breaking news
National
-
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆరిఫ్ హుస్సేన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ను హాజరుపర్చనున్నారు.వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బీజేపీ-ఆర్ఎస్ఎస్ వైరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదే. నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.అంతర్గత వైరుధ్యాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయని.. అయితే ఏ విధంగానూ వివాదం లేదన్న ఆయన.. ప్రతి ప్రభుత్వంతో తమకు మంచి సమన్వయం ఉందంటూ పేర్కొన్నారు. ‘‘మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది. అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మేం చర్చించుకుంటాం. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ‘ఒకరినొకరు విశ్వసిస్తాయి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. -
ఇక చాలు దయచేయండి.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం.. తాజాగా విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.1978 నుండి అందుబాటులో ఉన్న ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” ఆధారంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అంటే వారు పూర్తి కాలం చదువుతున్నంత కాలం ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ పూర్తయిన మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ద్వారా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలి.ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. -
వరద బీభత్సం.. హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్-కులు-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రధానంగా ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.50-km Traffic Jam On Chandigarh-Kullu Highway, Hundreds Of Trucks Stuckapples alone estimated at more than Rs 50 crore stuck in transit.#HimachalPradesh pic.twitter.com/6CCgiRIyus— Sidharth Shukla (@sidhshuk) August 28, 2025మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. -
30న ఆన్లైన్ గేమింగ్ చట్టానికి తొలి పరీక్ష!
ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ తీవ్ర ఆందోళన, ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆన్లైన్ గేమింగ్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ చట్టానికి న్యాయస్థానంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. కర్ణాటక హైకోర్టు ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలన్న పిటిషన్ను విచారణకు స్వీకరించింది. బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆన్లైన్ మనీ గేమ్స్పై నిషేధం విధిస్తూ తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ చట్టం 2025పై ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ సంస్థ A23 కోర్టుకెక్కింది. అత్యవసర విచారించాలన్న సీనియర్ అడ్వకేట్లు ఆర్యామా సుందరం, ధ్యాన్ చిన్నప్పల విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగష్టు 30న ఈ పిటిషన్ను విచారించనుంది.ఈ చట్టం ప్రకారం, నైపుణ్యమా.. అదృష్టమా అనే తేడాల్లేకుండా డబ్బుతో ఆడే అన్ని రకాల ఆన్లైన్ గేమ్స్ను కేంద్రం నిషేధించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరిరోజే ఈ కీలక బిల్లుకు క్లియరెన్స్ లభించగా.. ఆమరుసటిరోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది. మరోవైపు ఈ చట్టం కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్రతినిధులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. గేమింగ్పై నిషేధం విధించేకంటే.. నియంత్రణ చేయాలని సూచిస్తూ లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ భద్రతకు, ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందంటూ నిషేధ చట్టాన్ని హడావిడిగానే అమల్లోకి తెచ్చింది.అయితే.. ఈ చట్టం నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమ్స్ను కూడా నేరంగా పరిగణించడం ద్వారా బహుళ కంపెనీలు ఒక్కరాత్రిలో మూతపడే ప్రమాదం ఉందని A23 అంటోంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఆ పిటిషన్ సారాంశాన్ని ఉటంకిస్తూ.. ఈ చట్టం state paternalism (రాష్ట్ర పితృత్వ ధోరణి) ఉత్పత్తిగా పేర్కొంది. నైపుణ్య గేమ్స్కు వర్తింపజేస్తున్న తరుణంలో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని A23 కోర్టును కోరింది. మరోవైపు ఈ పిటిషన్పై స్పందించేందుకు కేంద్ర వర్గాలు నిరాకరించాయి.దేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఈ చట్టం బ్రేకులు వేసింది. సుమారు 70 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ ప్లేయర్లతో ఉన్న A23 కంపెనీ చట్టాన్ని సవాల్చేస్తూ కోర్టుకు ఎక్కింది. అయితే.. ఈ కేసు ఫలితం భారత ఆన్లైన్ గేమింగ్ రంగ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్-2025 ముఖ్యాంశాలు:'ఆన్లైన్ గేమింగ్' చట్టం ప్రకారం డబ్బుతో ఆడించే అన్ని అన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లను పూర్తిగా నిషేధించినట్టయింది.డబ్బుతో ఆడే గేమ్స్ నడపడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కాగ్నిజబుల్, బెయిల్ లేని నేరాలుగా పరిగణించబడతాయి.నేరస్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే చాన్స్ ఉంది. నేరాలు రిపీట్ అయితే రూ.2 కోటి వరకు జరిమానా, కనీస శిక్ష విధిస్తారు.ప్రకటనలకు ప్రచారం చేసినా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల వరకూ జరిమానా ఉంటుంది.బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు వంటి ఆర్థిక సంస్థలు నిషేధిత గేమ్స్కు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయడం నిషేధం.జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసి గేమ్స్ను నమోదు చేసి, పర్యవేక్షణ చేయనుంది కేంద్ర ఐటీ శాఖ. అయితే.. డబ్బు ప్రమేయం లేని ఈ-స్పోర్ట్స్కు మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ను ఆడుకోవచ్చు. -
వినాయక చవితి రోజు.. మంత్రిని పరిగెత్తించి కొట్టిన గ్రామస్థులు
పాట్నా: వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఇటువంటి విషాద ఘటనల తర్వాత జిల్లా స్థాయి నేతలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ తాజాగా జరిగిన ఘటన అందుకు భిన్నంగా ఉంది. ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న వినాయక చవితి రోజు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి వచ్చారు. ఈ ఆలస్యంపై గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఆయనను కిలోమీటర్ దూరానికి పైగా వెంబడించి దాడి చేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గత శనివారం (ఆగస్టు 23న) బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 6:45 గంటల సమయంలో షాజహాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డానియావాన్ – హిల్సా రహదారిపై ఎదురెదురుగా లారీ- ఆటో ఢీకొన్నాయి. గంగానదిలో పుణ్యస్నానం కోసం ఫతుహాకు వెళుతున్న ఆటోని ప్రయాణికుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు నలందా జిల్లా జోగిపూర్ మలవాన్ గ్రామస్థులని పోలీసులు నిర్ధారించారు.అయితే,ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల్ని ఓదార్చేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్ బుధవారం గ్రామానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు వారి వాహనాన్ని చుట్టుముట్టారు. కిలోమీటర్ దూరం మంత్రి కాన్వాయ్ని వెంబడించారు. బాధితులు మరణించింది ఎప్పుడు? మంత్రి పరామర్శకు వచ్చేది ఎప్పుడు? ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రిపై దాడికి తెగబడ్డారు.పోలీసుల సహాయంతో గ్రామస్థుల నుంచి మంత్రి,ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఈ సంఘటనలో మంత్రి సహాయకుడు గాయపడ్డాడు. ఆయనను హిల్సా సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు బాధితుల కుటుంబాల్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదని, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. बिहार: नालंदा में मंत्री श्रवण कुमार पर ग्रामीणों ने हमला किया, सुरक्षाकर्मी घायल◆ मंत्री जी को भीड़ ने दौड़ाया, धोती पकड़कर भागते दिखे श्रवण कुमार #Nalanda #NitishKumar #ShrawanKumar || Shrawan Kumar Bihar Minister pic.twitter.com/7fZgwpbbxe— बाबा टुल्लू जी (@abhaysingh147) August 27, 2025 -
ఈపీఎఫ్ఓ 3.0 కీలక ఫీచర్లు.. 8 కోట్ల మందికి ప్రయోజనం
భారతదేశ సామాజిక భద్రతా ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు వేగవంతమైన, మరింత పారదర్శక సేవలను అందించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఇది జూన్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యమైంది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అప్గ్రేడెడ్ సిస్టమ్ అమలు తుది దశలో ఉందని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను యాక్సెస్ చేసే విధానం, తమ ఖాతాలను నిర్వహించే పద్ధతుల్లో మార్పులుంటాయని ఆయన చెప్పారు. దీని ద్వారా ఖాతాదారులకు మరింత వేగవంతమైన సదుపాయం కలగబోతుందని పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా రాబోయే మార్పులు..ఏటీఎంల్లో నేరుగా పీఎఫ్ విత్డ్రాతొలిసారిగా ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేసి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్ )ను యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు విత్డా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా నగదు ఉపసంహరణకు జాప్యాన్ని తొలగించడం, వినియోగదారుల డబ్బుకు రియల్ టైమ్ యాక్సెస్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.యూపీఐ ద్వారా తక్షణ ఉపసంహరణఈపీఎఫ్ఓ 3.0 యూపీఐ ప్లాట్ఫామ్లతో అనుసంధానమై, అత్యవసర సమయాల్లో తక్షణ ఉపసంహరణలను అనుమతిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ వైద్య లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ఆన్లైన్ క్లెయిమ్సభ్యులు ఇకపై ప్రాథమిక సేవల కోసం పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే క్లెయిమ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులు చాలా సర్వీసులు పొందవచ్చు.డెత్ క్లెయిమ్ల పరిష్కారంమానవతా దృక్పథంతో ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్ల్లో గార్డియన్షిప్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించింది. మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తే గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రతి మైనర్ పిల్లవాడి పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు ఇది వర్తిస్తుంది. కోర్టు ప్రక్రియలు లేకుండా బాధిత కుటుంబాలకు వేగంగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.డిజిటల్ డ్యాష్బోర్డులుయూజర్ ఇంటర్ఫేస్ ద్వారా నెలవారీ కంట్రిబ్యూషన్ను ట్రాక్ చేయవచ్చు. క్లెయిమ్ స్టేటస్ను మానిటర్ చేయవచ్చు. బ్యాలెన్స్, వడ్డీ అప్డేట్లను రియల్ టైమ్లో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖ -
Ganesh Chaturthi: దేశంలోని ఆరు ప్రముఖ మండపాలు.. రెండు తెలంగాణవే..
ముంబై: దేశంలో నిన్న(ఆగస్టు 27)న మొదలైన గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పిల్లాపెద్దా అంతా కలిసి వినాయక మండపాలలో సందడి చేస్తున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీలు పడీ భారీ విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేశాయి. ఈ ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడు అత్యంత భారీ గణపతులను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తుంటారు. అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో రెండు ప్రముఖ గణపతులు తెలంగాణకు చెందినవే కావడం విశేషం.1. లాల్బాగ్చా రాజా, లాల్బాగ్, ముంబై‘ముంబై రాజు’గా పేరొందిన లాల్బాగ్చా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ పాలకుల కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. నేత కార్మికులకు నిలయమైన ఈ ప్రాంతంలో కొలువైన ఈ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 10 రోజుల గణపతి ఉత్సవాల్లో లాల్బాగ్చా రాజాను ప్రతిరోజూ సగటున 15 లక్షల మంది సందర్శిస్తుంటారు.2. దగ్డుషేత్ హల్వాయి, పూణేభారతదేశంలో అత్యంత ఖరీదైన గణేశ్ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారని చెబుతారు. దేశంలోనే అత్యంత ఖరీదైన గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు భీమా కవరేజ్ కోటి రూపాయలకు చేరుకుంది.3. ఖైరతాబాద్ గణేశుడు, హైదరాబాద్హైదరాబాద్(తెలంగాణ)లోని ఖైరతాబాద్ గణేశుడు..అత్యంత ఎత్తయిన గణనాథునిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తుంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు. 4. జీఎస్బీ సేవా మండల్, ముంబైముంబైలోని కింగ్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్ 60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ గణేశుని విగ్రహం పర్యావరణ అనుకూలమైనదని చెబుతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంప్రదాయ దుస్తులు ధరించి రావాలనే నిబంధన ఉంది. ఈ గణపతికి ఐదు రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి.5. బాలాపూర్ గణేశుడు, హైదరాబాద్హైదరాబాద్లోని బాలాపూర్ గణేశ మండపం ఎంతో పేరొందింది. లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తుంటారు.6. చించ్పోక్లి చ రాజా, ముంబైచింతామణి గణపతి లేదా చించ్పోక్లి చ రాజా గా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలో ఎంతో పేరొందింది. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. -
సింగర్తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్(31) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు.అమెరికన్ రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా'(41)తో మహ్రా కొంతకాలంగా ప్రేమలో ఉంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు రాపర్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ సంవత్సరం జూన్లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా నిశ్చితార్థం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచినట్లు తెలిపారు. రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' కంటే ఆమె వయసులో సుమారు పదేళ్లు చిన్నది. పెళ్లి తేదీ, ఇతర విషయాలు ఇంకా ప్లాన్ చేయలేదని చెబుతున్నారు. కానీ, ఈ జంట ఇరువురి కుటుంబాలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయని సమాచారం.షేక్ మహ్రా ఎవరు.. మొదటి భర్తతో విడాకులకు కారణం..?దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి 'షేకా మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' కుమార్తె 'షేకా మహ్రా' బ్రిటన్లో చదువుకున్న ఆమె 2023 మే నెలలో దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'షేకా మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్'ను పెళ్లి చేసుకున్నారు. వారికి తొలి సంతానం కలిగిన రెండు నెలలకే విడిపోతున్నట్లు 2024 జులైలో ప్రకటించారు. తన భర్త ఇతరుల సహచర్యం కోరుకున్నందున తాను విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. 'ఐ డైవర్స్ యూ.. టేక్ కేర్..' మీ మాజీ భార్య అంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తన కుమార్తెతో షేకా మహ్రా ఉంది. ఇప్పుడు ప్రేమించి మరో పెళ్లి చేసుకోనున్నడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.., రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' ప్రతినిధి ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారని ధృవీకరించినప్పటికీ, వారిద్దరు మాత్రం దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటనను పంచుకోలేదు. View this post on Instagram A post shared by Xtianna (@xtianna_official) -
17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల అమ్మమ్మ
జైపూర్: కొన్ని ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి ఉదంతం రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. ఒక మహిళ తన 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ బిడ్డ పుట్టకముందే ఆమె పలుమార్లు అమ్మమ్మగా మారడం మరో విశేషం.లీలావాస్ గ్రామానికి చెందిన కవారా రామ్ భార్య రేఖ(55) రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని జాడోల్ బ్లాక్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కుటుంబ సభ్యులనే కాకుండా స్థానికులను సైతం ఆశ్చర్యపరిచింది. కవారా,రేఖ దంపతులు ఇప్పటివరకూ మొత్తం 17 మంది పిల్లలను కన్నారు. వీరిలో ఐదుగురు శిశువులు పుట్టిన వెంటనే మరణించారు. ప్రస్తుతం ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఏడుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.కవారా తెలిపిన వివరాల ప్రకారం వారి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయ్యింది. ఈ వివాహితుల్లో ఒక్కొక్కరికి ఇద్దరు నుండి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేఖ.. ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వకముందే పలుమార్లు అమ్మమ్మగా మారింది. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. స్క్రాప్ డీలర్గా పనిచేసే కవారా పిల్లల వివాహాల కోసం అప్పులు చేశాడు. మరోవైపు ఈ దంపతుల పిల్లల్లో ఎవరూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు.రేఖ ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దరంగి మీడియాతో మాట్లాడుతూ.. రేఖ తన దగ్గరకు వచ్చిన ప్పుడు తొలుత ఇది తన నాల్గవ కాన్పు అని చెప్పిందన్నారు. అయితే ఆ తరువాత, ఆమె ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చిందని, వారిలో ఐదుగురు చనిపోయారని తెలిసిందన్నారు. ఆమెకు గతంలో చాలా ప్రసవాలు జరగడంతో, గర్భాశయం బలహీనపడి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఏర్పడేది. తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. అయితే అదృష్టవశాత్తూ, అటువంటిదేమీ లేకుండానే డెలివరీ జరిగిందని, తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమమేనేని తెలిపారు. -
మహారాష్ట్రలో కుప్పకూలిన ‘అక్రమ భవనం’.. 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12.05 గంటల సమయంలో విజయ్ నగర్లోని రమాబాయి అపార్ట్మెంట్లో వెనక భాగం కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే కూలిన భవనం అక్రమ కట్టడమని విచారణలో తేలింది. దీంతో.. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు భవన నిర్మాణదారుడు నిటల్ గోపినాథ్ను అరెస్టు చేశారు. ల్యాండ్ ఓనర్ మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం. ఏడాది పుట్టినరోజు వేడుక చేసుకున్న నాడే.. ఘటనలో ఆరోహి జోయెల్(24), ఆమె ఏడాది చిన్నారి కన్నుమూశారు. భర్త ఓంకార్ జోయల్ జాడ ఇంకా తెలియరాలేదు. చిన్నారి ఏడాది పుట్టినరోజు కేక్ కట్టింగ్ వేడుక జరిపిన కొన్నిగంటలకే.. అదీ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన ఐదు నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఆ తల్లీకూతుళ్లు విగతజీవులయ్యారు. -
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: భారత సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్లోని బందిపోరా సెక్టార్లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు పేర్కొన్నారు. నౌషెహ్రా నార్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. అప్రమత్తమైన దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా భారతసైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.ఈ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు చుట్టుపక్కల ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారా? అనేదానిపై శోధన ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ‘ఆపరేషన్ అఖల్’లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఆగస్టు ఒకటిన ‘ఆపరేషన్ అఖల్’ ప్రారంభమైంది. -
‘వైష్ణో దేవి’ చెంత మరో 28 మృతదేహాలు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ శతాబ్దంలో అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం కారణంగా రాష్ట్రం అతలాకుతమయ్యింది. బీభత్సమైన వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తిగా దెబ్బతింది.ఆగస్టు 14 వైష్ణో దేవి మందిరానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద పలువరు చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రాంతంనుంచి 28 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీసుకువచ్చారు. మరోవైపు రియాసి, దోడలో కొండచరియలు విరిగిపడటానికి తోడు, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. కొండచరియల ప్రమాదంలో అయినవారు మరణించిన బాధిత కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.9 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. #WATCH | Katra, J&K: On Vaishno Devi Yatra temporarily suspended due to landslide, a devotee, Raja Kumar, says, "The yatra has been stopped for now. We are staying at a hotel for two days. Now we will return only after visiting the Vaishno Devi Temple from here... There is a red… pic.twitter.com/MpTa2b9P2h— ANI (@ANI) August 28, 2025యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రియాసి కొండచరియల ప్రమాదం కారణంగా మృతిచెందిన తమ రాష్ట్రానికి చెందిన 11 మంది మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున మంజూరు చేశారు. కాగా ప్రతికూల వాతావరణంలో వైష్ణో దేవి మార్గంలో యాత్రికులు వెళ్లకుండా జిల్లా అధికారులు నియంత్రించపోవడంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ సిన్హా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్రంలోని వరద పరిస్థితి, సహాయ చర్యలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.గడచిన 24 గంటల్లో జమ్మూలో 380 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇప్పటివరకూ ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టులో జమ్మూ నెలవారీ సగటు 403.1 మి.మీ వర్షపాతం కురిసిందని పేర్కొంది. శ్రీనగర్-జమ్మూ హైవేలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఆ రహదారిని మూసివేశారు. జమ్మూలోని లోతట్టు ప్రాంతాలు, వరదల ముప్పు ప్రాంతాల నుండి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు జమ్ము కశ్మీర్ అంతటా టెలికాం సేవలు నిలిచిపోయాయి. వైష్ణోదేవి ఆలయం చెంత కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇంతకుమందు 32 మంది మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. -
నేడు పాఠశాలలకు సెలవు
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా పలు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు చేసింది. దీనిని గమనించిన ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏఏ రాష్ట్రాల్లో నేడు(గురువారం) సెలవు ప్రకటించారనే విషయానికొస్తే..పంజాబ్రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి ఆగస్టు 31 పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది. రుతుపవనాలకు రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రంలోని రంజిత్ సాగర్, భాక్రా ఆనకట్టల నుండి నీటి విడుదల, సట్లూజ్, బియాస్, రావి వంటి నదులలో నీటి మట్టాలు పెరగడం కారణంగా పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి.ఉత్తరాఖండ్, జమ్ముజమ్మూలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 28న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.దక్షిణాదిన..దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గోవా, కేరళలలో గణేష్ చతుర్థిని ఆగస్టు 27న జరుపుకున్నారు. అయితే వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో 28న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కేరళలో ఓణం వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి.నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. -
ఒకే వేదికపై రాహుల్, స్టాలిన్, తేజస్వి.. మండిపడిన బీజేపీ
పట్నా: బీహార్లో వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్))కు వ్యతిరేకంగా బుధవారం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నిర్వహించిన ‘ఓటరు అధికార్ యాత్ర’లో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ పాల్గనడం తీవ్ర చర్చలకు దారితీసింది. వివిధ పార్టీలు వీరి కలయికపై పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి.ఈ ముగ్గురు నేతల కలయికపై బీజేపీ మండిపడింది. దీనిని నిరాశాజనకమైన సమీకరణగా అభివర్ణించింది. కాగా బీహార్లో అడుగుపెట్టిన వెంటనే ఎంకే స్టాలిన్ ..రాహుల్, తేజస్వి యాదవ్తోపాటు తాను ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..లాలూ ప్రసాద్ భూమి తనను పలకరించిందని, ఈ నేల ఓటు చోరీతో నిండిపోయిదని’ వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ, డీఎంకేల మధ్య మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. MK Stalin’s Photo With Rahul Gandhi, Tejashwi Yadav Sparks DMK-BJP Face-Off https://t.co/ai9OEJna2F - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) August 27, 2025స్టాలిన్ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి కూడా సమర్థించారు. ‘ఓటరు అధికార్ యాత్ర’ను ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన ఉద్యమంగా అభివర్ణించారు. ఈ ముగ్గురు నేతల ఫోటోను షేర్ చేసిన కనిమొళి వారిని ‘భారతదేశ భవిష్యత్తు’ అని పేర్కొన్నారు. కలిసికట్టుగా మనం లేస్తాం.. కలిసి ప్రతిఘటిస్తాం. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్లో ఇండియా కూటమితో చేతులు కలుపుతున్నామని ఆమె ప్రకటించారు. Kanimozhi - நம்மளை ஓட்டுக்கு 1000 2000 குடுப்போம் நமக்கு என்ன தகுதி இருக்கு முறைகேடு பத்தி பேச Stalin - அதான் அரசியல் சும்மா இரு #திருட்டுமுன்னேற்றக்கழகம் #தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/mb4vnXqL2g— 🆃🅰🅼🅸🅻 🅲🅸🅽🅴🅼🅰 🆃🅰🅻🅺🆂 (@tamilcinema_12) August 27, 2025 -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి.. దంపతుల ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు.. తమ నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్లూమ్ వ్యాపారవేత్త సచిన్ గ్రోవర్ (30).. ఆయన భార్య శివాని (28) తమ నాలుగు నెలల కుమారుడు ఫతేహ్.. ఇంటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు.బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి.. కిటికీ గుండా చూసేసరికి, గదిలోని ఉరికి వేలాడుతూ భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండగా.. భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.సూసైడ్ నోట్లో తమకున్న అప్పులు తీర్చడానికి తమ కారు, ఇల్లు అమ్మివేయాలని సచిన్ కోరారు. “నా కుటుంబంపై నాకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వారు నన్ను పూర్తిగా మద్దతు ఇచ్చారు. దయచేసి మా కారు, ఇల్లు అమ్మి అప్పులు తీర్చండి.. తద్వారా ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలి.” అంటూ సచిన్ తన సూసైడ్ నోట్లో రాశారు. సచిన్.. మంగళవారం సాయంత్రం తన తల్లితో మాట్లాడినప్పుడు.. రూ. 5 లక్షలు బ్యాంకు లోన్ కట్టాల్సి ఉందని.. కానీ రూ. 3 లక్షలు మాత్రమే సమకూర్చగలిగానని చెప్పాడని ఆయన తల్లి పేర్కొంది.ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి, దంపతులు ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయారని.. వారి కుమారుడిని ముందుగా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. -
Noida Dowry Case: నోయిడా వరకట్నం కేసులో బిగ్ ట్విస్ట్..
ముంబై: నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్ చేసుకుంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త విపిన్ భాటి, అత్తమామలు నిక్కీభాటిని సజీవ దహనం చేశారు. ఇప్పుడే అదే నిక్కీభాటి కుటుంబ సభ్యులు వరకట్నం కావాలని తననూ వేదించినట్లు నిక్కీభాటి వదిన మీనాక్షి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నిక్కీభాటి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.నోయిడా వరకట్న హత్య కేసులో బాధితురాలు నిక్కీ భాటి కుటుంబంపై వదిన మీనాక్షి ఆరోపణలు చేశారు. నిక్కీభాటి సోదరుడు రోహిత్ పయ్లాతో మీనాక్షి వివాహం జరిగింది. వరకట్నం కావాలని తన మాజీ భర్త రోహిత్తో పాటు అతని తల్లిదండ్రులు తనని వేధించారని అన్నారు. దీంతో తన కుమార్తె ప్రాణం తీసిన విపిన్ భాటి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాంటూ నిక్కీభాటి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న తరుణంలో వారిపై ఆరోపణలు రావడంతో కేసును చేధించడం పోలీసులకు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.రోహిత్,మీనాక్షీలకు 2016లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద మీనాక్షి కుటుంబ సభ్యులు కట్నం కింద మారుతి సియాజ్ను ఇచ్చారు. ఆ తర్వాత అశుభం పేరుతో దాన్ని అమ్మేశారు. బుదులు స్కార్పియో ఎస్యూవీ కొత్తమోడల్ కట్నం కింద డిమాండ్ చేశారు.అందుకు తాను, తన కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పంపించారు. ఇదే విషయాన్ని పెద్దల సమక్షంలో తేల్చుకోనేందుకు గ్రామ పంచాయితీకి తీసుకెళ్లారు. అక్కడ మినాక్షి కుటుంబానికి రూ.35 లక్షలు (వారి వివాహానికి ఖర్చు చేసిన మొత్తం) తిరిగి ఇవ్వాలని, తద్వారా ఆమె తిరిగి వివాహం చేసుకోవచ్చని లేదా భర్త కుటుంబం ఆమెను తిరిగి తమ కోడలుగా అంగీకరించాలని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆమెను తిరిగి కోడలుగా స్వీకరించేందుకు నిక్కీ భాటియా తండ్రి భిఖారి సింగ్ పైలా, ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం నోచుకోలేదని మీనాక్షి వాపోయారు. మీనాక్షి ఆరోపణలపై ఆమె మాజీ భర్త నిక్కీ భాటి సోదరుడు మాట్లాడేందుకు నిరాకరించాడు. నేను ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదు.ఆమె కేవలం ఆరోపణలే చేసిందన్నారు. ఇదే విషయంపై నిక్కీ భాటి మరో కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కాల్పులకు దారి తీసింది. ప్రతీ ఇంట్లో గొడవలు జరగడం సాధారణం. కానీ మేం ఆ అమ్మాయిని తగలబెట్టలేదు’ అని రోహిత్ కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు. -
‘ఆ దమ్ముందా స్టాలిన్?’
బీహార్లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్ను సవాల్ విసిరింది.బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్లో ఉదయ్నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే.. డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్లో వచ్చారు. రోహితాష్ లాయర్తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
గణపయ్య ఆర్థిక పాఠాలు.. శ్రద్ధగా ఆచరిస్తే..
ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఉత్సవ సందడి నెలకొంది. గణపతి నుంచి పలు అంశాలు నేర్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఆర్ధిక నిపుణులు కూడా గణపయ్యను చూసి, పొదుపు పాఠాలు నేర్చుకోవచ్చంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అన్నింటినీ వినే సామర్థ్యం కలిగిన పెద్ద చెవులుగణేశుని పెద్ద చెవులు.. మనం ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అందుకు సంబంధించిన అవసరమైన అన్ని సమాచారాలను శ్రద్ధగా వినాలనే విషయాన్ని గుర్తుచేస్తాయి. పెట్టుబడులు పెట్టేముందు బలమైన పోర్ట్ఫోలియోను గుర్తించడం ఎంతో ముఖ్యం. తాజా పరిణామాలను ఎంత ఎక్కువగా వింటే, ఆర్థికంగా ముందుకు సాగడానికి అంత బాగా సన్నద్ధం కావచ్చని ఆర్థికరంగ నిపుణులు చెబుతుంటారు.జ్ఞానానికి పెద్ద శిరస్సువినాయకుని పెద్ద శిరస్సు .. లోతైన జ్ఞానం, విస్తృత దృష్టి, జ్ఞానాన్ని సూచిస్తుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే ముందు వీటిని గుర్తుంచుకోవాలి. లక్ష్యాలను, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని విశ్లేషించాలి. స్టాక్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ తప్పనిసరి.చక్కని దృష్టి కోసం చిన్న కళ్ళుచిన్న కళ్ళతో గణేశుడు.. చురుకైన దృష్టి, ఏకాగ్రతను గుర్తు చేస్తాడు. నష్టాలను నివారించడానికి, స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి తీక్షణమైన దృష్టి అవసరంఫ్లెక్సిబిలిటీ కోసం పొడవైన తొండంగణేశునికి పొడవైన తొండం ఉంటుంది. ఇది బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని, ఏ దిశలోనైనా కదలగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అదే రీతిలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఫ్లెక్సిబిలిటీతో ఉండాలి. విభిన్నమైన స్టాక్లు లేదా మ్యూచువల్ ఫండ్ల పోర్ట్ఫోలియోను కలిగి ఉండాలి.ప్రతిదీ జీర్ణం చేసేలా పెద్ద బొడ్డుగణేశుని పెద్ద బొడ్డు.. ఇది జీవితంలోని అన్ని అనుభవాలను, మంచి, చెడు రెండింటినీ జీర్ణించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి నుండి రాబడిని పొందేందుకు ఓపికగా ఉంటూ, పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. -
Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం
పూణె: భారీవర్షం నడుమ మహారాష్ట్రలోని పూణెవాసులు గణపతికి స్వాగతం పలికారు. #WATCH | Pune, Maharashtra | A procession is being carried out to take Shrimant Dagdusheth Halwai Ganpati idol to the 'Pandal' for 'Sthapana' pic.twitter.com/P6J77wEgo9— ANI (@ANI) August 27, 2025నగరంలో ప్రముఖంగా నెలకొల్పిన కస్బా గణపతి, తంబ్డి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ గణపతి, తులసిబాగ్ గణపతి, కేసరివాడ గణపతి, దగ్దుషేత్ హల్వాయి గణపతి, భౌసాహెబ్ రంగరి గణపతి తదితర వినాయక మండలాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.Punekars Welcome Ganpati Bappa With Devotion Despite Heavy Rains pic.twitter.com/YBVi15wNx1— Pune First (@Pune_First) August 27, 2025నగరం అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది పలువురు తమ ఇళ్లకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో మొత్తం 3,959 గణేశ్ మండపాలు ఏర్పాటయ్యాయి.ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు పూణే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందుకోసం ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలతో కూడిన నిఘా కెమెరాలు, ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు, మొబైల్ నిఘా వాహనాలు, డ్రోన్ ఆధారిత వైమానిక పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకర్లు వినియోగిస్తున్నారు.రాష్ట్ర శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులిచ్చారు.శాంతిభద్రతల దృష్ట్యా ఆగస్టు 27, సెప్టెంబర్ 6వ తేదీలలో పూణే జిల్లా అంతటా మద్యం అమ్మకాలు నిషేధించారు. -
Vaishno Devi Landslide: 30కి చేరిన మృతులు.. జమ్ముకశ్మీర్ అతలాకుతలం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కాట్రాలోని వైష్ణో దేవి ఆలయ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. Heart Breaking 💔Visuals from #VaishnoDevi in #Jammu.Sudden #Landslide and over 30 devotees lost life so farPrayers for the victims 🙏😥#VaishnoDeviLandslide #FloodRelief #Flood #GaneshChaturthi #TrumpTariffs #HeavyRains pic.twitter.com/mz7hDl7RxD— Sunaina Bhola (@sunaina_bhola) August 27, 2025ఆకస్మిక వరదలతో అతలాకుతలంఆగస్టు 14న కిష్త్వార్ జిల్లాలోని చిసోటిలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 65 మంది మృతిచెందారు. వీరిలో యాత్రికుల సంఖ్యే అధికంగా ఉంది. మంగళవారం దోడా జిల్లాలో భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారు. కాట్రాలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపధ్యంలో వైష్ణో దేవి యాత్ర నిలిపివేశారు. ఆగస్టు 27 వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. माता वैष्णो देवी मंदिर के पास कल हुए लैंडस्लाइड में मरने वाले श्रद्धालुओं की संख्या 30 पहुंची। ये आंकड़ा और भी बढ़ सकता है। खराब मौसम की वजह से यात्रा रोकी गई। #VaishnoDeviLandslide #VaishnoDevi #Landslide pic.twitter.com/hHLto3oWKm— Dr Anupama Soni (@DrAnupamaSoni) August 27, 2025టెలికాం వ్యవస్థ బ్లాక్అవుట్తుఫాను తీవ్రతకు రాష్ట్రంలో కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలలో టెలికాం వ్యవస్థ పూర్తిగా బ్లాక్అవుట్ అయ్యింది. రవాణా నిలిచిపోయింది. జమ్ముశ్రీనగర్, కిష్త్వార్-దోడ జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.🌊🇮🇳🇵🇰 Flood situation in South Asia; Chenab river is flowing at a very dangerous level at Pul Doda in Jammu & Kashmir. Gates of Baghliar Power Project and Salal Projects likely to be opened to avoid any damges to the dams. https://t.co/y9abuQwSRn— OSINT Expert (@OsintExperts) August 26, 2025రైలు సర్వీసులు రద్దుభారీ వర్షాల కారణంగా జమ్మూకు బయలుదేరే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. తావి, చీనాబ్, ఉజ్, తరానా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రావి నదిపై ఉన్న మోధోపూర్ బ్యారేజీ నుండి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన దరిమిలా కథువా జిల్లాలో వరదలు సంభవించాయి. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు. అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు మందులు, నిత్యావసరాలను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేత ఆగస్టు 27 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు.బోర్డు పరీక్షలు నిలిపివేశారు. -
దళపతి విజయ్పై కేసు పెట్టిన ఫ్యాన్
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కగళం(TVK) అధినేత విజయ్కు ఓ అభిమాని షాకిచ్చాడు. మధురై మహనాడులో తనపై విజయ్ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆయన అభిమానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యక్తిగత సిబ్బందితోపాటు విజయ్పైనా కేసు నమోదు అయ్యింది.ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదైంది. ఆగస్టు 21వ తేదీన మదురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్కుమార్ అనే అభిమాని ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభ సమయంలో వేదికపై విజయ్ వేదిక మీద నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఆ సమయంలో.. కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ నడుస్తున్న వేదికపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ క్రమంలో.. విజయ్కు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్ అవతల పారవేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ అతను కింద పడలేదు. ఆ సమయంలో విజయ్ సైతం తన బౌన్సర్లను కాస్త తగ్గమంటూ సైగ చేసి చూపించాడు. అయితే.. ఆ యువకుడు వేదికకు ఉన్న పైప్ను పట్టుకుని వేలాడి కిందకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ రూపేణా విపరీతంగా వైరల్ అయ్యింది. த.வெ.க மாநாட்டில் தொண்டரை தூக்கி வீசிய பாதுகாவலர்கள்.. நடவடிக்கை எடுக்கக்கோரி கண்காணிப்பாளரிடம் புகார்.. த.வெ.க தொண்டர் வேதனை பேட்டி#TVKManaadu | #Vijay | #Police | #Complaint | #Bouncers pic.twitter.com/AKgg1vdrM3— Polimer News (@polimernews) August 27, 2025 TVK Vijay Manaadu Issue | Perambalur | "பவுன்சர்கள் என்ன தூக்கி கெடாசிட்டாங்க"இளைஞர் பரபரப்பு புகார்#tvkvijay | #Vijay | #tvk | #perambalur | #thanthitv pic.twitter.com/t7WAXyQshW— Thanthi TV (@ThanthiTV) August 27, 2025 దీంతో మనస్తాపం చెందిన శరత్.. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకొన్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ‘‘నేను ఆయన్ని చూసేందుకు వచ్చా. కానీ, ర్యాంప్ నుంచి నన్ను కిందకు తోసేశారు. నాకు గాయాలయ్యాయి. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని శరత్ తన తల్లితో సహా మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు ఆధారంగా విజయ్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: స్టాలిన్ అంకుల్.. వెరీ వెరీ రాంగ్ అంకుల్! -
ఏటా 6,516 వరకట్న హత్యలు.. భయపెడుతున్న ఎన్సీఆర్బీ డేటా
లక్నో: యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల ఘటనలో ఒక మహిళ బలయ్యింది. ఆమెను భర్త, అత్తింటివారు సజీవదహనం చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది దేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న హింసాయుత ఘటనల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.అత్యాచారాల కంటే అధికందేశంలో వరకట్న మరణాలనేవి అత్యాచారాల కంటే అధికంగా ఉన్నాయని హోం మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలియజేసింది. బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 6,516 వరకట్న మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యాచారం, గ్యాంగ్రేప్ తరువాత హత్యకు గురైన మహిళల మరణాల కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని వెల్లడయ్యింది. ప్రతి మూడో మహిళ..2022లో 13,641 మహిళలు వరకట్న వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ సంఖ్యను అనుసరించి చూస్తే, వరకట్న వేధింపులకు గురైన ప్రతి మూడో మహిళ మరణిస్తున్నదని తెలుస్తోంది. బాధితులు చివరివరకు న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనుకడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. న్యాయం దొరకే అవకాశాలు బహు స్వల్పం2022 చివరి నాటికి 60,577 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండగా, అందులో 54,416 కేసులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఆ ఏడాది 3,689 కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినా, కేవలం 33శాతం తీర్పులలో నిందితులకు శిక్ష పడింది. కోర్టులకు పంపిన 6,161 నూతన కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాదిలోపు న్యాయం దొరకే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేని తేలింది. వరుడి కుటుంబంతో పోలిస్తే..భారతదేశంలో వరకట్నం ఇప్పటికీ ఒక ఆచారంగా కొనసాగుతోంది. పలు అధ్యయనాలు ఈ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని తెలియజేస్తున్నాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (2004-05)లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది. 24 శాతం కుటుంబాలు టీవీలు, ఫ్రిజ్లు, కార్లు, బైక్లు తదితర వస్తువులను వరునికి కట్నంగా ఇచ్చాయి.మహిళల్లో 29 శాతం మంది..2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా భాగస్వాముల నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. -
నమ్మించి.. ప్రాణం తీశారు!
గౌరీబిదనూరు (కర్ణాటక): ఇటీవల కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా పరిధిలో లభ్యమైన అపరిచిత మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. హతురాలిని హిందూపురం ప్రాంతానికి చెందిన అర్చనగా నిర్ధారించిన పోలీసులు ఆమెను హతమార్చిన ఓ యువకుడు, యువతిని అరెస్టు చేశారు. మంగళవారం గౌరీబిదనూరు తాలూకా మంచేనహళ్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను పోలీసులు వెల్లడించారు. హిందూపురం సమీపంలోని శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) క్యాటరింగ్ పని చేసేది. ఈ నెల 14న పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అర్చన భర్త ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.చున్నీతో గొంతు నులిమి..అర్చనకు కేటరింగ్ పనిలో బెంగళూరుకు చెందిన రాకేష్, అంజలితో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేష్కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని రాకేష్ పిలిపించుకున్నాడు. అనంతరం కారులో చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర, గౌరీబిదనూరు తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమె గొంతు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఓ వంతెన కింద పడేసి.. ఎవరూ గుర్తించకుండా బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించాడు. అనంతరం బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టి తన ఆటో రుణం కంతు చెల్లించాడు.పరారీలో డ్రైవర్, మరో యువతిఈ నెల 17న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ఫిర్యాదు మేరకు మంచేనహళ్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతరం హతురాలిని హిందూపురానికి చెందిన అర్చనగా నిర్ధారించారు. ఈ క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారు. ఆమెకు అందిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవం బయటపడింది. దీంతో రాకేష్తో పాటు అతనికి సాయపడిన అంజలిని మంగళవారం అరెస్ట్ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్ నవీన్, మరో నిందితురాలు నిహారిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే..
వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం కనిపిస్తుంది.గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు. -
వినాయక చవితి వేడుకలు: ముంబై సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ
ముంబై: ఈరోజు(ఆగస్టు 27) వినాయక చవితి. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం ఆలయాలు, మండపాల వద్ద బారులు తీరుతున్నారు. #WATCH | Nagpur, Maharashtra | Devotees in large numbers offer prayers at the Shri Ganesh Mandir Tekdi on the occasion of #GaneshChaturthi2025. pic.twitter.com/RcrxwILcL3— ANI (@ANI) August 27, 2025నాగ్పూర్: వినాయకచవితి వేళ టెక్టీ గణపతి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025ముంబై: సిద్ధివినాయక ఆలయంలో పూజలతో, భక్తుల కోలాహలంతో సందడిగా మారింది.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025గణపతి దేవుని ఆశీర్వాదం కోసం సిద్ధివినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు.తమిళనాడు: గణేష్ చతుర్థి సందర్భంగా వినాయగర్ ఆలయం అందంగా ముస్తాబయ్యింది.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025 -
భారత్ను తీవ్రవాదంలోకి లాగేందుకు పాక్ కుట్ర: మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు
మోవ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు. భారతదేశ సైనిక వ్యవహారాల మొదటి త్రి-సేవా సెమినార్ ‘రణ్ సంవాద్ 2025’లో విశ్వసరావు ఈ విధంగా వ్యాఖ్యానించారు.పహల్గామ్లో జరిగిన ఊచకోతను ‘ఉద్దేశపూర్వక రెచ్చగొట్టడం’గా సీనియర్ అధికారి విశ్వసరావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారని, ‘ప్రధాని మోదీకి ఈ సందేశాన్ని తెలియజేయాలని’ ప్రాణాలతో బయటపడిన వారికి సూచించారని ఆయన అన్నారు. భారతదేశంలో మతపరమైన, రాజకీయ అంతరాలను సృష్టించడమే కాకుండా, భారత్ మరోమారు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించేలా ఆకర్షించడమే పాకిస్తాన్ లక్ష్యం కావచ్చని ఆయన అన్నారు.ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక సంస్థ హస్తం ఉందని మన రక్షణ, నిఘా వర్గాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని విశ్వసరావు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పన్నిన ఎత్తుగడ ఇది అని అన్నారు. 2019 పుల్వామా దాడి సమయంలో ఐఎస్ఐకి నాయకత్వం వహించిన మునీర్.. కశ్మీర్ సమస్యను తిరిగి లేవనెత్తేందుకు చేసిన చర్య ఇది అని విశ్వసరావు పేర్కొన్నారు. భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇటువంటి చర్యలకు పాక్ పాల్పడుతున్నదన్నారు.దేశంలో జరిగిన రైతుల ఆందోళన, సీఏఏ వ్యతిరేక నిరసనలు, మణిపూర్లో కొనసాగుతున్న అశాంతి ఉద్యమాలను మొదలైన అంశాలను శత్రు శక్తులు ఉపయోగించుకుంటున్నాయని విశ్వసరావు అన్నారు. పాక్ అనుసరిస్తున్న వ్యూహాలను బంగ్లాదేశ్ తదితర దేశాలలో కనిపించే వర్ణ విప్లవాలతో విశ్వసరావు పోల్చారు. ఇటువంటి అశాంతి.. భారత దేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అప్రమత్తం కావాలని మేజర్ జనరల్ విశ్వసరావు పేర్కొన్నారు. -
దేశంలో ‘పెరుగుతున్న ఇథనాల్ బ్లెండింగ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఇథనాల్తో కలిసిన పెట్రోల్ను ఇంధనంగా వాడటం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 2014–15 నుంచి 2025 జూలై వరకు రైతులకు రూ.1.25 లక్షల కోట్లు నేరుగా చెల్లించగా, దేశానికి రూ.1.44 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 736 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి, 244 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు అవసరం తక్కువైందని ఇటీవల పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. ఇథనాల్ మిశ్రమం పెరుగుదల పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 2022 జూన్లోనే 10% లక్ష్యాన్ని చేరింది. తర్వాత ఇది 2022–23లో 12.06%, 2023–24లో 14.60%, 2024–25లో జూలై 31 నాటికి 19.05%గా నమోదైంది. కేవలం జూలై నెలలోనే 19.93% సాధించడం విశేషమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడి సరుకుల విస్తరణ, పన్ను రాయితీలు, వడ్డీ సబ్సిడీ పథకాలు, సహకార చక్కెర కర్మాగారాలకు మల్టిఫీడ్ స్టాక్ ప్లాంట్లకు ఆర్థిక సాయం వంటి చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. -
దేశ ఐక్యతకు వైవిధ్యమే మూలం
న్యూఢిల్లీ: భారతదేశ ఐక్యతకు దాని వైవిధ్యమే మూలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ చెప్పారు. భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరమేమీ కాదని అన్నారు. దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండడానికి వారి మధ్య ఏకరూపత ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సామరస్యపూర్వకంగా, కలిసిమెలసి జీవితం మన సంస్కృతిలో ఒక భాగమని గుర్తుచేశారు. వైవిధ్యం వల్ల ఐక్యత దెబ్బతినదని పేర్కొన్నారు. వైవిధ్యంలోనే ఐక్యత ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ త్వరలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోనుంది. ఇందులో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు, అమెరికా, చైనా, డెన్మార్క్, రష్యా, ఇజ్రాయెల్ తదితర దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులతో మోహన్ భగవత్ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమావేశమయ్యారు. హిందూ దేశ భావనపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది అధికారానికి, బలానికి సంబంధించిన విషయం కాదన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం ఒక్కటేనని, హిందూ దేశం అంటే దీనినుంచి ఏ ఒక్క వర్గాన్ని మినహాయించడం కాదని స్పష్టంచేశారు. హిందూ దేశ భావన ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. సంఘ్–బీజేపీ మధ్య విభేదాల్లేవు ఆర్ఎస్ఎస్కు, స్వయం సేవకులకు(వాలంటీర్లు) మధ్య బలమైన బంధం ఉందని మోహన్ భగవత్ తెలిపారు. వారు స్వతంత్రంగా పని చేస్తున్నారని, వారికి ఆ స్వేచ్ఛ ఉందని తేల్చిచెప్పారు. బీజేపీపై సంఘ్ పెత్తనం చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పారు. సంఘ్ అనుబంధ విభాగాలు, సంఘాలను ప్రత్యక్షంగా లేదా రిమోట్తో నియంత్రించడం లేదన్నారు. సంఘ్–బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పరోక్షంగా స్పష్టంచేశారు. మొత్తం సమాజాన్ని ఏకం చేయాలన్నదే సంఘ్ ఆశయమని చెప్పారు. గత 75 ఏళ్లలో మన దేశం చేరాల్సిన స్థాయికి చేరలేదని అభిప్రాయపడ్డారు. -
ఉత్తరాదిన కుంభవృష్టి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. హిమాలయాలకు నిలయాలైన హిమాచల్, జమ్మూలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు పడిన ఘటనలతో వణికిపోయాయి. హిమాచల్లో మెరుపు వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. జమ్మూకశ్మీర్లోని రియాస్ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్ మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్క్యాంప్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖత్రానుంచి 12 కిలోమీటర్ల మార్గముంది. ఇందులో అర్థ్కువారీ సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. ఆలయానికి రెండు మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం నుంచి హిమ్కోటీ ట్రెక్కింగ్ మార్గం గుండా యాత్రను నిలిపేశారు. పాత రూట్లో మధ్యాహ్నం 1.30దాకా ట్రెక్కింగ్ జరగ్గా కొండచరియలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్ధా్థంతరంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులుగత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ ఘటనతో కలిసి జమ్మూవ్యాప్తంగా వర్షసంబంధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో లోయలోనూ భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైళ్ల టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికం, ఇంటర్నెట్ సేవలు దాదాపు ఆగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైలుపట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దుచేశారు. కొండచరియలు పడటంతో జమ్మూ–శ్రీనగర్, కిష్ఠ్వార్–దోడా జాతీయరహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇలా డజన్లకొద్దీ పర్వతసానువుల వెంట రహదారులు మూసేశారు. కిష్ఠివార్, రేసీ, రాజౌరీ, రాంబాన్, ఫూంఛ్ జిల్లాల్లోనూ వర్షబీభత్సం జరిగింది. ఇళ్లు నేలకూలాయి. కిష్్టవార్లోని ముఘల్ మైదాన్ వంతెన ధ్వంసమైంది. జమ్మూలో తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శ్రీనగర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. మనాలీలో బియాస్ ఉగ్రరూపం హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలీ–లేహ్ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలీలోని బహంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీప్రవాహంలో పడింది. రెండు రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాప్లు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పత్లీకుహాల్ ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. కులూ ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాల కారణంగా కొండచరియలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండీ జిల్లాలో 320, కులూ జిల్లాలో 132 రహదారులను మూసేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్హౌస్కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
జమ్మూకశ్మీర్: విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురి మృతి
జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు మృతి చెందగా.. 14 మందికి గాయపడ్డారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కత్రా నుండి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్కోట్, కేలా మోర్, బ్యాటరీ చెష్మా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఉధంపూర్, కాజిగుండ్ వద్ద కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్వార్, రాంనగర్-ఉధంపూర్, జంగల్వార్-థత్రి మార్గాలు దెబ్బతిన్నాయి.కథువా జిల్లాలో సహార్ ఖడ్ నదిపై వంతెన దెబ్బతింది. దీంతో జమ్మూ-పఠాన్కోట్ హైవేపై రవాణా నిలిచిపోయింది. నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మొధోపూర్ బ్యారేజ్ ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దాటి పోయింది. ఉధంపూర్లో తావి నది 20 అడుగుల ప్రమాద స్థాయిని దాటి పోయింది. చెనాబ్ నది 899.3 మీటర్లకు చేరింది. ఆగస్టు 27 వరకు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కాశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.⚠️ Heavy rains trigger landslide on Vaishno Devi Yatra Route Near Adhkwari➡️ 5 pilgrims dead, 14 injured➡️ Yatra suspended, trains & routes disrupted➡️ Red alert issued,heavy rains to continue for 40 hrsRescue ops & helplines active.#JammuKashmir #VaishnoDevi #jammufloods pic.twitter.com/lGqlw6IYvL— Abheet Sangotra 🇮🇳 (@abheet20) August 26, 2025 -
క్షమాపణలు చెప్పడానికి సిద్ధం, కానీ.. : డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలకు సిద్ధపడ్డారు. కానీ, ఆ క్షమాపణలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదని.. నిజంగా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే చెబుతానని అంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ చర్యలు తీసుకునే ఉండేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు.‘‘బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే.. అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు అని అన్నారాయన. అలాగే గాంధీ కుటుంబం (Sonia Gandhi family), కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని అని స్పష్టం చేశారు.ఇటీవల అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై చర్చ నడిచింది. ఆ సమయంలో డీకే శివకుమార్ విపక్షాల విమర్శలకు బదులిస్తూ.. ఆర్ఎస్ఎస్ గేయాన్ని ఆలపించారు. ‘నమస్తే సదా వస్తలే మాతృభూమే’ అంటూ ఆయన నోట రావడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆ పరిణామాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. -
కుంకుమ పెడుతూ అసభ్యంగా తాకాడని..
22 ఏళ్లుగా ఈ గుడిలో పూజారిగా పని చేస్తున్నా. ఆచారంగా వస్తున్న పనే నేను చేస్తున్నా. ఎవరూ ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పలేదు. ఏనాడూ నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు అంటూ ఆలయ పూజారి నాగభూషణచార్ అంటున్నాడు. ఈలోపు.. ఆ పూజారి తమతోనూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలకు దిగుతున్నారు. కర్ణాటక తుమకూరు దేవరాయనదుర్గ కొండ మీద ఆలయ పూజారి నాగభూషణచార్ మీద జరిగిన దాడి నెట్టింట వైరల్ అవుతోంది. కుంకుమ పెట్టే వంకతో తమను అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ.. తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనపై దాడికి దిగారు. గుడి మెట్ల మీదనే కర్రలతో ఆయన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. తానేమీ భక్తులతో అనుచితంగా ప్రవర్తించలేదని ఆయన అంటున్నారు. నా నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో భక్తుల మెడకు కుంకుమ రాయడం ఎప్పటి నుంచో చేస్తున్నా. వాళ్లు పొరపాటు పడి నా మీద దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. దాడి చేసిన కుటుంబం హసన్ జిల్లాకు చెందిందిగా తెలుస్తోంది. అయితే వాళ్లు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. A group of devotees has been accused of assaulting an elderly priest at a temple on #DevarayanadurgaHill in #Tumakuru Sunday, alleging he inappropriately touched women while applying vermilion.pic.twitter.com/vo4U4QNNpa— Hate Detector 🔍 (@HateDetectors) August 25, 2025 -
కొత్త చట్టం అధికారపార్టీకి చుట్టమైతే?
నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.దానికి తగినట్లుగానే టీడీపీ లోక్సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్ఎస్లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈ గణేశుని దర్శనానికి.. 40 గంటలు వేచి ఉండాల్సిందే..
ముంబై: దేశవ్యాప్తంగా గణేశుని ఉత్సవాల సందడి మొదలయ్యింది. మహారాష్ట్రలోని ముంబైలో కొలువైన ప్రసిద్ధ ‘లాల్బాగ్చా రాజా’ తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.భక్తులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ ఏడాది ‘లాల్బాగ్చా రాజా’ ఊదా రంగు దుస్తులు ధరించి, తలపై కిరీటం, చేతిలో చక్రం తిప్పుతూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.‘లాల్బాగ్చా రాజా’ సన్నిధి భక్తులకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుతోంది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 27న మొదలై 10 రోజుల పాటు కొనసాగనుంది.ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ‘లాల్బాగ్చా రాజా’ను దర్శనం చేసుకునేందుకు 40 గంటల పాటు క్యూలో నిలుచునే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. -
అన్నామలైకు చేదు అనుభవం, అయినా సరే..!
బీజేపీ నేత, తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్కు హాజరైన ఆయన నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు. తీరా ఆ యువకుడు ఆ రాష్ట్ర మంత్రి కొడుకు కావడం గమనార్హం.తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తనయుడు సూర్య రాజా బాలు చేసిన పని ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. మాజీ ఐపీఎస్ అన్నామలై నుంచి మెడల్ను నిరాకరించాడు. తమిళనాడు 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు అన్నామలై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతల మెడలో మెడల్స్ వేస్తుండగా.. సూర్య అందుకు ఒప్పుకోలేదు. అన్నామలై నుంచి దూరందూరంగా జరిగాడు. ఆపై అన్నామలై నుంచి చేత్తో ఆ మెడల్ను తీసుకున్నాడు.அசிங்கப்பட்டான் ஆடு மேய்ப்பன் @annamalai_k pic.twitter.com/19l5XerZfH— ஜோக்கர் ᵖʰᵒᵉⁿⁱˣ (@lahudapandi) August 25, 2025అయితే ఈ పరిణామంపై అన్నామలై ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. బాలును దగ్గరికి తీసుకుని సక్సెస్ కావాలంటూ అభినందించి ఫొటో దిగారు. ఆపై ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్కు హాజరైన మీడియా నుంచి ఆయనకు వైరల్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దానికి అన్నామలై స్పందిస్తూ.. నేత అనేవాడు ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉండాలిగానీ ద్వేషంతో కాదు అని బుదులిచ్చారు. బాలుకు విజయాలు కలగాలి అంటూ మరోసారి ఆశీర్వదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. సింగంగా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఈమధ్యే ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ నిత్యం ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు.మొన్నీమధ్యే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. తిరునెల్వేలిలో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కాగా.. ఆయన నుంచి కాకుండా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నుంచి ఓ యువతి పట్టా అందుకుంది. డీఎంకే నేత ఎం రాజన్ తనయ జీన్ జోసెఫ్గా తేలింది. గవర్నర్ తమిళ భాషకు, తమిళనాడుకు వ్యతిరేకి అని.. పైగా వైస్ చాన్సలర్ తమిళనాడుకు ఎంతో చేశారని.. అందుకే ఆయన నుంచి పట్టా తీసుకున్నానని జీన్ తెలిపింది. -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో శివరాజ్ సింగ్ చౌహన్
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ(బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుని ఎంపికకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పదవికి తగిన నేత ఎంపిక కోసం అధిష్ఠానం కొన్నాళ్లుగా కసరత్తు నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా ఆర్ఎస్ఎస్ తో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరిపిందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల తరువాత అధ్యక్షుని ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ లో బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ భావిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరగడం లాభదాయకమని బీజేపీ అనుకుంటోందని సమాచారం.శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో జైట్ అనే గ్రామంలో 1059 మార్చి 5న జన్మించారు. అతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్. తల్లి పేరు సుందర్ బాయి. అతని తండ్రి వృత్తి రీత్యా రైతు. శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. శివరాజ్, సాధన దంపతులకు ఇద్దరు కుమారులు. 1972లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరారు. లో చేరారు. ఇక్కడ నుండి ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. దీని తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు . ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ ప్రజలకు సేవలు అందించారు. -
కందిరీగను మింగి బాలిక మృతి
తమిళనాడు: మురుకులు తింటూ ప్రమాదవశాత్తు కందిరీగను మింగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దిండుగల్ జిల్లాకు చెందిన కార్తీక్ తామరపాక్కంలోని శక్తి నగర్లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కుగశ్రీతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలిక శనివారం సాయంత్రం ఇంటి వద్ద మురుకులు తింటూ కందీరీగను మింగినట్టు తెలుస్తోంది. అయితే మురుకులు గొంతులో చిక్కుకున్నట్టు భావించిన తల్లిదండ్రులు చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలికకు ఎక్స్రే తీయగా, గొంతులో కందిరీగ ఉన్నట్టు గుర్తించి షాక్కు గురయ్యారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందింది. అనంతరం బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి గొంతులో చిక్కుకున్న కందిరీగను బయటకు తీశారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
కోనేరులో కాళ్లు కడిగిన బిగ్బాస్ బ్యూటీ.. అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి
దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్.. వారం కిందట గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో రీల్ రూపేణా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.గురువాయూర్ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. జాస్మిన్ జాఫర్(25).. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేమ్తోనే బిగ్బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆ సీజన్లో సెకండ్ రన్నరప్గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది. -
Dowry horror: కుమార్తెకు నిప్పంటించి, తానూ మృత్యు ఒడికి..
జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒక మహిళతో పాటు ఆమె మూడేళ్ల ఏళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తమ కుమార్తె కొన్నాళ్లుగా అత్తవారింటిలో వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపధ్యంలో ఆమె కుమార్తెతో పాటు ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.యూపీలోని గ్రేటర్ నోయిడాలో వరకట్న వేధింపులతో మహిళ హత్య జరిగిన కొన్ని రోజులకే ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాజా ఘటనలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సంజు బిష్ణోయ్ శనివారం మహాత్మా గాంధీ ఆస్పత్రిలో కాలిన గాయాలతో మరణించగా, ఆమె మూడేళ్ల కుమార్తె యశస్వి జోధ్పూర్లోని సర్నాడ గ్రామంలోని వారి ఇంట్లో సజీవ దహనమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంజు శుక్రవారం పాఠశాల నుండి తిరిగి వచ్చాక, ఇంటిలోని డైనింగ్ టేబుల్ కుర్చీపై పెట్రోల్ పోసి, తనతో పాటు తన కుమార్తెకు కూడా నిప్పంట్టించింది. ఇద్దరూ మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. అక్కడిక్కడే యశస్వి సజీవ దహనమైపోయింది. సంజు కాలిన గాయాలతో ఆస్పత్రిలో మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలం నుండి పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.సంజుకు దిలీప్ బిష్ణోయ్ తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తమ కుమార్తెను అత్తామామలు పదే పదే కట్నం కోసం వేధించారని, వాటిని తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తల్లిదండ్రులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. సంజుకు ఆమె అత్తమామలకు మధ్య నాలుగైదు నెలల నుంచి వివాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ సంజు బిష్ణోయ్ని ఆమె భర్త , అత్తమామలు కట్నం కోసం వేధించారని. ఇదే ఆమె ఆత్మత్యకు కారణంగా నిలిచిందంటూ ఫిర్యాదు అందిందన్నారు. ఈ నేపధ్యంలో భర్త దిలీప్, మామ గణపత్, అత్త లీలలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అంబానీ ‘వంతారా’పై సిట్ విచారణ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను తీసుకురావడంలో చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపధ్యంలో అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’పై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. గుజరాత్లోని జామ్నగర్లో గల గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రం వంతారాపై నిజనిర్ధారణ విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన పలు నివేదికలు, ఎన్జీఓలు, వన్యప్రాణుల సంస్థల నుండి ‘వంతారా’లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణల మేరకు దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్లు పంకజ్ మిథల్, పీబీ వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మాజీ న్యాయమూర్తి జె. చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సిట్ కమిటీని ‘వంతారా’పై విచారణకు ఏర్పాటు చేసింది.పిటిషన్లలో ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ ప్రతివాది లేదా మరే ఇతర పార్టీల కౌంటర్ను లెక్కించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు పేర్కొంది. సాధారణంగా ఇటువంటి ఆధారం లేని ఆరోపణలపై ఆధారపడిన పిటిషన్ను చట్టపరంగా స్వీకరించేందుకు అర్హత లేదని, అందుకు బదులుగా దానిని తాత్కాలికంగా కొట్టివేయాలని కూడా పేర్కొంది. అయితే వంతారాలో వాస్తవ పరిస్థితిని ధృవీకరించాలని, అప్పుడు ఇటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది తేలుతుందని, అందుకే విచారణ అనేది న్యాయ దృక్పథంలో సముచితమని భావిస్తున్నామని తొమ్మిది పేజీల ఉత్తర్వులో సుప్రీం కోర్టు పేర్కొంది.‘వంతారా’కు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో జస్టిస్ చలమేశ్వర్తో పాటు, జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అనిష్ గుప్తా ఉండనున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను సేకరించడం, వన్యప్రాణుల (రక్షణ) చట్టం అమలు, సజీవ జంతువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ‘వంతారా’ అనుసరిస్తున్న విధానాలపై దర్యాప్తు జరిపి, ఆ నివేదికను సమర్పించాలని ‘సిట్’కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లలో ఆరోపించిన మనీలాండరింగ్ లాంటి ఆరోపణలను కూడా ఈ ప్యానెల్ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
టారిఫ్ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
ఆప్ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు మరో 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. ఆస్పత్రుల నిర్మాణ అవకతవకలకు సంబంధించిన నేపథ్యంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.ఆప్ పాలనలో సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆస్పత్రుల నిర్మాణాల్లో అవకతకవలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో మరో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ని సైతం దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. అభియోగాలేంటంటే.. 2018-19లో ఆప్ ప్రభుత్వం రూ. 5,590 కోట్ల విలువైన 24 ఆసుపత్రుల ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల్లో అనేక ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల, మరియు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ICUలతో కూడిన ఆసుపత్రులు 6 నెలల్లో పూర్తవ్వాల్సి ఉండగా, 3 సంవత్సరాలు గడిచినా 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్ఎన్జీపీ ఆసుపత్రి ఖర్చు రూ. 488 కోట్ల నుంచి రూ. 1,135 కోట్లకు పెరిగింది, కానీ దాని నిర్మాణంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. పైగా అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం, అదే సమయంలో కాంట్రాక్టర్ల పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే Hospital Information Management System (HIMS) 2016 నుంచి పెండింగ్లో ఉంది, దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంతో.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ 2025 జూన్లో సత్యేందర్ జైన్ , సౌరభ్ భరద్వాజ్లపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కేసును ఈడీకి బదలాయించగా.. విచారణ జరుగుతోంది. -
కడలిపైకి కదననౌకలు
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. రెండు భారీ యుద్ధనౌకలు మంగళవారం నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో నిరి్మతమైన నీలగిరి క్లాస్లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితం కానున్నాయి. అత్యాధునిక ప్రాజెక్ట్–17లో భాగంగా మలీ్ట–మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లుగా రూపుదిద్దుకున్న వీటిని విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ సర్కార్లో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ కమిషనింగ్ చేయనున్నారు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో ఉదయగిరి, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో హిమగిరి యుద్ధనౌకలు నిర్మించారు. ఆధునిక కంబైడ్స్ డీజిల్ లేదా గ్యాస్ (సీవోడీవోజీ) ప్రొపల్షన్ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు ఇండియన్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్స్ ఉన్న ఈ నౌకలకు సముద్రజలాల్లో నిర్దేశిత లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేయగల సామర్థ్యం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా సముద్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇవి ముఖ్య భూమిక పోషించనున్నాయి. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధనౌకలు పలు రికార్డులను లిఖించనున్నాయి.ఐఎన్ఎస్ ఉదయగిరి.. నేవీ వార్íÙప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్. రెండు వేర్వేరు షిప్యార్డ్ల్లో నిర్మించిన రెండు ఫ్రంట్లైన్ సర్ఫేస్ యుద్ధనౌకల్ని ఒకేసారి ప్రారంభించడం నౌకాదళ చరిత్రలో ఇదే తొలిసారి. భారత షిప్యార్డ్లు అవలంబించిన మాడ్యులర్ నిర్మాణ పద్ధతిలో భాగంగా నిరి్మతమై అత్యంత వేగవంతంగా కమిషనింగ్ అవుతున్న యుద్ధనౌక ఉదయగిరి. ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణంలో చైనాను భారత్ అధిగమించింది. చైనా 19 వార్íÙప్స్ నిరి్మస్తుండగా.. భారత్ నిర్మాణ సంఖ్య 20కి చేరుకుంది. ఈ షిప్స్ తయారీలో 200 ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. వీటి నిర్మాణం ద్వారా 4 వేలమందికి ప్రత్యక్షంగా, 10 వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది. -
ఉత్తర కొరియాతో పెట్టుకుంటున్న ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్తో భేటీ?
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్హౌస్కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు వైట్ హౌస్ నుంచి పదేపదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. -
ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్
కర్ణాటక: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విధించిన జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో దీర్ఘకాలంగా ఉన్న చలానాలను కట్టేందుకు వాహనదారులు త్వరపడుతున్నారు. ఆదివారం ఒక్కరోజున 1.03 లక్షల కేసుల్లో రూ.3.01 కోట్ల జరిమానా చెల్లించడం గమనార్హం. వచ్చే నెల 19 వరకు రాయితీ కొనసాగుతుంది. మొదటి రోజు శనివారం 1.48 లక్షల చలాన్ల ద్వారా రూ.4.18 కోట్లు వసూలైది. వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కబ్బన్పార్క్ పోలీసులు తెలిపారు. టెక్కీకి మోసం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై సైబర్ మోసగాళ్లు కన్నేశారు. ఓ టెక్కీని ఇలాగే బురిడీ వేశారు. మీ చలానాలపై 50 శాతం తగ్గింపు ఉందని ఏపీకే ఫైల్ వాట్సాప్కు వచ్చింది. ఏపీకే ఫైల్ను ఓపెన్ చేసిన కొంతసేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.65 లక్షలు పోయింది. కొడిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ మోసం జరిగింది. -
పాక్పై అపార దయ చూపిన భారత్
ఇస్లామాబాద్: భారత్ తన పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలో ఎంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నదనడానికి మరో నిదర్శనం మన ముందు నిలిచింది. ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య పెరిగిన దౌత్య ఉద్రిక్తతల నడుమ కూడా పాకిస్తాన్పై భారత్ దయ చూపింది. పాక్లో ప్రవహించే తావి నదిలో వరద పరిస్థితిపై ఇస్లామాబాద్ను హెచ్చరించింది.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను నిలిపివేసింది. అయినప్పటికీ భారత్ తన దయాహృదయాన్ని చాటుతూ.. తాజాగా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ద్వారా తావి నది ఉధృతిపై పాక్ను అప్రమత్తం చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇటు భారత్ అటు పాకిస్తాన్లు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ వాదనలు నిజమైతే, ఉద్రిక్తతల దరిమిలా భారత్ తన దౌత్య మిషన్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.జమ్ములోని తావి నదిలో పెద్దఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉందని భారత్.. పాకిస్తాన్ను హెచ్చరించిందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని సమాచారం. భారతదేశం అందించిన సమాచారం ఆధారంగానే పాకిస్తాన్ సంబంధిత అధికారులకు ఈ విషయం చేరవేసిందని తెలుస్తోంది. టిబెట్లో ప్రారంభమైన సింధూ నది ప్రవాహం పాకిస్తాన్ అంతటా ప్రయాణిస్తుంది. కశ్మీర్ మీదుగానూ వెళుతుంది.ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధూ జల ఒప్పందం 1960లో కుదిరింది. ఇది భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ నది, దాని ఉపనదుల వాడకాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ ఒప్పందం కింద భారతదేశానికి సింధూ నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీరు, మిగిలిన 80 శాతం నీరు పాకిస్తాన్కు అందుతుంది. ఏప్రిల్ 22న చోటుచేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటి నుంచి ఈ నదికి సంబంధించిన మూడు ఉప నదులలోని నీటి మట్టాల డేటాను పాకిస్తాన్తో పంచుకోవడం ఆపివేసింది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మూడు నదులలో నీటి మట్టం పెరుగుతున్నదని పాక్కు భారత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో, ఆ దేశం.. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వర్షాకాలంలో పాకిస్తాన్ అంతటా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరదలు, భారీ వర్షాల కారణంగా పాక్లో ఇప్పటివరకూ 788 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా జనం గాయపడ్డారు. మృతులలో 200 మంది పిల్లలు, 117 మంది మహిళలు, 471 మంది పురుషులు ఉన్నారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. -
భరిస్తాం.. స్వప్రయోజనాలను పణంగా పెట్టం: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అధిక పన్నుల భారం మోపినా భరిస్తాంగానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమెరికా మోపిన 50 శాతం దిగుమతి టారిఫ్ భారంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సోమవారం సొంతరాష్ట్రంలో పర్యటన ఆరంభించిన ప్రధాని మోదీ రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. తర్వాత అహ్మదాబాద్లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజ నాలే భారత్కు ముఖ్యం. అదనపు టారిఫ్ల పేరిట మాపై పెనుభారం మోపినా భరిస్తాం. అంతేగానీ స్వప్రయోజనాలను పణంగా పెట్టబోం’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ భారత్పై విదేశీ ప్రభావాన్ని మోదీ ప్రధా నంగా గుర్తు చేశారు. ‘‘ ప్ర పంచ దేశాల్లో నేడు రాజకీ యాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూతా తిరుగుతున్నాయి. అయినా సరే నేను మహాత్మా గాంధీజీ చూపిన స్వదేశీ వస్తువు లకు పట్టం కట్టాలనే బాటలోనే పయనిస్తున్నా. అందుకే చిన్నపరిశ్రమలు, కర్షకులు, పశుపోష కులకు నేనొక్కటే చెప్పదల్చు కున్నా. మీ ప్రయోజ నాలే నాకు సర్వోన్నతం. మీ ప్రయోజనాల విష యంలో మా ప్రభుత్వం ఏమాత్రం పట్టు సడలించదు. మాపై ఎంతటి ఒత్తిడి పడినా సరే మేం భరిస్తాం. మీ ప్రయో జనాలకు భంగం కల్గకుండా చూసుకుంటాం’’ అని మోదీ అన్నారు. చక్రధారి, చరఖాధారి బాటలో..‘‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ, శక్తిసామర్థ్యాలకు, పరి రక్షణకు మారుపేరైన సుదర్శన చక్రధారి అయిన మోహన్ కృష్ణ భగవానుడు, ఛరఖాధారి అయిన మోహన్ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో భారత్ పయనిస్తోంది. నూలు వడికే రాట్నం చక్రంతో గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ఉరకలెత్తించారు. పహల్గాంలో ఉగ్ర ముష్కరుల పాశవిక దాడికి దీటుగా బదులిస్తూ భారత సైనికుల తెగువ, ధైర్య సాహసాలకు దర్పణమే ఆపరేషన్ సిందూర్’’ అని మోదీ అన్నారు.కాంగ్రెస్పై విమర్శల జడి‘‘60 నుంచి 65 ఏళ్లపాటు భారత్ను పాలించిన కాంగ్రెస్ కూడా ‘దిగుమతి స్కామ్’లకు పాల్పడి భారత్ను పరాయి దేశాలపై సరుకుల కోసం ఆధారపడేలా మార్చేసింది. పరాధీనంగా మార్చేసి బాపూజీ కీలక ఉపదేశమైన స్వదేశీ మంత్రాన్ని కాంగ్రెస్ మంటగల్పింది. గాంధీజీ పేరు చెప్పుకుని తిరిగే కాంగ్రెస్ పెద్దలు ఆయన సూచించిన స్వచ్ఛత, స్వదేశీ పదాలను గాలికొదిలేశారు’’ అని మోదీ విమర్శించారు. -
కొన్నోళ్లే కన్నోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకుని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపుకోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా.. ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ.. సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..: తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మాతా, శిశు సంక్షేమ శాఖ డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. ఇందులో డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు సుప్రీంకోర్టులో అప్పీల్చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే 14వ తేదీలోగా పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పును అధికార యంత్రాంగం పాటించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు ఈనెల 18న ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల లోపు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. అయితే, తమకు మంగళవారం ఉదయం 11గంటల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏఎస్జీ కోరారు. ‘సరే ఈ ఒక్కసారికి అవకాశమిస్తున్నాం, మంగళవారం ఉదయం 11గంటలకల్లా తల్లిదండ్రుల చేతిలో ఆ పసికందులు ఉండాలి’అని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. ఇదిలాఉండగా.. సోమవారం సాయంత్రంలోపే పిల్లలను ఆ తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడం గమనార్హం. ఇదీ జరిగింది.. గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం బట్టబయలైంది. మహిళా ఆర్ఎంపీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు 11 మందిని అరెస్ట్చేశారు. వారు మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడ పిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఏడుగురు చిన్నారులను అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో 9 మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన 9 మంది చిన్నారులను కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని, తదుపరి రోజు తీసుకోవాల్సి ఉండగా, హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందులో నలుగురు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న హైకోర్టు ముందుకు రానుంది. -
‘ఆర్జీ కర్’ విధ్వంసం సీపీఎం నేతల పనే
కోల్కతా: 2024 ఆగస్ట్ 14వ తేదీ రాత్రి కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వామపక్ష నేతలే కారణమని కోల్కతా పోలీసులు ఆరోపిస్తున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మీనాక్షీ ముఖర్జీ సహా 54 మంది పేర్లతో కూడిన నివేదికను సియల్డా కోర్టుకు సమర్పించారు. ఎస్ఎఫ్ఐ నేతలు దేబాంజన్ దేవ్, కలతన్ దాస్గుప్తా, సీపీఎంఎల్ మాజీ నేత దిధితి రాయ్, సీపీఎం నేత దీపూ దాస్ పేర్లు కూడా చార్జిషీటులో ఉన్నాయి. ఆర్జీ కర్ ఆస్పత్రిలో పనిచేసే ట్రెయినీ వైద్యురాలు ఆగస్ట్ 9వ తేదీన దారుణ హత్యాచారానికి గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిపై దాడి జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో విధ్వంసం సృష్టించారు. అడ్డుకోబోయిన పలువురు వైద్యాధికారులతోపాటు పోలీసులు సైతం గాయపడ్డారు. దీనికి సంబంధించి కోల్కతా పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటా రికార్డులను పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాకు‡్ష్యలు, బాధితులను వందలాది మందిని ప్రశ్నించారు. మీనాక్షీ ముఖర్జీని కూడా ప్రశ్నించారు. వీరంతా కోల్కతాలోని ఓ సీపీఎం నేత ఇంట్లో సమావేశమై ధ్వంస రచన చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. చార్జిషీటును పరిశీలించిన సియల్డా కోర్టు మేజి్రస్టేట్ సోమవారం మీనాక్షీ ముఖర్జీ సహా పలువురికి సమన్లు జారీ చేశారు. వీరంతా కోర్టు ఎదుట లొంగిపోయారు. కోర్టు వీరికి ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. -
శుభాంశుకు లక్నోలో అపూర్వ స్వాగతం
లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగిడిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లాకు సోమవారం లక్నోలో అపూర్వ స్వాగతం లభించింది. యాగ్జియం–4 మిషన్ను దిగి్వజయం ముగించుకుని ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ఆయన..మొదటిసారిగా సొంతూరుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లా, భార్య కామ్నా, కుమారుడు కియా‹Ùతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త్రివర్ణ పతకాలు చేబూని, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిటీ మాంటెస్సోరి స్కూలుకు చెందిన విద్యార్థులు డ్రమ్ములు వాయిస్తూ బాకాలు ఊదుతూ సందడి చేశారు. సొంతూరు రావడం ఎంతో ఉత్కంఠగా ఉందని శుభాంశు పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు లక్నోలో కాలు పెట్టిన దగ్గర్నుంచి అభిమానులతో కనీసం 2 వేల సెలీ్ఫలు తీసి ఉంటానని అన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో పూల వాన కురిపిస్తుండగా త్రివేణీ నగర్లోని సొంతింటి వైపు ఆయన విక్టరీ పరేడ్ సాగింది. స్పేస్ టెక్నాలజీ చదివే విద్యార్థులకు శుభాంశు శుక్లా పేరుతో స్కాలర్ షిప్పులను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నాసా బదులుగా ఇస్రో గురించి అందరూ మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ సమక్షంలో శుభాంశు శుక్లాకు సీఎం యోగి సన్మానం చేశారు. లక్నోలోని ఓ పార్కుకు శుక్లా పేరు పెడతామని మేయర్ తెలిపారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన భారీ డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లపై శుభాంశు శుక్లా ఘనతను ప్రదర్శించారు. శుక్లాను భారత రత్నతో గౌరవించాలని రా్రïÙ్టయ కిసాన్ మంచ్ డిమాండ్ చేసింది. -
మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్!
ఉనా (హిమాచల్): మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ.. హిమాచల్ ప్రదేశ్లో పిల్లలు చెప్పిన సమాధానం.. అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ.. మన దేశ విద్యా వ్యవస్థ దుస్థితి ఏంటో తెలియజెప్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. హిమాచల్ ప్రదేశ్లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ‘అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?’ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్త కంఠంతో ‘నీల్ ఆర్మ్్రస్టాంగ్’అని చెప్పారు. అందుకు ఎంపీ.. ‘కాదు.. నేను హనుమాన్ అనుకుంటున్నాను. వేల సంవత్సరాల నాటి మన సంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి ముఖ్యమైనవని ఇది చూపిస్తుంది. మనం మన స్వంతం గురించి నేర్చుకోకపోతే, బ్రిటిష్ వారు మనకు నేర్పించిన దానికే మనం పరిమితం అవుతాం’అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్లో వైరల్ అవుతోంది. ఆ రెండు సమాధానాలు తప్పు. ‘నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాదు.. యూరీ గగారిన్’అని చెప్పాల్సిన ఒక పార్లమెంటేరియన్.. జాతీయ అంతరిక్ష దినోత్సవం నాడు పిల్లల తప్పును సరిదిద్దకపోగా.. పురాణాలను చరిత్రగా చెప్పడం వివాదాస్పదమైంది. చర్రిత తప్పుదోవ.. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తరువాత 1969లో అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్్రస్టాంగ్ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకే ఠాకూర్ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ.. సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమంటే... సైన్స్, చరిత్ర పేరుతో పురాణాలను వల్లించడం కాదనే విషయాన్ని మరిచారు. మన చరిత్ర, సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ.. వాస్తవాలు, కల్పనల మధ్య తేడాను గుర్తించడం వారికి నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పు లేదు. కానీ.. పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే’అంటున్నారు. శాస్త్రీయ రుజువులు లేని పురాణాలు.. చరిత్ర వేరు.. పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్ వర్ణనలను పోలిన నగరం 19వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాత్ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. శాస్త్రీయ రుజువు లేకుండా, ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథనాలుగా మిగిలిపోతాయే తప్ప, చరిత్రగా కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు, యూరి గగారిన్ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి మరియు పార్లమెంటు సభ్యులు విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. -
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్యాన్నే కాదు.. మొత్తం వ్యవస్థనే అపహాస్యం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీఛార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం నెలలుగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేయగా.. చాలా మంది గాయపడ్డారు. కవర్ చేయడానికి వచ్చిన మీడియానూ అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘అభ్యర్థుల చెప్పేది వినడానికి బదులుగా, రాత్రి చీకటిలో వారిని లాఠీలతో కొట్టారు. ఊహించుకోండి... నిన్న పుస్తకాలు పట్టుకున్న చేతులకు ఇప్పుడు గాయాల గుర్తులు మిగిలాయి’అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీ నియంతృత్వం చూడండి... దేశంలో దుండగులు బహిరంగంగా రాజ్యమేలుతున్నారు. బీజేపీని ప్రశ్నించే వారిపై లాఠీ ఛార్జీలు ఝుళిపించి నోరు మూయిస్తున్నారు. ఎవరినైనా అరెస్టు చేసి జైలులో పెట్టవచ్చు, ఏ చట్టాన్నైనా వారు కోరుకున్నప్పుడల్లా మార్చవచ్చు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయకపోతే, వారి ఓటు తీసేస్తారు’అని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ.. మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని వివిధ పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహించే ఒక చట్టబద్ధమైన సంస్థ. జూలై 24 నుంచి ఆగస్టు 1 మధ్య 142 నగరాల్లోని 194 కేంద్రాల్లో 13 ఫేజుల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. అయితే.. ఆకస్మిక రద్దులు, సాఫ్ట్వేర్ క్రాష్లు, బయోమెట్రిక్ ధ్రువీకరణలో వైఫల్యాలు, తప్పుడు సెంటర్ కేటాయింపుల వంటి సమస్యలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలపై ఢిల్లీ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆశావహులు వీధుల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలోనూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పేలుడు పదార్థాన్ని నోట్లో కుక్కి ప్రియురాల్ని చంపేశాడు
మైసూరు: కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సుమారు 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు. మహిళ మృతదేహం బెడ్పై పడి ఉండగా, ఆమె ముఖం దిగువ భాగం ఛిద్రమైనట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అక్కడి ఫ్లోరంతా రక్తం ధారలుగా కనిపిస్తోంది. ఆమెను హున్సూర్ తాలుకా గెరసనహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. భెరియా గ్రామంలోని ఓ లాడ్జిలో రక్షిత విగతజీవిగా కనిపించింది. ఆ లాడ్జి గదికి ప్రియుడు సిద్ధరాజుతో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన రోజువారీ కూలీతో ఈమెకు వివాహమైంది. అయితే, రక్షిత తన బంధువైన సిద్ధరాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. లాడ్జిలో ఉండగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే సిద్ధరాజు తన వద్ద ఉన్న పేలుడు రసాయనాన్ని ఆమె నోట్లో కుక్కి జిలెటిన్ స్టిక్స్తో పేల్చాడు. ఇలాంటి జిలెటిన్ స్టిక్స్ను క్వారీల్లో బండలను పేల్చేందుకు వాడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పేలడంతోనే ఆమె చనిపోయిందంటూ అక్కడికి వచ్చిన వారితో సిద్ధరాజు కట్టుకథ చెప్పాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
డాక్టర్ రోబో.. సర్జన్ అవతారం!
రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో ఆపరేషన్ థియేటర్లో డెలివరీ చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. సినిమాల్లోనే కాదు.. వాస్తవ ప్రపంచంలోనూ రోబోలు సర్జరీలను చకచకా చేస్తున్నాయి. అన్నింటా మనం అన్నట్టు ఈ విషయంలో భారత్ సైతంతగ్గేదేలే అంటోంది.వైద్య పరిశ్రమ అంచనాల ప్రకారం భారత్లో ఇప్పటివరకు రోబోలు సహాయకులుగా 1,50,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు జరిగాయి. అంతేగాక పూర్తిగా రోబోటిక్ శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు మన వైద్యులు. ప్రస్తుతం మన దేశంలో 1,000 మంది సర్జన్లు ఏటా 12,000 కంటే ఎక్కువ రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యంవేయక మానదు.విదేశీ రోగులకూ సేవలు..ఫలితాలను అంచనావేసే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యక్తులనుబట్టి చికిత్సా మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని, ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలను మెరుగుపర్చడం, రోగనిర్ధారణ కచ్చితత్వం ద్వారా శస్త్రచికిత్సా విధానాల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ పెంచుతోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స సమయాలను ఏఐ దాదాపు 15 శాతం తగ్గించగలదని అంటున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల కోసం వచ్చే విదేశీ రోగులకు గమ్యస్థానంగా భారత్ అవతరిస్తోంది.యూఎస్, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే వైద్య ఖర్చులు మనదగ్గర కనీసం 50 శాతం తక్కువ. అమెరికా, యూకే, నైజీరియా, కెన్యా, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా నుండి ఎక్కువ మంది రోగులు భారత్కు వస్తున్నారు. భారతదేశ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం రూ.7,830 కోట్లకుపైగా ఉంది. 2030–31 నాటికి దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని అంచనా.సంక్లిష్ట విధానాల్లో సౌలభ్యంగుండెకు సంబంధించినవి, క్యాన్సర్ (ఆంకాలజీ), ఆర్థోపెడిక్స్, వెన్నెముక, నరాల సంబంధమైనవి, జీర్ణాశయం, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ వంటి సంక్లిష్టమైన ప్రక్రియల కోసం రోబోటిక్ శస్త్రచికిత్సలను ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. వివిధ రకాల సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సంప్రదాయ పద్ధతులకు మించిన సౌలభ్యం, కచ్చితత్వం, నియంత్రణను రోబోటిక్స్ అందిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శస్త్రచికిత్సా వ్యవస్థలలో.. భారత్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నది ‘డా వించీ సర్జరీ విధానం’. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ద్వారా సుమారు 8 లక్షల సర్జరీలు జరిగాయట. మనదేశంలో నిర్వహించే అత్యంత సాధారణ క్లినికల్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థలో కెమెరా ఆర్మ్, శస్త్రచికిత్సా పరికరాలతో కూడిన యాంత్రిక చేతులు (మెకానికల్ ఆర్మ్) ఉంటాయి. శస్త్రచికిత్స చేసే టేబుల్ పక్కన కంప్యూటర్ కన్సోల్లో కూర్చుని ఈ యాంత్రిక చేతులను సర్జన్ నియంత్రిస్తారు. త్రీడీ వ్యూలో పెద్దగా, అధిక స్పష్టతతో శస్త్రచికిత్స చేపట్టే భాగాన్ని ఈ కన్సోల్ చూపుతుంది.మెరుగైన ఫలితాలు..అత్యవసరం కాని శస్త్రచికిత్సలకు రోబోటిక్స్ విభిన్న ప్రయోజనాలను అందించగలవని వైద్యులు అంటున్నారు. గాయం చుట్టుపక్కల కణజాలాలకు నష్టం తగ్గించేలా శస్త్రచికిత్సను కచ్చితంగా నిర్వహించడం ఇందులోని ప్రత్యేకత. రోబోటిక్స్తో మరో ప్రయోజనం ఏమిటంటే మరింత నియంత్రణ, స్పష్టంగా చూసే వీలు ఉండడంతో సంక్లిష్ట, వీలుకాని భాగాలనూ చేరుకోవచ్చు. అధిక సామర్థ్యం, శస్త్రచికిత్స తదనంతరం ఖర్చులు తగ్గడం, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటం, ఔషధ మోతాదు తగ్గడం తదితర ప్రయోజనాలు ఉండడంతో ఈ ప్రక్రియ దేశంలో క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.ఖరీదైన వ్యవహారమేరోబోటిక్ సర్జరీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి చేయాల్సిన ముందస్తు పెట్టుబడి ఆసుపత్రులకు ఆందోళన కలిగిస్తోంది. రోబోటిక్ సర్జరీలలో చార్జీలు కేసును బట్టి.. ప్రధానంగా శస్త్రచికిత్స రకాన్ని బట్టి మారతాయి. డా వించీ రోబోటిక్ సర్జరీకి అవసరమైన యంత్ర పరికరాల విలువ సుమారు రూ.14 కోట్ల నుంచి గరిష్ఠంగా 20 కోట్ల వరకు ఉంటుందట.వార్షిక నిర్వహణ వ్యయాలు రూ.87 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ప్రశ్నార్థకమేనని చెబుతున్నాయి. ఎస్ఎస్ ఇన్నోవేషన్ ్స ఇంటర్నేషనల్, మెరిల్ లైఫ్ సైన్సెస్, రిలయన్ ్స ప్రమోట్ చేస్తున్న యాడ్వర్బ్ టెక్నాలజీస్, మెడ్ట్రానిక్ వంటి కంపెనీలు ఈ అడ్డంకిని తొలగించడానికి భారీ అడుగులు వేస్తున్నాయి.అయితే రోబోటిక్ సర్జరీలపట్ల ప్రజల్లో అవగాహన పరిమితంగా ఉండడం, సమగ్ర బీమా కవరేజ్ లేకపోవడం వల్ల రోగులకు అధిక భారం పడుతోంది. సుమారు 70 శాతం తక్కువ ఖర్చుతో సంప్రదాయ పద్ధతుల్లో శస్త్ర చికిత్సలకు వీలుండడం ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రోబోటిక్ సర్జరీలు పెరుగుతుండడం గమనార్హం.రెండో స్థానంలో దక్షిణాది..దేశంలో సర్జికల్ రోబోల వినియోగంలో ఉత్తర భారతదేశంలోని ఆసుపత్రుల వాటా 35 శాతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ–ఎన్ సీఆర్ ఈ విషయంలో ముందుంది. ఆ తర్వాతి స్థానంలో 30 శాతం వాటాతో దక్షిణ భారతం నిలిచింది. -
గగనసింహాలకు బై బై!
బికనీర్: దశాబ్దాలపాటు భారత గగనతలాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చి కంటికి రెప్పలా కాపాడిన మిగ్–21 రకం యుద్దవిమానాలు ఇక శాశ్వత విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో చివరిసారిగా వీటిని ఫైటర్జెట్ పైలట్లు తమ విధి నిర్వహణ కోసం వినియోగించుకున్నారు. సోమవారం రాజస్తాన్లోని బికనీర్లో ఉన్న నాల్ ఎయిర్ఫోర్స్స్టేషన్ గగనతలంపై వైమానిక విన్యాసాలు పూర్తిచేశారు. వీటికి వీడ్కోలు సూచికగా ఇప్పటికే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఒక్కరే మిగ్–21ను నడిపి అలా గగనవీధిలో చక్కర్లు కొట్టివచ్చారు. ఏకంగా 62 సంవత్సరాలపాటు సేవలందించిన దిగ్గజ వాయుసేన విమానాలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. 23వ పాంథర్ స్క్వాడ్రన్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విధుల నుంచి రిటైర్కానుంది. సెప్టెంబర్ 26న చండీగఢ్లో భావోద్వేగ వీడ్కోలు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో మిగ్–21 యుద్ధవిమానాల ప్రస్థానంలోని కొన్ని ముఖ్య ఘట్టాలపై ఓసారి విహంగవీక్షణం చేద్దాం..1960 దశకంలో భారత్కు ఆగమనం..1963లో తొలిసారిగా రష్యా నుంచి భారత్ వీటిని కొనుగోలుచేసింది. తొలినాళ్లలో యుద్దాల్లో విజయాలకు బాటలువేస్తూ మిగ్–21 విమానాలు తమకు ఏవీ సాటిలేవని నిరూపించుకున్నాయి. దాదాపు 870కిపైగా మిగ్ విమానాలు వాయుసేనలో వివిధ దశల్లో తమ అమూల్యమైన సేవలు అందించాయి. భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్సోనిక్ ఫైటర్జెట్లుగా మిగ్–21ను చెప్పొచ్చు. గాల్లో చురుగ్గా కదలడం, అత్యధిక వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. మిగ్–21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాయి. 1965, 1971 యుద్ధాల్లో భారత చిరస్మరణీయ విజయాల వెనుక మిగ్ విమానాల కీలకపాత్ర ఉంది. అసమాన రికార్డ్మిగ్–21 రకం విమానాలు భారత్లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కీలక వైమానిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అత్యధికంగా ఉత్పత్తయిన యుద్ధవిమానాల్లో ఒకటిగానూ ఇది రికార్డ్ సృష్టించింది. ఇప్పటిదాకా 60కిపైగా దేశాల్లో ఏకంగా 11,000 మిగ్లను తయారుచేశారు. ఇది సెకన్కు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలదు.గవర్నర్ భవనంపై భీకర దాడి1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధవిమానాలు విరుచుకుపడిన తీరు ఎవరూ మర్చిపోరు. ముఖ్యంగా ఆనాడు డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై మిగ్–21 బాంబులతో దాడిచేసింది. దెబ్బకు జడుసుకున్న గవర్నర్ మరుసటి రోజే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు. 1999లోనూ కార్గిల్ యుద్ధంలో మిగ్లు సత్తా చాటాయి. ఆపరేషన్ సఫేద్సాగర్లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టంచేసింది. అత్యంత శక్తివంతమైన ఎఫ్–16ను సైతం నేలకూల్చి 2019 ఏడాదిలో మిగ్ పత్రికల పతాక శీర్షికలకెక్కింది. మిగ్–21 పాతబడినాసరే అందులోని కొన్ని సాంకేతికతలు అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా దాడి చేసేలా రాడార్, తదితర సాంకేతికతలు దీని సొంతం.ఎగిరే శవపేటికలుగా అపకీర్తితొలినాళ్లలో విజయ చిహ్నాలు గా చెలరేగి పోయిన ఈ విమానాలు కాలం గడిచేకొద్దీ పాతబడిపోయి ప్రాణాంతకంగా తయార య్యాయి. కాలం చెల్లిన మిగ్లను ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారనే విమర్శలూ ఎక్కువయ్యాయి. సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటి అవసరం సైతం తగ్గిపోయిందని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 పలు ప్రమాదాల్లో నేలకూలాయని పుష్కరకాలం క్రితం నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని పార్లమెంట్లో చెప్పారు. భారత వాయుసే నలో అత్యధికంగా కూలిపో యిన యుద్ధవిమానాలుగా ఇవి అపకీర్తిని మూటగట్టుకున్నాయి. 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో వీటికి తుది వీడ్కోలు పలకనున్నారు. -
ఎమ్మెల్యే బుడ్డాపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
తాడేపల్లి : అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ, ఎస్టీ, ఎస్సీ కమిషన్లకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి. దీనిపై ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుడ్డా మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్, బీట్ ఆఫీసర్ గురవయ్య, డ్రైవర్ కరీముల్లా, సిబ్బంది మోహన్కుమార్లపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘బాధితులు ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారు. వారందరినీ ఎమ్మెల్యే బుడ్డా కులదూషణ చేశారు. వారిపై దారుణంగా దాడి చేశారు. వారిని బలవంతంగా కారులో ఎక్కించి రాత్రంతా తిప్పారు ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డానే స్వయంగా కారు నడిపారు. అనంతరం వారిని ఒక గెస్ట్హౌస్కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ ఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 19, 21లను ఉల్లంఘించడమే. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 1989 కింద నేరం. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల గౌరవంపై తీవ్రమైన దాడి చేసినట్టే. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ఎమ్మెల్యే బుడ్డా పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి. -
అభిషేక్ సింఘ్వీతో తెలంగాణ మంత్రుల బృందం భేటీ
న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వ మంత్రుల బృందం. దీనిలో ఈరోఉ(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు.. కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై అభిషేక్ సింగ్వితో తెలంగాణ మంత్రుల బృందం చర్చలు జరిపింది. న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి సలహాలు తీసుకున్నాం. ఈ అంశంపై అధ్యయనం జరిపి ఆయన సలహాలు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత క్యాబినెట్కు మా నివేదిక అందజేస్తాం’ అని తెలిపారు. -
గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ఫోన్లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు. మొబైల్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్గంజ్లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్చేశారు. ఇటీవల ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది. పశ్చిమబెంగాల్లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్చేశాయి. #Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam. Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025 -
‘సమాజం కోసం రాజీ పడితే.. చివరికి మనిషే లేకుండా పోయింది’
న్యూఢిల్లీ: తన సోదరి నిక్కీ భాటి దారుణ హత్యకు గురి కావడంపై సోదరుడు రోహిత్ గుర్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి నిక్కీ భాటిని శాశ్వతంగా తిరిగి పుట్టింటికి తీసుకొచ్చినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నాడు. తన సోదరి నిక్కీ భాటి విషయంలో తాము రాజీ పడే బ్రతికామని, అందుకు ఇంతటి దారుణం జరిగిపోయిందన్నాడు. సమాజానికి జడిసి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడంలో వెనుకడుగు వేశామన్నాడు. సమాజంలో తమ పరువు పోతుందనే ఆలోచించాం కానీ సోదరీ పడే బాధను పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. ‘మేము మా సోదరీమణులు నిక్కీ, కాంచనాల కోసం రూ. 8 లక్షల ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాం. ఆ పార్లర్లు పెట్టించి సుమారు ఏడాదిన్నర అవుతుంది. బావలు విపిన్, రోహిత్ భాటిలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబానికి చిన్న కిరాణా దుకాణం మాత్రమే ఉంది. కానీ మా చెల్లెళ్లు వారి స్వయం శక్తితో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. భర్తల నుంచి ఎటువంటి నగదు అడగకుండానే కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మా చెల్లెళ్ల పార్లర్లను అత్త మామలు ధ్వంసం చేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోదరుడు గుర్జార్.భర్త విపిన్ భాటి బాధలు భరించలేక చాలాసార్లు తిరిగి పుట్టింటికి వచ్చేదని, కానీ వారు మళ్లీ బుజ్జగింపు మాటలు చెప్పి తిరిగి తీసుకెళ్లిపోయేవారని నిక్కీ భాటి కుటుంబం తెలిపింది. అతి దారుణంగా హత్య.. యూపీ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పరిధిలో సిర్సా గ్రామంలో విపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.మరో రూ. 35 లక్షలు కావాలని వేధింపులుమరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసి చివరికి అతి దారుణంగా ఒంటికి నిప్పంటించి హత్య చేశారు.యాసిడ్ పోసి లైటర్తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు -
పీఎం మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెబుతున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే 2016లో కేంద్ర సమాచార కమిషన్.. మోదీ డిగ్రీ రికార్డులను తనిఖీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ యూనివర్సిటీ. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) సీఐసీ ఆదేశాలను కొట్టేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది తెలుసుకునే హక్కు కంటే మిన్న అని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు,.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నా, అవి అపరిచితులతో పంచుకోవడం గోప్యత ఉల్లంఘన అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ మోదీ డీగ్రీ వివాదంపై జరుగుతున్న రాజకీయ వివాదానికి దాదాపు ముగింపు దొరికినట్లే కనబడుతోంది. -
ఉక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యుద్ధ గాయాలను నయం చేస్తోంది
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతీసిన మానసిక వేదన నుంచి బయటపడేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రామా రిలీఫ్, ధ్యానం,శ్వాసాభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు, స్థలచ్యుతులు, పిల్లలకు కొత్త ఆశను అందిస్తున్నాయి.సైనికులకు నిర్వహించిన మొదటి శిక్షణ శిబిరాలు హృదయాన్ని కలచివేశాయి. “వారి చేతులు, కాళ్లు గాయాలతో నిండిపోయాయి. కళ్లలో భయం, ఖాళీతనం స్పష్టంగా కన్పించాయి” అని ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు తెలిపారు. అయితే శ్వాసాభ్యాసాలు నేర్చుకున్న తర్వాత సైనికులు “ప్రశాంతత, భద్రత, స్థిరత్వం”ను అనుభవించినట్లు చెప్పారు.ఉక్రెయిన్ సైనిక నాయకత్వం గురుదేవ్ పనిని అధికారికంగా గుర్తించింది. బెటాలియన్ కమాండర్ స్వయంగా గురుదేవ్కు గౌరవ పురస్కారం అందజేస్తూ, “బాంబులు పడితే మేము పోరాడాము, కానీ మాలోని ఖాళీతనం, కోపం, ద్వేషం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల తర్వాత మా జీవితాలు మారాయి. గాయాలతో ఉన్నవారే ఇప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు” అని పేర్కొన్నారు.అంతేకాక, నాయకత్వ శిక్షణలు కూడా సైన్యానికి సహాయపడ్డాయి. “అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఈ శిక్షణ పెంచింది” అని సైన్యం అభినందించింది.2014 నుండి సైన్యంలో మోరల్ అండ్ సైకాలజికల్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న నటాలియా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిన్న గుంతల్లో దాక్కున్న సైనికుల్లో ఒకరు భయంతో కదలలేకపోయిన పరిస్థితిని వివరించారు. “అప్పుడు అతనికి విజయ శ్వాస గుర్తొచ్చింది. అది అతని ప్రాణం మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రాణాలను రక్షించింది” అని ఆమె తెలిపారు.2022 నుండి ఇప్పటి వరకు 8,000 మందికి పైగా సైనికులు, స్థలచ్యుతులు, ఆక్రమిత ప్రాంతాల పిల్లలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్లు ప్రమాదాలను లెక్క చేయకుండా సేవ చేస్తున్నారు. “అత్యవసరంగా అవసరమైన వారికి తోడుగా ఉండటం మాకు గౌరవం” అని ఒక ఇన్స్ట్రక్టర్ చెప్పారు.యుద్ధం ఎన్నో ప్రాణాలు, కలలను తీసుకుపోయినా, గురుదేవ్ అందిస్తున్నది శాంతి, ఆశ, తిరిగి నిర్మించుకునే శక్తి. “శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం కాదు, కరుణ ఉనికిలో ఉండడం” అని ఆయన అన్నారు. ఉక్రెయిన్లో చీకటి నడుమ వెలుగుకి మార్గం చూపుతున్న ఆ కరుణ ఇప్పుడు వేలాది హృదయాలకు ఆధారమవుతోంది. -
భారతీయులకు రష్యా శుభవార్త
మాస్కో: భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా రష్యాలోని పలు రంగాల్లో అనుభవజ్ఞులైన భారతీయులకు డిమాండ్ పెరిగింది. రష్యాలోని ప్రముఖ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్,మెషినరీ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే విషయాన్ని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్థానిక మీడియాకు వెల్లడించారు.రష్యాకు మ్యాన్పవర్.. భారతీయుల్లో నైపుణ్యం ఉంది.వాటికి అనుగుణంగా రష్యా వీసా నిబంధనలు మార్చింది. తద్వారా స్థానిక రష్యా కంపెనీలన్నీ భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇప్పటికే అధికమొత్తంలో రష్యాకు భారతీయులు వచ్చారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాలలో ఉన్నారు.వీటితో పాటు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో భారతీయుల డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.రష్యాకు భారతీయల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం తన సేవల్ని విస్తరించేందుకు మరింత ప్రయత్నిస్తుందని చెప్పారు. పాస్పోర్ట్లు అప్డేట్,అప్రూవల్ వంటి సేవలు వేగవంతం అవుతాయని తెలిపారు. -
దివ్యాంగులపై జోకులా.. కమెడియన్లకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: దివ్యాంగులపై జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు ఆగుతాయంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అసభ్యకరమైన జోకులు వేసిన కమెడియన్లను మందలించింది. ఇలాంటి షోల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేసినవారు తమ సామాజిక మాధ్యమాల్లో కూడా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సామేయ్ రైనా, విపున్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి కమెడియన్లు వికలాంగులను అపహాస్యం చేశారంటూ ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకూడదంటూ ధర్మాసనం హెచ్చరించింది.సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించింది. ఇలాంటి కేసులలో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం.. ఈ ఇన్ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానాపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వివాదం అనంతరం సమయ్ రైనా తన షో "ఇండియాస్ గాట్ లాటెంట్"ను నిలిపేసిన సంగతి తెలిసిందే. -
కోడలి వివాహేతరం సంబంధం.. రాగి ముద్దలో విషం పెట్టి..!
కర్ణాటక: అక్రమ సంబంధాల మోజులో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే వివాహిత తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. వివరాలు.. అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది ఆరగించిన దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు. -
‘నీ క్యారెక్టర్ బాగోలేదు.. నిన్ను పెళ్లి చేసుకోలేను’
తిరువొత్తియూరు(తమిళనాడు): చెన్నై వేప్పేరిలోని ఈ.వి.కె.సంపత్ రోడ్డులో కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యువకుడు దర్శన్(26). ఇతను చెన్నై ప్యారిస్లో హార్డ్వేర్ డీలర్షిప్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రేమ ఇతనికి, రాయపురం పుదుమనైకుప్పం కల్మండపం రోడ్డు ప్రాంతంలో నివశిస్తున్న 25 ఏళ్ల హర్షిదా అనే యువతికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ గత 1 1/2 సంవత్సరాలుగా భార్యాభర్తల్లా కాపురం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత అన్నానగర్లోని ఒక హోటల్లో ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. హర్షిదా దివ్యాంగురాలు. చిన్నప్పటి నుంచి ఎడమ కాలు బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరు కుటుంబాలు నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు చేశాయి. గత ఫిబ్రవరి 12న నిశ్చితార్థం ముగిసిన తర్వాత దర్శన్, హాసిద ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒక వారం క్రితం దర్శన్ హర్షిదకు ఫోన్ చేసి ‘నీ క్యారెక్టర్ బాగోలేదు. నువ్వు నాకు వద్దు. నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని చెప్పాడు. ఇది విని దిగ్భ్రాంతి చెందిన హర్షిద తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పిన హర్షిద, తాను దర్శన్తోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై శనివారం రాత్రి 9 గంటలకు వేప్పేరిలోని ఒక అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ఉన్న దర్శన్ ఇంట్లో ఇరు కుటుంబాలు చర్చలు జరిపాయి. దర్శన్, హర్షిద ఇద్దరూ విడిగా ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో హర్షిత, దర్శన్తో నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను వద్దు అనకు అని బ్రతిమిలాడింది. కాని దర్శన్ మనసు మార్చుకోకుండా కలిసి జీవించాలని నేను కోరుకోవడం లేదు. మనం ఇద్దరం విడిపోదామని చెప్పి, పెళ్లి చేసుకోనని కచ్చితంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన హర్షిద ఇక బ్రతికి ఉండటంలో అర్థం లేదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో హర్షిత మిద్దె పైకి వేగంగా పరిగెత్తి కిందకు దూకింది. రేకుల షెడ్డుపై పడింది. 7వ అంతస్తు బాల్కనీలో ఎండ పడకుండా వేసిన రేకుల షెడ్డుపై హర్షిత పడింది. దానిపై కూర్చున్నట్లే ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దీనికి దర్శన్ సమాధానమిస్తూ ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పి, మళ్లీ పెళ్లికి నిరాకరించినట్లు మాట్లాడాడు. దీంతో మరింత మనస్తాపం చెందిన హర్షిత, రేకుల షెడ్డు నుండి మళ్లీ కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వేప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ధన్ఖడ్ రాజీనామాపై అమిత్ షా స్పందన.. రాజ్యాంగ సవరణపై ఇలా..
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ధన్ఖడ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే, రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడుతూ.. రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf— ANI (@ANI) August 25, 2025ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా?. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా మోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?. బిల్లు కచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అని వ్యాఖ్యలు చేశారు. -
పుర్రె రహస్యం గుట్టురట్టు?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్లో మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ! కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది. గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.యూట్యూబర్ సమీర్ విచారణశివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
మాతృత్వానికే మాయని మచ్చ
శివమొగ్గ(కర్ణాటక ): ముద్దులొలికే శిశువును కన్నతల్లే అంతమొందించింది. శివమొగ్గ నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రి ప్రసూతి వార్డులో టాయ్లెట్లో నవజాత మగ శిశువును గొంతు కోసి హత్య చేసిన కేసులో హంతకురాలు ఎవరో కాదు తల్లే అని బయటపడింది. దావణగెరె జిల్లా హొన్నల్లి తాలూకా తిమ్లాపురానికి చెందిన శైలా ను అరెస్ట్ చేసి కారాగారానికి తరలించారు. దొడ్డపేట సీఐ రవి పాటిల్ వివరాలను వెల్లడించారు. 16న మెగ్గాన్ ఆస్పత్రి టాయ్లెట్లో గొంతు కోసి చంపిన శిశువు మృతదేహం కనిపించింది. ప్రసూతి వార్డులో చేరిన మహిళలు, శిశువుల వివరాలను సేకరించారు. పుట్టిన శిశువులందరూ వార్డులోనే ఉన్నట్లు గుర్తించారు. ఏం జరిగిందంటే.. కడుపునొప్పిగా ఉందని అదే రోజు ప్రసూతి వార్డులో చేరిన శైలాను ప్రశ్నించారు. శిశువు మృతదేహాన్ని చూపించి అడిగినా ఆమె ఒప్పుకోలేదు. పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. శైలకు ఇద్దరు పిల్లలున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అయ్యింది. కానీ ఇటీవల గర్భం దాలి్చంది. కుటుంబానికి చెప్పకుండా దాచిపెట్టింది. 16వ తేదీన ప్రసవవేదన రాగా, కడుపునొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన ఆమెకు శిశువుకు జని్మంచింది. ఆ శిశువు వద్దనుకున్న ఆమె కిరాతకురాలిగా మారిపోయింది. టాయ్లెట్కు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పురుషులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘోరానికి కుటుంబ వ్యవహారాలే కారణమని అనుమానాలున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు. -
అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్
ఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడటం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో, సైద్ధాంతిక చర్చలలో, రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు.BIG MONDAY MORNING DEVELOPMENT :Seven former Supreme Court judges, three former High Court chief justices and eight former High Court judges issue a public statement criticising Home Minister Amit Shah for misinterpreting Supreme Court's 2011 Salwa Judum judgement and…— Nagendar Sharma (@sharmanagendar) August 25, 2025న్యాయమూర్తుల బృందంలో ఉన్నది వీరే.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. కురియన్ జోసెఫ్, మదన్ బీ లోకూర్, జె.చలమేశ్వర్, ఏకే పట్నాయక్, అభయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్జిత్ సేన్ ఉన్నారు. మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.. గోవింద్ మాథుర్, ఎస్. మురళీధర్, సంజీబ్ బెనర్జీ ఉండగా.. సంజయ్ హెగ్డే, ప్రొఫెసర్ మోహన్ గోపాల్ వంటి ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు.అమిత్ షా విమర్శలకు స్పందన.. ఇక, అంతకుముందు.. సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డి విభేదించారు. అనంతరం, ఆయన స్పందిస్తూ.. సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని వ్యాఖ్యానించారు.నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెలిసిందే. -
నటి ఆరోపణలు.. ఎమ్మెల్యే రాహుల్కు బిగ్ షాక్
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్కు బిగ్ షాక్ తగిలింది. రాహుల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అంతకుముందు.. రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరి తర్వాత ఒకరు రాహుల్ బాధితులమంటూ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్కూటథిల్ రాజీనామా చేశాడు. తనను హోటల్ రూమ్కు రావాలని రాహుల్ వేధింపులకు గురిచేసినట్టు నటి రిని ఆరోపించారు.తర్వాత హిజ్రా ఒకరు రాహుల్పై సంచలన ఆరోపణలకు దిగారు. తనను అత్యాచారం చేస్తానంటూ రాహుల్ మమ్కూటథిల్ మెసేజ్లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్లు చేస్తానన్నోడిని రోల్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది. దీంతో, ఇటు మహిళల ఆరోపణలు, పార్టీ నుంచి, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
రీల్స్, బ్యూటీ పార్లర్.. నిక్కీ కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: నోయిడా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపిన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేసిన విపిన్.. ఏ మాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. ‘‘నేను చంపలేదు.. తనే చనిపోయింది’’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడు.నిక్కీ బ్యూటీపార్లర్ ఓపెన్ చేయడాన్ని విపిన్ వ్యతిరేకించడంతో పాటు.. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం కూడా హత్యకు గల కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. నిక్కీ మర్డర్ కేసులో విపిన్ తల్లి దయాభాటి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. కిరోసిన్ బాటిల్ అందించినట్లు నిక్కీ సోదరి కంచన్ ఫిర్యాదులో పేర్కొంది. దయాభాటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించారు.యూపీలో గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యతి్నంచి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు. సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్ బెంజ్ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్ పోసి మరీ నిప్పంటించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి.భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోశారు’’ అంటూ కంచన్ వాంగ్మూలమిచి్చంది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.సీన్ రీకన్స్ట్రక్ఛన్ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు.పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు. -
సీఎం రేఖా గుప్తాపై కత్తితో దాడి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నిందితుడిని విచారణగా.. సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడవాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి వద్ద భారీ భద్రత కారణంగా ప్లాన్ను అమలు చేయలేదని నిందితుడు చెప్పినట్టు జాతీయ మీడియా పలు కథనాల్లో పేర్కొంది. దీంతో, ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న సివిల్ లైన్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా ‘జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సకారియా రాజేశ్భాయ్ ఖిమ్జీభాయ్(41) ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. పత్రాలను అందిస్తూ.. సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కు తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె జట్టును గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.ఇక, అతడి విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో సకారియా..‘ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలని నేను చాలా సార్లు అభ్యర్థించా. దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లా. న్యాయస్థానం బయట సెక్యూరిటీ చూసి అక్కడి నుంచి వచ్చేశా. అనంతరం సివిల్ లైన్స్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లా. తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేశా. కానీ, భద్రతా ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయటే పడేశాను’ అని చెప్పినట్టు సమాచారం.🚨Pre-planned attack on Delhi Chief Minister Rekha Gupta?CCTV footage shows accused Rajesh Sakriya scouting her Shalimar Bagh residence a full day before the assault. Police have recovered videos of CM’s house from his phoneDuring a public hearing at her residence this… pic.twitter.com/F270zGKiY4— Nabila Jamal (@nabilajamal_) August 20, 2025 -
వరద విలయం.. వామ్మో.. ఆ గ్రామంలో రెండు కిలోమీటర్ల గొయ్యి
జైపూర్: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయకరంగా ఉంటుంది. రాజస్థాన్లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో 2 కిలోమీటర్ల పొడవైన పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామం, పొలాల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ గుంత 2 కిలోమీటర్లు పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉంది.వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీటి మునిగింది. వరద ఉధృతికి రెండు ఇళ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. పొలాల మీదుగా వచ్చిన నీరు గుంతలోకి ప్రవహించి జలపాతంలా మారింది.ఆ గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు యంత్రాల సహాయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.सवाई माधोपुर, राजस्थान के जाडावता गांव में भारी बारिश से स्थिति बेहद गंभीर हो गई है। यहाँ मानो 'नियाग्रा फॉल्स' फूट पड़ा है, जहाँ कभी अमरूद के बाग और हरे-भरे खेत हुआ करते थे, वहाँ अब पानी के तेज बहाव ने उन्हें एक गहरी नदी में बदल दिया है। पानी के लगातार कटाव से जमीन चौड़ी ..1/2 pic.twitter.com/poyX33CkPq— Lokesh kumar (@lkmeena8619) August 24, 2025రాజస్థాన్.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది.. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది కనిపిస్తోంది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇల్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటుకున్నారు. -
ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. 82 కోట్ల కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ వద్ద కొకైన్ను గుర్తించారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.82 కోట్లు విలువ చేసే 5.5 కిలోల కొకైన్ను సీజ్ చేశారు.వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ గోల్డ్ కలర్ చాక్లెట్స్లో కొకైన్ను నింపి తరలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు.. ఆమె వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ట్రంప్కు బిగ్ షాకిచ్చిన భారత్
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎట్టకేలకు భారత్ తన వైఖరిని బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్ కౌంటరిచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని కుండబద్దలు కొట్టింది.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా రష్యా ప్రభుత్వం వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం. ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి. దేశీయ ప్రయోజనాలకే కాపాడుకోవడానికే ఢిల్లీ ప్రాధాన్యం ఇస్తుంది. భారత్లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో సహకారంలో భాగంగా చమురు మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడింది.🚨 BIG STATEMENT Indian Envoy to Russia, Vinay Kumar, SLAMS US move to impose 25% tariffs on INDIA for buying Russian oil.— Calls it ‘Unfair, Unreasonable & Unjustified.’— Says Indian companies will KEEP buying oil from Wherever they get the best deal. pic.twitter.com/yyiHjhpkFA— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) August 25, 2025భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైనది. భారత్ ప్రభుత్వం ఎల్లప్పుడు దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రష్యాతో అమెరికా సహా పలు యూరప్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిపై మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదు అని ప్రశ్నించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్.. రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. భారత్.. రష్యా ముడి చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణను భారత్ తిరస్కరించింది. -
UP: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ట్రాక్టర్ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ట్రాక్టర్ రాజస్థాన్లోని గోగామేడికి కాస్గంజ్ నుంచి బయలుదేరింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు.అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్షహర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తెలిపారు. కాస్గంజ్ జిల్లాలోని 60 నుంచి 61 మంది భక్తులు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది.ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్ను ఘటన స్థలంనుంచి తొలగించారు. ఈ ఘటన భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిలింది.#WATCH उत्तर प्रदेश | बुलंदशहर थाना अंतर्गत राष्ट्रीय राजमार्ग 34 पर घटाल गांव के पास, कासगंज से राजस्थान के गोगामेड़ी जा रहे गोगाजी के भक्तों से भरे ट्रैक्टर को एक कंटेनर ने टक्कर मार दी, जिससे 8 लोगों की मौत हो गई और 43 घायल हो गए हैं। pic.twitter.com/CDsRntamck— ANI_HindiNews (@AHindinews) August 25, 2025 -
ప్రాణాలు పణంగా పెట్టి విధులకు..
మండి: తండాల్లో ఉన్న గిరిజనులకు వైద్యం అందించడానికి కొండ, కోనల్లో కిలోమీటర్లు నడిచిన నర్సులను తెలుగు రాష్ట్రాల్లో చూశాం. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఈ నర్సు... విధి నిర్వహణకోసం ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని సైతం లెక్క చేయడం లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను చేరుకోవడానికి గర్జిస్తూ ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్తున్నారు. మండి జిల్లాకు చెందిన నర్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని టిక్కర్ గ్రామానికి చెందిన కమల పక్కనే ఉన్న గ్రామంలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె విధులకు హాజరు కావడానికి ప్రతిరోజూ దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆమె రోజువారీ ప్రయాణం కష్టంగా మారింది. నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆమె నదిలోని రాళ్లను దాటుతూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఒక్క అడుగు తప్పుగా వేసినా.. నదిలో కొట్టుకు పోవాల్సిందే. అయినా.. ఏమాత్రం వెరవకుండా వెళ్తుండటం చూసేవాళ్లకు వణుకు పుట్టిస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా వారాల్లో చౌహార్ లోయ విస్తృతంగా నష్టపోయింది. వంతెనలు, రోడ్లు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ అంతటా 313 రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. వాటిలో 160 మండి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో సిల్బుధాని, తర్సా్వన్ వంటి పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. కమల వంటి అనేక మంది ఉద్యోగులు, కారి్మకులు, స్థానికులు తమ రోజువారీ కార్యకలాపాలకోసం ఇలాంటి కాలువలు, వాగుల మీద ప్రమాదకర క్రాసింగ్లపై ఆధారపడుతున్నారు. -
దివి నుంచి నిర్విఘ్నంగా భువికి..
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్ ప్రాజెక్టు’లో అత్యంత కీలకమైన ‘క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్’విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తిరిగి భూమిని చేరే సమయంలో వారు ప్రయాణించే మాడ్యూల్ను సురక్షితంగా నేలకు దింపటంలో నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇస్రో, డీఆర్డీఓ, ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్గార్డ్ ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా డమ్మీ మాడ్యూల్ను ఆదివారం భూమికి 35 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు. అది భూ ఉపరితలానికి మూడు కిలోమీటర్ల సమీపానికి చేరుకోగానే అందులోని పారాచ్యూట్ తెరుచుకుంది. దీంతో మాడ్యూల్ వేగం నిర్దేశిత స్థాయికి నియంత్రించబడి బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. దానిని కోస్ట్గార్డ్ సిబ్బంది మెషీన్ బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ–01)గా పిలుస్తున్న ఈ ప్రయోగం ఇస్రోకు మొదటిది. గగన్యాన్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి జీ–1 పేరుతో ప్రయోగాత్మక పరీక్షకు ఇస్రో సిద్ధమవుతోంది. 2035 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావాలని నిర్ణయించింది. అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్ (బీఎస్ఎస్) నిర్మాణానికి ఇప్పటికే స్పేడెక్స్ ఉపగ్రహాలను ప్రయోగించి డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈలోపు గగన్యాన్కి సంబం«ధించి పలు పరీక్షలు చేపట్టనున్నారు. అందులో భాగంగానే శ్రీహరికోటలోని షార్ నుంచి తాజాగా క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించారు. ఈ ప్రయోగం క్రూ మాడ్యూల్లోని వివిధ పరికరాలు, ప్యారాచూట్ సమర్థత, పనితీరుతోపాటు వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన పరిస్థితుల అధ్యయనానికి దోహదపడుతుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. -
రాజ్యాంగ రక్షణకు పాటుపడతా
సాక్షి, చెన్నై: తనను ఆదరించి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమిళనాడులోని ఎంపీల మద్దతును కూడగట్టుకునేందుకు చెన్నైలో ఆదివారం సాయంత్రం సుదర్శన్ రెడ్డి పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్తో సమావేశమయ్యారు. చెన్నై టీనగర్లోని ఓ హొటల్లో జరిగిన సమావేశంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, వీసీకే తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ‘‘ నేనిప్పుడు నా గురించి చెప్పుకోదల్చుకోలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేనిచ్చిన తీర్పులనూ ప్రస్తావించదల్చుకోలేదు. నా తీర్పుల కంటే ఇప్పుడు మీరు నా విషయంలో ఇచ్చే తీర్పు(ఓటు వేయడం) అత్యంత కీలకం. నాకు అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా’’ అని సుదర్శన్ రెడ్డి చెప్పారు. -
సీఐఎస్ఎఫ్లో మహిళా కమాండో బృందాలు
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)పూర్తిగా మహిళా కమాండోలతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రత్యేకంగా తర్ఫీదు పొందే ఈ బృందాల సేవలను ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో వినియోగించుకుంటామని సీఐఎస్ఎఫ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో విధుల్లో ఉన్న 100 మంది మహిళా బలగాలను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి మధ్యప్రదేశ్లో ఉన్న బర్వాహా ట్రెయినింగ్ సెంటర్లో కమాండ్ నైపుణ్యాలపై 8 వారాల శిక్షణ త్వరలోనే మొదలవుతుందన్నారు. దేశంలోని 68 పౌర విమానాశ్రయాలతోపాటు ఢిల్లీ మెట్రో, ఇతర కీలకమైన ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు 1.70 లక్షల మంది సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. ఇందులో 12,491 మంది మహిళలున్నారు.2026లో సీఐఎస్ఎఫ్లోకి మరో 2,400 మందిని చేర్చుకుంటారు. ఈ విభాగంలో మహిళల ప్రాతినిథ్యాన్ని విడతల వారీగా కనీసం 10 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. -
అర్థవంతమైన చర్చలు లేకుంటే... సభలు జీవచ్ఛవాలే!: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ‘‘సభల్లో అలజడి సృష్టించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఇది మంచి పరిణామం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు, అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు’’ అన్నారు. సభాపతులు తమ పనితీరుతో ఆ పదవి ఔన్నత్యం పెంచాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చకు నిష్పాక్షిక వేదికగా సభలను తీర్చిదిద్దాల్సిన, వాటిలో పక్షపాతానికి తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. లేదంటే సభలు జీవచ్ఛవాలతో సమానమే’’ అన్నారు. అఖిల భారత స్పీకర్ల సదస్సును ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రారంభించారు. స్పీకర్లు, శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సభల్లో అర్థవంతమైన సంవాదాలు జరగకపోతే దేశానికి తీరని నష్టమన్నారు. ‘‘చర్చలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం సహించరానిది. విపక్షాలు సంయమనం పా టించాలి. కార్యకలాపా లు సజావుగా సాగేలా సహకరించాలి’’ అని సూచించారు. ద్రౌపదికి జరిగిన అవమానం నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఎన్నో విపరిణామాలకు దారితీసిందని అమిత్ షా గుర్తుచేశారు. ‘‘సభా గౌరవం దిగజారితే దేశంలో కూడా అలాంటి దుష్పరిణామాలు తప్పవు. స్పీకర్ సారథ్యంలో జరిగే చర్చలతో దేశానికి ఎనలేని మేలు జరుగుతుంది. చట్టసభల భవనాలు జీవం పోసుకుంటాయి. స్పీకర్ అంటే సంరక్షకుడు, సేవకుడు. సమస్యల పరిష్కారానికి మేధోమథనమే ఉత్తమ మార్గం. ‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయి సోదరుడు, స్వాతంత్య్ర యోధుడు విఠల్భాయి పటేల్ వందేళ్ల క్రితం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. మన దేశంలో శాసనసభ చరిత్ర అప్పుడే మొదలైంది. అలాంటి విఠల్భాయి చరిత్ర ఇన్నాళ్లూ మరుగున పడింది’’ అని ఆవేదన వెలిబు చ్చారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు సదస్సులో మాట్లాడారు. -
చెరుగుతున్న చేతిరాత
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. చేతిరాత దాదాపుగా చచ్చిపోతోంది. డిజిటల్ అవకాశాలు చేతిరాత అవసరాన్నే దాదాపుగా తగ్గించేశాయి. రాత అవసరమైన కెరీర్ను పక్కకు పెట్టే అవకాశం వచ్చింది. ఒకప్పుడు చొక్కా జేబులకు హుందాగా వేలాడిన పెన్ను ఇప్పుడు అలంకారప్రాయంగా కూడా మిగలని పరిస్థితి! కాలేజీ విద్యార్థులు టైపింగ్, టెక్స్టింగ్ చేయడం లేదా వాయిస్ నోట్స్ పంపడం చేస్తున్నారు. స్క్రీన్లపై, వ్యాకరణ స్లిప్లు, అక్షర దోషాలు కూడా ఆటోకరెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి డిజిటల్ యుగంలో ఇంకా విద్యార్థులకు ‘చేతిరాత’శిక్షలు అవసరమా? ఇది ఇప్పుడు పాఠశాలలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. ‘పేలవమైన చేతివ్రాతను శిక్షించడం మానేయాలి. విద్యార్థి పనిని ప్రదర్శన కోసం కాకుండా కంటెంట్ కోసం అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతులను అన్వేషించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ పిల్లలకు వ్యక్తిగత రచన కోసం ప్రైవేట్ స్థలాన్ని ఇవ్వాలి. యువతకు రాయడానికి, విఫలమవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. వారిని శిక్షించే పద్ధతులను మార్చండి’అని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగడలు చేతిరాత భయం యొక్క మూల కారణాలను తొలగిస్తాయి. రాయడం ముఖ్యమైన జీవిత నైపుణ్యమే. అలాంటి చోట పెన్ను ఒక సాధనంగా ఉండాలే తప్ప.. బెదిరింపు ఆయుధంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు. గ్రాఫో ఫోబియా ‘ముత్యాల్లాంటి అక్షరాలు.. రాత చూస్తేనే మార్కులు పడిపోతాయి’అందమైన చేతిరాత ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులిచ్చే కితాబు. ‘ఏంట్రా ఈ కొంగలు తొక్కిన రాత.. ఇట్లా రాస్తే ఏం అర్థమవుతుంది?’... ఇవి రాత బాగలేని వారికి పడే చివాట్లు. ఇప్పటికీ మన దేశంలోని తరగతి గదుల్లో టీచర్స్ నోట వినబడే ముచ్చట్లు. అవును చేతిరాతలు ఒకప్పుడు తలరాతలను మార్చాయి. కొందరికి మాత్రం ఫోబియాను మిగిల్చాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చేతిరాత కళపై చర్చ జరుగుతోంది. చేతిరాత అనగానే గుర్తొచ్చేది కాపీరైటింగ్ నోట్స్. తెలుగుకోసం డబల్ రూల్.. ఇంగ్లిష్ కోసం ఫోర్ రూల్ బుక్స్. రాత బాగుపడటం కోసం పదేపదే రాయించే టీచర్స్. రాత బాగోకపోతే టీచర్లతో పడే తిట్లు. బాగున్నందుకు అందే మెచ్చుకోళ్లు. పాఠశాలలో ఉండగా డైరీ ఎంట్రీలు.. యవ్వనంలో ప్రేమ లేఖలు. అవి కొందరిని సృజనాత్మక రచనలోకి మారేలా చేస్తే.. రాత సరిగ్గా లేని కొందరినీ భయంలోకి నెట్టేశాయి. అందుకే.. చిన్న దరఖాస్తు.. అందులో రాయాల్సిందల్లా పేరు, చిరునామా, తేదీ మాత్రమే. అయినా సరే.. పెన్ను, పేపర్ తాకగానే ఓ బెరుకు.. అక్షరం ముందుకు కదలదు. అబ్బా ఆన్లైన్ ఫామ్ పెట్టొచ్చు కదా.. ఎంత వయసొచ్చినా సరే.. ఇప్పటికీ కొంతమందికి ఉండే ఫోబియా ఇది. చేతిరాత సరిగా లేక.. బాల్యంలో టీచర్ చేత తిన్న తిట్లు గుర్తుకు వచ్చి కలిగే భయం. దీనిని గ్రాఫోఫోబియా (చేతివ్రాత భయం), స్క్రిప్టోఫోబియా (బహిరంగంగా రాయడానికి భయం) అని పిలుస్తారు. బాల్యంలో చేతిరాత సరిగా లేకపోవడం వల్ల ఎంతో మందికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఆ తరువాత ఉన్నత విద్యను, ఆపైన కెరీర్ను కూడా ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు.శిక్షగా రాత! భారత విద్యా వ్యవస్థలో నేటికీ చేతిరాతే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవల ముంబైలోని ఒక ట్యూషన్ టీచర్ చేతి రాత సరిగా లేదని ఎనిమిదేళ్ల బాలుడి చేతిని కొవ్వొత్తితో కాల్చిన విషయం తెలిసిందే. క్లాస్రూమ్లో చేసిన తప్పులకు శిక్షగా కూడా ఈ చేతిరాతనే ప్రయోగిస్తుంటారు ఉపాధ్యాయులు. క్లాసు జరుగుతుండగా మాట్లాడిన విద్యారి్థతో ‘నేను మళ్ళీ తరగతిలో మాట్లాడను’అని 200 సార్లు రాయమని సూచించడం అందుకో ఉదాహరణ. చేతిరాతలో జెండర్ పాత్ర కూడా ఉంది. అమ్మాయివై ఉండి ఇట్లా రాస్తే ఎట్లా.. అని టీచర్లతో తిట్లుతిన్న అమ్మాయిలనేకం. ఆ ఒత్తిడి కొందరికి కాలిగ్రఫీ, స్టెనోగ్రఫీ లాంటివాటిపై ప్రేమను పెంచితే.. పదేపదే విమర్శలు మరికొందరికి అవమాన భారాన్ని మిగిల్చాయి. ఈ శిక్షలు రాయడాన్ని శిక్ష, అవమానంగా అలవాటు చేశాయి. పేలవమైన చేతిరాత భయంతో రాయడం మానేశామని 36.3% మంది విద్యార్థులు 2012 జరిగిన ఓ అధ్యయనంలో చెప్పారంటే.. తీవ్రత ఏపాటిదో అర్థమవుతుంది. ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్, ఈమెయిల్.. వీటన్నింటికీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో పాస్వర్డ్తో సంరక్షణ ఉంది కాబట్టి ఎవరో చూస్తారనే భయం లేదు. కానీ.. యువతకు గోప్యత అంటూ లేని కాలంలో.. తమ డైరీనో లేఖనో దొరికితే.. కలిగే అవమానం, శిక్ష.. చేతిరాతను జీవితాంతం ట్రామాగా మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ.. మెదడులోని హిప్పోకాంపస్, లింబిక్ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇది శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే రాయడానికి పెన్ను పట్టుకోగానే వారికి చేతిలో వణుకు, అరచేతులకు చెమటలు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, తిమ్మిర్లు రావడం, మణికట్టు నొప్పి వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు వారు ఎదుర్కొన్న అవమానాల తాలూకు మానసిక సంకేతాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెల్త్కేర్ కోర్సుల ఆన్లైన్ బోధనపై యూజీసీ నిషేధం
న్యూఢిల్లీ: సైకాలజీ, న్యూట్రిషన్ తదితర హెల్త్కేర్ సంబంధిత రంగాల కోర్సులను ఇకపై ఆన్లైన్, దూరవిద్యా విధానంలో అందించరాదని ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ కోరింది. దీనిపై నిషేధం 2025 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. నిషేధిత కోర్సుల్లో సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ ఉన్నాయని వెల్లడించింది. వచ్చే విద్యా సెషన్ నుంచి ఆయా కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవద్దని యూజీసీ కార్యదర్శి జోషి కోరారు. ప్రాక్టికల్స్ కీలకమైన హెల్త్కేర్ కోర్సులను ఆన్లైన్/దూరవిద్య ద్వారా అందించడం వల్ల నాణ్యత దెబ్బతింటున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
‘ఆత్మనిర్భర్’లో నూతన అధ్యాయం గగన్యాన్ మిషన్
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో ‘గగన్యాన్ మిషన్’ నూతన అధ్యాయానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. గగన్యాన్ యాత్రకు ఎంపికైన వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్లను ఆదివారం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంతరిక్షం రేపటి మన ఆర్థికం, భద్రత, ఇంధనం అని రాజ్నాథ్ అన్నారు. గగనయాన్ వంటి కీలక మిషన్ల కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. వైమానిక దళానిదే ఘనత: శుక్లా భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ గురించి బాల్యంలో విని అంతరిక్ష ప్రయోగాల పట్ల ఆసక్తి పెరిగిందని శుక్లా చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకున్నానంటే ఆ ఘనత వైమానిక దళానిదేనన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిరావడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి అని వివరించారు. -
బీజేపీ కొత్త సారథి... ఎంపిక త్వరలో?
న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వేగవంతం చేసింది. నూతన అధ్యక్షుడి పేరును అతి త్వరలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. సెపె్టంబర్ 5 నుంచి 7 దాకా రాజస్తాన్లోని జోధ్పూర్లో జరిగే ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వ సమావేశం ఇందుకు వేదిక కానుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, ముఖ్య సంఘ్ నేతలు, అనుబంధ విభాగాల నేతలతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యనేతలు కూడా చర్చల్లో పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలపైనా భేటీలో చర్చిస్తారు. మరోవైపు పలు కీలక రంగాల ప్రముఖులతో భాగవత్ ఈ నెల 26 నుంచి 28 దాకా ఢిల్లీలో భేటీ కానున్నారు. -
చిరాగ్, పెళ్లి చేసుకో!
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. ‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. బుల్లెట్ ర్యాలీలో... రాహుల్కు ముద్దు అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు. -
బీజేపీ, ఈసీ మిలాఖత్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో బిహార్లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్లో ఎస్ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘ఇండియా’దే గెలుపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు. -
భారత్ ఎకానమీకి 'పర్యాటకం' దన్ను
దేశీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతరం పర్యాటకం తిరిగి పూర్వ స్థాయిని మించి పుంజుకుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రెండూ బలంగా విస్తరిస్తున్నప్పటికీ, వసతి మౌలిక సదుపాయాలలో గణనీయమైన కొరత ఉందని నీతిఆయోగ్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పీక్ సీజన్లలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా హోటల్ గదుల కొరత ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో హోమ్ స్టేలు కీలక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని, వాటి విస్తరణకు మరిన్ని మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. –సాక్షి, అమరావతిప్రత్యామ్నాయ వసతి రంగం పురోగతిపర్యాటక రంగం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో వసతి మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ వసతి కీలక పరిష్కారంగా నిలుస్తోంది. కొత్త హోటళ్ల నిర్మాణానికి అధిక పెట్టుబడి, నియంత్రణ ఆమోదాలు, భూమి లభ్యత అవసరం. అయితే, హోమ్ స్టేలు తక్కువ ఖర్చుతోనే చక్కటి వసతి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలు, ద్వితీయ–తృతీయ శ్రేణి నగరాలకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకంతో వీటిని అనుసంధానం చేయాలని నివేదిక సూచించింది. హోమ్ స్టేల కోసం కేంద్రం, రాష్ట్రాలు ఒక నమూనా విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివేదిక సిఫారసు చేసిన అంశాల్లో.. కొత్త ఆపరేటర్లకు సాంకేతిక సహాయం, ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యం, ఉత్తమ పద్ధతులపై మార్గదర్శకం, ఆర్థిక, ఆర్థికేతర రాయితీలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, నీరు, విద్యుత్, ఆస్తి పన్నులలో నివాస రేట్ల రాయితీలు, హోమ్ స్టే రిజి్రస్టేషన్ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ఉన్నాయి. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. » 2024లో ప్రయాణ–పర్యాటక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.21.15 లక్షల కోట్లు అందించింది. ఇది 2019తో పోలిస్తే 21 శాతం పెరుగుదల. » వచ్చే దశాబ్దంలో ఈ రంగం రూ.43.25 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థకు అందజేస్తుంది. ఇది దేశ జీడీపీలో 7.6 శాతంగా ఉంటుంది. » 2024లో దేశీయ పర్యాటకులు రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019తో పోలిస్తే దాదాపు 25 శాతం అధికం. 2034 నాటికి ఈ ఖర్చు రూ.28.70 లక్షల కోట్లు చేరనుంది. » అంతర్జాతీయ పర్యాటకులు 2024లో రూ.2.85 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2034 నాటికి అది రూ.4.07 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. » ప్రస్తుతం పర్యాటక రంగంలో 4.32 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే, ప్రతి 11 ఉద్యోగాలలో ఒకటి ఈ రంగానిదే. 2034 నాటికి ఈ రంగంలో ఉపాధి 6.3 కోట్లకు పెరుగుతుంది. » పర్యాటకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన ప్రయాణాలపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. » 87 శాతం మంది పర్యాటకులు కొత్త గమ్యస్థానాల్లో పర్యటించి, ఆ అనుభూతులను పదిలపరచుకోడానికి దీర్ఘకాల పర్యటనలను కోరుకుంటున్నారు. » వర్కేషన్స్ (విహార ప్రదేశంలో ఉంటూ పని చేయడం), డిజిటల్ నోమాడ్ (స్థిర నివాసం లేకుండా, ప్రపంచంలోని ఏ ప్రదేశం నుంచైనా ఆన్లైన్లో పని చేసేవాడు) సంస్కృతి పెరుగుతున్నందున దీర్ఘకాల వసతిపై డిమాండ్ పెరిగింది. » హోమ్ స్టేలు, ఆఫ్బీట్ అలాగే గ్రామీణ పర్యాటకం వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ హోమ్ స్టే మార్కెట్ 2024లో రూ.4,722 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. » ఈ మారుతున్న ధోరణులు పర్యావరణ హిత, వెల్నెస్ టూరిజం, గ్రామీణ హోమ్ స్టేల వంటి ప్రత్యామ్నాయ పర్యాటక నమూనాలకు దారి తీస్తున్నాయి. -
పేరెంట్స్.. ముందు మీరు పాటించండి
పిల్లల్ని ఎంత ముద్దు చేసినా, వారికి బుద్ధుల్ని నేర్పించే వయసొకటైతే వచ్చేస్తుంది. అప్పుడిక క్రమశిక్షణ అలవాటు చేయాల్సిందే. అయితే ఆ శిక్షణ.. శిక్షలా ఉండకూడదు. ముద్దార నేర్పించినట్లుగా ఉండాలి. పిల్లలు మెత్తటి మట్టి ముద్దల్లాంటి వారు. వారిని చక్కగా మలచటం పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అనే సామెత ఎలాగూ ఉన్నదే! వాళ్లు మొక్కలుగా ఉన్నప్పుడే.. వాళ్లు మంచి అలవాట్లు, బాధ్యతలు నేర్చుకోవాలంటే.. అవి చేసి చూపించాల్సింది, పాటించాల్సింది మొదట తల్లిదండ్రులే.స్కూల్లో టీచర్లు చదువు నేర్పటానికి ఒక సిలబస్ ఉన్నట్లే, ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పటానికి కూడా 6 సబ్జెక్టుల సిలబస్ ఒకటి ఉంది : ఆహారం, ఆటలు, నిద్రవేళలు, సమయపాలన, నియంత్రణ, సంభాషణ. ఈ ఆరు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయవలసింది పిల్లలు కాదు. తల్లిదండ్రులు! ఆ ఆరు సబ్జెక్టులు, ఆరు సిలబస్లు ఏమిటో చూద్దామా..– సాక్షి, స్పెషల్ డెస్క్సబ్జెక్ట్ 1 ఆహారం పిల్లలు అడిగినా అడగకున్నా ఏదో ఒకటి తినిపిస్తూ, తినేందుకు ఇస్తూ పేరెంట్స్ తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. స్కూలుకు వెళ్లడానికి మారాం చేస్తే ఏదో ఒకటి షాపులో కొని ఇస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు.. జంక్ఫుడ్ ఎంత ప్రమాదకరమో! వారంలో ఎక్కువ రోజులు హోటళ్ల నుంచో లేదా ఆన్లైన్ ద్వారానో ఆహారం తెప్పించుకుని ఇంట్లో తినడం చేస్తే.. పిల్లలకు ఇక ఏం చెప్తాం?ఎలా నేర్పించాలి?చాక్లెట్లు, జంక్ఫుడ్, బయటి ఆహారం వంటివి ఎంత ప్రమాదకరమో వీడియోల ద్వారా వారికి అర్థమయ్యేలా చూపించాలి. కాస్త పెద్ద పిల్లలైతే పత్రికల్లో కథనాలు చూపించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి వెబ్సైట్లలో సమాచారం చూపించాలి. తాజా పండ్లు, కూరగాయల వల్ల ప్రయోజనాలు తెలియజెప్పాలి. మీరు చెప్పే వాటిలో.. మీమీ ఆరోగ్య పరిస్థితులను బట్టి.. వీలైనంతవరకు పిల్లలతో కలిసి తినాలి.సబ్జెక్ట్ 2ఆటలు పిల్లలకు కూడా వయసుకు తగిన శారీరక శ్రమ అవసరం. అవి లేకనే పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా నేర్పించండి: పిల్లలతో కలిసి మీరూ ఇంటి పనులు చేయండి. కలిసి తోట పని చేయండి. వాకింగ్ చేయండి. వాటి ప్రయోజనాలు వాళ్లకు వీడియోలు లేదా పత్రికల్లో కథనాల ద్వారా తెలియజేయండి. సబ్జెక్ట్ 3నిద్ర వేళలు వేళకు నిద్రపోవటం, నిద్ర లేవటం మంచి అలవాటు. కానీ, చాలామంది పిల్లలు ఉదయాన్నే లేవరు. దాంతో వాళ్లను లేపి, రెడీచేసి, టిఫిన్ తినిపించేసరికి తల్లులకు తలప్రాణం తోకకి వస్తుంది. మీరే ముందు లేవండిసూర్యోదయానికంటే ముందే లేవడం మొదట తల్లిదండ్రులే ప్రారంభించాలి. ఇందుకోసం ముందు చేయాల్సిన రెండు విషయాలు.. రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం, బద్ధకాన్ని వదిలించుకోవడం. ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు పిల్లలకు చెప్పండి. విజయవంతమైన వ్యక్తులంతా.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచినవాళ్లేనని వాళ్ల జీవిత చరిత్రలు వివరించండి. పిల్లలను.. వాకింగ్ చేద్దామనో, అలా మేడమీదకు ఎండలోకి వెళ్లివద్దామనో నిద్రలేపండి. మొదట్లో లేవరు. కానీ, లేపడం మానొద్దు. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు వాకింగ్కో లేదా మేడమీదకో వాళ్లను తీసుకెళ్లినప్పుడు వాళ్లకు నచ్చిన విషయాలు జరిగితే వాళ్లే రోజూ మిమ్మల్ని లేపుతారు.సబ్జెక్ట్ 4సమయపాలనఅందరికీ ఉండేవి ఆ 24 గంటలే. అందులోనే మన నిత్య కృత్యాలకు, ఇతర పనులకు ఎంత సమయం కేటాయిస్తాం అన్నదానిపై మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మీరు ఫాలో అవ్వండిమీరు ఒక టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని మీ ఇంట్లో ఒక గోడమీదనో మరోచోటో అంటించండి. దాన్ని చూసుకుని మరీ ఫాలో అవ్వండి. ప్రతిసారీ టిక్కులు పెట్టండి. మీరు చూస్తున్న, చేస్తున్న విషయం పిల్లలకు తెలియాలి. నెమ్మదిగా వాళ్ల బెడ్రూమ్లో కలర్ఫుల్గా వాళ్లతోనే ఒక టైమ్ టేబుల్ తయారుచేయించండి. లేదా వాళ్లే తయారుచేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్లు కూడా మీలాగే చేసేందుకు ప్రయత్నిస్తారు. మొదట్లో.. వాళ్లు విజయవంతంగా దాన్ని ఫాలో అయిన ప్రతిరోజూ ఒక ప్రశంస లేదా బహుమతి ఏదో ఒకటి ఇవ్వండి. తరువాత వాళ్లకు మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అన్నీ చేసేస్తారు.సబ్జెక్ట్ 5నియంత్రణ సోషల్ మీడియా వచ్చాక పెద్దలకు, పిల్లలకు కూడా స్మార్ట్ ఫోనే లోకం అయిపోయింది. టీవీలు చూస్తూ తినడం చేస్తున్నారు. చాలామంది పెద్దలు పిల్లలు చదువుకుంటుంటేనో, వాళ్లు చూస్తుండగానో లేదా వాళ్లతోనో.. గంటల తరబడి రీళ్లూ, వీడియోలూ, టీవీలో సినిమాలూ / వెబ్సిరీస్లూ చూస్తుంటారు. మీకు మీరే నియంత్రించుకోండిసోషల్ మీడియా, టీవీ ఉచ్చులోంచి ముందు మీరు బయటపడండి. పిల్లల ముందు, వాళ్లు చదువుకుంటున్నప్పుడు ఫోన్లో వీడియోలు చూడటం తగ్గించండి. అలాగే భోజన సమయంలో టీవీ ఆఫ్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా రాత్రుళ్లు టీవీలూ ఫోన్లూ తగ్గించండి. ఉదయాన్నే త్వరగా లేవగలుగుతారు.సబ్జెక్ట్ 6సంభాషణ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంటి వారినైనా ఎక్కడైనా బతికేలా చేయగలవు. ఇందుకు ప్రధానమైనవి.. సంభాషణా చాతుర్యం, మాటల్లో స్పష్టత, అవసరమైన చోట మృదుత్వం, ధైర్యంగా భావవ్యక్తీకరణ. ఇవి పిల్లలు.. బడిలో టీచర్లు, ఇంట్లో మిమ్మల్నే చూసి నేర్చుకుంటారని మర్చిపోవద్దు.పిల్లలతో మాట్లాడండి.. వినండితల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా, పిల్లల కోసం తీరిక చేసుకోవాలి. వారి స్కూలు విషయాలను అడిగి తెలుసుకుంటుండాలి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఆ నమ్మకం వారికి కలగకపోతే వారు మనసువిప్పి మీతో మాట్లాడటం మానేస్తారు. సెలవు రోజుల్లో వారిని మీతోపాటు మార్కెట్కో, షాపుకో తీసుకెళ్లండి.. బయట ఎలా మాట్లాడాలో వాళ్లే నేర్చుకుంటారు.ఓపిక పట్టండిపిల్లలకు మంచి అలవాట్లు నేర్పటానికి పెద్దలకు ఓర్పు అవసరం. » పిల్లలు అలవాటు పడేంత వరకు వారికి గుర్తు చేస్తూనే ఉండాలి. » మంచి అలవాట్లు నేర్చుకునే విషయంలో పిల్లల ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించాలి. » పిల్లలకు మీరు కొన్ని అలవాట్లను ఏర్పరచలేకపోతుంటే వారి ఉపాధ్యాయులు, పిల్లల వైద్యులు లేదా ఇతర నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. -
Dharmasthala: ధర్మస్థళ ‘చిన్నయ్య’.. మామూలోడు కాదు
బెంగళూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రధాన ఫిర్యాదుదారుడు చిన్నయ్య పచ్చి అబద్ధాల కోరుగా బయటపడినట్లు తెలుస్తోంది. డబ్బు కోసం ధర్మస్థళపై సామూహిక ఖననాల కథలు అల్లినట్లు అతని మాజీ భార్య రత్నమ్మ ఆరోపించారు. ఇప్పటికే చిన్నయ్య చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తేలడంతో, సిట్ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. అతని మాజీ భార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మలుపు తిరిగింది. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేయడంపై అతని మాజీ రత్నమ్మ స్పందించారు. ‘చిన్నయ్య తప్పుడు మనిషి. ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు. చిన్నయ్య నుంచి విడాకులు కోరుతూ నేను కోర్టును ఆశ్రయించా.అయితే, కోర్టు విచారణ సమయంలో నాకు భరణం ఇవ్వాల్సి వస్తుందేమోనని కోర్టులో నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో నాకు అన్యాయం జరిగింది. కొన్నాళ్లు నా తల్లే నన్ను సాకింది. ఆ తర్వాత బిడ్డల అండతో జీవిస్తున్నట్లు పేర్కొంది.గ్రామస్థులు సైతం చిన్నయ్యపై పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్నయ్య నిత్య పెళ్లికొడుకు. ధర్మస్థళలో ఉంటున్నప్పుడే అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు భార్యలు అతనికి విడాకులు ఇచ్చినట్లు పలు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది మరోవైపు ధర్మస్థళ గురించి చెప్పేవన్నీ తేలడంతో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేశారు. దీనిపై ధర్మస్థళ గ్రామం, మంజునాథేశ్వరుడు, తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. సిట్ అధికారులు చిన్నయ్యను బెల్తంగడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత..వీరేంద్ర హెగ్గడే మీడియాతో మాట్లాడారు.నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. శైవ క్షేత్రంపై వచ్చిన ఆరోపణలు భక్తులను బాధించాయని, కానీ వాస్తవాలు గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.చిన్నయ్య.. గతంలో తాను ధర్మస్థళలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశానని, అనేక మృతదేహాలను ఖననం చేశానని ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, అతని ఆరోపణలు అబద్ధమని తేలడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. -
రీల్స్ పిచ్చి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు..!
రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం. సమయం, సందర్భం లేకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే ఆత్రమే తప్ప, అసలు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది గమనించకపోవడంతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. తాజాగా ఒడిశాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలోని దుడుమా వాటర్ ఫాల్ని తన కెమెరాలో బంధించి రీల్స్గా పెడదామనుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. డ్రోన్ సాయంతో ఆ వాటర్ ఫాల్ను బంధించే క్రమంలో గంజామ్ జిల్లా బెర్హాంపూర్కు చెందిన సాగర్ టుడు అనే 22 ఏళ్ల యువకుడు ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూ బృందం. సాగర్ టుడే అనే యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఆ స్పాట్కు వచ్చాడు. రెగ్యులర్గా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ తన యూట్యూబ్ చానల్స్లో పోస్ట్ చేసే సాగర్.. డ్రోన్ కెమెరాతో ఆ వాటర్ ఫాల్ను కెమెరాలో తీస్తున్నాడు. అయితే కోరాపుట్లోని లామ్టాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మచకుండ ఆనకట్ట అధికారులు ఆనకట్ట దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే ఆ సమయంలో సాగర్ ఒక బండరాయిపై నిలబడి డ్రోన్ను నియంత్రిస్తున్నాడు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో బండారాయిపై ఉన్న అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతని కోసం స్థానికుల సాయంతో రెస్క్యూ బృందం చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం లభించలేదని పోలీసులు తెలిపారు.The video is reportedly from Koraput, where a YouTuber was swept away by strong currents at Duduma Waterfall.People must exercise extreme caution while filming and never put their lives at risk.Such a tragic incident. pic.twitter.com/8hHemeWv2e— Manas Muduli (@manas_muduli) August 24, 2025 -
భార్యను హత్య చేసి.. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి..!
న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలోవిపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు. కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ. -
ఏందిరయ్యా ఇది.. 'స్పైడర్మ్యాన్'కు పోలీసుల షాక్!
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి యువత.. అతిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశాలో 'స్పైడర్మ్యాన్' వేషధారణలో బైక్పై స్టంట్లు చేసిన ఓ యువకుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 15,000 జరిమానా విధించారు. ఒడిశాలోని రౌర్కెలాలో ఈ ఘటన జరిగింది. "స్పైడర్మ్యాన్" డ్రెస్లో అధిక వేగంతో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపించాడు. కనీసం హల్మెట్ కూడా లేకుండా నేనే స్పైడర్మ్యాన్ అంటూ స్టంట్లు చేస్తూ.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగించాడు.పెద్దగా శబ్ధం చేసే విధంగా మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్తో హల్చల్ చేశాడు. ఆ యువకుడి ఓవర్యాక్షన్కు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్లు వేశారు. అతని బైక్ను స్వాధీనం చేసుకుని రూ. 15,000 జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, వేగం, మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్ వాడినందుకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది ఢిల్లీలో స్పైడర్మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తులు ధరించిన ఓ జంట బైక్పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఢిల్లీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు 20 ఏళ్ల ఆదిత్య మరియు 19 ఏళ్ల అంజలి అని తెలుస్తోంది.ఢిల్లీలోనే జరిగిన మరో ఘటనలో స్పైడర్మ్యాన్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఎస్యూవీ బానెట్పై కూర్చొని విన్యాసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిని నజాఫ్గఢ్ నివాసి ఆదిత్య (20) గా గుర్తించారు. మరో వైపు, వాహనం నడుపుతున్న వ్యక్తిని మహావీర్ ఎన్క్లేవ్ నివాసి గౌరవ్ సింగ్కు కూడా పోలీసులు జరిమానా విధించారు. -
Bihar: ఓటర్ లిస్టులో ఇద్దరు పాక్ మహిళలు.. దర్యాప్తు షురూ
పట్నా: బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.భాగల్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. #WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD— ANI (@ANI) August 24, 2025కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు. -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
గ‘ఘన’ రక్షణ వ్యవస్థ సూపర్ సక్సెస్
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఎస్–400 తదితరాలకు ప్రత్యామ్నాయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ రంగ సంస్థ డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఒడిశాలో చాందీపూర్లో శనివారం మధ్యాహ్నం ఈ పరీక్షలు జరిగాయి. తద్వారా గగనతల రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతల వేళ కీలక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం లేకుండా గగనతల రక్షణ వ్యవస్థలను సొంతగానే తయారు చేసుకోగలమన్న ధీమాను ఈ పరీక్ష మరింతగా పెంచిందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హర్షం వెలిబుచ్చారు. దీన్ని విజయవంతంగా చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. అత్యంత కచ్చితత్వం... గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షలో భాగంగా ఒక డ్రోన్, రెండు అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత గగనతల వాహనాలను గాల్లోనే తుత్తునియలు చేసేలా క్యూఆర్ఎస్ఏఎం, విశోరద్స్, డీఈడబ్ల్యూలను ఒకేసారి భిన్న ప్రాంతాల నుంచి ప్రయోగించారు. ఇవన్నీ తమ పథంలో అత్యంత ఖచ్చితత్వంతో పయనించి తమ తమ లక్ష్యాలను ఛేదించాయి. మూడు ఆయుధాలు తమ నిర్దేశిత పరామితులను సాధించాయి. మిస్సైల్ వ్యవస్థ, డ్రోన్ జాడ కనిపెట్టే వ్యవస్థ, విధ్వంసక వ్యవస్థ, కమాండ్, కంట్రోల్ వ్యవస్థలు, కమ్యూనికేషన్, రాడార్ల వ్యవస్థలన్నీ సమష్టిగా పూర్తి సమన్వయంతో పనిచేసే ఈ మిషన్ను విజయవంతం చేశాయి’ అని రక్షణశాఖ తెలిపింది. ఈ పరీక్షను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, త్రివిధదళాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. మరో పదేళ్లలో భారత గగనతలాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చే, అనుక్షణం కాపాలాకాసే అధునాతన ఎయిర్డిఫెన్స్ వ్యవస్థను తీసుకొస్తామని ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట మీద ప్రధాని మోదీ ప్రసంగించడం తెల్సిందే. సుదర్శన చక్ర పేరిట తేబోతున్న వ్యవస్థలో ఈ తాజా మూడు ఆయుధాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రతిపాదిత బహుళ అంచెల రక్షణ వ్యవస్థలో గగనతలంతోపాటు నిఘా, సైబర్ సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నారు. Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),… pic.twitter.com/Jp3v1vEtJp— DRDO (@DRDO_India) August 24, 2025మూడంచెల్లో శత్రుపీచం అణచే తిరుగులేని వ్యవస్థలుఐఏడీడబ్ల్యూఎస్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత వేగంగా స్పందించే సర్ఫేస్ టు ఎయిర్ (క్యూఆర్ఎస్ఏఎం) మిసైల్స్, అత్యల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (విశోరద్స్) క్షిపణులు, అత్యంత శక్తిమంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్–ఎనర్జీ ఆయుధ (డీఈడబ్ల్యూ) వ్యవస్థలు దీనితో భాగం.→ ఈ మూడు వ్యవస్థలను శనివారం విజయవంతంగా పరీక్షించారు.→ ఇలా అన్ని రకాల ఆయుధాలను ఒకేసారి సమన్వయంతో ప్రయోగించే ఈ ఆపరేషన్ను కేంద్రీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్(సీసీసీ) ద్వారా పర్యవేక్షించారు.→ ఆపరేషన్ సిందూర్ ముగిసిన మూడున్నర నెలల తర్వాత భారత్ ఇలా గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థను పరీక్షించడం ఇదే తొలిసారి.→ సీసీసీని డీఆర్డీఓ అభివృద్ధిచేసింది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన విశోరద్స్, డీఈడబ్ల్యూలకు కూడా అది నోడల్ లేబోరేటరీగా వ్యవహరించింది. The @DRDO_India has successfully conducted the maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS), on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha. IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air… pic.twitter.com/TCfTJ4SfSS— Rajnath Singh (@rajnathsingh) August 24, 2025 -
The Masked Warrior: ఉగ్రదాడిలో ముఖం చిద్రమైనా.. వెన్ను చూపని కల్నల్ రిషిరాజలక్ష్మి
న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో లెఫ్టినెంట్ కల్నల్ రిషిరాజలక్ష్మి చూపిన తెగువ ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది. యుద్ధంలో ముఖం ఛిద్రమైనప్పటికీ, ఆయన విధినిర్వహణలో దేనికీ వెనుకడుగు వేయలేదు. అందవిహీనంగా మారిన ముఖానికి మాస్క్ ధరించి, తన సాహస పంధాను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.మూడు బుల్లెట్లు తగిలాక..2017లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర నిరోధక దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ రిషికి మూడు బుల్లెట్లు తగిలాయి. ఒకటి అతని హెల్మెట్లో దూరగా, రెండవది అతని ముక్కును చీల్చింది. మూడవది అతని దవడను ఛిద్రం చేసింది. అంతటి స్థితిలోనూ రిషి పోరాటం కొనసాగించారు. అతని చేతిలోని ఏకే-47 ప్రత్యర్థులపై ఉరుముతూనే ఉంది. 28 సర్జరీల తర్వాత రిషి ముఖ కవచాన్ని ధరించి, తిరిగి విధులకు హాజరయ్యారు. రిషి వీరోచిత గాథ తశివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’లో ప్రముఖంగా కనిపిస్తుంది. రిషి చూపిన తెగువ అతనికి ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ మ్యాన్’ బిరుదును సంపాదించిపెట్టింది.తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా..2024లో, కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడినప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రిషి సైనిక సహాయక చర్యలకు నాయకత్వం వహించారు. వందల సంఖ్యలో బాధితుల ప్రాణాలను కాపాడారు. తన ముఖాన్ని మాస్క్లో దాచుకుని విపత్తు ప్రాంతానికి చేరుకున్న మలయాళీ సైనికుడు అక్కడున్నవారిలో మరింత ధైర్యాన్ని నింపారు. దేశం కోసం తన ముఖాన్ని త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్గా రిషి గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రిషి తొలుత ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. కానీ సైనికునిగా మారాలనే అతని కోరిక అతన్ని ఆ దిశగా నడిపించింది. కుమారుడు దేశానికి సేవ చేయాలనే అతని తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా రిషి తన పేరు పక్కన తల్లి పేరు జోడించుకున్నారు.ఫేస్ మాస్క్ ధరించడం వెనుక..లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ‘ఆపరేషన్ ట్రాల్’ సైనిక ఆపరేషన్కు నేతృత్వం వహించాడు. వారి బృందం ఒక ఇంట్లోకి చొరబడి అక్కడున్న ఉగ్రవాదులను తరిమికొట్టే ప్రయత్నం చేసింది. దాదాపు పది కిలోగ్రాముల ఐఈడీతో రిషి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. దానిని అక్కడ అమరుస్తుండగా, పైఅంతస్తు నుంచి దూసుకొచ్చిన మూడు బుల్లెట్లు అతనిని తాకాయి. అయితే రిషి తన ఏకే-47 తో పోరాడి ఉగ్రవాదులను తరిమికొట్టాడు. నాటి 15 గంటల ఎన్కౌంటర్లో సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. రిషి భార్య కెప్టెన్ అనుపమ ఆర్మీ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్. ఆమె భర్తకు వైద్య సేవలు అందించారు. నాటి దాడిలో కోలుకున్నప్పటి నుంచి రిషి ఫేస్ మాస్క్ ధరించడం ప్రారంభించారు.‘మన లోపాలను అధిగమించాలి’రిషి ధైర్యసాహసాలకు మెచ్చిప ప్రభుత్వం 2024లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉత్తమ సేవా పతకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ 'నా దేశం నాకు ముఖ్యం. మన లోపాలను మనం దాచిపెట్టుకోవాలి. మన ప్రతిభను హైలైట్ చేయాలి. ఇదే భావన నన్ను ముఖాన్ని కప్పి ఉంచేలా చేస్లోంది. దేశం నన్ను హీరోలా చూస్తున్నప్పటికీ నేనేమీ అంత ప్రత్యేకమైనవాడిని కాదు. భారత సైన్యం నుండి పొందిన కఠినమైన శిక్షణతో ఎవరైనా బలంగా తయారుకావచ్చు. వ్యక్తిత్వం కలిగిన యువకులు దేశానికి అవసరం. వైద్యుల నుండి ఇంజనీర్ల వరకు ఎవరైనా సరే సైన్యంలో చేరవచ్చని లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి పిలుపునిచ్చారు. -
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
అహ్మదాబాద్: ఇజ్రాయెల్ యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న గాజాలోని పేదల కోసం భారత్లోని వివిధ మసీదుల నుండి నిధులు సేకరిస్తున్న సిరియన్ జాతీయుడిని గుజరాత్లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తూ వస్తున్న మరో ముగ్గురు సిరియన్ పౌరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.నిందితునితో పాటు అతని సహచరులు గాజా బాధితుల పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు వారు ఏదో ఒక ప్రయోజనం కోసం రెక్కీ నిర్వహించడానికి నగరంలో తిష్ట వేశారనే అనుమానాలున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్ నుండి అలీ మేఘత్ అల్-అజార్ (23) ను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇదే హోటల్లో అనుమానిత సిరియస్లు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్ బసచేసినట్లు పోలీసులు కనుగొన్నారు.‘ఒక నిఘా సమాచారం ఆధారంగా మేము డమాస్కస్ నివాసి అయిన అల్-అజార్ను అరెస్టు చేశాం. అతని వద్ద నుండి 3,600 అమెరికన్ డాలర్లు, రూ. 25,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని అరెస్టు తర్వాత మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారు దేశం నుండి పారిపోకుండా ఉండేందుకు వారిపై లుక్-అవుట్ నోటీసు జారీ చేశాం. ఈ నలుగురు సిరియన్లు పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి జూలై 22న కోల్కతాలో దిగారు. ఆగస్టు 2న వారు అహ్మదాబాద్ చేరుకున్నారు.వారు స్థానిక మసీదుల నిర్వహకులను సంప్రదించి, గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారి వీడియోలను చూపిస్తూ విరాళాలు సేకరించారు. గాజాలోని పేద లకు ఆహారం అందించేందుకు, నిధులు సేకరిస్తున్నామని వారు చెప్పేవారు. అయితే వారు గాజాకు నిధులు పంపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు’ అని అని శరద్ సింఘాల్ తెలిపారు. కాగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి అహ్మదాబాద్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సిరియన్లు గుజరాత్కు రావడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటి? స్థానిక మసీదుల నుండి సేకరించిన నిధులను ఎక్కడికి పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.నిందితుల కదలికలు, సంబంధాల గురించి మరింత తెలుసుకునేందుకు వారు బస చేసిన ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను స్కాన్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రాథమికంగా.. వారు రెక్కీ చేయడానికే ఇక్కడకు వచ్చారని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోందని ఆయన తెలిపారు. అరెస్టయిన సిరియన్ జాతీయుడు, అతని సహచరులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారన్నారు. విచారణ సమయంలో నిందితుడు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం ఈ నిధులు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. -
Tamil Nadu: విజయ్కు ప్రత్యర్థిగా అజిత్? జయలలిత ఇదే కోరుకున్నారా?
చెన్నై: తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. 2026లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. తమిళ అగ్ర నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) పోటీ చేస్తుందని ప్రకటించిన దరిమిలా తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విజయ్ ప్రత్యర్థిగా భావిస్తున్న మరో తమిళ హీరో అజిత్ కుమార్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.అజిత్ రాజకీయ భవిష్యత్కు సంబంధించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మరణించాక అజిత్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. నాడు జయలలిత తన పార్టీ ఏఐడీఎంకేలోకి అజిత్ తన వారసునిగా రావాలని కోరుకుంటున్నారనే వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించి, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, అజిత్ ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఈ ఊహాగానాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత నాడు ఒక నటునిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఒక జర్నలిస్టు ముందు మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవే వాదనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే అజిత్ తనకు రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నట్లు ఏనాడూ ప్రకటించలేదు. కాగా జర్నలిస్టు, జయలలిత సన్నిహితుడు అయిన కాలచక్రం నరసింహ నాడు జయలలితతో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో ఈ చర్చను తిరగతోడుతోంది.ఆ వీడియోలో నరసింహ.. ‘ఆమె(జయలిత) తమిళ సినిమాకు చెందిన ఒక నటుడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అతని హుందా ప్రవర్తన, నిజాయితీ, ప్రజలతో కలిసిపోయే తీరు గురించి ప్రస్తావించారు. అయితే ఆ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియకపోయినా, తమ పార్టీలో చేరేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆమె చెప్పారు. వారసత్వం అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె అజిత్ పేరును నేరుగా పేర్కొన లేదు. అయితే అభిమానులు ఆ నటుడు అజయ్ అని స్పష్టంగా చెబుతుంటారు.ఈ అంశంపై అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. ఒక అభిమాని ‘అజిత్ సర్ 2029 లేదా 2030లో రాజకీయాల్లోకి వస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు.. నా మాటలు నిజం అవుతాయి’ అని పేర్కొనగా, మరొకరు, ‘రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఎవరికైనా ఇది నిజం అని అనిపిస్తుంది’ అని రాశారు. ఇంకొకరు ‘అతను ఏఐడీఎంకేను నడిపించేందుకు సరైన వ్యక్తి అయ్యేవాడు’ అని అభిప్రాయపడ్డారు. అయితే అజిత్ ఇప్పటివరకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అజిత్ నటనతో పాటు, తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్పై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు సినీరంగంలో ముడిపడి కనిపిస్తాయి. సిఎన్ అన్నాదురై నుండి ఎం.జి. రామచంద్రన్, జయలలిత వరకు.. అందరూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యమ్’ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. -
తేజస్వీ యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్ను ఎక్స్లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరొటే ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.ఈ పరిణామంపై తాజా తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘కేసులను చూసి భయపడను, ఇకపైనా నిజమే మాట్లాడుతా’అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీహార్ పర్యటన వేళ తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో బీహార్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలన్నీ వట్టి భూటకమని విమర్శించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా తేజస్వీ కటిహార్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని హామీలను భూటకమనడం అభ్యంతరకరమైన మాటలు ఎలా అవుతాయి అంటూ ఎదురుదాడి చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యాసిడ్ పోసి లైటర్తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు
నోయిడా: భర్త రూపంలోని కట్న పిశాచి పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. యూపీలో గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణం శనివారం పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు. ధన దాహంతో...సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్ బెంజ్ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్ పోసి మరీ నిప్పంటించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి. భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోశారు’’ అంటూ కంచన్ వాంగ్మూలమిచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.💔🚨 BIG BREAKING:ग्रेटर नोएडा के सिरसा गाँव में 21 अगस्त 2025 को दहेज के लिए क्रूरता — पति विपिन भाटी और सास ने निक्की को पेट्रोल डालकर ज़िंदा जला दिया! यह बेहद निंदनीय कृत्य है, इंसानियत शर्मसार है। मेरी राय: ऐसे दरिंदों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए। बहन की शिकायत पर… pic.twitter.com/UKMHQcrdj6— Praveen Maurya (@mr_pravi_01) August 23, 2025ఎస్సై గన్ లాక్కుని... సీన్ రీకన్స్ట్రక్ఛన్ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు. कुछ तस्वीरें सामने आई हैं जिससे लगता है कि निक्की के हत्यारे पति विपिन भाटी ने हत्या को दूसरा रंग देने की भी कोशिश की थी। उम्मीद है न्याय व्यवस्था उसकी चाल में नहीं फंसेगी और निक्की के कातिलो को जल्द ही कठोरतम सज़ा मिलेगी 🙏#JusticeForNikkiPayala pic.twitter.com/mGchaTvqIn— Greater Noida West (@GreaterNoidaW) August 23, 2025అమ్మను నాన్నే చంపాడు! ఆరేళ్ల కుమారుని వాంగ్మూలం పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు! -
పేదలకు అవకాశాలను దూరం చేసి.. ఇప్పుడు ఓట్లను చోరీ చేయాలనుకుంటున్నాయి
కటిహార్: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి పేదలకు అవకాశాలను దొర క్కుండా చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఇప్పుడు వారి ఓట్లను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నా యన్నారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా శనివారం రాహుల్ బిహార్లోని కటిహార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శిస్తూ ఆయన.. బీఆర్ అంబేడ్కర్ రచించిన ఈ పుస్తకంలోని ఆదర్శాలకు మరో వెయ్యేళ్ల యినా విలువ తగ్గదన్నారు. దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలను ముందుకు సాగకుండా అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులు, ఈబీసీలు, మైనారిటీలకు మంచి ఉద్యోగాలు దొరికేవనీ, బీజేపీ సర్కారు ప్రైవేటీకరణతో ఇప్పుడా అవకాశం లేకుండా చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రతి వ్యక్తికీ ఓటు హక్కుంది. అందరి ఓట్లూ సమానమే. ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి అమూల్యమైన ఆ ఓటును దొంగిలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల్లో వేలాది మంది ఓట్లను గల్లంతు చేశారని ఈసీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. వేలాదిగా చేర్చిన కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని చెప్పారు. ఇప్పుడు బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఈ విషయం తెలిపేందుకే ఓటర్ అధికార్ యాత్ర చేపట్టామని వివరించారు. అయితే, మీడియా తమ ప్రయత్నాన్ని చాలా తక్కువ చేస్తోందని, లక్షలాది మంది ప్రజలు తమ యాత్రకు తరలివస్తున్నా చూపించడం లేదని ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన సాసారంలో యాత్ర మొదలయ్యాక మొదటిసారిగా తాత్కాలిక వేదిక నుంచి రాహుల్ ప్రసంగించడం విశేషం. కార్యక్రమంలో బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ పాలుపంచుకున్నారు. -
అంతరాలు!
డైనింగ్ టేబుల్పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.మనసుల మధ్య ఎడంసాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే.. -
జర్మనీతో పీ–75ఐ సబ్మెరీన్ ఒప్పందానికి కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ 75 ఇండియా(పీ–75ఐ)కింద ఆరు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు జర్మనీతో చర్చలు జరిపేందుకు రక్షణ శాఖకు అనుమతి మంజూరు చేసింది. జాతీయ భద్రతా విభాగం, రక్షణ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జర్మనీ సంస్థతో ఈ నెలాఖరులోనే చర్చలు మొదలయ్యే అవకాశా లున్నాయని సమాచారం. కొత్తగా సమకూర్చుకునే ఆరు సబ్మెరీన్లలో ఎయిర్ ఇండిపెండెంట్ పొపల్షన్(ఏఐపీ)వ్యవస్థలుంటాయి. దీనివల్ల ఈ జలాంతర్గాములు కనీసం మూడు వారాలపాటు నీటి అడుగునే ఉండే సామర్థ్యముంటుంది. జర్మనీ సంస్థతో సంప్రదింపులను 8 నెలల్లో పూర్తి చేసి, ఒప్పందం ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ శాఖ, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్)లు నిర్మించతలపెట్టిన తరువాతి తరం సబ్మెరీన్లకు ఏఐపీ సాంకేతికతే కీలకం. జర్మన్ సంస్థ నుంచి అందే ఈ సాంకేతికతతో దేశీయంగా సబ్మెరీన్లను డిజైన్ చేసుకుని, నిర్మించనున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక అవసరాల రీత్యా ఇటువంటి జలాంతర్గాముల అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. వచ్చే పదేళ్లలో నేవీ నుంచి కనీసం పది పాతబడిన జలాంతర్గాములను విధుల నుంచి తప్పించే అవకాశముంది. -
ఆ తీర్పు నా ఒక్కడిది కాదు
న్యూఢిల్లీ: సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా చేసిన విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డి విభేదించారు. శనివారం పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ‘‘సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెల్సిందే. ప్రజాస్వామ్యంలో లోటు ‘‘రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లతో సతమతమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. పార్లమెంట్లో సభ్యుల నిరసన కారణంగా సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం సహజం. నిరసన అనేది అత్యావశ్యకం. కానీ అదే పనిగా నిరసన తెలపడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. గతంలో వాణిజ్యలోటు గురించి జనం మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో సైతం లోటు కన్పిస్తోంది. మొదట్నుంచీ భారత్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లినప్పటికీ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగంపై దాడి అనే అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ మాత్రమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వం, విపక్షం మధ్య సఖ్యత చెడిపోకూడదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా ముఖ్యం. విపక్షాలు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి అభ్యరి్థని ఎన్నుకోవడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ఎంపిక అనేది మూడు అంశాలను స్పష్టంచేస్తుంది. ఒకటి వైవిధ్యం. విపక్షంలోని వివిధ పారీ్టలు నన్ను ఎన్నుకున్నాయి. రెండో ఏకగ్రీవ ఎన్నిక. ఇక మూడోది దీటైన ఓటింగ్ సామర్థ్యం. ఒకరంగా విశ్లేషిస్తే దేశ జనాభాలో దాదాపు 63 శాతం జనాభాకు ఈ పారీ్టలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది’’అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఉపరాష్ట్రపతి పదవికి దేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నిక పూర్తవ్వాలి. కానీ రాజకీయాల్లో విబేధాలు సహజం. అందుకే అధికార, విపక్షాల మధ్య ఇలా పోటీ అనివార్యమైంది’’అని అన్నారు. ‘‘కులగణనకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డారో, అభ్యున్నతికి నోచుకోలేదో వాళ్లను గుర్తించి ఎదిగేందుకు సాయపడాలంటే కులగణన చేయాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు. -
అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి
న్యూఢిల్లీ: అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ‘జాతీయ అంతరిక్ష దినం’సందర్భంగా మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటినుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై అంతరిక్షం లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. స్పేస్ సెక్టార్లో ఒక విజయం తర్వాత మరో విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తంచేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దులు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ–క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అధునాతన సాంకేతికతను మనం సాధించామని తెలిపారు. -
అతి వేడి.. ఆరోగ్యానికి హానికరం
వేడివేడి టీలో మనం రంగు, రుచి, వాసనల్ని ఆస్వాదిస్తాం. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు మైమరిచిపోతాం. అందుకు కారణం, వేడి కూడా ఒక రుచిలా మనకు అలవాటై ఉండటం! అయితే ఈ పానీయాల వేడి.. పరిమితికి మించితే దీర్ఘకాలంలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ తాజాగాహెచ్చరించింది! – సాక్షి, స్పెషల్ డెస్క్వేడి పానీయాలు వేడిగానే కదా ఉండాలి! వాటిని వేడిగానే కదా తాగాలి! కాకపోతే, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కాస్త వేడి తక్కువగానో, కొంచెం వేడి ఎక్కువగానో తాగుతారు. మరి వేడి వల్ల కేన్సర్ రావటం ఏంటి? వస్తే ఏ రకం వస్తుంది? గొంతుకు వస్తుందా? ఉదరానికి వస్తుందా? నిజానికి వేడి పానీయాలకు, గొంతు కేన్సర్కు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఆధారాలూ లేవు. అలాగే వేడి పానీయాలకు కడుపు కేన్సర్కు మధ్య సంబంధం కూడా అస్పష్టంగానే ఉంది. ఇదంతా నిజమే కానీ, మితి మీరిన వేడి ఉన్న పానీయాలను సేవించటం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తాము గుర్తించామని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.65 డిగ్రీలు దాటితే డౌటే!2016లో ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్’ జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. వేడి పానీయాలను అతి వేడిగా తాగటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. 70 డిగ్రీల వేడి వద్ద ఎలుకలకు పట్టించిన నీరు, అలా వేడి నీటిని పట్టించని ఎలుకలతో పోల్చి చూస్తే, అధిక వేడి నీటిని పట్టించిన ఎలుకల అన్నవాహికలో ముందస్తుగా కేన్సర్ సంకేతాలు కనిపించాయి.వేడికి ఆమ్లాలు తోడౌతాయి!పానీయాల వేడికి, ‘గ్యాస్ట్రిక్ ఆసిడ్ రిఫ్లెక్స్’ (కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి వెనక్కి తన్ని, వాపును కలుగజేసే పరిస్థితి) తోడై అన్నవాహిక కేన్సర్ అవకాశాలు పెరగడాన్ని కూడా తాజా అధ్యయనంలో పరిశోధకులు గమనించారు. అలా బయటి ద్రవాల వేడి, లోపలి ఆమ్లాలు కలిసి కేన్సర్ వృద్ధికి కారకాలు అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. ‘గుటక’ మోతాదూ విలనే!ఒకేసారి ఎంత వేడిగా తాగుతారు, ఎంత త్వరగా తాగుతారు అనే దానిపైనే కేన్సర్ ప్రమాదం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం ప్రకారం.. వేడివేడి పానీయాలను ఒకేసారి ఎక్కువగా తాగితే ఆ వేడి తీవ్రత వల్ల అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరొక అధ్యయనంలో.. వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేడి వేడి కాఫీ, టీలు తాగే వ్యక్తుల అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు వారు తీసుకున్న ‘గుటక’ మోతాదు, వేడి కంటే కూడా ఎక్కువ దుష్ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. 65 డిగ్రీల వేడి ఉండే కాఫీలో ఒక పెద్ద గుటక (20 మిల్లీ లీటర్లు) అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు పెంచటాన్ని వారు గుర్తించారు. అందువల్ల టీ, కాఫీల వంటి వేడి పానీయాలను త్వరత్వరగా కాకుండా.. కాస్త వేడి చల్లారే వరకు ఉండి, నింపాదిగా తాగాలని సూచిస్తున్నారు.సుఖోష్ణం ఆహ్లాదకరంటీ, కాఫీ వంటి వేడి పానీయాలను అందరూ వేడివేడిగానే తాగుతారు. వీటిలో ఉండే కెఫినన్, థియోఫిలిన్ అనే రసాయనిక పదార్థాల వల్ల కేన్సర్ రాదు. బాగా వేడివేడిగా తాగడం వ్యాధికారకమని కొందరు అంటున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. మన నాలుక, నోరు భరించలేని వేడిని మనం తాగలేం. టీగానీ, కాఫీగానీ నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు మనం తట్టుకోగలిగే వేడి మాత్రమే ఉంటుంది. ఆ మార్పు యాంత్రికంగా జరిగిపోతుంది. జంతువుల మీద ప్రయోగాలు చేసేటప్పుడు ‘గొట్టాల ద్వారా’ వాటి కడుపులోకి వేడి పానీయాలు పంపుతారు. కాబట్టి అధిక వేడి సాధ్యపడవచ్చు. ఇక రెండో విషయం.. ఎంత ప్రమాణంలో తాగాలి, రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు? అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా ఏదైనా ప్రమాదకరమే. అతివేడి, అతి చలవ పదార్థాలు వెంటవెంటనే శరీరానికి తగిలినా, నోటిలోకి వెళ్లినా.. మన కణజాలాలు కాలిపోయి చర్మరోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ వ్యాధులు ముదిరితే కేన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగటం చాలా ప్రమాదకరం. ఆ పేపరు పొర కెమికల్స్తో కూడినది. దానికి ఏమాత్రం వేడితగిలినా.. రసాయనిక చర్య సంభవించి, అవి మన నోట్లోంచి కడుపులోకి వెళ్లి కేన్సర్ వంటి అనేక రోగాలకు దారితీయవచ్చు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, విశ్రాంత అదనపు సంచాలకులు, ప్రిన్సిపాల్, ఆయుష్ విభాగం -
2047 నాటికి స్పేస్ లీడర్ ఇండియా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. స్వదేశీ వ్యోమగాములను స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ రాకెట్లో అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2027లో ఈ మానవసహిత యాత్ర చేపట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందు గగన్యాన్ యాత్ర(జీ1)లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో మానవరహిత టెస్టు ఫ్లైట్ను ప్రయోగించబోతున్నారు. వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారు. మానవసహిత యాత్రకు అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరీక్షించడమే జీ1 యాత్ర ఉద్దేశం. మానవసహిత గగన్యాన్ యాత్రకు నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఎంపికయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో వారికి ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా నలుగురు వ్యోమగాములు శనివారం సమావేశమయ్యారు. తమ అనుభవాలు పంచుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి మన భూమిని దర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని శుభాంశు పేర్కొన్నారు. అది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మానవులకు భూమి ఎంతో విలువైన గ్రహం అని అర్థమైందని చెప్పారు. ఐఎస్ఎస్ యాత్ర తనకు అతిపెద్ద పాఠమని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గగన్యాన్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక స్వర్ణయుగమని, ఇందులో తాను భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఒక వ్యోమగామి దృష్టి ఎల్లప్పుడూ సరిహద్దులకు అతీతంగా ఉంటుందని గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అన్నారు. అంతరిక్ష రంగంలో పనిచేసేవారు ఇతర గ్రహాలపై ఆవాసాలు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలు మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయన్నారు. గగన్యాన్ మిషన్ అనేది ఎన్నో ఇతర మిషన్ల సమ్మేళనం అని వివరించారు. 2047 నాటికి ఇండియా ‘స్పేస్ లీడర్’గా ఎదగడానికి ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. మరో 20 ఏళ్లలో మనం అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలపై అంగద్ ప్రతాప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర దేశాల్లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకొని మన దేశం కోసం వారు పని చేస్తున్నారని కొనియాడారు. మానవ సహిత యాత్రల్లో ముందడుగు అంతరిక్ష కార్యకలాపాలు ఏవైనా సరే అవి మన భూమికి, మనుషులకు లబ్ధి చేకూర్చేలా ఉండాలని అజిత్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు. అలా లేకపోతే అవి వ్యర్థమేనని ఉద్ఘాటించారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మరెన్నో గొప్ప విజయాలు సాధించడానికి స్పేస్ సైంటిస్టులు, వ్యోమగాములు కలిసికట్టుగా పని చేయాలన్నారు. గత ఐదేళ్లలో ఎంతో సాధించామని, చంద్రుడిపైకి వెళ్లామని, డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేశామని గుర్తుచేశారు. స్పేస్ సెక్టార్లో ఎన్నో స్టార్టప్లు వస్తున్నాయని చెప్పారు. అంతరిక్షంలో మన పరుగులు చూసి ఇతర దేశాలు అసూయ చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. మన్ రోడ్మ్యాప్–2047 చాలా బలంగా ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదని బాలకృష్ణన్ నాయర్ పేర్కొన్నారు. -
ఇబ్బందైతే కొనకండి!
న్యూఢిల్లీ: భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధిచేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే అస్సలు కొనొద్దని ట్రంప్ సర్కార్కు భారత విదేశాగ మంత్రి జైశంకర్ తెగేసి చెప్పారు. ట్రంప్ పాలనాయంత్రాంగం అనుక్షణం స్వప్రయోజనాలతో వాణిజ్యంచేస్తూ భారత్ సైతం అదేపనిచేస్తుంటే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. పలుదేశాలపై ఎడాపెడా పన్నుల పిడిగుద్దులు కురిపించే ట్రంప్ అవలంభించే విదేశాంగ విధానం పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ఆయన అతిథిగా పాల్గొని పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ‘‘మా సరుకు కొనాలని మీపై ఒత్తడి చేయట్లేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే వేరే దేశాలు కొంటాయి. సరుకులను యూరప్ అమ్ముతుంది. అమెరికా కూడా అమ్ముతుంది. భారత్ సైతం అమ్ముతుంది. మావి వద్దనుకుంటే, సమస్య అనుకుంటే కొనకుంటే సరిపోతుందికదా’’అని జైశంకర్ వ్యాఖ్యానించారు.‘అమెరికా సంప్రదాయక విదేశాంగ విధానానికి ట్రంప్ తిలోదకాలిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏం అనుకుంటున్నారో ఎవ్వరికీ తెలీదు. అసలు ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్యగోచరంగా, అధ్వానంగా తయారైంది. ఇలాంటి విదేశాంగ విధానాన్ని, ఇంత బాహాటంగా అమలుచేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం కనీవినీ ఎరుగదు. సొంత వ్యాపారం, వాణిజ్యం పెంచుకోవడంపైనే ట్రంప్ సర్కార్ దృష్టిపెడుతుందని అందరూ అంటారు. మరి అలాంటప్పుడు భారత్ వంటి దేశాలు రష్యా వంటి దేశాలతో వాణిజ్యం చేస్తుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటి?. మీరు చేస్తున్న పనిని వేరొకరు చేయొద్దనడం హాస్యాస్పదం. సొంతింటిని గాలికొదిలేసి పక్కింట్లో ఏం జరుగుతుందా అని ట్రంప్ యంత్రాంగం తొంగి చూస్తుంటే నవ్వొస్తోంది. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి’’అని ట్రంప్కు జైశంకర్ చురకటించారు. మధ్యవర్తిత్వం ఉత్తిదే ‘‘మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్, భారత్ యుద్ధంలో మునిగిపోకుండా తాను ఆపానని బీరాలు పలుకుతున్న ట్రంప్ మాటల్లో ఆవగింజంత అయినా నిజం లేదు. అసలు మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ ప్రోత్సహించలేదు. గతంలోనూ తగాదా తీర్చమని ఎవ్వరినీ పెద్దమనిíÙగా పిలవలేదు. 1970వ దశకం నుంచి చూసినా గత అర్థశతాబ్దకాలంలో పాకిస్తాన్తో పొరపొచ్ఛాలకు సంబంధించి ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకూడదని భారత్ ఏనాడో నిర్ణయించుకుంది’’అని అన్నారు.అన్నింట్లో వైఖరి సుస్పష్టం‘‘ప్రతి అంశానికి సంబంధించి భారత్కు స్పష్టమైన విధానముంది. అమెరికా 50 శాతం టారిఫ్లు విధించినాసరే ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లోనైనా మన రైతుల ప్రయోజనాలే భారతప్రభుత్వానికి అత్యున్నతం. వ్యూహాత్మక వాణిజ్యం మొదలు రక్షణ, టారిఫ్లు, మధ్యవర్తిత్వం దాకా ప్రతి అంశంలో భారత్ స్వీయప్రయోజనాలకే విలువ ఇస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రతినిధి బృందంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సాగు, డెయిరీ ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణకు భారత్ పట్టుబట్టడంతో ఈ అంశాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది’’అని జైశంకర్ అన్నారు. పన్నుల భారం మోపడంతో అమెరికా సత్సంబంధాలు సన్నగిల్లి కొత్తగా చైనాతో బంధం కాస్తంత బలపడిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘‘ఒక సందర్భాన్ని వేరొక సందర్భంతో పోల్చిచూసి తుది నిర్ణయానికి, అంచనాకు రావడం సబబుకాదు’’అని వ్యాఖ్యానించారు. -
అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్మెంట్స్పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు. -
కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్లోని విజయ్ నగర్లోని బ్రహ్మపుత్రా ఎన్క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు. ఇదీ చదవండి: స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
ఈసారి పాక్ను కలిపి ఇచ్చి పడేశారు..!
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్లపై సెటైరిక్గా స్పందించారు. ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు. #WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc— ANI (@ANI) August 23, 2025 ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.ఇదీ చదవండి: భారత్తో సమస్య ఉంటే.. ట్రంప్కు జై శంకర్ స్పష్టీకరణ -
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్టక్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు!
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. 2024లో మాత్రమే అధికారులు దేశం మొత్తం మీద 8 కోట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్ల మొత్తం విలువ సుమారు రూ. 12,000 కోట్లు.దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ తప్పుతున్నట్లు, జరిమానాలు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ వసూలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్, రెడ్-లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలకు ప్రతోరోజూ 5000 కంటే ఎక్కువ ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ సంఖ్య గురుగ్రామ్లో కూడా ఎక్కువగానే ఉంది.సాధారణ ఉల్లంఘనలు - జరిమానాలుమోటారు వాహనాల చట్టం.. ట్రాఫిక్ విభాగాల డేటా ప్రకారం, జరిమానాలు విధించే సాధారణ ఉల్లంఘనలలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రెడ్ లైట్లు జంప్ చేయడం, స్టాప్-లైన్ ఉల్లంఘనలు, రాంగ్ లేన్లో డ్రైవింగ్ చేయడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీహెల్మెట్ ధరించకపోతే.. రూ. 1,000, నిర్దిష్ట వేగం కంటే వేగంగా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు (కొన్ని నగరాల్లో మొదటిసారి ట్రాఫిక్ రూల్ అతిక్రమించినవారికి జరిమానా కొంత తక్కువగా ఉంటుంది) ఉంటాయి. ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారు.. మళ్లీ మళ్లీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నట్లు తెలిస్తే.. వారికి మరింత ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. రోడ్డు భద్రతలో టెక్నాలజీఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టడం చాలా సులభమైపోయింది. ఏఐ కెమెరాలు హై రిజల్యూషన్ ఫోటోలను క్లిక్ చేయడం మాత్రమే కాకుండా.. వీడియో కూడా రికార్డ్ చేస్తాయి. వీటి ఆధారంగానే వాహనదారులకు చలాన్ జారీ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తప్పించుకోవడం అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన వినియోగదారులు మసలుకోవాలి. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. -
‘భారత్తో సమస్య ఉంటే.. ’: ట్రంప్కు జైశంకర్ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జైశంకర్ స్పష్టం చేశారు.‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. #WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv— ANI (@ANI) August 23, 2025ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు. -
National Space Day: 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో చీఫ్
న్యూఢిల్లీ: భారతదేశం అంతరిక్ష రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నదని, 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటవుతుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు. నేడు(ఆగస్ట్ 23) జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా ఉంటుందని నారాయణన్ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ, దార్శనికతల ఆధారంగా చంద్రయాన్-4 మిషన్ మనకు సాకారమయ్యింది. వీనస్ ఆర్బిటర్ మిషన్కు కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్ కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు. #WATCH | Delhi: ISRO Chairman V. Narayanan says, "... Based on his direction and vision, we are going to have a Chandrayaan-4 mission. We are going to have a Venus Orbiter Mission. We are going to have a space station called BAS (Bharatiya Antriksh Station) by 2035, and the first… pic.twitter.com/1RNQOJyng0— ANI (@ANI) August 23, 2025 -
Uttarakhand: ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు
చమోలీ: ఉత్తరాఖండ్ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. #WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఈ విపత్తుపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్బరస్డ్ సంభవించింది. జిల్లా యంత్రాంగం, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. తాను స్థానిక పరిపాలన అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అన్నారు#WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన విపత్తుకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహదారులు మూసుకుపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్ బరస్ట్ అని అంటారు. -
Dharmasthala Case: మరో ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్ట్
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థళకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.లభించని మృతదేహాల ఆనవాళ్లుఇటీవలి కాలంలో ధర్మస్థళ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ధర్మస్థళ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా అధికారులకు తెలిపాడు. ఆ మృతదేహాల్లో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నాయన్నాడు. దీంతో అతను చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకుని రంగంలోకి దిగిన సిట్ అధికారులు అతను చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. అయితే మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అధికారులకు లభించలేదు.మాయమాటలతో వ్యవస్థను నమ్మించి..మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి మరోమారు విచారించారు. ఈ నేపధ్యంలో అతను మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి, ఇప్పుడు తనకు ఏమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ నేపద్యంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. నేడు (శనివారం) అతనిని కోర్టుకు హాజరుపరచనున్నారు. దీనికి ముందు భీమా.. తనకు ఒకరు పుర్రె ఇచ్చి, సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో కేసు కూడా వారే చేయించారని చెప్పాడు.సుజాత భట్ చెప్పిందీ కట్టుకథే..మరోవైపు సుజాత భట్ తాను గతంలో ధర్మస్థళకు వెళ్లినప్పుడు తన కూతురు మిస్ అయిందని తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని సిట్ అధికారులమందు నిజం వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛాన్ల్తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. తనకు అసలు అనన్య భట్ అనే కూతురే లేదని.. ధర్మస్థళ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా కొత్తగా సృష్టించినవేనన్నారు. విచారణకు రాలేను: యూట్యూబర్ సమీర్ ధర్మస్థళ గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి లేఖ రాస్తున్నానని, తాను ధర్మస్థల స్టేషన్కు రావటానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. తనకు ప్రాణ హాని ఉందని భావించి, సెషన్ న్యాయస్థానంలో బెయిల్కు దరఖాస్తు చేశానని సమీర్ తెలిపాడు. ఒకవేళ తాను ధర్మస్థళ పోలీస్ స్టేషన్కు వస్తే, తనకు భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజులలోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని ఆ లేఖలో సమీర్ కోరాడు. -
భాను ముష్తాక్తో ప్రారంభోత్సవం.. సోనియాను ఎందుకు తప్పించారు?
బెంగళూరు: ఈ ఏడాది ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించవచ్చనే వార్తలు ఎప్పటి నుంచో వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం కన్నడ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముష్తాక్ చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ప్రారంభింపజేసింది. దీనివెనుక పలు కారణాలున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు.మైసూరు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలను ప్రముఖ కన్నడ రచయిత్రి, బుకర్ బహుమతి గ్రహీత బాను ముష్తాక్ (Banu Mushtaq) సెప్టెంబర్ 22న మైసూరులోని చాముండి కొండపై ప్రారంభించారు. ‘హృదయ దీప’ పుస్తకానికి బుకర్ ప్రైజ్ను అందుకుని, అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన బాను ముష్తాక్,ఈ పురస్కారం అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా నిలిచారు. హసన్ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె కన్నడ సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. జర్నలిస్ట్గా పనిచేసిన బాను ముష్తాక్ కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, చింతామణి అత్తిమబ్బే కూడా అవార్డును గెలుచుకున్నారు.ఆమె సాగించిన సాహిత్య రచనలు పలువురి ప్రశంసలు పొందాయి. బాను ముష్తాక్ను దసరా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎన్నిక చేయడం ద్వారా కర్ణాటక (Karnataka) సాంస్కృతిక వారసత్వానికి మరింత ఖ్యాతి దక్కుతుందని రాష్ట్రప్రభుత్వం భావించింది. ప్రాంతీయ బాషా వివాదాలు చెలరేగుతున్ను ప్రస్తుత తరుణంలో కన్నడ భాషకు పట్టంకట్టే ఉద్దేశంతోనే కర్ణాటక ప్రభుత్వం రచయిత్రి బాను ముష్తాన్ను దసరా ఉత్సవాలకు ప్రధాన అతిథిగా ఎంచుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) కన్నా బాను ముష్తాక్ ఎంచుకోవడం ద్వారా ప్రాంతీయాభిమానాన్ని కూడగట్టుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం భావించి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 11 రోజుల పాటు జరిగే మైసూరు దసరా వేడుకల్లో భారీ ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు. -
Punjab: నడిరోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్ దగ్ధం.. ఇద్దరు మృతి
హోషియార్పూర్: పంజాబ్లోని హోషియార్పూర్లో దడపుట్టించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మాండియాలా గ్రామంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. రోడ్డు ప్రమాదం అనంతరం గ్యాస్ ట్యాంకర్కు మంటలు అంటుకోగా, అవి సమీపంలోని 15 దుకాణాలను, ఐదు నివాస గృహాలను దగ్ధం చేశాయని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. #WATCH | A massive fire broke out in Mandiala village of Hoshiarpur in Punjab. According to Deputy Commissioner Aashika Jain, it is suspected that the fire was caused by a road accident in an industrial area involving an LPG tanker, and one casualty has been reported. Fire… pic.twitter.com/JMZYi4VT3J— ANI (@ANI) August 22, 2025శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ జైన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ మాలిక్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు అంబులెన్స్లలో తరలించారు. హోషియార్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ మీడియాతో మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదం కారణంగా గ్యాస్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమద బాధితులను ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదం తర్వాత గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Deputy Commissioner Aashika Jain says, "... The fire broke out, probably due to a road accident. Patients with burn injuries have been admitted to the hospital... One casualty has been… https://t.co/1jgGIYZKdD pic.twitter.com/OS3kQZw76X— ANI (@ANI) August 22, 2025ఘటనా స్థలానికి పంజాబ్ మంత్రి రవ్జోత్ సింగ్ చేరుకుని, పరిస్థితులను, సహాయక చర్యలను పరిశీలించారు. ‘పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఎంత మంది గల్లంతయ్యారో ఇంకా తెలియదు. ఒక ట్యాంకర్.. కారును ఢీకొంది. ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి’ అని మీడియాకు తెలిపారు. కాగా ప్రమాద బాధితులను హోషియార్పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు మృతిచెందారని, మరో 20 మంది వరకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సివిల్ సర్జన్ పవన్ కుమార్ తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Punjab Minister Ravjot Singh says, "The situation is such that it cannot be described. A very tragic accident has happened... It is not yet known how many people are missing. People are… https://t.co/1jgGIZ0i3b pic.twitter.com/IVWi9ArEis— ANI (@ANI) August 22, 2025 -
‘నాఫ్తలీన్’తో కప్పెట్టి.. పటకారుతో మోది.. దడపుట్టిస్తున్న రెండు ఘటనలు
వార్ధా: మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన భార్య అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు అతనిని ఫోన్లో సంప్రదించారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో పోలీసులు నేరుగా వార్ధాలోని హింగాన్ఘాట్లోని వారి ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధాలోని హింగాన్ఘాట్కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదును చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ ఇంటి సమీపంలో ఘాటైన వాసనను పోలీసులు గమనించారు.అది నాఫ్తలీన్ బాల్స్ వాసనగా వారు గుర్తించారు. అలాగే అక్కడ గుంత తవ్విన ఆనవాళ్లు వారికి కనిపించాయి. అక్కడ తవ్వి చూడగా, వారికి మహిళ మృతదేహం కనిపించింది. నాఫ్తలీన్ బాల్స్ ఘాటైన వాసన పోలీసుల దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడింది. ఈ హత్య ఎలా జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ కేసులో అదృశ్యమైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.పటకారుతో దాడి చేసి..హర్యానాలోని గురుగ్రామ్లో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది. భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మనేసర్ ప్రాంతంలోని నహర్పూర్ కసన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్కు చెందిన నిషా బిష్ట్ రాజేంద్రలకు 2024, డిసెంబర్లో వివాహం జరిగింది. గురుగ్రామ్లో ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా మరోమారు నిషా, రాజేంద్ర గొడవపడ్డారు. ఈ సమయంలో రాజేంద్ర వంటగదిలోని పటకారుతో ఆమెపై దాడి చేశాడు. తరువాత రోకలిబండతో మోదాడు.ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు శుక్రవారం ఉదయం నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. రాజేంద్రను అరెస్టు చేశారు. అతను నేరం అంగీకరించాడు. పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు. -
ఇంద్రధనస్సు ఇక భారత్ కనిపించదు..!
ఇంద్రధనస్సు. కొత్త ఆనందాలకు ఉషస్సు. ఆకాశంలో హరివిల్లు కనిపించిందంటే చాలు చిన్నారులు మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు. రంగురంగుల ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల విరిజల్లును కురిపిస్తుంది. వర్షం ఆగిపోగానే, కొన్ని సార్లు చిరుజల్లులు పడుతున్నప్పుడే వినీలాకాశంలో అర్థచంద్రాకృతి ఆవిష్కృతమై కనువిందు చేస్తుంది. హరివిల్లులోని రంగులను లెక్కబెట్టేవాళ్లు కొందరైతే ఆ మొత్తం హరివిల్లు తమకు పూర్తిగా కనిపించట్లేదే అని బాధపడే వాళ్లు ఇంకొందరు. భారతీయులు మెచ్చే అందాల ఇంద్రధనస్సు ఇకపై కనిపించకపోచ్చన్న చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి నిర్ధారించింది. కాలుష్యం, భూతాపోన్నతి, వాతావరణ మార్పులు కారణంగా మళ్లీ మార్చలేనంతగా మారిపోతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే హరివిల్లు అంతర్థానమయ్యే అవకాశాలు బాగా పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది. ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా ‘గ్లోబల్ ఎని్వరోన్మెంటల్ ఛేంజ్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ఆనందానికి, ఆశకు ప్రతిరూపంగా కనిపించే ఇంద్రధనస్సు భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో ఏర్పడే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయని అధ్యయనం పేర్కొంది. వర్షపాతం నమోదయ్యే రేటు, మేఘావృతమయ్యే పరిస్థితులు ఇటీవలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా మారిపోయాయి. వర్షం పడినప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో హరివిల్లు కనిపించదు. ఈ దృగి్వíÙయం ప్రకారమే వర్షాలకు, ఇంద్రధనస్సు ఆవిర్భావ సందర్భాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివిల్లు అంతర్థానమవుతుంది. మేఘాల్లోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇలా ఏర్పడిన హరివిల్లులను తమ కెమెరాల్లో బంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాస్త్రవేత్తలకు పంపించారు. అలా వేర్వేరు ఖండాల్లో భిన్న ప్రాంతాల్లో ఏర్పడిన హరివిల్లు ఛాయాచిత్రాలతో ఒక పేద్ద డేటాబేస్ను అధ్యయనకారులు సిద్ధంచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణ మార్పులు, వాతావరణ పరిస్థితులను క్రోడీకరించి భవిష్యత్తు వాతావరణ అంచనాలను రాబట్టారు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి 117 రోజులపాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా భవిష్యత్తులో మరింతగా ఏర్పడే అవకాశాలు ఉండటం విశేషం. 2100 ఏడాదికల్లా మరో 4 నుంచి 4.9 శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచానావేశారు. అయితే అన్ని దేశాల్లో సమసంఖ్య ఏర్పడకుండా కొన్ని చోట్ల అత్యధికంగా, కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయిన తేలింది. అత్యల్పంగా ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్లోనే ఎందుకు తక్కువ?మంచుమయ ప్రదేశాలతో పోలిస్తే మైదానాల వంటి నేలమయ ప్రాంతాల్లో హరివిల్లు ఏర్పడే అవకాశాలు 21 శాతం నుంచి 34 శాతం తగ్గిపోతున్నాయని అధ్యయనం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు 66 నుంచి 79 శాతం మెరుగుపడ్డాయి. చల్లటి, పర్వతమయ ప్రాంతాల్లోనే హరివిల్లులు అధికంగా ఏర్పడే ఛాన్సుంది. అధిక జనాభా దేశాల్లో ఇంద్రధనస్సు కనివిందు చేయడం తగ్గిపోనుంది. ఆర్కిటిక్, హిమాలయాల్లో రెయిన్బో ఏర్పడే సంభావ్యత అధికంగా ఉందని గణాంకాల్లో తేలింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశాల్లో హరివిల్లు సాక్షాత్కార ఘటనలు అధికంకానున్నాయి. భూమధ్యరేఖ నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ లెక్కన భారతదేశం భూమధ్యరేఖకు సమీపంలో ఉంది. భూమధ్యరేఖకు దూరంగా ఉండే అంటార్కిటి ఖండం వంటి ప్రదేశాల్లో అత్యధికంగా హరివిల్లులు ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఇప్పటికైనా కట్టుతప్పిన శిలాజఇంధన అతి వినియోగం, అడవుల నరికివేత, దారుణంగా పెరిగిపోయిన కాలుష్యం వంటివి తగ్గిపోతే భారత్ను హరివిల్లులు వదిలిపోవని భావించవచ్చు. ఆ మేరకు ప్రజల జీవనశైలిలో మార్పులొస్తాయని, ఆ మేరకు మళ్లీ హరివిల్లులు సందడి చేస్తాయని ఆశిద్దాం. -
‘భారత్ ఫెరారీ కారు, పాక్ చెత్త ట్రక్కు’.. పాక్ ఆర్మీ చీఫ్కు రాజ్నాథ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.తాజాగా కేంద్రమంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్ మునీర్ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్ పోలిక పాకిస్తాన్ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్నాథ్ అన్నారు. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్ వెనుకబడి ఉందని, సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మునీర్పై విమర్శలు వచ్చాయి.ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్ మిలటరీ ఆఫీసర్స్ కోర్స్లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది. -
20 ఏళ్లు పైబడిన వాహనాల రెన్యువల్ ఫీజు పెంపు
న్యూఢిల్లీ: 20 ఏళ్లు పైబడిన మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. తద్వారా ఇటువంటి వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇరవయ్యేళ్లు పైబడిన లైట్ మోటారు వెహికల్(ఎల్ఎంవీ)ల రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచింది. మోటారు సైకిళ్లకైతే ఈ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు, త్రీ వీలర్స్, నాలుగు చక్రాల వాహనాలకైతే ఇది రూ.3,500 నుంచి రూ.5,000కు పెంచింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి చేసుకున్న టూ–త్రీ వీలర్కైతే రెన్యువల్ ఫీజు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలుండే వాహనాల రెన్యువల్ ఫీజు రూ.80వేలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ముసాయిదా సవరణను ఫిబ్రవరిలో జారీ చేసిన కేంద్రం, ఈ నెల 21వ తేదీన దీనిని ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఫీజును కేంద్రం చివరిగా 2021 అక్టోబర్లో పెంచింది. -
కాలభైరవ.. దేశీయ రిమోట్ యుద్ధ విమానం
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్(ఎఫ్డబ్ల్యూడీఏ) సంస్థ మొట్టమొదటిసారిగా దేశీయంగా మీడియం అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యురెన్స్(మేల్) రిమోట్ యుద్ధ విమానం ‘కాల భైరవ’ను సిద్ధం చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సుహాస్ తేజస్కంద దీనిని శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. కాల భైరవుని స్ఫూర్తితో ఈ విమానం డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి దేశీయంగానే పూర్తి చేశామని వివరించారు. కాల భైరవ విమానం 3 వేల కిలోమీటర్ల దూరం 30 గంటలపాటు ఏకబిగిన ప్రయాణించగలదన్నారు. దక్షిణాసియాలోని ఒక దేశం నుంచి ఇప్పటికే 25 లక్షల డాలర్ల విలువైన ఒక ఆర్డర్ వచ్చిందని వివరించారు. అమెరికా నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో రిమోట్ ప్రిడేటర్ విమానం ఖరీదు రూ.1,000 కోట్లు కాగా, అదే ఖర్చుతో 10 కాల భైరవలను దేశీయంగా సొంతం చేసుకోవచ్చని, ఇందులో ఒకటి దెబ్బతిన్నా లక్ష్య సాధనలో ఎటువంటి మార్పు ఉండదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న విధానాలు, అమెరికా ప్రభుత్వ ఆంక్షల నడుమ భారత ప్రభుత్వం యుద్ధ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడరాదని ఆయన తెలిపారు. వేరే దేశాల వంక చూడటం వల్ల మన వ్యూహాత్మక స్వాతంత్య్రం దెబ్బతింటుందని, రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదముందని సుహాస్ పేర్కొన్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముఖాముఖి పోరు
న్యూఢిల్లీ: దేశ 17వ ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నిక బరిలో అధికార ఎన్డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మిగిలారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అందజేసిన నాలుగేసి సెట్ల నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు. వీటిని అంగీకరించామని చెప్పారు. శుక్రవారంతో నామినేషన్ల పరిశీలనకు గడువు ముగియడంతో, దక్షిణాదికే చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ ఖరారైనట్లయింది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్రెడ్డిల నామినేషన్లు మినహా సరిగా లేని మిగతా అన్ని నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వివరించారు. -
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. -
ఉద్యోగం పోతే.. మీరు భద్రమేనా?
ప్రపంచవ్యాప్తంగా 2023లో 1,193 టెక్ కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను.. గతేడాది 551 టెక్ సంస్థలు 1,52,922 మందిని తొలగించాయి. ఈ ఏడాది ఇప్పటికే 186 కంపెనీలు 81,567 మందిని ఇంటికి సాగనంపాయి. ఒక్క టెక్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే ఇతర రంగాల్లో పరిస్థితి? ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఉండే మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ ఇబ్బందీ లేదు. నెల జీతం మీద బతికేవారికే సమస్యల్లా. నిత్యావసరాలు, ఇంటి అద్దె, నెల వాయిదాలు, పిల్లల ఫీజులు, వైద్యం.. ఇలా తప్పించుకోలేని ఖర్చుల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అనుకోని కష్టం ఎదురైతే ఎదుర్కొనే ప్రణాళిక లేకపోతే చాలామంది ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. జాబ్ మార్కెట్లో ప్రస్తుత తరుణంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యవసర నిధిసగటు ఉద్యోగికి.. అలాగే కుటుంబానికి ఇదే పెద్ద ధీమా. కనీసం 6–12 నెలల ఇంటి ఖర్చులకు సమానమైన మొత్తంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే.. ఊహించని, అత్యవసర ఖర్చులను తీర్చడానికి ఈ ఫండ్ సమయానికి ఆదుకుంటుంది. » ఈ నిధి లేకపోతే అధిక వడ్డీతో అప్పులు, లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇదే జరిగితే ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి.» ఆర్థికంగా బలంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. అన్నింటికీ మించి ఒత్తిడి తగ్గుతుంది. » ఆహారం, వైద్య బిల్లులు, బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం మాత్రమే ఈ అత్యవసర ఫండ్ను ఉపయోగించండి. » జాబ్ కోల్పోయిన తర్వాత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించండి. కొత్త కోర్సు, శిక్షణ పూర్తి అయితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.అదనపు ఆదాయ మార్గాలుప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, అభిరుచి, ఆసక్తి దాగి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి. ఆదాయ నష్టాలను అధిగమించడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇదే సమయంలో వీలైనంత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా మర్చిపోవద్దు. ఆరోగ్య బీమాచాలా మంది ఉద్యోగులు సంస్థ అందించే గ్రూప్ హెల్త్ కవరేజీపైనే ఆధారపడతారు. సొంతంగా బీమా పాలసీ తీసుకోరు. కంపెనీ నుంచి ఉంది కదా అన్న ధీమా, నిర్లక్ష్యపు ధోరణి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ బీమా వర్తించదు. అందుకే కుటుంబం అంతటికీ వర్తించే సమగ్ర వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యక్తిగత బీమా ఉంటే జాబ్ పోయినా, మానేసినా చింత ఉండదు. కుటుంబంలోని వారందరికీ నిరంతర ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది.తక్కువ అప్పుఉద్యోగం కోల్పోతామన్న అభద్రతకు లోనైతే.. అప్పులు / రుణాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించండి. కొత్త రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీలైతే ముందస్తుగా ఈఎంఐలు చెల్లించండి.» బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాల క్రమం తప్పితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. » ఉద్యోగాన్ని కోల్పోయినట్టయితే రుణదాతకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు మారటోరియం, నెల వాయిదాల (ఈఎంఐ) గడువు పెంచడం (రీషెడ్యూల్) గురించి విన్నవించండి. » బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నట్టయితే పరిస్థితిని నిజాయితీగా వివరించండి.బడ్జెట్లో మార్పులుఅనిశ్చితి సమయాల్లో విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోండి. అత్యవసరమైతే తప్ప ఖర్చు చేయండి. » అనవసర ఖర్చులు తగ్గిస్తే చేతిలో డబ్బులు మిగులుతాయి. ఉద్యోగ నష్టానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. » ఉద్యోగం కోల్పోవడం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలు, తదుపరి ఉద్యోగ అన్వేషణ, జాబ్ మార్కెట్ గురించి మీ ఆలోచనలు, భావాలు, ప్రణాళికలను కుటుంబంతో పంచుకోండి. » కుటుంబ సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించడానికి, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు దోహదపడే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించండి. ఈ విధానం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. » మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదిలించొద్దు. -
ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఉన్న తాము ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని, ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి వాళ్లు తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము సపోర్ట్ చేస్తామని ఆశించడం కూడా కరెక్ట్ కాదంటూ ఇండియా కూటమిని విమర్శించారు. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ను మహారాష్ట్ర సదన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే భాగస్వామిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు తెలిపారు. అనంతరం అక్కడున్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది.. ‘సి.పి.రాధాకృష్ణన్ను ఎన్డీయే అభ్యర్థిగా మేమంతా కలిసే నిర్ణయించాం. ఆయన దేశంలో గరి్వంచదగ్గ నేత. దేశానికి, ఆ కుర్చీకి వన్నె తెస్తారు’.. అని చెప్పారు. టీడీపీ మద్దతు ఇస్తుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘గెలిచే అవకాశం లేకపోయినా తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టిన ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మేం, కేంద్రంలో ఎన్డీయే ఉన్నప్పుడు మేం వాళ్లకే కదా మద్దతు తెలిపేది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. మరోవైపు.. చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రూ.5 వేల కోట్లు అవసరమని ఆమెకు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (సాస్కి–స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) కింద ఆ నిధులను అందించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు. అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియాతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. -
మన అంతరిక్ష కేంద్రం!
ఇదేమిటో తెలుసా? రోదసిలో మన దేశాన్ని అమెరికా, రష్యా, చైనా సరసన నిలిపే ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) తొలి నమూనా! దేశమంతా చిరకాలంగా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న ఈ బీఏఎస్–01ను భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శుక్రవారం సగర్వంగా ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇందుకు వేదికైంది. దేశీయంగా రూపకల్పన చేసిన బీఏఎస్ తొలి మాడ్యూల్ (01)ను 2028 కల్లా భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో కృషి చేస్తుండటం తెలిసిందే. 2035కల్లా దాన్ని ఐదు మాడ్యూళ్లకు విస్తరించాలన్నది లక్ష్యం. – న్యూఢిల్లీఎన్నో విశేషాలు.. బీఏఎస్–01⇒ బరువు 10 టన్నులు⇒ పొడవు 8 మీటర్లు⇒ వెడల్పు 3.8 మీటర్లు⇒ దీన్ని భూమికి 450 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు⇒ అంతరిక్షంలో స్పేస్–లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది. ⇒ వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్ పూర్తిస్థాయిలో కాలూనేందుకు వీలు కల్పించనుంది. ⇒ అంతరిక్ష పర్యాటకంతో పాటు అంతర్జాతీయ సహకారాలకు వేదిక కానుంది. ⇒ స్పేస్ టెక్నాలజీ, రీసెర్చ్ను కెరీర్గా మలచుకునేలా భావి తరాలకు స్ఫూర్తినివ్వనుంది. ⇒ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, లైఫ్ సపోర్ట్ సిస్టం (ఈసీఎల్ఎస్ఎస్), భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హాచ్ సిస్టం వంటి హంగులెన్నో దీని సొంతం. ⇒ ఇవన్నీ పూర్తిగా దేశీయంగా తయారు చేసుకున్న ఫీచర్లే కావడం విశేషం. ⇒ అంతరిక్షంలో మనుషుల ఆరోగ్యంపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావంతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రీయ ఇమేజింగ్ తదితరాలు బీఏఎస్లో జరగనున్నాయి. ⇒ రోజువారీ కార్యకలాపాలకు తోడు రీఫిల్లింగ్ ప్రొపల్లెంట్, ఈసీఎల్ఎస్ఎస్ ఫ్లూయిడ్లు, రేడియేషన్, థర్మల్ ప్రభావం, మైక్రో మీటరాయిడ్ ఆర్బిటల్ వ్యర్థాల (ఎంఎంఓడీ) నుంచి రక్షణ తదితరాలకు అవసరమైన హంగులన్నీ బీఏఎస్లో ఉండనున్నాయి. ⇒ స్పేస్ సూట్లు, ఎయిర్ లాక్స్, ప్లగ్ అండ్ ప్లే తరమా ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వ్యవస్థలకు దన్నుగా నిలుస్తుంది.ఆ దేశాల సరసన... బీఏఎస్–01 భారత్ను సొంత అంతరిక్ష కేంద్రాలున్న అమెరికా, రష్యా, చైనా సరసన నిలపనుంది. అయితే ప్రస్తుతం రెండే అంతరిక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి. మొదటిది అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ⇒ గతంలో తొలుత అమెరికా, అనంతరం సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్–ప్రస్తుత రష్యా) సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ అమెరికా స్కైలాబ్ పేరిట, యూఎస్ఎస్ఆర్ మిర్ పేరిట అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ ఇటీవల టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మించిన చైనా అంతకుముందు టియాంగాంగ్–1, టియాంగాంగ్–2 పేరుతో మాడ్యూళ్లను ఏర్పాటు చేసుకుంది. -
క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగి..
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం పీజీ విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నారని అధికారులు తెలిపారు. విష ప్రయోగంగా అనుమానిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధి శనివారం తెలిపారు. గురువారం రాత్రి రిమ్స్ గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్ వార్డులో 25 ఏళ్ల బాధిత విద్యార్థిని ఉన్నారు. క్యాంటిన్ నుంచి ఫ్లాస్్కలో తెచి్చన టీని గ్లాసులోకి వంపుకుని పక్కన పెట్టుకున్నారు. ఖాళీ దొరికిన వెంటనే రెండు సార్లు చప్పరించారు. టీ బాగోలేదని, దుర్వాసన వస్తోందని ఆమె తెలపడంతో తోటి వారు ఆ టీ జోలి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి వారు వెంటనే ఆమెను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ‘బాధిత విద్యారి్థని ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. ఫ్లాస్్కతోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించాం. ఇది విష ప్రయోగంగా కనిపిస్తోంది’అని ఓ అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాలు అందాకే వాస్తవం వెల్లడవుతుందని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. క్యాంటిన్ సీల్ చేసి, టీ ఫ్లాస్క్ తీసుకువచి్చన క్యాంటిన్ ఉద్యోగిని పోలీసులు ప్రశి్నస్తున్నారు. -
చిన్నారిని గదిలో ఉంచి తాళం!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకమిది. బెంచీపై నిద్రిస్తున్న రెండో తరగతి చదివే ఎనిమిదేళ్ల చిన్నారిని అలాగే క్లాస్ రూంలో వదిలి, తాళమేసి ఇంటికి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చాక ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. రాత్రంతా చీకట్లో, ఒంటరిగా అలాగే భయంభయంగా ఉండిపోయింది. చివరికి కిటికీలోంచి దూరి బయటకు వచ్చేందుకు శతథా ప్రయత్నించింది. వీలుకాక కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయింది. ఉదయం గ్రామస్తులు వచ్చి చూసే వరకు కొన్ని గంటలపాటు అలాగే వేదన అనుభవించింది. కియోంఝర్ జిల్లాలో అన్జార్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న జోత్య్స దెహురి(8) అనే చిన్నారి తరగతి గదిలో ఓ బెంచీపై పడుకుని అలాగే నిద్రపోయింది. ఆమెను పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. చిన్నారి చీకటిపడిన రాకపోయేసరికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. శుక్రవారం ఉదయం ఆ స్కూలు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయిన స్థితిలో జోత్స్న రోదిస్తూ కనిపించింది. వెంటనే గ్రిల్స్ను తొలగించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్కూలు ఇన్ఛార్జి హెడ్మాస్టర్ గౌరహరి మహంతాను అధికారులు సస్పెండ్ చేశారు. తరగతి గది కిటికీ గ్రిల్లో చిన్నారి తల ఇరుక్కున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఉపాధ్యాయుల వైఖరిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాత తరగతి గదికి తాళాలు వేయాలంటూ 8వ తరగతి విద్యార్థులకు హెడ్మాస్టర్ చెప్పినట్లు విచారణలో తేలిందని డీఈవో వెల్లడించారు. -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/మహబూబ్నగర్/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతోసుధాకర్రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా సుధాకర్రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.అయితే 1998 (12వ లోక్సభ), 2004 (14 లోక్సభ)లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కారి్మక) చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న. మహబూబ్నగర్లో జననం..నల్లగొండతో అనుబంధం సురవరం సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు. చిరస్మరణీయుడు సురవరం సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్ సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు. కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ నేతల సంతాపం సుధాకర్రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా.. చిరుత పులినే తరిమికొట్టిన వీధి కుక్క
వీధి కుక్క.. చిరుత పులి.. ఒళ్లు గగుర్పొడిచే పోరాటం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాడోపేడో తేల్చుకుందామన్నట్టుగా.. చిరుత పులితోనే వీధి కుక్క పోరాటానికి దిగింది. ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఈ దృశ్యం చూసిన అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.నిఫాడ్లో రాత్రి సమయంలో గ్రామంలోకి చేరుకున్న ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసింది. దీంతో తిరగబడిన ఆ శునకం.. పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత మెడని గట్టిగా పట్టుకుని.. తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి దూకుడుగా చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. కుక్క పులి దాడి నుంచి బయటపడింది. అయితే, చిరుత గాయపడిందా? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై స్పష్టత రాలేదు.A stray dog and a leopard had a face off in Nashik’s Niphad, with the dog astonishingly overpowering the big cat and dragging it nearly 300 metres before it fled. The video of the encounter has gone #viral .#leopard #StrayDogs #viralvideo #Maharashtra #nashik #MaharashtraNews pic.twitter.com/wMswGJKTQv— Salar News (@EnglishSalar) August 22, 2025 -
‘ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ’
ఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. ఇంకా ఆయనేమన్నారంటే.. ‘పీవీ నరసింహారావు , టి అంజయ్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక తెలుగు ఆత్మగౌరవం బయటికి వచ్చింది. నాడు వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు సమర్థించలేదు? అని ప్రశ్నించారు. ‘ బ్లాక్ మార్కెట్ వల్ల యూరియా కొరత ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణం. మార్వాడి గో బ్యాక్ నినాదం మంచిది కాదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకోవాలి .. పెద్దవి చేయకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘ఆనాడు కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే.. ఈ బిల్లు వచ్చేది కాదు’
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా. ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు. ‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T— Amit Shah (@AmitShah) August 22, 2025 కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. -
ఫిర్యాదులకు ‘ఆధార’మే
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది. ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్లో తాము చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది. ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్ఐఆర్ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది. బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?బిహార్లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది. -
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
గయాజీ: అవినీతికి పాల్పడి జైలుపాలైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించడానికి చట్టం తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అధికారం వెలగబెడుతున్న వ్యక్తులు జైలుకెళ్లి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు చూసి మనం నిజంగా బాధపడాలని అన్నారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూ మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని చెప్పారు. అలాంటి వ్యక్తులు(ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) రాజ్యాంగ విలువలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లు జైలు నుంచే పరిపాలన చేస్తామంటే మనం చూస్తూ ఉండిపోవాలా? అని నిలదీశారు. 11 ఏళ్ల మా పాలనలో ఎలాంటి అవినీతి మరక లేదని గర్వంగా చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, బిహార్లో ఆర్జేడీ అవినీతి బాగోతాలు ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. అందుకే అవినీతి ముఖ్యమంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచే తొలగించేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి సైతం వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పుచేసి 50 గంటలు జైల్లో ఉంటే పోస్టు నుంచి తొలగిస్తారని, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు వదిలిపెట్టాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకొస్తున్న కఠినమైన చట్టాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, చేసిన పాపాలకు శిక్ష పడుతుందని భయపడుతున్నాయని విమర్శించారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే తప్ప పదవుల్లో కాదన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ముతో బొజ్జలు నింపుకున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్, పశి్చమ బెంగాల్లో పర్యటించారు. బిహార్లోని గయాజీ జిల్లాలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ రాజధాని కోల్కతాలో మూడు మెట్రో రైలు మార్గాలను ప్రారంభించారు. ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130 సవరణ) బిల్లు– 2025తోపాటు బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పరోక్షంగా సమరి్థంచారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... ‘‘పహల్గాంలో మన పర్యాటకులను బలి తీసుకున్న ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని బిహార్ గడ్డపైనే ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చి చూపించా. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టాం.ఓట్ల కోసమే విపక్షాల ఆరాటం: దేశంలో జనాభా స్వరూపం మారకుండా చూడాలన్న లక్ష్యంతో అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఉలుకెందుకు? మన దేశానికి వలసదార్లు, చొరబాటుదార్లు అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ సమస్య గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించా. కొన్ని రాష్ట్రాల్లో జనాభా స్వరూపమే మారిపోతోంది. స్థానికులు మైనారీ్టలుగా మారుతున్నారు. ఇది ఇకపై సాగడానికి వీల్లేదు. అందుకే డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోంది. కేవలం అధికారం దాహంతో దేశ భద్రతను పణంగా పెడుతోంది. చొరబాటుదార్లను గుర్తించి, వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. వారు మన దేశంలో తిష్ట వేస్తామంటే ఒప్పుకోం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నాయి. అక్రమంగా వచ్చినవారంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలి’’. -
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
నిన్నగాక మొన్న ఆరెస్సెస్పై తీవ్ర విమర్శలు గుప్పించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. హఠాత్తుగా స్వరం మార్చారు. ఆరెస్సెస్ గీతాన్ని.. అదీ అసెంబ్లీలో సభ్యులందరి సమక్షంలో ఆలపించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు బళ్లలు చరుస్తూ ఆయన్ని ప్రొత్సహించగా.. ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ సభ్యులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. బెంగళూరు ఆర్సీబీ వేడుకల్లో తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్లు, సెటైర్లు కనిపిస్తున్నాయి.చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు శివకుమారే బాధ్యుడంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. అయితే బెంగళూరు ఇంచార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్ను ముద్దాడాక అక్కడితో తనతోనే తన పని అయిపోయిందని అన్నారాయన. అదే సమయంలో ఇలాంటి ఘటనలు వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయని గుర్తు చేశారు.VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.(Source: Third party)(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4— Press Trust of India (@PTI_News) August 22, 2025దీంతో.. ఆ సమయంలో, ప్రతిపక్ష నేత ఆర్. అశోక గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ చెడ్డీ (RSS యూనిఫాం) వేసుకున్నానని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి స్పందనగా శివకుమార్ ఆరెస్సెస్ గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే…” పాడారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘‘ఈ లైన్లు రికార్డుల నుంచి తొలగించవద్దని ఆశిస్తున్నా’’ అని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలా స్పందిస్తారు?.. ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికే కాంగ్రెస్ చర్యలు తీసుకునేదేమో అని ఒకరు కామెంట్ చేస్తే.. అర్జంట్గా డీకేఎస్కు సీఎం పీఠం అప్పజెప్పకపోతే కాంగ్రెస్ చీలిపోయే ప్రమాదం ఉందని మరొకరు.. ఇది నిజంగానే షాకింగ్ రాజకీయ పరిణామమని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే.. చర్చ తీవ్రతరం కావడంతో డీకే శివకుమార్ తన చర్యపై స్పందించారు.నేను జన్మతః కాంగ్రెస్ వాదిని. ఒక రాజకీయ నేతగా స్నేహితులు, ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోవడం నాకు అవసరం. నేను వాళ్లను అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలపడం అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం.. నాయకత్వం వహిస్తాను. జీవితాంతం కాంగ్రెస్లోనే కొనసాగుతాను అని స్పష్టత ఇచ్చారాయన.ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ఆరెస్సెస్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు స్పందించగా.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ఒక సంస్థగా ఉన్నా, దాని నైతికతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నారు.అయితే కాంగ్రెస్కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఆరెస్సెస్తో పోల్చలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఆరెస్సెస్ చాలా కాలం జాతీయ జెండాను ఎగురవేయలేకపోయిందని, వాజ్పేయి ముందడుగు వేసిన తర్వాతే అది సాధ్యమైంది వ్యాఖ్యానించారు. -
‘తమ్ముడూ’.. ఆ ద్రోహులతో జాగ్రత్త!
పాట్నా: తమ్ముడూ ఆ ద్రోహులతో జాగ్రత్త అంటూ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజశ్వి యాదవ్కు సలహా ఇచ్చారు. ఆ ద్రోహులకు హెచ్చరికలు జారీ చేశారు. తేజ్ ప్రతాప్ ఇటీవల ఫేస్బుక్లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది.ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తేజ్ ప్రతాప్ తన కుటుంబ గౌరవాన్ని మంట గలుపుతున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు.ఈ క్రమంలో తండ్రి తీసుకున్న నిర్ణయంపై తేజ ప్రతాప్ స్పందిస్తూ.. తనపై రాజకీయంగా, వ్యక్తిగతంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సమాజంలో పేరు ప్రతిష్టలున్న ఐదు కుటుంబాలు ఈ కుట్రకు పాల్పడుతున్నాయి.త్వరలో వారి వివరాలను బహిర్గతం చేస్తాను’ అని తేజ్ ప్రతాప్ ప్రకటించారు.ఓ ఐదు కుటుంబాలు గత పదేళ్లుగా నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పెద్ద ఎత్తున కుట్ర చేశాయి. నేను ఏ తప్పూ చేయలేదు. ఎవరిమీద ఎలాంటి కుట్రలకు పాల్పడలేదు. కానీ, ఈ ఐదు కుటుంబాలు వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని నాశనం చేశాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీమ్ తేజ్ప్రతాప్యాదవ్ పేరుతో తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.అదే సమయంలో తనపై రాజకీయ కుట్ర చేస్తున్న వారిని జైచంద్(ద్రోహులు)గా పేర్కొంటూ వారిని టార్గెట్ చేస్తున్నారు.అదే సమయంలో తన తమ్ముడు తేజశ్వి యాదవ్కి కూడా ఆ కుట్రదారుల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, తేజ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆ ఐదు కుటుంబాలు ఎవవో, ఆయన ఎలాంటి ఆధారాలు చూపించబోతున్నారో అన్నది ఆసక్తిగా మారింది. मेरे राजनैतिक जीवन को पांच परिवार के लोगों ने मिलकर और बृहद रूप से षडयंत्र कर समाप्त करने की कोशिश किया।मैने अपने दस वर्षों से अधिक राजनीतिक जीवन में किसी के प्रति कभी गलत नहीं किया, कभी भी किसी के प्रति कोई षडयंत्र नहीं किया।लेकिन इन पांच परिवार के लोगों के द्वारा मेरे… pic.twitter.com/9mb3HUnGXb— Tej Pratap Yadav (@TejYadav14) August 21, 2025 -
పార్లమెంట్లోకి చొరబాటు యత్నం
న్యూఢిల్లీ: ఓ ఆగంతకుడు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచాడు. నిచ్చెన సహాయంతో లోపలికి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో రైల్ భవన్ వైపు నుంచి గోడ ఎక్కి పాత పార్లమెంట్ భవనం గరుడ ద్వారం వరకు చేరుకోగలిగాడు. కాంప్లెక్స్ లోపల మోహరించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. దుండగుడు ఉత్తరప్రదేశ్ నివాసి రామ్కుమార్ బింద్(20) అని, గుజరాత్లోని సూరత్లో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. అదుపులోకి తీసుకున్న సమయంలో అతను మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది. తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని, పార్లమెంట్కు చేరుకునే ముందు రైల్వే స్టేషన్కు కూడా వెళ్లానని, కానీ రైలు ఎక్కలేకపోయానని విచారణలో చెప్పాడు. ప్రస్తుతం, పార్లమెంట్ భద్రతా విభాగం అతడిని ప్రశ్నిస్తోంది. ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత చొరబాటుదారుడిని స్థానిక పోలీసులకు విచారణ కోసం అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. ఉల్లంఘన జరిగిన సమయంలో పార్లమెంటు సభ్యులెవరూ అక్కడ లేరు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. A person entered the Parliament building in the morning by jumping over the wall with the help of a tree. He reached the Garuda Gate of the new Parliament building by jumping over the wall from the Rail Bhawan side. The security present in the Parliament building has caught the…— ANI (@ANI) August 22, 2025 -
కూర వండాడు.. జైలు పాలయ్యాడు
భువనేశ్వర్: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం, నైతికత, సమాజం పట్ల బాధ్యతను విస్మరించి విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించిన ఓ యూట్యూబర్ జైలు పాలయ్యాడు. సాంస్కృతికంగా, చారిత్రికంగా, ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన రూప్ నాయక్ అనే యూట్యూబర్ ఓ వీడియో కారణంగా జైలు పాలయ్యాడు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూప్ నాయక్ తన అత్తింటి నుండి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో అతడికి రోడ్డు పక్కన మానిటర్ లిజర్డ్ (Monitor Lizard ఉడుము) దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్లి, మాంసం వండాడు.అంతేకాదు, ఉడుము మాంసం కూర ఎలా వండాలి? ఎలాంటి దినుసులు వేయాలో మొత్తం సవివరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరలైంది. వైరలైన వీడియో గురించి అటవీ శాఖకు సమాచారం అందింది.ఇంకేం జంతు సంరక్షణ యాక్ట్ 1972 కింద అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా, అటవీ జంతువులను వేటాడటం, చంపడం, లేదా తినడం చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా సైతం చెల్లించాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.