగులను ఆయన తన ప్రసంగంలో రిఫరెన్స్లుగా వాడారు.ముంబై: సుమారు 20 ఏళ్ల తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్థాక్రేతో కలిసి రాజకీయ వేదిక పంచుకున్న ఉద్దవ్ థాక్రే.. భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ముంబైలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. రాజ్ అద్భుతంగా మాట్లాడాడు. ఇంక నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటున్న. ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. మా మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఇక్కడికి వచ్చాం. అధికారం రావొచ్చు.. పోవొచ్చు. కానీ, కలిసి ఉంటేనే బలం అని చాటి చెప్పడానికి వచ్చాం. ఒక్కటి కలిసి ఉండేందుకు మేం ఒక్కటయ్యాం. ఇక మీదట కలిసి కట్టుగా ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర బడులలో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టనివ్వబోం’’ అని ఉద్దవ్ అన్నారు.పుష్ప సినిమా నేనూ చూశా. నాకు కూడా అందులో హీరోలా గడ్డం ఉండి ఉంటే.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టేవాడిని అని ఉద్ధవ్ ఉన్నారు. దీంతో అక్కడున్న ఇరుపార్టీల కార్యకర్తలు విజిల్స్ వేశారు. మరాఠీ భాషను రక్షించేందుకు తామిద్దరం ఐక్యమైనట్లు ప్రకటించిన ఉద్దవ్.. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు.పుష్ఫ సినిమాలో హీరో తగ్గేదేలే అన్నాడు. కానీ, ఇక్కడి ఓ ద్రోహి(ఏకనాథ్ షిండేను పరోక్షంగా ఉద్దేశించి) మాత్రం ‘దమ్ము ధైర్యం ఏమాత్రం లే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ ద్రోహికి సొంత ఆలోచనలు లేవు. కేవలం తన బాస్ వచ్చాడు కాబట్టి ఆయన్ని మెప్పించడానికే ‘జై గుజరాత్’ అన్నాడు. అలాంటోడు మహారాష్ట్రకు, మరాఠీ భాషకు ఏం గౌరవం ఇచ్చినట్లు? అని ఉద్దవ్ మండిపడ్డారు. Mumbai, Maharashtra: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "Gaddar (Eknath Shinde) said ‘Jai Gujarat’ just like the actor in the movie Pushpa says ‘Jhukega nahi s*la’; but this Gaddar follows ‘Uthega nahi s*la’. He doesn’t have his own thoughts. His boss came, so to please… pic.twitter.com/s7N4a0bog0— IANS (@ians_india) July 5, 2025మరాఠీలో మాట్లాడలేదని ఓ షాపు అతనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మరాఠీ భాష పేరుతో చేసే గుండాగిరిని సహించేది లేదని సీఎం ఫడ్నవిస్ అన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో తామూ గూండాలేమేనని, మరాఠా ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ గుండాగిరి ఇలాగే కొనసాగుతుందని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ఫ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు, అందులోని డైలాగులు.. హీరో మేనరిజానికి బాగా అడిక్ట్ అయ్యారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయ్యాక.. అందులోని డైలాగులను పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు వాడుకున్నాయి. పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ను బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగించింది. -
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..
ప్రకృతి వైపరిత్యాలు ఎవ్వరికి ఎలాంటి విషాదాన్ని ఇస్తుందో చెప్పలేం. అమాంతం ఉప్పెనలా విరుచుకపడే ఆ విలయం మిగిల్చే బాధ మాటలకందనిది. అందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలను చూశాం. అలానే ఇటీవల కురిసిన భారీ వర్షాలు హిమచల్ ప్రదేశాన్ని ఎంతలా అతలా కుతలం చేశాయో తెలిసిందే. అయితే దాని కారణంగా అనాథగా మారిన ఓ చిట్టితల్లి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎలా బతికి బట్టగట్టకలిగిందంటే..అసలేం జరిగిందంటే..ఎడతెరపిలేని వర్షాలకు వరదలు సంభవించి హిమచల్ప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసింది. ఈ ప్రకృతి వైరిత్యం కారణంగా భారీగా ఆస్తి, జన నష్టం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో హిమచల్ ప్రదేశ్లోని సిరాజ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం మొత్తం ఈ విపత్తుకు బలైపోయింది. ఆ కుటుంబానికి చెందిన 11 నెలల కూతురు ఒక్కత్తే బతికి బట్టగట్టగలిగింది. ఈ విపత్తు కారణంగా ఒరిగిపోయిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఆ చిన్నారి లభించడం విశేషం. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఆ చిన్నారి ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల్లి, తండ్రి, నానమ్మ చనిపోగా, ఆ చిన్నారి ఒక్కత్తే అనాథగా మిగిలిపోయింది. ఇవేమి ఆ చిన్నారికి తెలియక అమాయకంగా అందరిని చూస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది. శిథిలంగా మారిన ఆ ఇల్లు పర్వాడ గ్రామానికి చెందని రమేష్ ఇల్లుగా గుర్తించారు. ఆ ఇల్లు డ్రెయిన్ సమీపంలో ఉండటంతో, జూన్ 30న కురిసిన వర్షాలకు నీటి ఉద్ధృతి ఎక్కువై కొట్టుకుపోయింది. అయితే దీనిని ముందుగానే గమనించి రమేష్ కూతురిని ఇంటిలోపల పడుకోబెట్టి, తన భార్య తల్లితో కలిసి ఇంటి వెనకకు వెళ్లాడు. అంతే ఆ వరద ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఐతే చిన్నారి ఇంటిలోనే ఉండటంతో సురక్షితంగా శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉందని చెబుతున్నారు అధికారులు. ఆ చిన్నారి పేరు నిఖితగా గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని వెలికితీశారు కానీ తల్లి, భార్య మృతదేహాలు మాత్రం కానరాలేదు. అందుకోసం ముమ్మరంగా గాలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఆ చిన్నారి మేనత్త తారాదేవి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున అభ్యర్థనలు రావడం విశేషం. విత్తుల సహాయ నిర్వహాణ అధికారి స్మృతికా నేగి ఆ చిన్నారి నికితా బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన మేనత్త పర్యవేక్షణలో ఉందని తెలిపారు. కాగా, ఈ హిమచల్ప్రదేశ్ వర్ష బీభత్సానికి సుమారు 700 కోట్ల మేర ఆస్తి నష్టం తోపాటు 69 మంది దాక మృత్యువాత పడ్డారు.(చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
ఫడ్నవిస్ వల్లే మేం ఇలా! ఇక ఒక్కటిగానే..: థాక్రే సోదరుల ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కటిగా ఉంటాం.. ఇక ఒక్కటిగానే ముందు సాగుతాం అంటూ ఇద్దరు సోదరులు సంయుక్త ప్రకటన చేశారు.శనివారం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన అవాజ్ మరాథిచా కార్యక్రమం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఈ ఇద్దరూ అల్టిమేటం జారీ చేశారు.బాల్ థాక్రే వల్ల కూడా కాలేదు..మా ఇద్దరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వల్ల అయ్యింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. మా మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే ప్రకటించారు.మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలనుకున్నాయి. ఈలోపు ఫడ్నవిస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ఈ సభను ముంబైలో ఇవాళ నిర్వహించారు.మీకు చట్ట సభలో అధికారం ఉండొచ్చు. కానీ మా శక్తి రోడ్లపై ఉంది. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే.. మహారాష్ట్రను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు.. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఇరువురు సంయుక్తంగా పని చేస్తామని ప్రకటించారు.రాజ్ థాక్రే చివరిసారిగా 2005లో ఉద్దవ్తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను విడిచి ఎంఎన్ఎస్ను స్థాపించుకున్న సంగతి తెలిసిందే. महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण...! pic.twitter.com/kugbSPx0JU— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. -
పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. -
మాల్లో మంటలు.. లిఫ్ట్లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల
రామ్గఢ్: జార్ఖండ్లోని రామ్గఢ్లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక బొగ్గు గనిలో కొంత భాగం కూలిపోవడంతో ఒకరు మృతిచెందారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం గనిలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. One killed, many feared trapped after portion of coal mine collapses in Jharkhand's Ramgarh: Police. pic.twitter.com/m7sQrlflqk— Press Trust of India (@PTI_News) July 5, 2025అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలియగానే ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని, రామ్గఢ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ఘటనా స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. గనిలో చాలామంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు గ్రామస్తులు బొగ్గు అక్రమ తవ్వకాలలో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.ఇది కూడా చదవండి: ‘ట్రంప్కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు -
‘ట్రంప్కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జూలై తొమ్మిదిలోగా ఖరారయ్యే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలకు సంబంధించి నిర్దేశించిన గడువుకు ప్రధాని మోదీ సాత్వికంగా తలొగ్గుతారని రాహుల్ వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే, దానిని ఖరారు చేసేందుకు భారత్ తొందరపడదంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటనను రాహుల్ గుర్తుచేశారు. పీయూష్ గోయల్ ఈ విధమైన ప్రకటన చేసినప్పటికీ, ప్రధాని మోదీ అమెరికా విధించిన సుంకాల గడువుకు మృదువుగా తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. Piyush Goyal can beat his chest all he wants, mark my words, Modi will meekly bow to the Trump tariff deadline. pic.twitter.com/t2HM42KrSi— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2025ప్రతిపాదిత తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై భారత్- అమెరికన్ అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్ యంత్రాంగం విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. అప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో.. అమెరికన్ వస్తువులపై భారత సుంకాలకు ప్రతిగా ట్రంప్ విధించిన మునుపటి అమెరికా సుంకాలు తిరిగి అమలయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ యంత్రాంగం భారత ఎగుమతుల శ్రేణిపై 26 శాతం సుంకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు ప్రారంభించిన దరిమిలా ఈ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ పరస్పరం ప్రయోజనకరమైన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రమే సంతకం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది విన్-విన్ ఒప్పందంగా ఉండాలని, జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అమెరికాతో సరైన ఒప్పందం ఏర్పడితే, అభివృద్ధి చెందిన ఆ దేశంతో భారత్ సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.వివరాల ప్రకారం.. భోపాల్లోని సుభాష్నగర్లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A speeding car lost control and overturned on the Subhash Nagar Bridge in Bhopal, leaving two passengers injured.The vehicle hit the divider with such force that its front tyres detached.A live video of the dramatic accident has surfaced, highlighting the dangers of reckless… pic.twitter.com/jd1tnuBiD9— The Sentinel (@Sentinel_Assam) July 2, 2025ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్లో ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. #WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e— ANI (@ANI) June 12, 2025 -
అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్లోని చందర్కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువులు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.యాత్రా కాన్వాయ్లో ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9 వరకు అంటే రక్షా బంధన్ వరకూ కొనసాగనుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు యాత్రికులు రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు. వాటిలో ఒకటి పహల్గామ్ మార్గం. రెండవది బాల్తాల్ మార్గం. Shri Amarnath Yatra Bus Collision in Ramban, J&KOver 30 pilgrims sustained minor injuries when five buses in a Pahalgam-bound convoy for the Shri #AmarnathYatra collided near the Chanderkote langar site in Ramban district, #JammuAndKashmir The Deputy Commissioner of Ramban… pic.twitter.com/VFA33YyE0p— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) July 5, 20256,979 మంది యాత్రికుల బృందం శనివారం జమ్ము నుండి కాశ్మీర్కు గట్టి భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు జరగనుంది. గడచిన రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బ్యాచ్ భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలతో కూడిన రెండు ఎస్కార్ట్ కాన్వాయ్లలో బయలుదేరింది. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్కు వెళుతుండగా, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్కు బయలుదేరారు. ఇది కూడా చదవండి: ‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు -
‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఇటీవలి రోజులలో అది మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిపోతోంది. చివరికి పెళ్లిపీటల మీదే తెగతెంపులవుతున్న వ్యవహారాలూ కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది.జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో గల ప్రముఖ ఫెయిర్మాంట్ హోటల్లో గతంలో ‘వార్తల్లో’ నిలిచిన సౌరభ్ అహుజా వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. వేడుకలోని ఒక్కక్క కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతూ వస్తోంది. ఇక కొద్ది క్షణాల్లో నూతన వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం జరగనుంది. ఇంతలో హఠాత్తుగా వరుడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. సౌరభ్ అహుజా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వాంటెడ్ నిందితుడు. ఇతను ఫెయిర్మాంట్ హోటల్లో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరరేట్(ఈడీ) అధికారులు మండపానికి చేరుకున్నారు.ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిందితుడు సౌరభ్ అహుజా ఏడడుగుల తంతుకు ముందు పరారయ్యాడు. దీంతో ఈడీ అధికారులు నూతన వధువుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో అహుజా వాంటెడ్ నిందితుడు. అతన్ని అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. మహాదేవ్ యాప్ ప్రాథమిక ఆపరేటర్లలో అహుజా ఒకడు. అతిథులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు పెళ్లి దుస్తుల్లోనే పరారయ్యాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సౌరభ్ కొంతకాలంగా ఈడీ అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. కల్యాణ మండపం నుంచి అతను పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ -
రౌడీషిటర్తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్తో ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్ఫోన్కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
శానిటరీ నేప్కిన్స్ ప్యాకెట్లపై రాహుల్ బొమ్మ
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహిళలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విమర్శలపాలైంది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ను పంపిణీ చేయాలని పార్టీ తలపెట్టింది. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 అందజేయడంతోపాటు ఉచితంగా నేప్కిన్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ బొమ్మను ముద్రించడం వివాదం రేపింది. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు ఇదో ఉదాహరణ అంటూ అధికార జేడీ(యూ) మండిపడింది -
బీహార్లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గోపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలోని తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్ద కొందరు దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోపాల్.. హోటల్కు ఆనుకుని ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిటీ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కాపై కాల్పులు జరిగినట్టు మాకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews #PatnaNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE— Press Trust of India (@PTI_News) July 5, 2025ఇదిలా ఉండగా.. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. మరోవైపు.. పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది. నితీష్ జీ.. దయచేసి బీహార్ను విడిచిపెట్టండి. గుంజన్ ఖేమ్కా హత్యకు గురైనప్పుడే నేరస్థులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు గోపాల్ ఖేమ్కాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | Patna, Bihar | On businessman Gopal Khemka being shot dead, SP Patna Diksha says, "On the night of July 4, at around 11 pm, we received information that businessman Gopal Khemka has been shot dead in the south area of the Gandhi Maidan... The crime scene has been… pic.twitter.com/o8C0gVoz7B— ANI (@ANI) July 5, 2025 -
క్షమాపణ చెప్పండి.. పరిహారం చెల్లించండి
ముంబై: సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కొల్హాపురి చెప్పుల డిజైన్ను అనుమతి లేకుండా వాడుకున్న ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడాపై పిల్ దాఖలైంది. మేధో సంపత్తి హక్కుల రంగంలో పనిచేసే ముంబై, పూణేలకు చెందిన న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ను దాఖలు చేసింది.ఈ సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ ఏఐ ఉత్పత్తిని అనధికారికంగా ఉపయోగించడాన్ని అంగీకరిస్తూ, ప్రాడా గ్రూప్, ప్రాడా ఇండియా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఏఐలను అనధికారికంగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని పిటిషన్ కోరింది. భారతీయ కళాకారుల హక్కులను గుర్తించాలని డిమాండ్ చేసింది. కళాకారుల ప్రతిష్ట, ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా పిటిషన్ కోరింది.జూన్ 22న ఇటలీలోని మిలన్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్.. స్ప్రింగ్ సమ్మర్ మెన్స్ కలెక్షన్–2026 సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ను ప్రాడా బ్రాండ్ ఉపయోగించింది. ఫ్యాషన్ షో వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రదర్శనలో ప్రాడా మోడల్స్ ధరించిన పాదరక్షలు అచ్చం సంప్రదాయ కొల్హాపురి చెప్పుల మాదిరిగానే ఉన్నాయి. వాటి డిజైన్లకు శతాబ్దాల వారసత్వం కలిగిన సంప్రదాయ పాదరక్షల నుంచి ప్రేరణ పొందినట్టు ప్రాడా కూడా అంగీకరించింది. -
6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది. -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్ను విడిచి భారత్కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతి రూపాయికి ప్రతిఫలం రూ.2.54..!
న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష కార్యక్రమం ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ఎస్.సోమ్నాథ్ చెప్పారు. ఇస్రోలో పెట్టే ప్రతి రూపాయిపై రూ.2.54 మేర ఆదాయం వస్తోందని వెల్లడించారు. శుక్రవారం ఆయన ‘ఆక్స్ఫర్డ్ ఇండియా బిజినెస్ ఫోరం’లో ప్రసంగించారు. బడ్జెట్ తక్కువే అయినప్పటికీ అద్భుతమైన సామర్థ్యం కలిగిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ గుర్తింపు సాధించిందని ఆయన వివరించారు. ‘మేం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అందుతున్న ప్రతిఫలం రూ.2.54. బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేకున్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని, ఉపగ్రహాలను నిర్మించి విజయవంతంగా ప్రయోగించాం’అని తన హయాంలో అనుభవాన్ని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 లూనార్ ల్యాండింగ్, ఆదిత్య ఎల్–1 మిషన్ వంటి ఇస్రో సాధించిన మైలురాళ్లు అంతరిక్ష అన్వేషణలో భారత్ సత్తాకు నిదర్శనాలని చెప్పారు. ప్రైవేట్ రంగం గణనీయ వృద్ధి ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి సాధించిందని సోమ్నాథ్ చెప్పారు. ‘2014కు పూర్వం ఈ రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్ కంపెనీ ఉండేది. ఇప్పుడవి 250కి పెరిగాయి. ఉపగ్రహాలు, రాకెట్లను నిర్మించడంతోపాటు కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ రంగంలో అనుబంధ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ తన వాటాను పెంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది’అని సోమ్నాథ్ తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారతీయుడిని చంద్రుడిపైకి పంపి, అక్కడ ల్యాండ్ చేయించడంతోపాటు తిరిగి తీసుకువచ్చే బృహత్తర ప్రణాళిక ఇస్రో వద్ద ఉందన్నారు. ఇందులో పునర్వినియోగ రాకెట్ల నిర్మాణం, భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, అంతరిక్షంలోకి భారతీయులను పంపడం, చంద్రుడితోపాటు గురుగ్రహంపైకి అన్వేషణలను చేపట్టడం వంటివి కూడా ఉన్నాయని వివరించారు. ఇతర దేశాలకు సైతం సాయం నేపాల్, భూటాన్, ఒమన్, దక్షిణాఫ్రికాతోపాటు ఆసియాన్ దేశాల అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, పెంచేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. పునరి్వనియోగ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం, పరిశోధన–అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వ్యూహాత్మక అంతరిక్ష రంగంలో మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో భారత్ను అగ్ర స్థానానికి తీసుకెళ్లాలన్నదే ఇస్రో లక్ష్యమని సోమ్నాథ్ చెప్పారు. -
ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది. ప్రభుత్య వ్యవహారశైలి, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఎంపేడులో ఎస్టీల మీద జరిగిన దాడులపై వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అమాయకులపై దాడులు జరిగినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె కమిషన్కు అందచేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ సంబంధిత కలెక్టర్, ఎస్పీలకు సమన్లు జారీచేసింది. తాము ఈనెల 8న విచారణ నిర్వహించనున్నామని, ఆ విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించింది.