National
-
దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!
కోల్కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.ఎస్ప్లనేడ్లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.శోభన్దేబ్ చటోపాధ్యాయ్ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రిటైర్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రమోషన్.. ఇదేమి వింత గోల?
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బిందు అనే మహిళకు ఉద్యోగ జీవితంలో చివరి రోజున ఊహించని అనుభవం ఎదురైంది. 2026 మే 30న ఆమె చివరి పని దినం. ఇన్నేళ్లు సేవలు అందించిన ఆమెకు సహోద్యోగులు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పదవీ విరమణకు సంబంధించిన ప్రక్రియలు పూర్తిచేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆశ్చర్యకరమైన సమాచారం అందింది.సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి, 5.30 గంటలకు ఇంటికి చేరుకున్న బిందుకు వాట్సాప్ ద్వారా సందేశం వచ్చింది. అందులో ఆమెకు పదోన్నతి కల్పించి, త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా నియమించినట్టు పేర్కొన్నారు. మరుసటి రోజే విధుల్లో చేరాలని కూడా ఆదేశించారు.ఈ పదవి సాంకేతిక విద్యాశాఖ పరిపాలనా విభాగంలో ఉన్నత హోదా. సాధారణంగా ఇలాంటి నియామకాలు, పదోన్నతి ఉత్తర్వులు ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా జారీ అవుతాయి. అయితే నిర్ణయం చివరి క్షణంలో తీసుకోవడంతో వాట్సాప్ ద్వారా సమాచారం పంపించారు.తాను స్వస్థలం చేర్తలాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమాచారం రావడంతో ఆమె ప్రణాళికలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మరో సమస్య ఎదురైంది. మే 31 ఆదివారం కావడంతో కొత్త ఉద్యోగంలో అధికారికంగా ఎలా చేరాలనే ప్రశ్న తలెత్తింది.బిందు వెంటనే తిరువనంతపురంలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ను సంప్రదించారు. అనంతరం త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల సూపరింటెండెంట్తో మాట్లాడారు. అప్పటికే ఆమె నియామకంపై డైరెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు చేరాయి. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా తెలియజేశారు.స్వస్థలానికి వెళ్లేందుకు బిందు ముందుగానే మావేలి ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే చేర్తలాలో దిగకుండా త్రిస్సూర్లో దిగారు. అక్కడ ఒక బంధువు రైల్వే స్టేషన్ వద్ద ఆమెను తీసుకెళ్లి బస ఏర్పాట్లు చేశారు.సూపరింటెండెంట్ సూచనల మేరకు ఆదివారం ఉదయం ఒక క్లర్క్ ప్రత్యేకంగా కళాశాలకు వచ్చి కార్యాలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు బిందు త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆమె ఉద్యోగ సర్వీసు అధికారికంగా ముగిసింది. దీంతో ఆ పదవి నుంచి కూడా విరమించారు.అలాగే, 24 గంటల్లోనే బిందు రెండు సార్లు పదవీ విరమణ చేసిన అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. మొదట కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా, ఆ తర్వాత త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు.పదోన్నతి వస్తుందని బిందు ఆశించినప్పటికీ, ఉత్తర్వులు ఆలస్యం కావడంతో మే మధ్య నాటికే ఆశలు వదులుకున్నారు. అయితే చివరి క్షణంలో పదోన్నతి రావడంతో, ఆ హోదాతోనే పదవీ విరమణ చేయగలిగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. లలిత అంబికా దేవి, దివంగత రామచంద్ర పణిక్కర్ దంపతుల కుమార్తె అయిన బిందు, చేర్తలాలోని పట్టణక్కడ్లో నివసిస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ రిటైర్డ్ సైనిక అధికారి. వీరికి వైశాఖ్, డాక్టర్ వైష్ణ శ్యామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రెండు బస్సులు ఢీ.. 8 మంది సజీవ దహనం
గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొని మంటలు చెలరేగాయి. దీంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘోరంగా ఢీకొన్న ఈ రెండు బస్సులు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినవే. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. సూరత్లోని బార్డోలీ తాలూకా ఉవా గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మరో బస్సు బోల్తాపడింది. అందులో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి ధూలే-సూరత్ మార్గంలో నడుస్తోంది. ఈ బస్సు ధూలే నుంచి నందుర్బార్, నవాపూర్ మీదుగా సూరత్కు వెళ్తోంది. మరో బస్సు గుజరాత్ నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది. ఒక బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ప్రమాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పక్కకు మళ్లింది. అయితే ఆ క్రమంలో బస్సు బోల్తాపడింది. బోల్తాపడగానే మంటలు అంటుకున్నట్టు సమాచారం. -
బ్లాక్ అండ్ వైట్ సూట్ అందుకే: ఎం విజయ్
తిరుచ్చి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నలుపు-తెలుపు సూట్లోనే కనబడుతున్నారు జోసఫ్ విజయ్. ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వస్త్రధారణకు భిన్నంగా మోడ్రన్గా కనిపించడంతో జనమంతా ఆసక్తికరంగా ఆయనను గమనిస్తున్నారు. సీఎం విజయ్ వస్త్రధారణపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. కొంతమంది నాయకులు విజయ్ వస్త్రధారణపై విమర్శలు కూడా చేశారు. తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.తిరుచ్చి సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోట్ సూట్ వేసుకోవడం పైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు, మనం సూటుకోటు వేసుకోకూడదా? కేవలం అణచివేసే శక్తులు, అధికారం చెలాయించే వారే సూటుకోటు వేసుకోవాలా? అయినా నేనేమైనా రంగురంగుల సూట్లు వేసుకుంటున్నానా? నా మనసు లాగే కేవలం రెండు రంగులు.. నలుపు, తెలుపు మాత్రమే ధరిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారికి ఒకటే విన్నపం.. దయచేసి మీ విమర్శలు ఆపకండి. అవే నాకు మరింత శక్తినిస్తాయి. మీరు విమర్శలు చేస్తూనే ఉండండి, నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలు తన ఎదుగులకు దోహదపడతాయన్నారు.ఇప్పుడు వార్తలు చూస్తున్నారుఇదివరకు కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో ‘రీల్స్’ చూసే జెనరేషన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూస్ ఛానళ్లు చూస్తోందని విజయ్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ‘జెన్–జీ’ ఆసక్తి కనబరుస్తోందన్నారు. వారి కోసం ప్రతిపక్షాలు తమ ప్రెస్నోట్లను తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతోందని, వారిని తక్కువ చేసి చూడొద్దని విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారని చెప్పారు.#WATCH | “ஏன் நம்ம கோட் சூட் எல்லாம் போடக் கூடாதா?”திருச்சியில் முதலமைச்சர் விஜய் பேச்சு#SunNews | #TVKVijay | #Trichy pic.twitter.com/27QCiWxJx9— Sun News (@sunnewstamil) June 1, 2026 -
సీబీఎస్ఈ వివాదం.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం వేగంగా చర్యలు చేపట్టి సీబీఎస్ఈలోని ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తా బదిలీ అయ్యారు. సీబీఎస్ఈ కొత్త ఛైర్మన్గా లోఖండే ప్రశాంత్ సీతారామ్ను ప్రభుత్వం నియమించింది. అలాగే, ఓఎస్ఎం ఫెసిలిటీ కొనుగోలుపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ విచారణ కమిటీ ఏకైక సభ్యురాలిగా నియమితులయ్యారు. అవసరమైతే ఇతర అధికారుల సాయం తీసుకోవచ్చు. “చైర్పర్సన్కు అవసరమైన సందర్భాల్లో ఇతర కార్యాలయాల అధికారుల నుంచి సాయం పొందే అధికారం ఉంది. కమిటీకి సీబీసీ కార్యదర్శి సహకారం అందిస్తుంది. కమిటీ తన నివేదికను ఒక నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కు సమర్పిస్తుంది” అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల మార్కుల పునఃపరిశీలన పోర్టల్ను మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ ప్లాట్ఫాంపై సైబర్ దాడులయత్నం జరిగినట్లు బోర్డు వెల్లడించింది.సీబీఎస్ఈ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక దశలో కేవలం 2 నిమిషాల్లోనే దాదాపు 15 లక్షల హిట్లు నమోదయ్యాయి. విద్యార్థులు ప్లాట్ఫాంను ఉపయోగించకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగిందని బోర్డు ఆరోపించింది.అనధికారికంగా ఫైళ్లలోకి ప్రవేశించేందుకు జరిగిన లక్షకు పైగా ప్రయత్నాలను గుర్తించామని, సేవలకు అంతరాయం కలిగించాలనే దురుద్దేశంతో పనిచేసే వ్యక్తులే ఇందుకు కారణమని కూడా తెలిపింది. పోర్టల్ నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి “సాంకేతిక సమస్యలు” కారణమని అధికారులు తెలిపారు.ఈ ఆలస్యం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో జవాబు పత్రాల ప్రాప్తి ప్రక్రియలో లోపాలు తలెత్తినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి. మార్కుల ధ్రువీకరణ, జవాబు పత్రాల పునర్మూల్యాంకనం కోసం విద్యార్థులకు పారదర్శకమైన, అంతరాయంలేని వ్యవస్థను అందించేందుకే ఈ పోర్టల్ను ప్రారంభిస్తామని సీబీఎస్ఈ ఇంతకుముందు తెలిపింది. -
పోరాడతాం లేదా చనిపోతాం: ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.మొదట ఎస్ప్లానేడ్లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్ పాలిటిక్స్తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.కోల్కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. -
50 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ? టీఎంసీ ఇక తమదేనంటూ..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కోల్కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్లో “మహారాష్ట్ర మోడల్” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారని కూడా చెప్పారు.బెంగాల్లో మహారాష్ట్ర నమూనా?బెంగాల్లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. -
బీజేపీకి అన్నామలై రాజీనామా
సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం
అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రాచ్య దేశాలలో విధించే శిక్షలతో పోలుస్తూ , మనదేశంలోని నేరం, శిక్షలపై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. నటరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) దేశాల్లో మాదిరిగా కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.'బార్ అండ్ బెంచ్' వెబ్సైట్ కథనం ప్రకారం..“మనం నేరస్థులను గట్టిగా శిక్షించకపోవడం వల్లే కోరలు లేని పాముల్లా చట్టాలు తయారయ్యాయి. అందుకే నేరస్తులు రెచ్చిపోతున్నారు. అలా కాకుండా కాళ్లు, చేతులు నరికివేసే శిక్షలు ఉంటేనే, ప్రజలు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతీ ఒక్కరూ చులకనగా తీసుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కి చెందిన 23 ఏళ్ల విద్యార్థి గోపి రెడ్డి కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 5 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది."ఉప్పు తింటే నీళ్లు కూడా తాగాలి..అతడిని మరో నాలుగు-ఐదు రోజులు జైల్లోనే ఉండనివ్వండి. జైలు జీవితానికి అలవాటు పడతాడు. ఒకవేళ శిక్ష పడితే తిరిగి అక్కడికే వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తుంది" అని కోర్టు పేర్కొంటూ, తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!నిందితుడి తరఫు న్యాయవాది అయాంతికా మోండల్ వాదిస్తూ.. తన క్లయింట్ చేయని నేరానికి రెండు నెలలుగా జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగిందని చెబుతున్నారని, ఇప్పుడు అతడిని ఇలాగే నిర్బంధిస్తే అతని వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బతింటుందని వాదించారు.అసలు కేసు ఏంటి? ఇది 2003 జూలైలో నిందితుడు కార్తీక్ రెడ్డి ఒక మహిళను(ఫిర్యాదుదారు) ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ప్రేమను మొదట ఆమె కూడా అంగీకరించింది. అయితే, అతని ప్రవర్తనపై అనుమానంతో దూరం పెట్టింది. దీంతో తమ బంధం గురించి మాట్లాడుకుందామని చెప్పి, నమ్మించిన నిందితుడు ఆమెను తన అపార్ట్మెంట్కు పిలిపించాడు. అక్కడ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ. ఈ ఘటన వల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభ, నిరాశకు గురై మణిపాల్లోని కేఎంసీ (KMC) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించి, అనంతరం ఉడుపి మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.నెట్టింట దుమారంఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి. ఇటువంటి శిక్షలు రాజ్యాంగ, ఆధునిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని పలువురు వినియోగదారులు వాదించారు. స్వయంగా కోర్టులు, న్యాయమూర్తులు హమ్మురాబి స్మృతిని ఎలా నిర్దేశిస్తారు? మనం ప్రతీకార న్యాయాన్ని ఎప్పుడో దాటిపోయాం. ఇది అంతకంటే దారుణంగా కనిపిస్తోందన్నారు మరొకరు. రాజ్యాంగం, నేర చట్టాలు అటువంటి అనాగరికతను అనుమతించవని మరో నెటిజన్ వ్యతిరేకతను వ్యక్తంచేశాడు. న్యాయవ్యవస్థ దుస్థితిని విమర్శిస్తూ ఒథెరా ఇలా రాశారు, "మన దేశంలో ఉన్న కోర్టులు, న్యాయమూర్తుల స్థాయి ఇది. మన దేశంలో అన్ని నియమాలు, చట్టాలు ఉన్నాయి, కానీ వాటి అమలు చాలా తక్కువగా ఉంది. పై నుండి క్రింది వరకు ప్రతి స్థాయిలో అవినీతి ఉంది." -
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి,న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులేనని తెలిపింది. వివాహిత కుమార్తెను ‘కుటుంబం’ నిర్వచనం నుంచి మినహాయించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలకు పెళ్లయిన కూతుర్లను మినహాయించకూడదని వెల్లడించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం, బాంబే హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. వివాహం కారణంగా అర్హత ఉన్న కూతురికి సామాజిక సంక్షేమ ప్రయోజనాలు లేకుండా చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ కేసు మొదలైంది. తన తల్లి మరణం తర్వాత రేషన్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఆమెకు ‘వివాహిత కూతురు’ అనే కారణంతో లైసెన్స్ నిరాకరించారు.ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాప్ నడిపేది. అయినప్పటికీ 2019 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఆమె దరఖాస్తు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషనరైన వివాహిత కూతురుకు నాలుగు వారాల్లో రేషన్ షాప్ లైసెన్స్ ఇవ్వాలని సుప్రీం కోర్టు యూపీ అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టు మహిళల హక్కులను మరింత బలోపేతం చేసింది. వివాహం తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకు ఇది పెద్ద ఊరట కలిగినట్లైంది. -
ఈ బేబీ ఎంజాయ్మెంట్ చూసి పెద్దలూ అసూయపడుతున్నారు!
ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెను ఛాతీకి కట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో తండ్రి అక్షయ్ పాలీవాల్, 2001లో వచ్చిన దిల్ చాహ్తా హై సినిమాలోని వో లడ్కీ హై కహాన్ పాటకు స్టెప్పులు వేశాడు. బేబీ క్యారియర్లో ఉన్న చిన్నారి నవ్వుతూ, ఊగుతూ కనిపించింది.తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లిటిల్_మంచ్కిన్28లో ఈ వీడియోను పంచుకున్నాడు. కొద్ది సమయంలోనే ఇది వేగంగా వైరల్ అయి 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో తమ ముఖంపై చిరునవ్వు తెప్పించిందని చెబుతూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు. ఇటీవల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపిన మధురమైన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న ధోరణిలో పెరుగుతోంది.యూజర్ల స్పందన"అయ్యో... బిడ్డ ఎంత ముద్దుగా ఉంది. అందరిలోకెల్లా క్యూటెస్ట్" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు."వెనుక వినిపిస్తున్న సంగీతం చాలా చాలా క్యూట్గా ఉంది," అని మరో నెటిజన్ అన్నాడు."బిడ్డ చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఆస్వాదిస్తోంది. చాలా బాగా చేశారు" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు."నాన్న డ్యాన్స్కు బేబీ ఫుల్ సపోర్ట్.. వైరల్కు ఇదే సీక్రెట్!" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. "స్టెప్పులు నాన్నవి.. షో మొత్తం బేబీదే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు."బేబీ నవ్వితే చాలు.. 25 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి" అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Adrija Paliwal (@little_munchkin28) -
కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!
ఉత్తరప్రదేశ్లో అత్యంత ఘోరమైన, కలచివేసే ఘటన వెలుగుచూసింది. ఫిరోజాబాద్లోని యాదవ్ కాలనీలో శనివారం (మే 30) జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్ (24) అనే వ్యక్తి, ఆరవ్ అనే ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని అత్యంత అమానుషంగా నేలకేసి కొట్టి చంపాడు.స్థానిక మహిళను పెళ్లి చేసుకోవాలని భావించాడు నిందితుడు జితేంద్ర. అయితే దీన్ని ఆమె తిరస్కరించడంతో విచక్షణ మరచిన రాక్షసుడిలా మారిపోయాడు. అమాయక బాలుడిని దారుణంగా ఉన్మాదిలా పదే పదే నేలకేసి విసిరి కొట్టాడు. ఎనిమిది సార్లు నేలకేసి కొట్టడంతో, చిన్నారిఅక్కడికక్కడే ప్రాణాలొదొలేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. The video is sensitive.A woman rejected this monster's proposal, and the beast thrashed her innocent child to death. This incident occurred in #Firozabad, #UttarPradesh.Accused Viraj Alias Jitender Arrested Viraj, also known as Jitender, has been arrested by police. The… pic.twitter.com/bfoGAmACz7— Siraj Noorani (@sirajnoorani) May 30, 2026 నిందితుడు జితేంద్ర పాఠక్ ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన కజిన్ సుమిత్ భార్య, చిన్నారి తల్లి , రతీ దేవిపై మోహాన్ని పెంచుకున్నాడు. రతి, సుమిత్ గత కొంతకాలంగా విడిగా ఉంటుండగా, రతి విడాకుల వ్యవహారాల్లో జితేంద్ర సహాయం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమను పెంచుకుని పెళ్లి ప్రతిపాదనలు చేయగా, రతి వాటిని నిరంతరం తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి పింకీ దేవితో కలిసి విడాకుల చట్టపరమైన సంప్రదింపుల కోసం షికోహాబాద్ వెళ్లారు. జితేంద్ర వారిని వెంబడించి అక్కడ కూడా పెళ్లి ప్రపోజల్ పెట్టగా, ఆమె నిరాకరించింది. రతి తనను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ చిన్నారే ప్రధాన అడ్డంకి అని నిందితుడు భావించి, ఆ దురాగతానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో టాఫీ (చాక్లెట్) కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్ను జితేంద్ర లోబరుచుకున్నాడు. తీవ్రమైన ఉన్మాదంతో ఊగిపోయిన జితేంద్ర, ఆ పసికందును పైకెత్తి దాదాపు ఎనిమిది సార్లు కిరాతకంగా నేలకేసి కొట్టాడు. ఈ దారుణమైన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.స్థానికులు గమనించి అడ్డుకునేలోపే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదైంది. ఆదివారం (మే 31) మైన్పురి రోడ్డు సమీపంలో పోలీసులకు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల (ఎన్కౌంటర్) అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..! -
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
‘కోటా’ రూమ్మేట్స్: జేఈఈ అడ్వాన్స్డ్లో తొలి రెండు ర్యాంకులు వీరివే..
కోటా: రాజస్థాన్లోని కోటాలో ఒకే హాస్టల్లో ఉంటూ, ఒకే కల కోసం శ్రమించిన ఇద్దరు స్నేహితులు జేఈఈ అడ్వాన్స్డ్ -2026 పరీక్షలో దేశం గర్వించే ఫలితాలను సాధించారు. బీహార్కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్-1 (AIR 1) సాధించగా, గురుగ్రామ్కు చెందిన కబీర్ చిల్లర్ 329 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్-2 (AIR 2) దక్కించుకున్నారు. కేవలం ఒక్క మార్కు తేడాతో టాపర్లుగా నిలిచిన ఈ స్నేహితుల ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కోటా హాస్టల్లో చిగురించిన స్నేహంఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న శుభమ్, కబీర్ కోటాలోని అలెన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. వీరు ఒకే హాస్టల్లో వేర్వేరు అంతస్తుల్లో ఉంటూ, తమ దైనందిన జీవితాన్ని క్రమశిక్షణతో గడిపేవారు. తరగతులు, అసైన్మెంట్లు, మాక్ టెస్టులతో నిరంతరం ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ప్రతిరోజూ సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడుతూ పరీక్షల ఒత్తిడిని అధిగమించారు.ఒక్క మార్కు తేడా.. కానీ సంబరాల్లో సమానంర్యాంకులో ఒక్క మార్కు తేడా ఉన్నా, వారి స్నేహంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. గతంలో జేఈఈ మెయిన్లో AIR 1 సాధించిన కబీర్, తన స్నేహితుడు శుభమ్ మొదటి స్థానంలో నిలవడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘నా స్నేహితుడు టాప్ ర్యాంక్ సాధించడం నాకు గర్వంగా ఉంది. అతను దీనికి పూర్తిగా అర్హుడు’ అని కబీర్ పేర్కొన్నారు. అసూయకు తావులేకుండా, ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఐఐటీ వైపు అడుగులుఈ ఏడాది ఫలితాల్లో కోటా, రాజస్థాన్ ప్రాంతాల విద్యార్థుల ఆధిపత్యం మరోసారి కనిపించింది. మూడవ ర్యాంకును సికార్కి చెందిన జతిన్ చాహర్ కైవసం చేసుకోగా, వీరంతా అలెన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రస్తుతం శుభమ్, కబీర్ ఇద్దరూ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఉన్నారు. 1.87 లక్షల మంది పోటీపడిన ఈ పరీక్షలో 56,880 మంది అర్హత సాధించగా, ఈ స్నేహితుల విజయగాథ ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాడి జ్ఙాపకాలే ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది -
ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
బిహార్లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది. ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్ రాహుల్ని వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్గా మారాడు. రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ సర్జరీ కోసం నయన్శ్రీ రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది. అన్నీ సవ్యంగా ముగిసిన తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీపూర్లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.कल तक बहन, आज जीवनसाथी ! बिहार के जमुई में एक BPSC शिक्षिका ने अपनी फुफेरी बहन से शादी कर ली। शादी से पहले बहन ने जेंडर ट्रांजिशन कराया और दोनों ने हिंदू रीति-रिवाज से विवाह किया। मामला चर्चा का विषय बना हुआ है। pic.twitter.com/xSv0NNMsFD— Yash Ahmad (@YashAhmad8) June 2, 2026 ఐదేళ్ల లవ్నయన్శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్/రాఖీ తండ్రి కోల్కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.కుటుంబంలో గొడవలురాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు. -
సుప్రీంకోర్టులో కొలువుదీరిన కొత్త న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు కొత్త న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 32 నుండి 37కి పెరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో, ఈ నియామకాలు జరిగాయి. కొత్త న్యాయమూర్తులు వీరే..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఈ ఐదుగురు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందించిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు బెంచ్కు పదోన్నతి పొందడం గమనార్హం. Swearing-in Ceremony of the five newly appointed Supreme Court judges to commence at 10:30 am#SupremeCourt pic.twitter.com/sJHvOZyqAo— Bar and Bench (@barandbench) June 2, 2026వేగంగా సాగిన ప్రక్రియఈ నియామకాలకు సంబంధించి సిఫార్సులను గత వారమే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిద్ధం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జూన్ 1న అధికారికంగా ఆమోదముద్ర వేసింది. సాధారణంగా సుప్రీంకోర్టులో నియామక ప్రక్రియకు కాస్త సమయం పడుతుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.పెరిగిన న్యాయస్థానం సామర్థ్యంసుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి, న్యాయమూర్తుల కొరతను అధిగమించడానికి ఈ నియామకాలు ఎంతో కీలకం. కాగా రాబోయే రోజుల్లో మరో ఖాళీ కూడా భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా చేరిన న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు తీర్పులలో వేగం, పరిపాలనా సామర్థ్యం మరింత పుంజుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.సరికొత్త చరిత్ర సృష్టించిన సీనియర్ న్యాయవాది వి. మోహనసాక్షి, చెన్నై: దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులై తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది వి. మోహన సరికొత్త చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్న తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక నియామకంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. కాగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, ఏకంగా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతున్న భారతదేశపు రెండవ మహిళా న్యాయమూర్తిగా ఆమె మరో రికార్డు సృష్టించారు. మహిళా సాధికారతకు నిదర్శనం ఆమెకు దక్కిన గుర్తింపుపై సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది వెంకిడ సుబ్రమణి మోహన గారు నియమితులవ్వడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే నేరుగా న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రెండో మహిళగా, తమిళనాడు నుండి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారన్నారు. జస్టిస్ మోహన ఈ నియామకం దేశంలో, రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి, వారి ఆర్థిక సాధికారతకు , సామాజిక పురోగతికి ఒక గొప్ప ఉత్తేజకర శక్తిగా నిలుస్తుందన్నారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ మోహనకు తన తరపున, తమిళనాడు ప్రభుత్వం , రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర అనంతరం జస్టిస్ వి. మోహన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళనాడుకు చెందిన ఒక మహిళా న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానంలో అడుగుపెట్టనుండటం పై తమిళనాడు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!
శనివారం ఉదయం (మే 29).. త్యాగి కుటుంబమంతా చిరాగ్ కోసం ఎదురుచూస్తోంది. జపాన్ నుంచి తిరిగి వస్తున్న అతడికి ఘన స్వాగతం పలికేందుకు ఇంటిని అందంగా అలంకరించారు. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అతడికి అభినందనలు తెలపాలని ఊరంతా ఎదురుచూస్తోంది.కానీ చిరాగ్ మాత్రం ఇంటికి రానేలేదు. బదులుగా ఘజియాబాద్ పోలీసుల నుంచి అతడి కుటుంబానికి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఎంఎంజీ ఆస్పత్రికి రావాలని.. చిరాగ్ గాయపడ్డాడని వారికి చెప్పారు. కానీ అక్కడికి వెళ్లే సరికి అంతా అయిపోయింది.భారత పారా అథ్లెట్ 24 ఏళ్ల చిరాగ్ త్యాగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. పారా ఒలింపిక్స్లో పాల్గొనాలన్న కల నెరవేరకుండానే అతడు కన్నుమూశాడు. ఇందుకు అతడి స్నేహితుడు, తోటి పారా అథ్లెట్ యశ్ ఖటిక్ కారణమని త్యాగి కుటుంబం ఆరోపించింది.వాళ్లే కారణంఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం నాటి ప్రెస్ మీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘విచారణలో భాగంగా చిరాగ్ త్యాగి మరణానికి యశ్ ఖటిక్తో పాటు గగన్ త్యాగి కూడా కారణమని తేలింది. వీరితో పాటు అభయ్ అలియాస్ అభినవ్కు కూడా ఇందులో హస్తం ఉంది’’ అని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా నిందితుడు యశ్ ఖటిక్ తమకు చెప్పిన విషయాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ‘‘నేనూ.. చిరాగ్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 400 మీటర్ల రేసు కోసం ప్రాక్టీస్ చేసేవాళ్లము. చిరాగ్ మాత్రమే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు.నాలో అభద్రతా భావం నిజానికి చిరాగ్ మాదిరే నాకూ కంటి సమస్య ఉంది. అయితే, నా మెడికల్ రిపోర్టును జర్మనీకి పంపించాల్సి ఉంది. కానీ చిరాగ్ దానిని నాశనం చేశాడు. దీంతో నేను ఆసియా క్రీడలకు సెలక్ట్ కాలేకపోయాను.అంతేకాదు.. పరుగు పందెంలో ఎప్పుడూ చిరాగే గెలిచేవాడు. అతడు వరుసగా రెండు పతకాలు కూడా సాధించాడు. అతడి ఎదుగుదల నాలో అభద్రతా భావాన్ని పెంచింది. అతడి వల్ల నా కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం వెంటాడింది.అందుకే నా అసోసియేట్ గగన్ త్యాగితో కలిసి చిరాగ్ హత్యకు పథకం రచించాను. మాకు భికన్పూర్కు చెందిన అభయ్ పిస్టల్ తెచ్చి ఇచ్చాడు. మే 29న బెంగళూరు నుంచి చిరాగ్ తిరిగి వచ్చాడు. మే 30న ఘజియాబాద్కు టాక్సీలో పయనమయ్యాడు.అక్కడిక్కడే కుప్పకూలిపోయాడుఅప్పుడే మా ప్లాన్ ప్రకారం.. సాయి ఉప్వన్ దగ్గర చిరాగ్ త్యాగిని నేను తుపాకీతో చాలా దగ్గరి నుంచి కాల్చాను. అది అతడి తలకు తగిలింది. ఆ తర్వాత వెన్నులోనూ కాల్చాను. అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.మేము చిరాగ్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాము. అతడి సిమ్ కార్డు తీసి మురికికాలువలో పడేశాము. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి 62 వేల రూపాయలు డ్రా చేసి.. మాకు పిస్టల్ అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాము’’ అని నిందితుడు యశ్ ఖటిక్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.కాగా చిరాగ్, యశ్ ‘బ్లైండ్’ కేటగిరీలో పోటీల్లో పాల్గొంటున్నారని.. అయితే, చిరాగ్ పట్ల అసూయతోనే యశ్ ఈ పని చేసినట్లు వెల్లడించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా చిరాగ్ అంకుల్ ప్రవీణ్ రాజ్ త్యాగి ఈ ఘటన గురించి మాట్లాడుతూ..‘‘చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ లక్ష్యంగా చిరాగ్ ముందుకు సాగాడు. జూడోలో కూడా అతడికి ప్రవేశం ఉంది. అయితే, స్ప్రింటర్గా రాణించడంపైనే దృష్టి పెట్టాడు.మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. అయితే, రోజురోజుకీ అతడి కంటిచూపు మందగించింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పారా క్రీడల రూపంలో మాకు మరో మార్గం దొరికింది. అక్కడైనా తనను తాను నిరూపించుకోవాలని చిరాగ్ పట్టుదలగా పనిచేశాడు.అసలు యశ్ ఈ పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. చిరాగ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 20 వేలు వస్తే అందులో 10 వేలు యశ్కే ఇచ్చేవాడు. అతడికి శిక్షణ కూడా ఇచ్చేవాడు. యశ్ను మేమెంతగానో నమ్మాము. మా కొడుకులాగే చూసుకున్నాము. మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అసూయతో మా బిడ్డనే చంపేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
సాక్ష్యం చెబితే ఖబడ్దార్.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ!
నటి,మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి. ట్విషా అత్త, మాజీ జడ్జ్ బాధితురాలిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనం రేపగా, తాజాగా సాక్షులను బెదరించి, భయపెట్టేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నాలు కలకలం రేపాయి. కీలక సాక్షిపై ట్విషా భర్త ప్రధాన నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ స్నేహితులు గుండా గిరీ ప్రదర్శించారు. కట్నం వేధింపుల ఆరోపణలు, ఆమె ఉరివేసుకుందని చెబుతున్న బెల్ట్ మాయం కావడం లాంటి అంశాలపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో సెలూన్ నడుపుతున్న నీరజ్ దూబే అనే వ్యక్తిపై మే 30న సింగ్ స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేశారు. దాదాపు ఆరుగురు వ్యక్తులు తనను చుట్టుముట్టి కోర్టులో సాక్ష్యం చెప్పవద్దంటూఒత్తిడి తెచ్చారని, దుర్భాషలాడారని దూబే వాపోయారు. దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో, తనపై దాడి చేశారని దుబే ఆరోపించారు. ఈ దాడి, దూబే, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) లో రికార్డయ్యాయి. ఈ విషయంలో తనకు రక్షణ కల్పించాలని, తగిన న్యాయం చేయాలని కోరుతూ దూబే కటారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయనకు హామీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు."Law & Order Failure in Bhopal? Key Twisha Murder Witness Attacked by Friends of Prime Accused"#Madhyapradesh #Bhopal - A significant new twist has emerged in the #TwishaSharma murder case after a key witness was allegedly beaten up by friends of the main accused, Samarth… pic.twitter.com/TlpPvfg03u— Siraj Noorani (@sirajnoorani) June 1, 2026ఇదీ చదవండి: ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?కాగా ఏప్రిల్ 12న ట్విషా శర్మ తన అత్తవారి ఇంట్లో శవమై కనిపించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో తల్లి, కొడుకు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసులు వారిని కటారా హిల్స్ నివాసానికి తీసుకెళ్లి, శర్మ మరణించిన రాత్రి ఏం జరిగిందనే దానిపై క్రైమ్ సీన్ను రీ-క్రియేట్ చేసి విచారించారు. మరోవైపు ట్విషాశర్మ కేసులో అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగామారింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు పార్లర్కు వెళ్లిన దాదాపు గంటసేపు గడిపింది. దీనిపైనా కూడా అత్త గిరిబాల సింగ్ పార్లర్కు వెళ్లి వారిని బెదిరించిందనీ, సీసీటీవీ ఫుటేజ్ను తొలగించాలని కూడా డిమాండ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
‘వాడి జ్ఙాపకాలే ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకర విమాన ప్రమాదానికి ఏడాది నిండింది. 2025, జూన్ 12న టేకాఫ్తో మొదలైన ఆ ప్రయాణం క్షణాల్లో విషాదాంతమైంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్లైనర్ లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయం సమీపంలోని మెడికల్ హాస్టల్ను ఆ విమానం ఢీకొట్టిన దృశ్యం ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.కాలం గడిచినా చెరగని గాయంఈ ప్రమాదంలో జావేద్ అలీ, తన భార్య , ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడింది కేవలం ఒక్కరు మాత్రమే. జావేద్ తల్లి ఫరీదా బానో ఇప్పుడు అనాథలా మిగిలిపోయారు. ఒక తల్లికి తన బిడ్డను పోగొట్టుకోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదంటారు. ఆ ఘటన దరిమిలా ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. A year of grief and waiting: What remains when a plane falls from the sky - A year after the Air India crash, a mother still speaks about her dead son in the present tense and a brother waits for answers. Via @BBC:https://t.co/gjZTBusaFA— 🌊💙 Viking Resistance 💙🌊 (@BlueCrewViking) June 1, 2026‘వాడు నన్ను విడిచి వెళ్లడు’ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నా, తన కొడుకు జావేద్ను తలుచుకుంటూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ‘నా కొడుకు ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ఉండేవాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్లినా, ఏ గదిలో ఉన్నా వాడు నా వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. వాడు నన్ను విడిచి వెళ్లలేదు. వాడి జ్ఞాపకాలే నా ప్రాణంగా బతుకుతున్నాను’ అని ఫరీదా బానో చెప్పిన మాటలు ఎంతటివారినైనా కదిలింపజేస్తాయి.తీరని లోటు - మిగిలిన శూన్యంఈ ప్రమాదం కేవలం 260 మంది ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు. ఎన్నో కుటుంబాల ఆశలను బూడిద చేసింది. 241 మంది ప్రయాణికులు, 19 మంది స్థానికులు ఒకే ఒక్క క్షణంలో కాలగర్భంలో కలిసిపోయారు. భౌతికంగా వారు దూరమైనా, వారి కుటుంబ సభ్యుల గుండెల్లో ద్రవిస్తునన్న వేదన మాత్రం అలానే ఉంది. ఇది కూడా చదవండి: అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్ -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
తమిళ రాజకీయాల్లో కొత్త స్క్రిప్ట్.. అన్నామలైకి మైనస్సే!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ కలకలం నడుస్తోంది. బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. వరుస అవమానాల నేపథ్యంలో అనుచరుల నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయని.. అందుకే పార్టీకి గుడ్బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆ ప్రచార సారాంశం. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ వాతావరణం వేడెక్కించింది మాత్రం.. ఇందులోకి సీనియర్ నటుడు, సూపర్స్టార్ రజినీకాంత్ పేరు వచ్చి చేరడం.మాజీ ఐపీఎస్ అయిన అన్నామలైకి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. అలా ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. ఇక డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చీఫ్గా ఓ మినీ యుద్ధమే చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రతిపక్షం అన్నాడీఎంకే కంటే ఆయన బెటర్ అవుట్పుట్ కనబరిచారు. అయితే.. బీజేపీ ఆ క్రేజ్ను సరిగ్గా వాడుకోలేదనే చర్చ నడుస్తుంటుంది అక్కడ.ఎన్నికల ముందు పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా మొండి చేయి, ఎన్నికల ప్రచారంలోనూ ప్రాధాన్యత తగ్గించడం లాంటి పరిణామాలు ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనం పెంచింది. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు తగ్గిపోవడంతో కొత్త పార్టీ ప్రతిపాదన తెర మీదకు వచ్చిందని తెలుస్తోంది. ఈ పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో “అన్నామలై కొత్త పార్టీ పెడతారా?” అన్న చర్చ వేగంగా పెరిగింది. దీనికి కారణాలుగా నెటిజన్లు చూపుతున్న అంశాలు ఇవి:యువ నాయకుడిగా ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పుల తర్వాత వచ్చిన అనిశ్చితిసాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన మాట్లాడే శైలి.. ఇవన్నీ కలిపి “తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి” అనే ఊహాగానాలకు బలం ఇచ్చాయి.మరోవైపు.. అన్నామలైకి రాజ్యసభ సీటు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారనే ప్రచారం ఈ మధ్యే వినిపించింది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ భావించిందని.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారని.. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి లేదంటే తన పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడే వ్యక్తికే ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నారనన్నది ఆ ప్రచార సారాంశం. ఈలోపు..మరో ప్రచారం తోడైంది. సీనియర్ నటుడు రజినీకాంత్ ఆశీర్వాదంతోనే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తులపై చర్చ వచ్చిన ప్రతిసారీ రజినీకాంత్ పేరు సహజంగానే తెరపైకి వస్తుంది. ఆయనకు ఉన్న విస్తృతమైన ఫ్యాన్ బేస్ అందుకు ప్రధాన కారణం. అలా అన్నామలై కొత్త పార్టీకి రజినీ సపోర్ట్ అంటూ జోరుగా పోస్టర్లతో ప్రచారం నడుస్తోంది. రజినీకాంత్ కర్ణాటక మూలాలు కలిగి ఉండటం, అలాగే అన్నామలై ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య “ కర్ణాటక కనెక్షన్” ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..అన్నామలై చుట్టూ నడుస్తున్న చర్చకు ఒక సమాంతర వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయ ప్రయాణం స్వయంగా ఒక “అన్ఫినిష్డ్ చాప్టర్”గా మిగిలిపోయిందని.. కాబట్టి అనన్నామలైకు ఆ అవసరమే లేదన్నది ఆ వాదన. రజినీకాంత్ 2017–2021 మధ్య రాజకీయ ప్రవేశానికి గట్టి సంకేతాలు ఇచ్చినా, చివరికి పార్టీ ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆరోగ్యం, రాజకీయ ఒత్తిళ్లు, సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కొందరు విశ్లేషకులు—“పొలిటికల్ స్పేస్లో రజినీకాంత్ ఒక ‘మిస్డ్ ఛాన్స్’ మాత్రమే” అని వ్యాఖ్యానిస్తారు.ఇక మరో అంశం సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తోంది. రజినీకాంత్ ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అధికార పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి స్పష్టమైన విమర్శలు చేయకపోవడం, ఆయనను “పాసివ్ స్టాండ్”లో ఉన్న నేతగా చూపిస్తోందని ఒక వాదన ఉంది. కొంతమంది అయితే ఆయన స్టాలిన్ను కలిసిన సందర్భాలను ప్రస్తావిస్తూ, ఆయన డీఎంకేకు సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో.. ఆయన విజయాన్ని రజినీకాంత్ బహిరంగంగా అభినందించలేదన్న అంశాన్ని కూడా కొందరు ఉదాహరణగా చూపుతున్నారు. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “నాకేం అసూయ లేదు” అని ఇచ్చిన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. దీనిని ఆధారంగా చేసుకుని, రజినీ ఇప్పుడు “యాక్టివ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్” కలిగిన వ్యక్తి కాదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.ఈ నేపథ్యంతోనే అన్నామలై వంటి యువ నాయకుడికి రజినీ మద్దతు అవసరం లేదని. కారణం, ఆయనకు ఇప్పటికే ఉన్నది ఒక వేరే పొలిటికల్ ఐడెంటిటీ. ఐపీఎస్ నేపథ్యం, బీజేపీలో ఎదిగిన సంస్థాగత అనుభవం, సోషల్ మీడియాలో ఉన్న యువ ఫాలోయింగ్.. ఇవే ఆయనకు ప్రధాన బలం అని ఈ వర్గం భావిస్తోంది. -
సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్కు డీకే బ్రేక్!
ఢిల్లీ: కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిమండలి కూర్పు వ్యవహారం హస్తినకు చేరుకుంది. మాజీ, కాబోయే సీఎంలు ఇద్దరూ హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలి, ప్రభుత్వం ఎలా సాగాలి అనే దానిపై చర్చిస్తున్నారు. రేపటి(బుధవారం)లోగా కొత్త అమాత్యుల జాబితా రెడీ కావచ్చు.కర్ణాటక కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. అధిష్టానం పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారు. దాదాపు పదిమంది పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ కౌన్సిల్ సీట్ల పైన చర్చలు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, హెచ్కే పాటిల్, బీకే హరిప్రసాద్కు శివకుమార్ మద్దతు పలకగా, అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తున్నారు. సిద్ధరామయ్య వర్గానికి 10కి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.జీ.పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబి పాటిల్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారని.. మరో వైపు ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇవొద్దని డీకే శివకుమార్ వాదిస్తున్నట్లు సమాచారం. అలాగైతే మరో పవర్ సెంటర్గా మారుతారని డీకే వాదిస్తున్నారు. సిద్ధ రామయ్య తనయుడు యతేంద్రకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. తొలి దశలో పది నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు(బుధవారం) ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సిద్దరామయ్య సతీమణి పార్వతి, తనయుడు యతీంద్రకు పదవులు లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. రాజీనామా చర్చల సమయంలో హైకమాండ్ నేతలు సిద్దరామయ్యకు రాజ్యసభ స్థానం ఆఫర్ ఇచ్చారు. కానీ సిద్దరామయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. ఆయనకు బదులు భార్య పార్వతికి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా సిద్దరామయ్య అంగీకరించలేదని, ఆమెకు రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేదని చెప్పారని సమాచారం. ఇక పుత్రుడు యతీంద్రకు మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. -
బాలిక గర్భం కేసులో సంచలనం.. అసలు నిందితుడు తండ్రి
తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు. ఆ సమయంలో తన తండ్రి పెయింటర్గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది. -
స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు
తిరువనంతపురం: కేరళలో జూన్ ఒకటిన కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అయితే ఇంతలోనే తిరువనంతపురంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో ఒకటైన అట్టాకుళంకర సెంట్రల్ హైస్కూల్ భవనంలోని ఒక భాగం ఊహించని రీతిలో కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ తరగతులు ముగిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పెను ప్రమాదం తప్పిందిసాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన ఆ భాగంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయం ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. ఒకవేళ స్కూల్ వేళల్లో గనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే, పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిజనిర్ధారణకు విచారణఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఎన్. షంసుద్దీన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? క్రమ పద్ధతిలో భద్రతా తనిఖీలు జరిగాయా? లేదా? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాతబడిన నిర్మాణాల కండిషన్పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.భయపెడుతున్న పురాతన భవనాలుతిరువనంతపురంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో అట్టాకుళంకర స్కూల్ ఒకటి. ఈ భవనాల దుస్థితిపై గతంలోనే పలుమార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత స్కూల్ భవనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించి, తదుపరి భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త: లైవ్లోకి సీబీఎస్ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్ -
తమిళనాడులో తెరపైకి మరోసారి ఆ వివాదం
చెన్నై: తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ నదీకి మధ్య భాగంలో మేఘదాతు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇవాళ(జూన్ 2, మంగళవారం) తమిళ పార్టీల నేతృత్వంలో చెన్నైలో ఆందోళనలు చేపట్టారు. మేఘదాతు ప్రాజెక్టుకు కర్ణాటకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుండగా.. కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో పిలుపునిచ్చారు.డ్యామ్ను కచ్చితంగా నిర్మించి తీరుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ.. అలాగే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపటినట్లు ఆయన తెలిపారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ సమీపంలో తన నాయకత్వంలో జరిగే ఈ నిరసనలో పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సామాజిక సంస్థలు పాల్గొన్నాయి.ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటక రూ. 5,900 కోట్లు కేటాయించిందని, నిర్మాణ సామగ్రిని కూడా సిద్ధం చేస్తోందని పేర్కొన్న వైగో.. 68 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రతిపాదిత డ్యామ్.. సుప్రీంకోర్టు, కావేరీ నీటి నిర్వహణ అథారిటీ ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఇటీవల వైగో ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు సాగునీటి అవసరాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. మెట్టూరు డ్యామ్కు నీటి ప్రవాహం తగ్గుతుందని, దీనివల్ల కావేరీ నీటిపై ఆధారపడిన డెల్టా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. -
విద్యార్థులకు శుభవార్త: లైవ్లోకి సీబీఎస్ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల తర్వాత జరగాల్సిన రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ప్రారంభం కావాల్సిన ఈ పోర్టల్, సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున 4:42 గంటలకు సీబీఎస్ఈ ఈ పోర్టల్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది.ఆలస్యమైన పోర్టల్ ప్రారంభంసీబీఎస్ఈ తన పోర్టల్ను జూన్ 1న ప్రారంభిస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల అది సాధ్యపడలేదు. సోమవారం రోజంతా వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం బోర్డు అధికారులు వెబ్సైట్ త్వరలోనే లైవ్లోకి వస్తుందని ప్రకటించినప్పటికీ, అర్ధరాత్రి దాటిన తర్వాతే పోర్టల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.సైబర్ భద్రతపై సీబీఎస్ఈ దృష్టిఈ పోర్టల్ ప్రారంభానికి ముందు ‘ఆన్ మార్క్’ (OnMark) పోర్టల్లో కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల సమాచారం, పేపర్ల మూల్యాంకనంలో పారదర్శకతను పెంచేందుకు, సీబీఎస్ఈ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సైబర్ నిపుణులు, ఐఐటీ (IIT) నిపుణుల బృందాన్ని రంగంలోకి దించి, సిస్టమ్ను మరింత పటిష్టం చేసింది. అన్ని లోపాలను సరిదిద్ది, సర్వర్ను సురక్షితమైన వాతావరణంలోకి మార్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.విద్యార్థులకు కీలక సూచనలురీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పుడు అధికారిక పోర్టల్ ద్వారా తమ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఒకవేళ ఇంకా ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, విద్యార్థులు సీబీఎస్ఈ టెలి-కౌన్సెలింగ్ హెల్ప్లైన్ నంబర్ 1800 11 8004 ద్వారా లేదా resultcbse2026@cbseshiksha.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని పారదర్శకంగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది.ఇది కూడా చదవండి: 30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య
బెంగుళూరు: హాసన్ తాలూకా బిట్టగోడనహళ్లిలో వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోగా, భార్య హడావుడిగా అంత్యక్రియలను పూర్తి చేసింది. చివరకు ఆమే, కొడుకు సూత్రధారులుగా తేలింది. పోలీసులు నమోదు చేసిన కేసు మేరకు... మే 18న ఇంట్లో గురుమూర్తి అనే వ్యక్తి పడుకుని అలాగే చనిపోయాడు. భార్య, కొడుకు గబగబా అంత్యక్రియలను ముగించారు. 17 ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన గురుమూర్తికి హాసన్వాసి వీణాతో వివాహం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గురుమూర్తి భార్య వద్దే ఉంటూ, ఓ హోటల్ను నడుపుతున్నాడు. హోటల్ కోసం అప్పులు చేశాడు. సీసీ కెమెరాలలో గుట్టు కోడలు, మనవడు కలిసి తన కుమారున్ని చంపేశారని మృతుని తల్లి రేణుకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గుట్టు బయటపడింది. గురుమూర్తిని భార్య వీణా, మైనర్ కొడుకు కొట్టి చంపిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులచే పోస్టుమార్టం చేయించగా హత్యగానే నిర్ధారణ అయింది. మరోవైపు భార్య భర్త పేరుతో ఇన్సూరెన్స్లు చేసింది. ఆ డబ్బులు వస్తాయని హత్య చేసినట్లు విచారణలో తెలిపింది. ఆమెతో పాటు మైనర్ను అరెస్టు చేశారు. -
30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర
రెండు చేతులూ జోడించి నమస్కరిస్తే భక్తి... అదే రెండు చేతుల మధ్య ఒక చిన్న అగ్గిపుల్లను గీస్తే అది సృష్టి.. మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి. మరెన్నో సాంకేతిక విప్లవాలు దూసుకొచ్చాయి. కానీ, వాటన్నిటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది మాత్రం మన వంటింట్లో ఉండే ఒక చిన్న ‘అగ్గిపెట్టె’. ఒకప్పుడు అడవిలో మంటను వెలిగించడానికి మానవుడు శతాబ్దాల పాటు శ్రమించాల్సి వచ్చేది. అలాంటిది, కాలక్రమేణా ప్రపంచాన్ని మార్చేసిన పారిశ్రామిక విప్లవాన్ని, కళలను, సామాజిక మార్పులను తన చిన్న కాగితపు పెట్టెలో బంధించిందో అగ్గిపెట్టె. కేవలం నిప్పును పుట్టించే సాధనంగానే కాకుండా... ఒకనాటి వైభవాన్ని, స్వాతంత్ర్య ఉద్యమ ప్రచారాలను, నాటి సామాజిక పరిస్థితులను తనపై ముద్రించుకున్న లేబుల్స్ ద్వారా నేటికీ మన కళ్లకు కడుతోంది. అంతటి ఘనత కలిగిన అగ్గిపెట్టె చరిత్రను తన అవిరళ కృషితో మనముందుంచారు కోల్కతాకు చెందిన సావిక్ రాయ్..పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సమీపంలోని సోనార్పూర్కు చెందిన 62 ఏళ్ల సౌవిక్ రాయ్.. మనం నిత్యం వాడి పారేసే అగ్గిపెట్టెలను ఒక చారిత్రక నిధిగా మార్చేశారు. గత 15 ఏళ్లుగా ఆయన సేకరించిన 30,000కు పైగా అగ్గిపెట్టెలు.. కేవలం పాత వస్తువులు కావు, అవి ఒకప్పటి సామాజిక, రాజకీయ, కళాత్మక పరిణామాలకు సజీవ సాక్ష్యాలు.ఒక చిన్న ఆలోచన నుంచి గొప్ప ప్రస్థానంచిన్నతనంలో స్టాంపులు, కాయిన్స్ సేకరించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ సౌవిక్ రాయ్ దృష్టి మాత్రం ఎవరూ ఊహించని అగ్గిపెట్టెలపై పడింది. 2009లో అరుదైన వస్తువుల సేకరణలో ఉన్న నెట్వర్క్తో పరిచయం పెరిగాక, అగ్గిపెట్టెలు కేవలం వెలిగించే వస్తువులు కావని, అవి ఒకప్పటి కాలానికి చెందిన ‘టైమ్ క్యాప్సూల్స్’ అని ఆయన గుర్తించారు.15 ఏళ్ల కృషి.. అమూల్యమైన డాక్యుమెంటేషన్ఒక అగ్గిపెట్టెను సేకరించడం అంటే దాన్ని ప్లాస్టిక్ కవర్లో దాచడం కాదు, దాని చరిత్రను డాక్యుమెంట్ చేయడం అని సౌవిక్ నమ్ముతారు. ఒక్కో అగ్గిపెట్టె తయారీదారు, అది తయారైన కాలం, దానిపై ఉన్న డిజైన్ పరిణామంపై ఆయన ఎంతో పరిశోధన చేశారు. వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చితే, బెంగాల్ చరిత్రపై ఒక పూర్తి స్థాయి పాఠం నేర్చుకోవచ్చని ఆయన చెబుతున్నారు.1870ల నుంచి మొదలై..భారతదేశంలో అగ్గిపెట్టెల వాడకం 1870లలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడంతో మొదలైంది. ప్రారంభంలో ఇవి చెక్కతో తయారయ్యేవి. సౌవిక్ తన సేకరణ కోసం సుమారు 7,000 అగ్గిపెట్టెల లేబుల్స్ ఉన్న ఒక పాత సేకరణను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ లేబుల్స్ దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పటికీ, వాటిని ఆరు నెలల పాటు శ్రమించి అధ్యయనం చేయడం తన జీవితంలో ఒక మలుపు అని ఆయన గుర్తుచేసుకుంటారు.అగ్గిపెట్టెలపై భారతీయ బొమ్మలు19, 20వ శతాబ్దాల్లో జపాన్, స్వీడన్ దేశాలు అగ్గిపెట్టెల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉండేవి. భారతీయ మార్కెట్లో తమ పట్టు పెంచుకోవడానికి, జపాన్ తయారీదారులు ఏనుగులు, భారతీయ దేవతలు, సంస్కృతికి సంబంధించిన బొమ్మలను అగ్గిపెట్టెలపై ముద్రించేవారు. విదేశీయులు కూడా మన మార్కెట్ కోసం తమ కళను ఎలా మార్చుకున్నారో సౌవిక్ సేకరణలో స్పష్టంగా కనిపిస్తుంది.కోల్కతాలోనే 136 అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలుచాలా మంది అగ్గిపెట్టెల తయారీ కోల్కతాలో లేదని భావిస్తారు. కానీ తన దగ్గర ఉన్న ఆధారాలతో అక్కడ ఒకప్పుడు 136 ఫ్యాక్టరీలు ఉండేవని సౌవిక్ నిరూపిస్తున్నారు. 1892-93 నాటి డాక్యుమెంట్లు, 1960ల నాటి యుద్ధ కాలంలో నాశనమైన ఫ్యాక్టరీల వివరాలు ఆయన వద్ద ఉన్నాయి. బెంగాల్లో ఒకప్పుడు 400 మంది పనిచేసే అగ్గిపెట్టెల పరిశ్రమ ఉండేదని ఆయన గుర్తుచేస్తున్నారు.బెంగాల్ నుంచి శివకాశికి..ఒకప్పుడు బెంగాల్లోనే పునాదులు పడిన ఈ పరిశ్రమ, కాలక్రమేణా తమిళనాడులోని శివకాశికి ఎందుకు మారిందో సౌవిక్ వివరిస్తారు. 1920లలో శివకాశి పారిశ్రామికవేత్తలు కోల్కతాకు వచ్చి ఇక్కడ తయారీని నేర్చుకున్నారు. తక్కువ కూలీ, మెరుగైన ముద్రణ వ్యవస్థ, పంపిణీ నెట్వర్క్ ఉండటంతో, శివకాశి ఈ వ్యాపారాన్ని పూర్తిగా కైవసం చేసుకుంది. ఇది బెంగాల్లోని పరిశ్రమ పతనానికి దారితీసింది.కళాఖండాలుగా మారిన అగ్గిపెట్టెల బొమ్మలుఈ చిన్న అగ్గిపెట్టెలు కాలక్రమేణా భారతదేశ సామాజిక మార్పులకు అద్దం పట్టాయి. రాజా రవివర్మ చిత్రలేఖనాల నుంచి వందేమాతరం నినాదాలు, అశోక చక్రం, కోల్కతా ట్రామ్స్, చారిత్రక కట్టడాల వరకు ప్రతిదీ వీటిపై ముద్రితమయ్యేవి. ఇవి కేవలం అగ్గిపెట్టెలు కావు.. చిన్న కాన్వాస్లపై గీసిన భారతదేశ సామాజిక చరిత్ర అని ఆయన చెబుతారు.ప్రభుత్వ గుర్తింపు కోరుతున్న చరిత్రకారుడు30,000 అగ్గిపెట్టెలు ఉన్నాయన్న గర్వం ఆయనకు లేదు. తన సేకరణకు ప్రభుత్వ మద్దతు లభిస్తే, ఆ సామాజిక చరిత్రను భావితరాలకు భద్రపరచవచ్చని ఆయన ఆశిస్తున్నారు. సంఖ్య కంటే కూడా, ఆ వస్తువులను ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆర్కైవ్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని సౌవిక్ రాయ్ చెబుతున్నారు.ఇది కూడా చదవండి: పోలీసులకు చిక్కలేదు.. బాలీవుడ్కు దొరకలేదు! -
నా కుటుంబం నుంచీ రాజకీయాల్లోకి రావచ్చు..!
‘నా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు’ అని సీనియర్ దర్శకుడు, నటుడు ధనుష్ దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా పేర్కొన్నారు. ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగం నుంచి చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. పోయస్ గార్డెన్లో నివశిస్తున్న మీ కొడుకు, నటుడు ధనుష్ కూడా రాజకీయరంగప్రవేశం చేసే అవకాశం ఉందా ? అన్న విలేకరి ప్రశ్నకు దర్శకుడు కస్తూరి రాజా బదులిస్తూ “చెన్నైలో పవర్పుల్ స్రాంతం పోయస్గార్డెన్. గోపాలపురం కూడా ఆ పక్కనే ఉంది. కలైంజ్ఞర్ కరుణానిధి జీవించిన ప్రాంతం అది. వెలుగు పుట్టిన స్థలం అది. ఇళయదళపతి కూడా ఆ ప్రాంతానికి రానున్నారని అని చెబుతున్నారు. రానీయండి. మాకు రాజకీయాలు వద్దు. అయితే మా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. వద్దని చెప్పడానికి మనమెవరం. నేను మాత్రం రాను. వయసు అయిపోయింది. నా కొడుకులు రావచ్చు, మనవళ్లు రావచ్చు. నేను తేని నుంచి చెన్నైకి రావడానికి రూ. 50 లేక కష్టపడ్డాను. 19 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లి అయ్యింది. భార్య విజయలక్ష్మి ఆదరణతోనే చెన్నైకి వచ్చి కష్టపడి దర్శకుడిని అయ్యాను. తుళ్లువదో ఇళౖయె చిత్రం మా కుటుంబాన్ని మార్చేసింది. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్ సినిమాల్లోకి వెళతానని ఆశపడితే ముందు చదువు పూర్తి చెయ్యి ,ఆ తరువాత చూద్దాం అని చెప్పాను. గోల్డ్ మెడల్ పొందిన అతను కాదల్ కొండేన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మా కుటుంబ పరిస్థితి మార్చేసింది. ‘నా ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు చెన్నైలో ప్రముఖ డాక్టర్లుగా రాణిస్తున్నారు’ అని దర్శకుడు కస్తూరిరాజా పేర్కొన్నారు. -
డీఎంకే గుర్తుపై పోటీ చేయడం దురదృష్టకరం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల విజయం అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ డీఎంకే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే ఎంపీ దురై వైకో స్వయంగా పలకడం చర్చకు దారి తీసింది. అంతే కాదు, డీఎంకే చిహ్నంపై తాము పోటీ చేయడం దురదృష్టకరం అని ఆవేదనతో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్కు తిరుచ్చి లోక్సభ సభ్యుడైన దురై వైకో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.విజయ్ సీఎం అయిన తర్వాత ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోను నేరుగా కలిసి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దురై వైకో వరుసగా విజయ్పై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సీఎం విజయ్కు ఆహా్వనం పలికినానంతరం దురై వైకో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ గారు తొలిసారి తిరుచ్చి వచ్చారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ఎంపీగా ఆయనకు స్వాగతం పలకడం నా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిని అధికారికంగా కలిసి తిరుచ్చి లోక్సభ పరిధిలోని పెండింగ్ డిమాండ్లపై వినతిపత్రం సమరి్పస్తానని పేర్కొన్నారు. అలాగే, తిరుచ్చి ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిశానని తెలిపారు. సాంకేతిక కారణాల వల్లే.. పొత్తులు, అసెంబ్లీ సమీకరణాలపై చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ ఎండీఎంకే ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన ఉదయసూర్యుడు గుర్తుపై పోటీ చేసి గెలిచారన్నారు. ఆ సాంకేతిక కారణం వల్లే ఈరోజు తాము అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి నేరుగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే, గతంలో తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి ఇతర ప్రజాస్వామ్య శక్తులు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పారీ్టగా గెలిపించారని, ఆ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలన్నారు. భవిష్యత్తులో ఎండీఎంకే ఏ కూటమిలో ఉండాలో అన్న విషయంగా జూన్ 27వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
బీజేపీ అంత సాహసం చేస్తుందా?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.బహిరంగంగానే అంగీకారంపార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్బుక్ లైవ్లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.అభిషేక్పై అసంతృప్తి?పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి నిష్క్రమణల పరంపరఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎందుకు దూరమవుతున్నారు?రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీజేపీ అంత సాహసం చేస్తుందా?టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనతటీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.అసలైన పరీక్ష ఇప్పుడేబెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. -
ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా?
బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ నితిన్ నబిన్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు.త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది.జూన్ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి. బెంగళూరు సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉంటూ మంచి పేరు సంపాదించారు. -
ముప్పు వాటిల్లనివ్వం
న్యూఢిల్లీ: తమ భూభాగాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ హ్లాయింగ్ పునరుద్ఘాటించారు. ఐదురోజుల భారత పర్యటన నిమిత్తం యూమిన్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన రెండు నెలలకే ఆయన భారత్లో పర్యటనకు రావడం విశేషం. ‘‘భారత భద్రతా ప్రయోజనాలకు విఘాతం కల్గించే కార్యకలాపాలకు మయన్మార్ను నెలవు కానివ్వం. పొరుగుదేశంతో మిత్రత్వం మాకు ముఖ్యం’’అని భారత ప్రధాని మోదీతో భేటీలో హ్లాయింగ్ స్పష్టంచేశారు. మోదీ, హ్లాయింగ్లో ద్వైపాక్షిక సమావేశం వివరాలను తర్వాత భారత విదేశాంగ శాక కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఏళ్ల తరబడి జుండా సైనికపాలన తర్వాత మయన్మార్లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హ్లాయింగ్ మోదీతో వాణిజ్యం మొదలు రక్షణ, సరిహద్దు భద్రత, అభివృద్ధిలో తోడ్పాటు, ఇంధనం, పెట్టుబడులు, వైద్యం, విద్య, కృత్రిమమేధ వంటి సంక్లిష్ట సాంకేతికతలో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మయన్మార్ సార్వబౌమత్వం, అంతర్గత సమగ్రతకు భారత్ కట్టుబడిఉంది. మయన్మార్లో నెలకొంటున్న శాంతియుత వాతావరణంపైనా మోదీ ఆరాతీశారు’’అని మిస్రీ తెలిపారు. ‘‘1,640 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటూ మయన్మార్ భారత్కు వ్యూహాత్మకమైన పొరుగుదేశంగా కొనసాగుతోంది. పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయాభివృద్ధి, శ్రేయస్సే పరమావధిగా ఇరుదేశాలు ఇకమీదటా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి’’అని మిస్రీ పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్, లడాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 37కు చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను చీఫ్ జస్టిస్తో కలిపి 34 నుంచి 38కి పెంచిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న రెండు ఖాళీలను కలుపుకుంటే మొత్తం ఆరుగురు న్యాయమూర్తుల నియామకాలు జరగాల్సి ఉండింది. సుప్రీంకోర్టు కొలీజియం మే నెల 27న ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయడంతో కేంద్రం వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒకే ఒక్క న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉన్నట్లు అయ్యింది. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు... సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సోమవారం నియమితులైన సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రమణి మోహన (59) ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రెండో మహిళా న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన కావడం విశేషం. 2018లో జస్టిస్ ఇందిరా మల్హోత్ర ఇలాగే నేరుగా సుప్రీంకోర్టుకు ఎంపికయ్యారు. 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయ విద్యలో పట్టభద్రురాలైన మోహన ఇప్పటివరకూ ఆ నగరంలోనే వృత్తిలో కొనసాగుతున్నారు. అంతేకాదు... మోహన ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన 12వ వ్యక్తి. మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ బి.వి.నాగరత్న మాత్రమే ఉండగా.. తాజా నియామకంతో ఈ సంఖ్య రెండుకు చేరనుంది. -
జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకే దేశం–ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించడం లేదా పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తకుండా సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రెండు దశల విధానంపై కసరత్తు చేస్తోంది. 2029, 2034 సంవత్సరాల్లో రెండు విడతలుగా దీన్ని అమలు చేసి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమంచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029లో తొలిసారి.. 2034 నాటికి పూర్తిస్థాయిలో.. జమిలీ ఎన్నికల చట్రంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి రెండు దశలవారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా 2029 లోక్సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రాల పదవీకాలంపై ప్రభావం 20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంపై పడే ప్రభావంపై అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రం ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదు నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాలపరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030–31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశి్చమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఒకటి నుంచి రెండేళ్లు తగ్గే ఆస్కారం ఉంది. రాజ్యాంగంలో వెసులుబాటు జమిలి ఎన్నికలను దశలవారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి ముగియకముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, కొన్నింటిలో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొన్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ, అసెంబ్లీల కాలపరిమితిలో మార్పులు జరిగాయని గుర్తుచేశారు. ఇంతటి భారీ మార్పునకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీ య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. 1967 వరకు ఒకేసారి పోలింగ్.. దేశంలో 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు లోక్సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968–69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దు కాగా, 1970లో లోక్సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దీంతో జమిలీ ఎన్నికల తంతుకు తొలిసారిగా బ్రేక్ పడింది. 1971లో లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరిగింది. జమిలిపై వాదోపవాదనలు జమిలి ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని జమిలీ ఎన్నికలను సమరి్థంచేవారు వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే భారీ సమయం, ఖర్చు ఆదా అవుతాయని వారు పేర్కొంటున్నారు. శాసనసభల కాలపరిమితిని తగ్గించడం లేదా పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమాఖ్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నది జమిలి ఎన్నికలను వ్యతిరేకించేవాళ్లు వాదిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 దేశాల విధానాలపై కోవింద్ ప్యానెల్ అధ్యయనం జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన 2023 సెపె్టంబర్ 2న ప్యానెల్ ఏర్పాటైంది. ఈ కమిటీ నివేదిక తయారు చేయడానికి ముందు ఏడు దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్య యనం చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల అనంతరం కోవింద్ కమిటీ తన నివేదికను మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న జేపీసీ తన నివేదికను 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంటులో తదుపరి చర్చ, ఓటింగ్ జరుగుతాయి. -
అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ సోమవారం తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకు పడింది. ‘మంత్రి ప్రధాన్’అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమని ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. రాజధర్మం పాటించి పదవికి రాజీనామా చేయడం మేలని సలహా ఇచ్చింది. ఎక్స్ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్రమేశ్ సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల సాయంతో స్కాన్ చేయాలని సీబీఎస్ఈ 2025 మే నెలలో జారీ చేసిన టెండర్ స్పష్టం చేసిందని, ఈ స్కాన్ల స్పష్టత 300 డీపీఐ వరకూ ఉండాలని కూడా నిర్దేశించిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. అయితే ఆగస్టులో ‘స్కానర్లు’అన్న నిబంధనను నిశ్శబ్ధంగా తొలగించారని, స్పష్టతను కూడా 200 డీపీఐకి తగ్గించారని రాహుల్ ఆరోపించారు. ఫలితంగా జవాబు పత్రాల నాణ్యత బాగా తగ్గిపోయిందని, చాలా పత్రాలు అస్పష్టంగా ఉండటంతోపాటు, కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని దీనివల్లే మార్కుల జారీలో గందరగోళం ఏర్పడిందని రాహుల్ గాంధీ ‘నిసర్గ’ఎథికల్ హ్యాకర్ పోస్టును షేర్ చేశారు. ‘‘ఇది కచ్చితంగా మోసమే. తప్పుడు మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థీ బాధితుడే’’అని స్పష్టం చేశారు. మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు సమయమున్న ప్రధానమంత్రి 18.5 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్షీట్లకు సంబంధించి మాత్రం నోరు మెదపలేకపోయారని విమర్శించారు. కోఎంప్ట్ పై చర్యలెందుకు లేవు: జైరామ్ రమేశ్ సీబీఎస్ఈ వివాదంలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తప్పు పట్టారు. ఎక్స్లో ఆయన ఒక పోస్టు పెడుతూ ఓఎస్ఎం సాఫ్ట్వేర్లో భద్రత లోపాలను వారాలపాటు నిరాకరించిన సీబీఎస్ఈ ఎట్టకేలకు అంగీకరించిందని, బహుశా ఈ విషయం ముందుగానే తెలియడం వల్లనే కోంఎప్ట్కు అనుగుణంగా నిబంధనలను మార్చి ఉంటారని విమర్శించారు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టు సంస్థలను బ్లాక్లిస్ట్ చేస్తామని 2025 ఆగస్టు టెండర్ నిబంధనలు స్పష్టం చేయగా సెపె్టంబర్ నెలలో సవరణల పేరుతో ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని రమేశ్ ఎత్తిచూపారు. కోఎంప్ట్ను రక్షించేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమిదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి ప్రధాన్ అసమర్థతకు, అహానికి నిలువెత్తు నిదర్శనం. తన రాజకీయ అజెండాను అన్ని రకాల బాధ్యతలకు అతీతంగా ముందుకు నడిపించాలని చూసే వ్యక్తి’’అని ఆరోపించారు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం కేంద్ర విద్యా శాఖ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా జైరామ్ రమేశ్ ఇంకో ఎక్స్ పోస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఇది (ప్రమాద ఘటన) కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థ పునాదులు ధ్వంసం: పవన్ ఖేరాపన్నెండేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా సోమవారం విమర్శించారు. ‘‘సీబీఎస్ఈ కాంప్రమైజ్ అయిపోయింది. యూజీసీ ధ్వంసమైపోయింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు కాషాయమైపోయాయి. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లను ఆర్ఎస్ఎస్ నియమిస్తోంది. విద్యార్థులు ఎవరైనా ప్రతిఘటిస్తే అణచివేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ యవత హక్కులు కాలరాస్తున్నారు. నిరుద్యోగం ప్రబలిపోయింది. శాస్త్రీయ దృక్పథం కొరవడింది.’’అని ఆయన మోదీ హయాంపై విమర్శలు వెల్లువెత్తించారు. భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు. పరీక్ష పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో ప్రధాని తన ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూంటే... పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రం రోజూ ఎంతో వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. ఓఎస్ఎంపై ఉపాధ్యాయులు, నిపుణులు సుమారు 36 ప్రధాన లోపాలను ఎత్తిచూపినా సీబీఎస్ఈ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. -
భారత్కు తిరిగొస్తున్న సీజేపీ దీప్కే
న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత బొద్దింకల్లా సమాజాన్ని పాడుచేస్తోందన్న విమర్శలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విదేశాల నుంచి భారత్కు తిరిగొస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ ఉదంతం, క్యూట్–యూజీ పరీక్ష ఆలస్యం ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ తాను జూన్ ఆరోతేదీన ఢిల్లీలో శాంతియుత ధర్నా చేపట్టనున్నట్లు దీప్కే ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’, ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియోను విడుదలచేశారు. ‘‘మనందరం ఒక్కతాటి మీదకొచ్చి శాంతియుత నిరసన ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగబద్ధ మార్గంలో పయనిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని శాంతియుతంగా మన నిరసన వాణిని వినిపిద్దాం. మనందరం ఒక్కటిగా గొంతుకను వినిపిస్తే మన వాదనలతో వాళ్లు కూడా ఏకీభవిస్తారు. జూన్ ఆరోతేదీన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. శనివారం సాయంత్రం ఢిల్లీకి రాగానే మనందరం కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్కు వెళ్దాం. శాంతియుత ర్యాలీకి అనుమతికోరదాం. పరీక్షల సంబంధల వివాదాలతో లక్షలాది మంది పరీక్షార్థులు ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నారు. దీనికి ప్రభుత్వం, నేతలు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని దీప్కే అన్నారు. ‘‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ మొదలైన ఆన్లైన్ సంతకాల ఉద్యమంలో ఇప్పటికే లక్షలాది మంది సంతకాలు పంపించారు. ఉత్తరప్రదేశ్ మొదలు రాజస్థాన్, మహారాష్ట్రదాకా విద్యాసంబంధ నిరసనకార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి’’అని దీప్కే గుర్తుచేశారు. ‘‘ఇటీవలి కాలంలో వివాదాలకు నిలయంగా మారిన పలు పరీక్షల కారణంగా దాదాపు కోటి మంది పరీక్షార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఇంతజరిగినా మంత్రి ప్రధాన్ రాజీనామాచేయట్లేదంటూ దేశంలో జవాబుదారీతనమే లేదని స్పష్టమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, వివాదంతో నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే అరెస్ట్చేస్తారని నా కుటుంబసభ్యులు, బంధువులు, స్నహితులు చెబుతున్నారు. నాకు మద్దతిచ్చే వారంతా ఎయిర్పోర్ట్కు వచ్చి మనలోని ఐక్యతను చాటండి’’అని దీప్కే పిలుపునిచ్చారు. ‘‘ఇప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని నమ్ముతున్నా. మన ర్యాలీకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నా. మహాత్మాగాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ అంటే నాకు అమితమైన భక్తి. అందరికంటే నాకు రాజ్యాంగంపై విశ్వాసం ఎక్కువ. జైలుశిక్ష భయంతో ఎన్నాడూ భయపడుతూ బతకగలం? శాంతియుతర్యాలీలను ప్రోత్సహించే రాజ్యాంగానికి బద్దులైన బొద్దింకలన్నీ ఏకమై కోట్లాది మంది విద్యార్థుల భవితను కాపాడాలి’’అని దీప్కే వ్యాఖ్యానించారు. -
సెలవుల్లో సీనియర్లకు నో ఎంట్రీ యువ న్యాయవాదులకే ఛాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం (వెకేషన్ బెంచ్) ముందు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను అనుమతించేది లేదని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. సెలవుల్లో కేవలం యువ న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్)లకు మాత్రమే తన కోర్టులో అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పారు. తమ కేసులను ప్రస్తావించేందుకు ప్రయతి్నంచిన పలువురు సీనియర్లను న్యాయమూర్తి వారించారు. తనకు అధికారికంగా సీనియర్ హోదా లేనందున వాదించేందుకు అనుమతివ్వాలని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర కోరగా నిరాకరించారు. ఈ నిర్ణయం తమకు ముందుగా తెలియదని, కనీసం రేపటి నుంచైనా అమలు చేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోరారు. గత వారం నోటీసులు జారీ చేసిన కేసుల్లో తాము ఇదివరకే హాజరైనందున, ఈ రోజైనా వాదించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ధర్మాసనాలు సీనియర్లను అనుమతిస్తున్నాయని గుర్తుచేశారు. మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సైతం అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్ల విజ్ఞప్తులను జస్టిస్ విక్రమ్నాథ్ తోసిపుచ్చారు. యువ న్యాయవాదులు, ఏవోఆర్లను ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ ఒకటి నుంచి జూలై 12వ తేదీ వరకు సెలవుల కాలంలో పని దినాల్లో తన కోర్టులో సీనియర్లకు అనుమతి లేదన్నారు. ఈ నిబంధన ఎవరికీ తెలియదన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. గత నాలుగేళ్లుగా ప్రతి వెకేషన్లోనూ తన బెంచ్ ఇదే విధానాన్ని పాటిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. నెడుంపర అభ్యర్థనపై స్పందిస్తూ.. తన దృష్టిలో ఆయన సీనియర్ న్యాయవాదేనని పేర్కొన్నారు. గత వారం హాజరైన కేసుల్లో వాదించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనలను సైతం ధర్మాసనం అంగీకరించలేదు. తన వైఖరిని మార్చుకునేది లేదని జస్టిస్ విక్రమ్నాథ్ తేల్చిచెప్పారు. కోర్టు హాలు నుంచి సీనియర్ న్యాయవాదులను పంపించి వేయాలని కోర్టు మాస్టర్ను ఆదేశించారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేను సైతం అనుమతించని న్యాయమూర్తి.. ఆయన స్థానంలో సహాయక న్యాయవాది వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
‘దివ్యాంగుల చట్టం’ అమలుపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల హక్కుల చట్టం–2016 దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చట్టం తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని శశాంక్ పాండే అనే లాయర్ వేసిన పిల్పై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం తెచ్చిన ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పించలేదని తెలిపారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కమీషన్లు, బోర్డులు చురుగ్గా పనిచేయడం లేదని తెలిపారు. అధికార యంత్రాంగం మెజారిటీ కేసుల్లో వికలాంగుల కమిషన్ల సిఫార్సులను అమలు చేయడం లేదు. అలా అమలు చేయకపోవడానికి గల కారణాలను కూడా వారు సమర్పించడం లేదని పిటిషన్ పేర్కొన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. దివ్యాంగుల హక్కుల కోసం చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం కేవలం కాగితాలకే పరిమితం కారాదని, అప్పుడే దివ్యాంగుల జీవితాల్లో ఆచరణాత్మక మార్పులు వస్తాయని అభిప్రాయపడింది. సమాజంలో వారికి అవరోధాలు లేని వాతావరణం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ వాజ్యంపై స్పందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు, రిజర్వేషన్ల అమలు, ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి స్పందన అందిన తర్వాత తదుపరి విచారణ చేపడతామంటూ ధర్మాసనం కేసును వాయిదా వేసింది. -
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ తరఫున వరుసగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానిగా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం, ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ‘విశ్వాసం–అభివృద్ధి–ప్రజా సంక్షేమం’నినాదంతో జూన్ 7 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు ‘ప్రగతి పథ యాత్ర’లు, ‘వికసిత్ భారత్ సంకల్ప్’సదస్సులు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి పదాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12 ఏళ్ల మోదీ పాలన ప్రచార అంశాలతో పాటు, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కొత్త వారికి అవకాశాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అంశాలపై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రచార కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలు ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అమలైన ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించనున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, దేశ సమగ్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లా స్థాయిలో నలుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక బృందాలను బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఎంపీ తన లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోజు, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక రోజు పర్యటించనున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన కనీసం 500 మంది ప్రముఖులను కలిసి ప్రభుత్వ విజయాలను వివరించే సమాచార పత్రాలను అందజేసి సన్మానించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ వాయ్ వందన, పీఎం సూర్య ఘర్, పీఎం స్వనిధి, లక్పతి దీదీ, వీబీ–జీ–రామ్ పథకాల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కొత్త జట్టుపై ముమ్మర కసరత్తు... పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఈ నెలలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాటి సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రస్తుత పదాధికారులకు మార్పులు ఉండవచ్చని, కొంతమంది కేంద్ర మంత్రులను సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను రాష్ట్రాల నుంచి ఆశావహుల జాబితాను సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్ర పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయా పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేక పునర్వ్యవస్థీకరణపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక, 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల గడువు జూన్ 8తో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపైనా భేటీలో రాష్ట్రాల నేతలు, అధ్యక్షుల నుంచి అధ్యక్షుడు నితిన్ నబీన్ అభిప్రాయాలు సేకరించినట్లు చెబుతున్నారు. -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ వివాదంపై దిగువ కోర్టు సూచనల మేరకు ఇరుపక్షాలు మధ్యవర్తిత్వ కేంద్రంలో రాజీకి వచ్చాయి. లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాజీ షరతుల ప్రకారం నడుచుకున్నప్పటికీ.. తనపై పెట్టిన చీటింగ్ కేసును వెనక్కి తీసుకునేందుకు ఎదుటి పక్షం నిరాకరిస్తోందంటూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన క్లయింట్ను వేదించాలనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్ను కొనసాగిస్తున్నారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఒప్పందంలోని కొన్ని షరతులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అందుకే కేసును వెనక్కి తీసుకోలేదని ప్రతివాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు, మధ్యవర్తిత్వ కేంద్రం సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ..కోర్టుల సమయాన్ని ఆదా చేయడానికి, కేసుల సత్వర పరిష్కారం కోసమే మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. ఇరుపక్షాలు స్వచ్ఛందంగా రాజీ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత, అందులోని షరతులకు తప్పక కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కేసులను వెనక్కి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొనసాగించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు కేవలం కక్ష సాధింపు చర్యల కిందకే వస్తాయని, న్యాయపరమైన ప్రయోజనం ఏమీ ఉండదని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. పిటిషనర్పై నమోదైన చీటింగ్ ఎఫ్ఐఆర్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజీ ఒప్పందంలోని షరతులను ఇరుపక్షాలు నిరీ్ణత వ్యవధిలోగా తూచా తప్పక పాటించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి కొత్త ఫిర్యాదులు, క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
బీజైపీకీ అన్నామలై గుడ్బై..?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అనంతరం త్వరలోనే సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.బీజేపీ నేత అన్నామలైకి అధిష్ఠానంతో అస్సలు పొసగడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం తిరిగి AIADMKతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు, భవిష్యత్తు లేవనే అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్తో సమావేశం కావడానికి నిన్న( సోమవారం) ఢిల్లీ పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు పలకరించగా.. "దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి బీజేపీ జెండా లేకపోవడంతో ఆయమ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.ప్లాన్ సిద్ధమైందా..?కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఇప్పటికే "మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు" అనే నినాదాలతో భారీ పోస్టర్లు వెలిశాయి. ఆయన ప్రస్తుతం నడిపిస్తోన్న "వి ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థ ఆధారంగా ఒక బలమైన నెట్వర్క్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఉద్యమం చేపట్టి ఆపై దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చేలా అన్నామలై వ్యూహం రచిస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.సోమవారం కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.కాగా, బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. -
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్లో ఉంటూ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్ నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.షకీల్ ముఠాకు నియామకాల బాధ్యత కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్ఐకి ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి.ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్ తెలిపాయి. -
ఇదేందయ్యా ఇది.. 45 లీటర్ల ట్యాంక్కు 52 లీటర్ల పెట్రోల్!
బంక్ల వద్ద పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం ఇచ్చిన మొత్తానికి అంత పరిమితిలో పెట్రోల్ కొట్టారా.. లేదా అనే అనుమానం సాధారణంగా వాహనదారులకు వస్తూ ఉంటుంది. అందుచేత తాము నమ్మిన బంక్లకే ఎక్కువగా వెళుతూ ఉంటారు వాహనదారులు. అయితే ఈ తరహాలో జరిగే మోసాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అన్ని బంక్లలో ఇలా చేయకపోయినా కొన్ని బంక్లు ఈ తరహా మోసాలు చేస్తారనడానికి తాజా ఘటనే నిదర్శనం. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో ఈ తరహా మోసం వెలుగుచూసింది. కొత్త కారు తీసుకున్న వ్యక్తి ఫుల్ ట్యాంక్ చేయిద్దామని బంక్కు వెళితే అతనికి విపత్కరణ పరిణామం ఎదురైంది. తన కారు ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లైతే, 52 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు బిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా అతను షాక్ తిన్నాడు. తన కారు ట్యాంకు కెపాసిటీ ఎంత అని పలుమార్లు చెక్ చేసుకున్న తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అని, మరి ఇంకా ఏడు లీటర్ల పెట్రోల్ ఎందుకు ఎక్కువైందని ఆ బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. కాన్పూర్కు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి ఈ పరాభవం ఎదురుకాగా, ఆ మోసం ఎలా జరిగిందో వివరించాడు. తొలుత 41 లీటర్ల ఇంధనాన్ని నింపి ఆపేసి, మళ్లీ పెట్రోల్ కొట్టడం ప్రారంభించారన్నాడు. పెట్రోల్ కొట్టడాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించగా, ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు రెండు విడతల్లో కొట్టాలని సిబ్బంది బదులిచ్చారని చరణ్ సింగ్ తెలిపాడు. పెట్రోల్ నింపడంలో ఆలస్యం కావడం, చివరకు మొత్తం 52 లీటర్ల పెట్రోల్ అని పేర్కొన్న బిల్లును చేతికి అందించగానే తాను షాక్కు గురైనట్లు తెలిపాడు. దీనిపై పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. మేనేజ్మెంట్ కూడా సరిగా సమాధానం చెప్పక పోవడంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. స్థానిక తూనికలు, కొలతల అధికారుల కుమ్మక్కుతో ఒక వ్యవస్థీకృత మోసాల దందా నడుస్తోందని ఆరోపిస్తూ సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పంపిణీ యంత్రాలలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోనని తనిఖీ చేయడానికి జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
బీజేపీ అభ్యర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి
నాగ్పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ లఖానీ కుమారుడు శరంగ్ లఖానీతో రేవతి వివాహం ఈ నెల 20న జరగనుంది. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన అరుణ్ లఖానీ కుటుంబంతో సుప్రియా సూలే వియ్యమందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వేర్వేరని అరుణ్ లఖానీ స్పష్టం చేశారు.మహారాష్ట్రలో పెద్ద రాజకీయ కుటుంబమైన పవార్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం కలుపుకుంటున్నామని వెల్లడించారు. పవార్ కుటుంబంతో తమకు బంధుత్వం కూడా ఉందని తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తాము ఆయా పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బంధుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగి ఎంపికైన తనకు సుప్రియా సూలే అభినందనలు చెప్పినట్టు మరాఠీ న్యూస్ చానల్తో అరుణ్ లఖానీ చెప్పారు.గెలుపుపై దీమాప్రజలు తమ కోసం పనిచేసే వారినే ఎన్నుకుంటారని అరుణ్ లఖానీ (Arun Lakhani) అన్నారు. చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పారిశ్రామికవేత్తలకే బీజేపీ ప్రాధాన్యంఅరుణ్ లఖానీకి బీజేపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసిందని, పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుందన్నారు. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అంతర్గత ఆందోళనలకు సంకేతమని ఆరోపించారు. చంద్రపూర్ స్థానానికి కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ కార్యదర్శి, పలు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్న శైలేంద్ర అగ్రవాల్ను అభ్యర్థిగా నిలబెట్టినట్లు విజయ్ వడెట్టివార్ తెలిపారు.18న ఎన్నికలుమహారాష్ట్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన 16 శాసన మండలి స్థానాలకు, నాగ్పూర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా వ్యవహరించే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్నారు. -
సీఎం విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ రహస్యం బయట పడింది
సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన ఘటన, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..బులంద్షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!Bulandshahr, UP : Monkey 🙈 snatched a bag with ₹2 Lakh , climbed on a tree and started showering cash from the top of the tree 😳 pic.twitter.com/Sy2tbz21ce— Amitabh Chaudhary (@MithilaWaaala) June 1, 2026 కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు -
వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!
నటులుగా వెండితెరపై మెరవడం మాత్రమే కాదు, సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్)తో ఆకట్టుకున్నారు. ఆరోగ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఆలోచనతో చాలా మంది ప్రముఖులు సొంతంగా ఫామ్హౌస్లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఒకరు. నటన మాత్రమే కాదు., ఆర్గానిక్ ఫార్మింగ్లోనూ సూపర్స్టార్ అనిపించుకుంటున్న మోహన్లాల్ పచ్చని స్వర్గం గురించి తెలుసుకుందాం.భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూసిన అత్యంత విజయవంతమైన సూపర్స్టార్లలో మోహన్లాల్ కూడా ఒకరు. అయితే, ఆయన ఆసక్తులు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు.సినిమాతో పాటు థియేటర్, సంగీతం, వ్యాపారం, మ్యాజిక్ వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మోహన్లాల్, ఎర్నాకుళం జిల్లా కరూర్ పరిధిలోని ఎలమక్కరలో ఉన్న తన ఇంటి పక్కన గల అర ఎకరం భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రీయ వ్యవసాయం) చేస్తూ ఒక పచ్చని నందనవనాన్ని సృష్టించారు.అయితే సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆలోచన కోవిడ్ లాక్డౌన్ సమయంలో హఠాత్తుగా ఏమీ ప్రారంభించలేదు. 2010ల మధ్యకాలం కాలంనుంచే ఆయన ఈ పనిలో ఉన్నారు. అయితే, 2020-2021 కోవిడ్ లాక్డౌన్ల సమయంలో సినిమా షూటింగులు, ఇతర వినోద కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయన తన పూర్తి సమయాన్ని ఈ వ్యవసాయంపైనే కేంద్రీకరించారు.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!ఇక ఆయన తోటలో పండని కూరగాయ లేదంటే అతిశయోక్తి లేదు. మోహన్లాల్ గతంలోనే ఒక వీడియోలో వెల్లడించినట్టు కాకరకాయ, బీన్స్, బెండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, మొక్కజొన్న, కర్రపెండలం వంటి కూరగాయలు పండిస్తున్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇక్కడ పండిన సొంత కూరగాయలనే తింటానని ఆయన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఉంటారు కూడా. స్థలం లేని వారు గ్రో బ్యాగుల్లో (Grow bags) అయినా తమకు కావలసిన కూరగాయలను పండించుకోవచ్చని ఆయన అందరికీ పిలుపునిచ్చారు. అన్నట్టు మోహన్లాల్కు పెంపుడు జంతువులన్నా కూడా చాలా ప్రేమ.మరోవైపు కెమికల్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు అప్పటి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కూడా మోహన్లాల్ను అభినందించారు. ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!'దృశ్యం 3'తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులుదృశ్యం 3తో మలయాళ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన మోహన్లాల్ మోహన్ లాల్ కరియర్పరంగా ఆలోచిస్తే దాదాపు 45 ఏళ్లకు పైగా సినీ కెరీర్లో 360 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి, రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు ,ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన 'దృశ్యం 3' (2026) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మే 31, ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 219.75 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు -
ట్రాఫిక్ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్ వస్తుంటే అడ్డుగా కూర్చొని..
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్.. మోటర్కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో అతడు వాగ్వివాదానికి దిగాడు.వారి మధ్య జరిగిన సంభాషణనిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.This…— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026 -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ కీలక ప్రకటన
ఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేందుకు భారత్కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.అయితే, అభిజీత్ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. Important announcement:CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026 -
బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు
పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్గఢ్లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్గా మారింది.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా! తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా లైఫ్ పార్ట్నర్తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! -
65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!
బరువు తగ్గాలంటే వాకింగ్ కీలకం అనేది చాలామంది ఫిట్నెస్ నిపుణులు చెప్పేమాట. రోజుకు 5-10 వేల అడుగులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే బిజీ షెడ్యూల్స్, వర్షంవల్ల, మండే ఎండలు లాంటి వాతావరణ అననుకూలత వల్ల రోజుకు 10వేల అడుగులు వేయడం ఎలా? అనుకుంటున్నారా? అయితే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకుండానే కేవలం 65 నిమిషాల్లో 10వేల అడుగులు ఎలా పూర్తి చేయాలో ఫిట్నెస్ కోచ్ రీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఇండోర్ వర్కౌట్ ప్లాన్ వివరాలు చూద్దామా.వార్మ్-అప్, హై-నీ మార్చింగ్, స్టెప్-అప్స్, వాక్-అండ్-లంజ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాల కలయికతో ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేయవచ్చని రీత్ కూర్ తెలిపారు. ప్రతిరోజూ 10వేల అడుగులు నడవాలనే ఆలోచన మెరుగైన ఫిట్నెస్ , బరువు నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అయితే, తీరికలేని పనులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మరియు ఎక్కువ పని గంటల కారణంగా, చాలా మందికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా అనిపిస్తుంది.అందుకే తగినప్లాన్ అవసరం . ఎలా అంటే65 నిమిషాల్లో అంటే గంట 5 నిమిషాల్లో 10వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే., సగటున నిమిషానికి 167 అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 10వేల అడుగులు కాకుండా, ఫిట్ నెస్ను బట్టి నెమ్మదిగా ప్రారంభించాలి.వార్మ్-అప్ (5 నిమిషాలు)వర్కౌట్ ప్రారంభించే ముందు గాయాలు కాకుండా కండరాలను సిద్ధం చేయడానికి ఇది చాలా అవసరం. ఒకే చోట నిలబడి నడవడం (March in place), చేతులు తిప్పడం , పక్కలకు చిన్న అడుగులు వేయాలి. తద్వారా సుమారు 500 అడుగులు వస్తాయి.మెయిన్ ఇండోర్ వర్కౌట్ (50 నిమిషాలు)బోరింగ్గా అనిపించకుండా ఉండటానికి ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒకసారి క్రింది వ్యాయామాలను మారుస్తూ చేయాలి.హై-knee మార్చింగ్ లేదా ఒకే చోట జాగింగ్ అంటే మోకాళ్లను పైకి లేపుతూ, చేతులను వేగంగా కదిలిస్తూ జాగింగ్ చేయాలి. దీనివల్ల దాదాపు 1,200–1,500 అడుగులు వస్తాయి.స్టెప్-అప్స్ (5 నిమిషాలు): ఇంట్లోని మెట్లు లేదా ఏదైనా బలమైన కుర్చీ సహాయంతో కాళ్లు మారుస్తూ పైకి, కిందికి అడుగులు వేయాలి. ఇది కాళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల 600–800 అడుగులు వస్తాయి.ఫ్రీస్టైల్ డ్యాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు): మీకు నచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ పెట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేయాలి. దీని ద్వారా 1,500 కంటే ఎక్కువ అడుగులు సాధించవచ్చు.వాక్-అండ్-లంజ్ కాంబో (5 నిమిషాలు): గదిలో 10 అడుగులు నడిచిన తర్వాత ఐదు లంజెస్ (Lunges) వ్యాయామం చేయాలి. ఇది లోయర్ బాడీని బలోపేతం చేస్తుంది. దీనివల్ల 500 అడుగులు వస్తాయి.సైడ్ స్టెప్స్ & స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు): పక్కలకు పెద్ద అడుగులు వేస్తూ చిన్నగా గెంతాలి. ఇది కాళ్లు మరియు కోర్ (Core) కండరాలకు మంచిది. దీనివల్ల 800 అడుగులు లభిస్తాయి.పవర్ మార్చింగ్ (10 నిమిషాలు): వేగంగా మెట్లు ఎక్కడం లేదా ఇంట్లోనే వేగంగా అడుగులు వేయడం చేయాలి. దీనివల్ల కేవలం 10 నిమిషాల్లోనే 2,000 అడుగుల వరకు వస్తాయి.స్ట్రెచింగ్ (5 నిమిషాలు)హై-ఇంటెన్సిటీ వర్కౌట్ పూర్తయిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.నెమ్మదిగా నడవడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, బాడీ స్ట్రెచింగ్ చేయడం లాంటి కూల్ డౌన్ ప్రక్రియ ద్వారా చివరిగా మిగిలిన 500 అడుగులు దీని ద్వారా పూర్తవుతాయి. ఈ విధంగా సరైన పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తే, జిమ్కు లేదా పార్కుకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని మీ ఫిట్నెస్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. View this post on Instagram A post shared by Reet Kaur | Fat Loss Coach | Thyroid & Postpartum (@transformationwithtwins)నోట్ : సాధారణంగా వాకింగ్ చేయడం చాలా సులభం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా మెల్లగా సాధన చేసుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య ఉంది అనిపించినపుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
విద్యావ్యవస్థ : చైనాలో అలా.. ఇక్కడిలా!
ఒకే వయసు, ఒకే ప్రతిభ, ఒకే కలలు కంటున్న పిల్లల మధ్య భవిష్యత్తు పూర్తిగా వేరుగా ఉండటానికి కారణం ఒక్కటే – చదివే స్కూల్. ఇది సాధారణ విద్యా వ్యత్యాసం కాదు, కొత్త అసమానతల అగాథం. పిల్లల మధ్య పోటీ ఇప్పుడు 10వ తరగతిలో కాదు, ఎల్కేజీలోనే మొదలవు తోంది. ధనికుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ ఎక్స్పోజర్తో చదువుతుంటే, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు భారీ ఫీజులు, రుణాలు చెల్లించి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా విద్య అనేది పెట్టుబడిగా కాకుండా రుణ ఉచ్చుగా మారుతోంది. ఇది ‘ఎవరు బాగా చది వారు’ అనే పోటీ కాదు, ‘ఎవరు మంచి ప్రారంభ స్థానం పొందారు’ అనే అసమాన పోటీగా మారింది. 1990ల తర్వాత జనాభా పెరిగింది, చదువు మీద ఆసక్తి పెరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సకాలంలో విస్తరించలేదు. ఇంగ్లీష్ మీడియం ఆలస్యంగా ప్రవేశ పెట్టింది. ఈ ఖాళీని ప్రైవేటు రంగం పూరించింది. ఏసర్ 2024 ప్రకారం 6–14 వయసు పిల్లల్లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 66.8 శాతానికి పడిపోయింది (2022లో 72.9%, 2018లో 65.6%). తెలంగాణలో యూడీఐఎస్ఈ 2024–25 డేటా ప్రకారం, క్లాస్ 1లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 26 శాతానికి పడిపోయింది. 2013–14తో పోలిస్తే 40 శాతం తగ్గుదల. ప్రైవేటు స్కూళ్లలో విద్యా వంతులైన తల్లిదండ్రులు, హోమ్ సపోర్ట్, సెలెక్టివ్ అడ్మిషన్స్ ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, పేదరికం, ఆరోగ్య–పోషకాహార సమస్యలు ఉన్న పిల్లలు ఎలాంటి సెలెక్షన్ లేకుండా చేరుతారు. ‘నీళ్లు ఉన్న చోట ఎవరైనా పంట పండించ వచ్చు. ఎడారిలో పంట పండించడం కష్టం’ అన్న సూక్తి ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. సమస్య ప్రభుత్వ స్కూళ్ల వైఫల్యం కాదు, వ్యవస్థ డిజైన్, అమలు, పెట్టుబడి లోపాల్లో ఉంది. ఒకప్పుడు రైతు కొడుకు డాక్టర్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పుట్టిన కుటుంబం భవి ష్యత్తును చదువు నిర్ణయిస్తోంది.విద్యా వర్గ విభజనవరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అంతర్ తరం సామాజిక గతిశీలత (ఒక సామాజిక వర్గం నుంచి మరొక వర్గానికి ఎదగడం) నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. పేద కుటుంబాల నుంచి ఉన్నత స్థాయికి ఎక్కడం అరుదైన విషయం. ఇది క్లాస్ లాక్–ఇన్కు (వర్గ బంధనం) దారి తీస్తోంది. ఇలా కొనసాగితే మన సమాజం అవకాశాలు కలిగినవారు, అవకాశాలు కోల్పోయినవారు అనే రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదముంది.చైనాలో విద్యా వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్య మైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. కానీ మన దేశంలో మిడిల్ క్లాస్, పేద వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చైనా విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా జీడీపీకి దోహదపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కావాలి. అన్ని వర్గాల పిల్లలు ఒకే స్కూల్లో చదివే కామన్ స్కూలింగ్ సిస్టమ్ ఉండాలి. దానికి తగినట్టుగా ఆధునిక మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణ, పెట్టుబడుల పెంపు అవసరం. ‘క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ – నాట్ ఫర్ ది ప్రివిలేజ్డ్’ అన్నది మన మార్గదర్శక సూత్రం కావాలి.చైనాలో విద్యావ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. -డా. మేడా జగన్మోహన రావు వ్యాసకర్త విద్యారంగ నిపుణులు -
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నిలకకు సంబంధించిన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పది రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. -
కన్నప్రేమను పంచిన ‘ఆంటీ’.. కానరాని లోకాలకు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు.విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న పార్వతి అక్కడి విద్యార్థులకు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక తల్లి చూపించే ఆప్యాయతను కూడా పంచేవారు. హోమ్లీ ఫుడ్తో పాటు ఆమె చూపే ప్రేమ కారణంగా పలువురు విద్యార్థులు ఆమెను ‘పార్వతీ ఆంటీ’ అని పిలుచుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ధరలు పెంచకుండా, విద్యార్థులకు ఆమె చక్కని ఆహారం అందించారని స్థానికులు చెబుతుంటారు.ప్రాణాలకు తెగించి..ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన సమయంలో పార్వతి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ లోపల విద్యార్థులు చిక్కుకున్నారని తెలియగానే, వారిని రక్షించేందుకు ఆమె లోనికి వెళ్ళారు. అదే సమయంలో భవనం పూర్తిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద చిక్కుకుపోయారు. 16 గంటల సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ఢిల్లీలో అక్రమ కట్టడాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తనిఖీలు లేని భవనాలు ఎలా మరణశాసనంగా మారుతున్నాయనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. -
అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది.. వీడియో చూస్తే వణుకే!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు భయంకరమైన విషసర్పం రెండు గంటలు ఒళ్లంతా చుట్టేసినా సురక్షితంగా బయటపడ్డాడో వ్యక్తి. ఒడిశాలోని బౌధ్ జిల్లా అదెనిగఢ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తి రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిన ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎట్టకేలకు ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతమని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.ఏం జరిగిందీ అంటే..హరభంగ బ్లాక్ పరిధిలోని అదెనిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు. ఈయన పక్షవాతం (Paralysis) బాధపడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన తన ఇంట్లో పడుకుని ఉండగా, తెరిచి ఉన్న కిటికీ లోంచి ఒక విషసర్పం గదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి గాధనిద్రలో ఉన్న సాహు ఒంటి మీదికి చేరింది. శరీరంపైఏదో పాకుతున్నట్టు గమనించిన సాహు అసలు విషయం తెలిసి తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడు. కానీ పక్షవాతం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఆయన అక్కడి నుండి త్వరగా తప్పించుకోలేకపోయాడు. ఆ గందరగోళంలో పాము ఆయన చేతికి, అలాగే పక్కనే ఉన్న కుర్చీకి కలిపి గట్టిగా చుట్టుకు పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము చేసే ఏ చిన్న పొరపాటు జరిగిన అతని ప్రాణాలకే ప్రమామని గ్రహించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.इन चाचा को इस जहरीले और खतरनाक सांप ने इस तरह जकड़ लिया है कि खुद को छुड़ाना भी मुश्किल हो रहा है। 😱क्या लगता है, ये इस मुसीबत से बच पाएंगे या नहीं? अपनी राय जरूर बताइए। pic.twitter.com/0JS6WzNOFw— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) June 1, 2026 ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్రెండు గంటల ఉత్కంఠదాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు సాహును పాము పట్టు నుండి కృష్ణ చంద్ర సాహును సురక్షితంగా విడిపించారు. అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటి వెలుపల సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ క్రమంలోసాహుకు హాని ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ కాలంలో మండించే ఎండలు, వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులు జాగ్రత్తగా మూసి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్ చేస్తే -
‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్
న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. అయితే చాట్జీపీటీ, జెమిని వంటి అత్యాధునిక ఏఐ చాట్బాట్లను తప్పుదారి పట్టించేలా సులభంగా మానిప్యులేట్ చేయవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఉద్దేశపూర్వకంగా ప్రచురించిన చిన్న బ్లాగ్ పోస్ట్లు కూడా ఏఐని తప్పుదోవ పట్టిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐని బురిడీ కొట్టించడం..ఏఐ చాట్బాట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్ల వలే కాకుండా, ఇంటర్నెట్లోని సమాచారాన్ని సేకరించి ఒక ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఒక బిబిసి రిపోర్టర్ తన వ్యక్తిగత వెబ్సైట్లో తాను ‘వరల్డ్ ఛాంపియన్ హాట్-డాగ్ ఈటర్’ అని ఫేక్ పోస్ట్ పెట్టగా, 24 గంటల్లోనే ప్రధాన ఏఐ చాట్బాట్లు దానిని నిజమని నమ్మి ప్రచారం చేశాయి. ఇది హాస్యంగా అనిపించినా ఆరోగ్య సలహాలు, ఆర్థిక చిట్కాలు, రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇలాంటి మానిప్యులేషన్ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.గూగుల్ కఠిన నిర్ణయాలుఏఐ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేయడం నిబంధనలకు విరుద్ధమని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న స్పామ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, ఏఐ ఫలితాలను మానిప్యులేట్ చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. పెద్ద ఏఐ సంస్థలు తమ అల్గారిథమ్లను మెరుగుపరుస్తున్నప్పటికీ, సమాచార మార్పిడిలో ఈ ‘పిల్లి-ఎలుక’ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏఐ సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కూడా ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక, నమ్మకమైన వనరుల ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్ -
డిప్యూటీ సీఎం పోస్టులు లేవా?
శివాజీనగర: రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానాలను సృష్టించడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆదివారం కల్బుర్గిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రెండు దశల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. డీసీఎం పదవుల గురించి ప్రస్తావన రాలేదు. జూన్ 3 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటుగా తొలి దశలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలనేది 2 రోజుల్లో ఖరారవుతుందన్నారు. తొలి దశ మంత్రిమండలి ఏర్పాటు తరువాత 15 రోజుల్లోగా 2వ దశ మంత్రివర్గ విస్తరణ అవుతుందని, పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఒకవేళ డీసీఎంలు అవసరమైతే ఎంతమంది ఉండాలనేది చర్చిస్తాము, దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. జూన్ 3 తరువాత స్పష్టమైన చిత్రం లభిస్తుంది అని చెప్పారు.కేపీసీసీ సారథిపైకేపీసీసీ అధ్యక్షుని మార్పుపై ఖర్గే స్పందిస్తూ, సీఎం ప్రమాణం తరువాత సహజంగానే కేపీసీసీ కొత్త సారథి నియామకం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సుపరిపాలనకు ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుని మధ్య ఉత్తమ అవగాహన అవసరముందన్నారు. సీఎం, మంత్రులతో ఐకమత్యంతో పనిచేయాలన్నారు. పార్టీ నిర్మాణంలో శక్తియుక్తులు, ప్రజా మద్దతు కలిగిన నేతను పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చర్చలు జరిగాయన్నారు. -
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు
మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ముచ్చికల్ అబ్దుల్ మజీద్కు ఎదురైన పరిస్థితి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు పీఎస్సీ ఉద్యోగ నియామక ఉత్తర్వు అందింది. అయితే ప్రస్తుతం మజీద్ వయస్సు 60 ఏళ్లు దాటడంతో, ఉద్యోగంలో చేరడమా లేదా రిటైర్మెంట్ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో ఆయన చిక్కుకుపోయారు.2005లో పీఎస్సీ పరీక్ష రాసి..2005లో మజీద్ పార్ట్-టైమ్ జూనియర్ ఎల్పీఎస్ అరబిక్ లాంగ్వేజ్ టీచర్ పోస్టు కోసం పీఎస్సీ పరీక్ష రాశారు. ఆ ర్యాంక్ లిస్టులో ఆయన 12వ స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగం ఆయనకు దక్కాల్సింది. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రక్రియ 18 ఏళ్ల పాటు సాగదీతకు గురైంది. 2022లో ఆ ఖాళీని పీఎస్సీ గుర్తించినప్పటికీ, ఉత్తర్వు రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది.పరిపాలనా వైఫల్యాలకు పరాకాష్టఒక నియామక ప్రక్రియ గరిష్టంగా ఏడాదిలోపు పూర్తి కావాల్సిన చోట, దాదాపు రెండు దశాబ్దాలు పట్టడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. 2026 ఏప్రిల్ 26న మజీద్కు నియామక ఉత్తర్వు అందినప్పటికీ, అప్పటికే ఆయన పదవీ విరమణ వయసు చేరుకోవడంతో అది అపహాస్యం పాలైంది. అధికార యంత్రాంగం, పీఎస్సీ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.న్యాయం కోసం పోరాటంప్రస్తుతం తన రికార్డుల్లో పుట్టిన తేదీకి సంబంధించి ఉన్న చిన్న తప్పును సరిదిద్దాలని మజీద్ కోరుతున్నారు. తన అసలు పుట్టిన తేదీ ఆధారంగా, కనీసం ఒక్క ఏడాది పాటు సర్వీసులో ఉండే అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. పట్టు వదలని ఈ ఉపాధ్యాయుని పోరాటపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ? -
కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (మాన్సి) తన అత్తవారింట్లో స్థితిలో కన్నుమూసింది. అదనపు కట్నంగా కార్ ఇవ్వలేదనే అక్కసుతోనే మాన్సి భర్త సాగర్ రాజ్పుత్, అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరితీశారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక (FIR) ప్రకారం, కాన్పూర్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ మాన్సికి, 2024లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ రాజ్పుత్తో వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు, రాజ్పుత్కు ఇన్స్టాగ్రామ్లో దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.పెళ్లి సమయంలో మాన్సి కుటుంబం రూ. 7 లక్షల నగదు, ఇతర గృహోపకరణాలను ఇలా పలు రకాల బహుమతిలిచ్చింది అయినప్పటికీ, తక్కువ కట్నం తెచ్చిందంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారని, కారు కావాలని ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లైన దగ్గర్నుంచి వేధిస్తూనే ఉండేవారనీ, ఈ వేధింపుల గురించి, తెలిసి పుట్టింటి వారు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పలుమార్లు లక్నోకు వెళ్లి మాట్లాడి, సర్ది చెప్పి వచ్చేవారు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త సాగర్ రాజ్పుత్ సహా, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతని తండ్రి రాజేష్, సోదరుడు అను, ఆడపడుచులు బర్ఖా, చాందిని, అత్త ఆశలపై వరకట్న మరణం కేసు నమోదైంది. ప్రస్తుతం రాజ్పుత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు.గత రెండు వారాలుగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన భోపాల్ మోడల్ ట్విషా శర్మ వరకట్న మరణం కేసులొ హై-ప్రొఫైల్ CBI దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే, ఈ వరకట్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లక్నోలోనే జరిగిన ఇలాంటి మరో కేసులో, శ్వేతా సింగ్ అనే మహిళ మరణానికి సంబంధించి కూడా వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
ప్లీజ్.. పూలు చల్లొద్దు!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు చర్చల కోసం మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనకు ముందు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.ప్రమాణ స్వీకార వేడుకలను అతి హంగులుగా కాకుండా నియంత్రితంగా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు, తన అభిమానులకు సూచించారు. ముఖ్యంగా తనపై పలు జల్లొద్దని.. పూలమాలలతో, శాలువాలతో సత్కరించకుండా ఉండాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే భారీ జనసందోహం, అతిగా జరిగే సంబరాలు తనకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని పేర్కొన్నారు. అందుకే కార్యకర్తలు పరిమితుల్లోనే వేడుకలు జరపాలని, దూరం నుంచే అభినందనలు తెలిపినా తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు.తన విజ్ఞప్తికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యేనని ఆయన వెల్లడించారు. తనకు పూలమాలలపై అలర్జీ ఉందని, అందువల్ల ఎవ్వరూ వాటిని తీసుకురావద్దని స్పష్టంగా చెప్పారు. “ప్లీజ్… నాకు పూలమాలలు వద్దు. నేను వాటిని స్వీకరించలేను” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్లాస్టిక్ పూలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన గుర్తు చేశారు. పూలతో పాటు శాలువాలు కూడా తేవొద్దంటూ ఆయన సూచించారు.అలాగని ఈ విజ్ఞప్తితో ఆయన కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించలేదు. కాంగ్రెస్ విజయాన్ని సాధారణ కార్యకర్తల విజయం అని అభివర్ణిస్తూ, “ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నది నేను మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 1979–80లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తన రాజకీయ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దశలవారీగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ ఎదుగుదల సాధారణ కార్యకర్తల కష్టం, నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు.మొత్తంగా చూస్తే, శివకుమార్ విజ్ఞప్తి సంబరాల మధ్య కూడా నియంత్రణ అవసరాన్ని సూచిస్తోంది. వ్యక్తిగత ఆరోగ్య కారణాలు, అలాగే అతిగా ఆర్భాటం వద్దన్న తన స్వభావం ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ వేడుకల్లో హంగు తగ్గించి సింపుల్గా నిర్వహించాలని ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. -
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద దొరికిన రెండు స్మార్ట్ఫోన్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయ. ఎన్ఐఏ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో, ఆ ఫోన్లు పాకిస్తాన్కు చెందిన ఒక ప్రముఖ బ్యాంకు ద్వారా అందినట్లు తేలింది. ఈ బ్యాంకు గతంలో కూడా లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొందిబ్యాంకు చిరునామాలో ఉగ్రవాద ఫోన్లుషావోమీ గ్లోబల్ అందించిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు వాడిన ఫోన్లలో ఒకటి 2021లో పాకిస్తాన్కు చెందిన ‘టెక్ సిరాత్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాకిస్తాన్కు చెందిన ‘ఫైసల్ బ్యాంక్’ నిర్వహించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ల డెలివరీ చిరునామా కరాచీలోని ఫైసల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయానిది. భారీ కన్సైన్మెంట్లకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించడం సాధారణమే అయినప్పటికీ, ఆ కన్సైన్మెంట్ నుండి ఈ ఫోన్ అక్రమంగా బయటకు వచ్చి, ఉగ్రవాదుల చేతికి చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఆన్ చేయని ఫోన్లు.. భారీ కుట్రఈ ఫోన్ల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఇవి 2021, 2023లో పాకిస్తాన్కు చేరినప్పటికీ, పహల్గామ్ దాడికి కొద్ది రోజుల ముందు వరకు ఎప్పుడూ వీటిని ఆన్ చేయలేదు. ఉగ్రవాదులను ప్రత్యేకంగా లక్ష్యిత దాడుల కోసం వీటిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఉగ్రవాదులు సాధారణ నెట్వర్క్లను కాకుండా, సుదూర ప్రాంతాల్లో సురక్షితంగా సమాచారం పంచుకోవడానికి రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు గుర్తించారు. దాడికి వారం రోజుల ముందే ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న టెంట్ ఫోటోలు, మ్యాప్లు ఈ ఫోన్లలో లభ్యమయ్యాయి. ఇది వారి ముందస్తు ప్రణాళికను తెలియజేస్తోంది. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
40 మంది ఐఏఎస్ల బదిలీ
తిరువొత్తియూరు: తమిళనాడు ప్రభుత్వం 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై కలె క్టర్తో సహా మరికొంతమంది ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు.. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కిర్లోష్ కుమార్, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సామాజిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శరణ్య అరి, పెరంబలూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. పెరంబలూరు జిల్లా కలెక్టర్ మృణాళిని, అరియలూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. చెంగల్పట్టు జిల్లా మాజీ కలెక్టర్ మాలతి హెలెన్, చెన్నై జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. కో యంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివగురు ప్రభాకరన్, రామనాథపురం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కవిత, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్)గా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ వీరప్రతాప్ సింగ్, తిరుచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవరాజ్ కుమార్, మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్) కట్టా రవి తేజ, కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. -
మాజీ సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సాక్షి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడానికి గల కారణాలపై ఆ పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యానం చేశారు.యువతరం ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో, ముఖ్యంగా ఇన్స్ట్రాగామ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఈ లోపాన్ని సవరించుకుని, ద్రావిడ సిద్ధాంతాలను డిజిటల్ మాధ్యమాల్లో బలంగా తీసుకెళ్లడానికి డీఎంకే సరికొత్త డిజిటల్ విభాగాన్ని ప్రారంభించింది.చెన్నైలోని కళైజ్ఞర్ ఆడిటోరియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ‘జెన్సీ డీఎంకే – వి విల్ రిటర్న్’ అనే సరికొత్త డిజిటల్ సైన్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా ద్రావిడ భావజాలం ఉన్న యువతీ యువకులు పాల్గొన్నారు. పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి టి.ఆర్.పి. రాజా మాట్లాడుతూ.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వేదికలుగా ఈ వింగ్ పనిచేస్తుందన్నారు. -
షుగర్, గుండె జబ్బుల మందులు ఇక తక్కువ ధరకే!
న్యూఢిల్లీ: సాధారణ ప్రజలపై మందుల ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)తాజాగా 30 రకాల ఔషధాల గరిష్ట చిల్లర ధరలను (Retail Prices) ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013 నిబంధనల మేరకు, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, అలర్జీలు, విటమిన్ లోపాల చికిత్సలో వాడే మందులను ఈ ధరల నియంత్రణ జాబితాలో చేర్చారు.అందుబాటులోకి రానున్న ముఖ్యమైన మందులుకొత్తగా ధరలు ఖరారు చేసిన వాటిలో గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం వాడే అటోర్వాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ మాత్రలు ఒక్కొక్కటి రూ. 18.46కు లభిస్తాయి. అలర్జీల కోసం వాడే బిలాస్టిన్, మోంటెలుకాస్ట్ మాత్ర ధర రూ. 21.22గా నిర్ణయించారు. అలాగే హైపర్ టెన్షన్ రోగుల కోసం బిసోప్రోలోల్ ఫ్యూమరేట్, అమ్లోడిపైన్ మాత్ర రూ. 9.40కు అందుబాటులో ఉంటాయి. ఇక డయాబెటిస్ బాధితుల కోసం ఎంపగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్ వంటి కీలక కాంబినేషన్ మాత్రల ధరను రూ. 11.91 నుండి రూ. 14.88 లోపుగా నిర్ణయించారు.అవయవ మార్పిడి రోగులకు ఊరటకేవలం సాధారణ వ్యాధులే కాకుండా, అత్యవసర చికిత్సలో వాడే మందులను కూడా ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ముఖ్యంగా అవయవ మార్పిడి (Organ Transplant) చేయించుకున్న రోగులు వాడే ‘టాక్రోలిమస్ ప్రోలాంగ్డ్ రిలీజ్’ క్యాప్సూల్ (3 mg) ధరను రూ. 127గా నిర్దేశించారు. ఇవే కాకుండా, ఎముకల వ్యాధి, పోషకాహార లోపాల నివారణకు వాడే విటమిన్ డి3 ఓరల్ సొల్యూషన్స్ వంటి వాటికి కూడా కొత్త ధరలను అమల్లోకి తెచ్చారు.అదనపు ధర వసూలు చేస్తే కఠిన చర్యలుతయారీదారులు నిర్ణీత ధరల ప్రకారం ప్యాక్ ధరలను లెక్కించి, వాటిని ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IPDMS)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దుకాణదారులు సవరించిన ధరల జాబితాను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఎన్పిపిఎ ఆదేశించింది. ఒకవేళ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 నిబంధనల ప్రకారం అదనపు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
మరో వివాదంలో ఎన్టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహణ వైఫల్యంతో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ఐఏటీ) ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ ఒకే రోజున అంటే జూన్ 7వ తేదీనే నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జాతీయ స్థాయి పరీక్షలు ఒకే రోజు ఉండటంతో, తాము దేనిని ఎంచుకోవాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.పరీక్షల తేదీల క్లాష్తో సందిగ్ధంలో విద్యార్థులుదేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, జూన్ 7న ఈ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే పరీక్షల వాయిదాలతో ఒత్తిడికి గురైన విద్యార్థులకు, ఈ తేదీల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలకు వెళ్లడం అసాధ్యమని, దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.ఎన్టీఏ తక్షణ స్పందనఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. పరీక్షా షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థి వివరాలను వెంటనే cuet-ug@nta.ac.in ఈమెయిల్ ద్వారా పంపాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులకు తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.మొదలైన విమర్శలు, ఆందోళనలుఇప్పటికే సీయూఈటీ-యూజీ పరీక్షా నిర్వహణలో సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు తాజాగా చోటుచేసుకున్న ఈ తేదీల వివాదంతో ఎన్టీఏ తీరుపై మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ముందుగానే సమన్వయం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఏ ఈ పరీక్షల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందోనని విద్యార్థులు వేచి చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు -
హత్యకు దారి తీసి పబ్లో గొడవ!
సాక్షి,చెన్నై: కోయంబేడులో శనివారం అర్ధరాత్రి దాటి న తర్వాత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్లో మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. గంజాయి, మద్యం మత్తు లో ఉన్న ఒక ముఠా.. కక్షపూరితంగా బైక్ను కారుతో ఢీకొట్టడంతో ప్లస్–2 చదువు పూర్తి చేసిన శ్రీలంక త మిళ శరణార్థి శిబిరం యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘోర ఘటనలో మరో 17 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లుపురం జిల్లా అనిచన్ కుప్పంలోని శ్రీలంక తమిళ పునరావాస శిబి రానికి చెందిన యాన్సీ(18) ఇటీవల ప్లస్–2 పరీక్షల్లో 450 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఉన్నత చదువుల కోసం అలగప్ప విశ్వవిద్యాలయానికి దరఖా స్తు చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై రామపురంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని (17 ఏళ్ల బాలిక) కలవడానికి యాన్సీ కొద్దిరోజుల క్రితం చెన్నైకి వచ్చింది. శనివారం రాత్రి యాన్సీ, ఆమె స్నేహితురాలు తబిత (18) అనే మరో యువతితో పాటూ యువకులు కలిసి మొత్తం ఆరుగురు మూడు మోటారు సైకిళ్లపై కోయంబేడు ఫ్లైఓవర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత యాన్సీ బృందం నృత్యం చేస్తున్న సమయంలో అక్క డ మద్యం మత్తులో ఉన్న మరో వర్గానికి చెందిన యు వకులతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పబ్ లో గందరగోళం నెలకొంది. హో టల్ బౌన్సర్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు గెంటేశారు. బయటకు వచ్చినా మరోసారి గొడవ పడ్డారు. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. కారుతో తొక్కించి హత్య గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ సుమన్ శక్తివేల్ (20) బైక్పై ప్రయాణిస్తున్న యువతులను చంపాలనే ఉద్దేశంతో కారును మెరుపు వేగంతో వారి బైక్ వైపు పోనిచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న యాన్సీ, వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలిక గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయమై, ముఖం పూర్తిగా చిద్రమైన స్థితిలో యాన్సీ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన బాలికను కోయంబేడు కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కూలీ అయిన యాన్సీ తండ్రి నకులేశ్వరన్ , కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు. -
నేడు తిరుచ్చిలో.. సీఎం విజయ్ రోడ్ షో!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రభజంనం సృష్టించిన సీఎం విజయ్ ప్రపథమంగా ప్రజల్లోకి రానున్నారు. తనకు ఓట్లు వేసి గెలిపిచిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన కృతజ్ఙతల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సోమవారం జరిగే ఈ సభ కోసం తిరుచ్చిలో టీవీకే వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎన్నికల అనంతరం ప్రత్యక్షంగా ప్రజలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని విజయ్ తాజా సభలో ఏదేని ప్రకటన చేయవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి.సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి, సంకీర్ణ పారీ్టల మద్దతుతో ము ఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ సోమవారం తిరు చ్చిలో పర్యటించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అందులో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ (తూర్పు) నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తమ పారీ్టకి చారిత్రాత్మక విజయాన్ని అందించి, 108 స్థానాలు గెలవడానికి కారణమైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు రోడ్ షోతో పాటుగా బ హిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకుటారు.13 కిలోమీటర్ల భారీ రోడ్ షో ఎయిర్పోర్ట్ నుండి సీఎం విజయ్ తన ప్రత్యేక ప్రచార వాహనం (ఓపెన్ వ్యాన్) ద్వారా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. టీవీఎస్ టోల్గేట్ డెయిరీ, సంజీవి నగర్, చతిరం బస్ స్టాండ్ మీదుగా తిరుచ్చి జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్ వరకు సుమారు 13 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్ షో జరగనుంది. పాలక్కరై, పోస్టాఫీసు, ఉడ్ యార్డ్ ప్రాంతాల మీదుగా సాగే ఈ పర్యటన కోసం రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు, కాలేజీ ప్రవేశ ద్వారం వద్ద విజయ్ చిత్రంతో కూడిన భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమ విజయవంతం కోసం మంత్రులు బుస్సీ ఆనంద్, సెంగోట్టయ్యన్, రమేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత నిమిత్తం సుమారు 1,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. 3వ స్థానంలో సీఎం విజయ్.. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన అత్యంత ధనవంతులైన సీఎంల జాబితాలో 3వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ నిలిచారు. జోసెఫ్ విజయ్ రూ. 648 కోట్ల నికర ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఇందులో చెన్నై, కొడైకనాల్లోని నివాసాలతో పాటు సుమారు రూ. 404 కోట్ల చరాస్తులు, రూ. 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ తమిళనాడు లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచారు. లీమా రోజ్ మార్టిన్ రూ. 5,863 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. -
అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ
సాక్షి, చెన్నై: మదురై నగర పాలక సంస్థ (కార్పొరేషన్) చరిత్రలో అత్యంత నిజాయితీ కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్న కమిషనర్ చిత్రా బదిలీ అయ్యారు. కార్పొరేషన్లో భారీ స్థాయిలో జరిగిన ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కుంభకోణాన్ని వెలికితీసి, అసిస్టెంట్ కమిషనర్ నుండి బిల్ కలెక్టర్ల వరకు ఏకంగా 28 మంది సిబ్బందిని సస్పెండ్ చేసి సంచలనం సృష్టించిన ఆమెను ప్రభుత్వం బదిలీ చేయడంతో మదురై వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చెన్నై కార్పొరేషన్ నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. అవినీతిపై ’చిత్రా’స్త్రం.. మదురై కార్పొరేషన్కు 71వ కమిషనర్గా, అలాగే తొలి మహిళా కమిషనర్గా చిత్రా 2025 ఫిబ్రవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చే నాటికి కార్పొరేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతకుముందు 2021 నుండి 2025 వరకు కేవలం నాలుగేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారారంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన చిత్రా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే కార్పొరేషన్ రూపురేఖలను మార్చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితమైన ఆస్తి పన్ను అవినీతిపై గట్టి నిఘా పెట్టి, నిరూపించడమే కాకుండా పోలీసు విచారణకు ఆదేశించారు. ఈ విప్లవాత్మక చర్యే చివరకు మదురై మేయర్, ఐదుగురు జోనల్ చైర్మన్ల పదవులు ఊడిపోవడానికి ముఖ్య కారణమైంది. కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం కమిషనర్ చిత్రా తనదైన శైలిలో సంస్కరణలు చేపట్టారు. మదురై ప్రగతికి బాట వేయడమే కాకుండా పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచే కార్యక్రమాలు విస్తృతం చేసిన చిత్రాను కొత్త ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వంలో భాగంగా మదురై నుండి చెన్నైకు స్థాన చలనం కల్పించారు. అయితే, మదురై వాసులు ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. -
కష్టకాలంలో దీదీ పార్టీ!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం. ఆ వెంటనే పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి రావాలని స్వయంగా పార్టీ అధినేత్రి నుంచి ఆహ్వానం. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల డుమ్మా! దీంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒకటే చర్చ. అసలు టీఎంసీలో ఏమి జరుగుతోంది?.. ఇది కేవలం రాజకీయ ఉద్రిక్తతల ప్రభావమా? లేక మరేదైనా పెద్ద సంకేతమా?పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆ ఘటన తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కలీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో.. చేసేది లేక సమావేశం వాయిదా వేశారు.సాధారణంగా రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అలాంటిది దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ గైర్హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే టీఎంసీ దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు.కానీ ఈ వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం ఆరోపణలు-ప్రత్యారోపణలే. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక బీజేపీ అనుకూల వర్గాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, దాడికి పాల్పడింది టీఎంసీకి చెందిన వర్గాలేనని ఎదురుదాడి చేస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు.ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవేళ బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత నాయకత్వం, వారసత్వం, భవిష్యత్ వ్యూహాలపై పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రచారానికి అప్పుడు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా అదే కోణంలో విశ్లేషణకు దారితీయొచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే టీఎంసీ, బీజేపీ రెండూ తమ తమ రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని ప్రజా ఉద్యమంగా మలచాలని టీఎంసీ భావిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో టీఎంసీ మరింత దూకుడైన ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. బ్లాక్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోల్కతాలో మమతా బెనర్జీ స్వయంగా పాల్గొనే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఎన్నికల అనంతర హింస, కార్యకర్తలపై దాడులు, బుల్డోజర్ చర్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది గైర్హాజరు కావడం, బీజేపీ-టీఎంసీ మధ్య ఆరోపణల యుద్ధం, వీధి పోరాటాలకు పార్టీ సిద్ధమవడం.. ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇది కేవలం ఒక దాడి ఘటన ప్రభావమా? లేదంటే టీఎంసీలో జరుగుతున్న లోతైన రాజకీయ మార్పులకు సూచనా? అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
నాకు మంత్రి పదవి వద్దు
సాక్షి, చెన్నై: తనకు ఎలాంటి మంత్రి పదవీ వద్దు... తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని లక్ష్య జననాయగ కట్చి వ్యవస్థాపకుడు, కామరాజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోస్ చార్లెస్ మార్టిన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. మంత్రుల నియమకం, శాఖల కేటాయింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆయన ఆదివారం మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 100 కోట్ల బేరసారాల వివాదం ఈ సందర్భంగా జోస్ చార్లెస్ మార్టిన్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం వెనుక తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తనకూ మంత్రి పదవి ఇవ్వాలని, దానికోసం దాదాపు రూ. 100 కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నాయని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. “నా వల్ల లేదా నా మద్దతుదారుల వలన మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందని భావిస్తే.. నన్ను పక్కన పెట్టేయండి. నాకు ఏ పదవీ అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా కామరాజ్ నగర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ (ఆదర్శ) నియోజకవర్గంగా మార్చడమే నా ఏకైక లక్ష్యం’ అని స్పష్టంచేశారు. వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్కు వినతిపత్రం కూడా సమర్పించానని తెలిపారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం (టీవీకే సంకీర్ణ ప్రభుత్వం) బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రులను నియమించి, పనులను పరుగులు పెట్టిస్తోందని ఆయన గుర్తుచేశారు. అక్కడ కనీస అనుభవం లేని వారు కూడా తమ శాఖల్లో చురుగ్గా పనిచేస్తుంటే.. పుదుచ్చేరిలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు ఉండి కూడా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. -
పాస్పోర్టుకు డబ్బులు లేక..
బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుబడిన డీకే శివకుమార్ సాధారణ స్థాయి నుంచి నేడు కాబోయే సీఎంగా మారారు. ఇప్పుడు ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి కావచ్చు. అయితే ఒకప్పుడు పాస్పోర్టు కోసం బంగారు గొలుసు కుదువ పెట్టారు. వివరాల్లోకెళ్తే.. 1989లో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ బెంగళూరుకు వచ్చినప్పుడు భారీ సభ జరిగింది. బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న డీకే శివకుమార్ పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఎయిర్పోర్టులో డీకేని రాజీవ్గాంధీ చూసి ఆరా తీశారు. ఆ తరువాత కొన్ని రోజులకే డీకేకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాస్పోర్టుకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పీఎంఓ ఆదేశించినట్లు తెలిపారు. అప్పుడు పాస్ పోర్టు కోసం డీకే వద్ద రూ.3 వేలు లేకపోవడంతో మెడలోని బంగారు గొలుసును తాకట్టు పెట్టి అవసరం తీర్చుకున్నాడు. విదేశాల్లో జరిగే యువజన ఉత్సవాలకు డీకేను రాజీవ్గాంధీ పంపించారు. -
ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!
బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది. పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు. నివ్వెరపోయే నిజాలు.. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె దర్యాప్తులో అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్ డ్రైవర్ లోహిత్కుమార్ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్లాన్ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్ తెలిపారు. -
మటన్ అడిగితే బీఫ్ పెడతారు
బెంగళూరు: మటన్ బిర్యానీ తిందామని ఆశగా వెళ్లిన కస్టమర్లకు బీఫ్ బిర్యానీ పెడుతున్నారు. దీంతో కొందరు కస్టమర్లు గుర్తించి గొడవకు దిగడంతో పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. బెంగళూరులో బొమ్మనహళ్ళిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరతిలో నివసించే కేరళీయులు జిజు అలెగ్జాండర్, కెబి షిబు, బొమ్మనహళ్లిలోని ఇసిరి హబ్ కాయలోరం ఫ్యామిలీ రెస్టారెంట్ను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్లో మటన్ వంటకాలను ఆర్డర్ చేస్తే బీఫ్ను వడ్డిస్తున్నారని కొందరు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. రెస్టారెంట్ మెనూ కార్డులో ఎక్కడా బీఫ్ గురించి ప్రస్తావించ లేదు. తాము మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తే, బీఫ్ పెట్టారని, దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడ్డామని చాలామంది ఫిర్యాదు చేశారు. పోలీసుకూ బీఫ్ వంటకం ఈ నేపథ్యంలో పోలీసులు రహస్య ఆపరేషన్ను నిర్వహించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి హోటల్కు వచ్చాడు. మటన్ బిర్యానీ కావాలని చెప్పగా తెచ్చిచ్చారు. కానీ అందులో ఉన్నది బీఫ్ ముక్కలు అని నిర్ధారణ అయింది. నిందితులు జిజు, షిబులపై కర్ణాటక గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపారు. మరో నిందితుడు అభిలాష్ పరారీలో ఉన్నాడు. రెస్టారెంటును సీజ్ చేశారు. తాము ఇంతకాలం తిన్నది బీఫా అని కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. -
పోలీసులకు చిక్కలేదు.. బాలీవుడ్కు దొరకలేదు!
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి, పెరోల్పై బయటకు వచ్చి 12 ఏళ్ల పాటు పరారీలో ఉన్న ఒక వ్యక్తి, పోలీసుల కళ్లు గప్పి ఏకంగా బాలీవుడ్, సౌత్ సినిమాల్లో నటించిన ఉదంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, మోహన్లాల్ తదితర అగ్రనటుల పక్కన కనిపించిన ఈ వ్యక్తి, ఒకప్పుడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. ఒక చిన్న సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఈ ‘టగ్ ఆఫ్ హిందూస్థాన్’ అసలు కథ అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.కారాగారం నుండి కామ్రేడ్ వరకు2005లో అహ్మదాబాద్లో జరిగిన నరేంద్ర కాంబ్లే హత్య కేసులో హేమంత్ మోదీని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. 2008లో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సబర్మతి జైలు నుంచి మెహసానా జైలుకు తరలించిన హేమంత్ 2014 జూలైలో 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. ఆ గడువు ముగిసినా తిరిగి జైలుకు వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో పోలీసులు అతని కోసం వెతకని చోటు లేదు.వెండితెరపై మెరిసిన నేరస్తుడుపెరోల్ జంప్ చేసిన తర్వాత, హేమంత్ తన రూపాన్ని, పేరును పూర్తిగా మార్చుకున్నాడు. ‘ట్వింకిల్ దవే’గా పేరు మార్చుకుని ముంబైకి చేరుకున్నాడు. 2018లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘టగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ నుంచి మొదలుకొని, ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘మెట్రో ఇన్ దినో’ మోహన్లాల్ నటించిన ‘ఎల్ 2 ఎంపూరాన్’ వరకు పలు చిత్రాల్లో అతను నటించాడు. ఇమ్రాన్ హష్మీతో కలిసి ఒక వెబ్ సిరీస్లో కూడా నటించినప్పటికీ, ఎవరూ అతన్ని గుర్తుపట్టలేకపోయారు.పోలీసుల కళ్లు గప్పి..హేమంత్ తన పాత జీవితాన్ని పూర్తిగా తుడిచేసుకున్నాడు. భార్యకు విడాకులు ఇవ్వడం, కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం తదితర పద్ధతులతో అతను 12 ఏళ్లు పోలీసుల నిఘా నుంచి తప్పించుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తిగా ముంబైలో స్థిరపడి, ప్రతిభావంతుడైన నటుడిగా ముద్ర వేయించుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడు చేసిన నేరం కంటే, ఇన్ని ఏళ్ల పాటు అతను సాగించిన ‘నటన’ నేర పరిశోధనా వర్గాల్లో చర్చనీయాంశమైంది.ముగిసిన 12 ఏళ్ల నాటకంఅహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు 2026, మే 21 న అతని నాటకానికి తెరపడింది. పోలీసులు దాడులు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాత ఫోటోలను, ప్రస్తుత రూపాన్ని సరిపోల్చినప్పుడు, ఆ వ్యక్తి హేమంత్ మోదీయేనని తేలింది. 12 ఏళ్ల పరారీ తర్వాత, అతను మళ్లీ ఇప్పుడు జైలు గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.న్యాయం గెలిచిందిహేమంత్ తో పాటు శిక్ష పడిన మిగతా ఆరుగురు నిందితులు ఇప్పటికే తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. కానీ హేమంత్ తన శిక్షను మధ్యలోనే వదిలేసి పారిపోవడంతో, ఇప్పుడు అతను మిగిలిన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఒక హత్య కేసులో నేరస్తుడు తన గుర్తింపును మార్చుకుని ఇన్నాళ్లు స్వేచ్ఛగా తిరగడం, సినిమాల్లో నటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్ని ‘వేషాలు’ వేసినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని హేమంత్ మోదీ ఉదంతం మరోసారి నిరూపించింది.ఇది కూడా చదవండి: అందం, హోదా.. అంతా అబద్ధమేనా? -
అన్నామలై కొత్త పార్టీ?
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారి తీసింది. అయితే, తమిళనాడులో బీజేపి బలోపేతానికి కృషి చేసి అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు ఇంత వరకు బీజేపీలో గానీ, కేంద్రంలోని ఎలాంటి పదవీ అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సైత దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ‘మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. ‘మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు‘ అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది.BIG NEWS - Annamalai to launch People’s Movement in Tamil Nadu.It won't be a political party. He will enrol like-minded people and build a strong volunteer base as per reports.Your thoughts?pic.twitter.com/eekuEIb1rK— News Algebra (@NewsAlgebraIND) May 31, 2026 -
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
విజయ్ని అడిగితే.. డిప్యూటీ సీఎం ఇచ్చేవారు: ప్రేమలత
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పళనిస్వామి తీరుపై ఫైర్2024 లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్ ధరలు ఒక్కోలా ఉన్నాయి.ఢిల్లీలో ఒక్క సిలిండర్పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది. కోల్కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ డిమాండ్ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్లాగ్ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే పెట్రోల్ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. ఎందుకు పెంచారు?పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్లో నిలిచిన చమురు రవాణాదేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలుఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలుఅక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలుసరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలుమొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్ నెల ప్రారంభంలోనే ధరల షాక్ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. -
ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆదివారం ఆయన షేర్ చేశారు. ‘వీరంతా సీబీఎస్ఈలో అవకతవకలపై మోదీ ప్రభుత్వాన్ని చాలా చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగారు. ప్రశ్నిస్తే వీళ్లను అవమానిస్తున్నారు. సమాధానాలకు బదులు వీళ్లకు అవమానాలే ఎదురయ్యాయి. దేశ వ్యతిరేకులంటూ వారిపై ముద్ర వేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ దేశద్రోహులతో ఎంతో ఆసక్తికర సంభాషణ జరగింది. వీరికి ఎంతో చక్కటి భవిష్యత్తుంది’ అని అన్నారు. ఇటీవల సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన 12వ తరగతి ఆన్సర్ షీట్ తమది కాదంటూ వేదాంత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. అనంతరం మరికొందరు విద్యార్థులూ తమకూ ఇతరుల ప్రశ్నపత్రాలు ఇచ్చారంటూ ఆన్లైన్లో ప్రకటించడం తీవ్ర కలకలం రేగిన విషయం తెల్సిందే. -
క్రీడాకారుల జుగల్బందీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో ప్రతిభా పాటవాలు చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అథ్లెటిక్స్ రంగంలో దేశ క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆదివారం 134వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ఆయన రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా జార్ఖండ్లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో నాలుగు కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపించారు. గురీందర్వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కులదీప్ కుమార్... ఈ స్నేహితులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులు నెలకొల్పారని చెప్పారు. ముఖ్యంగా 100 మీటర్ల పరుగు పందెంలో రెండు రోజుల వ్యవధిలో పాత రికార్డులను మూడుసార్లు బద్ధలుకొట్టిన అనిమేశ్ కుజూర్, గురిందర్వీర్ సింగ్లతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వీరిద్దరి పోటీని క్రీడల్లో ‘జుగల్బందీ’గా అభివర్ణించారు. భారతీయుల శరీరాకృతి స్ప్రింటింగ్కు పనికిరాదనే అపోహలను పటాపంచలు చేస్తూ 10.1 సెకన్లలోపు పరుగు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన నావికాదళ అధికారి గురిందర్వీర్ను, ఫుట్బాల్ నుంచి అథ్లెటిక్స్లోకి వచ్చి రాణిస్తున్న అనిమేశ్ను ప్రధాని మోదీ అభినందించారు. మైదానం బయట స్నేహితులుగా, మైదానంలో పోటీదారులుగా ఉంటూ దేశ గౌరవాన్ని పెంచుతున్న వీరి క్రీడాస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే... దేశీయ పానీయాలను ఆస్వాదించండి ‘‘దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో డీహైడ్రేషన్కు గురికాకుండా తగినంత నీరు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వేసవి వేడిని తట్టుకునే అద్భుతమైన మార్గాలు మన వంటగదిలోనే ఉన్నాయి. ఉత్తర భారతదేశపు ఆమ్ పన్నా, పంజాబీ లస్సీ, రాజస్తానీ–గుజరాతీ మజ్జిగలతో పాటు బిహార్, జార్ఖండ్ల సత్తు షర్బత్, కొంకణ్ కోకుమ్ షర్బత్, దక్షిణ భారతదేశపు పానకం, నీర్ మోర్ వంటి సాంప్రదాయ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చేవి మాత్రమే కావి.. అవి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ దేశీయ పానీయాలను ఆస్వాదించాలి. గ్లోబల్ మార్కెట్కు మన మామిడి వేసవిలో వచ్చే ఫలరాజం మామిడి పండ్ల ప్రస్తావన రాని ఇల్లు ఉండదు. అల్ఫాన్నో, కేసర్, దశేరీ, లంగ్రా, చౌసా, మాల్డా వంటి మామిడి రకాలు మనకు ఉన్నాయి. ప్రతి పేరుతో ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి వెళితే బంగినపల్లి, తోతాపురీ, నీలం, మాల్గోవా, సువర్ణరేఖ వంటి రకాలు కనిపిస్తాయి. ప్రదేశం మారితే మామిడి పండు ఆకారం, రంగు, రుచీ మారుతాయి. మన మామిడి ప్రయాణం ఇప్పుడు గ్రామాల నుండి గ్లోబల్ మార్కెట్కు చేరుకుంటోంది. పడవ ప్రమాదంలో విద్యార్థులు చనిపోయిన ఘటనతో కలత చెంది, కేరళంలో ఉచితంగా 15 వేల మందికి పైగా ఈత నేర్పించిన సాజీ వలాశేరిల్ సేవలు నిజంగా ప్రశంసనీయం. దివ్యాంగ పిల్లలకూ ఈత నేర్పించారు. యూపీ కాలువలో చిక్కుకున్న గంగా డాలి్ఫన్ను 13 గంటల పాటు శ్రమించి కాపాడి రాప్తి నదిలోకి విడిచిపెట్టిన సిబ్బందిని అభినందిస్తున్నా. గిరిజా అమ్మ దేశభక్తికి సలాం తమిళనాడులోని నాగర్కోయిల్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు గిరిజా అమ్మ గొప్ప దేశభక్తికి ప్రతీక. ‘మన్ కీ బాత్’ స్ఫూర్తితో ఆమె పనిచేశారు. సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 విరాళం ఇచ్చేలా తన పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. అలా సేకరించిన రూ.40 లక్షల చెక్కును ఆమె నాకు అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో మనోరమ నదిని శుభ్రం చేసిన యువకుడు ఆకాశ్ గుప్తా, గోవాలో పైప్లైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించిన తీర్చిన రిటైర్డ్ టీచర్ బాలకృష్ణ అయ్యర్ సేవలు అభినందనీయం’’ అని అన్నారు. -
సీడీఎస్గా బాధ్యతలు చేపట్టిన రాజా సుబ్రమణి
న్యూఢిల్లీ: భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల ఆధునీకరణ, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణను పెంపొందించే దిశగా సంస్థాగత సంస్కరణల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజా సుబ్రమణి వ్యాఖ్యానించారు. మన సాయుధ దళాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ఉపయోగాన్ని వేగవంతం చేస్తామని అన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో భారత సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, దృఢ దీక్షను ప్రదర్శించాయని కొనియాడారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సుబ్రమణి 1985 డిసెంబర్ 14న ఆయన భారత సైన్యంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. 2023 మార్చి నుంచి 2024 జూన్ దాకా సెంట్రల్ కమాండ్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్– ఇన్–చీఫ్గా వ్యవహరించారు. జమ్మూకశ్మీర్, అస్సాంలో క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఎన్నో కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 దాకా వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మోడల్, విశిష్ట సేవా మెడల్లతో సత్కరించింది. -
నావికాదళ చీఫ్గా స్వామినాథన్
న్యూఢిల్లీ: భారత నావికాదళం నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం ఆయన పశ్చిమ నేవీ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్గా సేవలందించారు. నేవీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక స్వామినాథన్ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా వాతావరణం సవాళ్లతో కూడుకుంది. ఇది సంక్లిష్టతతో అనిశ్చితితో అనూహ్యంగా తయారైంది. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా దేశ భద్రతే ధ్యేయంగా అత్యున్నత కార్యాచరణ సంసిద్ధత, పోరాట సామర్థ్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పని చేస్తా. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు నౌకాదళం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మన నౌకదళం ఎల్లప్పుడూ చురుగ్గా పనిచేస్తోంది. ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది. నౌకాదళ వృద్ధి వేగాన్ని కొనసాగించడం, అమల్లో ఉన్న కార్యక్రమాలను మరింత పటిష్టం చేయడం, అవసరమైన చోట వాటిని విస్తరించడం, ప్రత్యేకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాలకు పెంపొందిస్తా’’ అని స్వామినాథన్ ఉద్ఘాటించారు. స్వామినాథన్ 1987 జూలై 1న ఇండియన్ నేవీలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, కాలేజీ ఆఫ్ నావల్ వార్ఫేర్, యూఎస్ నావల్ వార్ కాలేజీలో శిక్షణ పొందారు. కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్ యుద్ధరీతిలో నిపుణుడిగా పేరుగాంచారు. ఐఎన్ఎస్ విద్యుత్, వినాశ్ క్షిపణి నౌకలు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య తదితర యుద్ధ నౌకలకు సారథ్యం వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. -
తిరువళ్లువర్ ‘కాషాయ’ కలకలం
చెన్నై: ప్రాచీన తమిళ మహాకవి, తత్వవేత్త తిరువళ్లువర్ చిత్రపటాన్ని కాషాయ వ్రస్తాల్లో చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. వైకాశి అనుషం వేడుకల సందర్భంగా మే 30వ తేదీన లోక్ భవన్లో కాషాయ వ్రస్తాల్లో ఉన్న తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నివాళులర్పించారు. దీనిపై అధికార తమిళగ వెట్రి కళగం, విపక్ష డీఎంకేసహా పలు పారీ్టలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అధికారికంగా గుర్తించిన తిరువళ్లువర్ చిత్రంలో ఆయన తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తారు. దానికి బదులుగా లోక్భవన్లో నివాళులర్పించిన చిత్రాన్ని తిరువళ్లువర్ కాషాయ రంగు వస్త్రం ధరించినట్లు చిత్రీకరించడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్రాజ్ తీవ్రంగా స్పందించారు. మహాకవిని కాషాయ వ్రస్తాలలో ప్రదర్శించడాన్ని ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తను ఒక సంకుచిత గుర్తింపులో బంధించే ఏ ప్రయత్నమైనా ఆయన విశ్వ దృష్టిని కించపరచడమేనని పేర్కొన్నారు. తిరువళ్లువర్ ఏ ఒక్క మతానికీ, కులానికీ, జాతికీ, దేశానికీ పరిమితమైన కవి కాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ నిరంతరం మౌనంగా ఉండటం వల్లే గవర్నర్ కార్యాలయం తిరువళ్లువర్కు కాషాయ రంగు వేయడానికి సాహసించిందని డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. లోక్ భవన్ను కాషాయమయంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరువళ్లువర్కు కాషాయ రంగు అద్దడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా తిరువళ్లువర్ దినోత్సవాన్ని జనవరిలో నిర్వహిస్తుందని గుర్తుచేశారు. మరి వైకాశి అనుషం రోజు నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. డీఎంకే పాలనలో అప్పటి గవర్నర్ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ఖండించారు. -
మైనర్లను రవాణా చేస్తే ‘పోక్సో’ వర్తింపు
న్యూఢిల్లీ: ధన సంపాదనే ధ్యేయంగా లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల్లో మైనర్ ఉంటేనే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), అనైతిక అక్రమ రవాణా–నివారణ(ఐటీపీఏ) చట్టాలతోపాటు పోక్సో చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెక్స్ వర్కర్లకు సంబంధించిన అంశాలతోపాటు నేరస్థులపై విచారణ, బాధితుల పునరావాసం కోసం చట్టపరమైన నిబంధనల పాటించాలని సూచిస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నేరస్థుల చర్యలు, ఉద్దేశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. మానవ అక్రమ రవాణా నేరంలోని అంశాలు రుజువైన తర్వాత బాధితురాలు ‘అంగీకరించింది’ అనే ఏ వాదన లేదా ఆరోపణ అయినా అసంబద్ధమైనదిగా పరిగణించాలని తేల్చిచెప్పింది. ఒక మహిళ తాము లైంగిక పరిశ్రమలో, వ్యభిచారంలో ఉన్నామని తెలుసుకున్నంత మాత్రాన, వారు మానవ అక్రమ రవాణా బాధితులు కాకుండా పోరని స్పష్టంచేసింది. ఎందుకంటే పని పరిస్థితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చి వారిని మోసగించి ఉండవచ్చని, ఆ పరిస్థితులు తరువాత దోపిడీకి గురిచేసేవిగా తేలి ఉండవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, లైంగిక దోపిడీకి గురైన బాధితులకు హక్కులను అమలు చేయాలంటూ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది. లైంగిక దోపిడీకి గురైనవారికి పునరావాసం కల్పించకపోతే.. బాధితురాలు తిరిగి ఆ పాత పరిస్థితుల్లోకే వెళ్తుందని వెల్లడించింది. అందువల్ల బాధితులకు తగిన పునరావాసం కల్పించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21, 23 ఇదే అంశాన్ని సూచిస్తున్నాయని గుర్తుచేసింది. లైంగిక దాడి కోసం ఒక బాలికను అక్రమ రవాణా చేస్తే పోక్సో చట్టంలోని నిబంధనలతోపాటు బీఎన్ఎస్లోని సెక్షన్లు 143, 144, ఐటీపీఏ చట్టంలో సెక్షన్లను వర్తింపజేయాలని కోర్టు స్పష్టంచేసింది. చట్ట ప్రకారం పిల్లలపై జరిగే ప్రతి లైంగిక దోపిడీ చర్య వారి అంగీకారం లేకుండానే జరుగుతుందనే విషయంలో అస్పష్టత లేదని పేర్కొంది. -
ఫ్యాన్స్కి షాక్.. వేడుకలకు పోలీసులు నో..?
బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. -
కూర్చుని తింటేనే మేలు
ఎంత బిజీగా ఉన్నా సరే.. తినడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది నడుస్తూ లేదా డ్రైవ్ చేస్తూ లేదా ప్రయాణిస్తూ త్వరత్వరగా తినేస్తుంటారు. దీనినే ఈటింగ్ ఆన్ ది గో (కదులుతూ తినడం) అంటారు. ఇలా హడావుడిగా తినడం వల్ల శరీరానికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మందగిస్తుందినడుస్తూ తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలడం కుదరదు. దీనివల్ల ఆహారం పెద్ద పరిమాణంలో నేరుగా కడుపులోకి వెళుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు రక్తం జీర్ణవ్యవస్థ వైపు కాకుండా కాళ్లు, చేతుల కండరాల వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.తెలియకుండానే అతిగా తినేస్తాం ప్రయాణాల్లో లేదా వేరే పనుల్లో ఉంటూ తినడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. కడుపు నిండిందనే సంకేతాన్ని మెదడు సకాలంలో అందుకోలేదు. దీంతో మనకు తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువ క్యాలరీలు లాగించేస్తాం.ఊబకాయం.. బరువు పెరగడం త్వరత్వరగా నడుస్తూ తినే అలవాటు ఉన్నవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించకుండా, వాటిని నేరుగా కొవ్వుగా మార్చే ప్రమాదముంది. గ్యాస్ సమస్యలు (బ్లోటింగ్, గ్యాస్) కదులుతూ వేగంగా తినడం వల్ల ఆహారంతోపాటు ఎక్కువ మొత్తంలో గాలి కూడా కడుపులోకి వెళుతుంది. ఇది కడుపులో ఉన్నప్పుడు, గ్యాస్ నొప్పులను కలిగిస్తుంది. ఫలితంగా తరచు తేన్పులు వస్తాయి.మానసిక తృప్తి ముఖ్యం ప్రశాంతంగా తిన్నప్పుడే ఆ హారం రుచి, సువాసన మనసుకు తృప్తినిస్తాయి. హడావుడిగా తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపించినా, మానసికంగా ఇంకా ఏదో తినాలనే కోరిక మిగిలిపోతుంది. కాబట్టి రోజులో ఎంత పని ఉన్నా.. భోజనానికి కాస్త సమయం కేటాయించడం మంచిది. -
20 నిమిషాల ఎండతో చర్మ కేన్సర్ ముప్పు!
సూర్యరశ్మి వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్–డి లభిస్తుందనేది నిజమే. కానీ, అదే సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు మన చర్మ కణాల లోపలికి చొచ్చుకుపోయి డీఎన్ఏ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్న్్రస్కీన్ లోషన్ లేకుండా కేవలం 20 నిమిషాల పాటు తీవ్రమైన ఎండకు గురైతే చర్మ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ’స్కిన్ కేన్సర్ ఫౌండేషన్’, ‘హార్వర్డ్ మెడికల్ స్కూల్’పరిశోధకులు వెల్లడించారు.నిమిషాల్లోనే డీఎన్ఏ ముక్కలు!సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతమైనవి. మనం ఎటువంటి రక్షణ (సన్ స్క్రీన్ వంటివి) లేకుండా ఎండలో నిలబడిన మొదటి 10 నుంచి 20 నిమిషాలలోపే ఈ కిరణాలు చర్మ కణాల లోపల ఉండే డీఎన్ఏ నిర్మాణాన్ని ముక్కలు చేయడం లేదా మార్చడం ప్రారంభిస్తాయని పరిశోధకులు తెలిపారు.కేన్సర్గా ఎలా మారుతుంది? డీఎన్ఏ దెబ్బతిన్నప్పుడు శరీరం దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ పదేపదే తీవ్రమైన ఎండకు గురికావడం వల్ల ఆ డీఎన్ఏ శాశ్వతంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల చర్మ కణాలు అదుపు లేకుండా పెరిగిపోయి కేన్సర్ కణుతులుగా మారతాయి.ముప్పు 80 శాతం పెరుగుతుంది!అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అధ్యయనాల ప్రకారం.. కేవలం ఇరవై నిమిషాల ఎండ తీవ్రతకే చర్మం ఎర్రగా కందిపోతుంది (దీనినే సన్బర్న్ అంటారు). ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం 5 సార్లు తీవ్రమైన సన్బర్న్కు గురైతే, ఆ వ్యక్తికి అత్యంత ప్రమాదకరమైన ‘మెలనోమా’అనే స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశం 80 శాతం పెరుగుతుంది.రోగనిరోధక శక్తి తగ్గుతుంది పరిశోధనల ప్రకారం.. ఇరవై నిమిషాల ఎండ తీవ్రత చర్మంలోని రోగనిరోధక కణాలను తాత్కాలికంగా నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల చర్మానికి కేన్సర్ కణాలతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు పాడైన చర్మ కణాల డీఎన్ఏ, వెంటనే కాకుండా 10 లేదా 20 సంవత్సరాల తర్వాత కేన్సర్గా బయటపడొచ్చు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండ తక్కువగా ఉన్నట్టు అనిపించినా, మేఘావృతమై ఉన్నా కూడా బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం, గొడుగు వాడటం లేదా శరీరాన్ని పూర్తిగా కప్పుతూ దుస్తులు ధరించడం వంటి రక్షణ చర్యలు తప్పనిసరి. -
ఐపీఎల్ ఫైనల్పై రాజకీయం? డీకే శివకుమార్
బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్ఖుషీతో ఉన్నారు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు. ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్ జోష్ మీదుంటే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
దిమ్మతిరిగిపోయే ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది ఎవరో కాదు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పలువురు నిందితులకు సోనార్పూర్ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో తపన్ మైతి, ఆకాశ్ గాయెన్, కాజల్ దాస్, దేవాశిష్ దత్తా, నిర్మాల్య సెంగుప్తా అలియాస్ జాయ్ ఉన్నారు. ఈ ఘటనలో వారి పాత్రలపై దర్యాప్తు జరుపుతున్నారు. తపన్ మైతి, జాయ్ సెంగుప్తా మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహిత సహచరులు. కాజల్ దాస్, దేవాశిష్ దత్తా కూడా లవ్లీ మైత్రాతో అనుబంధం ఉన్నవారని తెలుస్తోంది. ఈ నలుగురూ కేసులో అరెస్టయిన వారిలో ఉన్నారు.ఆకాశ్ గాయెన్ ఎవరు?ఈ దాడి కేసులో అరెస్టయిన నిందితుల్లో ఆకాశ్ గాయెన్ ఒకరు. ఆయన స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త.. తన కుమారుడు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నాడని, టీఎంసీ ఎన్నికల బూత్ల వద్ద క్రమం తప్పకుండా విధులు నిర్వహించేవాడని ఆయన తల్లి తెలిపారు.తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అభిషేక్ బెనర్జీపై ద్వేషం పెట్టుకునే కారణం ఆకాశ్కు లేదని చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటన తర్వాత అతడు ఇంటికి వచ్చి, అనంతరం సమీప మైదానంలో ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లాడు. అదే రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కచ్చితమైన కారణాలను కుటుంబానికి తెలియజేయలేదని ఆమె అన్నారు. ఆకాశ్ తండ్రి వ్యాన్-రిక్షా నడుపుతుండగా, ఆకాశ్ నిరుద్యోగి.జాయ్ సెంగుప్తా ఎవరు?ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు జాయ్ సెంగుప్తా. ఆయన స్థానిక టీఎంసీ నాయకుడు. చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. సెంగుప్తా 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్తో అనుబంధంగా ఉన్నారని, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు మారినా పార్టీ పట్ల విధేయత చూపారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిషేక్ బెనర్జీపై సెంగుప్తాకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా వారు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అక్కడికి రావద్దని బెనర్జీకి సూచించాడని, అయినప్పటికీ పర్యటన జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలో సెంగుప్తాకు ఎలాంటి పాత్ర లేదని కుటుంబ సభ్యులు చెప్పారు.రాజకీయ ఆరోపణలుటీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించిందని ఆరోపించారు. బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఈ దాడి ఘటన పెద్ద రాజకీయ వివాదంగా మారింది. హింసకు బాధ్యత ఎవరిదన్న అంశంపై రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అరెస్టయిన పలువురు నిందితులకు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం దర్యాప్తును కొత్త కోణంలో చేయడానికి అవకాశం ఇచ్చింది. దాడి జరిగిన పరిస్థితులు, అరెస్టయిన వారి మధ్య సంబంధాలపై దర్యాప్తు అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. -
హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,చెన్నై: తమిళనాడు కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యుందాయ్ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నికీలల్లో కార్లు,సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. పదుల సంఖ్యలో మొహరించిన ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి టౌన్ సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
క్రీడా గర్జన.. ఎండలపై హెచ్చరిక.. ’మన్ కీ బాత్‘లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ ఈరోజు (ఆదివారం) ప్రసారమైంది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక అంశాలు, దేశ ప్రగతి, పౌరుల స్ఫూర్తిదాయక గాథలను ప్రధాని దేశానికి పరిచయం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో క్రీడారంగంలో యువత సాధిస్తున్న విజయాలను కొనియాడుతూనే, పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.క్రీడా రంగంలో సరికొత్త చరిత్రభారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో మన క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురిందర్వీర్ సింగ్, విశాల్ టికె, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వంటి క్రీడాకారులు సాధించిన మైలురాళ్లు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ముఖ్యంగా 100 మీటర్ల స్ప్రింట్లో రెండు రోజుల్లోనే మూడుసార్లు జాతీయ రికార్డులు బద్దలవ్వడం, భారతీయ అథ్లెటిక్స్ ఎదుగుదలకు నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/FhoBe0Hp6L— Narendra Modi (@narendramodi) May 31, 2026ఎండల తీవ్రత - జాగ్రత్తలే శ్రీరామరక్షప్రస్తుత వేసవి కాలంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ, ఎండలో అనవసర ప్రయాణాలను నివారించాలని కోరారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఆయన కోరారు.చరిత్ర పుటల నుంచి నూతన ప్రయాణంమన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా గత ఎపిసోడ్ విశేషాలను కూడా ప్రధాని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగిన 133వ ఎపిసోడ్లో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ముఖ్యంగా, ‘ఆర్కైవ్స్ వాల్ పోర్టల్’ ద్వారా దాదాపు 20 కోట్ల చరిత్రక పత్రాలను డిజిటల్ రూపంలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం భారత చరిత్రను భద్రపరచడంలో ఒక గొప్ప అడుగు అని మోదీ అభివర్ణించారు. -
బెంగాల్లో మళ్లీ హింస: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
హుగ్లీ: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చండితాల పోలీస్ స్టేషన్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా టీఎంసీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి.ఘర్షణకు దారితీసిన పరిస్థితులుటీఎంసీ బృందం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు పరిస్థితి భౌతిక దాడుల వరకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు ‘చోర్-చోర్’ (దొంగ-దొంగ) అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో, టీఎంసీ మద్దతుదారులకు, వారికి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.అధికార యంత్రాంగం అప్రమత్తంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. -
ఫస్ట్ టైమ్ ప్రజల్లోకి విజయ్.. రేపు తిరుచ్చిలో పర్యటన
సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు. చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. -
స్వీట్స్, చిప్స్, బిర్యానీ... మీ మనసులో ఏముందో చెప్పేస్తాయి!
రోజంతా అలసిపోయిన తర్వాత లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం కోసం ఆరాటపడుతున్నారా? అది ఐస్క్రీమ్ కావచ్చు, వేడి వేడి ఫ్రైస్ కావచ్చు లేదా ఇంట్లో వండిన పప్పు అన్నం కావచ్చు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మనసులోని భావోద్వేగాలకు ఉపశమనంగా కంఫర్ట్ ఫుడ్ పనిచేస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.తీపి వంటకాలతో ఓదార్పుచాలామంది కష్టకాలంలో చాక్లెట్లు, స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. చక్కెర పదార్థాలు మెదడులో తాత్కాలికంగా ‘ఫీల్-గుడ్’ రసాయనాలను విడుదల చేస్తాయి. ఒంటరితనంగా లేదా బాధగా ఉన్నప్పుడు, ఈ తీపి పదార్థాలు మనసుకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి మనసుకు అశాంతి నుంచి తాత్కాలిక ఊరటను ప్రసాదిస్తాయి.జ్ఞాపకాలతో ముడిపడిన ఆహారంవేడి సూప్ లేదా తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటకాలు మనకు భద్రతా భావాన్ని, ఆత్మీయతను అందిస్తాయి. అలాగే, స్పైసీ ఫుడ్ తినేవారిలో ఉత్సాహం కోసం లేదా బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తదనం కోసం ఆరాటపడే మనస్తత్వం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఒత్తిడిలో కరకరలాడే ఆహారంచిప్స్ లేదా పాప్కార్న్ వంటి కరకరలాడే ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు నమ్ముతారు. నమలడం అనే ప్రక్రియ శారీరక ఉద్రిక్తతను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మీ మనసు ఏం కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్లేట్లో ఉన్నది కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ హృదయపు అలజడి.ఇది కూడా చదవండి: కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్తో లైఫ్ హ్యాపీ! -
బెంగాల్లో మరో సంచలనం.. మమత వార్నింగ్ ఆడియో లీక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల అభిషేక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో కోల్కతాలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి సీఈవోకు ఆమె వార్నింగ్ ఇస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీంతో, ఇది కాస్త రాజకీయ దుమారం రేపింది. అభిషేక్ బెనర్జీపై సోనార్పుర్లో దాడి అనంతరం.. ఆయనను చికిత్స కోసం బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్ను హెచ్చరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. ‘టాండన్ మీరు తప్పుచేశారు. మేము మీకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటాం. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆస్పత్రిని నడుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. తర్వాత వాళ్లు అధికారం కోల్పోతే.. మేం చేయాల్సింది చేస్తాం’ అని ఆడియోలో ఉంది.అయితే, అభిషేక్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ చేయాలంటూ బీజేపీ నాయకులు, ఓ సీనియర్ పోలీసు అధికారి ఆస్పత్రిపై ఒత్తిడి తెచ్చారని మమత ఆరోపించారు. తన మేనల్లుడికి ఏమైనా జరిగితే ఆసుపత్రిదే బాధ్యత అని మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు మమత తెలిపారు. కాగా.. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.Last night Mamata Banerjee was shouting at the Hospital Authorities of Belle Vue & especially against Mr. Pradip Tandon (CEO), her arrogance isn't going away either. pic.twitter.com/CP8djkGYns— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 31, 2026ఇదిలా ఉండగా.. సోనార్పుర్లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయన ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని మమత తెలిపారు. అభిషేక్కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని ఆరోపించారు. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆసుపత్రులకు పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు. అలాగే, అభిషేక్ సోనార్పుర్ పర్యటన గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, వారు ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. హింసను సృష్టించేందుకే బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆరోపించారు. బీజేపీ చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలని మండిపడ్డారు. అంత అమానవీయంగా బీజేపీ తయారయ్యిందని ఫైర్ అయ్యారు. -
‘నన్ను నెట్టేసినా సరే.. ఇల్లు ఖాళీ చేయను’
పాట్నా: బీహార్లో ప్రభుత్వ బంగ్లా చుట్టూ వివాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలోని ఒక మంత్రికి కేటాయించిన ఆ ఇంటిని వదిలి, మరో ఇంటికి మారేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోవడం లేదు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాను మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్కు కేటాయిస్తూ భవన నిర్మాణ శాఖ మే 27న ఉత్తర్వుల్లో జారీ చేసింది.ఈ ఉత్తర్వులు జారీ అయినప్పుడు ఆమె నగరంలో లేరు. ఆమె విమానాశ్రయానికి చేరుకోగానే.. జర్నలిస్టులు ఈ విషయంపై మీడియా ప్రశ్నించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాట్ చౌదరి సీఎం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగానైనా ఖాళీ చేయించమనండి. నేను మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేయనంటూ ఆమె సమాధానమిచ్చారు. దశాబ్ద కాలంగా ఆమె ఉంటున్న ఈ బంగ్లాను, గతంలో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు మాజీ సీఎం హోదాలో కేటాయించిన సంగతి తెలిసిందే.శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న రబ్రీ దేవిని ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతేడాది నవంబర్లోనే మొదటిసారి కోరింది. అప్పట్లో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భవన నిర్మాణ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో... 10, సర్క్యులర్ రోడ్ బంగ్లాను అప్పటి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, సీనియర్ బీజేపీ నాయకుడైన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్లో కొనసాగుతున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు. రబ్రీ దేవి ఆ బంగ్లాను వదిలిపెట్టేందుకు నిరాకరించారు.తాజా వివాదంపై భవన నిర్మాణ శాఖ మంత్రి, సీనియర్ జేడీయూ నాయకురాలు లేశి సింగ్ మాట్లాడుతూ... శాసనమండలి ప్రతిపక్ష నేతకు '39, హార్డింజ్ రోడ్' బంగ్లాను కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని చెప్పారు. కాబట్టి, రబ్రీ దేవి ఆ ఇంటికి మారడం మంచిదన్నారు. ఆమె గత ఉత్తర్వులను పాటించారా? అనే విషయంతో మాకు సంబంధం లేదు. కానీ, ప్రభుత్వ ప్రముఖులకు తగిన బంగ్లాలు కేటాయించడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఎవరూ కూడా నిర్దిష్ట బంగ్లాపై తమకు హక్కు ఉందని పట్టుబట్టలేరు. మాజీ సీఎంగా రబ్రీ దేవి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నామంటూ సింగ్ పేర్కొన్నారు.1997లో తన భర్త తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రబ్రీ దేవి.. ప్రస్తుతం ఆయనతో కలిసే ఈ బంగ్లాలో ఉంటున్నారు. వారి చిన్న కుమారుడు, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదాలో 1 పోలో రోడ్ నివాసంలో ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం ఈ '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాలోనే గడుపుతుంటారు. -
నెత్తురోడుతున్న నెమలి.. ఈకలు పీక్కుపోయిన జనం
న్యూఢిల్లీ: ఒక జాతీయ పక్షి(నెమలి) గాయపడి, కుంటుకుంటూ రోడ్డు దాటుతుండగా, అటుగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో అది ప్రాణాపాయ స్థితికి చేరింది. దీనిని గమనించిన జనం ఆ మూగజీవికి సాయం చేయాల్సింది పోయి, దాని ఈకలను పీక్కోవడంలో తలమునకలయ్యారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.సహాయం మరిచి..‘మాతృభూమి’అందించిన కథనం ప్రకారం.. రోడ్డు పక్కన గాయపడి పడి ఉన్న ఆ నెమలిని చూసి జనం అక్కడ గుమిగూడారు. ఆ నెమలి నడవలేక, ఎగరలేక తీవ్ర వేదన అనుభవిస్తుంటే, వారు కనీస మానవత్వం చూపలేదు. అటవీ శాఖ అధికారులకో లేదా వెటర్నరీ వైద్యులకో సమాచారం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో అక్కడున్న కొందరు ఆ నెమలి శరీరం నుంచి బలవంతంగా ఈకలను పీకేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా షాకవుతున్నారు.మండిపడుతున్న నెటిజన్లుఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధలో ఉన్న జీవిని ఆదుకోవడానికి బదులుగా, ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో కరుణ, కనికరం అనేవి లేకుండా పోతున్నాయని, ఇలాంటి ఘటనలు మానవత్వం పతనమవుతున్నదనడానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా పలువురు అంటున్నారు.చట్టం ఏం చెబుతోంది?భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలికి ‘వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972’ కింద అత్యున్నత రక్షణ ఉంది. దీనికి హాని చేయడం, దాని శరీర భాగాలతో వ్యాపారం చేయడం నేరం. గాయపడిన పక్షిని చూసినప్పుడు వెంటనే అటవీ అధికారులకు లేదా రెస్క్యూ టీమ్కు సమాచారం అందించడం పౌరుల కర్తవ్యం. ఈ వీడియోపై అధికారులు స్పందించి, బాధ్యులపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదనే విషయాన్ని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొనలేదు.ఇది కూడా చదవండి: కేదారనాథ్లో భక్తజన సునామీ.. ఈ 39 రోజుల్లో.. -
‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్ జల్సాలు’
కట్టుకున్న భార్యను చదివించేందుకు ఓ భర్త చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం అమ్మి భార్యను చదివిస్తే.. తీరా ఉద్యోగం వచ్చాక కుటుంబాన్ని ఎగతాళి చేసి కన్న కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాక్ తగిలింది. ఆమె తన ప్రియుడితో కలిసి చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె ఆగిపోయినంత పనైంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, ఉద్యోగం తర్వాత మారే సంబంధాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.బీహార్లోని వైశాలి జిల్లా హాజీపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను 2013లో గుంజన్ కుమారిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆమె ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తిచేసి ఉంది. అయితే, ఆమెకు టీచర్ కావాలన్న లక్ష్యం ఉందని భర్తకు చెప్పింది. దీంతో, ఆమెను చదివించాలని అమన్ అనుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, తాను కూలి పనులు చేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా 2022లో తన భూమిని అమ్మి.. ఆమె డిగ్రీ, బీఈడ్ చదువులు, బీపీఎస్సీ టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.తర్వాత గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో ఎంపికై టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సుపౌల్ జిల్లాలో శిక్షణ పూర్తిచేసిన అనంతరం బిదుపూర్ బ్లాక్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన వద్దకు పంపించి, తాను సహచర టీచర్లతో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని చెప్పింది. కానీ తర్వాత ఆ ప్రయాణానికి ఇతర టీచర్లు ఎవరూ వెళ్లలేదని అమన్కు తెలిసింది. దీంతో తన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆరా తీయగా.. శిక్షణ సమయంలో ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉండడం ప్రారంభించిందని గుర్తించాడు.🚨Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC SuccessThe shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026ఈ క్రమంలో మే 23న హాజీపూర్లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంటికి వెళ్లగా, అక్కడ ప్రేమ్ ప్రకాశ్తో కలిసి ఉండడాన్ని అమన్ చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే డయల్-112 పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. తన తల్లి మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని ఒత్తిడి చేసిందని, తాను ఆమెతో ఉండాలని అనుకోవడం లేదని బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చిన్నారి భవిష్యత్తు, మానసిక పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కేదారనాథ్లో భక్తజన సునామీ.. ఈ 39 రోజుల్లో..
కేదారనాథ్: ప్రపంచ ప్రసిద్దచెందిన ఉత్తరరాఖండ్లోని కేదారనాథ్ ధామం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుండి, భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. కేవలం 39 రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్నాథ్ను దర్శించుకోవడం మరో చరిత్రకు నాందిపలికింది. గతంతో పోలిస్తే, ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం ఇదే మొదటిసారి.భక్తి పారవశ్యంలో కేదారపురిఆలయ ప్రాంగణం ‘హర్ హర్ మహాదేవ్’ అనే జయఘోషలతో మార్మోగుతోంది. రోజూ సుమారు 25 వేల మందికి పైగా భక్తులు కొండలను అధిరోహిస్తూ ఆలయానికి చేరుకుంటున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. గౌరీకుండ్ నుండి కేదారపురి వరకు ఎక్కడ చూసినా భక్తుల అంతులేని క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణం కూడా భక్తుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి.భద్రత కోసం మరింత నిఘారుద్రప్రయాగ ఎస్పీ నిహారికా తోమర్ మాట్లాడుతూ, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్,ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. యాత్ర మార్గంలో అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు. సిసిటివి కెమెరాలు, సోషల్ మీడియా పర్యవేక్షణతో పాటు, అక్రమ మద్యం వ్యాపారులపై దాడులు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఈ సీజన్ ముగిసే సమయానికి..ఈ ఏడాది భక్తుల రాకను బట్టి చూస్తే, ఈ సీజన్ ముగిసే సమయానికి కేదారనాథ్ యాత్ర అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాబా కేదార్పై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం, యాత్ర నిర్వహణలో మెరుగైన ఏర్పాట్లు ఈ యాత్రను విజయవంతం చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: నింగిలో అద్భుతం: నేడు ‘బ్లూ మూన్’ సందడి -
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదు అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా రక్షించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.సాయిదుల్లాజాబ్ ప్రాంతంలోని వెస్ట్రన్ మార్గ్లో ఉన్న ఈ ఐదు అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్, కేఫ్లు, కార్పొరేట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. మూడో అంతస్తులో కొంత నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. శనివారం రాత్రి 7:45 నిమిషాల సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పక్కనే విద్యార్థులు రాత్రి భోజనం చేస్తున్న ఒక తాత్కాలిక రేకుల షెడ్డు (క్యాంటీన్)పై ఈ భవనం పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.డీఎఫ్ఎస్, ఎన్డీఆర్ఎఫ్, డీడీఎంఏ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించడానికి జేసీబీ ఎక్స్కవేటర్లు, హైడ్రాలిక్ కట్టర్లతో పాటు.. లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక విక్టిమ్-లొకేషన్ కెమెరాలు, ఎర్త్-అగర్ డ్రిల్లింగ్ మిషన్లు మరియు శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) రంగంలోకి దించారు.#WATCH | Delhi: Rescue operation underway after a five-storey building collapsed in the Mehrauli police station area. Nine people have been evacuated.Morning visuals from the spot. pic.twitter.com/N8OCw44nKi— ANI (@ANI) May 31, 2026స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో క్యాంటీన్, భవనంలో కలిపి దాదాపు 100 నుండి 150 మంది వరకు ఉండవచ్చని... శిథిలాల కింద నుంచి రక్షించాలంటూ ఆర్తనాదాలు విన్నామంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి 12 మందిని రక్షించాం. శిథిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తయ్యే వరకు కచ్చితంగా చెప్పలేం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
డీకే శివకుమార్కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పునకు తెరలేచింది. కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సీఎం పదవి రేసుకు ఇది ముగింపు పలికినట్లైంది. అయితే, ఈ పరిణామం సాధారణ సీఎం మార్పు కంటే చాలా పెద్ద రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ ఫార్ములా అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి నుంచే ప్రభుత్వం సగకాలం తర్వాత సీఎం మార్పుపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, శివకుమార్ కాంగ్రెస్కు కర్ణాటకలో అత్యంత కీలకమైన నిర్వాహక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతున్న సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటం నుంచి, 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ హైకమాండ్కు చాలా కాలంగా డీకే శివకుమార్ను సీఎం చేయాలనే ఒత్తిడి ఉండేది. 2023లో సిద్ధరామయ్యను సీఎం చేసినప్పుడు కూడా డీకే వర్గం అసంతృప్తిగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నాయకత్వ మార్పు ద్వారా ఆ అసంతృప్తిని తగ్గించాలనే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సీఎల్పీ సమావేశంలో ఏమైంది?బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును కొత్త నాయకుడిగా ప్రతిపాదించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సేవలను కొనియాడారు. మీ సేవలు కేవలం కర్ణాటకకే పరిమితం కావు అనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యను కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సిద్ధరామయ్యకు భవిష్యత్తులో జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకవైపు డీకే శివకుమార్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూనే, మరోవైపు సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలో వినియోగించాలనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సిద్ధరామయ్యకు ఏ పదవి రావచ్చు?కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో పెద్ద బాధ్యత.ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో జాతీయ పదవి.ఓబీసీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి జాతీయ ప్రచార బాధ్యతలు ఇవ్వవచ్చు.2029 లోక్సభ ఎన్నికల వ్యూహరచనలో కీలక పాత్ర కల్పించవచ్చు.రాజ్యసభకు పంపించే అవకాశం. అయితే, ఈ అంశాలపై కాంగ్రెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.డీకే శివకుమార్ ముందున్న సవాళ్లు..ఇదిలా ఉండగా.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కు పలు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి.కాంగ్రెస్ అంతర్గత వర్గపోరును సమతుల్యం చేయడం.సిద్ధరామయ్య అనుచరులను సంతృప్తిపరచడం.ఐదు గ్యారంటీ పథకాల అమలు కొనసాగించడం.2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడం.బీజేపీ, జేడీఎస్ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడం. -
నింగిలో అద్భుతం: నేడు ‘బ్లూ మూన్’ సందడి
న్యూఢిల్లీ: ఈరోజు(మే 31, 2026) రాత్రి ఆకాశం ఒక అరుదైన ఖగోళ దృశ్యానికి వేదిక కాబోతోంది. ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బ్లూ మూన్’ నేడు సందడి చేయనుంది. సాధారణంగా ఒక నెలలో ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది. కానీ ఈ నెలలో రెండోసారి పౌర్ణమి రావడం వల్ల దీనిని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.చంద్రుడు నిజంగానే నీలంగా కనిపిస్తాడా?‘బ్లూ మూన్’ అనే పేరు వినగానే చాలా మంది చంద్రుడు నీలం రంగులోకి మారుతాడని భ్రమపడతారు. కానీ, అది నిజం కాదు. దీనికి చంద్రుని రంగుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం క్యాలెండర్ లెక్కల ప్రకారం ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే, ఆ రెండో పౌర్ణమిని సూచించే ఖగోళ పదం మాత్రమే. కాబట్టి, నేడు చంద్రుడు తన సహజ సిద్ధమైన శ్వేత వర్ణంలోనే ప్రకాశిస్తాడు.భారతదేశంలో ఎప్పుడు, ఎలా చూడాలి?ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేదా టెలిస్కోపులు అవసరం లేదు. మే 31 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత, ఆకాశం నిర్మలంగా ఉన్నట్లయితే మీరు మీ ఇంటి పైకప్పు లేదా బహిరంగ ప్రదేశాల నుంచి చంద్రుని చూడవచ్చు. సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య సమయం దీనిని వీక్షించడానికి అత్యంత అనువైనదిగా నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: విద్యార్థి హత్య: ఎన్కౌంటర్లో నిందితుడు హతం -
సిద్దు ఇంటికి ఎమ్మెల్యేల క్యూ
బెంగళూరు: సీఎం సిద్దరామయ్య బెంగళూరులో కావేరి నివాసంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో శనివారం రద్దీ ఏర్పడింది. బోర్డు, కార్పొరేషన్ల పదవుల కోసం నాయకులు సిద్దును కలవడానికి వస్తున్నారు. రాజీనామా తరువాత సిద్దరామయ్యకు హైకమాండ్ పలు వాగ్దానాలు చేసింది. రాబోయే మంత్రివర్గంలో ఆయన కోటాలో కొందరికి మంత్రి పదవులు లభిస్తాయి. సిద్దు ప్రభావం ఏమీ తగ్గబోదని తెలుస్తోంది. అనేకమంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్యను కలిసి పదవుల కోసం విన్నవించారు. ప్రజలు కూడా పెద్దసంఖ్యలో రాగా, సీఎం వారి నుంచి వినతులను స్వీకరించారు. -
గెటప్ వెనుక కథ ఏమిటో!
కర్ణాటక: డీకే శివకుమార్ మామూలుగా గడ్డం అనేది లేకుండా ఉండేవారు. కానీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన ప్రతిజ్ఞ పూని గడ్డం విడిచారు. తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత గడ్డం గెటప్ అలాగే కొనసాగుతోంది. ఈ మార్పు గురించి విలేకరుల సమావేశాల్లో ప్రశ్నించినా డీకే శివకుమార్ సమాధానం చెప్పేవారు కాదు. గడ్డం వెనుక రహస్యం ‘సీఎం కుర్చీయే’ అని చర్చ జరుగుతుండేది. ఆయన త్వరలోనే షేవ్ చేసుకుంటారని, సెలూన్ వారి ద్వారా ఈ సమాచారం తెలిసిందని బీజేపీ పక్ష నేత అశోక్ అసెంబ్లీలోనూ చెప్పారు. గడ్డం పెంచడం వెనుక ప్రతిజ్ఞ ఏమిటని కూడా ప్రశ్నించారు. అజ్జయ్య స్వామి చెప్పినపుడు గడ్డం తీస్తారు అని మంత్రి కృష్ణ బైరేగౌడ సరదాగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి గడ్డం తీసేస్తారా?, ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్త కొత్త లుక్లో కనిపిస్తారా అనేది కుతూహలంగా ఉంది. -
విద్యార్థి హత్య: ఎన్కౌంటర్లో నిందితుడు హతం
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ను కుదిపేసిన 11వ తరగతి విద్యార్థి సూర్య చౌహాన్ దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అసద్, పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. శనివారం ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.ఎన్కౌంటర్ వెనుక ఉన్న అసలు కథమే 28న జరిగిన ఘర్షణలో సూర్య చౌహాన్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ప్రధాన నిందితుడు అసద్పై రూ. 50,000 రివార్డు ప్రకటించిన పోలీసులు, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఖోడా ప్రాంతంలో తన సహచరులను కలిసేందుకు అసద్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్పై వస్తున్న అసద్ను ఆపే ప్రయత్నం చేయగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్కు తీవ్రగాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు.కుట్రపూరిత హత్య: కుటుంబం ఆరోపణసూర్య కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 28న ఫోన్ కాల్ చేసి ఈద్ వేడుకల కోసం రమ్మని పిలిచి, అతడిని ఒకచోట బంధించి దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు కత్తులతో వెంటాడి మరీ సూర్యను పొడిచారని, తనను తాను కాపాడుకునేందుకు 200 మీటర్ల దూరం పరుగెత్తినా వదలకుండా దాడి చేశారని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేయాలని బాధితుడి తల్లి సరోజ్ డిమాండ్ చేస్తున్నారు.చిన్న గొడవే ప్రాణం తీసిందిపోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సూర్య స్నేహితులే నిందితులు. మోటార్ సైకిల్ నడపడం విషయమై జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెరిగి, కోపంతో అసద్ సూర్యను నిందితులు కత్తితో పొడిచినట్లు డీసీపీ ధవల్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, తుపాకీని స్వాధీనం చేసుకుని సోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: అందం, హోదా.. అంతా అబద్ధమేనా? -
విజయ్కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. -
‘పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
భారత్లో ట్రంప్ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆమె.. ఢిల్లీలోని చారిత్రాత్మక బాప్స్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్తో పాటు రాజస్థాన్లోని జైసల్మేర్ వెళ్లారు. టిఫానీ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, కట్టడాలను టిఫానీ దంపతులు మంత్రముగ్దులయ్యారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు ఫోటోలు దిగారు. ఆచిత్రాలను టిఫాని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు. -
రాజస్తాన్, ఢిల్లీ అతలాకుతలం
న్యూఢిల్లీ/జైపూర్: ప్రకృతి ప్రకోపానికి శనివారం దేశరాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతాలతోపాటు రాజస్తాన్ అతలాకుతలమైంది. జాతీయరాజధాని పరిధి(ఎన్సీఆర్)లోని చాలా చోట్ల వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీనికితోడు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దుమ్ము గాలులు వీస్తూ స్థానికులను తీవ్ర ఇబ్బందులపాల్జేశాయి. థార్ ఎడారికి నిలయమైన రాజస్తాన్లో ఇసుక తుపాన్ల ధాటికి జనజీవనం కొన్ని గంటలపాటు స్తంభించిపోయింది. దుమ్ము తుపాన్లకు పిడుగులు, మెరుపులు తోడవడంతో ఢిల్లీ–ఎన్సీఆర్, రాజస్తాన్ వాసులు శనివాం ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి వచ్చిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏమిటీ ఆందీ? వాయవ్య భారతంలో రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఉరుములు, మెరుపులతో కూడిన భీకర గాలులు వీయడాన్ని ఆందీగా పిలుస్తారు. మే చివరివారంలో ప్రకృతి ఇలా దుమ్ము తుపాన్ల రూపంలో వాయవ్య భారతాన్ని చుట్టేస్తుంది. ఎండాకాలంలోని చండ ప్రచండ వేడిమికి భూమి ఉపరితలం అత్యధికంగా వేడెక్కుతుంది. దీంతో గాలిలో స్థిరత్వం అదుపుతప్పుతుంది. దీనికి ధూళి గాలులు తోడై దుమ్ము తుపానులను సృష్టిస్తాయి. వీటికి సమీపంలోని థార్ ఎడారికి నిలయమైన రాజస్తాన్ గుండా ఇసుకరేణువులు గాలితోపాటు ఎగిరొచ్చి ఢిల్లీ–ఎన్సీఆర్లో ధూళి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్తాన్లో ఇసుక బీభత్సం రాజస్తాన్లోని చాలా ప్రాంతాల్లో శనివారం సైతం ఇసుక తుపాన్లు, వర్షం స్థానికులను తెగ ఇబ్బందులకుగురిచేశాయి. దుమ్ముతోపాటు ఇసుక గాల్లోకి లేవడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రహదారులపై దుమ్ము కమ్ముకుంది. దీంతో ప్రయాణికులకు రహదారులపై ఏముందో కని్పంచకపోవడంతో డ్రైవర్లు పట్టపగలే హెడ్లైట్లు ఆన్చేసుకుని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించారు. హనుమాన్గఢ్, శ్రీ గంగానగర్ రీజియన్లలో ఇసుక తుపాను ప్రభావం ఎక్కువగా కన్పించింది. భీకర గాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. గత 24గంటల్లో ఛురు, హనుమాన్గఢ్, శ్రీ గంగానగర్, బికనీర్, నాగౌర్, దిద్వానా–కుఛమాన్, ఆల్వార్, సికార్లలో తుపాను బీభత్సం సృష్టించింది. ‘‘ఇంతటి ఇసుక తుపాను జీవితంలో చూడలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కసారిగా నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి’’అని ఛురు నగర వాసి చెప్పారు. దుమ్ము తుపాన్లతోపాటు ఉరుములతో కూడి వర్షాలు పడ్డాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ధోల్పూర్ జిల్లాలోని బారీలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీ సెల్సియస్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. -
ఇప్పుడు క్యూట్ వంతు
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్– యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్ఈ పునర్మూల్యాంకనంలో లోపాలు, పరీక్షఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలో పరువు పోగొట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్(క్యూట్–యూజీ) పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలుపడ్డారు. సాంకేతిక సమస్యతో పరీక్ష రాయలేక చివరకు వెనుతిరిగారు. మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకు పరీక్షహాల్లోకి అనుమతించారు. మూడు గంటలకు పరీక్ష మొదలుకావాల్సి ఉండగా గంటపాటు అభ్యర్థులు లాగిన్కాలేకపోయారు. 4 గంటలకు పరీక్ష మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3,765 మంది అభ్యర్థులు పరీక్షరాయలేక చివరకు వెనుతిరిగారు. ఉదయం సెషన్లోనూ ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది. వాళ్లకు మాత్రం కోల్పోయిన కాలం మేరకు అదనపు సమయాన్ని కేటాయించారు. మ«ధ్యాహ్నం సెషన్లో మాత్రం వేలాది మంది పరీక్షరాయలేకపోయారని వాళ్లకు మాత్రం వేరేరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్టీఏ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూట్–యూజీ పరీక్షకు టెక్నికల్ సరీ్వస్ ప్రొవైడర్గా ఉన్న ‘టీసీఎస్ ఐఆన్’సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్టీఏ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే +91–11–40759000 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్చేసి లేదా cuet-ug@nta. ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టంచేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఉదయం సెషన్ రెండు గంటలు ఆలస్యంగా చేపట్టామని టీఎస్ఎస్ సంస్థ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు.వెల్లువెత్తిన విమర్శలు పరీక్ష కోసం లోపలికి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకురాకపోవడంతో మండుటెండలో వేచిచూసిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘మూడు, నాలుగు గంటలు బయట ఎండలో వేచిచూసి అలసిపోయాం. తీరా బయటికొచ్చి పరీక్ష రాయలేదు అని వాళ్లు చెప్పడంతో ఒళ్లు మండింది. జాతీయస్థాయి పరీక్షలను ఇలాగేనా నిర్వహించేది? వాళ్లు లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న మాలో ఒక్కరికీ చెప్పలేదు’’అని ఒక పరీక్షార్థి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘సుదూరం నుంచి ఉదయం ఆరు గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చాం. తీరాచూస్తే 11 గంటలకైనా ఎగ్జామ్ మొదలెట్టలేదు. మా వాళ్లు ఎదురుచూసి అలసిపోయి వెనుతిరిగారు’’ అని మరో నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా అసహనం వ్యక్తంచేశారు.ఇది ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ: కాంగ్రెస్ క్యూట్–యూజీ ఉదయం సెషన్ ఆలస్యం, వేలాది మంది మధ్యాహ్నం పరీక్ష రాయలేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బాధ్యుడిని చేయకుండా ఆయనను ప్రధాని మోదీ వెనకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజా క్యూట్–యూజీ ఘటనను ‘ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ’గా అభివరి్ణంచింది.‘విశ్వగురువు’ ఒక్క పరీక్షా సవ్యంగా నిర్వహించట్లేరు: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థ క్యూట్–యూజీ పరీక్ష సవ్యంగా నిర్వహించలేకపోవడంతో లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ మరోసారి మోదీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ విశ్వగురువే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రం అది సాధ్యపడట్లేదు. కనీసం ఒక్క పరీక్షను సవ్యంగా, సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మొన్న నీట్, నిన్న సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, నేడు క్యూట్’’ అంటూ విమర్శించారు. -
ట్రబుల్ షూటర్
బెంగళూరు: కన్నడనాట రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ తరఫున ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీని పలుమార్లు విజయతీరాలకు చేర్చిన రాజకీయ దురంధరుడు డీకే శివకుమార్ ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. రామనగర జిల్లాలోని దొడ్డ అలహళ్లి గ్రామంలో దుమ్ముకొట్టుకుపోయిన వీధుల్లో స్నేహితులతో కలిసి స్వేచ్ఛగా తిరుగుతూ బాల్యాన్ని ఆస్వాదించిన దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ తన నాలుగు దశాబ్దాల రాజకీయప్రస్థానాన్ని కొనసాగిస్తూ సీఎం స్థాయికి ఎదగడం ఆద్యంతం ఆసక్తిదాయకం. కనకపుర బండె(గ్రానైట్ శిల)గా పేరొందిన డీకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమస్యల సుడిగుండంలో పడిన ప్రతిసారీ పార్టీని కాపాడి ట్రబుల్షూటర్గా పేరు సంపాదించారు. కనకపుర తాలూకా దొడ్డ అలహళ్లిలో కెంపెగౌడ, గౌరమ్మ దంపతులకు 1962 మే 15న డీకే జన్మించారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థినేతగా తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1985లో తొలిసారిగా సతనూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడినా నియోజకవర్గ సమస్యలపై పోరాడి 1989లో అదే స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లే. అప్పట్నుంచి వరసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. కనకపుర నియోజకవర్గం ఈయనకు కంచుకోట. 64 ఏళ్ల డీకే కాంగ్రెస్లో వొక్కలిగ సామాజికవర్గం నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2002లో మహారాష్ట్రలో నాటి ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ సర్కార్ విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నప్పుడు విలాస్రావ్కు డీకే సాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే బెంగళూరు రిసార్ట్కు రప్పించి క్రాస్ఓటింగ్ను నివారించారు. 2018లో జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. తొమ్మిదేళ్ల క్రితం రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్లో 42 మంది పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వలలో చిక్కుకోకుండా చూసుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం డీకేకు అప్పగించింది. పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి బీజేపీ కుట్రను భగ్నంచేసి డీకే ట్రబుల్ షూటర్ అని మరోసారి నిరూపించుకుని అధిష్టానం దృష్టిలో పడ్డారు. తర్వాత అక్రమాస్తుల కేసులతో బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినా, జైల్లో పడేసినా డీకే ప్రభ ఏమాత్రం తగ్గకపోగా ఆయనకు రాష్ట్రంలో ఆదరణ మరింత పెరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరస దాడులు, దర్యాప్తుల పర్వం సైతం డీకే ఫాలోయింగ్ను అమాంతం పెంచేసింది. 2019 సెపె్టంబర్ మూడోతేదీన డీకేను అరెస్ట్చేసి 50 రోజులపాటు తీహార్ కేంద్ర కారాగారంలో విచారణఖైదీగా ఉంచారు. జైలు శిక్ష భయంతో కమలదళంలో చేరబోతున్నారన్న పుకార్లను పటాపంచలుచేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీపై తన అచంచల భక్తిని చాటారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మనసును డీకే గెల్చుకున్నారు. తర్వాత 2020లో పార్టీ ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో రాష్ట్రంలో పార్టీ అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో ఆయన నాయకత్వ సమర్థతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినాసరే పట్టువదలకుండా ప్రయత్నించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేశారు. 2023లో పార్టీని విజయతీరాలకు చేర్చి తన రాజకీయ చాతుర్యాన్ని మరోసారి చాటారు. మరుసటి ఏడాది సైతం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతంచేయడంతో విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలవగా 2024 ఎన్నికల్లో 9 చోట్ల విజయకేతనం ఎగరేసేలా చేశారు. సీఎం కుర్చీకి తాను అర్హుడినే అని అధిష్టానం వద్ద బలంగా తన వాదనను విన్పించారు. అయితే సిద్ధరామయ్య నుంచి సీనియార్టీ రూపంలో ప్రతిఘటన ఎదురుకావడంతో మధ్యేమార్గంగా డీకేకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర చీఫ్గా కొనసాగుతూ పార్టీపై తన పట్టు నిలుపుకున్నారు. ఎట్టకేలకు తాను కలలుగన్న కీలక సీఎం పదవిని కైవసంచేసుకున్నారు. 1993లో ఉషను డీకే పెళ్లాడారు. వీళ్లకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడిని వివాహం చేసుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయవేత్తలో డీకే కూడా ఒకరు. -
సీఎల్పీ నేతగా డీకేఎస్ ఏకగ్రీవం
సాక్షి బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎఎల్పీ) నేతగా ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. బెంగళూరు విధానసౌధలో శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీలో స్పీకర్ యూటీ ఖాదర్ సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో హాజరు కాలేకపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. అనుకున్న సమయానికే డీకే శివకుమార్ విధానసౌధకు చేరుకున్నారు. విధానసౌధ గడపకు నమస్కరించి లోపలికి వెళ్లారు. సీఎల్పీ నాయకుడిగా డీకే శివకుమార్ పేరును ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ‘‘మన శాసనసభాపక్ష నాయకుడు డీకే శివకుమార్’’అంటూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి పరమేశ్వర ఆమోదించారు. తర్వాత ఎమ్మెల్యేలందరూ చేతులెత్తి ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. అనంతరం సీఎల్పీ నేతగా శివకుమార్ ఎన్నికైనట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులుగా కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా పాల్గొన్నారు. అయితే, ఈ భేటీ మధ్యలో 10 నిమిషాలపాటు విరామం తీసుకోవడం విశేషం. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా ప్రత్యేకంగా మరో గదిలో కొద్దిసేపు సమావేశమైనట్లు తెలిసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఇన్నాళ్లూ అందించిన సేవలను కొనియాడుతూ సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్తో భేటీ సీఎల్పీ సమావేశం కంటే ముందు డీకే శివకుమార్ లోక్భవన్కు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్భవన్లో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ కలిసి చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై గవర్నర్కు సమాచారం అందించారు. గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారాన్ని జూన్ 3న సాయంత్రం 4.05 గంటలకు ఖరారు చేసుకున్నారు. అదేరోజు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సీఎల్పీ నేత ఎన్నిక పూర్తయిన తర్వాత డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సీనియర్ నేతలు కలిసి లోక్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్కు తెలియజేశారు. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిపారు. ఈ మేరకు లేఖ అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డీకే శివకుమార్ను గవర్నర్ ఆహా్వనించారు. జూన్ 3న నిరాడంబరంగా ప్రమాణం సీఎల్పీ భేటీలో డీకే శివకుమార్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ పలకరించారు. జూన్ 3న సాయంత్రం 4.05 గంటలకు లోక్భవన్లో ఆయన కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతుండడంతోపాటు బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయాలని డీకే శివకుమార్ నిర్ణయించారు. అంకితభావంతో సేవలందిస్తాం: డీకేఎస్ కర్ణాటక ప్రజలకు అంకితభావం, నిజాయితీతో సేవ చేయడానికి తాను, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు కాబోయే సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తనను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. సమన్వయ సమితికి నో రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సూచించగా, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తిరస్కరించారు. పారీ్టలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, ప్రభుత్వంతో సమన్వయం కోసం కొత్తగా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని వారు నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. -
తృణముల్ కాంగ్రెస్కు మరో షాక్.. అభిషేక్ బెనర్జీకి నోటీసులు
కోల్కతా: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లి దాడికి గురైన ఘటన గడిచి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుకున్నారు. నకీలీ సంతకాల విచారణలో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి (శనివారం) సమన్లు జారీ చేసింది. 'నకిలీ సంతకాల' వివాదానికి సంబంధించిన విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోల్కతాలోని భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోభన్దేబ్ చటోపాధ్యాయను ఎన్నుకుంటూ సుమారు 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అభిషేక్ బెనర్జిీ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించారు. అయితే, ఈ లేఖలోని కొన్ని సంతకాలు అసెంబ్లీ రికార్డులతో సరిపోలలేదు. ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే నైనా బెనర్జీ సంతకం ఫోర్జరీ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ సెక్రటేరియట్ కోల్కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ కేసు విచారణను సిఐడి (CID) స్వీకరించి, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను విచారించింది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఐదుగురు సీఐడీ అధికారుల బృందం ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి అభిషేక్ వచ్చిన సమయంలో ఆయనను స్వయంగా కలిసి నోటీసులు అందజేశారు.అభిషేక్ స్పందన అయితే నోటీసులు అందుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. "నేను ఇంకా నోటీసు లోపల ఏముందో పూర్తిగా చూడలేదు. నా న్యాయవాదులతో మాట్లాడి తగిన విధంగా స్పందిస్తాను. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, అవసరమైతే అధికారుల ముందుకు హాజరవుతాను. అని అన్నారు. -
అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఐఏఎస్ల సస్పెన్షన్
పట్నా: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను శనివారం బిహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), స్పెషల్ విజిలెన్స్ యూనిట్ (ఎస్వీయూ)ల నుంచి వచ్చిన సిఫారసుల మేరకు నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. వీరిలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 2017 బ్యాచ్కు చెందిన యోగేశ్ కుమార్ సాగర్ కాగా, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే 2014 బ్యాచ్ అధికారిణి అభిలాష కుమారి శర్మ అని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
అవసరమైతే ‘సింధూర్ 2.0’కు సిద్ధం
పుణే: ఒకవేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’ అవసరం తలెత్తితే అందుకు భారత సైనిక దళాలు సర్వసన్నద్ధం ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. భూతల, గగనతల, సముద్ర యుద్ధానికి అతీతంగా ఆధునిక బహుళ–రంగ యుద్ధం కోసం త్రివిధ దళాలు సమన్వయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(డీఎన్ఏ)లో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచి పోయినప్పటికీ.. మళ్లీ మొదలైతే అందుకోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద వివరాలు, శిక్షణ కేంద్రాలను సైన్యం నేలమట్టం చేసింది. పలువురు ముష్కరులను హతమార్చింది. పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు మొదలైనా సరే వెంటనే రంగంలోకి దిగేలా మన సైన్యం అన్ని రకాల సన్నాహాలతో సిద్ధంగా ఉందన్నారు. యుద్ధక్షేత్రాలు పారదర్శకం భవిష్యత్తులో యుద్ధం కేవలం భూమి, సముద్రం, గగనతలానికి పరిమితం కాదని జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అంతరిక్ష యుద్ధాలు, సైబర్ సైబర్ యుద్ధాలు జరుగుతాయన్నారు. యుద్ధ రీతులు నానాటికీ మారిపోతున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుద్ధక్షేత్రాలు పారదర్శకంగా మారాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి కదలిక అవతలివారికి వెంటనే తెలిసిపోతుందన్నారు. అందుకే సైనిక మోహరింపులు, బలగాల రక్షణ చర్యల విషయంలో సైనిక వ్యూహకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనలో భారతదేశ సంకల్పాన్ని, సాయుధ దళాల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. సమగ్ర ప్రణాళిక, రియల్ టైమ్ నిఘా, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన వాయు రక్షణ, సురక్షిత సమాచార మార్పిడి, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ నొక్కిచెప్పిందని వివరించారు. భారత సైన్యం ఆధునీకరణ మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తి’గా మనం రూపాంతరం చెందుతున్నామని, ఇందులో యువతరం పాత్ర కీలకమని స్పష్టంచేశారు. -
జాక్వెలిన్, సుకేశ్లపై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు లో మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మరో 15మందిపై అభి యోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శనివా రం ఆదేశించింది. నిందితులందరిపైనా ప్రాథ మికంగా బలమైన సాక్ష్యాధారాలున్నా యని అదనపు సెషన్స్ జడ్జి (ఏఎస్జే) ప్రశాంత్ శర్మ పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3, 4కింద వీరిపై అభియోగాలు నమోదు చేయా లన్నారు. దీంతో, ఈ కేసు విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కేసులో పలుమార్లు జాక్వెలిన్ను ప్రశ్నించిన ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లో మొదటిసారిగా ఆమె పేరును చేర్చింది. పింకీ ఇరానీ ద్వారా సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన బహు మతులను పొందినట్లు రెండో సప్లిమెంటరీ చార్జి షీట్లో పేర్కొంది. సుకేశ్ నేర కార్యకలాపాలు తెలిసిన తర్వాత కూడా అతడితో జాక్వెలిన్ సంబంధాలు కొనసాగించిందని, మనీలాండరింగ్తో ఆమెకూ సంబంధాలున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆమె బాధితురాలు కాదని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు సుకేశ్ను 2017లో అరెస్ట్ చేయగా, 2021లో ఈడీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సుకేశ్ భార్య లీనా, దీపక్ రమ్నానీ, ప్రదీప్ రమ్దానీ, బి. మోహన్రాజ్, అరుణ్ ముత్తు, డి.కమ్లేశ్ కొఠారి, పింకీ ఇరానీలతోపాటు మరికొందరు కూడా నిందితులుగా ఉన్నారు. -
సైనిక దళాల ఏకీకరణ అత్యవసరం!
న్యూఢిల్లీ: త్రివిధ దళాలు, కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మిళితం చేసి ఒక ప్రత్యేక నావల్ థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత నావికాదళం అధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి చెప్పారు. సముద్ర భద్రత (మారి టైమ్ సెక్యూరిటీ) అనేది ఇంధన భద్రత, జాతీయ భద్రతతో నేరుగా ముడిపడి ఉందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంఘర్షణను ఉదహరించారు. భారతదేశ సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నావల్ థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేయా లని ప్రతిపాదించారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నావల్ కమాండ్ థియేటరైజేషన్ అనేది కేవలం సంస్థాగత పునర్నిర్మాణంపై మాత్రమే కాకుండా, కార్యాచరణ సామర్థ్యం, జాతీయ సైనిక సామర్థ్యం పెంపుదల ద్వారా జరగాలని తెలిపారు. వేర్వేరు సైనిక దళాల ఏకీకరణను ఒక భావనగా కాకుండా పోరాట అవసరంగా పరిగణించాలని సూచించారు. ఏదైనా కొత్త ఉమ్మడి నిర్మాణం అనేది విస్తృత జాతీయ లక్ష్యాలు సాధిస్తూనే సముద్ర భద్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అస్థిరత, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణను ప్రస్తావించారు. సంఘర్షణకు దూరంగా ఉండటం అంటే దాని పరిణామాలకు దూరంగా ఉన్నట్లు కాదని పేర్కొన్నారు. మన సముద్ర తీరాలు, సరిహద్దులు భద్రంగా ఉంటేనే ఆర్థిక భద్రత, జాతీయ భద్రత సాధ్యమవుతుందని, ఇది చాలా ముఖ్యమైన పాఠమని స్పష్టంచేశారు. నౌకా మార్గాలు, ఇంధన సరఫరాలు, సముద్ర సరుకు రవాణా చైన్లకు కలిగే అంతరాయాలు తక్షణ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని అన్నారు. బీమా ఖర్చులు పెరిగిపోతాయని, నౌకా రవాణాకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. యుద్ధాల్లో విభజన తొలగిపోయిందినేడు మొత్తం యుద్ధ స్వరూపమే ఒక తీవ్రమైన పరివర్తనకు లోనవుతోందని అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి తెలిపారు. నేటి సముద్ర యుద్ధ క్షేత్రం సముద్రగర్భం నుండి అంతరిక్షం వరకు నిరాటంకంగా విస్తరించిందని అన్నారు. అదే సమయంలో సైబర్, విద్యుదయస్కాంత, సమాచార రంగాలు కూడా అంతే కీలకమైనవిగా మారాయని స్పష్టంచేశారు. ఆధునిక యుద్ధాన్ని దాని వేగం, స్థాయి ద్వారా ఎక్కువగా నిర్వచించే పరిస్థితి వచ్చిందన్నారు. వేగం అంటే ఇకపై ఒక ప్రత్యేక సామర్థ్యమని వ్యాఖ్యానించారు. స్వల్పకాలిక, వేగవంతమైన యుద్ధాలు అనే విభజన తొలగిపోయిందన్నారు. సుదూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలు, నిరంతర నిఘా అమల్లోకి వచ్చిన నేటి కాలంలో సంప్రదాయ యుద్ధరీతి ఇకపై రక్షణకు హామీ ఇవ్వదని అన్నారు. అంతేకాకుండా సుంకాలను ఆయుధంగా వాడటం, పరస్పర ఆధారిత సప్లై చైన్లకు అంతరాయాలు కలగడం వల్ల, దేశాలు తమ లాజిస్టిక్స్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అపూర్వమైన కార్యాచరణ వేగం భారత నావికాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోందని దినేశ్ కె.త్రిపాఠి తెలియజేశారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే’ బలగాన్ని నిర్మించేందుకు మానవరహిత వ్యవస్థల రోడ్మ్యాప్కు అనుగుణంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి పరిష్కా రాలను అనుసంధానిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్ నౌకాదళం అత్యాధునిక సిబ్బందితో కూడిన ప్లాట్ఫామ్లతో పాటు తక్కువ ఖర్చుతో అధిక ప్రభావం చూపే మానవరహిత పరిష్కారాలపై దృష్టి పెట్టిందని గుర్తుచేశారు. పరస్పరం అనుసంధానమై, రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న సముద్ర భౌగోళిక పరిస్థితుల్లో భారత నౌకాదళం అపూర్వమైన కార్యాచరణ వేగాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. 2025లో దాదాపు 11,000 నౌకా దినాలు, 50,000 గంటలకు పైగా విమానయాన సమయాన్ని నమోదు చేసిందని చెప్పారు. గత ఏడాది నావికాదళం సాధించిన విజయాల్లో ఆపరేషన్ సింధూర్ చాలా ప్రధానమైనదని వివరించారు. ఇది మన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్ సందర్భంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సమన్వయం కూడా అంతే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. ఇది ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పిందని అన్నారు. -
స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు. వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే కీలక బాధ్యతను పాక్ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో ఢిల్లీ-ఎన్సిఆర్లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్కు చెందిన హర్విందర్ సింగ్, గగన్దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు, బైకులు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అభిషేక్ బెనర్జీపై దాడి.. మమతా ఘాటు రియాక్షన్
కోల్కతా: ఈ రోజు పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోనార్పూర్లో ఈరోజు (శనివారం) మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ పర్యటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస చెలరేగింది. అందులో బాధితులైన తృణముల్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మమతా ""పాలకులే హంతకులుగా మారారు.. సిగ్గుపడాలి బీజేపీ" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. అదే విధంగా దాడిని ఖండిస్తున్నామన్నారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ సాగించిన పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందన్నారు.అయితే ఆ దాడి సమయంలో అభిషేక్ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. Staying true to his word, Shri @abhishekaitc REFUSED TO ABANDON the grieving family of Sanju Karmakar.Even after a vicious attack by @BJP4Bengal-backed miscreants, our National General Secretary chose not to turn back. Instead, he stood beside a family devastated by an… pic.twitter.com/L11oo92AzQ— All India Trinamool Congress (@AITCofficial) May 30, 2026 -
‘దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలి’
న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు శనివారం వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు, ఎంపీలు డాక్టర్ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు.ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఏమన్నారంటే..వారి మాటల్లోనేదళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి వైఎస్సార్సీపీఅధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్ను కోరాం. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైఎస్సార్సీపీచిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావుదళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు: జూపూడి ప్రభాకర్రావుదళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ వారిని బీసీసీ వర్గంలోకి నెట్టివేసే ప్రయత్నాలను వైఎస్సార్సీపీతీవ్రంగా ఖండిస్తోంది. దళిత క్రైస్తవులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక వాస్తవికత మారదు. అందువల్ల వారిని ఎస్సీలుగానే పరిగణించాలన్నదే మా పార్టీ స్పష్టమైన వైఖరి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. మతం మారినా కుల వివక్ష పోవడం లేదని కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రెండు గ్లాసుల విధానం, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అదే వైఖరికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతుంది. బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేయాలి. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం:మేరుగు నాగార్జున దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీఈ రోజు పోరాటం చేస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని స్పష్టంగా సూచించాయి. సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. చర్చిలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దళిత సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 24న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి వైఎస్సార్సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దళితులు, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. దళిత క్రైస్తవుల పక్షాన వైయస్ జగన్ గారు దృఢంగా నిలబడతారని స్పష్టం చేస్తున్నాం.దళితుల పక్షాన నిలిచిన నాయకుడు జగన్: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కులపై కుట్ర జరుగుతోందనే ఆందోళన కలుగుతోంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాన్ని మత మార్పిడితో మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి. మతం మారినా సామాజిక వివక్ష, వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుంటే, దళిత క్రైస్తవుల విషయంలో మాత్రమే భిన్నమైన వైఖరి అవలంబించడం సమంజసం కాదు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని గతంలో నియమించిన కమిషన్లు సిఫార్సు చేశాయి. అయినప్పటికీ మరోసారి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు మారిపోలేదు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష, వెలివేత, అనేక రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను కాలరాయడం సరికాదు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీనిరంతరం పోరాడుతోంది. 2023లో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీపెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం సాధిస్తాం. దళితుల పక్షాన వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఎస్సీ హోదా లేదనడం వివక్షతకు నిదర్శనం: అరుణ్ కుమార్ దళితులు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలని, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని చెబుతున్నారు. అయితే బౌద్ధం, సిక్కు మతాలను స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ హోదా కొనసాగిస్తున్నారు. ఈ భిన్నమైన వైఖరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవుల విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కమిషన్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైస్తవ మతంలో కులం లేదని, అంటరానితనం లేదని చెప్పడం ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోవడం లేదనేది వాస్తవం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని వైఎస్సార్సీపీప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ హోదా కోసం ఐక్య పోరాటం: నందిగామ సురేష్ మతం మారిన కారణంతో దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక పరిస్థితులు, వివక్షకు గురయ్యే వాస్తవాలు మారవు. అందువల్ల దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాల్సిందే. దళితుల హక్కుల అంశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదవుల కోసం మౌనం పాటించకుండా దళిత సమాజం తరఫున గొంతెత్తాలి. దళితుల సమస్యలు, హక్కుల అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవడం సరైంది కాదు. దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు ప్రశ్నించాలి. సమాజంలో సంపద, అవకాశాలు, హక్కులు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. దళితులకు న్యాయం జరిగే వరకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు. -
3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలకు ఇక ముగింపు పడిందని బీజేపీ అంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నుంచి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు ఎదురవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది తాము బీజేపీలో చేరాలనుకుంటున్నామని నేరుగా చెప్పడం లేదు. వారి తిరుగుబాటు సిద్ధాంతపరమైన మార్పు కంటే, పార్టీలో పెరిగిన అసంతృప్తి, నిరాశ, దూరం పెరగడాన్ని ప్రతిబింబిస్తోంది.బీజేపీ కూడా వచ్చే మూడు నెలల వరకు ఫిరాయింపుదారులను చేర్చుకునే ఆసక్తి తమకు లేదని బహిరంగంగా ప్రకటించింది. టీఎంసీలోని మంచి, చెడు నేతల మధ్య తేడా స్పష్టంగా తెలిసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పుడు భావిస్తున్నట్లు కాకుండా తమ వద్దకు వచ్చిన టీఎంసీ నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. మూడు నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కనుమరుగు అవుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. వారి ఆరోపణలు దాదాపు ఒకేలా ఉన్నాయి. పార్టీ కార్పొరేట్ శైలిలో నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. నాయకత్వాన్ని చేరుకోవడం కష్టమైందని మరికొందరు చెబుతున్నారు. కీలక సమయాల్లో అభిషేక్ బెనర్జీ రాజకీయంగా అందుబాటులో లేరని కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతమంది సొంత పార్టీ నేతల నుంచి విమర్శలువస్తున్నాయి.ఓటమిపై మమత సమీక్ష ఏది? ఇటువంటి ప్రచారం జరుగుతుండడానికి బలమైన కారణం ఉంది. ఓటమి తర్వాత మమతా బెనర్జీ వాస్తవిక పరిస్థితుల గురించి, పరాజయం వెనుక ఉన్న కారణాల గురించి పునరాలోచన చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు శాశ్వతం కాకపోయినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రతి ప్రధాన రాజకీయ శక్తి తనలోతాను విశ్లేషించుకునే దశలోకి వెళ్తుంది.చరిత్రలో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలు చూస్తే.. జ్యోతి బసు యుగం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య నాయకత్వానికి సీపీఎం మారిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలో కూడా అంతర్గత చర్చలు జరిగాయి. సీనియర్ కమ్యూనిస్టు నేత అబ్దుల్లా రసూల్ అప్పట్లో నాయకత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు. చివరకు పార్టీ ఆత్మపరిశీలన చేపట్టక తప్పలేదు. సీపీఎం సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి ఆత్మశుద్ధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునే ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కూడా ఇలాంటి ఆత్మపరిశీలన దశను ఎదుర్కొంది.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఎలాంటి తప్పులను బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా కనిపించడం లేదు. మమతా బెనర్జీ గానీ, అభిషేక్ బెనర్జీ గానీ ఎన్నికల పరాజయానికి వ్యూహాత్మక లేదా సంస్థాగత తప్పిదాలు కారణమయ్యాయని ఒప్పుకోలేదు. దీంతో పార్టీలో మరింత అసంతృప్తి పెరిగి ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఊహాగానాలు వస్తున్నాయి. -
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.సదరు ట్రక్కు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 📍Bhubaneswar–Cuttack, Odisha: Chaos erupted on the highway after a dispute over giving side reportedly turned dangerous between a car and a Hyva truck. The truck allegedly dragged the car for nearly 200 meters while trying to flee the spot, creating panic on the road. Police… pic.twitter.com/eN5ubZJ3ps— Deadly Kalesh (@Deadlykalesh) May 30, 2026 -
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్ దశకు చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్కు చేరింది. ఫైనల్ మ్యాచ్ కౌంట్డౌన్ స్టార్ట్ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.మే 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్ ఫైట్ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్కు తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్కు ప్రత్యేక ఏసీ సూపర్ఫాస్ట్ రైలు నడపనున్నారు.ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్లు కూడా ఉంటాయి.రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.ఫైనల్ మ్యాచ్ ముగిసాక అదనపు సర్వీసులుమ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.రైలు ఆగే స్టేషన్లు ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.బుకింగ్స్ ఎలా అంటే..ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా పీఆర్ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా టైటిల్కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. -
భార్యను కాపాడబోయి బలైపోయాడు
అహ్మదాబాద్: దేశం ఎంత పురోగతి సాధించినా ఇంకా అక్కడక్కడ అంధకార యుగపు ఆనవాళ్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసుల గుడ్డి నమ్మకాలకు గరీబులు బలైపోతూనే ఉన్నారు. మూఢ విశ్వాసాలకు మూకస్వామ్యం తోడుకావడంతో మనుషులు మానవత్వం మరిచిపోతున్నారు. మూఢనమ్మకాలు, గుంపు మనస్తత్వం.. ఒంటరి కుటుంబాలను ఎలా నాశనం చేయగలవో చూపే ఒక భయంకరమైన ఘటన గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై మూకుమ్మడిగా దాడి చేసి ఒకరి ప్రాణాలను బలిగొన్నారు. మూక దాడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఇంటిపెద్ద కడతేరిపోయాడు.సబర్కాంత జిల్లా (Sabarkantha district) విజయ్నగర్ తాలూకాలోని గడివన్కాడ గ్రామంలో ఈ అనాగరిక హత్యోదంతం చోటుచేసుకుంది. మను రామ్జీ దామోర్, అతడి కుటుంబ సభ్యులను మంత్రగాళ్ల నెపంతో కొంతకాలంగా గ్రామస్థులు వేధిస్తున్నారు. రామ్జీ భార్యను 'మంత్రగత్తెస ముద్రవేసి ఈ వేధింపులకు పాల్పడుతున్నారు. దాడి జరిగిన రోజున, వేధింపులు హింసగా మారాయి. మను భార్యను లక్ష్యంగా చేసుకుని గ్రామస్థుల గుంపొకటి వారి ఇంట్లోకి బలవంతంగా చొరబడింది. మూక దాడి నుంచి తన భార్యను తప్పించేందుకు ఆమెకు రక్షణగా నిలబడ్డాడు. అతడి ఇద్దరు కొడుకులు కూడా తమ కన్నవాళ్లను కాపాడుకునేందుకు కదిలారు. కానీ గుంపు ముందు వారు నిస్సహాయులుగా మిగిలిపోయారు.12 మంది అరెస్టుతమకు అడ్డుగా నిలిచిన ఈ ముగ్గురిపై మూఢవిశ్వాసులు పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని పోలీసులు సహాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తగిలిన గాయాల కారణంగా మను మరణించాడు. మూక దాడి నుంచి భార్యను రక్షించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై చిటోడా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మంది నిందితులను అరెస్టు చేశారు.నిందితుల్లో నలుగురు మహిళలుచిటోడా పోలీసులు హత్యతో కూడిన అల్లర్ల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా స్పందించిన పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారని మీడియాకు ఖేడ్బ్రహ్మ డివిజన్ డీఎస్పీ ఉల్దీప్ నాయి వెల్లడించారు. అరెస్టయిన వారు.. వాల్జీ సాలూజీ దామోర్, జిగ్నేష్ వాల్జీ దామోర్, రోహిత్ రాయ్, జివాజీ సాలూజీ దామోర్, నాగ్జీ సాలూజీ దామోర్, హిరాజీ సాలూజీ దామోర్, విజయ్ హిరాజీ దామోర్, కాంతి సాలూజీ దామోర్, సంగీతా నాగ్జీ దామోర్, అరుణ వాల్జీ దామోర్, శారదా కాంతి దామోర్, సీతా హిరాజ్ అని డీఎస్పీ తెలిపారు. చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను -
కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
బెంగళూరు: కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కర్ణాటక సీఎల్పీ భేటీ ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశానికి ఆలస్యంగా చేరుకున్న ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. డీకే పేరును ప్రతిపాదించిన అనంతరం సిద్ధరామయ్య సమావేశం నుంచి వెళ్లిపోయారు. డీకే శివకుమార్,, గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. జూన్ 3న సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు.మరోవైపు, కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాబీయింగ్ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. -
అభిషేక్ బెనర్జీపై గుడ్లు, రాళ్లతో దాడి.. ‘చోర్ చోర్’ అంటూ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అభిషేక్ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం హింస జరగడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి రక్షణ కల్పించారు ఘటనాస్థలిలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. “ఇది పూర్తిగా బీజేపీ ప్రేరేపిత చర్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. అయినా పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was beaten up by locals during his visit to Sonarpur to meet the post-poll victims' families pic.twitter.com/zkXxLJydqe— ANI (@ANI) May 30, 2026 -
‘సీఎం’ గొడవ అయిపోయింది.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం’ కోసం..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు.ఉప ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను నియమించాలని కోరుతూ దళిత వర్గ నేతలు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసన చేపట్టారు. మడార మహాసభ, పలు దళిత సంఘాల నేతలు పోస్టర్లు ప్రదర్శిస్తూ మునియప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. రాష్ట్రానికి చేరుకుంటున్న ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు వినతిపత్రం అందించేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు.విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ఈ నిరసన కొన్ని గంటల పాటు కొనసాగింది. మడిగ వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు దక్కలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. తమ వర్గాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా నగరంలోని షాంగ్రి లా హోటల్కు చేరుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంపై మునియప్ప మాట్లాడుతూ.. "కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, మరికొందరు బలపరుస్తున్నారు. ఇదే విధానం. దీని కంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేం. అయితే ఈ ప్రక్రియ ఈ సాయంత్రానికే పూర్తవుతుంది" అని తెలిపారు.కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి లింగాయత్ వర్గం నుంచి కూడా వచ్చింది. సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గురు బసవ పట్టదేవరు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.గురు బసవ మీడియాతో మాట్లాడుతూ.. "ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుంది" అని అన్నారు. కాగా, కర్ణాటకలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. -
AI: ఒక కొత్త రక్కసి.. ఇదొక మహా ప్రళయం!
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు." ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లను, టూల్స్ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లతో వ్యాపారం చేస్తాయా?ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్వేర్కు, ప్రతి యాప్కు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు. - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం
చురు జిల్లా: రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది. భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. సోషల్ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్గా మారాయి.వీధుల గుండా బలమైన ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి. దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు, దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు.. ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇసుక తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. -
ఢిల్లీ, ముంబైలకు తప్పిన పెనుముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు వాణిజ్య రాజధాని ముంబైకి పెను ముప్పు తప్పింది. కీలక ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా, గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి కలిసి విధ్వంసానికి వేసిన పథకాన్ని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్, హరియాణాల్లోనూ వీరు పేలుళ్లు, విధ్వంసానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఇందులో పాలుపంచుకున్న 8 మంది ఉగ్రవాదులను శనివారం అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడంతోపాటు దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలి్పంచడమే వీరి లక్ష్యమని అధికారులు తెలిపారు. తాజా అరెస్టులతో దేశ రాజధానికి పెను ముప్పు తప్పినట్లయిందని వెల్లడించారు. ఈ పరిణామం నేపథ్యంలో దేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రమాడ్యూల్పై నిఘా కన్ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ సూచనల మేరకు ఢిల్లీ, ముంబై, ఇతర ముఖ్య నగరాల్లోని కీలక కట్టడాలు, భద్రతా బలగాల స్థావరాలు, ప్రముఖ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పథకం వేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో, చాలా కాలంగా నిఘా వర్గాలు ఈ ఉగ్ర మాడ్యూల్ కదలికలపై ఓ కన్నేసి ఉంచాయి. దాడులకు సమాయత్తమవుతున్నట్లు ఉప్పందడంతో స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. పక్కా ప్రణాళికతో ఆకస్మికంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఇంకెవరికైనా ఈ మాడ్యూల్తో సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ స్పెషల్ సెల్ పోలీసులు విచారణ చేపట్టారు. మున్నా జింగ్రా ప్రమేయం ఈ కేసులో దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ల ప్రధాన అనుచరుడైన మున్నా జింగ్రా కీలకంగా ఉన్నట్లు తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. నిందితులకు, అండర్వరల్డ్కు మధ్య సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. జింగ్రా పాకిస్తాన్లో ఉంటూ సయ్యద్ ముదస్సర్ హుస్సేన్ పేరుతో ఉగ్ర కార్యకలాపాలను నడుపుతున్నట్లు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఛోటా రాజన్పై జరిగిన దాడిలో ఇతడి ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. -
మాస్క్ ధరించండి..మాన్విని రానివ్వొద్దు : సూసైడ్ నోట్ కలకలం
కనిపెంచిన తల్లిదండ్రులు,తోబుట్టువులు, భార్యాబిడ్డలు.. ఇలా అందర్నీ మరిచి, జీవితంమీద ఆశ కోల్పోయి తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య. కానీ అంత నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు తీసుకునే చివరి క్షణాల్లో కూడా జరగబోయే ప్రమాదాన్ని గమనించి, తన కుటుంబం, ముఖ్యంగా చిన్న కూతురు మాన్వి, ఇతరులు క్షేమంగా కూడా ఉండాలని ఆయన ఆలోచించిన తీరు అందరినీ కదిలిస్తోంది. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే చనిపోయే తలుపుపై రాసిన చివరి లేఖ మాత్రం అందర్ని కదిలించింది.ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు, ఆ వ్యక్తి తన ఫ్లాట్ తలుపుపై ఇంగ్లీష్లో ఒక హెచ్చరిక లేఖను అంటించాడు. అందులో "సెల్ఫాస్ (Celphos), విషవాయువు, మాస్క్ ధరించండి, నీళ్లు తాగొద్దు" అని రాసి ఉంది. ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ విషవాయువు వల్ల ముఖ్యంగా తన చిన్న కూతురు మాన్వి, కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోఆయన ఈ హెచ్చరిక చేశాడు.'సెల్ఫాస్' అనేది అత్యంత విషపూరితమైన క్రిమిసంహారక మందు.మృతుడు పంకజ్ భన్సాలీ (42) గాంధీనగర్లోని కుడసన్ ప్రాంతంలో గల పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్లో నివసించేవాడు. ఇన్ఫోసిటీలోని ఒక స్టాక్ మార్కెట్ సంస్థలో పనిచేసే ఆయన, దాదాపు ఐదు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోవడంతో పాటు అప్పులు, నష్టాల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. పంకజ్ భన్సాలీ భార్య, కూతురు మే 13న పుట్టింటికి వెళ్లారు. భార్యాభర్తలు చివరి సారిగా మే 22న ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు మే 27న ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. మే 22న లేదా ఆ తరువాత గానీ భన్సాలీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల పాటు మృతదేహం మూసి ఉన్న ఇంట్లోనే ఉండటం వల్ల పూర్తిగా కుళ్ళిపోయింది.ఇన్ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలం నుండి విషపూరిత క్రిమిసంహారక మందును స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!
రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేశాయి.రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్సింగ్ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్మెంట్ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్సింగ్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు, ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు విషయం బయటపడింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్సింగ్కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్ కొడుకు కలిసి.. తొలుత రామ్సింగ్ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్సింగ్ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసి..పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవింగ్తో హ్యాపీ లైఫ్!
ఐటీ ఉద్యోగాలు పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి జీతం వస్తున్నా తాము పడే ఇబ్బందులు, పని ఒత్తిడి అంతా ఇంతా కాదని చాలా మంది ఐటీ ఉద్యోగులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసిన మహిళ తీసుకున్న విలక్షణ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యాలయ ఉద్యోగంలోని తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన ఆమె చివరకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఆటో డ్రైవర్గా కొత్త ప్రయాణంసుమారు 9 ఏళ్లు చేసిన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆమె.. ఆ తర్వాత ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తనకు నచ్చిన సమయాల్లో పని చేసుకునే స్వేచ్ఛ లభించడంతో పాటు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించగలిగింది. ప్రస్తుతం తాను నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతోంది.సోషల్ మీడియాలో వైరల్ఈ మహిళ కథను మరో మహిళా ఎంట్రప్రెన్యూర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా విస్తృత చర్చకు దారితీసింది. సాంప్రదాయ కెరీర్ను వదిలి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చే వృత్తిని, అది కూడా పురుషాధిక్యత ఉండే పనిని ఎంచుకోవడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం అంటే కేవలం అధిక జీతమే కాదని, జీవన నాణ్యత కూడా ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఐటీ ఉద్యోగుల స్పందనఈ కథకు స్పందించిన ఓ ఐటీ ఉద్యోగి, “18 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నా ఇప్పటికీ అంతులేని మీటింగ్లు, గంటల తరబడి కొనసాగే కాల్స్, అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో కొనసాగాలంటే ఎంతో సహనం, మానసిక స్థైర్యం అవసరమని పేర్కొన్నారు.ఆమె గతంలో సంపాదించిన ఆదాయంతో మంచి సేవింగ్స్ చేసి ఉండవచ్చని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం సరళమైన, ప్రశాంతమైన జీవితం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. చివరికి ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతేనని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా నెటిజన్లు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే ఉద్యోగాన్ని వదిలి ఆటో రిక్షా నడపడం ప్రారంభించాడని, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఐదు ట్రక్కుల యజమానిగా ఎదిగాడని తెలిపారు. రూ.5 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ ఇప్పటికీ ఆటో నడుపుతుండటం అతని వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dr. Nezrin Midhlaj / Entrepreneur / Global Speaker (@dr.nezrin_midhlaj) -
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్కు వలస వెళ్లి లండన్లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్లోనే చదువుకున్నారు. విజయ్కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
సీబీఎస్ఈ టెండర్లో సంచలన ట్విస్టులు?
న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్.. డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.12వ తరగతి విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్గా మారినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.సీబీఎస్ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్పై వివాదం🔹 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్ (ప్రస్తుత కోయెంప్ట్ ఎడుటెక్)కు కాంట్రాక్ట్🔹 టెండర్ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్ఈ🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్కు టెండర్ దక్కినట్లు ఆరోపణలుసార్థక్ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్ విఫలమైతే సంస్థను భవిష్యత్లో బ్లాక్లిస్ట్ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. జవాబు పత్రాల స్కానింగ్లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెండర్ రూల్స్లో మార్పులు➡️ గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు➡️ సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు➡️ థర్డ్పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానంఇటీవల సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్లో వెలుగుచూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్ నిర్వహించాలని, పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.లేవనెత్తుతున్న ప్రశ్నలు❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది? This is an unbelievable piece of work by Sarthak and something that requires amplification. Let me explain what he found, in simple terms.Sarthak is a Class 12 student from the 2025-26 batch, one of the 17 lakh students whose answer sheets went through CBSE's new On-Screen… https://t.co/1wB5ZRx5qO— Malay Krishna (@Malay4Product) May 29, 2026అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్ఈ లేదా కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్ఈ టెండర్ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది. -
అద్భుత చికిత్సల పేరుతో మోసం.. పతంజలి ఉత్పత్తులు సీజ్
ముంబై: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యక్తులు, సంస్థలపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) స్పష్టం చేసింది. తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్ చేసి 27 సంస్థలను సీజ్ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం.ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్డీఏ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొంకణ్, పూణే, నాసిక్, అమరావతి, నాగపూర్, శంభాజీనగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు.నివారణ పేరుతో మోసంపలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు.భారీగా స్వాధీనం..రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.కొంకణ్ విభాగంలో – రూ.18.58 లక్షలుపుణే విభాగంలో – రూ.14.68 లక్షలునాగ్పూర్ విభాగంలో – రూ.7.26 లక్షలునాసిక్ విభాగంలో – రూ.7.10 లక్షలుగ్రేటర్ ముంబైలో – రూ.1.85 లక్షల మందులుఅదనంగా రూ.21.83 లక్షల విలువైన మిస్ బ్రాండెడ్ అల్లోపతి మందులు కూడా స్వాధీనం చేశారు.పతంజలి ఉత్పత్తులపైనా చర్యలుహరిద్వార్కు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేసిన, పతాంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. తీవ్రమైన వ్యాధులకు హామీ చికిత్స ఇస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 రకాల ఉత్పత్తులను కలిపి రూ.28.78 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేశారు.కఠిన హెచ్చరికఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే మాట్లాడుతూ..‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలిపెట్టం. తప్పుడు ప్రకటనలు, అక్రమ ఔషధాలు, కల్తీ ఆహారంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిహెచ్చరించారు. మొత్తంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడులు కల్తీ ఆహారం, తప్పుడు వైద్య ప్రకటనల మాఫియాకు గట్టి హెచ్చరికగా మారాయి. -
రూ.2 లక్షల బైక్.. కేవలం రూ.500కే అమ్మేశాడు!
తిరువొత్తియూరు: చెన్నై సమీపం అయపాక్కంలో ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్ను దొంగిలించి, దాని భాగాలను విడదీసి కేవలం 500 రూపాయలకే పాత ఇనుప సామా న్ల కొట్టులో అమ్మేసిన వింత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయపాక్కం ప్రాంతానికి చెందిన భరత్ వేల్ ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రి సమయంలో తన బైక్ను ఎప్పటిలాగే ఇంటి ముందు నిలిపి ఉంచారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో అయపాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భరత్ వేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బైక్ దొంగిలించిన వ్యక్తి దానిని నేరుగా అమ్మకుండా, విడిభాగాలను వేరు చేసి ఒక పాత ఇనుప సామాన్ల అంగడిలో కేవలం 500 రూపాయలకే అమ్మినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిని అనుసరించి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి బైక్ దొంగిలించిన వ్యక్తి దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులను బురిడీ కొట్టించి తక్కువ ధరకే బైక్ అమ్మేసిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. -
ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
సాక్షి, చెన్నై: కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సన్నాహాలు జరుగుతున్న వేళ, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ శాసనసభాపక్ష (CLP) నాయకుడిగా ఎన్నికవడం, సీఎం పదవిని దక్కించుకోవడం ఇక లాంఛనప్రాయమేననిఅందరూ భావిస్తున్నారు ఈ క్రమంలో డీకే రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగుతుందని జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ జోస్యం, ఆసక్తికరంగా మారింది.ప్రమాణ స్వీకారానికి సూచించిన తేదీలుమనీ కంట్రోల్ కథనం ప్రకారం డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ద్వారకానాథ్ గురూజీ మూడు అనుకూలమైన తేదీలుగా మే 31 (ఆదివారం), లేదంటే జూన్ 5, 6 శుక్ర, శని) సూచించారట.గురూజీ అంచనాలు డీకే శివకుమార్ కేవలం తాత్కాలిక లేదా ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాదని, ఆయన జాతకం చాలా బాగుందని గురూజీ తెలిపారు. ఆయన కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. శివకుమార్కు కాంగ్రెస్ అధిష్ఠానం (హైకమాండ్) పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఎంగా డీకే.. జూన్ 3 ముహూర్తం : ఎందుకలా?2028 ఎన్నికల్లోనూ విజయంశివకుమార్ నాయకత్వంలోని దూరదృష్టి వల్ల కర్ణాటక రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని గురూజీ జోస్యంచెప్పారు. అయితే, వచ్చే (2028) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన అసలైన ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుతానికి ఆయనపై కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తదుపరి విడతలో ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని సూచించారు.కాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదించి, మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు వేగవంతమయ్యాయి.శనివారం సాయంత్రం బెంగళూరులోని విధానసౌధలో జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకో నున్నారు. ఈ రేసులో డీకే శివకుమార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు, ఆయన ఎన్నిక దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. -
సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి!
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్పై సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పేమెంట్ సిస్టమ్ హ్యాక్ కావడంతో.. కొంతసేపు అనధికారిక యాక్సెస్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సైబర్ దాడేంకాదని.. సాంకేతిక సమస్య మాత్రమేనని ఇటు అధికారులు అంటున్నారు.పోర్టల్ లైవ్ అయిన సమయంలో ఈ సమస్య తలెత్తగా.. సుమారు 50 మంది విద్యార్థులు సిస్టమ్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సమాచారం. దీంతో కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన ఫీజు రూ.1 నుంచి ఏకంగా రూ.67,000–రూ.68,000 వరకు మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటన సంబంధిత బ్యాంక్ పేమెంట్ గేట్వేతో అనుసంధానమైన వ్యవస్థలో గ్లిచ్ కారణంగా(సిస్టమ్లో బగ్ వల్ల వచ్చిన ఇష్యూ) జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సిస్టమ్ను నిలిపివేసి సమస్యను సమీక్షించారు.ఈ వ్యవహారంపై ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బృందం కూడా దర్యాప్తు ప్రారంభించింది. పోర్టల్ కోడ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ను సమీక్షిస్తూ భద్రతను మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇకపై హెచ్డీఎఫ్సీతో పాటు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కూడా అదనపు పేమెంట్ గేట్వేలుగా అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. సిస్టమ్ను మరింత సురక్షితంగా, గ్లిచ్లేని విధంగా మార్చేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
ఆలయంలో మంత్రి రహస్య తనిఖీ.. అడ్డంగా దొరికిన అర్చకులు!
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ మురుగన్ ఆలయం తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో వీఐపీ, ప్రత్యేక దర్శనాల పేరిట అర్చకులు, సిబ్బంది భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హిందూ ధారి్మక దేవదాయ శాఖ మంత్రి రమేష్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయంలో ఒక సామాన్య భక్తుడిలా మారి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లంచం డిమాండ్ చేసిన అర్చకులు డిజిటల్ ఆధారాలతో సహా మంత్రికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. డిజిటల్ చెల్లింపు.. రెడ్ హ్యాండెడ్ ఆధారాలు ప్రస్తుతానికి తన వద్ద నగదు లేదని చెప్పిన మంత్రి, అక్కడి అర్చకుడి గూగుల్ పే నంబర్కు రూ.4వేలు ఆన్ లైన్ ద్వారా బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్లో పడ్డాయని అర్చకులు నిర్ధారించుకున్న మరుక్షణమే, మంత్రి తన ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి తానెవరో బయటపెట్టారు. డిజిటల్ లావాదేవీ ఆధారాలు సహా దొరకడంతో అర్చకులు, వారికి సహకరించిన సిబ్బంది షాక్కు గురయ్యారు. అక్రమాలకు పాల్పడిన అర్చకులను, సిబ్బందిని ఆలయ కార్యాలయానికి పిలిపించి మంత్రి రమేష్ వారి నుంచి లిఖితపూర్వక వివరణ లేఖలను తీసుకున్నారు.ఆ తర్వాత ఆయన అన్నదాన సముదాయానికి వెళ్లి సాధారణ భక్తులతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అక్కడ పంపిణీ చేసే అన్నదాన టోకెన్ల జారీలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. ఆలయ ఆస్తులు, నెలవారీ ఆదాయం, పరిపాలనాపరమైన అంశాలపై కూడా మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ వ్యవహారంపై మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నెట్లో తాజా తనిఖీలకు సంబంధించిన తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు. లంచం వసూలు చేసిన వారి నుంచి క్షమాపణ లేఖ తీసుకోలేదని, కేవలం వివరణ లేఖ మాత్రమే కోరామన్నారు. ఆలయ అన్నదానం, ఆస్తుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నామని అన్నారు. ఈ విచారణ నివేదిక వచ్చిన తర్వాత, తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, ఎలాంటి పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సామాన్యుడిలా మంత్రి చేసిన ఈ ఆకస్మిక తనిఖీలను ఆలయానికి వచ్చిన భక్తులు అభినందించారు.ఒక సామాన్య భక్తుడిలా మంత్రి ఎంట్రీ మంత్రి రమేష్ తన అధికారిక వాహనాన్ని ఆలయ సముదాయానికి దూరంగా నిలిపివేసి, ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ టీషర్ట్, మాస్క్ ధరించి తన సహాయకుడితో కలిసి కాలినడకన ఆలయంలోకి ప్రవేశించారు. శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలని మంత్రి సహాయకుడు అక్కడి అర్చకులను విచారించారు. వచ్చిన వ్యక్తి మంత్రి అని తెలియని అర్చకులు, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నలుగురికి కలిపి మొత్తం రూ.4వేలు ఇస్తే వెంటనే వీఐపీ దర్శనానికి తీసుకెళ్తామని బేరసారాలు మొదలెట్టారు. -
సీఎంగా డీకే శివకుమార్ : జూన్ 3న ప్రమాణ స్వీకారం
సాక్షి, చెన్నై: ఉత్కంఠ రాజకీయాల నడుమ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3న తేదీన సాయంత్రం 4:10 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావద్దని చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సాయంత్రం జరిగే భేటీలో డీకేను సీఎల్పీ నేతగా ఎన్నుకోన్నారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు హాజరుకానున్నారు. మరోవైపు సీఎల్పీ సమావేశంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీన్ని శివకుమార్ వ్యతిరేకించినట్లు తెలిసింది. జూన్ 3నే ఎందుకు?ప్రస్తుతం రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్కు దైవభక్తి ఎక్కువ. ఆయన తన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ను సంప్రదించిన తర్వాత, జూన్ 3వ తేదీని "శుభ ముహూర్తం"గా నిర్ణయించారు. దీనికి తోడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆయన అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి కూడా ఈ తేదీని ఎంచుకున్నారు. అంతేకాదు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా సాదాసీదాగా సాగనుందని సమాచారం.డీకేతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వారిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటారని తెలుస్తోంది.ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత, పార్టీలోని వివిధ వర్గాలను సమతుల్యం చేయడానికి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో కీలక పోర్ట్ఫోలియో (మంత్రి పదవి) దక్కే అవకాశం ఉందని అంచనా. అలాగే సిద్ధరామయ్య రూపంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చినందున, ఈ సామాజిక సమతుల్యత కాంగ్రెస్కుకీలకంగా మారింది.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మార్గదర్శకాల ప్రకారం దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే, 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. -
ఎల్నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


