National
-
పెట్రోలు మస్త్ ఉంది, డోంట్ వర్రీ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) 100 శాతం సహజ వాయువు సరఫరాకు ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు. ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుకాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే.కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుంది. విజయ్ మద్దతుతో ఎన్డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్’ఉందని అని వ్యాఖ్యానించారు.మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్డీఏ కూటమి విజయ్తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
పెళ్లిళ్లు స్వర్గాల్లో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసిపెట్టా ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. పెళ్లి పీటల మీద కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పెళ్లి కొడుకుని పోలీసులు తీసుకెళ్లపోయారు. గెస్ట్లంతా గందరగోళంతో చూస్తుండగా, ఎన్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. పోలీసులు ఎందుకొచ్చారంటే..సియారాంపూర్కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. జూన్ 15న, పెళ్లి ఊరేగింపుతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి గురించి అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ సిగోయిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని గ్రామ పెద్ద అశోక్ యాదవ్కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి, ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు.అలా కథ సుఖాంతం అయింది. -
అమరావతిపై లోక్సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్సభలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్ను మోసం చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన ప్రశ్నించారు. -
30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు
ఐటీ కంపెనీలు ఇటీవలి కాలంలో మళ్లీ లేఆఫ్ల బాటపట్టాయి. భారతీయ ఐటీ రంగంలో, ముఖ్యంగా ఒరాకిల్ (Oracle) సంస్థలో భారీ లేఆఫ్స్ బెంగళూరు లాంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ ఇండియా సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. త్వరలోనే మరో 30వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. దీంతో ఏ క్షణాన ‘ఈ రోజే మీ చివరి పని దినం’ అనే సందేశాన్ని మోసుకొచ్చే మెయిల్ వస్తుందేమోనని టెకీల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరికొన్ని వారాల్లో మరో విడత తొలగింపులు జరగవచ్చని అంచనా. రెండు దశాబ్దాల విస్తరణ తర్వాత భారతదేశ ఐటీ సేవల పరిశ్రమలో వృద్ధి వేగంగా మందగిస్తున్న తరుణంలో ఈ ఘటనలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్పనాయి.మంగళవారం ఉదయం 6 గంటలకు (EST) తొలగించబడిన ఉద్యోగులకు ఈ మెయిల్ పంపింది. "ఈ రోజే మీ చివరి పనిదినం" అని సంస్థ పేర్కొన్నట్లు సమాచారం. "సంస్థాగత మార్పు"ను కారణంగా చూపుతూ, ఈ ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది.మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్కు చెందిన సౌరభ్ ముఖర్జీయా ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, ఐటీ రంగం ఒక నిర్మాణాత్మక మందగమనంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. 2005 - 2020 మధ్య, ఐటీ సేవల సంస్థలు తమ ఆదాయాలను, ఉద్యోగుల సంఖ్యను ఏటా సుమారు 15శాతం చొప్పున పెంచుకున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత నియామకాలు తగ్గడంతో ఆ వేగం ఇప్పుడు 5 నుండి 6 శాతానికి పడిపోయింది.దాదాపు రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ఐటీ రంగం ఇప్పుడు మందగిస్తోందని ముఖర్జీయా వ్యాఖ్యానించారు. ఏఐ (AI) ప్రాచుర్యం పొందక ముందే ఈ మందగమనం మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మార్పును మరింత తీవ్రతరం చేస్తోంది. నీతి ఆయోగ్ యొక్క 2025 నివేదిక ప్రకారం, 2031 నాటికి ఐటీ సేవలు , కాల్ సెంటర్లలోని 20శాతం వరకు ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా.ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) నివేదిక ప్రకారం, ఐటీ రంగం "డిఫ్లేషనరీ ఫేజ్" (ధరల తగ్గుదల దశ) లోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల దాదాపు 80 బిలియన్ల డాలర్ల ఆదాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.అలాగే ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం ఐటీ నిపుణుల జీవనశైలి , రియల్ ఎస్టేట్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావంఐటీ నిపుణుల ఆదాయంపై ఆధారపడిన బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కోతల వల్ల ఇప్పటికే ఇల్లు కొన్నవారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుండగా, మిగిలిన ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో కొత్త కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.ఖరీదైన ఇళ్ల నుండి తక్కువ ధరలో ఇళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన ఇళ్లకు బదులుగా తక్కువ ధర గల ఇళ్లను ఎంచుకుంటున్నారు టెక్ నిపుణులు.మరోవైపుప్రస్తుతం ఐటీ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా AI ఆధారిత సేవలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
గోగాముఖ్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ‘ఈ ఎన్నికలు కేవలం విజయం కోసం కాదు వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రజా తీర్పు’ అంటూ గోగాముఖ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసి, ఘనమైన ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలుప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటములలో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగిన తన మొదటి సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే ఎన్డీఏ విజయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. Assam has seen rapid development over the past decade. The people are ready to reaffirm their faith in the BJP-NDA. Watch from Gogamukh.https://t.co/UN20VAYJoS— Narendra Modi (@narendramodi) April 1, 2026మేనిఫెస్టోలో వరాల జల్లుఅస్సాం అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక హామీలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. 15 లక్షల కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా ఇప్పటికే మూడు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 40 లక్షలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘అరుణోదయ’ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.ఏప్రిల్ 9న పోలింగ్అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. గత పదేళ్ల అభివృద్ధి మళ్లీ తమను అధికారంలోకి కూర్చోబెడుతుందని బీజేపీ భావిస్తుండగా, అధికారపక్షాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మోదీ పర్యటనతో అస్సాం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇది కూడా చదవండి: Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు -
ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు
ఇప్పటివరకు బ్యాంకుల స్కాం గురించి విన్నాం. భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాదారులు మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ గోల్డ్ లోన్(Gold Loan) పేరుతో స్వయంగా ఖాతాదారులే మోసానికి పాల్పడటం గురించి విన్నారా? మహరాష్ట్ర నాగ్పూర్లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్లో ఈ మెగా గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఖాతాదారులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు రూ. రూ. 23 కోట్ల విలువైన బంగారు రుణాల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్లోని తమ తొమ్మిది శాఖలలో స్కాం జరిగిందని ICICI బ్యాంక్ అధికారులు అంతర్గత తనిఖీలో గుర్తించారు. 'గోల్డ్ లోన్' పోర్ట్ఫోలియోపై నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఇది బయటపడింది. తొమ్మిది వేర్వేరు శాఖల్లో తాకట్టు పెట్టిన ఆభరణాలను పరిశీలించగా, అవి అసలు బంగారం కాదని, నకిలీ అని తేలింది.మొత్తం 195 మంది ఖాతాదారులు ఈ నకిలీ బంగారాన్ని చూపి రుణాలు పొందారు.ICICI బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఉద్యోగి అయిన ధనంజయ్ రమేష్ థైటే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ధంతోలి పోలీసులు మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసపూరిత పథకం జనవరి 2023 నుండి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?బ్యాంక్ అధికారుల ప్రమేయం?సాధారణంగా గోల్డ్ లోన్ ఇచ్చే ముందు బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి 'వాల్యూయర్స్' (Valuers) ఉంటారు. వారి అనుమతి లేదా క్లియరెన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు కావడం అసాధ్యం. కాబట్టిఈ కుట్రలో బ్యాంక్ ఉద్యోగులు లేదా అధికారులు కూడా భాగస్వాములై ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వాల్యూయర్స్ కావాలనే నకిలీ బంగారాన్ని అసలుదిగా ధృవీకరించారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఏఐతో మీడియా రంగంలో పెనుమార్పులు
థింపూ: ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై కీలక సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 30, 31 తేదీల్లో జరిగింది. భూటాన్ మీడియా ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించింది. భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాయల్ థింపూ కాలేజ్కు చెందిన ప్రొఫెసర్ పల్లవి మజుందార్, కాంట్రైల్స్ ఏఐకు చెందిన అమితాభ్ కుమార్ కూడా శిక్షకులుగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే ఉడుముల, పల్లవి మజుందార్, అమితాభ్ కుమార్లతో మాట్లాడారు.పత్రికారంగంలో కృత్రిమ మేధస్సు పాత్రపై ఉడుముల మాట్లాడుతూ, “జర్నలిజం, దర్యాప్తు కథనాలు, ధృవీకరణ, పంపిణీ, న్యూస్రూమ్ పనితీరులో ఏఐ పెద్ద మార్పులు తీసుకొస్తోంది” అన్నారు. “నాణ్యత పెంపు, సమాచారం సేకరణ మెరుగుదల, పునరావృత పనుల్లో వేగం పెంపు, పంపిణీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రిపోర్టింగ్, ధృవీకరణ, సంపాదకీయ నిర్ణయాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు” అని చెప్పారు. దర్యాప్తు జర్నలిజంలో పెద్ద డేటా విశ్లేషణ, పత్రాల పరిశీలన, నమూనాల గుర్తింపు, ట్రాన్స్క్రిప్షన్, అనువాదం, ధృవీకరణ పనుల్లో ఏఐ సహాయపడుతుందని ఆయన వివరించారు. అదే సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వ్యాఖ్యలు, పాక్షికత, అతి విశ్వాసం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. మానవ పర్యవేక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు. పత్రికారంగంలో ఏఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలంటే స్పష్టమైన సూచనలు, నైతిక నియంత్రణలు, పారదర్శకత, బాధ్యత, డీప్ఫేక్లపై జాగ్రత్త అవసరమని ఉడుముల పేర్కొన్నారు. “ఏఐ జర్నలిస్టులకు సహాయక సాధనంగా ఉండాలి. సంపాదకీయ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదు” అని తెలిపారు. -
అస్సాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
అస్సాంలో తమను గెలిపిస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ పేర్కొంది. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్ర మించిన భూములను విడిపించి స్థానికులకు అందజేస్తాం. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తాం’’అని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 31 హామీలతో కూడిన బీజేపీ ‘సంకల్పపత్ర’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం గువాహటిలో విడుదల చేశారు. ఇక అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..అరుణోదయ్ పథకం లబ్ధిదారులైన మహిళలకు ఆర్థిక సాయం ప్రస్తుత రూ.1,250 నుంచి క్రమంగా రూ.3,000కు పెంపుగిరిజనులతో సహా అర్హులైన తేయాకు కార్మికులందరికీ భూ పట్టాలు. రూ.500 చొప్పున వేతన పెంపు. అక్రమ చొరబాటుదారులకు దేశ బహిష్కరణ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుతో అస్సామీల నాగరికత, వారసత్వం, హక్కుల పరిరక్షణ మిషన్ వసుంధర’లో భాగంగా చొరబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రతి అంగుళం భూమికీ విముక్తి. వాటిపై అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు.చదవండి: బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్! -
మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. తన వాగ్ధాటితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీని ఇరకాటంలో పడేశాయి. గుజరాతీ సమాజంపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదం కావడంతో, స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి క్షమాపణలు కోరాల్సి వచ్చింది.అసలేం జరిగింది?మూడు రోజుల క్రితం తృణమూల్ భవన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహువా మోయిత్రా స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీల పాత్రను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మీరు కాలాపానీ (అండమాన్ సెల్యులార్ జైలు)కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరి పేర్లు కనిపిస్తాయి? అక్కడ ఎంతమంది గుజరాతీలు ఉన్నారు? జైలు శిక్ష అనుభవించిన వారిలో 68 శాతం మంది బెంగాలీలే.. ఆ తర్వాత పంజాబీలు ఉంటారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భవానీపూర్లో సెగ.. దీదీ క్షమాపణలుమహువా చేసిన ఈ వ్యాఖ్యలపై భవానీపూర్లోని గుజరాతీ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో గుజరాతీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో అప్రమత్తమైన టీఎంసీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వార్డు నంబర్ 70 కౌన్సిలర్ అసిమ్ బసు ద్వారా మమతా బెనర్జీ ఒక బహిరంగ క్షమాపణ లేఖను విడుదల చేశారు. ‘నా గుజరాతీ సోదర సోదరీమణులకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. మీ పట్ల నాకు ఎంతో గర్వం ఉంది. సంబంధిత ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవి అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. మేము వాటిని సమర్థించం’ అని మమత తన సందేశంలో పేర్కొన్నారు.పార్టీ అనుమతి లేని వ్యాఖ్యలుఎంపీ మహువా మోయిత్రా పార్టీ అనుమతి లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని కౌన్సిలర్ అసిమ్ బసు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ను హిందీ, ఇంగ్లీష్తో పాటు ప్రత్యేకంగా గుజరాతీ భాషలోనూ విడుదల చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ వార్డులో టీఎంసీ వెనుకబడి ఉండటంతో, ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.ప్రీమియం ఇంధనాలకు ధరల సెగలగ్జరీ కార్లు, సూపర్ బైక్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధరవ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.ఏటీఎఫ్ రూ.2 లక్షలువిమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఊరటప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
ర్యాపిడో బుక్ చేస్తే ఇదేనా..? యువతికి చేదు అనుభవం
బెంగళూరు: యువతి పట్ల ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా వ్యవహరించగా అ తన్ని బెంగళూరు ఇందిరానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక యువతి బీటీఎం లేఔట్ నుంచి ఇందిరానగర్ వెళ్లడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. బైక్ డ్రైవర్ మహమ్మద్ ఖాజా ప్రయాణం సమయమంతా యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. దీంతో యువతి ఇందిరానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ‘కుక్కకాటుకు కోమాలోకి..బెంగళూరు: వీధి కుక్కల దాడిలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి జారుకున్న సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా హొల్లోళిహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. బసవరాజు (18) అనే వ్యక్తిపై ఇటీవల వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని బిమ్స్ ఆస్పత్రికి తరలించగా కోమాలోకి వెళ్లిపోయాడు. -
బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్!
తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హామీలు ఇవే..నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు. -
‘రండి బాబూ రండి.. 50 రూపాయలకే స్వచ్ఛమైన గాలి’
న్యూఢిల్లీ: మనం తాగే మంచి నీటిని బాటిళ్లలో కొనుక్కోవడం మనకు అలవాటే.. అయితే పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని కూడా సీసాల్లో కొనుక్కునే రోజులు వచ్చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఒక వ్యక్తి ‘స్వచ్ఛమైన గాలి’ని విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కన్నౌట్ ప్లేస్లో కనిపించిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధర్మశాల నుంచి ‘ప్యూర్ ఎయిర్’..హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతమైన ధర్మశాల నుంచి స్వచ్ఛమైన గాలిని ప్లాస్టిక్ సీసాల్లో నింపి తీసుకొచ్చినట్లు గాలి విక్రయదారు చెబుతున్నాడు. అతను ఒక్కో బాటిల్ ధర రూ. 50 గా నిర్ణయించాడు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ వాసులు ఈ ‘స్వచ్ఛమైన గాలి’ అనుభవం కోసం క్యూ కడుతున్నారు. ఆ బాటిళ్లు కొనుక్కుని పీలుస్తూ ‘నిజంగానే ఢిల్లీ గాలికంటే ఇది చాలా భిన్నంగా, హాయిగా ఉంది’ అని కొనుగోలుదారులు అభిప్రాయపడటం గమనార్హం. This guy sold “air” from Dharamshala for ₹50 to people in Delhi, and those buying it actually said it felt different from Delhi’s air. What looks like a random video today could turn into a real business and a harsh reality in the coming years, the bigger concern is whether even… pic.twitter.com/MS2nDwzj5A— Nikhil saini (@iNikhilsaini) March 31, 2026విషపూరితమైన గాలికి నిదర్శనంఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. మంగళవారం నాటి లెక్కల ప్రకారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 171 గా నమోదైంది. ఇది ‘పేలవమైన’ కేటగిరీ కిందకు వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.ముంచుకొస్తున్న ముప్పు?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రోజు ఇది ఒక ఫన్నీ వీడియోలా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో గాలిని ఇలాగే కొనుక్కోవాల్సి రావడం ఒక చేదు నిజం కాబోతోంది’ అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇది ఒక వింత వ్యాపారంగా కనిపిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రేపు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
‘జుబీన్’ చుట్టూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ దుమారం 52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది. స్మారకం చుట్టూ నేతల చక్కర్లు గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు! -
జైలు నుంచే అసెంబ్లీకి
ప్రొఫైల్ అఖిల్ గొగోయ్. రైజోర్ దళ్ అధ్యక్షుడు. శివసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మార్క్సిస్ట్ విశ్వాసాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అస్సాం రైతులకు ఆశాకిరణంగా మారారు. భూ హక్కులు, పర్యావరణ పరిరక్షణ పోరాటాలతో వెలుగులోకి వచ్చి అవినీతి వ్యతిరేకోద్యమ నేతగా ఎదిగారు. అరెస్టులు, జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. జైలు నుంచే అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రచారమే చేయకుండా ఎన్నికల్లో గెలిచిన తొలి అస్సామీ నేతగా నిలిచారు. వందకు పైగా కేసులు! అఖిల్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలోనే మొదలైంది. గువాహతిలోని కాటన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత సీపీఐ (ఎంఎల్) అనుబంధ సంస్థలో చేరినా కొంతకాలానికే బయటికొచ్చారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టడానికి సమాచార హక్కు చట్టాన్నే ఆయుధంగా చేసుకున్నారు. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ సమస్యలపై పోరాటానికి ‘కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి’(కేఎంఎస్ఎస్)ని ఏర్పాటు అఖిల్ ఉద్యమ ప్రయాణంలో కీలక మలుపు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, భూ హక్కుల కోసం, రైతులు, దినసరి కూలీల సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అఖిల్ను అరెస్టు చేసినా కొంతకాలానికే నిర్దోషిగా విడుదలయ్యారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంలోనూ పని చేశారు. 2012లో కొండ ప్రాంతాలవారిని బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ, కజిరంగా నేషనల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమించి పలుమార్లు అరెస్టయ్యారు. ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కదాంట్లోనూ ఆయన దోషిగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత జీవితం అఖిల్ 1976 మార్చి 1న జోర్హాట్లోని సెలెన్ఘాట్ గ్రామంలో జని్మంచారు. గువాహటిలోని కాటన్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. ఆయన తండ్రి, బోలురామ్ తల్లి ప్రియదా గొగోయ్, భార్య గీతాశ్రీ తమూలీ, కుమారుడు నచికేత ఉన్నారు. ఈసారి కాంగ్రెస్తో జట్టు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లో ఉద్యమించడంతో హిమంత సర్కారు అఖిల్పై దేశద్రోహ ఆరోపణలు మోపి జైలుకు పంపింది. దానిపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కేఎంఎస్ఎస్ సహా సుమారు 70 అనుబంధ సంస్థలు కలిసి అఖిల్ సారథ్యంలో ‘రైజోర్ దళ్’గా మారాయి. జైల్లో ఉంటూనే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యరి్థపైనే దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు! తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రైజోర్ దళ్ కాంగ్రెస్తో జట్టుకట్టింది. అఖిల్ పారీ్టకి కాంగ్రెస్ ఏకంగా 13 స్థానాలు కేటాయించింది! అఖిల్ మళ్లీ శివసాగర్ నుంచే బరిలో దిగారు. అక్కడ బీజేపీ భాగస్వామి అస్సాం గణ పరిషద్ కూడా స్నేహపూర్వక పోటీ చేస్తుండటం విశేషం. -
విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంటున్న వేళ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుణితుర నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి అంజలి నాయర్ తన పేరు విషయంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్ పేపర్, ఈవీఎంలలో తన పేరును మార్చాలని ఆమె కోరుతున్నారు.అసలు సమస్య ఏమిటి?ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రస్తుతం ‘అంజలి పీవీ’వి. అని ఉంది. అయితే ఓటర్లకు ఆమె ‘అంజలి నాయర్’ గానే సుపరిచితురాలు. ఒకవేళ ఈవీఎంపై అంజలి పీవీ అని ఉంటే, సామాన్య ఓటర్లు గుర్తుపట్టలేరని, ఇది తన గెలుపు అవకాశాలపై, ఓట్ల శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోర్టులో వాదనలుతన ప్రచార సామాగ్రి, పోస్టర్లు, సోషల్ మీడియా పబ్లిసిటీ అంతా ‘అంజలి నాయర్’ అనే పేరుతోనే జరిగిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరుకు, ప్రచారంలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని అంజలి నాయర్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కేరళ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.సాంకేతిక ఇబ్బందులుఅయితే ఈ దశలో పేరు మార్పు చేయడం ఎన్నికల సంఘానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలో ఇప్పటికే కొన్ని విభాగాల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధానం ఇప్పటికే ప్రారంభం కాగా, సర్వీస్ ఓటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరునే సాధారణంగా బ్యాలెట్ పేపర్పై ముద్రిస్తారు కాబట్టి, ఇప్పుడు మార్పులు చేయడం ఎంతవరకు సాధ్యమనేది ఉత్కంఠగా మారింది.ఇది కూడా చదవండి: కెనడా గ్యాంగ్వార్లో పంజాబ్ యువకుడి హత్య -
మళ్లీ షాక్.. పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్లోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.195.5, కోల్కతాలో రూ.218 పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు ఈ మేరకు ప్రకటన చేశాయి.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరగడంతో కొత్త రిటైల్ ధర రూ.2,078.50కు చేరింది. ఇప్పటికే మార్చి 1న ప్రతి సిలిండర్పై రూ.114.5 పెంచిన విషయం తెలిసిందే.సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర మార్చి 7న రూ.60 పెరిగి, రూ.913కు చేరింది. ఆ తర్వాతి నుంచి ఈ ధరల్లో ఎలాంటి మార్పులేదు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రధాన చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, కరెన్సీ మార్పిడి రేట్ల ఆధారంగా ఈ ధరలను సవరిస్తాయి.ఎల్పీజీ మార్కెట్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72గా ఉండగా, డీజిల్ రూ.87.62గా ఉంది. గత సంవత్సరం మార్చిలో లీటరుకు రూ.2 తగ్గింది. ఆ తర్వాత ఈ ధరల్లో మార్పు లేదు. -
‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్నా, ప్రతిపక్షంలో నిలబడాలన్నా కేవలం సిద్ధాంతాలు ఉంటే సరిపోదు.. ప్రజల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన ‘గ్లామర్’ కూడా తోడవ్వాలి. దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీ (టీఎంసీ) నుంచి, సవాల్ విసురుతున్న బీజేపీ (బీజేపీ) వరకు అందరికీ సినీ తారలే బ్రహ్మాస్త్రాలుగా మారారు. ఒకప్పుడు కేవలం ప్రచారానికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు, నేడు నేరుగా ఎన్నికల బరిలో నిలిచి, పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నారు. అటు గ్లామర్ అటు పవర్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న ఆ బెంగాలీ అగ్ర తారల ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.మిథున్ చక్రవర్తి: ‘డిస్కో డాన్సర్’ నుంచి బీజేపీ స్టార్ వరకు..బెంగాలీ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ ‘గ్రాండ్ మాస్టర్'గా పేరు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. గతంలో తృణమూల్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నేతగా ఉన్నారు. తన డైలాగులతో ప్రచార సభల్లో ఉత్సాహం నింపడం ఆయన ప్రత్యేకత.నుస్రత్ జహాన్: వివాదాలు.. విజయాలుబెంగాలీ సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరైన నుస్రత్ జహాన్, 2019లో తృణమూల్ కాంగ్రెస్ తరపున బసిర్హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తన పెళ్లి, పార్లమెంటులో తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచే నుస్రత్, 2024 వరకు ఎంపీగా సేవలు అందించారు.మిమీ చక్రవర్తి: యువత ఆరాధ్య దైవంనుస్రత్ జహాన్ ఆప్తమిత్రురాలు మిమీ చక్రవర్తి కూడా 2019లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇటీవల తన పదవికి రాజీనామా చేసి తిరిగి సినిమాలపై దృష్టి సారించినప్పటికీ, రాజకీయాల్లో ఆమె ప్రభావం మాత్రం తగ్గలేదు.చిరంజిత్ చక్రవర్తి: నిలకడైన రాజకీయ నాయకుడువెండితెరపై హీరోగా మెప్పించిన చిరంజిత్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. బారాసత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో ఈయన ఒకరు.సాయోనీ ఘోష్: కొత్త తరం గళంనటి, గాయని అయిన సాయోనీ ఘోష్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. గతంలో టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 2024 ఎన్నికల్లో జాదవ్పూర్ నుంచి ఎంపీగా గెలిచి, పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆమె ప్రసంగాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.హిరన్ ఛటర్జీ: బీజేపీ పోరాట యోధుడుఖరగ్పూర్ సదర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న హిరన్ ఛటర్జీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నారు. సినిమాల్లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, రాజకీయాల్లో మాత్రం మాస్ లీడర్గా ఎదిగారు.సోహమ్ చక్రవర్తి - రాజ్ చక్రవర్తిసోహమ్ చక్రవర్తి: చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగిన సోహమ్, ప్రస్తుతం టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సినీ విభాగంలో చురుగ్గా ఉంటూ చండిపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.రాజ్ చక్రవర్తి: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ చక్రవర్తి, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులు. బరాక్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అటు సినిమాలు ఇటు రాజకీయాలను సమన్వయం చేసుకుంటున్నారు.పర్ణో మిత్ర - సయంతిక బెనర్జీనటి పర్ణో మిత్ర గతంలో బీజేపీలో చేరి వార్తల్లో నిలిచారు. మరోవైపు సయంతిక బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.శ్రావంతి ఛటర్జీ: గ్లామర్ పాలిటిక్స్ప్రముఖ నటి శ్రావంతి ఛటర్జీ 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, ఆ ఎన్నికల తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వార్తల్లో నిలిచారు.పశ్చిమ బెంగాల్లో కేవలం గ్లామర్ ఉంటేనే రాజకీయాల్లో గెలవడం సాధ్యం కాదు. ప్రజల సమస్యల మీద పోరాడాలి. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న నటీనటులు ఈ రెండు రంగాల్లోనూ సమతూకం పాటిస్తూ, బెంగాల్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సినిమాల్లో వారి పాత్రలు ఎలా ఉన్నా, రాజకీయ తెరపై వారు పవర్ ఫుల్ లీడర్లుగానే కనిపిస్తున్నారు.ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! -
కాంగ్రెస్.. రాజకీయ రాబందు
థరాడ్/గాందీనగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలను వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మనపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. మంగళవారం గుజరాత్లోని వావ్ థరాడ్ జిల్లా నానీ గ్రామంలో మోదీ పర్యటించారు.రూ.19,806 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఖేడ్బ్రహ్మ–హిమ్మత్నగర్–అసర్వా రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చింన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకొని ఉంది’’ అని దుయ్యబట్టారు. ఇంధన భారం పడకుండా చర్యలుపలు దేశాలు యుద్ధం, అశాంతి, అస్థిరతలో కూరుకుని ఉంటే భారత్ మాత్రం సుస్థిరత, ఐక్యతను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత పెరిగిందని గుర్తుచేశారు. ఇంతటి సంక్షోభంలోనూ మన బలమైన విదేశాంగ విధానం, పౌరుల సమష్టి కృషితో ప్రతికూల పరిస్థితిని విజయవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఇంధనం ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయన్నారు. ఈ భారం మన ప్రజలపై పడకుండా చర్యల చేపటినట్లు వెల్లడించారు. శాంతి, అహింస సందేశం ప్రపంచ అస్థిరత, అశాంతి మంటల్లో చిక్కుకున్న నేటి తరుణంలో సామ్రాట్ సంప్రాతి మ్యూజియం శాంతి, అహింస సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ సమీపంలో శ్రీమహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం వారసత్వం, సందేశం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. విశ్వసనీయ సరఫరాదారు భారత్ గుజరాత్లోని సనంద్లో కేనెస్ సెమీకాన్ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్లలో మనదేశం విశ్వసనీయ సరఫరాదారుగా మారిందని చెప్పారు. ‘‘21వ శతాబ్దం పలు సవాళ్లు తెచి్చంది. సంఘర్షణల వల్ల ప్రపంచ సప్లై చైన్లు ప్రభావితమయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత, ఇంధన భద్రతకు మా ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది’’ అని వివరించారు. -
బిహార్ ఆలయంలో విషాదం
బిహార్ షరీఫ్: బిహార్లోని నలంద జిల్లాలోని శీతలామాత ఆలయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. దీప్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిహార్ షరీఫ్ పట్టణంలోని ఈ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెల్సి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు.మంగళవారం ఉదయం ఈ తొక్కిసలాట జరిగిందని బిహార్ షరీఫ్ పట్టణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూరుల్ హక్ మీడియాకు తెలిపారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో అత్యంత శుభప్రదంగా భావించి మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చైత్రమాసం చివరి మంగళవారం, మహావీర్ జయంతి కలిసిరావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇదే సమయంలో బారికేడ్లు విరిగిపోవడంతో జనం ఒక్కసారిగా కిందపడడంతో తొక్కిసలాట జరిగింది’’ అని స్థానికుడు ఒకరు వెల్లడించారు.‘‘తొక్కిసలాట జరగడంతో అంతా గందరగోళ పరిస్థితి తలెత్తింది. వెంటనే పోలీసులు వచ్చి భక్తులను వెనక్కి తోసేశారు. లాఠీచార్జ్ చేశారు’’ అని ఒక భక్తుడు తెలిపారు. భక్తుల మరణవార్త తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయనున్నారు.క్షతగాత్రులకు తలో రూ.50,000ను ఇవ్వనున్నారు. ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.6 లక్షల ఎక్స్గ్రేíÙయా ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని దీప్నగర్ పోలీస్స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. వివరాలు తెల్సుకునేందుకు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆలయంలో అధ్వాన్న ఏర్పాట్ల కారణంగానే తొక్కిసలాట జరిగిందని బిహార్ శాసనసభలో విపక్షనేత తేజస్వీయాదవ్ వ్యాఖ్యానించారు. -
డీజీసీఏ చీఫ్గా కొత్త అధికారి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొత్త చీఫ్గా సీనియర్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ని నియమించింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖలకు బదిలీ చేసింది.కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీ పరిపాలనా ప్రక్షాళనలో భాగంగా పౌర విమానయాన నియంత్రణ సంస్థ నూతన చీఫ్గా సీనియర్ బ్యూరోక్రాట్ వీర్ విక్రమ్ యాదవ్ నియమాకం చేపట్టింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శి స్థాయి హోదాల్లో నియమించింది.పునీత్ కన్సల్: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి. విశాల్ గగన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యదర్శిగా, జ్ఞానేంద్ర డి త్రిపాఠి భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) కార్యదర్శి మరియు వ్యవసాయ పరిశోధనా విభాగం అదనపు కార్యదర్శిగా నియమించింది.ఒడిశా క్యాడర్కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది. -
ముంబై మున్సిపల్ కమిషనర్గా మహిళా అధికారి
బృహన్ ముంబై నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా అశ్విని భిడే నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆసియాలోనే అతిపెద్ద మున్సిపాలిటీకి కమిషనర్గా వ్యవహరించనున్న మహిళ అధికారిగా అశ్విని భిడే రికార్డు సాధించనున్నారు. ముంబై మేయర్ రీతూ వాడే ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మహిళా కమిషనర్ ఎంపిక "నారీ శక్తి"కి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ముంబై నగరాన్ని మరింత స్మార్ట్గా, పరిశుభ్రంగా మార్చడంలో ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా BMC చరిత్రలో మొట్టమొదటి మహిళా కమిషనర్గా సేవలు అందిస్తోన్న అశ్విని భిడే 1995 కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో ముంబై మెట్రోలో 2015 నుండి 2020 వరకు రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సేవలందించారు. కాగా ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కోసం నలుగురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుతో అశ్విని భిడే ఎంపికయ్యారు. -
హీరో విషాద మరణం : అసలు ట్విస్ట్ ఇదే!
ఒడిశాలోని తల్సారీ బీచ్లో ఒక టీవీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.షూటింగ్ సమయంలో తన సహ నటి నీటిలో ఉన్న ఒక లోతైన గుంతలో పడిపోవడాన్ని గమనించిన రాహుల్, ఆమెను రక్షించే ప్రయత్నంలో స్వయంగా నీటిలో మునిగిపోయారు. మోకాలి లోతు నీటిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, సముద్రపు అలల తాకిడికి మలయాళ నటి (సహ నటి) అదుపు తప్పి పడిపోయారు. ఆమె చీరలో ఉండటంతో నీటిలో చిక్కుకుపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆయన లోపలికి వెళ్లి మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షి తపన్ చెప్పారుస్థానిక పడవ నడిపే వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ సాహసంగా ముందుకు అడుగు వేసినప్పటికీ, సముద్రపు అడుగుభాగం సమానంగా లేకపోవడం ఇసుక మూలంగా బయటకు రాలేకపోయారు. అంతేకాదు రాహుల్ను బయటకు తీసినప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, కానీ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తక్షణమేఅతన్ని బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాహుల్ను కాపాడలేకపోయారు. తల్సరి నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి అతన్ని తరలించే సమయానికే మరణించినట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: గ్యాస్ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారంఅనుమతి లేదుఈ ప్రమాదం విషయంలో భద్రతా పరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న విషయంపై అనుమతి తీసుకోలేదని, ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారులంటున్నారు. స్పీడ్బోట్లో చిత్రీకరణ జరుపుతుండగా, బలమైన అలల కారణంగా వారు సముద్రంలో పడిపోయారని పోలీసులు తెలిపారు. తోటి మహిళా నటిని త్వరగా రక్షించినప్పటికీ, రాహుల్ను గుర్తించి నీటిలోంచి బయటకు తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందని సమాచారం. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, అక్కడ లైఫ్ గార్డులు, వైద్య బృందం ,రెస్క్యూ బోట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళమని స్థానిక అధికారి చెప్పారు.పోస్టుమార్టం నివేదికరాహుల్ ఊపిరితిత్తుల్లోకి ఉప్పు నీరు, ఇసుక వెళ్లడం వల్లే ఆయన మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.42 ఏళ్ల రాహుల్ అరుణోదయ బెనర్జీ కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా, పాడ్కాస్ట్ హోస్ట్గా కూడా సుపరిచితులు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలో పెద్ద లోటును మిగిల్చింది. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
‘ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటేయడం ఎలా సాధ్యం?’
ఢిల్లీ: ఏపీ-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్ బూత్ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్. ఈ మేరకు ఏపీ ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆధారాలతో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఏపీ-2024 ఎన్నికల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి?, 3,500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడం వెనుక అనుమానాలున్నాయి. రాత్రి గం. 11. 45ని నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటు వేయడం ఎలా సాధ్యం. ఇది ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది’ అని తన ప్రజెంటేషన్లో పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!
మధ్యప్రాచ్య సంఘర్షణపై నెలకొన్న ఆందోళనల నడుమ.. ఎల్పీజీ, ముడి చమురు నౌకలు కొచ్చికి చేరుకుని వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. ఖతార్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న 'అపోలో ఓషన్' ట్యాంకర్ నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకుంది. ఈ ట్యాంకర్ 9,086 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది.నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకున్న ట్యాంకర్, గ్యాస్ను దించిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎల్పీజీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన వివిధ బాట్లింగ్ ప్లాంట్లకు రవాణా చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో, దిగుమతి చేసుకున్న ఎల్పీజీ రాక చమురు కంపెనీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.ఇదిలా ఉండగా.. రష్యా ముడి చమురు కూడా కొచ్చికి చేరుకుంది. 'నెవా' అనే చమురు ట్యాంకర్ రష్యాలోని కోస్మినో పోర్ట్ నుండి 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో కొచ్చికి చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే మన దేశంలో గ్యాస్ కొరత తగ్గుతుందని తెలుస్తోంది. -
గ్యాస్ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం
ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్,ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు,ఎల్పిజి (LPG) కొరత ఉన్న నేపధ్యంలో ఐఐటీ బాంబే తన క్యాంపస్లోని వంటశాలలను ఎల్పిజి కొరత నుంచి బయటపడేలా, ఒక వినూత్న మార్గాన్ని కనుగొంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తోంది. ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో వీరి ఆవిష్కారం ప్రాధాన్యతను సంతరించుకుంది. కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ సంజయ్ మహాజని నేతృత్వంలో 2014లో ఈ పరిశోధన ప్రారంభమైంది. క్యాంపస్లో కుప్పలుగా పేరుకుపోయే ఎండుటాకులను తొలగించడం, పారవేయడం లాంటివి సవాలుగా మారడంతో వారిలో కొత్త ఆలోచన మెదిలింది. దీన్ని శక్తిగా మార్చే ఆలోచన చేశారు.ఐఐటీ బాంబే 'బయోమాస్ గ్యాసిఫికేషన్'దశాబ్ద కాలం సుదీర్ఘ పరిశోధన తర్వాత, ఎండుటాకులను సమర్థవంతమైన వంట ఇంధనంగా మార్చే 'బయోమాస్ గ్యాసిఫికేషన్' (Biomass Gasification) సాంకేతికతను వారు రూపొందించారు. ఈ ప్రయోగాల్లో అనేక సవాళ్లు తప్పలేదు వీరికి. మొదట్లో పొగ రావడం, 'క్లింకర్స్' (వ్యర్థాలు పేరుకుపోయి వ్యవస్థ ఆగిపోవడం) వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ 2016 నాటికి ఈ సమస్యలను అధిగమించి పేటెంట్ పొందారు. 2017లో ఎనర్జీ సైన్స్ విభాగం నుండి ప్రొఫెసర్ సందీప్ కుమార్ చేరడంతో బర్నర్ డిజైన్ మరింత మెరుగుపడింది. 2024 నాటికి ఈ వ్యవస్థను స్టాఫ్ క్యాంటీన్లో విజయవంతంగా ఏర్పాటు చేశారు.#WATCH | Mumbai, Maharashtra: The Indian Institute of Technology (IIT) Bombay has developed an indigenous technology to combat the rising prices and potential shortages of LPG (cooking gas). Through its patented biomass gasification technology, the institute has successfully… pic.twitter.com/rVVIFDrKGV— ANI (@ANI) March 31, 2026లాభాలు ప్రస్తుతం క్యాంటీన్లలో 30శాతం నుండి 40శాతం వరకు ఎల్పిజి వాడకం తగ్గింది. హాస్టల్ మెస్సుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాదు ఇది పర్యావరణ హితం కూడా. ఏటా దాదాపు 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఇది తగ్గిస్తుంది. ఈ వ్యవస్థ 60శాతం థర్మల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.#WATCH | Mumbai, Maharashtra: IIT Bombay Professor Sanjay Mahajani says, "I am a faculty member here in the Department of Chemical Engineering at IIT Bombay. My research focuses on gasification and energy conversion. These dried leaves and twigs—if we simply burn them—they do, in… https://t.co/kxKaTbH3hv pic.twitter.com/E5qHmO4u5Y— ANI (@ANI) March 31, 2026మరింత విస్తరణకేవలం క్యాంపస్లకే పరిమితం కాకుండా, పరిశ్రమలు మరియు భారీ వంటశాలలలో కూడా ఈ సాంకేతికతను వాడేలా విస్తరించాలని ఐఐటీ బృందం భావిస్తోంది. అంతేకాకుండా, 2019 నుండి ఐఐటీ బాంబే ప్రతిరోజూ 2 టన్నుల తడి వ్యర్థాలను శక్తిగా మార్చే 'బయోమెథనేషన్' ప్లాంట్ను కూడా నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్యప్రొఫెసర్ సంజయ్ మహాజని ఏమంటారంటే..తన పరిశోధన గ్యాసిఫికేషన్ , శక్తి మార్పిడిపై కేంద్రీకృతమై ఉందని, ఈనేపథ్యంలోనే క్యాంపస్లోని ఈ వ్యర్థ పదార్థంలోనే సహజంగానే శక్తి ఉన్నప్పుడు, దానిని మన అంతర్గత అవసరాల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించామనీ ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ సంజయ్ మహాజని చెప్పారు. ఈ వ్యర్థాలను దహనం చేసినప్పుడు, అది ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ రూపంలో గణనీయమైన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గణనీయంగా తగ్గించే విధంగా తాము గ్యాసిఫైయర్ డిజైన్ను రూపొందించామన్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువును 'ప్రొడ్యూసర్ గ్యాస్' అంటారు. ఇలా ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ , హైడ్రోజన్లను వెంటనే దహనం చేస్తేఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాయువును దహనం చేసినప్పుడు, విడుదలయ్యే శక్తి ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ప్రాథమికంగా, నీటిని ఆవిరిగా మారుస్తాం, ఇది ఆహార తయారీకి ఉపయోగించే ఆవిరి ఆధారిత వంట పరికరాలను,ఇతర ఉపకరణాలను నడపడానికి శక్తినిస్తుందని వివరించారు. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
‘హనీమూన్ మర్డర్ కేసు’.. రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడు!
షిల్లాంగ్: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే భార్య సోనమ్ రఘువంశీ చేతిలో దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాజా రఘువంశీ సోదరుడు సచిన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా తన తమ్ముడు రాజా మళ్లీ పుట్టాడంటూ అన్న సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ‘రాజా’ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. రాజా రఘువంశీ చంద్రపక్షంలోని పదకొండవ రోజు అయిన ఏకాదశి రోజే హత్యకు గురయ్యాడు. యాదృచ్ఛికంగా నా కుమారుడు కూడా అదే ఏకాదశి రోజే జన్మించాడు. ఇది దేవుడి ఆశీర్వాదమేనని, తన తమ్ముడు మళ్లీ జన్మించి కుటుంబంలోకి అడుగు పెట్టాడ’ని సంతోషం వ్యక్తం చేశాడు.రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఇండోర్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తిరిగి వచ్చాడు’. రాజా రాక కోసం ఇంటిని బెలూన్లతో అలంకరించినట్లు చూపించారు. ఇంటి బయట ‘Raja is Back’ అంటూ డిజైన్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న అదే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని గుర్తించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో గతేడాది జూన్లో భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా,మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.కనిపించని పశ్చాత్తాపం.. పోలీసుల దర్యాప్తులో ప్రియుడితో కలిసి జీవించేందుకే తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు సోనమ్ రఘువంశీ నేరాన్ని అంగీకరించారు. భర్తను హత్య చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సోనమ్ మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, భర్త హత్య చేసినందుకు సోనమ్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జైలు అధికారులు చెప్పినట్లు అప్పట్లో పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్ తన ప్రతాపాన్ని చూపించాడు. పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు. బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు. తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు -
బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు! -
పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి. నిందితుడు, భార్యతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకుటుంబ సభ్యుల ఆరోపణలుఅయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు కన్నీరు పెట్టుకున్నారు.ఇదీ చదవండి: పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్ चलती बाइक से पति ने पत्नी को दिया धक्का, महिला की हुई मौत यूपी के रामपुर में पति-पत्नी एक बर्थडे पार्टी से लौट रहे थे. पार्टी में पत्नी ने डांस नहीं किया. इससे पति नाराज हो गया. इसी बात को लेकर दोनों के बीच रास्ते में कहासुनी शुरू हो गई, गुस्से में आकर पति ने चलती बाइक से पत्नी… pic.twitter.com/TDkcZ0wY03— Priya singh (@priyarajputlive) March 30, 2026 -
హీరో విజయ్ ఏం చదివారో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, విద్యా వివరాలను పొందుపరిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.విలాసవంతమైన కార్లు, బైకులుఅఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం విజయ్కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్(అప్పీల్స్), హైకోర్టులో పెండింగ్లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.భార్య పేరిట విడిగా ఆస్తులువిజయ్ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.అప్పులు లేవుతనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ అఫిడవిట్లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్కు విజయ్ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్పీ ఆంటోనియస్ బ్రిటో, కోకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు.చదవండి: ఎన్నికల వేళ.. విజయ్కు మరో షాక్డిగ్రీ డిస్కంటిన్యూవిజయ్ విద్యార్హతలను గమనిస్తే.. 1989లో పదోతరగతి పాసయ్యారు. ఆ తర్వాత ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. -
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026 -
గ్యాస్ రేటు పెరిగింది.. ఇల్లు ఖాళీ చేయండి!
కృష్ణరాజపురం: బెంగళూరులో ఇళ్లలో బాడుగకు ఉండేవారు లక్షలాది రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చుకుని, వేలాది రూపాయలను ప్రతి నెలా అద్దె చెల్లించాలి, అంతే కాదు.. ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తే చేయించుకోవాలి... ఇలా ఉంది కొన్నిచోట్ల దుస్థితి. ఇంటి యజమాని కుటుంబం దాడి చేయడంతో అద్దెకున్నవారు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన మార్చి 29న బెంగళూరులోని కోడిహళ్లి, జీవన్ బీమా నగరలో జరిగింది. ఇంటి యజమాని శోభ, దేవరాజ్ వారి పిల్లలు అద్దెకున్నవారి పైన దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నరేష్ అతని సోదరుడు సచిన్, సోదరి రేఖ ఈ ఇంట్లో బాడుగకు ఉంటున్నారు. అది కూడా వారం క్రితమే చేరారు. గ్యాస్ రేటు పెరిగిందని, నీటి బిల్లు కూడా ఎక్కువ చెల్లించాలని, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని వారిని ఒత్తిడి చేశారు. దీని మీద గొడవ జరిగింది. యజమాని కుటుంబీకులు నరేష్ సచిన్, రేఖలను కొట్టారు. వారి మీద బకెట్లతో నీళ్లు చల్లి అల్లరి చేశారు. కత్తి, బ్లేడ్లతో కోయడంతో నరేష్కు రక్త గాయాలు అయ్యాయి. బాధితులు జీవన్ బీమా నగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్
రాజస్థాన్లోని జైపూర్లో రష్యన్ ఫొటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు ముదురు గులాబీ రంగు (Pink) వేసి చేసిన ఫొటోషూట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోషూట్లో పాల్గొన్న 70 ఏళ్ల చంచల్ అనే ఏనుగు గత నెలలో మరణించింది. అయితే, ఆమె మరణానికి ఈ షూట్కు ఎలాంటి సంబంధం లేదని, వయసు పైబడటం వల్ల సహజ కారణాలతోనే చనిపోయిందని అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఏమి జరిగింది?గత ఏడాది నవంబరులో రాజస్థాన్లోని జైపూర్లోని ఒక పురాతన గణేశుడి ఆలయం వద్ద ఈ షూట్ జరిగింది. 'పింక్ సిటీ' జైపూర్ నేపథ్యం నుండి ప్రేరణ పొంది, మోడల్ యశస్వి, చంచల్ అనే ఏనుగుకు ఒకే రకమైన గులాబీ రంగు వేసి ఫొటోలు తీశారు. బార్సిలోనాకు చెందిన ప్రఖ్యాత కాన్సెప్టువల్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక ఏనుగుకు తల నుండి తోక వరకు పూర్తిగా గులాబీ రంగు పూయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Julia Buruleva (@julia.buruleva) కొంతమంది ఈ షూట్ సౌందర్య ఆకర్షణను సృజనాత్మకతను ప్రశంసించగా, చాలా ఎక్కువ మంది ఏనుగు పట్ల వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులలో జంతువులను ఉపయోగించడం యొక్క నైతికతను ప్రశ్నించారు. ఇది కచ్చితమైన జంతు హింసే.. ఇలా లైక్స్ కోసం మూగజీవాలను కెమికల్ రంగులతో ముంచెత్తడం ఆర్ట్ అనిపించుకోదు అంటూ పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ వాదనఏనుగు యజమాని , హతి గావ్ కమిటీ అధ్యక్షుడు బల్లు ఖాన్ , ఫొటోగ్రాఫర్ వాదన ప్రకారం, హోలీ పండుగలో వాడే ఆర్గానిక్ గులాల్ (Gulal) పొడిని మాత్రమే వాడారు. అంతేకాదు రంగును కేవలం 10-30 నిమిషాలు మాత్రమే ఉంచి, వెంటనే కడిగేసినట్లు వారు తెలిపారు.ఏనుగు మృతితో మరింత ఆందోళన సుమారు 70 ఏళ్ల వయసున్న చంచల్ గత నెలలో మరణించినట్లు బల్లుఖాన్ ధృవీకరించారు. ఏనుగు మరణానికి ఫోటోషూట్తో గానీ, దాని చుట్టూ ఉన్న వివాదంతో గానీ సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.దాని మరణం సహజ కారణాల వల్ల సంభవించిందని అధికారులు, స్థానిక సంరక్షకులు స్పష్టం చేశారు.స్పందించిన అటవీ అధికారులుఅయినప్పటికీ, ఈ వీడియో వైరల్ అవ్వడంతో,కళాత్మక సృజన పేరుతో మూగజీవాలను ఇలా రంగులతో హింసించడం సరికాదని నెటిజన్లు విమర్శల నేపథ్యంలో రాజస్థాన్ అటవీ శాఖ స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చనున్నారు.వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. నిర్లక్ష్యం లేదా వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల ఉల్లంఘన ఏదైనా కనుగొనబడితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
మరోసారి బరిలో ఎలక్షన్ కింగ్
సాక్షి, చెన్నై : ఎలక్షన్ కింగ్గా సుపరిచితులైన కె. పద్మరాజన్ (65) తన రికార్డును మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆయన సోమవారం మెట్టూరు నియోజకవర్గంలో తన 253వ నామినేషన్ దాఖలు చేశారు. రికార్డుల రారాజు: సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని కుంజండియూర్కు చెందిన పద్మరాజన్, గత 38 ఏళ్లుగా (1988 నుండి) దేశంలోని అన్ని ప్రధాన ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. దిగ్గజాలతో పోటీ: గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులతో పాటు కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఎడప్పాడి పళనిసామి వంటి హేమాహేమీలపై ఈయన పోటీ చేశారు. మెట్టూరులో నామినేషన్ వేసిన అనంతరం పద్మరాజన్ మాట్లాడుతూ.. తన 254వ నామినేషన్ను చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ను ఢీకొననున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు ఎన్నికల డిపాజిట్ల కోసం దాదాపు రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్లు పద్మరాజన్ వెల్లడించారు. 2011 జరిగిన మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన 6,700 ఓట్లే ఇప్పటి వరకు ఆయన సాధించిన అత్యధిక ఓట్ల రికార్డు కావడం గమనార్హం. గెలవడం తన ఉద్దేశం కాదని, ఒక సామాన్యుడు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో పోటీ పడవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడమే తన అంతిమ ధ్యేయమని పద్మరాజన్ పేర్కొన్నారు. -
అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు
భారతీయ కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలకు, చట్టబద్ధమైన బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం, ఒక కోడలు తన అత్తమామలకు భరణం చెల్లించాల్సిన చట్టపరమైన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.కేసు నేపథ్యం ఏమిటి?ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక మహిళపై ఆమె అత్తమామలు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు మరణించాడని, తాము వృద్ధులమని, నిరక్షరాస్యులమని, ఎటువంటి ఆదాయ వనరులు లేని పేదలమని వారు పేర్కొన్నారు. తమ కోడలు తన భర్తకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నింటినీ పొందిందని, పైగా ఆమెకు స్వతంత్ర ఆదాయం ఉన్నందున తమను పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని వారు వాదించారు.గతంలో ఆగ్రాలోని కుటుంబ కోర్టు ఆగస్టు 2025లో వీరి పిటిషన్ను తిరస్కరించింది. తాజాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 144 కింద తాము భరణం పొందేందుకు అర్హులమని కోరుతూ వృద్ధ దంపతులు వేసిన రీపిటిషన్పై జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు వ్యాఖ్యలువిచారణ సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్ చట్టంలోని నిబంధనలను విశ్లేషించారు. ‘భరణం కోరే హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే. సెక్షన్లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తుల వర్గాలకు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) మాత్రమే ఇది పరిమితం. అత్తమామలు ఈ పరిధిలోకి రారు. నైతిక బాధ్యత అనేది ఎంత బలంగా ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ఆదేశం లేని పక్షంలో దానిని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని కోర్టు స్పష్టం చేసింది. అత్తమామలను ఈ నిబంధన పరిధిలోకి చేర్చకూడదని శాసనసభ తన విచక్షణతోనే నిర్ణయించిందని, కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.వారసత్వ ఆస్తులపై స్పష్టతపిటిషనర్లు వాదించినట్లుగా.. కోడలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అలాగే, మరణించిన కుమారుడి ఆస్తి వారసత్వానికి సంబంధించిన అంశాలు ఇటువంటి భరణం కేసుల విచారణ పరిధిలోకి రావని హైకోర్టు తేల్చి చెప్పింది.చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారుడిపై లేదా కుమార్తెపై ఉంటుంది తప్ప, కోడలిపై అత్తమామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి అనేక కుటుంబ వివాదాల్లో కీలకంగా నిలవనుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు!
సాక్షి, చెన్నై : ఎన్నికలలో ఆసక్తికరంగా ఒకే కుటుంబానికి చెంది బిగ్ షాట్లు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే, వీరంతా వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. వీరు తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే రక్తసంబంధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా భిన్నమైన బాటలు ఎంచుకుని తల్లి, కుమారుడు , అల్లుడు ఎన్నికల క్షేత్రంలో తలపడుతున్నారు. వీరంతా లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ పోటీలో ఉ న్నారు. ఆమె కుమారుడు జోష్ చార్లెస్ మార్టిన్ ఎన్డీఏ కూటమిలో లక్ష్య జననాయగ కట్చి తరపున పుదుచ్చేరిలోని కామరాజర్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక, లీమా రోజ్ మేనల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కంలో పోటీ చేస్తుండటం గమనార్హం. లాటరీ మార్టిన్గా పేరుగడించిన వ్యాపార వేత్త కుటుంబానికి చెందిన వారు ఇలా తలా ఓ పార్టీ తరపున పోటీలో ఉండడం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వీరి నామినేషన్లలో ఆస్తులు కోట్లు కోట్లుగా ఉండడం గమనార్హం. -
బిహార్లో తొక్కిసలాట.. 8 మంది మృతి
నలంద: బిహార్లో విషాదం జరిగింది. నలందలోని శీతల మాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలింఒచారు. పూజలు నిర్వహించడానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited. Visuals from the spot as an ambulance reaches here. pic.twitter.com/1UU0kwN6OA— ANI (@ANI) March 31, 2026 -
భర్త బతికుండగానే వితంతు పింఛన్ తీసుకున్న భార్య..!
బెంగళూరు: బతికున్న వ్యక్తి చనిపోయాడని పాలికె అధికారులు డెత్ సరి్టఫికెట్ ఇచ్చారు. ఆ పత్రం ద్వారా అతని భార్య రేషన్ కార్డు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కిద్వాయి ఆస్పత్రిని మోసం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మహబూబ్ బాషా (39), షబానా దంపతులు గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. నా భర్త చనిపోయాడంటూ షబానా ప్రచారం చేసుకుని గతేడాది ఏప్రిల్ 23న డెత్ సర్టిఫికెట్ను తెచ్చుకుంది. వితంతు మహిళగా ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ సౌకర్యాలను తీసుకుంటోంది.ఇది తెలిసి మహబూబ్ బాషా లబోదిబోమంటూ కోర్టుకెళ్లారు. చిక్కపేటలోని జనన–మరణ రిజి్రస్టార్ ఈ డెత్ సర్టిఫికెట్ను జారీ చేశారని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ అధికారులు విచారణ చేశారు. షబానా తన భర్త పేరుపై ఉన్న బీపీఎల్, ఆధార్ కార్డును ఉపయోగించి కిద్వాయి ఆస్పత్రిలో మరో వ్యక్తికి చికిత్సలు చేయించింది. అయితే అతడు చనిపోయాడు. అతడు తన భర్తేనని సిబ్బందికి తెలిపింది. అతని పత్రాలన్నీ బాషా పేరుపైనే ఉన్నాయి. దీనితో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రాలతో ఆమె సులభంగా డెత్ సర్టిఫికెట్ను సంపాదించింది. -
ఒక్కో ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టికెట్లు
కర్ణాటక: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు టికెట్ ఇవ్వాలన్న ఎమ్మెల్యేల డిమాండ్ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ), డీఎన్ఏ, ఆర్సీబీ ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు. ఇంతకుముందు ఒక్కో ఎమ్మెల్యేకు 2 ఉచిత టికెట్లు ఇవ్వాలని అనుకోగా, ఈ భేటీలో దానిని 3కు పెంచడం గమనార్హం. బెంగళూరులో జరిగే ప్రతి మ్యాచ్కు 3 టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ 3 ఉచితమని, ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు కొనుగోలు చేయాలని చెప్పారు. చిన్నస్వామి స్టేడియంలో సీట్లు పెంచాలని కేఎస్సీఏ ఆలోచిస్తోందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని తెలిపామన్నారు. మరో క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ కట్టాలో అలోచిస్తున్నట్లు తెలిపారు. కేఎస్సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
సిలిండర్ల లారీ పల్టీ.. పోలీసుల బందోబస్తు!
కర్ణాటక: రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, సిలిండర్లు దొరకడం గగనమైన తరుణంలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన గదగ్ జిల్లా రోణ పట్టణ శివారులో జరిగింది. హుబ్లీ నుంచి రోణ, గజేంద్రగడ మీదుగా కుష్టగి పట్టణానికి భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ రోణ శివార్లలో మలుపులో ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. దీంతో గ్యాస్ సిలిండర్లు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు అంతకుమించి జరగలేదు. ఎవరూ సిలిండర్లు ఎత్తుకుపోకుండా రోణ పోలీసులు బందోబస్తు కాశారు.గ్యాస్ సిలిండర్ల చోరీబొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకాలోని సూర్య సిటీలో బి–కాంపొనెంట్లో సిలిండర్ దొంగతనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు ఇళ్ల నుంచి మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఓ ఇంటివారు ఫుల్లు సిలిండర్ను తీసుకుని ఇంటి కిందిభాగంలో ఉంచారు. మరో రెండు ఇళ్లలోనూ సిలిండర్లు ఉన్నాయి. దీనిని కనిపెట్టిన దొంగలు వరుసగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఇద్దరు బైక్పై వచ్చారు, హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డయింది. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. మేం సురక్షితంగా జీవించగలమా అనే ప్రశ్న తలెత్తుతోంది అని స్థానిక నివాసి పూర్ణేష్ రెడ్డి వాపోయారు. -
ఎన్నికల వేళ.. టీవీకే విజయ్కు మరో షాక్!
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు కుమార్ చెప్పారు.కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు భారీగా జనాలు వచ్చారు. అయితే, చెన్నై పోలీసులపై టీవీకే నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేదని అన్నారు.చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్కు భద్రత కల్పించలేదని చెప్పింది.కాగా, విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, త్రిచీ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆయా స్థానాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ విజయ్కు ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో 2016 వరకు సీపీఎం ఆధిపత్యం ఉండేది. ఆర్డీ శేఖర్ 2019 ఉపఎన్నికలో గెలిచి ఈ స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
‘కోటా’కు ఊపిరి.. మళ్లీ ‘ఆల్ ఇండియా ప్రభంజనం’?
కోటా: దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్గా పేరుగాంచిన రాజస్థాన్లోని కోటా నగరం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. గత రెండేళ్లుగా కొంత మందగించిన ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) కోచింగ్ అడ్మిషన్లు.. 2026-27 విద్యా సంవత్సరంలో ఏకంగా 20 నుంచి 30 శాతం మేర పెరిగాయి. దీంతో నగరమంతా మళ్ళీ విద్యార్థులు, తల్లిదండ్రుల సందడితో కళకళలాడుతోంది.సంక్షోభం నుంచి గట్టెక్కి..2023 నుంచి 2025 మధ్య కాలంలో కోటా కోచింగ్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులతో ఏడాదికి రూ. 6,500–7,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ నగరం.. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్షకు పడిపోవడంతో ఆదాయం రూ.3,500 కోట్లకు తగ్గిపోయింది. అయితే మార్చి 25 నుంచి ప్రారంభమైన కొత్త బ్యాచ్లకు అనూహ్య స్పందన లభించింది. ఏప్రిల్ రెండు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.విజయాల పరంపర.. తగ్గని క్రేజ్ఎన్ని విమర్శలు ఎదురైనా, ఫలితాల విషయంలో కోటా తన మార్కును నిలబెట్టుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ఎనిమిది మంది కోటా విద్యార్థులే కావడం విశేషం. గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇక్కడి విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డే తల్లిదండ్రులను మళ్లీ కోటా వైపు నడిపిస్తోంది. మణిపూర్, బీహార్, మహారాష్ట్ర లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి తరలివస్తున్నారు.అండగా స్థానికులు.. అద్దె పెంపునకు నోపెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, కోటా హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హాస్టల్ అద్దెలను పెంచవద్దని ఆపరేటర్లకు సూచించారు. నగరంలోని 4,000 హాస్టళ్ళు, 45,000 పీజీ సెంటర్లు విద్యార్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. స్థానిక ఎంపీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి స్థానికులు కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఒత్తిడి మేనేజ్మెంట్, మోటివేషన్ క్లాసులపై కూడా కోచింగ్ సెంటర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అడ్మిషన్ల పెరుగుదలతో అటు కోచింగ్ రంగం, ఇటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు -
‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు
లక్నో: బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. గాలిలో ఉండగానే విమానంలో పొగలు రావడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం లక్నోకు విమానాన్ని మళ్లించారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా, ఒక్కసారిగా ఆక్సిజన్ మాస్కులు కిందకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.అసలేం జరిగింది?సోమవారం సాయంత్రం 134 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఐఎక్స్ 1523 (IX 1523) విమానం ‘బాగ్డోగ్రా’ నుంచి బయలుదేరింది. సాయంత్రం 4:58 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ఏవియానిక్ ప్యానెల్ నుంచి పొగ వస్తున్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ‘పాన్ పాన్’ (PAN PAN) కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు చేరవేసి, లక్నోలో ల్యాండింగ్కు అనుమతి కోరారు.విమానంలో గందరగోళంఅత్యవసర ల్యాండింగ్ ప్రకటన వెలువడగానే విమానంలో ఆక్సిజన్ మాస్కులు కిందకు పడ్డాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను శాంతింపజేస్తూ, మాస్కులను ఎలా ఉపయోగించాలో సూచనలు ఇస్తూ, వారికి భరోసా కల్పించారు. సాయంత్రం 5:17 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.తనిఖీల్లో తేలిందేంటి?విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను టెర్మినల్-3కి తరలించారు. అగ్నిమాపక దళం, సాంకేతిక నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పొగ లేదా మంటల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులను స్వల్ప విరామం తర్వాత ప్రత్యామ్నాయ విమానాల్లో ఢిల్లీకి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సాంకేతిక లోపంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇది కూడా చదవండి: కువైట్ ట్యాంకర్పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం -
ఎన్నికల రేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్టు
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలోని అఖిల భారత పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్రకళగం అభ్యర్థిగా ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగడించిన మాజీ పోలీసు అధికారి ఎస్. వెల్లదురై రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో శశికళ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో కలిసి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో సోమవారం శశికళ జాబితాను ప్రకటించారు. 21 మందితో తొలి జాబితాను ఆమె ప్రకటించారు. ఇందులో శంకరన్ కోయిల్ నుంచి అన్నాడీఎంకే మాజీ ఎంపీ వసంతి మురుగేషన్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మదురైలో చక్రవర్తి, తిరుచ్చి తూర్పులో నందకుమార్, రాజ పాళయంలో డాక్టర్ హరీష్ ముదుకులత్తూరులో రిటైర్డ్ అదనపు ఎస్పీ డాక్టర్ రాంకుమార్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే,పొత్తుల మేకు సాత్తూరు, ఆలంకులం నియోజకవర్గాలను పసుంపొన్ మక్కల్ దేశం కట్చి, నన్నిలం నియోజకవర్గాన్ని వెల్లలార్ మున్నేట్ర కళగంకుకు కేటాయించినట్టు వివరించారు. అదే సమయంలో శశికళ పార్టీ తరపున నాంగునేరిలో పోటీ చేస్తున్న అభ్యర్థిపై అందరి దృష్టి పడింది. పోలీసు శాఖలో రిటైఱ్డ్ ఎస్పీగా ఉన్న వెల్ల దురై ఇక్కడ అభ్యర్థి కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. స్మగ్లర్ వీరప్పన్ వేటలో కీలక పాత్ర పోషించిన వెల్లదురై, తన సర్వీసులో ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొని ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్నో సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల రేసులో ఆయన దిగడంతో నాంగునేరి నియోజకవర్గంలో చర్చ మొదలైంది. -
అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ!
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఏప్రిల్ 9న జరగనున్న 126 అసెంబ్లీ స్థానాల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.49 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హేమాహేమీలు తలపడుతున్న ఈ స్థానాలే అస్సాంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆ కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక విశ్లేషణ..జోర్హాట్: దిగ్గజాల మధ్య హోరాహోరీఎగువ అస్సాంలోని జోర్హాట్ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్థానంగా నిలిచింది. ఇక్కడ బీజేపీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హితంద్ర నాథ్ గోస్వామి.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ గౌరవ్ గొగోయ్తో తలపడుతున్నారు. 2016 నుంచి ఇక్కడ బీజేపీదే హవా.. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్లో గౌరవ్ గొగోయ్కు 12,130 ఓట్ల ఆధిక్యం లభించింది. నియోజకవర్గ పునర్విభజన తర్వాత మహిళా ఓటర్ల ప్రాబల్యం ఈ పోరును ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా మార్చేసింది.శివసాగర్: ప్రాంతీయత వర్సెస్ జాతీయ శక్తిచారిత్రక శివసాగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ 2021లో జైలు నుంచే పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈసారి ఆయనను ఢీకొట్టేందుకు బీజేపీ నుంచి కుశాల్ దోవారీ, మిత్రపక్షం అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ప్రదీప్ హజారికా బరిలో ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల మధ్యే ఇక్కడ ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ జరగడం అఖిల్ గొగోయ్కు కలిసి వస్తుందా లేక ఓట్లు చీలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.బిహ్పురియా: ఫిరాయింపుల సెగబిహ్పురియాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ (రామ్) భుయాన్ రంగంలో ఉన్నారు. ఆయన స్థానిక నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక సమస్యలను అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో అంతర్గత అసమ్మతి భూపేన్ బోరాకు సవాల్గా మారింది.జలుక్బారీ: ముఖ్యమంత్రి కోటముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన శక్తిని మరోసారి నిరూపించుకోవడానికి జలుక్బారీ నుంచి ఆరోసారి బరిలోకి దిగుతున్నారు. 2021లో లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన హిమంతకు ఇక్కడ ఎదురులేదనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ ఆయనను ఢీకొంటున్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటికీ, పట్టణ ఓటర్లు హిమంత వైపే మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి.దిస్పూర్: రాజధాని పోరులో ‘రెబల్’ సెగరాష్ట్ర రాజధాని దిస్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మెగా డ్రామాను తలపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ప్రద్యుత్ బోర్డోలోయ్ ఇక్కడి అభ్యర్థి. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి పోటీ చేస్తున్నారు. అయితే, టికెట్ దక్కని బీజేపీ సీనియర్ నేత జయంత కుమార్ దాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం బీజేపీకి తలనొప్పిగా మారింది. 2.43 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గం అస్సాం పట్టణ ఓటర్ల నాడిని ప్రతిబింబిస్తుంది.గౌహతి సెంట్రల్: అనుభవం వర్సెస్ యువతకొత్తగా ఏర్పడిన గౌహతి సెంట్రల్లో తరం మారుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ గుప్తాతో 27 ఏళ్ల యువ నాయకురాలు, అస్సాం జాతీయ పరిషత్ (AJP) అభ్యర్థి కుంకీ చౌదరి తలపడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వర్సెస్ యువత ఉపాధి అనే నినాదాల మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.తముల్పూర్: మిత్రుల మధ్య యుద్ధంబోడోలాండ్ రీజియన్లోని తముల్పూర్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన బీజేపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఇక్కడ నేరుగా తలపడుతున్నాయి. బీజేపీ నుంచి బిస్వజిత్ దైమరీ, యూపీపీఎల్ అధినేత ప్రమోద్ బోరో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో రఫీ దైమరీ బరిలో ఉండటంతో, బోడో ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ -
కేరళ ఎన్నికలు.. ఈసీ సరికొత్త ప్రయోగం
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రయోగం చేపట్టింది. పేరు ఓట్ స్వీటెన్డ్ కేరళ క్యాంపెన్. ఇందులో భాగంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా ప్యాకెట్లు అందజేశారు. ఇందుకుగాను, ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా ప్యాకెట్లను అందజేస్తారు.ఏఏ బూత్లలో వీటిని ఫస్ట్ టైం ఓటర్లకు అందజేయాల్సిందీ జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించి, ఆ మేరకు ఆయా బూత్లకు పంపిణీ చేయనున్నారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని ఈసీ తెలిపింది. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. -
బెంగాల్ దీదీకి ‘సరిహద్దు’ సెగ
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే.. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం బెంగాల్లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. పెండింగ్లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా.. → జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి. → రాజ్బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్ (కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది. → సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. -సోమన్నగారి రాజశేఖర్రెడ్డి -
పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే (ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా), దీని కారణంగా దేశీ పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ఉపశమన ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో, దేశీయంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం లీటరు పెట్రోల్పై రూ.3 ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. అదేవిధంగా దేశీయ సరఫరా పెంచేందుకు డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్లీ సుంకాలు విధించడం తెలిసిందే. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన తరువాత, ఇరాన్ ప్రతీకార చర్యలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో బ్యారెల్కు 119 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడ్ అవుతున్నాయి. మన దేశ చమురు, గ్యాస్ అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. వీటిలో ఎక్కువ భాగం హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంటాయి. ఎగుమతిదారులకు అండ.. ఈ సంక్షోభం కారణంగా ఎగుమతిదారులు సరుకుల రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో.. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతిదారులకు కొన్ని సడలింపులు ఇచి్చంది. రూ.497 కోట్లతో ‘రిలీఫ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం తెలిసిందే. దీంతో నౌకా రవాణా మార్గం మార్చుకోవడం కారణంగా అధిక సమయం పట్టడం, ట్రాన్స్షిప్మెంట్ హబ్ల వద్ద రద్దీ పెరగడం, బీమా చార్జీలు పెరగడం, అత్యవసర సర్చార్జీలు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు పెరిగిపోయాయి. ఇలా పెరిగిన రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలను ఎదుర్కొనేందుకు రిలీఫ్ పథకం సాయం అందించనుంది. అలాగే, రాడ్టెప్ పథకం కింద ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31, 2026 వరకు అన్ని అర్హత గల ఉత్పత్తులపై పూర్తి ప్రయోజనాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గత నెలలో ఈ ప్రయోజనాలను సగానికి తగ్గించడంతో ఎగుమతిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణ ఉపశమనం అవసరం.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ప్రభావితమయ్యే వర్గాలు, వ్యాపారాలకు తక్షణ ఉపశమనం అవసరం. అదే సమయంలో వ్యూహాత్మక, దీర్ఘకాల అవసరాలకు వీలుగా తగినంత ద్రవ్య వెసులుబాటు కూడా అవసరమే. కేవలం ఇంధన అవసరాలే కాకుండా.. పలు కమోడిటీలు, మెటీరియల్స్ పరంగానూ దీర్ఘకాల నిల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తాజాగా నెలవారీ ఆర్థిక సమీక్ష వివరాలు విడుదల సందర్భంగా పేర్కొన్నారు. -
కరడుగట్టిన నక్సలిజం ఖతం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు చేపట్టిన చరిత్రాత్మక ’ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ విజయవంతం కావడంతో తెలంగాణ పూర్తిస్థాయిలో నక్సల్స్రహిత రాష్ట్రంగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారదోలేందుకు భద్రతా బలగాలు చేసిన త్యాగాలను కొనియాడుతూ సభలో సెల్యూట్ చేశారు. అదే సమయంలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో వివరిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్.. భీకర పోరు ‘తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో 50 కి.మీ. పొడవు, 37 కి.మీ. వెడల్పు ఉన్న ఒక కొండపై మావోయిస్టులు ఏళ్ల తరబడి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క డ సోలార్ విద్యుత్, ఐఈడీ (బాంబుల) తయారీ ఫ్యాక్టరీలు, ఐదేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకున్నారు. 400 నుంచి 500 మంది కేడర్ అక్కడ ఉన్నారు. ఆ స్థావరాన్ని ఛేదించేందుకు కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా 21 రోజులపాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టారు. 45 డిగ్రీల భగభగమండే ఎండలో మన జవాన్లు రోజుకు కేవలం 300 మిల్లీలీటర్ల నీటిని తాగుతూ ధైర్యంగా పోరాడారు. ఈ ఆపరేషన్లో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వారు లొంగిపోయారు లేదా పారిపోతూ పోలీసులకు చిక్కారు. దీంతో బస్తర్, మహారాష్ట్ర, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో నక్సల్స్ పైకి (ఉత్తరం వైపు) రాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా వారు నిరాకరించారు. కిందికి వస్తే మాత్రం ఆపుతామని చెప్పారు‘ అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయారు 2024 ప్రారంభంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో 21 మంది సభ్యులు ఉండగా.. ఇప్పుడు వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని అమిత్షా తెలిపారు. ‘ఒకరు పట్టుబడ్డారు, ఏడుగురు లొంగిపోయారు, 12 మంది హతమయ్యారు, ఒకరు మాత్రమే పరారీలో ఉండి చర్చలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 37 మందికిగాను ఎవరూ మిగల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో ఆరుగురు లొంగిపోయారు, ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నక్సలైట్ కూడా లేడు‘ అని చెప్పారు. బసవరాజు, హిడ్మా, వివేక్, పల్లూరి ప్రసాదరావు (చందన), వాసుదేవ్ వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం లేదా లొంగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ దన్నుతోనే నక్సలిజం ‘1970లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ’అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి’ అని పిలుపునిచ్చి, నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా మావోయిస్టుల మద్దతు తీసుకున్నారు. ఆ మద్దతును ఆసరాగా చేసుకుని మావోయిస్టులు దేశంలోని 17 శాతం భూభాగానికి, 10 శాతం జనాభాకు విస్తరించారు. తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నారు‘ అని అమిత్షా చెప్పారు. అలాగే నక్సల్స్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ ప్రారంభించిన ’సల్వాజుడుం’ ఉద్యమాన్ని 2011 జూలై 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఆ తీర్పు వల్లే నిరాయుధులైన ఎంతోమంది సల్వాజుడుం కార్యకర్తలను, ఆదివాసీలను నక్సల్స్ ఊచకోత కోశారని చెప్పారు. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తినే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయని, ఇదీ కాంగ్రెస్కు నక్సల్స్తో ఉన్న లాలూచీ అని దుయ్యబట్టారు. ‘రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో అనేకసార్లు నక్సల్స్ సానుభూతిపరులతో కనిపించారు. ఆయన జరిపిన భారత్ జోడో యాత్రలో నక్సల్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు చెందిన వారు పాల్గొన్నారు. 2010లో ఒడిశాలో లాడో సికాకాతో, 2018లో హైదరాబాద్లో గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారు‘ అని అమిత్షా పేర్కొన్నారు. 1970 నుంచి 2026 మార్చి వరకు వామపక్ష తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే ఉందని, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 20 వేల మంది పౌరులు, జవాన్ల మరణాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. -
జవాన్లకు న్యాయ సౌలభ్యం కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర శ్లాఘనీయమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వారికి మెరుగైన న్యాయసౌలభ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం సరిహద్దుల్లో ఒక యుద్ధం, న్యాయపరమైన హక్కుల కోసం మరో యుద్ధం, ఇలా రెండు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులను వారికి రానివ్వరాదన్నారు. లేహ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. కోర్టులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పిస్తుండగా, సాయుధ బలగాలు అందుకు అవసరమైన ఆదర్శాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, గౌరవం, సమానత్వం, న్యాయం దేశ ప్రజలకు అందించేందుకు తగిన రక్షణను, పరిస్థితులను కల్పించిన ఘనత సైనికులకే దక్కుతుందన్నారు. -
నేవీ చేతికి కొత్తగా 3 నౌకలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ గార్డెన్ రీచ్ షిప్బిల్డింగ్, ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన మూడు నూతన నౌకలు దునగిరి, సంశోధక్, ఆగ్రే సోమవారం భారత నావికా దళం చేతికొచ్చాయి. వీటి రాకతో నావికా దళ శక్తిసామర్థ్యాలు మరింత పటిష్టంకానున్నాయి. దునగిరి అనేది నీలగిరి తరగతి నౌక. 1977 నుంచి 2010 ఏడాదిదాకా భారత నావికా దళంలో సేవలందించిన పాత ‘ఐఎన్ఎస్ దునగిరి’స్థానంలో కొత్తగా ప్రాజెక్ట్–17ఏ కింద కొత్త దునగిరి నౌకను నిర్మించారు. బ్రహ్మోస్ క్షిపణితోపాటు రాకెట్లు, టోర్పెడోలను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు. డిజైన్, దాడి సామర్థ్యం, ఆటోమేషన్, నిఘాతోపాటు స్వావలంబనలో ఈ నౌక తిరుగులేనిదని భారత నేవీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సంశోధక్ అనేది సర్వే బాధ్యతలు చూసే నౌక. తీర ప్రాంతాల్లో గస్తీకాయడంతోపాటు నౌకాశ్రయాల వద్ద సముద్ర లోతును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రక్షణతోపాటు పౌర అవసరాలకు సంబంధించి ఒషనోగ్రాఫిక్, జియోఫిజికల్ సమాచారాన్ని అందివ్వగలదు. డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్, ఆటానమస్ అండర్వాటర్ వెహికల్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ వంటి అదనపు సదుపాయాలు దీనిలో ఉన్నాయి. ఆగ్రే అనేది అర్నానా తరగతి యాంటీ–సబ్మెరైన్ యుద్ధనౌక. 2017లో విధుల నుంచి ని్రష్కమించిన ఐఎన్ఎస్ ఆగ్రేకు బదులుగా కొత్త ఆగ్రే నౌకను నిర్మించారు. -
లష్కరే ఉగ్రవాది అహ్మద్ లోన్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో పోస్టర్ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ను అరెస్ట్ చేశారు. ఘాజీపూర్లో ఇతడిని మార్చి 29వ తేదీ రాత్రి పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. జమ్మూకశీ్మర్లోని శ్రీనగర్ వాసి అయిన షబీర్ అహ్మద్ లోన్కు రజా, కశీ్మరీ అనే పేర్లు కూడా ఉన్నాయని వివరించింది. పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ నుంచి అందే ఆదేశాల ప్రకారం ఇతడు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడంది. ఢిల్లీ, కోల్కతాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ప్రత్యక్షమైన దేశ వ్యతిరేక పోస్టర్ల వెనుక లోన్ హస్తముందని పోలీసు విభాగం పేర్కొంది. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మెట్రో స్టేషన్లో కనిపించిన పోస్టర్ కేసులో ఇతడు వాంటెడ్గా ఉన్నాడని వివరించింది. పట్టుబడిన లోన్ వద్ద బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కరెన్సీ కూడా లభ్యమైంది. సిమ్, అభ్యంతరకర సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఉగ్ర కార్యకలాపాలను లోన్ సమన్వయం చేస్తున్నట్లు వీటిని బట్టి తెలుస్తోందని పోలీసు విభాగం వివరించింది. దీర్ఘకాలంగా ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఇతడు 2007లోనే అరెస్టయ్యాడు. అప్పట్లో లోన్ నుంచి ఏకే–47 రైఫిల్తోపాటు గ్రనేడ్ను స్వా«దీనం చేసుకున్నారు. రెండోసారి, 2015లో శ్రీనగర్లోని పరింపొర పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్ పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్లో అత్యాధునిక ఉగ్ర శిక్షణ పొందాడని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఢిల్లీలో గతంలో లక్షిత హత్యలకు లోన్ ప్రణాళిక వేసినట్లు కూడా విచారణలో అంగీకరించాడని చెప్పారు. అప్పట్లో జైలు నుంచి విడుదలైన వెంటనే బంగ్లాదేశ్లో ఉండగానే ఐఎస్ఐ తరఫున పని చేసే లష్కరే తోయిబా హ్యాండ్లర్లు అబూ హుజైఫా, సుమమ బాబర్ అనే వారితో లోన్ సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పారు. -
బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య దోస్తీ
పథనంతిట్ట/కొట్టాయం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమితో బీజేపీ రహస్య దోస్తీ కొనసాగిస్తోందని, రెండూ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ ఆదూర్ పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘‘మనం ఎన్నికల్లో ఒక్క కూటమిని మాత్రమే ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్డీఎఫ్ కూటమితో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. అందుకే శబరిమల అంశంపై మోదీ ఏమీ మాట్లాడటం లేదు. దేశంలో ఎక్కడికెళ్లినా మతం, ఆలయాల ప్రస్తావన తెచ్చే మోదీ.. కేరళలో మాత్రం ఎందుకు శబరిమల అంశంపై మౌనం దాల్చారు?. ఎన్నికల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే మోదీ మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. లేదంటే వాటి ఊసెత్తరు’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘దేశవ్యాప్తంగా తమకు గిట్టని పారీ్టలు, నేతలపై ఈడీని ఉసిగొల్పే మోదీ సర్కార్ కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ కూటమి పారీ్టలు, నేతలను ఎందుకు వదిలేసింది? అదే నాపై అయితే డజన్లకొద్దీ కేసులు మోపి విచారణ పేరిట దర్యాప్తు సంస్థల కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. నాపై 36 కేసులు పెట్టారు. ఏకధాటిగా 55 గంటలపాటు విచారించారు. ఇలాంటి కఠిన చర్యలు కేరళ ముఖ్యమంత్రి లేదా ఎల్డీఎఫ్ నేతలపై ఎందుకు తీసుకోవట్లేదు?’’అని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు. ‘‘ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పినట్లు మార్కెట్లో ఒక అదృశ్యశక్తి ఉందంటే అది మాత్రమే ఆర్థికవ్యవస్థను నడిపిస్తుందని అర్థం. అలాగే కేరళ ఎన్నికల్లో అదృశ్యశక్తి దాగి ఉంది. అదే బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ కుటిలయత్నాలు చేస్తోంది. పాలక్కడ్లో మోదీ ఆదివారం మాట్లాడారుగానీ కీలక అంశాలను వదిలేశారు. అయ్యప్ప ఆలయంలో వామపక్ష నేతల చోరీని మోదీ మాటవరసకైనా ప్రస్తావించలేదు’’అని రాహుల్ అన్నారు. ఆర్ఎస్ఎస్కు మాత్రమే నిధులు అందాలేమో.. యూడీఎఫ్ కూటమి అభ్యర్థి చాందీ ఊమెన్కు మద్దతుగా రాహుల్ సోమవారం పథుప్పల్లి నియోజకవర్గంలో ప్రచారంచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సైకిల్ తొక్కి అక్కడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల(నియంత్రణ)చట్టం సవరణ బిల్లుపై రాహుల్ అభ్యంతరం వ్యక్తంచేశారు.‘‘హఠాత్తుగా ఎఫ్సీఆర్ఏ చట్టం తెచ్చారు. ఇందులో గమ్మత్తైన విషయమేంటంటే విదేశాల నుంచి ఇకపై కేవలం ఒక సంస్థ మాత్రమే విరాళాలు పొందే ఆస్కారముంది. అదే ఆర్ఎస్ఎస్. గౌతమ్ అదానీ ద్వారా విదేశీపెట్టుబడిదారులను మోదీ శాసిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఎఫ్సీఆర్ఏ నిబంధనలతో ఆర్ఎస్ఎస్ మాత్రమే లబ్ధిపొందనుంది’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
చొరబాటు.. ఎన్నికల అంశం కాదు
న్యూఢిల్లీ: అస్సాంను సమస్యగా పరిణమించిన చొరబాటు అంశాన్ని కేవలం ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లు అనేవి దేశ పౌరుల గుర్తింపునకు, జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టుగా తయారవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. మరో పది రోజుల్లో అస్సాంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో ‘మేరా బూత్, సబ్సే మజ్బూత్ సంవాద్’కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ అయ్యారు. ‘‘అస్సాంలో తొలిసారిగా ఓటేసే యువ ఓటర్లు రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థ పాలనలను ఒకసారి గుర్తుచేసుకోండి. పొరపాటున కాంగ్రెస్కు ఓటేసినా మీరు చేసే ఈ తప్పు రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథం నుంచి పక్కకు తప్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టేలా బీజేపీ కార్యకర్తలు బాగా శ్రమించాలి. చొరబాట్లు అనేవి కేవలం ఎన్నికల అంశం కానేకాదు. అస్సాం రాష్ట్ర గుర్తింపు పరిరక్షణకు సంబంధించిన అంశమిది. చొరబాటుదారులు అక్రమంగా భూములను లాక్కునేలా కాంగ్రెస్ ప్రోత్సహించింది. చొరబాటుదారులు ఒక్కసారి రాష్ట్రంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారంటే అక్కడి చిరువ్యాపారాలను తమపరంచేసుకుంటారు. దాంతో స్థానికుల జీవనోపాధి కష్టమవుతోంది. ఆక్రమణను కాంగ్రెస్ ప్రోత్సహిస్తే బీజేపీ వాటిని అడ్డుకుంది. ఈశాన్య భారతంలో కేంద్రప్రభుత్వం శాంతిస్థాపన కోసం వేర్వేరు సంస్థలతో 12 శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. అదే కాంగ్రెస్ ఒప్పందాలను కాగితాలకే పరిమితంచేసింది. కేవలం ఆర్భాటం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కి ప్రజలను తప్పుదోవపట్టించింది. కాంగ్రెస్పాలనలో అస్సాం హింసతో రగిలిపోయింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు శాంతిస్థాపనకు శతథా కృషిచేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క శాంతి ఒప్పందం అమలుకునోచుకోలేదు. దీంతో యువత అశాంతితో రగిలిపోయారు. నాడు బోడోల్యాండ్లో కర్ఫ్యూలు కన్పించేవి. బాంబుమోతలు విన్పించేవి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు శాంతి, సుస్థిరత సాధించాయి. ఒకప్పుడు హింసను చవిచూసి నేడు శాంతిపథంలో దూసుకెళ్తున్న అస్సాం దేశానికే ఒక ఆదర్శదాయకం’’అని అన్నారు. ‘‘అస్సాం బీజేపీ కార్యకర్తలందరికీ ఇదే నా ఆహా్వనం. నేను కూడా మీలాగా కార్యకర్తనే. నాపై మోపిన బాధ్యతను నెరవేర్చా. నేడు ఏఐతో వచ్చే ఆడియో, వీడియో సందేశాలపై అప్రమత్తంగా ఉండండి. మీ అందరి వద్దా నమో యాప్ ఉండాలి. నారీశక్తి కోసం పార్టీ చేపట్టే చర్యల సమగ్ర వివరాలు యాప్ ద్వారా తెల్సుకుని ఓటర్లకు అవగాహన పెంచండి’’అని మోదీ సూచించారు. -
జ్యోతిష్యంతో క్యాన్సర్ నయమవుతుందట..
కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి నరసింహనాయకన్పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.ఎలాంటి వారికి టికెట్లిచ్చారు? టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. -
‘బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే’
ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారుఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లానికి మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి : ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం -
డెడ్లైన్ ముగుస్తోంది.. ‘కగార్’పై అమిత్ షా ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు డెడ్లైన్ రేపటితో (మార్చి 31) ముగియనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు కీలక మావో నేతలు. హిడ్మా సహా పలువురు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్పై లోక్సభలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. ‘ఛత్తీస్గఢ్లోని బస్తర్లో నక్సలిజం దాదాపు అంతమైంది. దేశంలో కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. కాంగ్రెస్ 60 ఏళ్లపాటు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించింది. గత పాలకులు ఆదివాసీలను తప్పుదోవ పట్టించారు.గత కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. మావోయిస్టుల హింసలో అనేకమంది ప్రజలు నష్టపోయారు. తెలంగాణలో అనేక మంది మావో నేతలు లొంగిపోయారు. దేశంలో 12 రాష్ట్రాలు మావోయిస్టుల వల్ల తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్ వైఖరి వల్లే దేశంలో నక్సలిజం పెరిగింది. ఎన్డీఏ వచ్చాకే ఆదివాసుల హక్కులను పరిరక్షించాం. నక్సలిజం కథ ముగిసింది. ఆయుధాలు వీడకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆయుధాలు పట్టుకుంటే బుల్లెట్లతో మేము సమాధానం చెబుతాం. గిరిజనులను నక్సలైట్లు తప్పుదోవ పట్టించారు. వారి చేతికి ఆయుధాలు ఇచ్చి హింసకు పురికొల్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లూటీ చేశారు. జనతా సర్కారు పేరుతో ప్రజలను భ్రమలో ముంచారు. జనతా ఆదాలత్ పేరుతో ఎంతోమందిని చంపారు’ అని అమిత్ షా అన్నారు. కాగా, దేశంలో ఉన్న మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి. ఛత్తీస్గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. -
నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. టీవీకే అధినేత ఆస్తులెంత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్ ఓ పుస్తకం విడుదల చేశారు."మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్ నామినేషన్ సమర్పించారు. విజయ్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. TVK Chief Vijay declares ₹405 crore of movable assets and ₹115 crore of immovable assets in his affidavit while filing nomination for Perambur assembly constituency pic.twitter.com/03U4JC28GC— Arvind Gunasekar (@arvindgunasekar) March 30, 2026 -
భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు
పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, ఇలా అ నేక కోరికలు నెరవేర్చమని దేవుడికి మొక్కుకోవడం, ఆ తరువాత మొక్కులు చెల్లించుకోవడం చాలా కామన్. దయచేసి భార్య నుంచి కాపాడు తల్లీ అని మొక్కుకున్న 25 ఏళ్ల యువకుడి మొర ఆలకించిందట అమ్మవారు. అందుకే వినూత్న రీతిలో ఆ దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.విడాకులను వేడుకగా జరుపుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఉత్తర ప్రదేశలోని బస్తీ జిల్లా, సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. భార్యతో ఇబ్బందుల పడిన భర్త, ఆమెనుంచి తన విముక్తి కల్పనించమని దేవుడికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు నెరవేరడంతో, వైవాహిక బంధానికి ముగింపు పలికిన సందర్భంగా స్థానిక ఆలయానికి 9 కిలోమీటర్ల 'దండావత్ యాత్ర'ను చేపట్టిన వైనం, చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశంనార్ఖోరియా గ్రామంలోని మైనిహవాన్ టోలా నివాసి జోగేష్. 2022లో సమీప గ్రామానికి చెందిన పూజను వివాహం చేసుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు గ్రామంలోనే నివసిస్తున్నారు. జోగేష్ తండ్రి జగదీష్ ఒక రైతు. అతనేమో ఢిల్లీలోని పిఓపి (POP) ఫ్యాక్టరీలలో పనిచేసేవాడు. పెళ్లైన రెండేళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిరంతరం ఏదో ఒక గొడవ. ఈ ఘర్షణలు, మానసిక ఒత్తిడితో విసిగి పోయిన భర్త, కోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో భార్య బారి నుండి విముక్తి లభిస్తే, తన ఇంటి నుండి ఆలయం వరకు దండావత్ యాత్ర చేస్తానని ‘మా బైదా సమయ్ మాతా’ ఆలయంలో మొక్కుకున్నాడు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఈ ఏడాది జనవరిలో అతనికి విడాకులు మంజూరైనాయి. దీంతో అతనితో పాటు,అతని కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. అయిత జోగేష్ ఉండేది ఢిల్లీలో ఉన్నందున మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైంది.అయితే, పవిత్ర నవరాత్రులు సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు మార్చి 27వ తేదీన, దండావత్ యాత్ర చేయడానికి భాన్పూర్ ఎస్డిఎం హిమాంశు కుమార్నుంచి అనుమతి తీసుకుని మరీ మాతా ఆలయం వరకు 12 గంటల్లో 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను పూర్తి చేశాడు.చట్టపరంగా, సామాజికంగా తన భార్య నుండి విముక్తి లభించడంతో మొక్కును తీర్చుకోవాలని ఉదయాన్నే అన్నపానీయాలు ముట్టుకోకుండా, తన గ్రామం నుండి భాన్పూర్లోని అమ్మవారి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ ఆలయానికి చేరుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామానికి చెందిన అనేకమంది ప్రజలు డప్పులు వాయిస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వారితో పాటు ఉన్నారు.సాయంత్రం 6 గంటలకు, రక్తసిక్తమైన మోకాళ్లతో, అలసిపోయిన శరీరంతో గుడికి చేరుకున్న అతను, అమ్మవారి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. వైవాహిక జీవిత నరకం నుండి బయటపడ్డాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని అతను మీడియాతో చెప్పాడు. -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణగతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్కేఓ) అందుబాటులోకి రానుంది.కొత్త నిబంధనల ముఖ్యాంశాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్లెట్లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.భద్రతలో రాజీ లేదునిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.ఇంధన భద్రతే లక్ష్యంప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్వర్క్ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్ డైలాగ్ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది. స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయంపొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను చూసి అత్యాశకు పోలేదు. రీటా ఆ డబ్బును విత్డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.బ్యాంక్ అధికారుల ప్రశంసలు ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్ ఎర్రర్, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ పాండే తెలిపారు.సోషల్ మీడియా ఫిదా'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది అంటూ ఎక్స్ యూజర్ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు. -
అస్సాం ఎన్నికల బరిలో ‘జెన్ జీ’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే వారసత్వ ఆస్తి అనే పాత పద్ధతులకు అస్సాం ఎన్నికల్లో ‘ఎండ్ కార్డ్’ పడుతోంది. ప్రజలతో అనుబంధం, విద్య, పోరాట పటిమే పెట్టుబడిగా కుర్రకారు రాజకీయ రణరంగంలోకి దూసుకొస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతో పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి.34 ఏళ్ల లోపు నవతరానికి, విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి. వాళ్లు పక్కా గ్రౌండ్ వర్క్, సమస్యలపై అవగాహనతో రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ అడుగుపెట్టి ప్రజా గళం వినిపించాలని ఈ యువ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవ నుంచి వచ్చిన, క్షేత్రస్థాయి అనుభవమున్న వారే...!తేయాకు తోటల నుంచిరాజోర్ దళ్ పార్టీ తరఫున మార్గెరీటా నియోజ కవర్గం నుంచి బరిలో ఉన్న రాహుల్ ఛెత్రీ తేయాకు తోటల్లో పనిచేసిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగారు. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాహుల్ నిరుద్యోగం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.విద్యార్థి రాజకీయాలతోఅల్గాపూర్–కట్లిచెర్రా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జుబేర్ అనామ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. ఆయన తొలుత విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చురుకైన, దూకుడైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలకు చేరువ కావడానికి డిజిటల్ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.మధ్యతరగతి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తిన్సుకియా అభ్యర్థిగా డేవిడ్ టి.ఫుకాన్ను నిలబెట్టింది. మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన ఫుకాన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మధ్యతరగతి ప్రజల ప్రతినిధిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, తేయాకు తోటల కార్మికుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.గిరిజన గొంతుకగా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, జిల్లా అటానమస్ కౌన్సిల్లో చురుగ్గా పనిచేసిన 36 ఏళ్ల రూపాలీ లాంగ్థాసా గిరిజన సమాజంలో కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. హాఫ్లాంగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు.గ్లోబల్ అనుభవంతో సెంట్రల్ గౌహతి నుంచి అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థిగా కుంకీ చౌదరి బరిలో ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులందరిలోనూ అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. లండన్లో మాస్టర్స్ చేసిన ఆమె కార్పొరేట్ కెరీర్ను వదిలి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కుంకీ చౌదరి విస్తృతంగా పనిచేశారు.కార్యకర్త నుంచిగోల్పారా వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పవిత్ర రాభా పోటీ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలతో ప్రస్థానం ప్రారంభించి, యువమోర్చాలో కీలక పాత్ర పోషించి సంస్థాగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నారు.మంచి కెరీర్ వదిలేసిమరియానీ నియోజకవర్గం నుంచి రైజోర్ దళ్ అభ్యర్థిగా డాక్టర్ జ్ఞానశ్రీ బోరా పోటీ చేస్తున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఆమె సురక్షితమైన కెరీర్ను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిరుద్యోగం, మెరుగైన ఆరోగ్య సేవలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు.చదవండి: మాయోంగ్ గ్రామానికి నేతల క్యూ.. ఎందుకో తెలుసా? -
బెంగాల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు.. తొలి జాబితా ఇదే
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏకంగా 284 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు ఏప్రిల్ 23, 29వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనుండటం తెల్సిందే.ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ ఆధిర్ రంజన్ చౌదరి, బహరంపూర్ నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మౌసమ్ నూర్ మాలతిపూర్ నుంచి పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు బెంగాల్ సీనియర్ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేశారు. The AICC leadership has approved the following candidates for the West Bengal Assembly elections. My best wishes to them all. More than Congress candidates, they are people’s candidates representing diverse religious, cultural, geographical, and professional identities. We will… pic.twitter.com/3R2BjFhWdv— Subhankar Sarkar শুভঙ্কর সরকার (@subhankar_cong) March 29, 2026మూడో ఓటరు లిస్ట్ బెంగాల్లో ప్రచురించిన ఈసీకోల్కతా: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనంతరం మూడో అదనపు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. శనివారం రాత్రి 11.30 గంటలకు ప్రచురించిన ఈ జాబితాలో బూత్లవారీ వివరాలున్నాయి.అయితే ఇందులో కూడా తొలగించిన, కొత్తగా చేర్చిన పేర్ల సంఖ్యను వెల్లడించలేదు! సోమవారం తొలి అదనపు జాబితాను, శుక్రవారం రాత్రి రెండో జాబితాను ఈసీ విడుదల చేయడం తెలిసిందే. చదవండి: దీదీ 'చేప'లకు మోదీ గాలం? -
లివ్ ఇన్ జంటలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 16వ జనగణన (Census) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న జంటలకు సంబంధించి ప్రభుత్వం కీలక క్లారిటీ ఇచ్చింది. స్థిరమైన బంధంలో ఉంటూ, కలిసి జీవిస్తున్న జంటలను జనగణన ప్రయోజనాల కోసం ‘వివాహితులు’గానే పరిగణించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.33 ప్రశ్నలతో తొలి దశ జనాభా లెక్కలుజనగణన తొలి దశలో భాగంగా ప్రజలను అడగబోయే 33 ప్రశ్నలకు సంబంధించిన ‘తరచుగా అడిగే ప్రశ్నల’ (FAQs) జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయంగా వివరాలు నమోదు చేసుకునే) పోర్టల్లో ఈ వివరాలను అందుబాటులో ఉంచారు. హౌస్లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ (HLO), జనాభా గణన అనే రెండు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.ఏమేం అడుగుతారు?కేంద్రం సిద్ధం చేసిన ఈ 33 ప్రశ్నల జాబితాలో ఇంటి నిర్మాణ శైలి నుంచి వ్యక్తిగత వివరాల వరకు అన్నీ ఉన్నాయి.ఇంటి నిర్మాణం: గోడలు, పైకప్పు, నేల తయారీకి వాడిన ముడి పదార్థాలు.వసతులు: ఇంట్లో ఉన్న మౌలిక సదుపాయాలు, తాగునీరు, వాహనాల లభ్యత.ఆహారపు అలవాట్లు: కుటుంబ సభ్యులు ప్రధానంగా తీసుకునే తృణధాన్యాల వివరాలు.కుటుంబ వివరాలు: ఇంట్లోని వివాహిత జంటల సంఖ్య, యజమాని పేరు, లింగం, ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారా? కాదా? వంటి అంశాలు.ఆస్తి హక్కు: నివసిస్తున్న ఇల్లు సొంతదా లేక అద్దెదా అనే వివరాలను కూడా సేకరించనున్నారు.డిజిటల్ జనగణన దిశగా..ప్రజలు తమ వివరాలను సులభంగా నమోదు చేసుకునేందుకు వీలుగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పోర్టల్ను రూపొందించారు. లివ్ ఇన్ జంటల గుర్తింపు వంటి సున్నితమైన అంశాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, గణనలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ను విడుదల చేసింది. మున్సిపల్ లేదా స్థానిక సంస్థలు కేటాయించిన వార్డు నంబర్లు, ఇంటి నంబర్ల ఆధారంగా అధికారులు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరిస్తారు. దేశ భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా నిలిచే ఈ జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ‘పన్ను చెల్లిస్తేనే..’.. వందేళ్ల ఓటరు అనుభవాలు -
వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారులు కేకే బిష్ణోయ్ (K.K.Bishnoi) , అన్షికా వర్మ(IPS Anshika) వివాహం (2026 మార్చి 29) వైభవంగా జరిగింది. రాజస్థాన్లోని బార్మర్లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. జోధ్పూర్లో రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు. కేకే బిష్ణోయ్ అన్షికా వర్మల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. తాజగా ఐపీఎస్ అన్షికా వర్మ తన ప్రీ-వెడ్డింగ్షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లవ్ బర్డ్స్కు చెందిన రొమాంటిక్ ఫోటోలు నెటిజనులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఐపీఎస్ లవ్ స్టోరీఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ లవ్బర్డ్స్ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. హల్దీ, మెహందీవేడుకలనుఘనంగా నిర్వహించు కున్నారు. ఈ జంట మార్చి 29న వివాహం తరువాత మార్చి 30న జోధ్పూర్లో పలువురు వీఐపీల సమక్షంలో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Anshika Verma (@anshikaverma.ips) యూపీలో యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరి ప్రేమకథ వైరల్ అవుతోంది. సంభాల్ హింస తర్వాత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకొన్న డైనమిక్ బిష్ణోయ్ సీఎం మెడల్ అందున్నారు. రూ. 100 కోట్ల విలువైన బీమా కుంభకోణం బయటపెట్టి, 69 మందికి పైగా మాఫియాను కటకటాల వెనక్కి నెట్టారు. రౌడీ గ్యాంగ్లకు, అల్లరిమూకలకు చుక్కలు చూపించి ‘‘లేడీ సింగం’’గా అన్షికా వర్మ పేరు తెచ్చుకున్నారు. SP कृष्ण बिश्नोई - SP अंशिका बिश्नोई का #विवाह सम्पूर्ण #बिश्नोई_समाज के रीति रिवाज़ द्वारा हुआ सम्पन्न #KKBishnoi#AnshikaVerma#IPSWedding#IPSWedding#WeddingVibes#ipsanshikaverma#IPSOfficer#SPKKBishnoi#SambhalSp#NewsFlash https://t.co/46TU4SFLE1 pic.twitter.com/tPQfkatl3P— Goldy Srivastav (@GoldySrivastav) March 30, 2026ఐపీఎస్ అధికారిణి,లేడీ సింగం అన్షిక వర్మఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందినవారుతండ్రి రిటైర్డ్ యూపీపీసీఎల్ ఇంజనీర్బీ.టెక్ తరువాత, కోచింగ్ లేకుండా యూపీఎస్సీలో ఉత్తీర్ణత 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం బరేలీలో ఎస్పీ సౌత్గా పనిచేస్తున్నారుగోరఖ్పూర్లో ఏఎస్పీగా కూడా పనిచేశారుఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్ ఐపీఎస్ కేకే బిష్ణోయ్ రాజస్థాన్లోని బార్మర్ జిల్లా నివాసిపూర్తి పేరు కృష్ణ కుమార్ బిష్ణోయ్రైతు కుటుంబానికి చెందినవారుఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బీఏ పట్టా పొందారు24 ఏళ్ల వయసులో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారుగతంలో ముజఫర్నగర్లో ఏఎస్పీగా పనిచేశారు -
‘పన్ను చెల్లిస్తేనే..’.. వందేళ్ల ఓటరు అనుభవాలు
పతనంతిట్ట: వయసు సెంచరీ దాటినా, ఓటు వేయాలనే ఉత్సాహం ఆ తాతలో ఏ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేరళకు చెందిన 101 ఏళ్ల గంగాధరన్ ఆచారి ఓటర్లకు అసలైన బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నారు. ఎవరి సాయం లేకుండా, స్వయంగా పోలింగ్ బూత్కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ, ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటిచెబుతున్నారు. ఏప్రిల్ 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంగాధరన్ ఆచారి ఎదురు చూస్తున్నారు.నాడు ఇంటి పన్ను చెల్లిస్తేనే ఓటు..పతనంతిట్ట జిల్లా అడూర్ సమీపంలోని చెరుకోడ్ నివాసి అయిన గంగాధరన్ ఆచారి 1925లో జన్మించారు. ఆయన తన మొదటి ఓటును ఓమల్లూర్లో వేశారు. ఆ రోజుల్లో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు; కేవలం ఇంటి పన్ను చెల్లించే వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉండేది. రేడియో ద్వారా ఎన్నికల అవగాహన కార్యక్రమాలను విని, ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంచుకున్నానని ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి నేటి మూడంచెల పంచాయతీ ఎన్నికల వరకు ఆయన నిరంతరాయంగా ఓటు వేస్తూనే ఉన్నారు.ఒక చరిత్ర పుటగంగాధరన్ ఆచారి జీవితం ఒక చరిత్ర పుటలాంటిది. తన యవ్వనంలో ఇలంతూర్ పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీని ఆయన స్వయంగా చూశారు. అంతేకాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్ర తిరునాల్, సర్ సి.పి. వంటి మహోన్నత వ్యక్తులను వివిధ సందర్భాల్లో కలిశారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, అప్పటి పరిస్థితులు, అభ్యర్థుల గుణగణాలను బట్టే తాను ఓటు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్య రహస్యం ఇదే101 ఏళ్ల వయసులోనూ గంగాధరన్ ఎంతో దృఢంగా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, అర కిలోమీటరు దూరం నడవడం ఆయన దినచర్యలో భాగం. పరోటా, ఎగ్ కర్రీ, పాలు వంటి ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటారు. వయసు రీత్యా పళ్లు ఊడిపోయినా, మనసు మాత్రం ఇంకా పడుచుగానే ఉందని ఆయన నవ్వుతూ చెబుతారు.కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, ఎన్నికల రోజున ఎవరిపై ఆధారపడకుండా ఒంటరిగానే పోలింగ్ బూత్కు వెళ్లడం ఆయన ప్రత్యేకత. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు ఆయన ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు వేయడం అనేది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అదొక థ్రిల్లింగ్ అనుభూతి అని గంగాధరన్ ఆచారి అంటున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇక ప్రోగ్రామర్లకు గుడ్బై: గూగుల్ మాజీ సీఈఓ -
ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా
పట్నా: బిహార్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి (ఎంఎల్సీ) సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రాజీనామా లేఖను కౌన్సిల్ సెక్రటేరియట్కు సమర్పించారు.గడువు ముగియడంతో నిర్ణయంమార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.మరిన్ని మార్పులు ఖాయమేనా?నితీష్ కుమార్ మాత్రమే కాకుండా, బీజేపీ నేత నితిన్ నబిన్ కూడా బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన రాజీనామా ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగిందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి త్వరలోనే ఆ లేఖను సమర్పిస్తారని సమాచారం.తదుపరి సీఎం ఎవరు?నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ
గౌహతి: అక్కడ మండుటెండలో ఒక మహిళ స్పృహలేకుండా నేలపై పడి ఉంది. ఆమె తలపై ఒక చేటను ఉంచి, మంత్రాలు పఠిస్తూ నీళ్లు పోస్తున్నాడు ఒక వ్యక్తి. తరువాత అదే నీటిని ఒక మట్టి పాత్రలో పోసి ఆమె చేత తాగించాడు. ఇదేదో మారుమూల అడవిలో జరుగుతున్న తంతు కాదు.. అస్సాంలోని క్షుద్ర విద్యల రాజధానిగా పేరొందిన ‘మాయోంగ్’ గ్రామంలోని దృశ్యం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ మంత్రతంత్రాల హోరు మరింతగా మారుమోగిపోతోందిక్షుద్ర పూజల హడావుడిఅస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనితో పాటు, మంత్రతంత్రాలతో గెలుపును దక్కించుకోవాలని మాయోంగ్ బాట పడుతున్నారు. గౌహతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం మంత్రతంత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చే నేతలు ఓట్లు అడగడానికి రారని, ‘విజయ ప్రాప్తి’ కోసం క్షుద్ర పూజలు చేయించుకునేందుకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం జాగీరోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుండి బీజేపీ తరపున మంత్రి పిజూష్ హజారికా, కాంగ్రెస్ నుండి బబుల్ దాస్ పోటీ పడుతున్నారు. పిజూష్ హజారికా పది రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడుమాయోంగ్లో సుమారు మూడు వేల జనాభా ఉంటే, దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉంటాడని చెబుతుంటారు. ఇక్కడి వారసత్వంగా వస్తున్న తంత్ర విద్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘మా వద్దకు జబ్బులు తగ్గించుకోవడానికి, మానసిక సమస్యల నివారణకు చాలామంది వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. అయితే ఎవరినైనా ఓడించడానికైనా పూజలు చేయమంటే మేము ఒప్పుకోం. వచ్చే ప్రతి వ్యక్తి వివరాలను ఒక డైరీలో నమోదు చేస్తాం’ అని స్థానిక తంత్రవేత్త విపుల్ మేధి తెలిపారు. 100 ఏళ్ల వయసున్న జంతు మండల్ అనే వృద్ధ మంత్రగాడు మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి కూడా నేతలు వచ్చి మంత్రి పదవుల కోసం పూజలు చేయమని తమను అడుగుతారని, కానీ తాము కేవలం స్వస్థత చేకూర్చే పనులు మాత్రమే చేస్తామని పేర్కొన్నారు.చరిత్రలో ‘మాయోంగ్’ మాయాజాలంఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. శత్రువులను గాలిలో మాయం చేయడం, మనుషులను జంతువులుగా మార్చడం వంటి శక్తులు ఇక్కడి వారికి ఉన్నాయని స్థానికుల నమ్మకం.తుగ్లక్ సైన్యం మిస్టరీ: 1337లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్ పంపిన ఒక లక్ష మంది సైన్యం ఈ మాయోంగ్ అడవుల్లోనే అదృశ్యమయ్యారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.మొఘలుల వెనకడుగు: ఔరంగజేబు పంపిన రాజా రామ్ సింగ్ కూడా మాయోంగ్ మంత్రగాళ్ల భయంతో వెనక్కి తగ్గినట్లు చరిత్ర చెబుతోంది.మహాభారతంతో లింక్: భీముడు-హిడింబల కుమారుడైన ఘటోత్కచుడు ఇక్కడే నివసించాడని, అతని వారసులే ఈ విద్యల్లో ఆరితేరారని స్థానికులు నమ్మకం. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన పురాతన కత్తులు, మంత్రాలు రాసిన రాగి పలకలను స్థానిక మ్యూజియంలో భద్రపరిచారు.మారుతున్న కాలంఇక్కడ 18వ శతాబ్దం వరకు నరబలి కూడా జరిగేదని, బ్రిటిష్ వారు దానిని నిషేధించారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత తరం ఈ విద్యలకు దూరంగా ఉంటోంది. గ్రామంలోని యువత ఇప్పుడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతోంది.‘మా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నేతలు కూడా గెలిచాక మా పిల్లలకు ఉపాధి కల్పించాలి’ అని స్థానిక మహిళలు నిరుపమ దేవి, నీలం ముని దేవి మీడియా ముందు కోరారు.ఇది కూడా చదవండి: షాకింగ్: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా -
‘చిట్టీ’ల్లో నష్టం... ముగ్గురిని అంతమొందించి..
చేసేది చిట్ఫండ్ బిజినెస్, సాగించేది విలాసవంతమైన జీవనం.. కానీ పరిస్థితి అదుపు తప్పింది, విపరీతంగా అప్పుల భారం, చెల్లించాలని ఒత్తిళ్లు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రాక్షసునిగా మారాడు. తన తల్లి, అక్క, ఆమె కొడుకుపై కత్తితో దాడి చేశాడు. వారిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలన్నదే అతని ప్రణాళిక. ఈ దురాగతంలో ఇద్దరు మరణించారు, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. బెంగళూరు శివార్లలోని ఆనేకల్ ఈ ఘోరానికి వేదికైంది. బెంగళూరు: చిట్ఫండ్ వ్యాపారంలో అప్పుల పాలై ఓ వ్యక్తి ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని అత్తిబెలే సమీపంలో ఉన్న మల్లెనహళ్లిలో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మోహన్గౌడ (32) చిట్ఫండ్ వ్యాపారం చేసేవాడు. ఇంట్లో కత్తితో తల్లి ఆశా (56),, సోదరి వర్షిత (34), సోదరి కుమారుడు మయాంక్గౌడ (11) మీద దాడి చేసి వారి గొంతులు కోసి, తరువాత అదే కత్తితో తానూ గొంతుకోసుకున్నాడు. ఆశా, వర్షిత అక్కడికక్కడే మరణించారు. మోహన్గౌడ, బాలుడు తీవ్ర గాయాల పాలయ్యారు. సెల్ఫీ వీడియో పంపి మోహన్గౌడ రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకూ చిట్టీలు నిర్వహించేవాడు. జనం డబ్బులు చెల్లిస్తూ ఉండగా, విలాసవంత జీవనానికి అతడు అలవాటు పడ్డాడు. హత్యాకాండకు ముందు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బంధువులకు ఓ సెల్ఫీ వీడియోను పంపాడు. అప్పులవారి వేధింపులను భరించలేకపోతున్నట్లు తెలిపాడు. దీంతో కొందరు పరుగు పరుగున ఇంటికి వచ్చి చూడగా తలుపులన్నీ వేసి ఉన్నాయి. వెనుక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, రక్తపు మడుగులో తల్లీకూతురి మృతదేహాలు కనిపించాయి. మోహన్, మయాంక్లు గాయాలతో పడి ఉన్నారని బెంగళూరు రూరల్ ఎస్పీ ఎంవీ చంద్రకాంత్ మీడియాకు తెలిపారు. అత్తిబెలె పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అవివాహితుడని సమాచారం. అప్పులే కారణం: ఎస్పీ ఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ, శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అధిక అప్పులే కారణమని తేలింది. మోహన్గౌడ ఖాతాదారుల నుంచి లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వారికి తిరిగి చెల్లించలేకపోయాడు, లగ్జరీ లైఫ్తో విపరీతంగా ఖర్చులు పెట్టేవాడు. ముందుగా తల్లి, సోదరి, మేనల్లుని గొంతులు కోసినట్లు తేలింది. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయి అని తెలిపారు. అతని వద్ద చిట్ వేసినవారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. -
షాకింగ్: ఇండియా పోస్ట్ పేరుతో కొత్త దందా
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు వచ్చాయని మెసేజ్ మీకు వచ్చిందా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ లింక్ను క్లిక్ చేసే ముందు ఇది తప్పక చదవండి. లేదంటే మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. భారత తపాలా శాఖ (India Post) పేరుతో ప్రస్తుతం ఒక నకిలీ లక్కీ డ్రా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 170 ఏళ్ల వేడుకల సందర్భంగా ఉచిత బహుమతులు అందిస్తున్నామంటూ యూజర్లను ఈ స్కామ్ ఊరిస్తోంది. బహుమతులు గెలుచుకోవాలంటే కొన్ని వివరాలు నమోదు చేయాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.ప్రభుత్వం ఏమంటోంది?దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇప్పటికే స్పందించింది. ఇదంతా ఒక పెద్ద మోసమని, ఇండియా పోస్ట్ ఇలాంటి లక్కీ డ్రాలు గానీ, బహుమతుల పంపిణీ గానీ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో సంబంధిత అధికారులు.. ‘ఇండియా పోస్ట్ పేరుతో జరుగుతున్న ఈ లక్కీ డ్రా నకిలీది. ఇలాంటి అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోకండి’ అని హెచ్చరించారు. A #fake lucky draw is luring people into providing their personal information by offering free gifts in the name of @IndiaPostOffice#PIBFactCheck⚠️It is a #Scam & is not related to India Post✔️Be cautious! Refrain from clicking on such suspicious links pic.twitter.com/mcmwbx4d22— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2026సురక్షితంగా ఉండటం ఎలా?సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు..అధికారిక సమాచారం: ఏదైనా ఆఫర్ లేదా ప్రమోషన్ గురించి తెలుసుకోవాలంటే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ లేదా వారి వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే నమ్మండి.అజ్ఞాత లింక్లు వద్దు: వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింక్లపై క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఉచిత బహుమతులు అని చెప్పే వాటికి దూరంగా ఉండండి.వ్యక్తిగత డేటా: ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను ఎవరికీ తెలియజేయకండి.యాప్ల పట్ల జాగ్రత్త: గుర్తుతెలియని లింక్ల ద్వారా వచ్చే యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి.సందేహం ఉంటే: ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవడానికి నేరుగా తపాలా శాఖ కస్టమర్ కేర్ను సంప్రదించండి. డిజిటల్ యుగంలో ఆశ చూపి, మోసం చేసే నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అప్రమత్తంగా ఉండటమే ఇందుకు ఏకైక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కువైట్: క్షిపణి దాడిలో భారత కార్మికుడు మృతి -
కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ
దేశంలో అటు సినిమా, ఇటు రాజకీయం.. ఈ రెండూ నాణేనికి రెండు పార్శ్వాల వంటివని అంటుంటారు. వెండితెరపై వెలిగిన తారలు ప్రజాక్షేత్రంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. మాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమదైన ముద్ర వేసిన ఐదుగురు ప్రముఖ దర్శకులు, నటుల ప్రస్థానం ఇలా..రాము కారియాట్: ట్రెండ్ సెట్టర్మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో దిగ్గజ దర్శకులు రాము కారియాట్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘నీలకుయిల్’ (1954) తదితర గొప్ప చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, జాతీయ అవార్డు గెలుచుకున్న 'చెమ్మీన్' (1967) సినిమాతో మరో చరిత్ర సృష్టించారు. కేరళలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఎన్నికల బరిలోకి దిగే సంప్రదాయాన్ని ఆయనే మొదలుపెట్టారు. 1965లో త్రిసూర్ జిల్లాలోని నాటిక నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘనవిజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.ఇన్నోసెంట్: హాస్య చక్రవర్తి నుంచి పార్లమెంటు వరకు..ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతల.. తన కామెడీ టైమింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు ఉన్న దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో చలకుడి నియోజకవర్గం నుంచి ఎల్డిఎఫ్ (ఎల్డీఎఫ్)మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఒక హాస్య నటుడిగా కేరళ ప్రజల హృదయాల్లో నిలిచిన ఆయన, పార్లమెంటు సభ్యుడిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.సురేష్ గోపి: కేరళలో బీజేపీ సత్తామలయాళ స్టార్ హీరో సురేష్ గోపి ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘మణిచిత్రతాజు’ (1993) వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆయన, 2016లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. చివరకు 2024 లోక్సభ ఎన్నికల్లో అదే త్రిసూర్ నుంచి ఘనవిజయం సాధించి, కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు.గణేష్ కుమార్: రాజకీయ వారసుడునటుడు కేబీ గణేష్ కుమార్ అటు సినిమా, ఇటు రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సీనియర్ నాయకుడు ఆర్. బాలకృష్ణ పిళ్ళై కుమారుడైన గణేష్ కుమార్.. 2023 నుంచి కేరళ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ‘మణిచిత్రతాజు’, ‘కమిషనర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, రాజకీయాల్లోనూ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కీలక నేతగా ఎదిగారు.రమేష్ పిషారోడి: 2026 బరిలో కొత్త ఆశప్రముఖ నటుడు, కమెడియన్ రమేష్ పిషారోడి ఇప్పుడు 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం పిషారోడిని బరిలోకి దించింది. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోవాలని ఆయన సిద్ధమవుతున్నారు.కేరళ రాజకీయ ముఖచిత్రంలో సినీ సెలబ్రిటీల పాత్ర ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 1965లో రాము కారియాట్ వేసిన పునాది నుంచి నేడు రమేష్ పిషారోడి వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో మలయాళీ ఓటర్లు మరోసారి వెండితెర తారలకు పట్టం కడతారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన.. -
డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్
చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్స్టార్లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్లేని పంపుసెట్లువార్షిక ఆదాయ పరిమితి పెంపుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపువృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్కలైంగర్ మగలిర్ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపుపాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపుక్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధరటన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధరవచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణంఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్ ముధల్వాన్ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేతరాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడంవచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపుధుమై పెన్, తమిళ్ పుధల్వాన్ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్ అందజేతకోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్–రెడీ గ్లోబల్ సిటీల నిర్మాణం. -
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
ఆకాశంలో కమాండ్ సెంటర్!
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో ‘ఇ–3సీ సెంట్రీ’ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే! ఎందుకంటే దాని ప్రత్యేకతలు అలాంటివి. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్ సేవలూ అందించగలదు. ఎయిర్బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)గా పిలుచుకునే ఈ ముందస్తు హెచ్చరికల విమానం గగనతలంలో చక్కర్లు కొట్టే కమాండ్ కేంద్రం! దీని తోకపై ఉండే 30 అడుగుల భారీ రాడార్ డిస్క్ అత్యంత శక్తిమంతమైనది.ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్ల ప్రయాణిస్తూ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. దీన్ని సైన్యానికి కళ్లు, చెవులుగా చెప్పవచ్చు! భూ, సముద్రతలాలతో పాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా ఈ విమానం పసిగట్టి వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్ల రూపంలో చూడొచ్చు.తద్వారా క్షిపణులు, బాంబుల ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం వీలవుతుంది. ఆర్సీ–135 నిఘా విమానాలు, విమాన వాహననౌకలతో ఏకకాంలో సమాచారం పంచుకుంటూ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. బోయింగ్ తమ 707–320బీ విమానాన్ని ఆధునీకరించి ఇ–3సీ సెంట్రీ విమానంగా రూపొందించింది. ఒక్కో విమానం ఖరీదు రూ.6,640 కోట్లు. దశాబ్దాల క్రితం అమెరికా అమ్ములపొదిలో ఇవి 30 దాకా ఉండేవి. వీటి తయారీని బోయింగ్ నిలిపేయడంతో ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. 46 మీటర్ల పొడవైన ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్టంగా 29,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లూటీదార్లు!
పాలక్కాడ్/త్రిసూర్: సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను విచ్చలవిడిగా లూటీ చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలైన ఎ–టీమ్. అంతే తప్ప ఎవరికీ బి–టీమ్ కాదు’’ అని తేల్చిచెప్పారు. ఆదివారం కేరళలోని పాలక్కాడ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని తేల్చిచెప్పారు. కేరళ ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని అన్నారు.కేరళకు సేవ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ‘మోదీ గ్యారంటీ’ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈసారి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి ఎన్డీయేకు ఆదరణ పెరుగుతోందన్నారు. కేరళ యువత, మహిళలు, రైతన్నలు బీజేపీ కూటమిని ఎంతగానో అభిమానిస్తున్నారని వెల్లడించారు.అన్ని కుంభకోణాలపై దర్యాప్తుకేరళను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ విపరీతంగా లూటీ చేశాయని మోదీ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఆ రెండు కూటముల మధ్య అవగాహన ఉంది. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చి, జేబులు నింపుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల కేరళ ఆర్థికంగా నష్టపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిపోతున్నాయి. మేం గెలిచాక ఆ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని ప్రకటించారు.ఆ సొమ్మంతా కక్కిస్తాం పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో కేరళ రుణ భారం మూడు రెట్లు పెరిగి రూ.5 లక్షల కోట్లు దాటేసిందరి మోదీ చెప్పారు. ‘‘ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అది ఎల్డీఎఫ్ నేతల జేబుల్లోకే వెళ్లింది. మేం రాగానే ఆ సొమ్మంతా కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తాం. కేరళ ప్రగతి కోసం కేంద్రం భారీగా నిధులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే రాష్ట్రానికి మేమే ఎక్కు నిధులు విడుదల చేశాం’’ అని చెప్పారు. ‘‘మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణంపై దృష్టి పెట్టాం.చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి పార్లమెంట్లో ‘నారీశక్తి వందన్ అధినియమ్ చట్టం’ తెచ్చాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలేమో అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలుతున్నారు’’ అని మండిపడ్డారు. పశ్చిమాసియా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. దానివల్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయుల ప్రాణాలకు ముప్పుందన్నారు. త్రిసూర్లో భారీ రోడ్ షో కేరళలోని త్రిసూర్లో మోదీ ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు, కాషాయం రంగు తలపాగా ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. డోలు వాయించిన మోదీపాలక్కాడ్ సభలో మోదీ కేరళ సంప్రదాయ డోలు వాద్యం ‘చెండా’పై దరువేశారు. దాంతో సభికులు హర్షధ్వానాలు వెలిబుచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక దాకా జనం రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీకి స్వాగతం పలికారు. వేదికపై చెండాను వాయించడానికి ఆయన కర్రలు చేతుల్లోకి తీసుకోగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆయన అర నిమిషం పాటు కొన్ని బీట్లు వాయించి అలరించారు. సభలో ఇద్దరు చిన్నారులు పెయింటింగ్లను పట్టు కొని ఉండటం గమనించిన మోదీ, వా టిపై వాళ్లు పేర్లు, చిరునామా రాయాలని వారికి సూచించారు. వారికి తాను ప్రత్యు త్తరం పంపుతానన్నారు. ఆ పెయింటింగులను తీసుకో వాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. సభలో మైక్కు సంబంధించిన పరికరం నుంచి పొగలు రావడం కాసేపు కలకలం సృష్టించింది.కష్టకాలంలోనూ సత్తా చాటుతున్నాం: మన్ కీ బాత్లో మోదీసాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభాల వంటి క్లిష్ట పరిస్థితులను 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సహకారంతో దేశం దీటుగా ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యుద్ధాల వేళ స్వార్థ రాజకీయాలకు తావులేదని, పుకార్లను నమ్మవద్దని ఆదివారం మన్ కీ బాత్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పీఎం సూర్య ఘర్ పథకాన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. 100 రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోందని, ఫిట్నెస్పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. జల సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యమివ్వాలన్నారు. పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు ఉద్దేశించిన ’జ్ఞాన్ భారతం సర్వే’లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
బాలిక ప్రాణం తీసిన ‘క్యాండీ చోరీ’..
బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్యాండీ ప్యాకెట్ చోరీ చేసిందని కుమార్తెను కర్రతో కొట్టి చంపాడు ఓ తండ్రి. అతడిని ఇవాళ (మార్చి 29న) అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు తెలిపారు. నిందితుడిని పోలీసులు పుష్పేంద్ర అలియాస్ పప్పు శర్మగా గుర్తించారు. మార్చి 27న రతన్పూర్ గ్రామంలో పుష్పేంద్ర భార్య ఆర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో ఆర్తి పేర్కొన్న వివరాల ప్రకారం.. తన కుమార్తె(12)పై పుష్పేంద్ర కర్రతో దాడి చేయడంతో ఆమె మరణించింది.అంతకుముందు పుష్పేంద్ర వద్దకు స్థానిక దుకాణదారుడు వచ్చాడు. పుష్పేంద్ర కుమార్తె క్యాండీ ప్యాకెట్ తీసుకుందని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన పుష్పేంద్ర తన కుమార్తెను ఓ కర్రతో చావబాదాడు. దీంతో ఆ బాలిక దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది. ఆర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నరోరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగా ప్రసాద్ ఆర్యా మాట్లాడుతూ.. పుష్పేంద్ర ఉపయోగించిన కర్రను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.కేవలం క్యాండీ చోరీ చేసినందుకు కుమార్తెను తండ్రి చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ సమయంలో ఆ తండ్రిని గుర్తించి బాలికను కొట్టకుండా ఎవరైనా ఆపి ఉంటే ఆమె ఇప్పుడు బతికి ఉండేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. -
TVK : విజయ్ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
సాక్షి,చెన్నై: సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పార్టీ అధినేతలు సామాన్యులకు కీలక పదవులు ఇచ్చి, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అందరి మన్ననలు పొందుతుంటారు. తాజాగా, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ను విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ప్రకటించారు.ఆదివారం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్న 234 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అయితే, వేదికగా విజయ్ తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును ప్రకటించడంతో శబరినాథన్, ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. శబరీనాథన్ విజయ్ పాదాలను తాకి, ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచారు. ఈ దృశ్యం అభిమానులను కదిలించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు ‘విజయ్ తన డ్రైవర్ కుమారుడిని రాజకీయ నాయకుడిగా నిలబెట్టడం విశ్వాసానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.మరికొందరు ‘రాజేంద్రన్ 30 ఏళ్లుగా విజయ్తో ఉన్నాడు. అతని కుమారుడు శబరీనాథన్ అభిమాన సంఘం కార్యకలాపాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నాడు’ అని వివరించారు. గత ఏడాది శబరీనాథన్ను విరుగంబాక్కం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం ద్వారా విజయ్ తన విశ్వాసపాత్రులపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైంది.2024లో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని ప్రకటించారు. ఆయన చివరి సినిమా ‘జన నాయకన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపై ఆయన పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి స్వయంగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రజలతో నిలబడే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాను’అని విజయ్ స్పష్టం చేశారు. Namma Kuda Irkavangala Namma Pathukitta , Namaku Mela Irkavan Nammala Paarthupaan 🫶Thalapathy Vijay Personal Driver Rajendran & his Son Got Emotional ♥️😭#TVKPeopleCandidates pic.twitter.com/dIe7bqZpo0— Arun Vijay (@AVinthehousee) March 29, 2026 -
పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీయే 14-17, ఎస్పీయే 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 9-11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5-7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34-36 శాతం, ఎస్పీఏ 30-32 శాతం, టీవీకే 16-18 శాతం, ఎన్టీకే 4-6 శాతం, వీసీకే 1-3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 2-5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది.ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి.ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఎన్డీయే ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా? అని అడిగినప్పుడు, 55 శాతం మంది ఇస్తామని, 41 శాతం మంది ఇవ్వమని, 4 శాతం మంది చెప్పలేం అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నమ్ముతున్నట్లు దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమిని గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.ఎన్నికల్లో మీరు ఓటే వేసే ముందు ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు? అని ప్రశ్నించినప్పుడు 40 శాతం మంది అభ్యర్థి, 30 శాతం మంది పార్టీ, కులం, మతానికి 10 శాతం, డబ్బు 10 శాతం, మిగిలినవారు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.ఈ ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు 62 శాతం మంది ఎన్. రంగస్వామికి మద్దతిచ్చారు. దీంతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశం... ఏమిటని ప్రశ్నించినప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేకపోవడం, అధికార యంత్రాంగంలో అవినీతి, విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యలు అని ఈ సర్వేలో ప్రజలు వెల్లడించారు.రాష్ట్ర హోదా డిమాండ్, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, యువతలో నిరుద్యోగం, వరదలు, రోడ్ల దుస్థితి, నీటి కొరత, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. కానీ, వీటికి కౌంటర్ గా ప్రచార వ్యూహాల్లో ఎన్డీయే సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం, పాలు, విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు నెలకు రూ. 2000 ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రచారం చేస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని ఎస్పీయే కూటమి రాష్ట్ర హోదా, పాలనా లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ప్రచారం చేస్తోంది.మరోవైపు టీవీకే యువతను ఆకర్షించే ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తోంది. అభ్యర్థుల ఎంపికలో మత, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎన్డీయే ప్రధానంగా హిందూ ఓటర్లపై ఆధారపడి, వ్యూహాత్మకంగా మైనారిటీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. ఎస్పీయేకి క్రైస్తవులు, ముస్లింలలో బలమైన మద్దతు ఉంది. ఎన్టీకే 50 శాతం మహిళలకు టికెట్లు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అంశాలు, అభ్యర్థుల బలం, ఓట్ల విభజన వంటి అంశాలే ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయేకి స్వల్ప ఆధిక్యం తెచ్చిపెట్టే అవకాశం ఉంది.పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థులు ఉపసంహరణ చివరి తేది అయిన మార్చి 16 నుంచి 23వ తేది వరకు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రానున్న 10 రోజుల్లో సంభవించే రాజకీయ పరిణామాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏప్రిల్ 9వ తేదిన పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలకు ముగిసిన తర్వాత పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి ఏప్రిల్ 29 నాడు తుది సర్వే ఫలితాలను వెల్లడిస్తుంది. -
‘కేరళంను లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ దోచుకున్నాయి’
పాలక్కాడ్: కేరళం ఎన్నికల వేళ ఎల్డీఎఫ్, యూడీఎఫ్పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కేరళంలోని పాలక్కాడ్లో మోదీ పర్యటించి బహరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేరళం ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. కేరళంను లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ దోచుకున్నాయని చెప్పారు. ఓటు బ్యాంక్పైనే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దృష్టి పెట్టాయని తెలిపారు.“బీజేపీకి వారు భయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు చేసిన అవినీతి బయటపడుతుందని వారు నమ్ముతున్నారు. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్-యూడీఎఫ్ ఇక్కడ భారీగా అవినీతికి పాల్పడ్డాయి. కానీ, ఈ పార్టీల ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి కేసులను దర్యాప్తు చేసి కేరళం ప్రజలకు న్యాయం చేస్తుంది. అందుకే ఎల్డీఎఫ్-యూడీఎఫ్కు నిద్ర పట్టడం లేదు. కేరళంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ లక్ష్యం కేరళం ప్రజల కలలను నెరవేర్చడం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే ఐదు రెట్ల ఎక్కువ బడ్జెట్ను కేరళానికి మేము ఇచ్చాం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరి బీ-టీమ్ అనే నిజం కేరళం ప్రజలకు తెలియాలి‘’ అని అన్నారు. -
Mann Ki Baat: పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని మోదీ క్లారిటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్నా భారత్ ఏమాత్రం బెదిరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నాటి 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందని అన్నారు.వదంతులు నమ్మొద్దు.. ఐక్యంగా ఉందాం!పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోవడం ఇంధన సరఫరాకు సవాలుగా మారిందని పేర్కొన్నారు. ‘ఇది క్లిష్ట సమయం. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉండాలి. స్వార్థ రాజకీయాల కోసం ఈ విషయాన్ని వాడుకోవద్దు. వదంతులు వ్యాప్తి చేస్తూ దేశానికి నష్టం కలిగించకండి’ అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన కోరారు.అండగా నిలిచిన గల్ఫ్ దేశాలుగల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయుల భద్రతపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.జ్ఞాన భారతం - యువ శక్తిదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, రాగి రేకులు, ప్రాచీన రాతప్రతులను భద్రపరిచేందుకు చేపట్టిన ‘జ్ఞాన భారతం’ సర్వే గురించి మోదీ వివరించారు. అలాగే ‘మై భారత్’ (MY Bharat) ద్వారా లక్షలాది మంది యువత దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ విజయం, జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ గెలవడం వంటి క్రీడా విజయాలను ఆయన కొనియాడారు. ప్రజల ఆరోగ్యంపై ప్రధాని స్పందిస్తూ.. ఆహారంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని, వంట నూనె వినియోగాన్ని 10 శాతం మేర కోత విధించాలని ప్రధాని సూచించారు. జల సంరక్షణలో భాగంగా నిర్మించిన 70 వేల అమృత్ సరోవర్ల విజయాన్ని ఉదాహరిస్తూ, సుస్థిర భవిష్యత్తు కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
China: ముగ్గురు సజీవ దహనం.. మరో 23 మంది..
బీజింగ్: చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. తైయువాన్ నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. షాంగ్జీ రాజధాని తైయువాన్లోని షియావోడియన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే భవనం మొత్తానికి అవి విస్తరించాయి. దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఆకాశాన్నంటడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన 23 మందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని జిల్లా పబ్లిసిటీ విభాగం వెల్లడించింది.3月28日晚,山西太原,亲贤北街茂业怡和巷一饭店大楼发生大火,官方通报24死伤!#太原 #火灾 pic.twitter.com/uZsvMm3utw— 中国悲剧档案 (@newszg_official) March 28, 2026భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాత్రి పూట మంటలు భవనాన్ని చుట్టుముట్టడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. -
గ్యాసు లేదని.. ఆశించరాదని.. నిత్యం 500 మందికి వంట
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ.. గుజరాత్లోని ఒక విద్యాసంస్థ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్లపై పైసా ఖర్చు లేకుండా, కేవలం బయో గ్యాస్తో వందలాది మందికి కడుపు నింపుతూ వార్తల్లో నిలిచింది.నిత్యం 500 మందికి భోజనంగాంధీనగర్లోని ‘మానెక్బా వినయ్ విహార్’ విద్యాసంస్థ గుజరాత్ ప్రభుత్వ ‘ఇన్స్టిట్యూషనల్ బయో గ్యాస్ ప్లాంట్ స్కీమ్’ కింద ఈ అద్భుతాన్ని సాధించింది. ఈ క్యాంపస్లో ప్రతిరోజూ దాదాపు 250 మంది విద్యార్థులకు రెండు పూటలా భోజనం సిద్ధం చేస్తున్నారు. కేవలం విద్యార్థులకే కాకుండా, క్యాంపస్లో నివసించే మరో 15 కుటుంబాలకు కూడా ఈ బయో గ్యాస్ ద్వారానే వంట గ్యాస్ అందుతోంది. మొత్తంగా రోజుకు 500 మందికి పైగా ఈ ఇంధనం ద్వారానే ఆహారం పొందుతున్నారు.నెలకు 30 సిలిండర్ల ఆదాఈ విద్యాసంస్థలో ప్రస్తుతం 45 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 90 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఒకవేళ ఈ ప్లాంట్లు లేకపోతే, ఈ అవసరాల కోసం నెలకు కనీసం 30 ఎల్పీజీ సిలిండర్లు వాడాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఒక్క సిలిండర్ అవసరం కూడా లేకుండానే వంట పనులు పూర్తవుతున్నాయి.వ్యర్థం నుంచి ఆదాయం.. సేంద్రీయ సాగుసంస్థ మేనేజర్ రాహుల్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం క్యాంపస్లో ఉన్న 220 ఆవుల నుంచి వచ్చే పేడను ఈ ప్లాంట్లకు ముడిసరుకుగా వాడుతున్నారు. బయో గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలే వ్యర్థాన్ని ఎరువుగా మార్చి, క్యాంపస్లోనే పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల అటు గ్యాస్ ఖర్చు తగ్గడమే కాకుండా, ఇటు స్వచ్ఛమైన ఆహారం కూడా లభిస్తోంది.విస్తరిస్తున్న ‘బయో’ విప్లవంగుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (జీఈడీఏ) గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 193 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 12 కోట్లు కేటాయించింది. త్వరలోనే మరో 60 విద్యాసంస్థల్లో ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి స్వయం సమృద్ధి మార్గాలు సామాన్యులకు వివిధ సంస్థలకు ఊరటనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు -
రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు
భారత పారిశ్రామిక రంగానికి చెందిన ఒక ధ్రువతార నేలకొరిగింది. దేశీయ వస్త్ర ప్రపంచంలో ‘రేమండ్’ అనే బ్రాండ్ను ప్రతి ఇంటికి చేర్చిన, సంస్థ మాజీ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ విజయ్పత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం రాత్రి ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచిన వార్త వినగానే యావత్ పారిశ్రామిక లోకం దిగ్భ్రాంతికి లోనైంది. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, అసాధారణ సాహసిగా, దాతగా ఆయన చెరగని ముద్ర వేశారు.ఒక బ్రాండ్ వెనుక ..సాధారణ మధ్యతరగతి భారతీయుడికి సూట్ ధరించడం అనే కలను పరిచయం చేసిన వ్యక్తి విజయ్పత్ సింఘానియా. 1980లలో ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రేమండ్ ఒక చిన్న సంస్థ. అయితే తన వ్యూహాలతో దానిని పురుషుల ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని గమ్యస్థానంగా మార్చారు. ‘ది కంప్లీట్ మ్యాన్’ అనే ట్యాగ్లైన్కు నిలువెత్తు రూపంగా ఆయన నిలిచారు.RIP. Om Shanti 🙏 pic.twitter.com/nGtOGAEtHt— Gautam Singhania (@SinghaniaGautam) March 28, 2026వ్యాపారవేత్త మాత్రమే కాదువిజయ్పత్ సింఘానియా జీవితం కేవలం బోర్డ్రూమ్ మీటింగ్లకే పరిమితం కాలేదు. 2005లో, తన 67వ ఏట, హాట్ ఎయిర్ బెలూన్లో సుమారు 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుండి అహ్మదాబాద్ వరకు ఒంటరిగా విమానాన్ని నడుపుతూ వచ్చిన ఆయన సాహసం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.పద్మభూషణ్ నుండి షెరీఫ్ వరకు..వస్త్ర పరిశ్రమ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతేకాకుండా, ఆయన ముంబై నగరానికి గౌరవ ‘షెరీఫ్’గా కూడా పనిచేశారు. తన జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన విజయ్పత్ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. ఒంటరి పోరాటంకోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన జీవితంలో పలు వ్యక్తిగత సంఘర్షణలను ఎదుర్కొన్నారు. తన ఆస్తులను కుమారుడు గౌతమ్ సింఘానియాకు బదిలీ చేసిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అద్దె ఇంట్లో గడపడం నుండి కోర్టు మెట్లు ఎక్కడం వరకు, ఒక దిగ్గజం ఎదుర్కొన్న ఈ ఒడిదుడుకులు ఎందరినో కలచివేసాయి.మళ్లీ కలిసిన బంధంసంవత్సరాల తరబడి సాగిన మనస్పర్థల తర్వాత, 2024లో తండ్రీకొడుకులు మళ్లీ ఒక్కటవడం అభిమానులను, వ్యాపార వర్గాలను సంతోషపరిచింది. ‘అపార్థాలు తొలగిపోయాయి, నా తండ్రి దీవెనలు నాకు ముఖ్యం’ అని గౌతమ్ ప్రకటించడం ఆ కుటుంబ ప్రస్థానంలో ఒక కీలక మలుపు.ముగిసిన అద్భుత శకంవిజయ్పత్ సింఘానియా మరణం భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు. శూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించడం, ఆకాశంలో రికార్డులు సృష్టించడం, జీవితపు ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కోవడం మొదలైనవి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ‘కంప్లీట్ మ్యాన్’ ప్రయాణం ముగిసినా, ఆయన సృష్టించిన బ్రాండ్ ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన.. -
Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన..
భారతీయ టెలివిజన్ చరిత్రలో ‘మహాభారతం’ సీరియల్లో ద్రౌపదిగా నటించి, యావత్ దేశాన్ని అలరించిన నటి రూపా గంగూలీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ పౌరాణిక గాథలో అన్యాయాన్ని ఎదిరించినట్లే, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికలను ‘చెడుపై మంచి సాగిస్తున్న ధర్మయుద్ధం’గా ఆమె అభివర్ణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.కురుక్షేత్రం తరహాలో బెంగాల్ రాజకీయాలుప్రస్తుత రాజకీయ పరిస్థితులను రూపా గంగూలీ కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. ‘ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. అంతిమంగా సత్యమే గెలుస్తుంది (సత్యమేవ జయతే)’ అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా బెంగాల్ ప్రజలు పాలనాపరమైన వైఫల్యాలతో సతమతమవుతున్నారని, సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తాను ఈ పోరులో నిలబడినట్లు ఆమె స్పష్టం చేశారు.ఓటర్ల జాబితాలో ఇన్ని లోపాలా?ఎన్నికల వ్యవస్థలోని లోపాలపై రూపా గంగూలీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా 2002 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఇంకా కొనసాగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రతిపక్షాల వాదనకు చోటు కల్పించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సొంత గడ్డ.. తండ్రి కలసోనార్పూర్ సౌత్ నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రూపా గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘మహాభారతం సీరియల్ ద్వారా వచ్చిన సంపాదనతో నా తల్లిదండ్రుల కోసం ఇక్కడే ఇల్లు కొన్నాను. దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నా తండ్రి పడ్డ కష్టాలు, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి లేమి నాకు బాగా తెలుసు’ అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ వ్యక్తిగత అనుబంధమే తనను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రేరేపించిందని రూపా గంగూలీ అన్నారు.సంక్షేమ పథకాలే లక్ష్యంఎన్నికల హింసను అరికట్టి శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని రూపా గంగూలీ కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)వంటివి అర్హులైన బెంగాల్ ప్రజలందరికీ చేరాలని ఆమె ఆకాంక్షించారు. ‘ద్రౌపది’గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం? -
ఐస్క్రీమ్ విక్రేత తల నరికి.. ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
బారాబంకి: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బారాబంకిలో ఐస్క్రీమ్ విక్రేత దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి.. యువకుడి గొంతు కోసి, తలను శరీరం నుండి వేరు చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ తెగిపడిన తలను తన ఇంటికి తీసుకెళ్లి.. పక్కనపెట్టి ఏమీ ఎరగనట్టు వంట చేసుకోవడం పోలీసులను సైతం షాక్కు గురి చేసింది.బారాబంకి జిల్లాలోని పర్సావల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని బబ్లూగా గుర్తించారు. అతను ప్రతిరోజూ లాగే ఐస్క్రీమ్ అమ్ముకోవడానికి ఆ గ్రామానికి వెళ్లాడు. పనిలో ఉండగా.. స్థానిక నివాసి శంకర్ యాదవ్తో బబ్లూకు వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో, శంకర్ యాదవ్ ఒక్కసారిగా కొడవలితో బబ్లూపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే అతని గొంతు కోసి తలను నరికేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోకుండా.. ఆ తెగిపడిన తలను పట్టుకుని గ్రామంలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి నిందితుడు ఇంట్లో వంట చేసుకుంటున్నట్లు గుర్తించారు.హత్య గురించి సమాచారం అందిన వెంటనే, ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. పోలీసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టి లోపలికి వెళ్లగా.. అక్కడ బబ్లూ తల పక్కనే పడి ఉండగా.. శంకర్ యాదవ్ వంట చేస్తూ కనిపించాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.బబ్లూ తన ముగ్గురు సోదరులలో పెద్దవాడు. కూలీ పనులు చేస్తూ, ఐస్క్రీమ్ అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బబ్లూ భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అసలు వారిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. -
సౌదీ యువరాజుకు మోదీ ఫోన్.. ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఖండించారు. ఆయన శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు తేల్చిచెప్పారు.నౌకా మార్గాలను తెరిచి ఉంచాలని, తగిన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులకు సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు కృతజ్ఞతలు తెలియజేశానని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ, సౌదీ యువరాజు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. మోదీ ఇప్పటికే యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఇరాన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మలేషియా, అమెరికా తదితర దేశాల పాలకులతో సంభాషించారు. -
Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?
పశ్చిమ బెంగాల్ అనగానే అందరికీ అక్కడి కళలు, సాహిత్యం.. అంతకు మించి ఘుమఘుమలాడే చేపల పులుసు గుర్తుకువస్తాయి. అయితే ఇప్పుడు అదే చేప రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను పక్కనబెట్టి, ఓటర్ల కంచంలో ఉండే ‘చేప ముక్క’ చుట్టూ ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తోంది. బెంగాలీయుల ప్రాణప్రదమైన ఆహారపు అలవాట్లను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘ఫిష్ పాలిటిక్స్’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.చేపతో బీజేపీ ప్రచారం.. షాకైన ఓటర్లుబీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలం పార్టీ నేతలు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ ఏకంగా 5 కిలోల బరువున్న 'కట్ల' చేపను చేత్తో పట్టుకుని వీధుల్లో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మేము చేపలకు వ్యతిరేకం కాదు.. మా సంస్కృతిలో భాగం’ అంటూ ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ఫీట్ చేశానని ఆయన చెబుతున్నారు.దీదీ ఘాటు విమర్శలు: ‘మీ కంచంపై కన్నేస్తారు’ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ‘వారు మీ పళ్లెంలో చేపను ఉండనివ్వరు, గుడ్లను తాకనివ్వరు. చివరికి మీరు బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులని ముద్ర వేస్తారు’ అంటూ భావోద్వేగపూరిత విమర్శలు చేస్తున్నారు. బెంగాలీ అస్తిత్వాన్ని, ఆహారపు అలవాట్లను కాపాడుకోవాలంటే తృణమూల్కే ఓటు వేయాలని ఆమె గట్టిగా పిలుపునిస్తున్నారు.బీజేపీ కౌంటర్: ‘స్వామి వివేకానందుడే చెప్పారు’మమత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానందుడి బోధనలను గుర్తు చేస్తూ.. ఆహారపు అలవాట్లపై తాము ఎప్పుడూ ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే దీదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతిని తమ కంటే బాగా ఎవరూ గౌరవించలేరని ఆయన కౌంటర్ ఇచ్చారు.ఓటర్ల మనోగతం: ‘ఆహారాన్ని రాజకీయం చేయకండి’రాజకీయ నాయకుల వాదోపవాదాలు ఎలా ఉన్నా, సామాన్య ఓటర్లు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. ‘మా పళ్లెంలో చేపను దూరం చేసే ఎవరికైనా ఓటు వేయబోము’ అని కొందరు స్పష్టం చేస్తుండగా, మరికొందరు మహిళా ఓటర్లు అసలు సమస్యను తెరపైకి తెస్తున్నారు. చేపల ధరల కంటే, ఆ చేపను వండే గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటి గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.గణాంకాలు చెబుతున్న 'చేప' పవర్!బెంగాల్లో చేపల వినియోగం కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వ్యవస్థ. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బెంగాలీయులు ఏడాదికి 8.36 లక్షల టన్నుల చేపలను ఆరగిస్తున్నారు. తమ మొత్తం ఆహార ఖర్చులో 18.9 శాతం కేవలం చేపలు, మాంసం కోసమే ఖర్చు చేస్తారు. పెళ్లిళ్లలో కూడా చేపను కానుకగా ఇచ్చే ఈ రాష్ట్రంలో, చేప చుట్టూ తిరిగే రాజకీయం ఎన్నికల ఫలితాలను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి!ఇది కూడా చదవండి: కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ? -
సర్వం ‘సర్’మయం!
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.అస్తిత్వవాదం దిశగా... బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్ భట్టాచార్య, మొయిదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు. -
164 స్థానాల్లో డీఎంకే పోటీ
చెన్నై: తమిళనాట అధికార డీఎంకే పార్టీ వచ్చే నెలలో జరగబోయే శాసనసభ ఎన్ని కల్లో 164 స్థానాల నుంచి బరిలో దిగనుంది. తన సారథ్యంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్పీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎండీకే తది తర 11 పార్టీలకు డీఎంకే మొత్తంగా 70 సీట్లను కేటాయించింది. కూటమి పార్టీల్లో కాంగ్రెస్కు అత్యధికంగా 28 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని పార్టీ కార్యాల యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నిదానంగా చర్చలు జరపడంతో నష్టంకంటే లాభమే ఒనగూరింది. మిత్ర పక్షాలన్నింటినీ సంతృప్తిపరుస్తూ సీట్లు కేటాయించాం.ఎస్పీఏ కూటమిలో ఐక్యతకు ఇది నిదర్శనం. ఎన్నికల తర్వాత డీఎంకే 2.0 ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అభ్యర్థులంతా గెలుపు గుర్రాలే’’ అని అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదలచేస్తానని ఆయన వెల్లడించారు. వైకో సారథ్యంలోని ఎండీఎంకేలోని కొందరు అభ్యర్థులు సహా 11 మంది కూటమి పార్టీల అభ్యర్థులు ఈసారి డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతుండటం విశేషం. దీంతో డీఎంకే పరోక్షంగా 175 స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లయింది. సీట్ల సర్దుబాటు తర్వాత పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడె, శివకాశి, కరైకుడి సహా 28 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి నిలబడుతున్నారు. కూటమి న్యాయం పాటిస్తూ... దివంగత తమిళనటుడు కెప్టెన్ విజయ్కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి 10 సీట్లు కేటాయించారు.దాదాపు మంత్రులందరికీ మళ్లీ చాన్స్33 మంది కేబినెట్ మంత్రుల్లో ము గ్గురు మినహా మిగతా వారందరికీ సీఎం స్టాలిన్ మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకూ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది. ఈసారి వైద్యులు, ఇంజనీర్లు, పీహెచ్డీ పట్టాదారులు సహా 60 మందికిపైగా కొత్తవాళ్లను డీఎంకే రంగంలోకి దింపుతోంది. డీఎంకే పార్టీ తరఫున ఈసారి 18 మంది మహిళా నేతలూ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొలథూర్ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మరోసారి చెపాక్–త్రిప్లికేన్ నుంచి పోటీచేస్తున్నారు. -
అవినీతి, హింసకు చిరునామా!
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో పశ్చిమబెంగాల్ అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనకబాటుకు గురైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం ము స్లిం సంతుష్టీకరణ రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసనే నమ్ముకున్నారు. రాజకీ యంగా ఎదిగేందుకు, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అబద్ధాలు, హింసనే నమ్ముకు న్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లకు బెంగాల్ను ప్రధాన ద్వారంగా మార్చారు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ అక్రమాల న్నింటికీ బీజేపీ అడ్డుకట్ట వేసి తీరుతుందన్నారు.మమత సర్కారు తీరుపై పలు అభి యోగాలతో చార్జిషీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం కోల్కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మమత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని తూర్పారబట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ భద్రత కోసం జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. 15 ఏళ్లుగా రాష్ట్రంలో భయోత్పాతంతో కూడిన పాలన సాగింది. ఈ ఎన్నికలు ఆ భయోత్పాతానికి, విశ్వాసానికి నడుమ జరుగుతున్న పోరాటం. మమత సర్కారు అసమర్థ పాలన, అవినీతి, రాజకీయ హింస, సంతుష్టీకరణ రాజకీయాలు, అక్రమ చొరబాట్లతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ఫెన్సింగ్, ఓటర్ల జాబితా ప్రక్షాళన కూడా ప్రధాన ప్రచారాంశాలుగా ప్రజల్లోకి వెళ్తాం’’ అని ప్రకటించారు.దేశానికే ముప్పుగా చొరబాట్లుబంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ గుండా దేశంలోకి సాగుతున్న చొరబాట్లు జాతీయ భద్రతకే సవాలుగా పరిణమిస్తున్నాయని అమిత్ షా ఆందోళన వెలిబుచ్చారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం చొరబాట్లకు బెంగాల్ ఏకైక మార్గంగా మిగిలిందంటే మమత సంతుష్టీకరణ రాజకీయాలే అందుకు కారణం. వాటివల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ భద్రతే పెను ప్రమాదంలో పడింది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క బెంగాల్కు మాత్రమే గాక దేశమంతటికీ చాలా కీలకంగా మారాయి. ఒకరకంగా దేశ భద్రతే ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది’’ అని చెప్పారు.‘‘కేంద్రం ఎన్నిసార్లు కోరినా బంగ్లాదేశ్ సరిహద్దులను ఫెన్సింగ్తో బలోపేతం చేసేందుకు భూమి కేటాయించేందుకు మమత ససేమిరా అన్నారు. చొరబాటు దారులతో తృణమూల్ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకోవాలన్న దురాలోచనే ఇందుకు ఏకైక కారణం’’ అని అమిత్ షా ఆరోపించారు. ‘‘బెంగాల్ ప్రజలను ఒక్కటే అడగదలచుకున్నా. చొరబాటుదారులకు ఓటటుహక్కు ఇవ్వాలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రతి చొరబాటుదారు ఓటునూ తొలగించి తీరతాం. అంతేకాదు, వాళ్లలో ప్రతి ఒక్కరినీ దేశం నుంచే వెళ్లగొడతాం’’ అని స్పష్టం చేశారు.‘‘బెంగాల్లో మమత అరాచక పాలనకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మే 6న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత 45 రోజుల్లోనే సరిహద్దుల గుండా ఫెన్సింగ్కు అవసరమైన భూమిని కేంద్రానికి అప్పగిస్తాం. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబాట్లకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తాం’’ అని ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా అంగ (బిహార్), వంగ (బెంగాల్), కళింగ (ఒడిశా) ఒకే పార్టీ పాలనలోకి రానున్నాయని జోస్యం చెప్పారు.మైనారిటీ ఓట్ల కోసమే ‘సర్’ డ్రామాఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై మమత వ్యతిరేక తను అమిత్ షా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఈసీపై విమర్శలు చేయడం బెంగాలీ సంస్కృతిలో భాగం కానే కాదు. కేవలం మైనా రిటీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే మమత ఇలా రాద్ధాంతం చేశారు’’ అని ఆరో పించారు. దేశంలో విపక్షాల పాలనలో ఉన్న మరే రాష్ట్రంలోనూ సర్ ప్రక్రియపై వివాదాలు తలెత్తలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని అమిత్ షా సమర్థించారు. వారిలో పలువురు అచ్చం తృణమూల్ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఆ బదిలీల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు.బాధితురాలి కార్డు‘విక్టిమ్ కార్డు’ రాజకీయాలను మమత అలవాటుగా మార్చుకున్నారంటూ అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ప్రజల్లో సానుభూతి పొందేందుకు బాధితురాలి కార్డు ప్రయోగించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తనకు చిన్న గాయమైనా దానిపై విపరీతంగా ప్రచారం చేయించుకుంటారు. అవినీతి తదితర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నికల సంఘంపై ఇష్టానికి విమర్శలు చేస్తారు. వీటిని బెంగాల్ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మమత విక్టిమ్ కార్డు పాచిక ఇకపై పారబోదు’’ అని స్పష్టం చేశారు. -
భారత ఆర్మీ చేతికి ప్రహార్
గ్వాలియర్: రక్షణరంగ ప్రైవేట్ సంస్థ ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’తయారుచేసిన తేలికపాటి మెషీన్ గన్(ఎల్ఎంజీ) ‘ప్రహార్’తొలిసారిగా భారత సైన్యం చేతికొచ్చింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఈ గన్లను తయారుచేశారు. గ్వాలియర్లోని ఆయుధ కర్మాగారంలో తొలి దఫాలో తయారుచేసిన 2,000 మెషీన్ గన్లను ఆర్మీకి అందజేశారు. శనివారం గ్వాలియర్లో జరిగిన ఈ ఆయుధాల బదిలీ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయుధాల సమీకరణ విభాగ డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు, అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.7.62 ఎంఎం కాలిబర్(బుల్లెట్) సామర్థ్యంతో ఈ తేలికపాటి మెషీన్గన్లను తయారుచేశారు. దీని బ్యారెల్ పొడవు 508 మిల్లీమీటర్లు. బరువు 8 కేజీలు. గన్ మొత్తం పొడవు 1.1 మీటర్. ‘‘గరిష్టంగా ఒక కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గురిపెట్టి కాల్చవచ్చు. ఈ గన్ల తయారీకి బిడ్డింగ్, అమనుతులు, ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా మొత్తంగా ఆరేళ్ల ప్రయాణం పూర్తయింది. గడువు కన్నా 11 నెలల ముందుగానే తొలి బ్యాచ్ గన్లను తయారుచేసి ఇస్తున్నాం. మొత్తంగా 40,000 గన్లను షెడ్యూల్లోపు ఇచ్చేస్తాం’’అని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ చెప్పారు. -
ఐక్యతతో సవాళ్లు ఎదుర్కోవాలి
నోయిడా/లక్నో: అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలంతా అంకితభావం, ఐక్యతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పునరుద్ఘాటించారు. రైతన్నల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని జేవర్లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనకు 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ప్రయత్నం, ఐక్యత అవసరమని స్పష్టంచేశారు.సమయాన్ని ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం ద్వారా పౌరుల జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కిచెప్పారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. ఈ సంక్షోభాన్ని ప్రశాంతంగా, సహనంతో, ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో మనదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, అదే మన గొప్ప బలమని తేల్చిచెప్పారు. ప్రజలపై భారం పడకుండా చర్యలు ‘‘పశ్చిమాసియా పరిణామాలు, మన దేశంలో పరిస్థితులపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాం. ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలోనూ దీనిపై సానుకూలమైన సంప్రదింపులు జరిపాం. ఈ సంక్షోభ సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలకు దూరంగా ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి సమయంలో తప్పుడు ప్రచారం చేసినవారిని ఎన్నికల్లో జనం తిరస్కరించారని గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లను భారత్ పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటోంది. చమురు, గ్యాస్ ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది’’అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయ్యింది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. యూపీలోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది జనం పాల్గొన్నారు. వారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం పూర్తయ్యింది. అది ఎలా అంటే.. సభలో జనవాహినితో మోదీ సంభాíÙంచారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించగా, జనం అదే రీతిలో ప్రతిస్పందించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పూర్తయ్యిందా? అని మోదీ ప్రశ్నించగా, అవునంటూ బదులిచ్చారు.‘‘లేదు.. సగం మాత్రమే పూర్తయ్యింది. నేను ఇక్కడ శిలాఫలకం మాత్రమే ఆవిష్కరించా. మిగతా కార్యక్రమం మీరే పూర్తిచేయాలి. మీ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్ వెలిగించండి. అలా చేస్తే మీలో ప్రతి ఒక్కరూ ఎయిర్పోర్టును స్వయంగా ప్రారంభించినట్లే’’అని ప్రధానమంత్రి సూచించగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్ ఆన్ చేశారు. మోదీ చిరునవ్వు చిందిస్తూ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఇప్పుడు పూర్తయ్యిందని ప్రకటించారు. -
పైప్డ్ గ్యాస్.. దీనిపైనే ఫోకస్
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన అంతరాయాలు.. దిగుమతి చేసుకునే గ్యాస్పై ఆధారపడిన భారత్ను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నుండి అందుబాటులో ఉన్న చోట పైప్డ్ నేచురల్ గ్యాస్కు (పీఎన్జీ) మారాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గృహ వంట గ్యాస్ వినియోగంలో నిర్మాణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉన్న గృహాల వారు మూడు నెలల్లో పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ సరఫరాను నిలిపివేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మళ్లేలా ప్రోత్సహించేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు రెంటల్ స్కీమ్, ఈఎంఐ సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. –సాక్షి, స్పెషల్ డెస్క్దిగుమతులపై ఆధారపడకుండా.. పీఎన్జీ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా కొరతగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పైప్లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించి ఇంధన భద్రతను పెంపొందించాలన్నది ఆలోచన. ప్రస్తుతం పైప్లైన్లు వేసే కంపెనీలు వివిధ అనుమతులు, అధిక ఫీజులు, స్థల సేకరణ సమస్యలు, హౌసింగ్ సొసైటీల నుండి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్రానికి ఒకటి కాకుండా దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఒక చట్టబద్ధమైన కేంద్ర వ్యవస్థ ఏర్పాటు కానుంది.దేశవ్యాప్తంగా 784 జిల్లాల్లో.. గత డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 1.62 కోట్ల మంది పీఎన్జీ కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల మంది వినియోగదార్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్నారు. మన దేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రస్తుతం 784 జిల్లాలకు విస్తరించింది. ఇవి ప్రతి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ వంటి 307 భౌగోళిక ప్రాంతాలుగా (జియోగ్రాఫికల్ ఏరియా) ఈ నెట్వర్క్ పైపుల ద్వారా సహజ వాయువును గృహ వినియోగదార్లకు అందిస్తోంది. రూ.500 కడితే చాలు.. గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ కావాలంటే వన్ టైమ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీని బట్టి ఇది రూ.9 వేల వరకు ఉంది. భవనంలోని కనెక్షన్ల సంఖ్య పెరిగితే ఈ మొత్తం తగ్గుతుంది. కొన్ని కంపెనీలు కనెక్షన్ను వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తున్నాయి. రెండు నెలలకు (బిల్ సైకిల్) రూ.500 కడితే చాలు. తాత్కాలిక కనెక్షన్ కావాల్సినవారు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర ఒక యూనిట్కు (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.51గా ఉంది. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రెండు నెలలకు సగటున 24 యూనిట్లు ఖర్చు అవుతుందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అవసరాల్లో సగం దేశీయంగానే ఉత్పత్తి » దేశ గ్యాస్ అవసరాల్లో సగ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. » దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో కృష్ణా–గోదావరి బేసిన్ వాటా 25%, అస్సాం, త్రిపుర బేసిన్ల వాటా 13%గా ఉంది. మిగిలింది ముంబై, రాజస్తాన్, కాంబే బేసిన్ (గుజరాత్) ఉత్పత్తి చేస్తున్నాయి. » 2024–25లో భారత్ 35,594 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. అదే సమయంలో 35,720 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకుంది. » భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్జీలో ఖతార్, యూఏఈ వాటా 50% పైమాటే. » మధ్యప్రాచ్యం మీద ఆధారపడడం తగ్గించి యూఎస్, ఆ్రస్టేలియా, రష్యా, మొజాంబిక్ నుంచి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ కొనుగోళ్ల డీల్స్కు భారత్ శ్రీకారం చుట్టింది. పీఎన్జీ ఎందుకు ?ఇంధన భద్రత, స్థిరత్వం: కేవలం ఓడల ద్వారా హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల గుండా వచ్చే ఎల్పీజీపై ఆధారపడటం వల్ల అక్కడ ఏదైనా అంతరాయం కలిగితే లక్షలాది మందికి వంట గ్యాస్ అందకుండా పోతుంది. దీనికి భిన్నంగా స్వదేశీ గ్యాస్ నిల్వలు, వివిధ దిగుమతి కేంద్రాలు, ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే పైప్లైన్ నెట్వర్క్ చాలా సురక్షితమైనది, నమ్మదగినది. తక్కువ ఖర్చు: సిలిండర్లు, లారీలు, బాట్లింగ్ ప్లాంట్లు, డీలర్ల ఖర్చులు అన్నీ కలిసి ఎల్పీజీ ధర నిర్ణయం అవుతుంది. పైప్లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ఇంటికి చేరడం వల్ల ఈ అదనపు ఖర్చులు తగ్గుతాయి. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ వ్యయం 20–30% తక్కువ అని కంపెనీలు చెబుతున్నాయి. సౌకర్యం, భద్రత: వంట మధ్యలో గ్యాస్ అయిపోతుందనే భయం ఉండదు. ప్రమాద భయం లేదు. ఇందులోని మీథేన్ గాలి కంటే తేలిక. సులభంగా గాలిలో కలిసిపోతుంది. స్వచ్ఛమైన ఇంధనం కూడా. రాయితీ భారాన్ని తగ్గించడం: ప్రభుత్వం ఉజ్వల పథకం కింద కోట్లాది కుటుంబాలకు ఎల్పీజీపై సబ్సిడీ ఇస్తోంది. ప్రజలను పీఎన్జీకి మార్చడం ద్వారా ప్రభుత్వంపై పడే ఈ ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)అతిగా చల్లబర్చిన సహజ వాయువు. దీనిని సుమారు మైనస్ 162 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుస్తారు. తద్వారా దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ట్యాంకర్లలో నింపి సముద్రాల గుండా రవాణా చేయడం సులభం అవుతుంది. ఇది గమ్యస్థానానికి చేరుకున్నాక తిరిగి వేడి చేసి వాయువుగా మార్చి పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పీఎన్జీ సేవలు అందిస్తున్న కంపెనీలు.. తెలంగాణ: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, టోరెంట్ గ్యాస్, మహారాష్ట్ర నేచురల్ గ్యాస్. ఆంధ్రప్రదేశ్: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, థింక్ గ్యాస్. -
20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్ వాసిని మహారాష్ట్రలోని నాగ్పూర్లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్ మండల్ అనే విద్యార్థి 2005 అక్టోబర్లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్ వద్ద శ్యామ్ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అండమాన్ నికోబార్కు చెందిన దుర్గా బహదూర్ భట్ ఛత్రి, మహ్మద్ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సూరజ్ భట్ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్ భట్ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. -
సినీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2023లో సవరించిన సినిమాటోగ్రాఫ్ చట్టం ద్వారా పైరసీ నిరోధానికి బలమైన న్యాయ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ వెల్లడించారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ ప్రకారం సినిమాలను అనుమతి లేకుండా రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం నిషేధించబడిందన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాల జైలు, సినిమా మొత్తం ఖర్చులో 5 శాతం వరకు జరిమానా విధించేలా అవకాశం ఉందన్నారు. ఇక పైరసీ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. టెలిగ్రామ్ యాప్లో అనధికారికంగా కంటెంట్ ప్రసారం చేస్తున్న 3,142 చానళ్లను తొలగించాలని 2026 మార్చి 11న నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. అలాగే సుమారు 800 పైరసీ వెబ్సైట్లను ఇంటర్నెట్ సేవా దాతల ద్వారా బ్లాక్ చేయించినట్లు చెప్పారు. పైరసీ ఫిర్యాదులను స్వీకరించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోడల్ అధికారులను నియమించిందన్నారు. ఇంటర్నెట్లో చట్టవిరుద్ధ కంటెంట్ను తొలగించేందుకు సమాచార సాంకేతిక చట్టం–2000 కింద కూడా నిబంధనలు అమల్లో ఉన్నాయన్నారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సహా అన్ని మధ్యవర్తి సంస్థలు కాపీరైట్ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈచర్యల ద్వారా సినీ, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ పైరసీని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు డా. ఎల్. మురుగన్ సమాధానమిచ్చారు. -
అస్సాంలో పేలుళ్లు.. ఇద్దరు మృతి
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోర్హాట్ జిల్లాలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జోర్హాట్ పట్టణంలోని రాజా మైదాన్ ప్రాంతంలో. పాత ఇనుము సామాగ్రిని ఒక వ్యక్తి తన ఇంటివద్ద సుత్తితో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నూర్ మహమ్మద్ (45), మహమ్మద్ ఇక్బాల్ (8) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. షెహనాజ్ బేగం (12), నూర్జహాన్ బేగంలకు తీవ్రగాయాలయ్యాయి.పేలుడు దాటికి పెద్దఎత్తున శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటీన అక్కడ గూమిగూడారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు అని భావించినప్పటికీ తదుపరి విచారణలో అది గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని తేలింది. అయితే పేలుడు ఎలా సంభవించిందనే అంశం విచారణ చేపడుతున్నారు. కాగా ఈ ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో అక్కడ పేలుడు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. -
క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో ?
ఐపీఎల్ 2026 (IPL-2026) సీజన్ ప్రారంభమైంది. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్తో మొదలుకానుంది. మార్చి 28 నుండి మే 31 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. మొత్తం మొత్తం 84 మ్యాచ్లతో 10 జట్ల తలపడతాయి. ఈ సీజన్ ఫైనల్ బెంగళూరులో జరగనుంది.అయితే ఐపీఎల్ జట్లలో ప్రదానమైంది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ఆర్సీబీ జట్టు కో-ఓనర్ నీతా అంబానీకి సంబంధించి ఒక ఆసక్తికర సంగతి నెట్టింట వైరల్గా మారింది.నీతా అంబానీ ముద్ర స్పెషల్ ముఖ్యమైన కార్యక్రమాలకు,మరీ ముఖ్యంగా ఐపీఎల్ స్పెషల్ ఈవెంట్లకు ముందు నీతా అంబానీ సూక్ష్మ హస్త ముద్రలు వేయడం విశేషంగా నిలుస్తోంది. ఇది అంగ న్యాసను ప్రతిబింబిస్తుందని విశ్వాసం. మనస్సును కేంద్రీకరించి, అంతర్గత శక్తిని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన ప్రాచీన వేద పద్ధతి అని పండితుల మాట. 60 సెకన్ల పాటు ఇలా చేస్తే మనసుకు ప్రశాంతత, శక్తిని లభిస్తుందట. క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో? View this post on Instagram A post shared by Vastro Vibe (@vastrovibe)ఎలా చేయాలి?ప్రశాంతంగా కూర్చోండి (వీలైతే తూర్పు వైపు ముఖం పెట్టి) మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత పూర్తి ఏకాగ్రతతతో “ఓం నమః శివాయ” లేదా మీ ఇష్ట దేవతా మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత శరీర భాగాను సున్నితంగా స్పృశించాలి.శిరస్సు – స్పష్టతకళ్ళు – ఏకాగ్రతహృదయం – భావోద్వేగాల సమతుల్యతనాభి – అంతర్గత శక్తిని ఉత్తేజంపాదాలు – భూమిపై నిలదొక్కుకున్న అనుభూతిచివరగా ఒక క్షణం మౌనం పాటించి, శ్వాసమీద ధ్యాసపెట్టి ఆలోచనలను ఆలోచనలను గమనించాలి ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. -
రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర ప్రదేశ్కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్టు తెలుస్తోంది. తద్వారాఉత్తరప్రదేశ్ రైతుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయని పలు నివేదిల సమాచారం'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఒక రైతుకు దాదాపు రూ.15 కోట్ల పరిహారం అందింది. ఈ భారీ సొమ్ముతో ఆయన ఏకంగా ఒక హెలికాప్టర్ను కొనుగోలు చేయడమే కాకుండా, విహారయాత్ర కోసం థాయ్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖచిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా నెరవేరుతున్నాయి ఈ కథనం పేర్కొంది. ఉదాహరణకు ఈ క్రింది వివరాలు చూద్దాం.శివమ్ ప్రజాపతి : బన్వారీ బాస్ గ్రామానికి చెందిన ఈ యువకుడు శివమ్ ప్రజాపతి (26) ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మరియు సోలార్ ప్లాంట్కు లేబర్ను సరఫరా చేసే సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. పెరిగిన ఆదాయంతో తన స్నేహితులతో కలిసి థాయ్లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తనకు ఇది ఊహకందని విషయం అని ఆయన చెబుతున్నారు.అజయ్ బేనివాల్: కిశోర్పూర్ గ్రామానికి చెందిన అజయ్ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు ఇప్పుడు విమానాశ్రయ పనులకు వచ్చే కూలీలు తమ హెల్మెట్లు, తాళాలు భద్రపరుచుకునే చిన్న సర్వీస్ సెంటర్ను నడుపుతూ నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు.(ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి)56 ఏళ్ల నానక్ చంద్ : వలస కూలీలకు అద్దెకు ఇవ్వడం కోసం తన ఇంట్లో ఆరు అదనపు గదులను నిర్మించాడు. ఒకప్పుడు మంచి ఆదాయం వచ్చినా, ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో కూలీల సంఖ్య తగ్గి గదులు ఖాళీగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో చర్చఅయితే దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ నాయకులకు, బడాబాబులకు హెలికాప్టర్ ఒక స్టేటస్ సింబల్. కానీ రైతు కూడా అదే అనుభవించాలని అనుకుంటున్నాడా అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ముల్షీ ప్రాంత విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఇలాగే పరిహారం వచ్చిన వారు విలాసవంత మైన కార్లు కొని, ఆ తరువాత కొన్నేళ్లకే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పరిహారం సొమ్మును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని మరో యూజర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు -
బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ ఛార్జ్షీట్
కోల్కతా: బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. టీఎంసీ ప్రభుత్వ పదిహేనేళ్ల పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. చొరబాటు దారులకు బెంగాల్ అడ్డాగా ఉందని.. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అమిత్ షా.. మమత పాలనలో అరాచకం రాజ్యమేలుతోందంటూ దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే(బెంగాల్) పరిమితం కాదని.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని.. అందుకే అత్యంత కీలకమంటూ వ్యాఖ్యానించారు.గత 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ చొరబాట్లకు, బుజ్జగింపు రాజకీయాలకు, సరిహద్దు అభద్రతకు ప్రధాన కారిడార్గా మారిందని షా ఆరోపించారు. కేంద్రం పదేపదే కోరినప్పటికీ, సరిహద్దు కంచె ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని అంటూ ఆయన విమర్శించారు. చొరబాటుదారులతో ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యమంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలను భయం- విశ్వాసం మధ్య జరుగుతున్న పోరాటంగా అమిత్ షా అభివర్ణించారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అబద్ధాలు, హింస, అవినీతి రాజకీయాలను పెంచి పోషించారు. ఈసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే పరివర్తన్ ర్యాలీల పేరిట ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ.. మమత సర్కారు వైఫల్యాలపై బహిరంగ సభలు, చిన్న స్థాయి భేటీల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఛార్జ్షీట్ పేరుతో ప్రజలను మరింతగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి–కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, శాంతిభద్రతల పతనం, మహిళలపై నేరాలు– భద్రతా లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల క్షీణత, రైతు సమస్యలు, తేయాకు తోట కార్మికుల దుస్థితి, కోల్కతా నగర పరిస్థితి, ‘సిండికేట్ రాజ్’వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్లను నిర్మించారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు. -
మహారాష్ట్ర లాక్డౌన్?.. సీఎం ఫడ్నవీస్ కీలక ప్రకటన
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో జనం పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతుండటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.వదంతులు వ్యాపింపజేస్తే జైలుకే..లాక్డౌన్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కనీసం వాట్సాప్లో వచ్చే మెసేజ్లను ఫార్వార్డ్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తాం’ అని ఫడ్నవీస్ తీవ్రంగా హెచ్చరించారు. ముంబై సహా థానే, పాల్ఘర్, రాయగడ జిల్లాల్లో పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ కేంద్రాల వద్ద జనం ఎగబడుతుండటంతో గందరగోళం మొదలైంది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళనతో బంకుల వద్దకు పరుగులు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.నిందితుడు అరెస్ట్లాక్డౌన్ రాబోతున్నదంటూ ఫేక్ వీడియో సృష్టించి, వైరల్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఉద్రిక్తతలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారత్లో లాక్డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ పరిస్థితులను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అసత్య వార్తలను నమ్మవద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
బావమరిదిని చంపి డిక్కీలో వేసుకుని పోలీసుల వద్దకు..
బెంగళూరు: బంధువుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసిన ఘటన బెంగళూరు శివారులోని ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో వరుసకు బావమరిది అయిన యువకుడికి ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాలు.. బన్నేరుఘట్ట సమీపంలోని బైరప్పనహళ్లి నివాసి శ్రీనివాస్ నిందితుడు. మరసూరు వాసి, తన సొంత బావమరిది రంజిత్(24)ను హత్య చేశాడు. శ్రీనివాస్కు రంజిత్ సొంత సోదరి పవిత్రతో వివాహం జరిగింది. దీంతో రంజిత్, నిందితుడైన శ్రీనివాస్కు సొంత బావమరిది అయ్యాడు. నిందితుడైన శ్రీనివాస్ సోదరి కోమలతో రంజిత్కు అక్రమ సంబంధం ఉందని చెబుతున్నారు. కోమలికి అప్పటికే వేరొకరితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమె తన భర్తను విడిచిపెట్టి రంజిత్తో పారిపోయింది. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైంది. పరువు తీశాడనే కోపంతో.. తన కుటుంబ పరువును పది మందిలో వేలం వేస్తున్నాడనే కోపంతో శ్రీనివాస్ చాలాసార్లు రంజిత్ను హెచ్చరించాడు. కానీ అతను వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూశాడు. సినీ ఫక్కీలో హత్య చేయడానికి పథకం వేసిన శ్రీనివాస్ గురువారం సాయంత్రం మాట్లాడదామనే నెపంతో రంజిత్ను తన కారులోకి ఎక్కించుకున్నాడు. బన్నేరుఘట్టలోని బిల్వరదహళ్లిలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత రక్తసిక్తమైన ఆ మృతదేహాన్ని తన కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ అతను పోలీసుల ఎదుట తాను చేసిన హత్యను ఒప్పుకుని లొంగిపోయాడు. మొదట శ్రీనివాస్ మృతదేహాన్ని ఎక్కడో ఒకచోట పడేసి పారిపోవాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ తర్వాత భయపడి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న బన్నేరుఘట్ట పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. -
పుదుచ్చేరి రాజకీయాల్లో ‘లాటరీ కింగ్’ వారసుడు
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా తెర వెనుక ఉండి ఎన్నికల వ్యూహాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగింది. మార్టిన్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన మార్టిన్ స్థానిక నాయకత్వంతో విభేదాల కారణంగా ఆ పార్టీకి స్వస్తి పలికారు. అనంతరం తన సేవా సంస్థ ‘జేసీఎం మక్కల్ మండ్రం’ను రాజకీయ పార్టీగా మార్చి 2025లో ‘లక్ష్య జననాయక కచ్చి’ (ఎల్జేకే)ని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగానే ఉంది. కూటమి ఒప్పందంలో భాగంగా ఎల్జేకేకు కేటాయించిన రెండు స్థానాల్లో మార్టిన్ కామరాజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లింతోపు నియోజకవర్గంలో కూడా ఆయన నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల సంఘం కామరాజ్ నగర్ నామినేషన్ను ఆమోదించింది.భారీ ఆస్తుల ప్రకటనఎన్నికల అఫిడవిట్లో మార్టిన్ సమర్పించిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రూ.597 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులతో ఆయన ఈ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు.మొత్తం ఆస్తులు: రూ.597 కోట్లుస్థిరాస్తులు (భూమి, భవనాలు): రూ.450 కోట్లునగలు: రూ.72 కోట్లువాచీలు: రూ.32 కోట్లువాహనాలు: రూ.2 కోట్లుఅప్పులు: రూ.210 కోట్లుచార్లెస్ మార్టిన్కు తన తండ్రి స్థాపించిన ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్’ సంస్థలో 4.5 శాతం వాటా ఉంది. గతంలో ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా విరాళాలు ఇచ్చిన సంస్థగా ఇది వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.కుటుంబ రాజకీయాలుమార్టిన్ కుటుంబం కేవలం పుదుచ్చేరికే పరిమితం కాలేదు. ఆయన తల్లి లీమా రోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే టికెట్పై పోటీ చేస్తుండగా ఆయన బావ ఆధవ్ అర్జున ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉండటం విశేషం. -
ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
బెంగళూరు: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. స్టోరీ ఏంటంటేఅసలేం జరిగింది?కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర తాలూకాలోని ప్రముఖ బెట్టద భైరవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈ ప్రాంతం ప్రీ-వెడ్డింగ్ షూట్లకు చాలా ప్రసిద్ధి.ఇక్కడ ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లతో కలిసి ఈ ఆలయానికి వచ్చింది. షూటింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు పాదరక్షలు (షూలు) ధరించి ఆలయ పరిధిలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ చెలరేగింది.మాట మాట పెరిగి అది భౌతిక దాడికి దారితీసింది. స్థానికులు ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడమే కాకుండా, వారి కెమెరాను కూడా పగులగొట్టారు.ఈ దాడిలో నవీ, నందన్ అనే ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సకలేశపుర తాలూకా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న సకలేశపుర రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముదిగెరె తాలూకాకు చెందిన ఏడుగురిని (ఆశి, ప్రశాంత్, రక్షా, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!నోట్: ఆధ్యాత్మిక, పర్యాకట ప్రదేశాల్లోఇలాంటి షూట్లు చేసేటప్పుడు స్థానిక పద్దతులను నియమాలను పాటించడం అవసరం. స్థానికుల మనోభావాలకు భంగం కలగకుండా సున్నితత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. (షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ) -
ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: విశాఖపట్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో కలకలం చెలరేగింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో రన్వే వద్ద కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పైలట్లు, అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.అసలేం జరిగింది?విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్లు ఏటీసీ (ఐటీసీ)ని కోరారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:53 గంటలకు అగ్నిమాపక విభాగానికి అత్యవసర సందేశం అందింది. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అగ్నిమాపక దళాలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది.కాగా విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక విభాగం, ఎయిర్పోర్టు అత్యవసర బృందాలు నిమిషాల వ్యవధిలో స్పందించి ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షించాయి. విమానానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని, కేవలం ముందుజాగ్రత్త చర్యగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
యువత భవితకు కొత్త రెక్కలు: ప్రధాని మోదీ
జేవార్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్) శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్.. దేశ విమానయాన రంగంలో సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైందని, ‘వికసిత యూపీ, వికసిత భారత్' లక్ష్యంలో భాగంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం యువత భవిష్యత్తుకు కొత్త రెక్కలు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, నేడు ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా యూపీ అవతరించడం గర్వకారణమని పేర్కొన్నారు.తనను ప్రతినిధిగా ఎన్నుకున్న ఈ రాష్ట్రం ఇకపై ఈ భారీ విమానాశ్రయంతో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, గత 11-12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో 'నవ భారత్' అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని కొనియాడారు. 2002 నుండి 2017 వరకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల అసమర్థత వల్ల రాష్ట్రం అభివృద్ధిలో స్తబ్ధతను ఎదుర్కొందని, అయితే గత తొమ్మిదేళ్లుగా 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యల వల్ల ఉత్తరప్రదేశ్ నేడు అంతర్జాతీయ ఏవియేషన్ మ్యాప్లో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుందని అన్నారు. #WATCH | Greater Noida, UP: PM Modi arrives at Noida International Airport in Jewar today ahead of the inauguration of Phase 1. UP CM Yogi Adityanath is also present with him.(Source: DD) pic.twitter.com/YSmOkhUnQE— ANI (@ANI) March 28, 2026ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏర్పడుతున్న విపరీతమైన రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో (ఎఫ్డీఐ)జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ దీనిని నిర్మించింది. నోయిడా, మీరట్, ఘజియాబాద్, మథుర, ఆగ్రా తదితరప్రధాన నగరాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇది ముఖద్వారంగా నిలవనుంది. #WATCH | Jewar: Uttar Pradesh Deputy Chief Minister Keshav Prasad Maurya says, "From the perspective of both the country and Uttar Pradesh, the inauguration of Jewar Airport by PM Modi today is a historic day of pride. I congratulate all the citizens of the state and the entire… https://t.co/An8DvDNC6h pic.twitter.com/FW4GexL5t0— ANI (@ANI) March 28, 2026కట్టుదిట్టమైన భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలుప్రధాని పర్యటన నేపథ్యంలో జేవార్లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులు, ఎస్పీజీ, ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. మరోవైపు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యమునా ఎక్స్ప్రెస్వే, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే మీదుగా వెళ్లే భారీ వాహనాలను మళ్లించారు. అయితే, అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
మోహన్ లాల్ కేసు: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
న్యూఢిల్లీ: మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ నటుడు మోహన్ లాల్ వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆయన పేరు, గొంతు, రూపం లేదా ఇతర గుర్తింపు చిహ్నాలను అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మోహన్ లాల్ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా ఆన్లైన్లో ఉన్న కంటెంట్ను వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మోహన్ లాల్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలను, కంటెంట్ను అప్లోడ్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన ‘బేసిక్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్’ (బీఎస్ఐ) వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని డిజిటల్ ప్లాట్ఫారమ్లను కోర్టు ఆదేశించింది. అలాగే ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని అన్ని పక్షాలకు సూచించింది.ముఖ్యంగా ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా మోహన్ లాల్ చిత్రంతో కూడిన వస్తువులను విక్రయించడంపై జస్టిస్ జ్యోతి సింగ్ ఘాటుగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సదరు ప్లాట్ఫారమ్ ప్రతినిధులు.. ఇప్పటికే ఆ వస్తువులను వెబ్సైట్ నుండి తొలగించినట్లు తెలిపారు. పద్మభూషణ్ తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న మోహన్ లాల్.. తన పేరును వాణిజ్య ప్రకటనల్లో లేదా ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్లో దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదివరకే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా వంటి సినీ దిగ్గజాలు కూడా ఇదే తరహాలో తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ? -
కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలుకేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ ఆశలన్నీ గాంధీ కుటుంబంపైనే..కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.రేసులో ఇతర పార్టీలుఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించనున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , బహుజన్ సమాజ్ పార్టీలు కూడా తమ అగ్రనేతల పేర్లను ఎన్నికల సంఘానికి అందజేశాయి. మొత్తానికి జాతీయ స్థాయి నేతల రాకతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ల హవా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ! -
అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ‘దళపతి’ పూర్తి స్థాయిలో విజయ్ సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 29వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థులను విజయ్ స్వయంగా పరిచయం చేయనున్నారు.తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లోతుగా కసరత్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం (మార్చి 29) చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ వేదిక నుంచే విజయ్ అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.ఎన్నికల బరిలో 264 స్థానాలుతమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుదుచ్చేరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, తమిళనాడు అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.ఏప్రిల్లో పోలింగ్ సందడిఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్వల్ప సమయంలోనే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం టీవీకే ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార పంథాను స్పష్టం చేయనుంది.నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, విజయ్ తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళపతి అభిమానులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది కాబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ! -
West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు నేతలందరి దృష్టి ఆ 57 నియోజకవర్గాలపైనే నిలిచింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ, ఈ సీట్ల ఫలితాలను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ, నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా..రాష్ట్ర అధికార పీఠాన్ని నిర్ణయించడంలో కేవలం 8,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఈ 57 సీట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్వల్ప ఓట్ల తేడా అటు ఇటు అయితే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గత 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ 57 స్థానాల్లో గెలుపోటములు వెంట్రుక వాసిలో జరిగాయి. వీటిలో సగటున 8,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గట్టెక్కారు. మరీ ముఖ్యంగా, 19 నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ 3,000 ఓట్ల లోపే ఉండటం గమనార్హం. ఈ 57 కీలక స్థానాల్లో గతంలో టీఎంసీ 29 సీట్లు గెలవగా, బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెండు పార్టీల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న 19 సీట్లలో బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా, టీఎంసీ 7 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, 2026లో ఈ 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా అది ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే అసలైన కురుక్షేత్రంఈ ఉత్కంఠభరిత నియోజకవర్గాల్లో అత్యధికంగా 47 సీట్లు దక్షిణ బెంగాల్లోనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే ఇటువంటి స్వల్ప మెజారిటీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన పుర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, పురూలియా, పశ్చిమ బర్థమాన్ జిల్లాలు ఈసారి ప్రధాన యుద్ధభూమిగా మారనున్నాయి. బంకురా, పశ్చిమ బర్థమాన్ జిల్లాల్లో ఇటువంటి సీట్లు ఆరేసి చొప్పున ఉండగా.. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు చొప్పున ఉన్నాయి.గత ఎన్నికల్లో షాకింగ్ మెజారిటీలునందిగ్రామ్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేవలం 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.కుల్తీ: ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 679 ఓట్లతో గట్టెక్కారు.దంతాన్: టీఎంసీ కేవలం 623 ఓట్లతో ఇక్కడ విజయాన్ని అందుకుంది.ఘటల్: బీజేపీ కేవలం 966 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది.దిన్హాటా: కూచ్ బెహార్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ కేవలం 57 ఓట్ల తేడాతో గెలవడం ఒక సంచలనం. అయితే ఆయన రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 1.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలవడం గమనార్హం.మారిన రాజకీయ సమీకరణలు2026 సమరంలో పాత లెక్కలు చెల్లుతాయని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసారి పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉండగా, సీపీఐ(ఎం) - ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి. వీరికి తోడుగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్కు చెందిన ఏజేయూపీ కూటమి ముస్లిం ఓట్ల సమీకరణలను మార్చే అవకాశం ఉంది. ఓట్లు ఇలా చీలిపోవడం వల్ల స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువైపు తిరుగుతాయోనన్న టెన్షన్ పార్టీల్లో నెలకొంది.పార్టీల ధీమా.. పరస్పర విమర్శలుబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల జాబితా సవరణ తమకు కలిసి వస్తుందని, తాము 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి అరూర్ చక్రవర్తి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా కొన్ని వర్గాల ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారని, స్వల్ప మెజారిటీ సీట్లలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీకి, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య 2026 ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి -
మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి
లడఖ్: లడఖ్లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విరిగిపడిన భారీ మంచు పెళ్లలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కింద 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.నిముషాల్లోనే మారిన దృశ్యంద్రాస్ పరిధిలోని ‘క్యాప్టెన్-టర్న్’ వద్ద మధ్యాహ్నం సమయంలో భారీ హిమపాతం కురిసింది. రహదారిపై వాహనాలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగిపడటంతో, ప్రయాణికులు అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మంచు కింద మరికొన్ని వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Heard the unfortunate news of an avalanche at Zoji La. I have directed the DC & SSP of Kargil to visit the spot immediately and mobilise relief and rescue operations. All government agencies including disaster relief forces and BRO have been put on high alert. I am personally…— LG Ladakh (@lg_ladakh) March 27, 2026యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలుప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ఆర్డీఎఫ్)బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)బృందాలు రంగంలోకి దిగాయి. మేఘా టన్నెల్ సిబ్బంది సహకారంతో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సోనామార్గ్- ద్రాస్.. ఇలా రెండు వైపుల నుండి మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీర్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం.ఇది కూడా చదవండి: Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు! -
తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.నీమమ్తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్కు చెందిన కె.శివన్కుట్టిపై బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.శబరీనందన్ పోటీలో ఉన్నారు.కళక్కొట్టం బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్రన్ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.వట్టియుర్కవుఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్నే యూడీఎఫ్ ఈసారీ పోటీకి పెట్టింది.మంజేశ్వరంబీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.పాల చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) చైర్మన్జోస్ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి.కప్పన్తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.నట్టికగత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్ ఈసారి బీజేపీ టికెట్పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది. మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.అరన్ములపత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్ వర్కుకి టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.త్రిసూర్గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్ నాయ కుడు వేణుగోపాల్కు టికెట్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు.పాలక్కాడ్ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్ కావాలనే హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్కు టికెటిచి్చందని సతీశన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్’ఇ.శ్రీధరన్కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్ పిశరోడికి టికెట్ ఇచ్చింది. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్కు 30 రోజుల గ్రేస్ పీరియడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్సును గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్ విశ్వాస్(అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్)బిల్లు–2026ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 23 శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించిన 784 నిబంధనల సవరణ ప్రతిపాదనలున్నాయి. ఇందులో మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనల సడలింపు, చట్టపరమైన సందిగ్ధతను తొలగించేందుకు ఉద్దేశించిన 20 సవరణలున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే, పునరుద్ధరించిన తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చేయడం వంటివి ఉన్నాయన్నారు. అదేవిధంగా, డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిన 30 రోజుల వరకు అమలయ్యేందుకు వీలు కల్పించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 రోజులకు పెంచాలని, బీమా సర్టిఫికెట్ బదిలీపై సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇచ్చే గడువును కూడా 30 రోజులకు పెంచాలని ప్రతిపాదించామన్నారు. హిట్–అండ్–రన్ కేసుల్లో పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుంటుందని తెలిపారు. -
‘టీమ్ ఇండియా’గా పనిచేద్దాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాలు, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార భద్రతను విఘాతం కలగకుండా చూడడానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమలు, సప్లై చైన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయన శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించారు.రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మనమంతా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సవాల్ను మనం కచ్చితంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న అనుభవం మనకు ఉందన్నారు. తాజా సంక్షోభం పట్ల మన ప్రతిస్పందన వేగంగా ఉండాలంటే సమాచారం పంచుకోవాలని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు సైతం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సప్లై చైన్లు సజావుగా పనిచేసేలా చూడాలని, సరుకుల అక్రమ నిల్వలు, రవాణా, అక్రమార్జనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనం, సరుకుల సరఫరాలో అంతరాయాలను నివారించడానికి పరిపాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాల సరఫరా పట్ల ఆందోళన తలెత్తకుండా ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎరువులపై ముందస్తు ప్రణాళిక అవసరం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రైతాంగానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కు ముందు ఎరువుల నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. ప్రజల్లో భయాందోళనకు తావులేకుండా వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు.తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు. అలాగే నౌక రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించి తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు.సహకారం, సమన్వయమే మన బలమని ఉద్ఘాటించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూకశీ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు. -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలాదేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, రిటైల్ ధరల పెరుగుదలను అరికట్టినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడంతో వినియోగదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.13 ఉండగా.. తాజాగా రూ.10 తగ్గించడంతో అది రూ.3కు చేరుకుంది. డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.10 ఉంది. తగ్గింపు తర్వాత సున్నాకు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రిటైల్ ధరలు యథాతథం ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్పై లీటర్కు రూ.24, డీజిల్పై లీటర్కు రూ.30 చొప్పున నష్టం వస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గడంతో ఆయిల్ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు.పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత రిఫైనరీలకు వచ్చిన లాభాల నేపథ్యంలో 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి, 2024 డిసెంబర్లో ఉపసంహరించుకున్న ఎక్స్పోర్టు పన్నును ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్పై లీటర్కు రూ 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)పై లీటర్కు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని(విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. అయితే, ఈసారి ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ఎలాంటి విండ్ఫాల్ పన్ను విధించలేదు. ఎన్నికల కోసమే ఈ స్టంట్: కాంగ్రెస్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రిటైల్ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్ 30 దాకా వెయిట్ చేయండి’అంటూ జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ తర్వాత రిటైల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేలి్చచెప్పారు. -
బాలరామునికి ‘సూర్యతిలకం’
అయోధ్య: శ్రీరామ నవమి సందర్భంగా దేశం నలుమూలల నుంచీ పోటెత్తిన భక్తులతో అయోధ్య జనసంద్రమైంది. శుక్రవారం ఏకంగా 10 లక్షల మంది బాలరామున్ని దర్శించుకున్నారు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్త వేళ బాలరాముడు తొమ్మిది నిమిషాల పాటు నుదుట ‘సూర్యతిలకం’తో దర్శనమివ్వడం విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అమర్చిన లెన్సులు, అద్దాల ద్వారా సూర్యకిరణాలను సరిగ్గా బాలరాముని విగ్రహం నుదుటి భాగాన పడేలా చేశారు. 14 మంది అర్చకుల ఆధ్వర్యంలో వైదిక పద్ధతిలో క్రతువు పరిసమాప్తమైంది.అనంతరం 56 రకాల ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. అయోధ్య ఆలయంలో బాలరామున్ని 2024 జనవరి 22న ప్రతిష్టించడం తెలిసిందే. అనంతరం మూలమూర్తికి సూర్యతిలక క్రతువు నిర్వహించడం ఇది వరుసగా రెండో ఏడాది. దీన్ని భక్తులంతా దర్శించుకునేందుకు వీలుగా నగరమంతటా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంతకుముందు తెల్లవారుజాము నుంచే బాలరామునికి ప్రత్యేక పూజలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ భక్తులు భారీగా బారులు తీరారు. దాంతో ప్రధానాలయానికి దారితీసే రామ్పథ్, భక్తి పథ్, జన్మభూమి పథ్ తదితర మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నగరమంతటా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్చువల్గా వీక్షించిన మోదీ అయోధ్య బాలరామునికి సూర్యతిలక ధారణ క్రతువును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా వీక్షించారు. ఇది అద్భుత అనుభూతినిచి్చందని ఎక్స్ పోస్టులో ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ రాముని దీవెనలు అందాలని ఆకాంక్షించారు. -
సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం
ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు. PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro— ANI (@ANI) March 27, 2026 -
వివాహితుడి లివ్-ఇన్ రిలేషన్ నేరం కాదు : సంచలన తీర్పు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన ఒక జంట దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వయోజనులైన స్త్రీ-పురుషులు పరస్పర అంగీకారంతో సహజీవనం (Live-in Relationship) చేయడం నేరం కాదని స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు మరొక వయోజన మహిళతో కలిసి ఉన్నా, అది చట్టపరంగా నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది.ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన అనమిక, నేత్రపాల్ అనే జంట తాము వయోజనుల మని, ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తున్నామని కోర్టును ఆశ్రయించింది. కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS) నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే. మునిర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల డివిజన్ బెంచ్, పిటిషనర్లకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.అయితే జనవరి 8న అనామిక తల్లి కాంతి, షాజహాన్పూర్లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్లో నేత్రపాల్పై కేసు పెట్టింది. నేత్రపాల్ తన కుమార్తె అనామిక (18)ను మాయమాటలతో లోబరుచుకుని తీసుకువెళ్లాడని ఆమె ఆరోపించింది.నైతికత vs చట్టంన్యాయమూర్తులు జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. "సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు" అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ వివాహితుడు అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.మరోవైపు తాను మేజర్నని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే నేత్రపాల్తో సహజీవనం చేస్తున్నానని అనామిక పోలీసులకు స్పష్టం చేసింది. తమకు ప్రాణహాని ఉందని (Honour Killing) పిటిషనర్లు కోర్టుకు తెలపడంతో, వారి భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ (SP) వ్యక్తిగత బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించడం విశేషం. అలాగే ఈ జంటను నేరుగా గానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గానీ లేదా మూడవ వ్యక్తి ద్వారా గానీ సంప్రదించ కూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని కోర్టు కఠినంగా కుటుంబ సభ్యులను హెచ్చరించింది.ఇదీ చదవండి: షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళఏప్రిల్ 8 కి వాయిదా 2018 నాటి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ
జైపూర్ : జైపూర్లో జరిగి ఒక విభ్రాంతికర ఘటన నెట్టింట వైరల్గా మారింది. జైపూర్లోని ఒక కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక మహిళ బహిరంగంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను ధ్వంసం చేసే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది.సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై ఆఫీసుకి వెళ్తుండగా, ముందున్న స్కూటర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న క్యాబ్ కూడా ఆగింది. అయితే నియంత్రణ కోల్పోయిన సౌరభ్ తన ముందున్న క్యాబ్ను బుల్లెట్తో స్వల్పంగా ఢీకొట్టాడు.అయితే మర్యాదగా సౌరభ్ వెళ్లి వెంటనే క్యాబ్ డ్రైవర్కు క్షమాపణలు చెప్పాడు. కానీ క్యాబ్లో ఉన్న మహిళ మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది. ఆగ్రహం ఊగిపోతూ ఆమె బుల్లెట్ రైడర్తో గొడవకు దిగడమే కాకుండా, ఊహించని విధంగా సౌరభ్ హెల్మెట్ తీసుకుని అతని బైక్ అద్దాలను పగలగొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని బైక్ బాడీని, వెనుక లైట్లను పదే పదే బాదుతూ విధ్వంసం సృష్టించింది. ఈ తంతంగా అంతా సీసీటీవీలో రికార్డైయింది.Jaipur Woman Badly Damages Man's Bullet After It Grazes Her Scooterhttps://t.co/VNGAn5Q54t pic.twitter.com/Gt52R463vS— NDTV (@ndtv) March 26, 2026 ఇప్పటికే రూ. 1,700 నష్టం జరిగింది, చాలు ఇక వదిలేయండి. బైక్ పాడైపోతోంది అంటూ సౌరభ్ వేడుకున్నా ఆమె వదల్లేదు సరిగదా, ఎందుకు వదలాలి?" అంటూ మరింత కసిగా బైక్ను రాయితో కొట్టింది. బైక్ పాడైపోతోంది, వదిలేయండి, కేసుపెడతాను బెదిరించాడు అతగాడు. దీంతో నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ విరుచుకుపడింది.పోలీసుల తీరుపై విమర్శలుసౌరభ్ ఆరోపణల ప్రకారం, ఈ గొడవ జరుగుతున్నప్పుడు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ, అతను పట్టించుకోలేదు. మహిళను ఆపమని పదే పదే కోరినప్పటికీ ఆ అధికారి పట్టించుకోలేదని బుల్లెట్ రైడర్ సౌరభ్ శర్మ ఆరోపించారు.ఈ విషయం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి సామరస్యంగా పరిష్కారమైందని, ఆ మహిళపై ఎలాంటి అధికారిక కేసు గానీ, చట్టపరమైన చర్యలు గానీ నమోదు చేయలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, బహిరంగంగా ఒక వ్యక్తి వాహనాన్ని ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల నిర్లిప్తతపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ హెల్ప్డెస్క్ బహిరంగంగా స్పందిస్తూ, ఈ కేసును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై అప్డేట్ అందించాలని జైపూర్ పోలీసులను కోరింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
అధికారిక నివాసంలో.. ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహరాష్ట్ర ఆహార,ఔషధాల నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలో ఓ ట్రాన్స్జెండర్తో రాస లీలలు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆ వీడియోలపై నరహరి సోదరుడు ఎన్సీపీ నేత రవి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్జెండర్ వెనుక కీలక నేతలు ఉన్నారు. ఆ నేతలే సదరు ట్రాన్సెజెండర్తో వీడియోలు తీయించారు. ట్రాన్స్జెండర్ కోటాలో ఎమ్మెల్సీతో పాటు ఇతర కీలక పదవులు పొందేందుకు మా సోదరుడి వీడియోలు తీశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నరహరినే కాదు గతంలో తనని కూడా ట్రాన్స్ జెండర్ బెదిరించారాని గుర్తు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజలి దమనియా తీవ్రంగా స్పందించారు. ‘ఇది సిగ్గుచేటు. ఇదే మంత్రి గతంలో లంచం కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని పదవిలో ఉంచడం పార్టీకి అవమానం’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ప్రపంచంలో ‘ఎప్స్టిన్ ఫైల్స్’ ఎలా చెడ్డపేరు తెచ్చుకున్నాయో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది,” అని ఎద్దేవా చేశారు. ఇక ఎన్సీపీ నేత అమోల్ మిత్కరి మాత్రం ఈ వీడియోను పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ‘ఈ వీడియో ఎనిమిది నెలల పాతది. అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే ఎందుకు బయటకు వచ్చింది?. జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో దృష్టి మళ్లించడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. అలాగే, అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ఎన్సీపీ అధ్యక్షురాలిగా రావాలని మొదటగా డిమాండ్ చేసింది జిర్వాల్. అప్పటి నుంచి ఆయనపై వరుసగా వివాదాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు.జిర్వాల్పై ఇదే మొదటి వివాదం కాదు. మహారాష్ట్రలోని దిండోరి గిరిజన ప్రాంతానికి చెందిన ఈ నాయకుడి కార్యాలయంలోని ఒక క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో చర్చకు దారితీసింది. అప్పుడూ ప్రతిపక్షం ఆయన రాజీనామా కోరింది. ఈ రెండు వివాదాలు కూడా అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం.ఎన్సీపీ కొత్త అధ్యక్షురాలు సునేత్రా పవార్ పదవిలోకి వచ్చి ఒక నెల పూర్తయిన రోజే ఈ వీడియో బయటకు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాసిక్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి కొంతమంది పార్టీ నేతలు మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకంకర్ను తొలగించాలని, జిర్వాల్పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. చకంకర్ పేరు కూడా జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో వినిపించడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు.మొత్తం మీద, ఈ వీడియో వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను తెచ్చింది. ఒకవైపు బ్లాక్మెయిల్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్ర ఆరోపణలు, ఎన్సీపీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష ఒత్తిడి ఇవన్నీ కలిపి జిర్వాల్ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చాయి. -
రూ.400 కోట్లకు పైగా నగదు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఈసీ కఠిన చర్యలు చేపట్టింది.ఫిబ్రవరి 26న ఎల్రక్టానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) పేరిట ఎన్నికల నిఘా వ్యవస్థను క్రియాశీలకం చేసింది. నాటి నుంచి మార్చి 25 వరకు కొద్దిరోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తంలో మాదకద్రవ్యాల విలువ రూ.167 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ సొత్తును ఈసీ గణాంకాలతో సహా వెల్లడించింది. 100 నిమిషాల్లోనే పరిష్కారం... ఎన్నికల అక్రమాలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ‘సి–విజిల్’ (cVIGIL) యాప్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఈసీ తెలిపింది. మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల్లోనే 70,944 ఫిర్యాదులు అందాయి. ఇందులో 95.8 శాతం (67,899) ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించారు. 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ పేర్కొంది. చదవండి: ఎన్నికర ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు నిర్మించిన కేరళ నేత -
దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ లాంటి సంక్షోభం మనముందుంది, అందరం సన్నద్ధంగా ఉండాలి, కలిసికట్టుగా దీన్ని అధిగమించాలన్న వ్యాఖ్యలు, ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ మళ్లీ తప్పదనే పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్త లాక్డౌన్ వదంతులు పూర్తిగా అవాస్తవమని ఎక్స్లో క్లారిటీ ఇచ్చారు.గ్లోబల్ పరిస్థితులు మారుతున్నప్పటికీ, ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉంది. ఇంధనం, సరఫరా గొలుసులు, నిత్యావసర వస్తువుల రంగాలలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా LPG సరఫరాపై లాక్డౌన్ ఆందోళనలు వ్యక్తమవడంతో కేంద్రమంత్రి ఈ వివరణ ఇచ్చారు.The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత కారణంగా భారతదేశంలో లాక్డౌన్ విధించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో పూరీ ఈ స్పష్టతనిచ్చారు. లాక్డౌన్ వార్తలను తీవ్రంగా ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యమని ఆయన హితవు పలికారు. ప్రజల రాకపోకలపై గానీ, ఆర్థిక కార్యకలాపాలపై గానీ ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని , ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీరపశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు , వాటి వలన సంభవించే ఆర్థిక పరిణామాల నేపథ్యంలో, ప్రధాని ఇటీవల పార్లమెంటు ప్రసంగాలలో 'సన్నద్ధత' గురించి ప్రస్తావించడంతో ఈ గందరగోళానికి దారి తీసింది. ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! -
ఇరాన్కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి...
కర్ణాటక: నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి... అంటూ ఓ పోలీసు అధికారి సిగ్గు విడిచి వాట్సాప్ చాటింగ్ చేశాడు. అది కూడా మహిళా రౌడీతో. ఆమె తిరగబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బెంగళూరులో ఈ ఉదంతం వైరల్గా మారింది. వివరాలు.. బెంగళూరు కోననకుంటె పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పాపణ్ణపై లేడీ రౌడీషీటర్ యశస్విని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.పాపణ్ణ తనకు వాట్సాప్లో అశ్లీల మెసేజ్లు పంపిస్తూ వేధించాడని బుధవారం నగర పోలీస్ కమిషనర్కి చాటింగ్, ఆడియో కాల్స్ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తరువాత కూడా పాపణ్ణ తనకు కాల్ చేసి ఇంటికి వస్తానని, మాట్లాడాలని, కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కమిషనర్ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడుతూ పాపణ్ణపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఐ మీద విచారణకు ఆదేశించామని, రుజువైతే చర్యలు తీసుకుంటామని స్థానిక ఏసీపీ తెలిపారు. -
అత్తమామల ఆశలు… ఒక్కరాత్రిలో కూలిపోయాయి!
కర్ణాటక: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజనతో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. -
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుంకాల కోత.. మారని ధరలు!కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.నయారా ఎనర్జీ ధరల పెంపుదేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)ఢిల్లీరూ. 94.72రూ. 87.62ముంబైరూ. 104.21రూ. 92.15బెంగళూరురూ. 102.84రూ. 88.95హైదరాబాద్రూ. 107.41రూ. 95.65చెన్నైరూ. 100.75రూ. 92.34 గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.ఎందుకీ అస్థిరత?ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది? -
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆర్థిక ప్రయాణం కూడా. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి ఆస్తులు కొంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బంధం విడాకుల వరకు వెళ్తే.. మరి వారు ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఎవరిది? అనే ప్రశ్న వివాదంగా మారుతోంది.ఇటీవల ‘1 ఫైనాన్స్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విడాకులు తీసుకున్న వారిలో 67 శాతం మంది తాము విడిపోకముందే తీవ్రమైన ఆర్థిక విభేదాలు ఎదుర్కొన్నట్లు తేలింది. అంతేకాకుండా, 43 శాతం కేసుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైవాహిక ఆస్తుల యాజమాన్యంపై చట్టం ఏం చెబుతోంది? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను చూద్దాం.టైటిల్ డీడ్ వర్సెస్ కంట్రిబ్యూషన్: చట్టం ఏం చెబుతోంది?1955 హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారే యజమాని అనేది ప్రాథమిక సూత్రం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త ఆస్తిలో భార్యకు లేదా భార్య ఆస్తిలో భర్తకు సగం వాటా దానంతట అదే రాదు. ఇటీవల అమిష్ అగర్వాలా కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. భర్త పేరు మీద ఉన్న నివాస ఆస్తిలో తనకూ వాటా కావాలని భార్య కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘వివాహం జరిగినంత మాత్రాన స్థిరాస్తిపై ఉమ్మడి యాజమాన్యం ఏర్పడదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలులో తమ ఆర్థిక భాగస్వామ్యం ఉందనడానికి బ్యాంకు స్టేట్మెంట్లు వంటి పక్కా ఆధారాలు చూపాలని న్యాయస్థానం పేర్కొంది.వినీతా సక్సేనా కేసు మినహాయింపుసుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిపై విభిన్నంగా స్పందించింది. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (2006) కేసులో ఆస్తి భర్త పేరు మీద ఉన్నప్పటికీ భార్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గృహిణిగా ఆమె అందించిన సేవలు, ఇంటి నిర్వహణలో ఆమె పడిన శ్రమను ‘పరోక్ష సహకారం’గా గుర్తించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమెకు హక్కు కల్పించింది.నేటికీ చాలామందిలో ఆస్తి విషయంలో కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి. 1 ఫైనాన్స్లో విల్, ఎస్టేట్ ప్లానింగ్ హెడ్ శ్రద్ధా నీలేశ్వర్ కొన్ని కీలక విషయాలను వివరించారు. తాను తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.పెళ్లయ్యాక కొన్న ఆస్తిలో భాగస్వామికి ఆటోమేటిక్గా 50% వాటా రాదు.‘షమీమా ఫరూకీ వర్సెస్ షాహిద్ ఖాన్ (2015)’ కేసు ప్రకారం, ఆస్తిలో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, పూర్తి యాజమాన్య హక్కులు ఉండవు.చాలామంది పన్ను ఆదా కోసం ఒకరి పేరు మీదనే ఆస్తులు కొంటారు, కానీ విడాకుల సమయంలో ఇది రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది.ప్రస్తుతం 42 శాతం మంది పురుషులు తమ సంపాదనలో సగటున 38 శాతాన్ని భరణం లేదా వివాహ సంబంధిత రుణాలకే వెచ్చిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రణాళికలో రికార్డుల ప్రాధాన్యతను చెబుతోంది.నిపుణుల సూచనలుభవిష్యత్తులో ఆస్తి తగాదాలు తప్పించుకోవడానికి కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల సెక్షన్ 80సీ, సెక్షన్ 24(b) కింద ఇద్దరూ పన్ను మినహాయింపు పొందవచ్చు.డౌన్ పేమెంట్స్ లేదా ఈఎంఐలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్మెంట్లను భద్రపరుచుకోవాలి.ఆస్తిలో ఎవరి వాటా ఎంతో దస్తావేజుల్లోనే పేర్కొనడం ఉత్తమం.వివాహం అనేది నమ్మకంతో కూడిన బంధం అయినప్పటికీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం నేటి కాలంలో అత్యవసరం. చట్టపరమైన చిక్కులు రాకముందే మేల్కొని ఆస్తులకు సంబంధించిన సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.వదంతులు నమ్మొద్దు..సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలునిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.విశాఖ తీరానికి ‘ఎంటీ జంబో’ రాక!రష్యా నుంచి సుమారు 1,36,728 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తూ ‘ఎంటీ జంబో’ నౌక నేడు విశాఖ తీరానికి చేరుకుంది. ఈ భారీ కంటైనర్ రాకతో స్థానిక రిఫైనరీలకు ముడి సరుకు లభ్యత పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది. నిన్న బీడబ్ల్యూ బ్రిచ్ నౌక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (వంట గ్యాస్)తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఎంటీ పెట్రాయిట్ నౌక కూడా భారీ స్థాయిలో ముడి చమురును తీసుకువచ్చింది. అయితే, ఎంటీ జంబో ద్వారా వచ్చిన లక్షన్నర టన్నుల ముడి చమురును పైప్లైన్ల ద్వారా రిఫైనరీలకు తరలించే అన్లోడింగ్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. వంట గ్యాస్ నిల్వలను మరింత పెంచే దిశగా ఈ నెల 30వ తేదీన మరో రెండు ఎల్పీజీ నౌకలు విశాఖ తీరానికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది. గత నెల 21వ తేదీన కేరళ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీని ప్రకారం కేరళ ఓటర్లలో 1,32,20,811 మంది పురుషులు ఉంటే వాళ్లకంటే ఎక్కువగా 1,39,21,868 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ద్వారా శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఓపక్క ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ మాటలన్నీ నీటిలో ఉప్పు మూటలేనని రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా తేల్చిచెప్పాయి. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో 140 స్థానాలకుగాను అన్ని ప్రధానపార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ అత్యధికంగా 14 చోట్ల మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. సీపీఐ(ఎం) 12 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐ ఐదు చోట్ల మహిళలకు సీట్లు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తేగానీ మహిళలకు కోటాపై ఆలోచించేదిలేదని రాజకీయపార్టీల ఆలోచనగా ఉందని తాజా కేటాయింపులతో తేలిపోయింది. అయితే విపక్ష యూడీఎఫ్ కూటమిలో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు సీట్లు ఇవ్వడం విశేషం. 1957లో కేరళ శాసనసభ ఆవిర్భవించింది. అప్పట్నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఏ ఒక్క శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కనీసం 10శాతానికి చేరుకోలేదు. పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్నాయని ఏప్రిల్9న బరిలో దిగనున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ అన్నారు. ‘‘శక్తిసామర్థ్యాలున్న మహిళా నేతలు ఎలాంటి చట్టం, కోటా లేకుండానే సీటు సాధించి విజయతీరాలకు చేరగలరు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రతి పార్టీ.. గెలుపు గుర్రాలనే నమ్ముకుంటోంది. మహిళా అభ్యర్థి అని కాకుండా ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సీటు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి’’అని అన్నారు.ప్రాధాన్యత పెరగాలి: ఐద్వా నాయకురాలు‘‘ఎల్డీఎఫ్ కూటమి మొత్తంగా 18 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది ఏమాత్రం సరిపోదు. మాకు సీట్లు పెరగాలని ప్రతిసారీ గట్టిగా చెబుతున్నాం. పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తీరా అభ్యర్తుల తుది జాబితా బయటికొచ్చేసరికి పరిస్థితి తారుమారవుతోంది’’అని సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు, ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) జాతీయ కార్యదర్శి పీకే శ్రీమతి అసహనం వ్యక్తంచేశారు. ‘‘కేరళలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ సర్కార్ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ చట్టంపై మాట్లాడుతోంది. దమ్ముంటే తక్షణం ఆ చట్టం అమల్లోకి తేవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి) పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి. ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబ్దిపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది. గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు. హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది. సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జంగిల్మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కబీర్ మరో ఒవైసీ అవుతారా..? తృణమూల్కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్కు గండికొడుతుంది. వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
ల్యాండింగ్కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారర్యాలీల్లో పాల్గొని కోల్కతాకు ఛార్టెర్డ్ విమానంలో తిరుగుపయనమైన మమతకు కోల్కతా ఎయిర్పోర్ట్లో అననుకూల వాతావరణం స్వాగతం పలికింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో విమానం గంటకుపైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. తర్వాత ఎట్టకేలకు 5.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అణ్డాల్ నగరంలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో మమత బయల్దేరారు. అరగంటలో కోల్కతాలోని నేతాజీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ అప్పటికే ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా పెద్ద గాలివానలో చిక్కుకుంది. దీంతో విమానాల రాకపోకలను నిలిపేశారు. చేసేదిలేక విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టి గంట తర్వాత దిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం, ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు. అసలు బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వినయోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం నిర్దేశిత రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అధిక చార్జీలపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు సీసీపీఏ వెల్లడించింది. మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై మెనూలో ప్రదర్శించిన రుసుములే ఫైనల్ అని పేర్కొంది. వాటిపై వర్తించే పన్నులు మినహా అదనంగా వసూలు చేయకూడదని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది. -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్ఎఫ్ సిరీస్ ఎయిర్ఇండియా విమానం లండన్కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్లోని జాన్ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్కు చేరుకోవాల్సిన ఎయిర్ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే. -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు, పికప్ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో బస్సులోని ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు చనిపోయారు. బస్సు డ్రైవర్, పికప్ ట్రక్కు డ్రైవర్, క్లీనర్ సైతం చనిపోయారు. ఛింద్వారా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని సిమారియా పట్టణ సమీపంలో నాగ్పూర్ జాతీయరహదారిపై గురువారం రాత్రి 7.15 గంటలకు ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు...ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ప్రమాదం వార్త తెల్సి సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రూ.506 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఛింద్వారా నగరంలోని పోలీస్మైదానంలో ఏర్పాటుచేయగా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఆరు గంటలకు దాదాపు 47 మందితో ఈ ప్రైవేట్ బస్సు తిరుగుపయనమై చివరకు ప్రమాదంలో చిక్కుకుంది. -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
నేడు సీఎంలతో మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’గా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధానమంత్రి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కళలు, సంస్కృతిపై ప్రేమను చాటుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. భక్తిని, వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించే అందమైన చీరలో స్పెషల్గా మెరిసారు. శ్రీరామ నవమి పవిత్ర సందర్భాన, భక్తిని, భారతీయ వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పే ఒక చీర గురించి అంటూ నీతా లుక్కుసంబంధించిన ఫోటోలను ఎన్ఎంఏసీసీ ఇన్స్టాలో షేర్ చేసింది.హస్తకళల ద్వారా ఒక సంస్కృతిని గౌరవించడం అనేది ఆ కళాకారుల శ్రమకు నిజమైన గుర్తింపు నివ్వడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. ఇటీవల ఒడిశాలోని కేఐఐటీ (KIIT)లో నీతా గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు, ఆమె ఆ ప్రాంతపు కాలాతీత హస్తకళలను గౌరవించారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం, ఆమె మట్టి రంగులలోని ఒక సుందరమైన ఇక్కత్ (Ikat) చీరను ఎంచుకున్నారు. స్వదేశ్ నేత కళాకారుడు హరిశంకర్ మెహర్ దీన్ని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఒడిశాలోని గొప్ప నేత వారసత్వానికి ప్రతిబింబమైన ఈ చీరను నీతాకు ఆయన బహూకరించారు.సహజమైన రంగులను ఉపయోగించి, సాంప్రదాయ బంధ (Bandha)పద్ధతిలో నేసిన ఈ చీర, భక్తిని,డిజైన్ మేళవింపుగా అందంగా రూపొందింది. దీని ప్రధాన భాగంలో రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది. దానిపై సార్వజనీన విశ్వాసానికి ప్రతీకగా "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించారు. కొంగుపై ఒడియా లిపిలో పవిత్ర మంత్రాలు, సాంప్రదాయ ఇక్కత్ నమూనాలలో నేయడం విశేషం.ఇదీ చదవండి: ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)నీతా చీర ప్రత్యేకతలుసహజ సిద్ధమైన రంగులలతో సాంప్రదాయ 'బంధ' (Bandha) ప్రక్రియలో ఈ చీరను నేశారు. పవిత్రమైన పల్లు, రామనామాలు ఈ చీర ప్రత్యేకతలు.చీర మధ్య భాగంలో (Body) 'రామ శిల' స్ఫూర్తితో కూడిన డిజైన్ ఉంది. ఇందులో "రామ్" అనే పదం వివిధ భాషలలో లిఖించబడి, విశ్వవ్యాప్తమైన భక్తిని చాటిచెబుతోంది. చీర పల్లూ భాగంలో పవిత్రమైన మంత్రాలను ఒడియా లిపిలో, క్లాసిక్ ఇక్కత్ నమూనాలతో కలిపి అత్యంత నైపుణ్యంతో నేశారు.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపుకేవలం ఇదొక వస్త్రంగానే కాకుండా, ఈ చీర సంప్రదాయం, ఆధ్యాత్మికత మరియు కథాకౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. మన వస్త్రాలు మన సంస్కృతిని, భక్తిని , కాలాతీత జ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం.ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ -
ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
2026 ఐపీఎల్ సీజన్ (BCCI-IPL 2026) శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శాసనసభలో ఒక కీలక ప్రతిపాదన చేశారు. తమ లాంటి వీఐపీలు క్యూలో నిలబడలేరు కాబట్టి ప్రతీ మ్మెల్యేకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఐదు టిక్కెట్లను అందించాలని కోరారు. హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ కశపనవర్ ప్రతీ ఎమ్మెల్యేకు ఐదు టికెట్లతోపాటు, శాసనసభ్యులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా క్రికెట్ సంఘాన్ని కోరడం విశేషం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంవారు ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వారికి అన్ని భద్రతలూ లభిస్తున్నాయి. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. కానీ వారు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి కుటుంబాలకు ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు విఐపీలు కాబట్టి వారు క్యూలో నిలబడలేరు వారి 5 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోయినసారి ప్రజలతోపాటు క్యూలోనే నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం అలా జరగనివ్వమని వ్యాఖ్యానించారు.ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకంలో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కూడా కశపనవర్ ఆరోపించారు. అందుకే తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తిన ఈ విషయానికి తాము మద్దు తెలిపామనిఅవసరమైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలకు కనీసం 5 టిక్కెట్లు జారీ చేయాలని స్పీకర్ను కోరామన్నారు. వాళ్లు ఎవరి మాట వినరు. అంత పెద్దవాళ్లైపోయారు. డబ్బులు వసూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ కశపనవర్ కేఎస్సీఏపై విమర్శలు గుప్పించారు.అంతకుముందు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి చెందిన ఆర్.అశోక, కేఎస్సీఏపై ధ్వజమెత్తారు. నెలకు కేవలం రూ. 1,600 నామమాత్రపు ధరకు వారికి 16.32 ఎకరాలిచ్చాము. వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి కానీ వారు మ్యాచ్ టిక్కెట్ల కోసం తమ నుండి వేల రూపాయలు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం మరో స్టేడియం నిర్మించాలను కుంటోంది. వారికి గుణపాఠం నేర్పాలి అంటూ అసెంబ్లీలో మండిపడ్డారు.దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సంస్థాగత జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తప్పక KSCAతో చర్చలు జరపాలన్నారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలకు కేవలం ఒక టికెట్ మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి కుటుంబ సభ్యులకు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని వారికి స్పష్టం చేయాలని ఖాదర్ అన్నారు. ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ డీకే హామీఈ విషయాన్ని KSCA అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సభకు హామీ ఇచ్చారు. అధ్యక్షుడితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాను. అడిగే హక్కు ఎమ్మెల్యేలకు పూర్తిగా ఉంది, వారికి ఆ ప్రయోజనం దక్కాల్సిందనని డీకే అన్నారు. అంతేకాదు "ఇది 'సమ్రాట్' అశోక్ నుండి వచ్చిన అభ్యర్థన అని తాను వారికి కచ్చితంగా చెబుతానంటూ సరదాకా కామెంట చేయడంతో సభలోనవ్వులు పూసాయి. కాగా 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
గెలిచే తంబీ ఎవరో..?
కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్కోడ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. -
క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్
బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దిగ్భ్రాంతి రేపుతోంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నెలమంగళ సమీపంలోని టి. బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అసలేం జరిగింది?క్లాస్ జరుగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్ ఉన్నట్టుండి మైక్ పట్టుకుని విద్యార్థులందరి ముందు ఒక విద్యార్థినికి తన ప్రేమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనకు లవ్ ప్రపోజ్ చేసిందనీ, దీంతో తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని ఆయన క్లాసులో అందరి ముందు ప్రకటించారు. అందరికీ చాక్లెట్లు పంచాడు. దీన్ని సదరు విద్యార్థిని వ్యతిరేకించడంతో వాగ్వాదం జరిగింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా? ఐ లవ్ యూ అని చెప్పావు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. ‘నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను? ఆధారాలు చూపించండి’ అంటూ ఆమె గట్టిగా వ్యతిరేకించింది. సీసీటీవీ ఫుటేజీ ఉంది, కావాలంటే చూసుకోండి అని ప్రొఫెసర్ కొంచెం గట్టిగా వాదించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె ‘ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం పద, క్లాస్ అంతా వస్తారు’ అనడంతో రేపు మాట్లాడుకుందాం అంటూ అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు సదరు ప్రొఫెసర్ .అడ్డుకున్న విద్యార్థులు ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ప్రొఫెసర్ను నిలదీశారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, ప్రొఫెసర్ను ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో క్యాంపస్లో గందరగోళం నెలకొంది. Movie type proposal in #Bengaluru!A professor proposes to a student in the classroom of a medical college at T Begur in Nelamangala. The girl takes objection.A few moments later: The girl & fellow students thrash the professor. @timesofindia pic.twitter.com/ohsFTxUj5J— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 26, 2026ఇదీ చదవండి: హోర్మూజ్ తరువాత : ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ఇది పోలీసుల దాకా చేరింది. నెలమంగళ రూరల్ పోలీసులు కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.అటు ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. మెడికల్ కాలేజీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?
భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.ప్రతి ఏటా మీకు వడ్డీ చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్" వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్" కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. -వెబ్డెస్క్ -
కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు
మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు పెట్రోలు, డీజిల్ సరఫరాలో అంతరాయాలు వస్తాయనే ఆందోళనతో, వినియోగదారుల ప్యానిక్ కొనుగోళ్లతో దేశంలో పెట్రోలుబంకుల వద్ద రద్దీ ఏర్పడింది. మరోవైపు దేశానికి సరిపడా ఇంధన నిల్వలున్నాయని, ఆందోళన అవసరం లేదని కేంద్రం పదే పదే స్పష్టతనిస్తోంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వినియోగదారులకు షాకిచ్చింది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది, పెట్రోల్పై లీటరుకు రూ.5 పెంచింది. అలాగే డీజిల్పై లీటరుకు రూ.3 పెంచేసింది. భారతదేశంలోని 1,02,075 పెట్రోల్ పంపులలో 6,967 పంపులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ముడిసరుకు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగ దారులపై మోపాలని నిర్ణయించింది.ఈ పెంపు నయారా బంకుల్లో మాత్రమే. నేటి నుండి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.మరోవైపు పెట్రోల్, డీజిల్ అనేవి నియంత్రణ లేని వస్తువులని, వాటి ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్వతంత్రంగా నిర్ణయిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నయారా వంటి ప్రైవేట్ సంస్థలకు అటువంటి రాయితీలు ఉండవు గనుక పెరిగిన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని సంస్థ వర్గాలు తెలిపాయి.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఒక దశలో ముడిచమురు ధర బ్యారెల్కు 119 డాలర్లకు చేరుకుంది. దేశంలోని 90శాతం మార్కెట్ను నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థలు (IOC, BPCL, HPCL))ఇప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.అయితే, గత వారం ఇవి కూడా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2, పారిశ్రామిక అవసరాల కోసం వాడే బల్క్ డీజిల్ ధరను లీటరుకు సుమారు రూ.22 పెంచాయి. -
‘ఇప్ప సారా’ తాగితే వందేళ్లు బతుకుతారా? అసలేంటీ దీని కథ
తెలంగాణా శాసనసభలో 'ఇప్ప సారా' తీవ్ర దుమారం రేపింది. బుధవారం నాటి సభలో ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పసారాపై ఒక్కసారి ఆసక్తి పెరిగింది. గతంలో గిరిజన ప్రాంతాల్లో లభించే స్వచ్ఛమైన ఇప్ప సారాను తాగిన వారు 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్ప సారా సంగతులేంటో ఒకసారి చూద్దాం.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజాలు తరతరాలుగా ఇప్పపువ్వుల సారాను వ్యక్తిగత , సామూహిక వినియోగం కోసం తయారు చేసుకుంటారు. ఇప్పపువ్వుతో తయారుచేసే సార (మహువా డ్రింక్) సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో దీనిని ఒక సంప్రదాయ పానీయంగా భావిస్తారు. గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టు (Madhuca longifolia)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండబెట్టిన పువ్వులను నీటిలో నానబెట్టి, సహజంగా పులియబెడతారు. ఈ పువ్వులలోని సహజ చక్కెరలతో ఆల్కహాల్గా మారతాయి. ఇప్ప పువ్వుతో కేవలం మద్యం మాత్రమే కాకుండా లడ్డూలు, బిస్కెట్లు, కేకులు వంటి పోషక ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు.ఇప్ప పువ్వు లడ్డూగిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, పోషకమైన లడ్డూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆదివాసీల సాంప్రదాయ, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన లడ్డూ. చాలా రుచిగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిల్వ కూడా ఉంటాయి. ఇది ఎండు ఇప్ప పూలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు., రక్తాన్ని శుద్ధి చేయడంలో, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.ఇప్పపువ్వులో ఉండే పోషక విలువలు ఇప్పపువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలను కలిగి ఉంటాయిఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.విటమిన్ సి, కాల్షియం ,ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.దీని లోని ఔషధ గుణాల నేపథ్యంలో ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఇప్పపువ్వులను దగ్గు, బ్రోన్కైటిస్ మరియు కండరాల నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.ఇక ఇప్పసారా లాభాలు : ఎలాంటి కల్తీలేకుండా, సహజంగా పద్దతుల్లో తయారుచేసిన ఇప్పసారాను నియంత్రిత పద్ధతిలో తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం అలసటను తగ్గించడానికి . కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.ఒంటి వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుందని కొందరు భావిస్తారు. అతిసర్వత్రా వర్జయేత్..నష్టాలు : లాభాలున్నాయి కదా అని అతిగా ఇప్పసారాని సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అన్ని మద్య పానీయాల మాదిరిగానే దీనికీ నియంత్రణ అవసరం. అంతేకాదు కల్తీ సారా తాగడం ప్రాణాలకే ప్రమాదం. బయట దొరికే ఇప్పసారాలో మత్తు కోసం యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతారు. ఇది కాలేయం (Liver) , కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. చివరికి మరణానికి దారి తీస్తుంది.అతిగా సేవించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ప్రవర్తనలో మార్పులతోపాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.నోట్ : ఇప్పపువ్వులను ఆహారంగా (లడ్డూలు లేదా పొడి రూపంలో) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, కానీ దానిని 'మద్యం' రూపంలో తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఆరోగ్య సమస్యల కోసం దీనిని వాడాలనుకుంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లైసెన్స్ లేకుండా ఇప్పసారా తయారు చేయడం లేదా విక్రయించడం నేరం. మనిషి వందేళ్లు బతకడం ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతోపాటు జీవన శైలి, పోషకాహారంతో కూడిన ఆహార అలవాట్లు, జీన్స్ లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు


