National
-
పెళ్లి విందులో మ్యాంగో జ్యూస్? 400మందికి అస్వస్థత
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక దుమారాన్ని రాజేసింది.పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 400 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పందించింది.దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి విందు భోజనం చేసిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆందోళన మొదలైంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాహోద్ కలెక్టర్ యోగేష్ నిర్గుడే తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. పెళ్లి విందులో వడ్డించిన మామిడి రసం (Mango Juice) తాగడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతిFSSAI సీరియస్కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్ను ఆదేశించింది. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర అధికారులకు సహాయం చేస్తోంది. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్పష్టం చేసింది. -
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. కీలక అభ్యర్థులు వీరే..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులునందిగ్రామ్లో సువేందు అధికారి vs పబిత్ర కర్బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.బహరంపూర్లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రాఅధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీఅగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.ఖరగ్పూర్ సదర్లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్లు బర్మన్కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.డోంకల్లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్. -
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించిందిఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. -
దుమారం రేపుతున్న ఎంపీ ‘పడకగది’ వ్యాఖ్యలు
పాట్నా: ఒకవైపు మహిళల రాజకీయ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విపరీతంగా చర్చలు నడుస్తున్న వేళ.. బిహార్ ఎంపీ పప్పూ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు పప్పూ యాదవ్. 90 శాతం మహిళల రాజకీయ జీవితం.. నాయకుల బెడ్రూమ్ నుంచే మొదలవుతోందంటూ అసభ్యంగా మాట్లాడారు. రాజకీయ నాయకులంతా మహిళలపై కన్నేసి వారిని హింసిస్తున్నారని కొత్త వివాదానికి తెరలేపారు. మహిళల పట్ల రాజకీయ నేతల ప్రవర్తనకు సంబంధించి నిత్యం ఏదో ఒక నాయకుడి సీసీ టీవీ ఫుటేజ్ బయటపడుతూనే ఉందని, అమెరికా నుంచి భారత్ వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందని అసహ్యంగా మాట్లాడారు. ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది, ఇది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది. మరొకవైపు పప్పూ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పప్పు యాదవ్ను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి పప్పూ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.'Women start careers in men's bedrooms... 90% female Netas start this way.'Despicable,outrageous comments by Pappu Yadav,abusing self made women politicians. Will @priyankagandhi sack this obnoxious misogynist or does she endorse his views?Disgusting ppl pic.twitter.com/7PDBhp5Nrv— Tuhin A. Sinha तुहिन सिन्हा (@tuhins) April 21, 2026 -
కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి
కేరళంలోని త్రిస్సూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరువంబడి డివిజన్కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది. పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.కొనసాగుతున్నసహాయక చర్యలుఅగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్లతో సహా, తగినన్ని అంబులెన్స్లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు. -
తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఇలా క్లీన్ చేయొచ్చని శాస్త్రవేత్తల గుర్తింపు
మునగ భారతదేశానికి చెందిన మొక్క. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీని ఆకులు, గింజల పోషక విలువల కారణంగా ఆహారంగా బాగా వినియోగిస్తారు. నీటి శుద్ధిలో ఇది ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా ఈ గింజలపై పరిశోధనలు చేస్తున్నారు.మునగ గింజలు నీటిలోని మైక్రోప్లాస్టిక్స్ను బయటకు తీయడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సాధారణ రసాయన చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మొక్క ఆధారిత సారం ప్లాస్టిక్ కణాలను ఒకదానికొకటి అంటుకునేలా చేసి వడపోతలో సులభంగా తొలగించేలా చేస్తుంది.కొన్ని పరిస్థితుల్లో ఇది సంప్రదాయ రసాయనాల కంటే మెరుగ్గా పనిచేసింది. తక్కువ ఖర్చుతో సహజ పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది. తాగునీటి శుద్ధి విషయంలో ఇది పెద్ద మార్పు తీసుకురావచ్చు. బ్రెజిల్ సావో పాలో స్టేట్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఐసీటీ యునెస్ప్ సావో జోసే డోస్ కాంపోస్లో పరిశోధకులు మోరింగా ఒలీఫెరా (సాధారణంగా మునగ లేదా వైట్ అకేషియా అని పిలిచే మొక్క) నీటిలోని మైక్రోప్లాస్టిక్స్ను తొలగించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ఫలితాలు అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఏసీఎస్ ఒమెగాలో ప్రచురితమయ్యాయి.రసాయన చికిత్సలా మునగ గింజల సారం ‘ఈ గింజల ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ లాగా పనిచేస్తుంది. ఇది మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తుంది క్షార స్వభావం ఎక్కువగా ఉన్న నీటిలో ఇది రసాయన ఉత్పత్తి కంటే మెరుగ్గా పనిచేసింది’ అని శాస్త్రవేత్త గాబ్రియెల్లే బాటిస్టా తెలిపారు. ఆమె పీజీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ పీపీజీఈసీఏలో మాస్టర్స్ సమయంలో ఈ పరిశోధన చేశారు.ఈ పరిశోధనకు ఐసీటీ యునెస్ప్ ప్రొఫెసర్ ఆడ్రియానో గోన్కాల్వెస్ డోస్ రైస్ నాయకత్వం వహించారు. ఆయన మైక్రోప్లాస్టిక్స్ తొలగింపు ప్రాజెక్ట్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఫాపెస్ప్ మద్దతుతో నడుస్తోంది.అల్యూమినియం సల్ఫేట్లో ప్రధాన లోపం కరిగిన సేంద్రీయ పదార్థం పెరగడం. దీన్ని తొలగించే ప్రక్రియ ఖర్చును పెంచుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని తక్కువ ఖర్చుతో సమర్థంగా ఉపయోగించవచ్చని రైస్ తెలిపారు.మైక్రోప్లాస్టిక్స్ తొలగింపులో కోగ్యులేషన్ కీలకంకోగ్యులేషన్ అంటే చిన్న చిన్న కణాలు ఒకదానికొకటి అతుక్కుని పెద్ద గుంపులుగా మారే ప్రక్రియ. సరళంగా చెప్పాలంటే నీటిలో తేలియాడే సూక్ష్మ కణాలు విడిగా ఉండకుండా ఒకచోట చేరేలా చేయడం. నీటి శుద్ధిలో ఇది ముఖ్యమైన దశ. ఈ ప్రక్రియలో కణాలపై ఉన్న విద్యుత్ ఛార్జ్ తగ్గించి వాటిని కలిసేలా చేస్తారు. దీంతో అవి పెద్ద ముద్దలుగా మారి సులభంగా వడపోతలో తొలగించవచ్చుమైక్రోప్లాస్టిక్స్ ఇతర కాలుష్య కణాలకు నెగటివ్ విద్యుత్ ఛార్జ్ ఉంటుంది. అందువల్ల అవి ఒకదానిని మరొకటి తోసుకుంటాయి. వడపోతలో వాటిని పట్టడం కష్టమవుతుంది. కోగ్యులెంట్లు మునగ ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ ఈ ఛార్జ్ను తటస్థం చేస్తాయి. దీంతో కణాలు పెద్ద గుంపులుగా మారతాయి.. సులభంగా తొలగించవచ్చు. గత పరిశోధనలో మునగ గింజలు ఫ్లోక్యులేషన్ సెడిమెంటేషన్ ఫిల్ట్రేషన్ వంటి పూర్తి శుద్ధి ప్రక్రియలో సమర్థంగా పనిచేస్తాయని నిరూపించాయి.ప్రయోగశాల పరీక్షలుపరిశీలన కోసం బృందం ట్యాప్ నీటిలో పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ మైక్రోప్లాస్టిక్స్ కలిపింది. పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ ఇది. జన్యు మార్పులకు క్యాన్సర్కు కారణమయ్యే లక్షణాలు ఉంటాయి. ఇది నీటి ఉపరితలాల్లో సాధారణంగా కనిపిస్తుంది. సంప్రదాయంగా మనం చేసే నీటి శుద్ధి తర్వాత కూడా మిగిలి ఉండవచ్చు. పీవీసీపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రయోగించారు. తర్వాత కలుషిత నీటిని జార్ టెస్ట్ విధానంతో కోగ్యులేషన్ ఫిల్ట్రేషన్ చేశారు. ఇది చిన్న స్థాయి నీటి శుద్ధి ప్రక్రియ. ఫలితాలను కొలవడానికి స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఎస్ఈఎం ఉపయోగించారు. ఇది సూక్ష్మ కణాలను పెద్దగా చూపించే సాంకేతిక పద్ధతి. కణాల పరిమాణం గుంపులను హై స్పీడ్ కెమెరా లేజర్ కొలతలతో విశ్లేషించారు. రెండు విధానాలు సమానంగా మైక్రోప్లాస్టిక్స్ తొలగించాయి. -
శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.నాటి పహల్గామ్ దాడిలో డాక్టర్ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్ భూషణ్ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. నిజానికి ఏప్రిల్ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్ సుజాత.#PahalgamTerroristAttackDr. Sujatha, a pediatrician from Bengaluru, witnessed the tragic killing of her husband, Bharath Bhushan, during a terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on April 22, 2025. #DrSujatha, her husband, and their three-year-old son were vacationing… pic.twitter.com/Wn5D9ZnMuL— Dr Parveen Yograj (@ParveenYograj) April 24, 2025 (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ) -
రాహుల్పై లాలూ పెద్ద కొడుకు కీలక వ్యాఖ్యలు
పట్నా: కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ గాంధీకి లేదని లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు, జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ వాద్రాను ఇండియా కూటమి ఫేస్గా ఆయన వర్ణించారు. ప్రియాంక మాత్రమే సమర్థవంతంగా విపక్ష కూటమిని నడపగలరని అభిప్రాయపడ్డారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చారు.''కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిని ప్రియాంక గాంధీ మాత్రమే నడపగలరు. ఆమె ఇందిరా గాంధీ లాంటివారు. యాత్రకు వెళ్లడం, బుల్లెట్పై కూర్చోవడం ద్వారా రాహుల్ గాంధీ కూటమిని నడపలేరు. బిహార్ నుంచి నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఉద్దేశ్యం ఏమిటి?" అని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ద్వారా నితీశ్ కుమార్ రాజీపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో తేజ్ ప్రతాప్ స్పందించారు. ''రాహుల్ గాంధీ ఇప్పుడు నితీశ్ కుమార్ గురించి మాట్లాడుతున్నారు. నితీశ్ తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన (రాహుల్ గాంధీ) మరో రాష్ట్రంలో ఉన్నారు. అలాంటప్పుడు బిహార్ సీటు విషయంలో ఎందుకు అత్యాశ పడుతున్నారు?” అని తేజ్ ప్రతాప్ యాదవ్ నిలదీశారు.యాదవ్పై రాజ్ ఫైర్తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదిత్ రాజ్ స్పందించారు. లాలూ కుమారుడికి రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోరని అన్నారు. అనవసరపు మాటలు కట్టిపెట్టి తన సొంత పనిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, ఇండియా కూటమిని నడిపే సత్తా రాహుల్కు లేదని గతంలోనూ పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: హమ్మయ్య! అమిషాను నవ్వించాం.. రాహుల్ సరదా వ్యాఖ్యలురాహుల్ గాంధీ ఏమన్నారంటే..తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''బిహార్ తరహా రాజకీయాలు తమిళనాట కుదరవని అన్నారు. కొద్ది రోజుల క్రితం బిహార్లో ఏం జరిగిందో చూడండి. బిహార్ ముఖ్యమంత్రిని తొలగించి బీజేపీ నాయకుడిని సీఎం సీటులో కూర్చొబెట్టారు. ఎందుకంటే సీఎం రాజీపడ్డారు. పదవి నుంచి ఎందుకు తొలగించారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మౌనంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. బీజేపీ ఆయనను కంట్రోల్ చేసింది. ఇదే విధానం తమిళనాడులో అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. కాషాయ పార్టీ కలలను ఇండియా కూటమి భగ్నం చేస్తుంద''ని అన్నారు. -
ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
PM Modi : పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న జహాగ్రామ్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ అయిన ఝల్మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్నైట్లో ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాను అని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్ వెల్లడించాడు. మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝల్మురి కోసం గూగుల్లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్ వద్ద ఆగారు. ఝల్మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్ నుంచి జహాగ్రామ్కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్ కాలేజ్ మోర్ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది. Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4— Narendra Modi (@narendramodi) April 19, 2026 -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
పెళ్లి భోజనం చేసిన 400 మందిలో అలజడి
దాహోద్: పెళ్లి వేడుకను సాధారణంగా స్నేహితులు, కుటుంబం సభ్యులు, బంధువులతో ఎంతో హుషారుగా, రుచికర వంటకాలతో జరుపుకుంటాం. వివాహం అంటే బాగా గుర్తుకువచ్చేది పెళ్లి వంటకాలు కూడా. అదే ఆహారం వందల మంది అనారోగ్యానికి కారణమైతే? గుజరాత్లోని దాహోడ్, అబ్లోడ్ గ్రామంలో బాజా భజంత్రీల మధ్య ఎంతో సందడిగా ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సుమారు 300-400 మంది హాజరయ్యారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారము, కడుపు నొప్పి, డయేరియాతో బాధపడ్డారు. వారిలో 50-60 మందిని స్థానికులు జైడస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.జైడస్ ఆసుపత్రి ఆర్ఎమ్వో డాక్టర్ రాజీవ్ దామోర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోగులకు గత రాత్రి 11 గంటల సమయంలో లక్షణాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ముందుగానే సమాచారం రావడంతో 150-200 మంది రావచ్చని అంచనా వేసి పడకలు, అత్యవసర సేవలు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 50-60 మంది రోగులు చేరారని, చికిత్స పొందుతున్నారని చెప్పారు. అధికారులు అత్యవసర దర్యాప్తు ప్రారంభించి ఆరోగ్య బృందాలను అప్రమత్తంగా ఉంచారు.పెళ్లి కార్యక్రమానికి వచ్చివారికి ఇలాంటి అనుభవం ఏర్పడడంతో ఆ గ్రామంలోని వారంతా షాక్ అయ్యారు. పెళ్లిలో అందించిన ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. ఆహారం తయారీ, వడ్డించే సమయంలో పాటించిన పరిశుభ్రత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూపొందించిన ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. పరిశుభ్రతను గాలికి వదిలేసి వండితే సమస్యలు తప్పవు.‘దాహోద్లో 400 మందికిపైగా పెళ్లి భోజనం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన ఆందోళనకర విషయం. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. दाहोद में 400 से ज़्यादा लोगों का शादी का खाना खाकर बीमार पड़ना चिंता का विषय है। इस घटना की निष्पक्ष जांच होनी चाहिए। मैं सभी के जल्द स्वस्थ होने की प्रार्थना करता हूँ। फ़ूड सेफ़्टी में लापरवाही कभी भी हेल्थ इमरजेंसी का रूप ले सकती है। देश भर में मिलावटी खाद्य सामग्री पकड़ी जा… https://t.co/fpRTSue7vu— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2026 -
లెన్స్కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్చల్
సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్చల్ చేశారు. ముంబైలోని స్టోర్లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.తమ ఉద్యోగుల కోసం లెన్స్కార్ట్ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్కార్ట్ స్టోర్లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.లెన్స్కార్ట్ వివరణసోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్కాట్ లెన్స్కార్ట్' తీవ్రం కావడంతో , లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Mohsin Khan is the main operator of the Lenskart Shop in Andheri, Mumbai!No Hindu staff member can wear the Tilak!Kalaava!This is strictly prohibited!All Lenskart Shops in India should be banned immediately!Gazwa-e-hind strategy are operational from #lensekart ?… pic.twitter.com/q6bClZvrLL— Nazia Elahi Khan (सनातनी) (@ElahiNazia1) April 19, 2026 -
ప్రధాని మోదీకి ‘తమిళ మేకప్?.. నెట్టింట రచ్చ
చెన్నై: సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. DARK MAKEUP FOR DARKER VOTES — Tamil Nadu Tantrum!” 😡🎭 ⁉️Everything is a PR stunt for our PM.In Tamil Nadu, he seems to have applied darker skin-tone makeup to “look like one among them. Does he really think all Tamilians are black or dark? If this is true then this is… https://t.co/b8oGXWAZgA— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) April 20, 2026కెమెరా ఎఫెక్టా, ఎండ ప్రభావమా?ఒకవైపు ఈ 'తమిళనాడు మేకప్' వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. తీవ్రమైన ఎండలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కెమెరా ఎక్స్పోజర్, లైటింగ్ లోపాలు లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల సహజంగానే చర్మం రంగు అలా కనిపించి ఉండొచ్చని వారు అంటున్నారు. వీడియోలు తీసిన కోణం లేదా పోస్ట్-ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి కారణం కావొచ్చని విజువల్ మీడియా నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. Different shades; early morning in Bengal election campaign V/s evening election campaig in Tamil Nadu after applying shoe polish on face..He’s not insulting entire Tamilians ? pic.twitter.com/InN7RxsCn1— RajSpeak Parody ☭ (@RajSpeak_) April 21, 2026ఉత్తర-దక్షిణ వివాదంగా మారిన రాజకీయంవాస్తవ నిర్ధారణ జరగకముందే ఈ వివాదం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీసే స్థాయికి చేరుకుంది. ఆన్లైన్ వేదికగా రెండు వర్గాలు తీవ్రంగా వాదించుకుంటూ సోషల్ మీడియాను రెండుగా చీల్చాయి. ఎన్నికల వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలు కూడా ఎంత వేగంగా పెద్ద చర్చకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇది కూడా చదవండి: తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా? -
తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా?
లక్నో: ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారుల కుర్చీలపై తళతళలాడే తెల్లటి టవల్స్ను ఎప్పుడైనా గమనించారా? ఇవి కేవలం పరిశుభ్రతకు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లో ‘అధికారానికి నిదర్శనం’గా కూడా మారాయి. ఇంటర్నెట్లో నెటిజన్లను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘తెల్ల టవల్’ సంస్కృతి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, వాస్తవిక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.అధికారానికి కేరాఫ్ అడ్రస్ప్రభుత్వ ఆఫీసుల్లో తెల్ల టవల్స్ను కేవలం ఒక వస్త్రంగా కాకుండా, ఒక అధికారిక చిహ్నంగా భావిస్తారు. కేతన్ అనే ఒక నెటిజన్ పెట్టిన ట్వీట్తో ఆన్లైన్లో ఈ చర్చ మొదలైంది. ఉన్నతాధికారులు తెల్లని టవల్స్ వేసిన కుర్చీలలో కూర్చుని దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, చట్టసభలకు ఎన్నికైన తమకు అలాంటి ఆ గౌరవం దక్కలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేసినట్లు ఆ నెటిజన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.టవల్స్ కోసం అత్యవసర సమావేశంఈ టవల్స్ వ్యవహారం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే, 2024లో యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ దీనిపై ఏకంగా ఒక అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రొటోకాల్స్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా జరిగే అధికారిక సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం అధికారులతో సమానంగా తెల్లటి టవల్స్ కప్పిన కుర్చీలనే ఖచ్చితంగా కేటాయించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.వారానికి వెయ్యికి పైగా టవల్స్ మార్పుఈ తెల్ల టవల్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో లక్నోలోని ఉత్తరప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏకంగా వారానికి రెండు సార్లు (సోమవారం, గురువారం) కుర్చీలపై ఉన్న దాదాపు 1,000 టవల్స్ను మారుస్తుంటారని సమాచారం. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలకు టవల్ వేసే ఆచారం కొనసాగుతుండటం ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ -
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ
పహల్గామ్: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఒకపక్క ఆత్మీయులను కోల్పోయిన ఆవేదన, మరోపక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం వారిని మరింత కుంగదీస్తున్నాయి.ఆఖరి శ్వాస వరకు వెంటాడే పీడకలపహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీత మాట్లాడుతూ.. ఆ భయానక ఘటనను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేదేమీ లేదని, ప్రభుత్వంతో పోరాటం ఉంటే నేరుగా వారితోనే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు. మరో బాధితురాలు ప్రియదర్శిని ఆచార్య (ప్రశాంత కుమార్ శత్పథి భార్య) తన భర్త లేని లోటును ప్రతీ రోజు తలచుకుంటున్నానని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి, ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సాయం అందినప్పటికీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట..ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి మరీ దారుణ మారణకాండకు ఒడిగట్టారు. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ గడ్డపైకి చొచ్చుకెళ్లాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన తొమ్మిది భారీ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో దిగివచ్చిన పాక్ ఆర్మీ.. భారత డీజీఎంఓను ఆశ్రయించి మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.భయాలు వీడి.. మళ్లీ పర్యాటకుల రాకకశ్మీర్ లోయలో ఇప్పుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. పహల్గామ్తో పాటు ఇతర ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇది సందర్శకుల్లో తిరిగి చిగురించిన భద్రతా భావానికి అద్దం పడుతోంది. శ్రీనగర్ను సందర్శించిన విశాల్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ.. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయలేమని, కశ్మీర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు -
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
ఆ వ్యాఖ్యలు చేసింది వారు కాదు.. యోగీపై ట్రోల్
కోల్కతా ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్కు గురవుతున్నాయి. తృణముల్ ఎంపీ సాగరిక ఘోష్తో పాటు సమాజ్ వాద్ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలేం జరిగింది?యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా బంకురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ "మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అన్నారు.అయితే దీనిపై తృణముల్ ఎంపీ యోగీ ఆదిత్యానాథ్కు కౌంటరిచ్చారు. "యోగీ ఆదిత్యానాథ్ గారు ఆ వ్యాఖ్యలు చేసింది స్వామి వివేకానంద కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్" అన్నారు. యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు "బెంగాల్ చరిత్ర పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని, ధిక్కారాన్ని" బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీస్తున్నాయన్నారు.కాగా ఈ వ్యాఖ్యలు 1944 జూలైలో బర్మాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడమని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సైనికులను ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఆసమయంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సైనికులనుద్దేశించి "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 23న తొలిదశ ఎన్నికలు జరగునుండగా, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
కేదార్నాథ్: మంచు కొండల నడుమ నెలకొన్న మహా శివుని క్షేత్రం కేదార్నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి, భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మారుమోగుతోంది.పూల వనంలా పరమశివుని సన్నిధిదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 51 క్వింటాళ్ల తాజా పూలతో కేదార్నాథ్ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ పూల అలంకరణతో రాతి కట్టడమైన ఆ పవిత్ర మందిరం భక్తిభావానికి సజీవ సాక్ష్యంగా, కన్నుల పండువగా మారింది. అధికారులతో పాటు స్థానికులు సైతం అహర్నిశలు శ్రమిస్తూ, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా చేరుకున్న భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ వివిధ పనుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండటం విశేషం.భద్రత కట్టుదిట్టంభారీ సంఖ్యలో రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మంచుతో కప్పుకుపోయిన నడక మార్గాలను పూర్తిగా క్లియర్ చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులను అమల్లోకి తెచ్చారు. యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక బృందాలు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాయి.ఉత్సాహంగా చార్ధామ్ యాత్రఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది భక్తులు హిమాలయాలకు చేరుకున్నారు. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయం తెరుచుకోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సైతం భక్తుల దర్శనార్థం తెరవనున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’ -
ఇండియా ఫస్ట్ లగ్జరీ ట్రైన్కు గడ్డు కాలం.. 43 ఏళ్ల చరిత్రలో..
ప్యాలెస్ ఆన్ వీల్స్.. భారతదేశపు మొదటి లగ్జరీ హెరిటేజ్ ట్రైన్.. 1982లో ప్రారంభమైన ఈ విలాసవంతమైన రైలు.. రాజస్థాన్, ఆగ్రా ప్రాంతాల గుండా ప్రయాణిసూ.. 7 రాత్రులు/8 రోజుల పర్యటనలో కవర్ చేస్తోంది. ఎడారులు, కోటలు, చారిత్రక నగరాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు రాజస్థాన్ రాజరిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అయితే, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా.. ఈ సీజన్లో అంతర్జాతీయ ప్రయాణాల మందగమనం సాగుతోంది.విదేశీ ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలులో క్యాబిన్లు కూడా నిండటం లేదు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, ఉద్రిక్తతలు ప్రపంచ పర్యాటకంపై పడింది. ముఖ్యంగా భారత్లోని పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ సీజన్లో జైసల్మేర్కు జరిగిన చివరి ప్రయాణంలో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించారు. ఈ రైలు సామర్థ్యం 84 మంది కాగా.. చాలా తక్కువ మంది ప్రయాణించారు.పర్యాటక రంగానికి పెద్ద దెబ్బతక్కువ బుకింగ్ల కారణంగా రెండు ప్రయాణాలను ముందుగానే రద్దు చేశారు. నిబంధనల ప్రకారం, రైలు నడవాలంటే కనీసం 14 క్యాబిన్లు బుక్ అవ్వాలి. కానీ ఈ సీజన్లో చాలాసార్లు ఆ సంఖ్య 10 కూడా దాటలేదు సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రణాళిక చేసిన 32 ట్రిప్పులలో 10 ట్రిప్పులు రద్దయ్యాయి, ఇది పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా అధికారులు చెబుతున్నారు.43 ఏళ్ల చరిత్రలో..43 ఏళ్ల చరిత్రలో షెడ్యూల్ చేసిన ప్రయాణాలలో దాదాపు మూడొంతులు రద్దు కావడం ఇది రెండోసారి. గత సీజన్లో కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా 10 ట్రిప్పులు రద్దయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ రైలు ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. టికెట్ ధరలు రూ. 6 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఉండటం కూడా డిమాండ్ తగ్గడానికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా విదేశీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి వెనుకాడుతున్నారు. గతంలో ప్యాలెస్ ఆన్ వీల్స్ 70 నుండి 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచేది. కానీ ఈ సీజన్ చివరి ట్రిప్పులో అది కేవలం 26 శాతానికి పడిపోయిందని టూర్ ఆపరేటర్లు అంటున్నారు.రాజస్థాన్ పర్యాటకంపై తీవ్ర ప్రభావంలగ్జరీ రైలు బుకింగ్లు తగ్గడంతో రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. రైలు వచ్చే సమయంలో ప్రదర్శనలు ఇచ్చే స్థానిక జానపద కళాకారులు ఆదాయం కోల్పోయారు. అలాగే, జైసల్మేర్ వంటి నగరాల్లోని హోటళ్లు, గైడ్లు, చిన్న వ్యాపారస్తులు కూడా పర్యాటకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకతలు ఏంటంటే..మొఘల్ చక్రవర్తులు, రాజస్థాన్ రాజుల వైభవాన్ని గుర్తు చేసే 'ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును 1982లో రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి సంస్థ (RTDC), భారతీయ రైల్వే సంయుక్తంగా ప్రారంభించాయి. పూర్వం రాజస్థాన్, గుజరాత్ పాలకులు, బ్రిటిష్ వైస్రాయ్లు ప్రయాణించిన అసలైన కోచ్లను ఆధునికీకరించి దీనిని రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.ప్రయాణ మార్గం:ఈ రైలు ఢిల్లీ రైల్వేస్టేషన్(సఫ్దర్జంగ్) నుంచి బయలుదేరి జైపూర్ చేరుకుంటుంది. అనంతరం రెండో రోజు జైపూర్ సిటీ ప్యాలెస్(హవా మహల్, అంబర్ కోట) సందర్శన ఉంటుంది. మూడో రోజు రత్నాంబోర్-ఫతేపుర్ సిక్రి చేరుకుంటుంది. నాలుగో రోజు ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ సందర్శన అనంతరం ఖజురాహోకు ఐదో రోజు చేరుకుంటారు. అనంతరం ఆరో రోజు రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరగా ఏడో రోజు మధ్యాహ్నం ఈ ట్రైన్ ప్రయాణం ముగుస్తుంది.రైలులోని సౌకర్యాలు:ప్రతి కోచ్ రాజస్థానీ శైలిలో అలంకరించబడి ఉంటుంది. వై-ఫై, అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి. 'మహారాజా, 'మహారాణి అనే రెండు అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియన్, కాంటినెంటల్, రాజస్థానీ వంటకాలు లభిస్తాయి. ఖరీదైన వైన్, పానీయాలు లభించే బార్, విశ్రాంతి తీసుకోవడానికి లాంజ్ ఉన్నాయి. ప్రయాణ అలసటను పోగొట్టుకోవడానికి ఆయుర్వేద స్పా సౌకర్యం కూడా ఉంది. -
పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్లో హై టెన్షన్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటితో (ఏప్రిల్ 22) సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యంత ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ‘మానవత్వపు హద్దులు దాటినప్పుడు, మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరిగింది. భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆర్మీ చేసిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. ఉగ్ర మూకలకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతూనే, దేశ భద్రత పట్ల ఆర్మీ తన ఉక్కు సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పింది.ఆ నెత్తుటి జ్ఞాపకం..2025 ఏప్రిల్ 22న అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ మారణకాండలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్లోని 44 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తెరుచుకున్నప్పటికీ, బైసరన్తో పాటు మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చందన్వాడి ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు. When boundaries of humanity are crossed, the response is decisive. Justice is Served.India Stands United.#SindoorAnniversary #JusticeEndures #NationFirst pic.twitter.com/rtgYu9Hg11— ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2026కశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రతఉగ్రదాడి ప్రథమ వార్షికోత్సవం సమీపించడంతో కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. సాధారణ ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు కలగకుండానే, వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం డేగకన్నుతో నిఘా కొనసాగుతోంది.రంగంలోకి ఉన్నతాధికారులువివిధ జిల్లాల్లో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామాలో డీఐజీ జావేద్ ఇక్బాల్ మట్టూ నేతృత్వంలో నేరాలు, భద్రతపై కీలక సమీక్ష జరిగింది. ఉగ్రవాద కట్టడి చర్యలు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా అవంతిపొరా, శ్రీనగర్లలో ఎస్ఎస్పీ జి.వి సందీప్ చక్రవర్తి శాంతిభద్రతలను సమీక్షించారు. ముఖ్యంగా దర్యాప్తులను వేగవంతం చేసి, నేరస్తులకు శిక్ష పడే శాతాన్ని పెంచడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్కు బహుళ ప్రయోజనం! -
టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వేతన జీవి పోరాటం అంతా ఆ నాలుగు మెతుకుల కోసమే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. అంతర్జాతీయంగా ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన కర్రీ పాయింట్లలో కరీ ప్యాకెట్ ధర పెరుగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకితే రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ ధర మారుతుంది. ధరలు పెరిగిన ప్రతిసారీ సర్దుకుపోవడం సామాన్యుడికి అలవాటైపోయింది. కానీ ఆ సర్దుబాటు ఇప్పుడు అతని ఆకలిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.వ్యాపారులకు ఖర్చులు పెరిగాయన్నది నిజమే కావచ్చు, కానీ పరిస్థితులు చక్కబడ్డాక పెంచిన రేట్లను తగ్గించే మనసు మాత్రం ఏ వ్యాపారికీ రాదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక పక్క కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకులు చెబుతూ ఉద్యోగి జీతంలో వందల రూపాయల పెంపునకు కూడా వెనకాడుతుంటే.. అదే కంపెనీల యజమానులు మాత్రం కుబేరుల జాబితాలో పోటీ పడుతున్నారు. ఈ అంతరం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అశాంతికి పునాది.ఆకాశమే హద్దుగా ధరలుఒకప్పుడు రూ.20 ఉన్న కర్రీ ప్యాకెట్ నేడు రూ.30కి(కొన్ని ప్రదేశాల్లో మారుతుంటుంది) చేరింది. అంటే ఒక్కసారిగా 50 శాతం పెరుగుదల. కేవలం కర్రీ పాయింట్లే కాదు, టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉండే ప్లేట్ ఇడ్లీ నేడు రూ.45కి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ అటు బడా హోటళ్లు, ఇటు వీధి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, ముడి చమురు లేదా గ్యాస్ ధరలు తగ్గినా.. పెంచిన ఈ ధరలను మళ్లీ తగ్గించడం అనేది మన మార్కెట్ సంస్కృతిలో దాదాపు అసాధ్యం.పెరగని జీతాలు.. కార్పొరేట్ లాభాలువస్తువుల తయారీ ఇన్పుట్ ఖర్చులు పెరిగాయని సాకు చూపుతున్న కంపెనీలు ధరల భారమంతా వినియోగదారుడిపైనే మోపుతున్నాయి. కానీ, అదే నిష్పత్తిలో తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వార్షికంగా ధరల పెరుగుదల 30-50 శాతం ఉంటే సగటు వేతన జీవి జీతాల పెరుగుదల మాత్రం 5 నుంచి 8 శాతం లోపే ఉంటోంది. మరోవైపు, ఇన్పుట్ ఖర్చులు పెరిగాయని వాపోతున్న కంపెనీల యజమానులు మాత్రం ఫోర్బ్స్ వంటి ప్రపంచ ధనవంతుల జాబితాలో తమ ర్యాంకులను మెరుగుపరుచుకుంటున్నారు.సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై అధిక శాతం ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.పరిష్కార మార్గాలుప్రభుత్వాలు చేయాల్సినవి..ధరల నియంత్రణ కమిటీలు: నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. ఇన్పుట్ ఖర్చులు తగ్గినా ధరలు తగ్గించని సిండికేట్లపై చర్యలు తీసుకోవాలి.వేతన సవరణ చట్టం: కేవలం కనిష్ట వేతనం మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ కనీస వార్షిక ఇంక్రిమెంట్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.ప్రజా రవాణా పటిష్ఠం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మరో ప్రధానాంశం రవాణా. ప్రజారవాణాను చౌకగా అందుబాటులోకి తెస్తే కొంత ఊరట లభిస్తుంది.ప్రజలు చేయాల్సినవి..ఆర్థిక క్రమశిక్షణ: అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంస్కృతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.నైపుణ్యాభివృద్ధి: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం జీతంపైనే ఆధారపడకుండా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.వినియోగదారుల హక్కులు: అన్యాయంగా ధరలు పెంచే వ్యాపార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి వినియోగదారుల ఫోరమ్ ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి.అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సగటు సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగడం. సంపద పంపిణీలో సమతుల్యత లేకపోతే అది దేశ పురోగతికి ఆటంకమవుతుంది. ఇప్పటికైనా పాలకులు, పారిశ్రామికవేత్తలు సామాన్యుడి బతుకు బండిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్.. -
Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం
కమ్జోంగ్: ఒకవైపు జాతి వివక్ష అల్లర్లు, వరుస బంద్లతో అట్టుడుకుతున్న మణిపూర్ను తాజాగా ప్రకృతి ప్రకోపం భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం రాష్ట్రాన్ని మరోసారి తీవ్రంగా కుదిపేసింది. గాఢ నిద్రలో ఉన్న జనం భూమి కంపించడంతో ప్రాణభయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 21) ఉదయం 5:50 గంటలకు మణిపూర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 గా నమోదైంది. కమ్జోంగ్ జిల్లా కేంద్రంగా భూమికి 62 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు అందలేదు.అల్లర్లతో అగ్నిగుండంలా..మరోవైపు రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగలేదు. ఏప్రిల్ 7వ తేదీన బిష్ణుపూర్ జిల్లాలోని త్రోంగ్లాబీలో అనుమానిత మిలిటెంట్లు జరిపిన బాంబు దాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఇంఫాల్ లోయ ప్రాంతాలు అగ్నిగుండంగా మారాయి. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ మహిళా సంఘం ‘మీరా పైబిస్’ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చింది. రాజధాని ఇంఫాల్లోని ఉరిపోక్, నాగారం వంటి ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.బంద్తో స్తంభించిన జనజీవనంనిరసనకారుల ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. మైతేయి, నాగా వర్గాల ప్రాబల్యం ఉన్న ఐదు జిల్లాలతో పాటు ఉఖ్రుల్, సేనాపతి జిల్లాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపును ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా, 30 మందికి పైగా జనం గాయపడ్డారు. శనివారం థాంగ్మీబాండ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు గాయపడగా, వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉండటం అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది. EQ of M: 5.2, On: 21/04/2026 05:59:33 IST, Lat: 24.703 N, Long: 94.415 E, Depth: 62 Km, Location: Kamjong, Manipur. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/Z2UScSAau8— National Center for Seismology (@NCS_Earthquake) April 21, 2026 -
మమత వర్సెస్ మోదీ: ఐ-ప్యాక్ అడ్డాగా యుద్ధం!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగుతోంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ చుట్టూ అల్లుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం.. దాడులు, అరెస్టులు, సమన్లు దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయమున్న ‘గ్రీన్ ఫైల్’ ఎపిసోడ్తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ ఐ-ప్యాక్ చుట్టూ ఏం జరుగుతోంది?తనిఖీల నుంచి రాజకీయ రగడకు.. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ఊహించని రీతిలో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన అనుచరులు, పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రదేశం నుంచి కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సాల్ట్ లేక్లోని ఐ-ప్యాక్ కార్యాలయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మమత చేతిలో ఉన్న ఆ ‘గ్రీన్ ఫైల్’ దృశ్యాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.పరస్పర తీవ్ర ఆరోపణలుమనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జరుగుతున్న విచారణను సీఎం అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా తమ పార్టీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని, అభ్యర్థుల జాబితాను, హార్డ్ డిస్క్లను లాగేసుకుంటున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. ‘ఓ పార్టీ వ్యూహాలను, పత్రాలను ఎత్తుకెళ్లడం అమిత్ షా బాధ్యతా?’ అని ప్రశ్నించిన మమత, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవాలని సవాల్ విసిరారు.బొగ్గు కుంభకోణం, హవాలా లింక్స్..ఈ మొత్తం వివాదానికి మూలం 2020లో అనూప్ మాఝీ అలియాస్ లాలాకు చెందిన అక్రమ బొగ్గు మైనింగ్ కుంభకోణం. ఈ స్కామ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ మాతృసంస్థ అయిన ‘ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు మళ్లించారని ఈడీ ప్రధాన ఆరోపణ. హవాలా ఆపరేటర్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ సంస్థకు బదిలీ అయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యాలను మాయం చేయడం ఏంటి?ఈ ఆరోపణలపై దాడులు జరుగుతుండగా, ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి సాక్ష్యాలను మాయం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాఫియాకు మద్దతు ఇస్తున్నారని.. ప్రభుత్వాలను కూల్చడానికి, ఏర్పాటు చేయడానికి ఐ-ప్యాక్ నేరుగా మాఫియా నుంచి డబ్బులు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. విచారణను అడ్డుకున్న మమతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తు సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశించి సాక్ష్యాలను తీసుకెళ్లడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.అరెస్టులు,ముమ్మర విచారణ..మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ నిబంధనలకు అనుగుణంగానే ఈడీ వ్యవహరించిందని, సరైన ఆధారాలు సమర్పించిందని ఢిల్లీ కోర్టు సైతం స్పష్టం చేసింది. దర్యాప్తు విస్తృతం కావడంతో డైరెక్టర్ రిషి రాజ్ సింగ్కు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడమే కాకుండా, ప్రతీక్ జైన్, ఆయన భార్య, సోదరుడి వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ నిఘా పెట్టింది.ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాక..2021 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ సంస్థ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇంకా కీలకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న ఈ దాడులు టీఎంసీ ప్రచార యంత్రాంగాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆ పార్టీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడిని ప్రభావితం చేసే ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. -
‘ఝాల్మురీ’ ఓ డ్రామా: మమత
కోల్కతా: ఝార్గ్రామ్లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ దుకాణం వద్ద ఆగి ‘ఝాల్మురీ’ని కొనుగోలు చేయడం ఒక డ్రామా అని సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ‘అదంతా ప్రణాళికతో చేసిందే. అనుకోకుండా జరిగితే∙అక్కడికి అన్ని కెమెరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ప్రధాని వెంట ఉండే భద్రతాధికారులే వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన జేబు నుంచి రూ.10 నోటు బయటకు తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఇదంతా నమ్ముతారా? మొత్తం డ్రామయే’ అని ఆమె అన్నారు. ‘మీకు అకస్మాత్తుగా ఝాల్మురీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను చేపలు, మాంసం తినకుండా అడ్డుకోవడాన్ని ఏమంటారు?’ అంటూ మోదీని సీఎం ప్రశ్నించారు. -
‘ఝాల్మురీ’కి విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 9 కోట్ల వ్యూస్ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్ సెర్చ్లో ‘ఝాల్మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. -
ట్రంప్ ఆదేశాలతోనే ఇజ్రాయెల్కు
తూత్తుకుడి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడం వల్లే ఇరాన్ యుద్ధానికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైళ్లు, అదానీ పుణ్యమా అని ట్రంప్ దూకమంటే దూకేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ సోమవారం తూత్తుకుడిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ తాను ఫోన్ చేస్తే సర్..అంటూ సంబోధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారని రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్ను తాను సర్ అని సంబోధిస్తాను కాబట్టి, తమిళనాడు సీఎం కూడా తనను సర్ అంటూ గౌరవించాలని మోదీ అనుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ అలా అనకపోవడం మోదీకి నచ్చడం లేదన్నారు. అందుకే, సర్..అంటూ గౌరవించే అన్నాడీఎంకే నేతను తమిళనాడు సీఎంగా కూర్చోబెట్టాలని, రాష్ట్రాన్ని పూర్తిగా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. అలా తమిళనాడు ప్రజలు ఎన్నటికీ జరగనివ్వరని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ మోడల్ను తమిళనాడులోనూ అమలు చేయాలని బీజేపీ ప్రయతి్నస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమిళ వ్యతిరేక సంస్థలని మండిపడ్డారు. -
హార్మూజ్ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్«దీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్ గరిమా’విజయవంతంగా హార్మూజ్ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్ చెప్పారు. -
మద్యం కేసులో కేజ్రీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసు విచారణ నుంచి తనను తప్పుకోవాలంటూ ఆప్ చీఫ్ కేజ్రీవాల్, తదితరులు వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తోసిపుచ్చారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలతో కక్షిదారు ఓ న్యాయమూర్తిని గురించి అంచనా వేయజాలరని ఆమె తన తీర్పు పేర్కొన్నారు. కక్షిదారు పక్షపాతపూరితంగా చేసే నిరాధార ఆరోపణలతో న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోరాదని పేర్కొన్నారు. సరైన కారణం చూపకుండా న్యాయవ్యవస్థను ఓ రాజకీయ నాయకుడు దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలను కొనసాగనివ్వ రాదని తెలిపారు. న్యాయమూర్తిపై వ్యక్తిగత దాడిని ఏకంగా న్యాయవ్యవస్థపైనే జరుగుతున్న దాడిగా ఆమె అభివరి్ణంచారు. ‘నన్ను విచారణ నుంచి తప్పుకోవాలంటూ వేసిన పిటిషన్లలోని అంశాలు కేవలం ఊహాగానాలు, అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ కోర్టు నా గౌరవం కోసం, న్యాయవ్యవస్థ కోసం గట్టిగా నిలబడుతుంది. నేను విచారణ నుంచి వైదొలగను’ అని స్పష్టం చేశారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా తన విషయంలో జస్టిస్ స్వర్ణ కాంత పక్షపాతంతో వ్యవహరించారని, అందుకే ఆమె ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేయడం తెల్సిందే. -
ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన రద్దు!
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ పర్యటన రద్దయింది. రాజస్తాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలోని చమురు శుద్ధి కర్మాగారంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మంగళవారం ఈ రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ అనూహ్య ప్రమాదం కారణంగా మోదీ రాజస్తాన్ పర్యటన రద్దు అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకనట విడుదల చేసింది. మంగళవారం రిఫైనరీ ప్రారంభోత్సవంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు సీఎం భజన్లాల్ శర్మ కార్యాలయం ధృవీకరించింది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం సాయంత్రం పచ్పద్ర వెళ్లాల్సిన సీఎం పర్యటన కూడా రద్దయ్యింది. కాగా ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు సోమవారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో హెచ్పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. -
ఇక బలీయ బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, దక్షిణ కొరియా నిర్ణయించుకున్నాయి. వార్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని తీర్మానించాయి. అంతేకాకుండా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఏడాది లోగా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సోమవారం ఢిల్లీలో సమావేశయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సరస్పర సహకారానికి సంబంధించి ఇరుదేశాల మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇంధనం, రక్షణ, అరుదైన ఖనిజాలు, నౌకా నిర్మాణం, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, లీ జే మ్యూంగ్ నిర్ణయించారు. ఇండియా–సౌత్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఒక ఉమ్మడి వ్యూహాత్మక విజన్ను ఆవిష్కరించారు. నౌకా నిర్మాణం, నౌకా రవాణా, సముద్ర రవాణా రంగాల్లో భాగస్వామ్యం కోసం ఒక సమగ్ర విధానాన్ని భారత్, దక్షిణ కొరియా విడుదల చేశాయి. ఇంధన భద్రతపై ఒక సంయుక్త ప్రకటనను సైతం వెలువరించాయి. భారత్లో కొరియన్ పారిశ్రామిక టౌన్షిప్ 2010లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించడమే లక్ష్యంగా చర్చలను పునఃప్రారంభించడంపై ఒక ఉమ్మడి ప్రకటనపై భారత్, దక్షిణకొరియా సంతకాలు చేశాయి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకొనే చర్యల్లో భాగంగా భారత్లో కొరియన్ పారిశ్రామిక టౌన్షిప్ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. వాతావరణ మార్పు, ఆర్కిటిక్, సముద్ర సహకారంపై చర్చల కోసం న్యూఢిల్లీ, సియోల్ ‘ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్’తోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖల ఫ్రేమ్వర్క్ను కూడా ప్రారంభించాయి. పశ్చిమాసియా పరిణామాలపై మోదీ, లీ జే మ్యూంగ్ చర్చించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు పెరుగుతుండడం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తామని భారత్, దక్షిణ కొరియా తేల్చిచెప్పాయి. అవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తమ రెండు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చెప్పారు. దీన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం అనేవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయని ఉద్ఘాటించారు. -
మహిళా రిజర్వేషన్లకు సరికొత్త ‘మార్గం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల’ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో పార్లమెంట్లో ఎదురైన సాంకేతిక, రాజ్యాంగపరమైన ఆటంకాలను అధిగమిస్తూ, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సరికొత్త రూపం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, న్యాయస్థానాల్లో నిలబడేలా పటిష్టమైన సవరణలతో బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏమిటా కొత్త వ్యూహం? ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కాలంటే అదే పాత పద్ధతిలో కాకుండా ‘ప్రత్యామ్నాయ మార్గాల’ను అన్వేషించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని భవిష్యత్తులో ఎవరూ కోర్టులో సవాల్ చేయకుండా, చేసినా అది వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధమైన లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టింది. గతంలో బిల్లు నిలిచిపోవడానికి కారణమైన వివాదాస్పద అంశాలపై చర్చలు జరపకుండానే, ఒక మధ్యేమార్గం ద్వారా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా వారికి లబ్ధి చేకూరేలా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. న్యాయ సలహాలు తీసుకోవడంతోపాటు ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో సవరణలు చేయబోతున్నారు. కోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేసి లోపాలు లేని ముసాయిదా రూపొందించబోతున్నారు. నిపుణుల కమిటీ కసరత్తు మహిళా రిజర్వేషన్ల విషయంలో సీనియర్ న్యాయ సలహాదారులు ప్రస్తుతం సవరణల ముసాయిదాపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రభుత్వ సంకల్పం చెక్కుచెదరలేదని, ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. మొత్తానికి శాసన, పరిపాలన వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. ఇవి 18,262 ట్రిప్స్ నడుస్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి. -
అమ్మో.. ఆ రోజు నేను చూసింది అదే!
"ఆ రోజు నేను చూసిన దారుణ దృశ్యాన్ని మరెవరూ జీవితంలో అలాంటిది చూడకూడదని ప్రార్థిస్తున్నాను" అని అబ్దుల్ వహీద్ వానీ అన్నారు. పహల్గామ్లో సమీపంలోని బైసారన్ పట్టణంలో ఏడాది క్రితం ముష్కర మూక సాగించిన రాక్షస పర్వాన్ని గుర్తు చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారు. కశ్మీర్లోని పహల్గామ్లో అతిపెద్ద గుర్రపు బగ్గీ కార్మికుల సంఘాలలో ఒకదానికి వహీద్ అధ్యక్షుడిగా ఉన్నారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఆనాటి బాధాకర విషయాలను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు.అది 2025, ఏప్రిల్ 22.. మధ్యాహ్నం సమయం. బైసారన్లో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందని అబ్దుల్ వహీద్ వానీకి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అక్కడికి సమీపంలోనే ఉన్న ఆయన తనకు బాగా తెలిసిన అడ్డదారిలో పోలీసుల కంటే ముందే ఘటనాస్థలానికి చేరుకున్నాడు. “నేను అక్కడికి చేరుకునేటప్పటికి.. ఒక మహిళ ఏడుస్తూ, ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.ఇదంతా చూశాక ఒక్క క్షణం నేను తిరిగి వెళ్లనేమో అనిపించింది. వెంటనే తేరుకుని సమీపంలోని దుకాణం వద్దకు పరుగెత్తి నీళ్ల సీసా తీసుకుని ఆమె వద్దకు తిరిగి వచ్చాను. వాటర్ బాటిల్ ఆమె అందించి.. పోలీసులు, అధికారులు వస్తున్నారని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత వెంటనే సుమారు 700 మంది గుర్రపు బగ్గీ కార్మికులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో సహాయం కోసం మెసేజ్ పెట్టాను. సంఘటనా స్థలానికి వచ్చి సాయం చేయాలని కోరారు. అయితే, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో సుమారు 15 మంది మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకోగలిగారు. గాయపడిన వారికి సహాయం చేయడానికి మేము శాయశక్తులా ప్రయత్నించాం.బైసారన్ చాలా పెద్ద ప్రాంతం, మృతదేహాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఒకచోట చేర్చడానికి సమయం పట్టింది. మృతుల్లో ఎక్కువ మందికి తలకు బుల్లెట్ గాయాలున్నాయి. ఘటనా స్థలాన్ని వదిలి రావడానికి ఓ మహిళ నిరాకరించింది. తన భర్త అక్కడే ఉన్నారని, తామిద్దరం ఇప్పుడే నడుస్తూ ఫోటోలు తీసుకుంటున్నామని, తాను ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలంటూ ఆమె రోదించింది. మృతదేహాల మధ్య ప్రాణాలతో పడి ఉన్న మరో వ్యక్తిని మేము గుర్తించాం. మేము అతడిని తాకినప్పుడు, అతను మాట్లాడాడు. అతని మెడ, చేతిపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఏం జరిగిందో అతడు మాతో చెప్పాడు.పరిమిత వనరులు ఉన్నప్పటికీ, స్థానికుల సహాయంతో గాయపడిన వారిలో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. ఒక వ్యక్తిని మేము భుజాలపై, ఆ తర్వాత మంచంపై మోసుకెళ్లాం. అతడు ప్రాణాలతో బయటపడ్డాడని అబ్దుల్ వహీద్ వానీ చెప్పారు. ఆ రోజు తాను చూసిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందే మెదులుతున్నాయని, మరపునకు రావడం లేదన్నారు. ఇలాంటి దారుణ విషాద దృశ్యాలను మరెవరూ చూడకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ చీకటి జ్ఞాపకాలు తరచుగా గుర్తుకు వస్తుంటాయని తెలిపారు. “ఆ జ్ఞాపకాలు తిరిగి వచ్చినప్పుడల్లా నన్ను నేను ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అటూ ఇటూ తిరుగుతాను, చేయడానికి ఏదైనా పని వెతుక్కుంటాను లేదా ఎవరికైనా ఫోన్ చేస్తాను” అని అబ్దుల్ వహీద్ వానీ వెల్లడించారు.చదవండి: అందుకే మహిళా బిల్లును ఓడించామన్న రాహుల్ గాంధీకాగా, గతేడాది ఏప్రిల్ 22న బైసారన్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానిక గుర్రపు బగ్గీ కార్మికుడు కూడా ఉన్నాడు. నవవధువు కళ్లెదుట ఆమె భర్తను అతి దారుణంగా కాల్చిచంపడం జాతి యావత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గామ్ దాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశంలోని ఉగ్రతండాలను నేలమట్టం చేసింది. -
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్–2 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్కార్డ్ను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్తో పాటు డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11.23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 2.5 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు అయ్యారు. -
పాపులర్ వెయిట్ లాస్ మందులు, షాకింగ్ స్టడీ
జనాదరణ పొందిన బరువు తగ్గించే మందుల వల్ల కండరాలు మరింత క్షీణించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి (UNC) చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గడానికి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సెమాగ్లుటైడ్ (Semaglutide) మరియు తిర్జెపాటైడ్ (Tirzepatide) వంటి ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా కండరాల క్షీణత (Muscle Loss) జరుగుతున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.ఈ మందులు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, కండరాల నష్టం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, బరువు తగ్గే ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల, ఊహించిన దానికంటే ఎక్కువ కండరాల క్షీణతకు దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' అనే జర్నల్లో ప్రచురితమైనాయి. దీనికి యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యూఎన్సీ గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఊబకాయం మరియు పోషణ నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నాయకత్వం వహించారు.ఈ అధ్యయనం ప్రకారం ఈ మందులు వాడుతున్న వారిలో తగ్గుతున్న మొత్తం బరువులో దాదాపు 35శాతం కండరాలకు సంబంధించిందే అని తేలింది. సాధారణంగా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గితే కండరాల నష్టం 2-10శాతం మాత్రమే ఉంటుంది, కానీ ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?మనం కేలరీలను తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కొత్త మందులు ఆకలిని 16-39% వరకు తగ్గిస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు, కానీ తగినంత వ్యాయామం (Resistance training) లేకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకికండరాల క్షీణత, నష్టాలుమెటబాలిజం మందగిస్తుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గితే మెటబాలిక్ రేటు తగ్గి, భవిష్యత్తులో బరువు పెరగడం సులభం అవుతుంది. అలాగే దైనందిన పనులు (మెట్లు ఎక్కడం, బరువులు మోయడం) చేసుకోవడం కష్టమవుతుంది. త్వరగా అలసట వస్తుంది. కండరాలు బలహీనపడితే శరీర సమతుల్యత దెబ్బతిని, కింద పడటం మరియు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రికవరీ ఆలస్యమవుతుంది. గాయాలు త్వరగా మానవు. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి. ముఖ్యంగా వృద్ధులలోఈ ప్రమాదం ఎక్కువ అని తేల్చారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత ప్రమాదకరం. ఇది వారిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూతదీన్ని ఎలా అరికట్టవచ్చుబరువు తగ్గే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరం. అంటే బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాల సాంద్రత పెరిగి, అవి కరిగిపోకుండా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో కేవలం మెషిన్ మీద అంకెలను మాత్రమే కాకుండా, శరీరంలోని 'లీన్ మాస్'ఎంత ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలి. -
బిహార్ అభివృద్ధిపై ఓ కన్నేసి ఉంచుతా : జేడీయూ చీఫ్ నితీష్
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జేడీయూ (JD-U) అధ్యక్షుడు నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బిహార్ అభివృద్ధి , పురోగతిపై తాను ఒక కన్నేసి ఉంచుతానని పేర్కొన్నారు. తన పార్టీ శాసనసభ్యులతో సమావే మైన సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి , పురోగతిపై తన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉండాల్సిన సమయం మినహా, మిగిలిన గరిష్ట సమయాన్ని తాను బిహార్లోనే గడుపుతానని నితీష్ కుమార్ పార్టీ నేతలకు తెలిపారు. ప్రభుత్వ పనులను నిశితంగా పర్యవేక్షిస్తూ, రాష్ట అభివృద్దిపై దృష్టి పడతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నందున, గతంలో తాను ప్రారంభించిన మంచి పనులు కొనసాగేలా చూస్తానని, దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జేడీయూ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకునే అధికారాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా నితీష్ కుమార్కే అప్పగించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకిఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నితీష్ కుమార్ ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ గత నెలలోనే జేడీయూలో చేరారు. అయితే, సామ్రాట్ చౌదరి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరించారు.నిశాంత్ను పార్టీ భవిష్యత్తు నాయకుడిగా అందరూ అంగీకరించారని, అయితే తాజా సమావేశంలో ఆయన పాత్ర గురించి ఎటువంటి చర్చ జరగలేదని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి? -
అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే భారీగా పరిపాలనా విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ భారీ నిర్ణయం తీసుకుంది.2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్పాల్ (Durga Shakti Nagpal) ను దేవీపటన్ డివిజన్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపింది. అప్పటి అఖిలేష్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను సస్పెన్షన్. కట్ చేస్తే.. ఇపుడు యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు. ఇంతకీ ఎవరీ దుర్గా శక్తి నాగ్పాల్?24 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అధికారి అయిన దుర్గా శక్తి నాగ్పాల్ ఘజియాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలు వాహనాలను అదుపులోకి తీసుకుని, పలువురిని అరెస్టు చేసిన తర్వాత 2013లో వార్తల్లో నిలిచారు. ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై పోరాడి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్పాల్. గతంలో ఆమె తన సాహసోపేతమైన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తాజాగా రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశాలను ధైర్యంగా ఎదుర్కొనే అధికారిణిగా పేరున్న దుర్గా శక్తి నాగ్పాల్కు కమిషనర్గా పదోన్నతి కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ బదిలీల్లో భాగంగా 15 జిల్లాల మేజిస్ట్రేట్లు (DMs), పలువురు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, సెక్రటేరియట్ స్థాయి అధికారులను మార్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక బాధ్యతలతో అందరి దృష్టిని ఆకర్షించి, పేరు దుర్గా శక్తి నాగ్పాల్.ఎవరీ దుర్గా శక్తి నాగ్పాల్?నోయిడాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఒక రాజకీయ దుమారాన్ని రేపడంతో పాటు, ఐఏఎస్ అసోసియేషన్ నుండి నిరసనలకు దారితీసింది. అంతేకాదు నిర్మాణంలో ఉన్న ఒక మసీదుకు అనుసంధానంగా ఉన్న గోడను కూల్చివేయమని ఆమె ఆదేశించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2013లొ సెప్టెంబర్లో ఆమె సస్పెన్షన్ను రద్దు చేశారు. ఆ వెంటనే ఆమె తిరిగి పరిపాలనా విధుల్లో చేరడం విశేషం.ఆగ్రాకు చెందిన దుర్గాశక్తి ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత ఐఆర్ఎస్కు అర్హత సాధించిన ఈమె, రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియాలో 20వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించారు. మొదట పంజాబ్ కేడర్లో మొహాలీలో పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను వివాహం చేసుకోవడంతో యూపీ కేడర్కు మారారు. (అభిషేక్ సింగ్ ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేసి నటనారంగంలో ఉన్నారు). గడిచిన సంవత్సరాలుగా, రాజకీయంగా సున్నితమైన సమస్యలను చేపట్టడానికి ముందుకొచ్చే దృఢమైన అధికారిణిగా నాగ్పాల్ పేరు సంపాదించు కున్నారు. అదే ఆమెకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులురాష్ట్ర స్థాయిలో, కీలకమైన శాఖలలో మార్పులు చోటుచేసుకున్నాయి. అశుతోష్ నిరంజన్ను రవాణా శాఖ కమిషనర్గా, కింజల్ సింగ్ను మాధ్యమిక విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. పాలనా దక్షతను పెంచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ 40 మంది అధికారుల బదిలీలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.మరికొన్ని కీలక మార్పులు:జిల్లా మేజిస్ట్రేట్ల మార్పు: ఆగ్రా, సహారన్పూర్, బులంద్షహర్, రాయ్బరేలీ వంటి కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.మనీష్ బన్సల్: ఆగ్రా డిఎంగా నియామకం.ఇంద్రజిత్ సింగ్: సుల్తాన్పూర్ డిఎంగా నియామకం.కుమార్ హర్ష్: బులంద్షహర్ డిఎంగా బాధ్యతలు.రాష్ట్ర స్థాయి మార్పులు: శుతోష్ నిరంజన్: రవాణా శాఖ కమిషనర్గా నియామకం. కింజల్ సింగ్: సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా బదిలీ.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి -
కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్లో ప్రైట్ జెట్ కుప్పకూలింది. సోమవారం జష్పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ విమానం కొండచరియను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జష్పూర్-నారాయణ్పూర్ అటవీ ప్రాంతంలో విమానం చెట్టును ఢీకొట్టింది. అనంతరం కొండ చరియల్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కొండను ఢీకొట్టడంతో విమానం నుండి దట్టమైన పొగ, మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. Jashpur - Reports of a possible aircraft crash have emerged from the Narayanpur region in Jashpur district of Chhattisgarh. According to preliminary information, an aircraft was seen flying at a low altitude over the hilly terrain before crashing. Thick plumes of smoke have been… pic.twitter.com/fX99UyuirT— NextMinute News (@nextminutenews7) April 20, 2026 -
రూ. 2.5 లక్షల లంచం : సోదాల్లో రూ. 37 లక్షలు, భారీగా బంగారం,వెండి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు చెందిన ఉన్నతాధికారి అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీజీసీఏలో పెండింగ్లో ఉన్న అనుమతులు మరియు ఆమోదాలను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన కేసు విచారణలో భాగంగా సీబీఐకి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి.రూ. 2.5 లక్షల లంచం ఆరోపణలతో డీజీసీఏ ఎయిర్వర్దినెస్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న అధికారిని, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని సిబీఐ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 18న కేసు నమోదు చేసిన సీబీఐ లంచం తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన భారీ నగదు , ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు ఏకంగా రూ. 37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు, వెండి నాణేలను గుర్తించారు. వీటితోపాటు పలు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై లోతైన విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి -
విజయ్ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్షో నిర్వహించారు.ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్ వద్దకు వచ్చింది. వారిని విజయ్ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్త దంపతులు విజయ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్ను ఆలింగనం చేసుకున్నాడు. విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. ఓట్ల కౌంటింగ్ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. #ThalapathyVijay Blessed a Newly Married couple during today's campaign..❣️🤝pic.twitter.com/FPHWZqd4oO— Laxmi Kanth (@iammoviebuff007) April 20, 2026 -
టీవీకే విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీవీకే అధినేత విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడిపై మండిపడింది. ఈ మేరకు విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.విజయ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరంబదూర్, తూర్పు తిరుచ్చి ఈ రెండు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ఒక చోట రూ.111కోట్లు..మరో చోట రూ.220 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాఖలైన పిటిషన్లో విజయ్ దాదాపూ 100కోట్ల ఆస్తుల వివరాలు దాచారంటూ కోర్టు తెలిపారు. ఆ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణలో ఒక చోట రూ.111కోట్లు ఒక చోట రూ.220 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఆస్తుల వివరాల ఎందుకు వెల్లడించారని విజయ్ని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది క్లరికల్ పొరటపాటు అనుకోవడానికి వీల్లేదు. రూ.100కోట్ల ఆస్తుల వివరాల్ని ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇవ్వాలని విజయ్కు జారీచేసిన నోటీసుల్లో సూచించింది. విజయ్తో పాటు ఆదాయపు పన్ను, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. Breaking: Madras High Court issues notice on plea alleging discrepancies in actor-politician Vijay’s election affidavits; seeks response from authorities including Election Commission. Court says "This is an irregularity. More than 100 crores not disclosed in one of the… pic.twitter.com/b09BhWcCng— Bar and Bench (@barandbench) April 20, 2026 -
అప్పుడు మాత్రమే హర్మూజ్ను దాటండి: భారత్
హర్మూజ్ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్ను జలసంధిని దాటే క్రమంలో భారత్కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్ నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్ను దాటుతున్నప్పటికీ ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా-ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్.. ఇక చేసేది లేక హర్మూజ్ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ హర్మూజ్ను దాటకండిఈ పరిస్థితుల నడుమ భారత్ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలు.. ఇరాన్ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. పర్షియన్ గల్ఫ్లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లారాక్ ద్వీపంఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది. -
రాజస్థాన్ రిఫైనరీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జైపూర్ : రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతులు మీదిగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 21, 2026) రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలోని పచ్పద్రలో దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను దేశానికి అంకితం చేయనున్నారు. రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ భారత్ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే,ఇప్పుడీ ఈ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న తొలి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్.ఇందులో క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేయడమే కాకుండా,పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు కానున్నాయి. #WATCH | Rajasthan: Fire broke out at Refinery-cum-Petrochemical Complex at Pachpadra in Balotra. Firefighters have arrived at the refinery to control the fire. More details awaited. pic.twitter.com/q7ztFGVbAA— ANI (@ANI) April 20, 2026 -
కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, కిద్వాయ్ నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందులునిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.UP man kiII twin daughters, wife demands death penalty Shashi Ranjan Mishra, a resident of UP's Kanpur slit throat and kiIIed his 11-year-old twin daughters- Riddhi and Siddhi. He has a 6-year-old son who was sleeping with her mother in separate room. Domestic dispute is… pic.twitter.com/X86b4vvxSC— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరుసీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే 11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. ఘటన పూర్వాపరాలు కాన్పూర్కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త తల్లి గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులుసీసీటీవీ నిఘా, దృశ్యాలు మరో షాకింగ్ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.మనసెలా ఒప్పింది..ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత -
అందుకే మహిళా బిల్లును ఓడించాం: రాహుల్ గాంధీ
కన్యాకుమారి: మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన పాపం విపక్షాలదే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్న బీజేపీ పన్నాగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామని వెల్లడించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కన్యాకుమారిలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.''మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్రతిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మహిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా తక్కువ చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోమ''ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వర్ణించారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.చదవండి: హమ్మయ్య! అమిత్ షా నవ్వారు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్ -
అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు
సాక్షి : నేడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ఖనిజ సంపదతో అలరారుతున్న . ఒకప్పుడు నిశ్శబ్దంగా అలలు ఎగసిపడే మహా సముద్రం అంటే నమ్మగలమా? కానీ, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇదే నిజాన్ని రూఢీ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, సింగ్భూమ్ ప్రాంతాలు 320 కోట్ల ఏళ్ల క్రితం విశాలమైన జలరాశిలో ఉండేవని, ఆధునిక ప్రపంచానికి ఇది అత్యంత పురాతనమైన 'సాగర రహస్యం' అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమి పరిణామ క్రమంలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. సుమారు 3.2 బిలియన్ అంటే 320 కోట్ల ఏళ్ల క్రితమే సింగ్భూమ్ ప్రాంతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది. అంటే, భూమిపై ఏర్పడిన అత్యంత పురాతన ఖండాంతర భూభాగాలలో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ లభించిన 'జిర్కాన్' స్పటిక రేణువుల విశ్లేషణ ద్వారా ఆ కాలంలోనే నదులు, తీర ప్రాంతాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులు..రాంచీ దాని పరిసర ప్రాంతాల్లోని శిలలు మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ ప్రియదర్శి ప్రకారం, ఇక్కడ కనిపించే ఇసుకరాయి, సున్నపురాయి, పగడపు శిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని స్పష్టం చేస్తున్నాయి.కాంగ్లోమరేట్లు.. నీటి ప్రవాహం వల్ల గుండ్రంగా మారిన రాళ్లతో కూడిన ఈ అవక్షేప శిలలు సముద్ర నిక్షేపణకు ప్రధాన సాక్ష్యం. పట్రాటు సమీపంలోని బెంటి బాగ్దా ప్రాంతంలో లభించే సున్నపురాయి సాధారణంగా నిస్సారమైన సముద్ర వాతావరణంలోనే ఏర్పడుతుంది. పట్రాటు నుండి బర్కగావ్ వెళ్లే దారిలోని రాళ్ల ఆకృతులు, ఒకప్పుడు అలల తాకిడికి గురై రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తాయి.కోట్లాది ఏళ్ల క్రితం భూమి లోపల జరిగిన టెక్టోనిక్ కదలికల కారణంగా ఒకప్పుడు నీటి అడుగున ఉన్న ఈ భూభాగం నెమ్మదిగా పైకి లేచింది. భారతదేశం 'గోండ్వానా ల్యాండ్'లో భాగంగా ఉన్న కాలంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దామోదర్ లోయ ప్రాంతం ఒకప్పుడు చిత్తడి నేలలు లేదా నిస్సార సముద్రంగా ఉండేదని, అందుకే అక్కడ నేడు భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయని నిపుణులు వివరిస్తున్నారు.సముద్రానికి, మానవ పరిణామానికి ఉన్న ఈ విడదీయలేని బంధాన్ని గుర్తుచేస్తూనే.. భారతదేశం ప్రతి ఏటా ఏప్రిల్ 5న 'జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని' జరుపుకుంటుంది. ప్రాచీన కాలం నుంచి సముద్ర వాణిజ్యంలో భారత్ అగ్రగామిగా ఉండటమే కాకుండా, మన నేల గర్భంలో దాగి ఉన్న ఇటువంటి భౌగోళిక రహస్యాలు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. నేడు మనం రాంచీ కొండలపై నిలబడి చూస్తున్న దృశ్యం వెనుక, కోట్లాది ఏళ్ల క్రితం సముద్రపు అలల సంగీతం దాగి ఉందన్నది కాదనలేని వాస్తవం.పసుపులేటి. వెంకటేశ్వరరావు -
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్లో నరరూప రాక్షసున్ని పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఘాజియాబాద్ జిల్లాకు చెందిన జీషన్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కోడలును అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం గొంతునులిమి చంపాడు. అనంతరం పారిపోగా తాజాగా పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఆ కిరాతకుడు మరణించాడు.పోలీసుల వివరాల ప్రకారంఏప్రిల్ 11 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపంశుభం తెలియని నాలుగేళ్ల పాప ఇంటి బయిట ఆడుకుంటుంది. అది గమనించిన జీషన్ అనే వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి తనకు తినుబండారాలు కొనిస్తానని ఆశచూపి తనతో తీసుకెళ్లాడు. అనంతరం ఆ పసికందును ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపాడు. ఏవరికి అనుమానం రాకుండా ఆ పసిపాప మృతదేహాన్ని కారుకింద పడేశాడు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిపై రూ. 50 వేల రివార్డు ప్రకటించారు.అయితే కొద్దిరోజుల క్రితం ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అతని జాడలు కనుక్కొన్నారు. అతని జాడకోసం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో అతను లోని ప్రాంతంలోని బాంతాల కెనాల్ వద్ద ఒకరిని కలవాల్సి ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతనిని పట్టుకోవడం కోసం పక్కా ప్రణాళిక వేశారు. నిందితున్ని పట్టుకునే క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరపగా ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి జైలు పాలయ్యాడు!
కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు. అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు. -
విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు
విమానం ప్రయాణం ఎంత సౌకర్యవంతమో, ఎంత విలాసవంతమో అంత భయానకం కూడా. విమానం టేక్ ఆఫ్ అయింది మొదలు ల్యాండ్ అయ్యేదాకా మన ప్రాణాలు గాల్లోనే. ఏదైనా తేడా వచ్చిందా అంతే సంగతులు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఫ్లై91 ప్రయాణీకులకు ఎదురైంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ గాలిలో 4 గంటల పాటు గడపాల్సి వచ్చింది.ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్ విమానం IC3401 (ATR టర్బోప్రాప్ AT7), సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా, అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు ల్యాండింగ్ను నిలిపి వేసి నాలుగు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. View this post on Instagram A post shared by NEWS9 (@news9live)సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పడంతో, ప్రయాణికులు భయంతో వణికిపోయారు, చాలామంది ఇష్టదైవాలకు ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవుడా, కాపాడు దేవుడా అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. రెండు చేతులు జోడించి, నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మహిళ తీవ్ర ఆవేదన చెందింది. కంటి ధారగా కన్నీరు కారుస్తూ మౌనంగా ప్రార్థించిన ఘటన ఎవ్వరి హృదయాన్నైనా కరిగించకమానదు. ఇంకా, భయంతోవణికిపోతూ, "ఓరి దేవుడా...ఇతను ఎందుకిలా చేస్తున్నాడు," అని ఒకరు, "ఏడవకు, ఏడవకు-ఏమీ కాదు. ఆగు," అని మరొకరు ఓదార్చడం ఈ వీడియోలో గమించనవచ్చు. గాలిలో ఊహించని పరిణామంతో గందరగోళానికి గురైన దృశ్యాల వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఆ విమానం ముండ్గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.మరోవైపు ‘‘పరిస్థితిని అదుపులోనే ఉంచుతున్నాం. మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాము. ఓపికగా ఉండండి, దయచేసి సూచనలను పాటించండి," అని పైలట్ ప్రయాణికులకు సూచిస్తున్నట్లు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఫ్లై91 ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వలేదని, నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. ఉద్రిక్త క్షణాలు, పలు ప్రయత్నాల తర్వాత, విమానాన్ని చివరికి దారి మళ్లించి, రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
ఎన్నికల వేళ డీఎంకే, కాంగ్రెస్లకు షాక్
తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్కమ్టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి. -
బైక్ ట్యాక్సీలకు భారీ షాక్..?
బెంగళూరు: బైక్ ట్యాక్సీల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నిర్ణయించాయి. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీల విధానానికి నియమావళి రూపొందించే ఉద్దేశం లేదని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనుంది. గతేడాది హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలను అనధికారికమని ప్రకటించి నిషేధించింది. అయితే ఈ జనవరి 23న ద్విసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆయా సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైక్ ట్యాక్సీలకు అవకాశం లేదని సర్కారు వాదించింది. మూడు నాలుగు రోజుల్లో బైక్ ట్యాక్సీల నిషేధం కోసం సుప్రీంలో పిటిషన్ సమర్పించనుంది. దీంతో వేలాదిమంది రైడర్లు అయోమయంలో పడిపోయారు. -
అటువంటి న్యాయవాదులను తొలగించాలి: జస్టిస్ బీ.వీ నాగరత్న
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.వీ నాగరత్న న్యాయమూర్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వేతనాలకు అనుగుణంగా జీవించలేక ప్రలోభాలకు గురయ్యే న్యాయమూర్తులను తమ పదవులను తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన 22వ వార్షిక రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ నైతికత, స్వతంత్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవల వచ్చిన 2వ పేకమిషన్ సిపారసులను అమలు చేయడం ద్వారా న్యాయమూర్తుల భద్రత మరింతగా మెరుగుపడిందన్నారు. అయితే చట్టబద్దంగా తమకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా జీవించలేక దురాశకు లోనయ్యే న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థ నుండి తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.ఒక న్యాయమూర్తి చేసే తప్పు కేవలం అతనికి మాత్రమే కాదని పూర్తి న్యాయవ్యవస్థపైనా ప్రభావం చూపుతుందన్నారు. అదే విధంగా న్యాయమూర్తులు కేవలం బయటి వ్యక్తుల నుండే కాకుండా, సహచర న్యాయమూర్తుల నుండి వచ్చే ఒత్తిళ్లకు కూడా లొంగకూడదన్నారు.తీర్పులు ఇచ్చే విషయంలో ఎటువంటి కో ఆర్డినేషన్ ఉండకూడదని ప్రభావితమై న్యాయమూర్తి ఇచ్చే తీర్పు అతని వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనంలా ఉండాలి కాని అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. అదే విధంగా న్యాయవాదులు తాము సమర్పించే తీర్పుల యథార్థతను ధృవీకరించాలని అల్గారిథమ్ల ప్రభావం నుండి న్యాయవ్యవస్థకు విముక్తి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.కోర్టులలో మహిళా న్యాయమూర్తులకు భద్రత, గౌరవం మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం న్యాయవ్యవస్థకు అత్యంత అవసరమన్నారు. హైకోర్టులు మరియు జిల్లా న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు మరియు సెలవుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మెుత్తంగా న్యాయం అనేది కేవలం యాంత్రికంగా కాకుండా, మానవత్వంతో కూడిన విచక్షణతో జరగాలని ఆమె తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కాగా జస్టిస్ నాగరత్న ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2027 సెప్టెంబరులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్ర్య భారత చరిత్రలో మెుట్ట మెదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డు సాధిస్తారు. -
జమ్మూ కశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
జమ్మూ కశ్మీర్: ఉదమ్పుర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయ్.. ఇక ఆరంభిద్దామా!
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్ను ముందు ఉంచింది. కమల్కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తమిళనాట టీవీకే అధినేత విజయ్కి యువత, మహిళలు, జెన్జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్ను ‘స్టార్’ క్యాంపెయినర్గా సీన్లో ఉంచింది. కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్డా, ఉత్తర్ దినాజ్పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. -
కోల్కతా డీసీ నివాసంపై ఈడీ దాడులు
కోల్కతా: మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శంతను సిన్హా బిస్వాస్తో పాటు జాయ్ కామ్దార్ అనే వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. దాడుల సమయంలో బిస్వాస్ అందుబాటులో లేరు. కామ్దార్ను విచారణ నిమిత్తం స్థానిక ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అరెస్టు చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఈ దాడులు, అరెస్టు చర్చనీయాంశమయ్యాయి. కేసులో ఏప్రిల్ 1న ఈడీ మొదటి విడత సోదాలు నిర్వహించింది. రూ. 1.47 కోట్ల నగదుతో పాటు రూ. 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్ట ఉల్లంఘనల అభియోగాలతో కోల్కత్తా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. -
చార్ ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. దీంతో, ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర తిరిగి మొదలైంది. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్లను, కెమెరాలను నిషేధించారు. చార్ ధామ్లో భాగమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు ఈ నెల 22, 23వ తేదీల్లో తెరుచుకోనున్నాయి. గతేడాది చార్ ధామ్ యాత్రలో 51 లక్షల మంది పాల్గొనగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 లక్షల మంది నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
మిస్ ఇండియా సాధ్వీ సతీశ్
భువనేశ్వర్: గోవా సుందరి సాధ్వీ సతీశ్ సైల్ 2026 సంవత్సరానికి ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన 61వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో దాదాపు 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజ్నందిని పవార్ తొలి రన్నరప్గా, జమ్మూ కశ్మీర్కు చెందిన డాక్టర్శ్రీ అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు. సాధ్వీ ఆత్మవిశ్వాసం, నిబ్బరం, ఆలోచనల్లో స్పష్టత ఆమెకు కిరీటాన్ని కట్టబెట్టాయి. 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. సామాజిక సేవలో ముందు గోవాలో జన్మించిన సాధ్వీ సతీశ్ ఉన్నత విద్య అభ్యసించారు. కెనడాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ చేశారు. మో డల్గా పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించారు. నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టారు. ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. సామాజిక సేవ రంగంలోకీ దిగారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్నారు. బధిర చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియా గోవా–2026 కిరీటం కూడా దక్కించుకున్నారు. -
ఐఎస్ఎస్లో అమెరికా వ్యోమగామి ‘బిహూ’
గువాహటి: అమెరికా వ్యోమగామి మైక్ ఫిన్కె (59) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అస్సాం సంప్రదాయ నృత్యం బిహూను ప్రదర్శించి అలరించారు. అస్సాంలో నూతన సంవత్సరాది ‘రొంగలి బిహూ’ జరుపుకుంటున్న వేళ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అందులో ఫిన్కె అస్సాం సంప్రదాయ కండువా వేసుకుని బిహూ నృత్యం చేస్తూ కన్పిస్తున్నారు. ఆయన అస్సాంకు చెందిన రెనిటా సైకియాను పెళ్లాడారు. రెండు రోజుల క్రితం అప్లోడ్ చేసిన వీడియోను ఎప్పుడు తీశారనేది వెల్లడి కాలేదు. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హర్షం వెలిబుచ్చారు. అస్సాం సంసృతీ సంప్రదాయాల గొప్పతనం విశ్వవ్యాప్తమైందని ఎక్స్ పోస్ట్లో ఆయన పేర్కొన్నారు. ఫిన్కె 2004లో ఐఎస్ఎస్కు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి వీడియోను షేర్ చేశారు. -
ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృత్యువాత
రోమ్: ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్ పారిశ్రామిక కోవో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వైశాఖి పండుగ వేళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గురుద్వారా మాతా సాహిత కౌర్ జీలో ప్రార్థనల అనంతరం బయటకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను కోవోకు చెందిన రగీందర్ సింగ్(48), అగ్నడెల్లో వాసి గుర్మీత్ సింగ్(48)గా గుర్తించారు. దుండగుడు వారిపై అతి సమీపంలో నుంచి కాల్పులు జరిపి, కారులో పరారయ్యాడని మీడియా తెలిపింది. అంతకుముందు వారి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. తరచూ గురుద్వారాకు వచ్చే ఓ భారతీయుడే పథకం ప్రకారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. -
లూటీలో తృణమూల్ పీహెచ్డీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 15 ఏళ్ల పాలనలో దోపిడీలో పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చొరబాటుదార్ల అభివృద్ధిలోనే తృణమూల్కు అమితాసక్తి ఉందని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలతో యువత, మహిళలు, రైతన్నలను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని ఆరోపించారు. చొరబాటుదార్ల ఓట్లతో కేవలం వారి మేలుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ భావిస్తోందని మండిపడ్డారు. ప్రధాని ఆదివారం బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణ్గఢ్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈసారి పోటీ తృణమూల్ లూటీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బీజేపీ అభివృద్ధి ఎజెండాకు మధ్యేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కోరితే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్నారు. అభివృద్ధి జాడే లేదు ‘‘భారత్ 3జీ నుంచి 5జీకి ఎదిగింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాం. బెంగాల్లో మాత్రం అభివృద్ధి జాడే లేదు’’ అంటూ మోదీ దుయ్యబట్టారు. ‘‘మమత పాలనలో అవినీతి, ఉద్యోగాల కొరత తప్ప ఇంకేమీ లేదు. ఉపాధి లేక బెంగాల్ మహిళలు ఢిల్లీ, ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను చొరబాటుదార్లకు తృణమూల్ పంచిపెడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అడ్డుకుంటాం. ఇది నా హామీ! తృణమూల్ దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. చొరబాట్లతో బెంగాల్ భాష, సంస్కృతి మారిపోతున్నాయి. మమత ప్రభుత్వం గిరిజన భాషలను, గుర్తింపును అవమానిస్తోంది. మదర్సాలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ సంతాలీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజనుల భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తృణమూల్ నేతలకు లంచమివ్వనిదే ఒక్క పనీ జరగడం లేదు. లంచాల సంస్కృతిని తట్టుకోలేక పరిశ్రమలు రాష్ట్రం వీడాయి. అవినీతితో ఉపాధి సంక్షోభం పెరిగింది. ఉద్యోగాల్లేక యువత అలమటిస్తోంది’’ అని విమర్శించారు. మహిళలకు తీరని ద్రోహం మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి లోక్సభలో తెచ్చిన బిల్లును అడ్డుకుని మహిళలకు తృణమూల్ తీరని ద్రోహం చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘2029 నుంచే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల ఆకాంక్షలతో కాంగ్రెస్తో కలిసి తృణమూల్ సమాధి కట్టింది. తద్వారా బెంగాల్ సోదరీమణులనూ దగా చేసింది. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. కొన్ని జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటూ గెలవదని నా రాజకీయ అనుభవంతో చెప్పగలను’’ అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. మాతృశక్తి భరోసా పథకం కింద వారికి ఏటా రూ.36,000, గర్భిణులకు రూ.21,000, కుమార్తెల చదువుకు రూ.50,000 ఇస్తాం. వరి మద్దతు ధర క్వింటాల్కు రూ.3,100కు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు. ఝాల్మురీ రుచికిమోదీ ఫిదాబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. రుచెలా ఉందని దుకాణదారు ప్రశ్నించగా ఉప్పు తప్ప అన్నీ బాగున్నాయని బదులిచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా తాను ఉప్పు వాడడం లేదని చెప్పారు. ఝాల్మురీ ఆరగిస్తున్న ఫొటో, వీడియోను మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
శ్రీనగర్లో అమెరికా వాసి అరెస్ట్.. రీజన్ ఇదే
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ ఎయిర్పోర్టువద్ద షాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నారనే నెపంతో ఒక అమెరికా దేశస్థునితో పాటు కోల్కతాకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు.పోలీసుల విచారణలో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న వారిలో ఒకరు అమెరికాకు చెందిన జేప్రీ స్కాట్ ప్రాథర్గా గుర్తించారు. మరోకరు కోల్కతా నివాసైన హల్దార్ కౌశిక్గా తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రాంతం పాకిస్థాన్కు సరిహద్దుల్లో ఉండడం ఉగ్రవాద ముప్పు పొంచి ఉండడంతో భద్రతా బలగాలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నాయి. దానిని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.శాటిలైట్ ఫోన్ అంటే ఏమిటి?మనం సాధారణంగా వాడే మెుబైల్ఫోన్ సిగ్నల్స్ భూమిపై ఉండే సెల్ టవర్ల (సెల్ టవర్స్) మీద ఆధారపడతాయి. ఒకవేళ మీరు టవర్లు లేని అడవిలోనో లేదా సముద్రం మధ్యలోనో ఉంటే సాధారణ ఫోన్లకు సిగ్నల్ రాదు. కానీ, శాటిలైట్ ఫోన్ నేరుగా ఆకాశంలోని ఉపగ్రహంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది కనుక దీనికి ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. సాధారణంగా మిలిటరీ యుద్ధ సమయాల్లో లేదా మారుమూల ప్రాంతాల సమాచార మార్పిడి కోసం దీనిని ఉపయోగిస్తారు. పర్వతారోహకులు ఎవరెస్ట్ వంటి శిఖరాలు అధిరోహించేటప్పుడు లేదా దట్టమైన అడవుల్లోకి వెళ్ళినప్పుడు దీనిని అధికంగా వాడుతుంటారు.ఎందుకు నిషేదంఅయితే వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని కనుక భారత్లో వీటి వాడకంపై నిషేదం విధించారు. ఒకవేళ ఎవరైనా దానిని వాడాలంటే టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీయులు దానిని తీసుకరావాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్
కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెంగాల్లోని బిష్ణుపూర్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్ బ్రాండ్ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్సభలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 20 మంది మృతి
చెన్నై: తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్పట్టి ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వనజ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. కర్మాగారంలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మొదట నలుగురు మరణించినట్లు సమాచారం వచ్చినా, కొద్ది సమయంలోనే మరణాల సంఖ్య భారీగా పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని, కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆదివారం(ఏప్రిల్ 19వ తేదీ) హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ అజెండాగా మమతా అభివర్ణించారు.శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. -
‘హలో.. పోలీస్ స్టేషనా? నా కూతుళ్లను చంపేశాను సర్’
కాన్పూర్: కన్న కుమార్తెలన్న ప్రేమ కూడా లేదు. అభం శుభం తెలియని పసివాళ్లన్న జాలి కూడా లేకుండాపోయింది. రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. ఆ తర్వాత, పోలీసులకు ఫోన్ చేసి తన కూతుళ్లను హత్య చేశానని పోలీసులకు చెప్పాడు.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. శశి రంజన్ మిశ్రా (48) తన 11 సంవత్సరాల కవల కూతుళ్లను పదునైన ఆయుధంతో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున అతని ఫ్లాట్లో జరిగింది. శశి రంజన్ మిశ్రా మెడికల్ రిప్రెజెంటేటివ్గా పనిచేస్తుంటాడు.బిహార్కు చెందిన అతను భార్య రేష్మా, జంట కూతుళ్లు రిద్ధి, సిద్ధి, కుమారుడు (6)తో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని శశి రంజన్ మిశ్రా అనుమానించాడు. తరచుగా ఆమె కుమారుడితో ఉండాలని, తాను కూతుళ్లను చూసుకుంటానని చెప్పేవాడు.రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. శశి డిప్రెషన్తో బాధపడుతున్నాడు. ఇంట్లో అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కూతుళ్ల గదుల్లోకి ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత శశి కూతుళ్లను నిద్రపొమ్మన్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక కూతురిని బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి గదికి వచ్చి లైట్లు ఆపేశాడని ఆమె తెలిపింది. రెండు గంటల తర్వాత అతను పోలీసులకు కాల్ చేసి తాను హత్య చేశానని తెలిపాడు. ఫ్లాట్కు చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలికలు రక్తపు మడుగులో కనపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన రేష్మా కాన్పూర్లో బ్యూటీ పార్లర్లో పని చేస్తూ శశిని కలిసింది. 2014లో వారి వివాహం జరిగింది. “శశిని అరెస్ట్ చేశాం, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారని చెప్పారు. -
భారత్లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?
న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. ప్రస్తుతం భారత్కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
మమతా సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయి: ప్రధాని మోదీ
బిష్ణుపూర్: బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్లోని బిష్ణుపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై మమతకు చురకలు అంటించారు. మహిళలు ఎమ్మెల్యేలు కావడం టీఎంసీకి ఇష్టం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్తో కలిసి టీఎంసీ కుట్ర చేసిందన్న మోదీ.. మమతా సర్కార్పై బెంగాల్ ప్రజలు కోపంతో ఉన్నాయన్నారు. మమతా సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారుప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకున్నారు. 2029 నుండి ఇది అమలు కావాలని బెంగాల్ మహిళలు ఆకాంక్షించారు. మహిళ రిజర్వేషన్లకు మేం కృషి చేశారు. కానీ టీఎంసీ.. కాంగ్రెస్తో కలిసి కుట్ర పన్నింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకుంది’’ అని మోదీ మండిపడ్డారు.మమతా సర్కార్ను కనికరం లేని ప్రభుత్వంంగా మోదీ అభివర్ణించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాతావరణం, ఉత్సాహం, ప్రేమ, ఆనందం మమతా ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి చిహ్నాలు. ఇది మా శారదా దేవి నడయాడిన పవిత్ర భూమి, ఇక్కడ ఎంతో మంది మహిళలు హాజరయ్యారు. బీజేపీ అంటేనే మహిళా సాధికారత, రక్షణకు మారుపేరు, అందుకే మహిళలు బీజేపీని ఎక్కువగా దీవిస్తారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర మరింత విస్తరించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు. -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్గా లేకపోవడం.. సడెన్గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
సీఎం మార్పు తప్పదా?
సాక్షి బెంగళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతుండడం తెలిసిందే. సీఎం సిద్ధరామయ్యతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న నేతలను డీకే శివకుమార్ వర్గీయులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పారీ్టలో ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీకే శివకుమార్ బాహాటంగా హెచ్చరించడంతో పాటు ఇటీవల కాలంలో కొందరిపై పడిన వేటును గుర్తు చేసుకుని సీఎం వర్గీయుల్లో భయం అలుముకుంది. సీఎం అనుచరులు వరుసగా పదవులను కోల్పోతున్నారు. దీంతో సిద్దు కుర్చీ కూడా డోలాయమానంలో పడిందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ విధానసభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక రాజకీయాలపై హైకమాండ్ నాయకులు దృష్టి సారించనున్నారు. మే 20తో సిద్ధరామయ్య సీఎం అయ్యి మూడేళ్లు పూర్తి అవుతుంది. అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య రికార్డు కెక్కారు. సిద్ధరామయ్య పదవిని వదులుకోవాల్సి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ నేతలను డీకే శికుమార్ ఒప్పించారని, జూన్ నాటికి కుర్చీ మారి్పడి తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తోంది. -
ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యను అంతమొందించాలని వేధింపులు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
తప్పుడు ప్రకటనలకు గూగుల్ చెక్
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు, మోసపూరిత ప్రకటనలు పెద్ద సవాల్ విసురుతుండగా టెక్ దిగ్గజాలు ఏఐ సాయంతో వాటికి చెక్ పెడుతున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించిన వందల కోట్ల యాడ్స్ను నిలువరించినట్లు సెర్చ్ ఇంజన్ రారాజు గూగుల్ తెలిపింది. 60 కోట్ల మోసపూరిత ప్రకటనలు.. సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు 90 శాతానికిపైగా వాటా ఉంది. గూగుల్ లక్షలకొద్దీ వెబ్సైట్లలో కోట్లకొద్దీ ప్రకటనలను ప్రదర్శిస్తోంది. ఆటోమేటెడ్ తనిఖీలు ఉన్నప్పటికీ ప్రకటనల సంఖ్య విపరీతంగా ఉండటంతో కొన్ని హానికరమైన యాడ్స్ కూడా ప్రదర్శితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది నిబంధనలను ఉల్లంఘించిన 830 కోట్ల ప్రకటనలను గూగుల్ నిరోధించడం లేదా తొలగించడమో చేసింది. అలాగే 2.49 కోట్ల ప్రకటనకర్తల ఖాతాలను రద్దు చేసింది.భారత్లో నిబంధనలకు పాతరేసిన 48.37 కోట్ల యాడ్స్ను గూగుల్ తొలగించింది. 17 లక్షల ప్రకటనకర్తల ఖాతాలను నిలిపివేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, పెద్ద కంపెనీల పేర్లను వాడుకొని అవి నిజమైన కంపెనీలే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, ఇతర కంపెనీల లోగోలు, ఫొటోలు, కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకొని రూపొందించిన యాడ్స్ వాటిలో ఉన్నాయి. తాము చెక్ పెట్టిన యాడ్స్లో స్కామ్లకు సంబంధించిన 60.2 కోట్ల ప్రకటనలు, 40 లక్షల ఖాతాలు ఉన్నాయని కంపెనీ 2025 యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్లో వెల్లడించింది. నేరగాళ్ల చేతిలోనూ ఏఐ..ఇంత భారీ మొత్తంలో ఉన్న మోసపూరిత ప్రకటనలను మనుషులు తనిఖీ చేయడం అసాధ్యం. పైగా ఇటువంటి యాడ్స్ను పెద్ద ఎత్తున సృష్టించడానికి సైబర్ నేరగాళ్లు ఓ అడుగు ముందుకేసి జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. వాటిని రియల్ టైమ్లో గుర్తించి అడ్డుకోవడానికి జెమినై ఏఐ సాయం తీసుకుంటున్నట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఏఐ మోడల్స్ వందల కోట్ల రకాల సంకేతాలను.. అంటే ఒక అకౌంట్ ఎంత పాతది, వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది, ప్రకటనలు ఇచ్చే విధానం వంటి అంశాలను తనిఖీ చేస్తుంది. వైరస్లు లేదా హ్యాకింగ్ ముప్పులు యూజర్లకు చేరకముందే ఈ వ్యవస్థ వాటిని గుర్తించి ఆపేస్తుందని గూగుల్ తెలిపింది. 830 కోట్ల యాడ్స్లో వాటిని ఎవరూ చూడకముందే 99% కంటే ఎక్కువగా నిరోధించినట్లు కంపెనీ వెల్లడించింది. -
మోదీ గుట్టు ట్రంప్కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు!
కైరో/న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుతున్నాయి. ఆ జలసంధిని తెరిచినట్టు ఇరాన్ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్మూజ్ను దాటుతున్న రెండు భారత చమురు నౌకలపై శనివారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ)కి చెందిన స్పీడ్ బోట్లు కాల్పులకు దిగాయి. దాంతో అవి జలసంధిని దాటకుండానే వెనుదిరిగినట్టు అంతర్జాతీయంగా నౌకల రాకపోకలను ట్రాక్ చేసే టాంకర్ట్రాకర్స్ డాట్కామ్ తదితర సంస్థలు వెల్లడించాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. అంతేగాక ఇరాన్ చర్యపై తీవ్ర నిరసన కూడా వెలిబుచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐఆర్జీసీ కాల్పులతో మరో నాలుగు భారత చమురు నౌకలు హార్మూజ్ను దాటకుండానే వెనుదిరిగాయి. చమురు, సహజవాయువు, ఎరువుల నిల్వలతో కూడిన 13 భారత నౌకలు ప్రస్తుతం జలసంధి వద్ద చిక్కుబడి ఉన్నాయి. అవి సురక్షితంగా హార్మూజ్ దాటేలా ఇరాన్తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ‘దేశ్ గరిమ’ అనే చమురు నౌక శనివారం హార్మూజ్ను దాటి భారత్వైపు బయల్దేరినట్టు తెలుస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్ తాజాగా ప్రకటించింది. తమ ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి పలకని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దిగ్బంధం కొనసాగినంత కాలం హార్మూజ్ను తెరవబోమని ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. త్వరలో ఒప్పందానికి రానిపక్షంలో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. అంతేగాక ఇరాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అణు కార్యక్రమంతో పాటు అన్ని అంశాలపైనా ఇరాన్ తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా అధ్యక్షుడు స్పష్టం చేశారు. దాంతో పశి్చమాసియాలో పరిస్థితులు మళ్లీ విషమించేలా కన్పిస్తున్నాయి. త్వరలో చర్చలు! అమెరికా, ఇరాన్ నడుమ మరో దఫా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఆ రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగుస్తుండటం తెలిసిందే. ఆ లోపే చర్చలు జరిగే అవకాశమున్నట్టు పాక్ పేర్కొంది. చర్చల నిమిత్తం పంపిన అమెరికా నూతన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెల్లడించింది. ఇప్పటిదాకా 23 నౌకలు వెనక్కు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటి నుంచీ ఇప్పటిదాకా హార్మూజ్ జలసంధి వద్ద 23 నౌకలను అడ్డగించి వెనక్కు పంపినట్టు అమెరికా పేర్కొంది. ఆ దేశ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించింది. ఇరాన్ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతమంతటా నౌకల రాకపోకలపై నిషేధం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13న అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి దిగింది.తీవ్ర పోరుకు సిద్ధం: మొజ్తబా శత్రువులపై తీవ్ర పోరాటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. వారికి భారీ ఓటమి రుచి చూపేందుకు ఇరాన్ నావికా దళం ఇప్పటికే సర్వ సన్నద్ధంగా ఉందని శనివారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వ్యవస్థాపక దినం సందర్భంగా సాయుధ దళాలకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ప్రత్యేకంగా ప్రశంసించారు. లెబనాన్లో శాంతిదళాలపై కాల్పులు → ఒక ఫ్రెంచి సైనికుని మృతి → హెజ్బొల్లా పనేనన్న మాక్రాన్ పారిస్: లెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పుల్లో ఒక ఫ్రెంచి సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ మేరకు వెల్లడించారు. తమ దేశానికి చెందిన మరో ముగ్గురు సైనికులు గాయపడ్డట్టు తెలిపారు. దక్షిణ లెబనాన్లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టులో మాక్రాన్ వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిని లెబనాన్ ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యురేనియం అప్పగించబోం: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందనే అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్జాదే పూర్తిగా ఖండించారు. అంతేగాక, ‘‘అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది. కనుక ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నట్టు అంచనా. -
బీజేపీ పతనం మొదలైంది
హౌరా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ లక్ష్యంగా టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకోవడంలో విఫలమైన కాషాయ పార్టీ పతనం మొదలైందన్నారు. పార్లమెంట్లో సొంత మెజారిటీ లేని బీజేపీ ఎన్డీయేలోని రెండు పారీ్టల మద్దతుతో మాత్రమే మనుగడ సాగిస్తున్న విషయం శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలతో మరోసారి రుజువైందని విమర్శించారు. సీఎం మమత శనివారం హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మహిళా రిజర్వేషన్ అంశంతో ముడిపెట్టడమెందుకంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. అసలు కుట్రను బయటపడకుండా దాచేందుకే ఇలాంటి ప్రయత్నం చేసిందంటూ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మోదీజీ, శుక్రవారం నుంచి మీ పతనం ప్రారంభమైంది. లోక్సభలో మీరు ఓడిపోయారు. క్షేత్రస్థాయిలోనూ మీకు ఓటమి తప్పదు. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని ఇంటిదారి పట్టిస్తారు’అంటూ హెచ్చరించారు. బీజేపీ కంటే ఎంతో ముందుగానే 1998లోనే మహిళా రిజర్వేషన్ డిమాండ్ను తాను తెరపైకి తెచ్చానన్నారు. బీజేపీ మాత్రం ఇప్పుడు తామే మహిళా రిజర్వేషన్లకు కారణమనే వాదనను ప్రచారం చేసుకుంటోందంటూ మమత ఆరోపించారు. బీజేపీ ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను బలహీనపర్చడానికేనంటూ ఆరోపించారు. ‘దేశాన్ని ముక్కలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. బెంగాల్తోపాటు అన్ని రాష్ట్రాలను విడదీస్తుంది. అందుకే లోక్సభ సీట్లను పెంచేందుకు బీజేపీ ముందుకు వచి్చంది. ఇది చాలా కీలక అంశం అయినందునే మా పార్టీ ఎంపీలంతా శుక్రవారం పార్లమెంట్కు హాజరయ్యారు. బిల్లును ఓడించారు. బెంగాల్ను విభజించేందుకు మేం ఒప్పుకోం’అని మమత స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై బీజేపీ తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ పార్లమెంట్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు సగం సీట్లను కేటాయించామని చెప్పారు. బిహార్ తాజామాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఎన్నికల్లో నితీశ్ను వాడుకున్న బీజేపీ, అనంతరం ఆయన్ను పక్కనబెట్టిందని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలు పంచుతున్న దరఖాస్తులను నింపవద్దని సీఎం మమత రాష్ట్ర మహిళలను కోరారు. -
బాధాకరమే.. పరాజయం కాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. -
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి. -
మహిళలు క్షమించరు!
న్యూఢిల్లీ: నారీ శక్తికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న పవిత్రమైన ఆశయంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించిన పాపం పూర్తిగా విపక్షాలదేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. వాటి ముసుగు తొలగి అసలు రంగు బయట పడిందన్నారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయాం. ఇందుకు దేశ మహిళలందరితో పాటు నేను కూడా ఎంతగానో దుఃఖిస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్సభలో వీగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ తదితర విపక్షాలు దేశ మహిళల చిరకాల ఆకాంక్షను అత్యంత కర్కశంగా నలిపేశాయి. బిల్లును ఓడించడం ద్వారా భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. పైగా అందుకు నిండు సభలోనే సంబరాలు చేసుకున్నాయి. బల్లలను చరుస్తూ హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. మహిళల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా గాయపరిచాయి’’అంటూ తూర్పారబట్టారు. మహిళల ఆకాంక్షలను ఆ పార్టీలు కాలరాసిన తీరును దేశ పౌరులంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘విపక్షాల పాపానికి ఎన్నటికీ నిష్కృతి లేదు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మహిళా శక్తిని విపక్షాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ భారత మహిళ దేన్నయినా మర్చిపోతుందేమో గానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించబోదు. రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ తదితర పార్టీలు తలపెట్టిన ద్రోహాన్ని మహిళలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అవి ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్పి తీరతారు’’అని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు జరుగుతున్న కృషి విపక్షాల స్వార్థ రాజకీయాల కారణంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘లోక్సభలో మాకు సంఖ్యా బలం లేకపోయింది. అయినా నిరాశ పడబోం. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు, రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉంటాయి. ఆ మార్గంలో నెలకొన్న ప్రతి అడ్డంకినీ తొలగించి తీరతాం’’అని ప్రకటించారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను మేం సాధించలేకపోవచ్చు. కానీ దేశ మహిళల ఆశీర్వాదాలు మాత్రం 100 శాతం మాతోనే ఉన్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు. పునాదులు కదులుతాయని భయం! కుటుంబాల చెప్పుచేతుల్లో నడిచే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ వంటి పార్టీలు మహిళల ఎదుగుదలను సహించలేవని మోదీ ఆరోపించారు. ‘‘మహిళలను ఎదగనిస్తే తమ స్వార్థ రాజకీయ పునాదులు పూర్తిగా కదిలిపోతాయని వాటి భయం. అధికారం ఎప్పటికీ తమ కుటుంబానికే పరిమితం కావాలని కోరుకుంటాయి. తమ కుటుంబంలోని మహిళలు తప్ప దేశ మహిళల రాజకీయ ఎదుగుదల సహించలేవు’’అంటూ ఎద్దేవా చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం దక్కడం తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ల అంశం 40 ఏళ్లుగా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు. ‘‘అందుకే మహిళల సమున్నత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే ఉదాత్త లక్ష్యంతోనే సవరణ బిల్లు తెచ్చాం. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర... ఇలా ప్రాంతాలవారీగా సమతుల్యతతో దెబ్బతినకుండా నిజాయతీతో కృషి చేశాం. లోక్సభలో ప్రతి రాష్ట్రానికీ ప్రస్తుతమున్న ప్రాతినిధ్యం సంఖ్యాపరంగానే గాక నైష్పత్తికంగా కూడా యథాతథంగా కొనసాగేలా చూశాం. ఇదే విషయాన్ని విపక్షాలన్నింటికీ పదేపదే చెప్పాం. అయినా దేశ హితం, మహిళా సాధికారత కంటే స్వార్థానికే అవి పెద్దపీట వేశాయి. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించాయి. రాజ్యాంగం ముందు, దేశ మహిళా శక్తి ముందు నేరస్తులుగా నిలబడ్డాయి’’అంటూ మండిపడ్డారు. ‘‘లోక్సభ స్థానాల పెరుగుదలతో తమిళనాడు, పశ్చమబెంగాల్ గొంతుకను పార్లమెంటులో మరింతగా విన్పించే సువర్ణావకాశం అక్కడి అధికార పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్కు వచ్చింది. దాన్ని అవి కాలదన్నాయి’’అంటూ ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. విపక్షాల అసలు ఉద్దేశాలను వారు అర్థం చేసుకుంటున్నారు’’అంటూ హెచ్చరించారు. పరాన్నజీవిలా కాంగ్రెస్! కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆ పార్టీది ఆది నుంచీ ప్రతికూల భావజాలమేనంటూ దుయ్యబట్టారు. దేశ వెనకబాటుకు, అది ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కాంగ్రెసే ఏకైక కారణమని ఆరోపించారు. ‘‘సంస్కరణలకు కాంగ్రెస్ నిత్య వ్యతిరేకి. ఆ పేరు వింటేనే ఉలిక్కిపడుతుంది. జాతి నిర్మాణానికి, మెరుగుదలకు ఉద్దేశించి ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటూ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. దశాబ్దాలుగా ప్రతి సంస్కరణనూ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. జన్ధన్ యోజన మొదలుకుని ఆధార్, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ దాకా ఇందుకు తార్కాణాలెన్నో. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లను, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దునూ కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించింది’’అంటూ ఆక్షేపించారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతోంది. ప్రజాదరణ, సొంత బలం కోల్పోయి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ఆ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం కావొద్దని కోరుకుంటోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్ గుడ్డి వ్యతిరేకిస్తోంది. సవరణ బిల్లుకు మద్దతిచ్చి ఆ తప్పిదాలను సరిచేసుకుంటుందని, కొత్త చరిత్ర లిఖిస్తుందని ఆశించా. కానీ ఆ చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆ పార్టీ నమ్ముకున్నది విభజన రాజకీయాలను మాత్రమే. అందుకే ఉత్తరాది, దక్షిణాది విభజన అంటూ డీలిమిటేషన్పై అవాస్తవాలను ప్రచారం చేసింది’’అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల భావజాలానికి దేశ మహిళలు తగిన రీతిలో బదులిచ్చి తీరతారని హెచ్చరించారు. -
రైలు టికెట్ రహస్యం తెలుసా?
భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?ఏమిటీ పీఎన్ఆర్?పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.పది అంకెలే ఎందుకంటే..లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్ను రైల్వే ఎంచుకుంది.ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్ను తెలియజేస్తాయి.చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.పీఎస్ఆర్ వ్యవస్థ ఎందుకు కీలకం?కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్ఆర్లో గమనించండి. -
’మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలను నాశనం చేశారు. దేశహితమే మాకు ముఖ్యం’ అని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి‘ అని మోదీ ప్పారు.కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు‘మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు.. మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది.కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించా. కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. మిత్రపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. కానీ, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్పై దుష్ప్రచారం చేశారు’ అని మోదీ తెలిపారు. -
తమిళనాట ఇండియన్ ఇనిస్టిట్యూట్ సర్వే...!
చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ సంచలన ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ ఓపీనియన్ పోల్ ప్రకారండీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లుఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లుటీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం. -
విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత
మలయాళ టీవీ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ 41 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత రెండేళ్లుగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనమరణవార్తతోపరిశ్రమలోని అభిమానులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో సహోద్యోగులు, అభిమానులు తీవ్ర సంతాపం తెలిపారు.నటి సీమా జి. నాయర్ ఫేస్బుక్లో సిద్ధార్థ్ మరణవార్తను ధృవీకరించారు. ‘‘నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. సిద్ధార్థ్ వేణుగోపాల్ బాధలు లేని లోకానికెళ్లిపోయారు. నీ జీవితాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఈ రోజు నువ్వు ఇక బాధ పడకూడదని దేవుడు నిర్ణయించాడు. ఈ బాధ భరించలేనుసిద్ధార్థ్, కుప్పకూలిపోయాను’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కిషోర్ సత్య కూడా సిద్ధార్థ్కు నివాళులర్పించారు.మలయాళ టీవీ నటుడు,త్రిస్సూర్లోని చాలకుడికి చెందిన సిద్ధార్థ్ వేణుగోపాల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో పడుతున్నారు. కాలేజీ టైంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. అతను బ్రాడ్కాస్టర్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను కస్తూరిమాన్ , భాగ్యజాతకం వంటి టీవీ సీరియల్స్లో నటించాడు.సిద్ధార్థ్ వేణుగోపాల్కు అతని తల్లి ,తమ్ముడు ఉన్నారు.ఇదీ చదవండి: నో షార్ట్కర్ట్స్ : 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్ -
నో షార్ట్కర్ట్స్ : సింపుల్ రూల్తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్
బరువు తగ్గాలంటే కచ్చితత్వంతో, నిబద్దతతో వ్యాయామం, ఆహార నియమాలు పాటించాలి. అయితే చిన్న అవమానంతో ఒక బ్యాడ్మింటన్ కోచ్ తన జీవన శైలినిమార్చుకుంది. ఆహారనియమాలను సరిచేసింది.కట్ చేస్తే.. 16 కిలోలు తగ్గింది. అయితే ఈ మార్పు అకస్మాత్తుగా జరగలేదు. ఎంతో పట్టుదలతో కష్టపడి సాధించింది. అని చాటి చెప్పింది. విమర్శలనే సవాల్తీసుకుని విజయ తీరాలకు బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.36 ఏళ్ల బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ, తల్లి అయిన తర్వాత సుమారు 20 కిలోల బరువు పెరిగారు. ఒకానొక దశలో ఆమె బరువు 79 కిలోలకు చేరుకుంది. అయితే ఒక రోజు తన క్లయింట్లలో ఒకరు, "మీరే మంచి శారీరక స్థితిలో లేకపోతే, మీ విద్యార్థులకు శిక్షణ ఎలా ఇవ్వగలరని ఆశిస్తున్నారు?" అని అనడంతో అవమానంగా భావించింది. ఎంత మాట అనిపించుకున్నానే అని చిన్నబుచ్చుకుంది.కానీ అక్కడితే ఆగిపోలేదు.అప్పుడే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చక్కటి ఆహార నియమాలతో దాదాపు 16 కిలోలు బరువు తగ్గింది. XXL నుండి M సైజుకు మారిపోయింది. మొదట్లో ఆమె 'క్రాష్ డైట్స్' (అతిగా పస్తులు ఉండటం) ప్రయత్నించింది, కానీ ఫలితం తాత్కాలికంగానే ఉండేది. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో బరువు తగ్గడం ప్రారంభించారు. కాలిలో రాడ్ ఉన్నప్పటికీ, పట్టుదలతో క్రమబద్ధమైన వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాహారంపై దృష్టి పెట్టింది. ఇదీ చదవండి: మోమోస్ తింటున్నారా? మెమరీ లాస్, లివర్ నాశనం, చివరికి!? డైట్ ప్లాన్ఆపిల్, ఓట్స్ (40 గ్రా), పోహా (40 గ్రా).అన్నం (50 గ్రా), గోధుమలు (40 గ్రా).ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన), ఒక స్కూప్ వే ప్రోటీన్.ఇలా రోజూ కేలరీలను లెక్క వేసుకుంటూ నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకునేది. ఫలితంగా తన బరువును 79 కిలోల నుండి 63 కిలోలకు తగ్గించుకుంది."అప్పట్లో నేను XXL సైజ్ బట్టలు వేసుకునేదాన్ని, ఇప్పుడు M సైజ్కు మారాను. వార్డ్రోబ్ మొత్తం మార్చడం వల్ల జేబుకు చిల్లు పడినా, నా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది!" అని ఆమె గర్వంగా చెబుతుంది.ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!ఆమె సలహా..షార్ట్కట్స్ వద్దు, త్వరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేయకండి, స్థిరంగా బరువు తగ్గాలంటే స్థిరత్వం, పౌష్టికాహారం, వ్యాయామం అవసరం, ఫలితం నెమ్మదిగా వచ్చినా, క్రమం తప్పని అలవాట్లను పాటించండి అంటారామె.నోట్ : బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైన పోషకాహారం వ్యాయామం కలయిక. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. క్రాష్డైట్స్ ఎప్పటికీ మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
మోమోస్ తింటున్నారా? మెమరీ లాస్, లివర్ నాశనం, చివరికి!?
పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఆధునిక జీవనశైలిలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆహార, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన ఢిల్లీలోని బురారీలో చోటుచేసుకుంది. మెమోస్ తింటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ వివరాలు తెలుసుకుదాం.మెమోస్.. వేడి వేడిగా, కారం కారంగా, వెజ్ ఆర్ నాజ్ వెజ్ మోమోస్ తినడం చాలా మందికి ప్రాణం. కానీ నిత్యం మోమోస్ వల్ల 10 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బురారీకి చెందిన కిషోర్, సావిత్రి దంపతుల తాన్యతోపాటు 8 ఏళ్ల గౌరీ అనే మరో పాపకూడా. తల్లి సావిత్రి మాథుర్,కేర్టేకర్గా తండ్రి కిషోర్ మొబైల్ రిపేర్లు చేసే పనిలో ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, తాన్య తన తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుని రోజూ బయట మోమోస్, చిప్స్ వంటివి కొని తినేది. క్రమంగా ఆమె మెదడు పని తీరు దెబ్బతింది. జ్ఞాపకశక్తిని కోల్పోవడం ప్రారంభించింది, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయింది, చివరికి నడవడానికి కూడా ఇబ్బంది పడింది. రోజు రోజుకు ఆమె పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.ఇదీ చదవండి: రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందనలక్షణాలుఎలా బయపడ్డాయి?చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం (జ్ఞాపకశక్తి తగ్గడం)తో సమస్య మొదలైంది. ఏగాగ్రతలేదు అనుకున్నారు. ఆ తరువాత విపరీతమైన నీరసం, అలససటతో బాధపడేది. చివరికి నడవలేని స్థితికి చేరుకుంది. అప్పుడు వైద్యులను సంప్రదించగా షాకింగ్ నిజాలా వెలుగు చూశాయి. వైద్య పరీక్షలలో ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలింది. ఆమె శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల, మెదడు వాచిపోయింది, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. మోమోస్ వంటి ఫాస్ట్ ఫుడ్ను తరచుగా తినడమే ఆమె పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారించారు.వైద్యులు మొదట ఆ బాలికకు కాలేయ మార్పిడి చేయాలని సిఫార్సు చేశారు. కానీ ప్లాస్మాఫెరెసిస్ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శైలేష్ శర్మ ప్రకారం, ఢిల్లీలో దాదాపు 35 శాతం మంది పిల్లలు ఫ్యాటీ లివర్ లక్షణాలను చూపిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, అధిక స్క్రీన్ సమయం , శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. దీంతో చిన్న పిల్లలలో కూడా తీవ్రమైన కాలేయ వైఫల్యం కేసులు కనిపిస్తున్నాయి. అంతేకాదు సగటున రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలి, కానీ చాలామంది 1 నుండి 1.5 లీటర్లు మాత్రమే తాగుతున్నారు. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతోందని కూడా ఆయన హెచ్చరించారు.ప్లాస్మాఫెరిసిస్ (Plasmapheresis) అంటేశరీరంలోని రక్తం నుండి విషపూరితమైన ప్లాస్మాను తొలగించి, దాని స్థానంలో శుభ్రమైన ప్లాస్మాను ఎక్కించే ప్రక్రియ. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గి, అది కోలుకోవడానికి అవకాశం కలిగింది. రెండు యూనిట్ల ప్లాస్మా సహాయంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది! -
‘మహిళా రిజర్వేషన్ బిల్లును రాహుల్, రేవంత్లు అడ్డుకున్నారు’
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా బిల్లును ఓడించామని కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారని, ఇది మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసపూరిత చర్య అని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీలే ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సైనికులను రాహుల్ అవమానించారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని, రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపుపై కేంద్ర క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ 7 సార్లు మహిళా బిల్లును అడ్డుకున్నారన్నారు కిషన్రెడ్డి. -
‘2051 వరకు పునర్విభజన వాయిదా వేయాలి’
చెన్నై: కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి వాదిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం దీనిపై మరోసారి స్పందించారు. ‘నియోజకవర్గాల పునర్విభజన అనే నల్ల చట్టం’పై చేసిన పోరాటం చేసిన ప్రతిపక్షం పార్లమెంటులో విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 శుక్రవారం లోక్సభలో ఆమోదం పొందలేదన్న విషయం తెలిసిందే. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీలు, మహిళలకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు, అంటే 2051 వరకు వాయిదా వేయాలని స్టాలిన్ సూచించారు. “2001లో చేసినట్లే ఇప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు వాయిదా వేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. అంటే 2051 వరకు. అంతేకాకుండా, 2023లో మేము మద్దతు ఇచ్చి ఆమోదించిన మహిళల రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా ఎటువంటి షరతులు లేకుండా బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. దాని కోసం మనం పోరాడుదాం” అని స్టాలిన్ తెలిపారు.తమిళనాడు ప్రభుత్వం, దేశంలోని ప్రతిపక్ష నేతలు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దాదాపు ఒక సంవత్సరం ముందే అంచనా వేశారని స్టాలిన్ తెలిపారు. అప్పటినుంచే సమన్వయంగా చర్యలు చేపట్టారని అన్నారు. ప్రతిపాదిత చట్ట ప్రతులను దహనం చేస్తూ తెలిపిన నిరసనలు సహా పలు కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచాయని తెలిపారు.సంవత్సరం ముందే అంచనా వేశాం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలోలో స్టాలిన్ మాట్లాడుతూ.. “నేను నూతనోత్సాహంతో మీ ముందున్నాను. పునర్విభజన అనే నల్ల చట్టంపై మన పోరాటం విజయవంతమైంది. ఈ ప్రమాదాన్ని సంవత్సరం ముందే అంచనా వేసి అవసరమైన చర్యలు అప్పుడే ప్రారంభించాం. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. నల్ల జెండా ఎగరవేశాం. నిన్న,మొన్న చట్ట ప్రతిని దహనం చేశాం. ఈ అగ్ని వ్యాపించాలని అన్నాను. అది పార్లమెంటుకు కూడా చేరింది” అని చెప్పారు.ఇది గట్టి దెబ్బ.. తమిళనాడు ప్రజలకు కూడా స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ మోసపూరిత ప్రయత్నానికి ఎదురు నిలిచారని అన్నారు. ‘‘పునర్విభజన పేరిట బీజేపీకి అనుకూలంగా నల్ల చట్టం తీసుకురావాలనుకుంది. పార్లమెంటులో దీనిని ఓడించిన అందరికీ తమిళనాడు ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల రిజర్వేషన్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ మహిళలే ముందుండి దీనిని ఓడించారు. ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి సభ్యులు ఏకమై నిలవడం వల్ల ఇది సాధ్యమైంది” అని అన్నారు.దేశాన్ని విభజించాలనే ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బ అని స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత పెరుగుతుందనడానికి ఇది సంకేతమని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొదటిసారి ఓ బిల్లు ఆమోదం పొందలేదని అన్నారు. ఉత్తరాది-దక్షిణాది పేరుతో మన మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన వారికి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు. -
రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ సోషల్ మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.2016లో రద్దయిన పాత రూ. 1000, రూ. 500, నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీంతో బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని కూడా హెచ్చరించింది. Has RBI really announced 'new rules' for exchanging old ₹500 & ₹1000 notes❓Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck❌ This claim is FAKE!❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని తమకు సెండ్ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను (rbi.org.in) చెక్ చేయాలని వెల్లడించింది.WhatsApp: +91 8799711259Email: factcheck@pib.gov.in -
బాక్సైట్.. ఫైట్ .. తీవ్రరూపం
రాయగడ : రాయగడలో బాక్సైట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. సిజిమాలి తవ్వకాలకు అనుమతి కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంత వ్యతిరేకత..? కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సిజిమాలిలో జరిగింది ఇదే.. సిజిమాలి బాక్సైట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి. ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులుప్రభావిత గ్రామాలు సిజిమాలి బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది! -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.మరిన్ని కీలక నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా పెరిగిన రెండు శాతం డీఏడీఏ పెంపుతో ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,68.27 శాతం పెన్షన్ దారులకు ప్రయోజనంఘజియాబాద్, సీతాపూర్ థర్డ్ , ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు 14,926 కోట్ల రూపాయలు -
స్టేట్ టాపర్.. అవినీతి ఉచ్చులో..!
జైపూర్: రాజస్థాన్లో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. భూవ్యవహారానికి సంబంధించిన దందాలో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు పట్టుబడింది. గతంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వూలో అవినీతిని అంతమెుందిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఈ అధికారి ఇప్పుడు తానే లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశమైంది.రాజస్థాన్లో ఎస్డీఎమ్గా విధులు నిర్వహిస్తున్న కాజల్ మీనా అనే అధికారి భూవ్యవహారానికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం కోసం రూ. లక్ష తొలుత డిమాండ్ చేసింది. అయితే బాధితులు అంత చెల్లించలేము అని అనడంతో రూ. 60 వేలకు డీల్ కుదిరింది. అయితే ఈ వివరాలని బాధితుడు ఏసీబీకి తెలియజేయడంతో పక్కా ప్లాన్ వేసిన అధికారులు రెడ్హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తన బ్యాగులో మరో రూ. 4 లక్షలున్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.కాజల్ మీనా నేపథ్యంకాజల్ మీనా 2024లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో టాఫర్గా నిలిచారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో టాపర్గా నిలిచిన సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. అప్పుడు అవినీతిని నిరోధిస్తానని ప్రజా సేవ చేయడమే లక్షమని పేర్కొంది. కాగా ఇప్పుడు తన తొలి పోస్టింగ్ లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రగల్భాలు పలికిన అధికారి తన తొలిపోస్టింగ్లోనే ఏసీబీకి చిక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
బిల్లును అడ్డుకుని సంబరాలా?
ఢిల్లీ: రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోవడంతో విపక్షాలపై అధికార ఎన్డీఏ నాయకులు మండిపడుతున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అడ్డుకున్న విపక్షాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో విపక్షాలు పెద్ద తప్పు చేశాయని, దీనికి ఫలితం కచ్చితంగా అనుభవిస్తాయని అన్నారు.ఓడిన బిల్లు.. కాంగ్రెస్ సంబరాలు: ఇరానీమహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. లోక్సభలో మహిళా బిల్లు వీగిపోతే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ, నవ్వుతూ సంబరాలు చేసుకున్నారని అన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసి, వారి హక్కులను నిరాకరించడమే కాకుండా సంబరాలు చేసుకున్నారని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మహిళల ఆకాంక్షలను కాంగ్రెస్ కాలరాసిందని దుయ్యబట్టారు. రాజ్యాంగ వ్యవస్థ, పార్లమెంటుపైనే కాదు.. దేశంలోని మహిళలపైనా కాంగ్రెస్కు నమ్మకం లేదని పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని, సమానత్వ హక్కు కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.మహిళలు తగిన జవాబిస్తారు: అథవాలేమహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేయకుండా విపక్షాలు అడ్డుపడ్డాయని విమర్శించారు. సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టారని వివరించారు. ప్రతిపక్షాలకు మహిళలు సరైన సమయంలో తగినవిధంగా బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని మహిళలు అందరూ కాంగ్రెస్ పనితీరును చూశారని, ఆ పార్టీని వారు క్షమించబోరని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పేర్కొన్నారు.కుంటి సాకులతో అడ్డుకున్నారు: చిరాగ్లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందకుండా చేసిన ప్రతిపక్ష పార్టీలకు మహిళలు భవిష్యత్తులో తగిన జవాబు ఇస్తారని కేంద్ర మంత్రి, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. కుంటి సాకులతో విపక్షాలు మహిళా బిల్లుకు మోకాలడ్డాయని ధ్వజమెత్తారు. "ఈ బిల్లును చదివిన ఎవరికైనా ఇంతకంటే మంచి ప్రతిపాదన మరొకటి ఉండదని అర్థమవుతుంది. మేము ముందుకు తెచ్చిన డీలిమిటేషన్ ప్రతిపాదనలో ప్రతి రాష్ట్రానికి సమాన వాటా ఇచ్చాం, సీట్లను సమానంగా పంపిణీ చేశాం. నిన్న లోక్సభలో హోం మంత్రి అమిత్ షా కూడా అన్నీ స్పష్టంగా వివరించారు. ప్రతిపక్షం ఒకదాని తర్వాత ఒకటి సాకులు చెబుతూ బిల్లును అడ్డుకుంది. సగం జనాభాకు వారి హక్కులు దక్కడం వారికి ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పార్లమెంట్ సమావేశాలను విని ఉంటారు, భవిష్యత్తులో వారు ప్రతిపక్షానికి తగిన జవాబు ఇస్తార"ని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.కాంగ్రెస్ ఖతం ఖాయం: హిమంత శర్మమహిళల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ అంతమైపోతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (himanta biswa sarma) అన్నారు. లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నందుకు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులపై మహిళలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. విపక్ష నాయకులు తమను అవమానించారనే భావన మహిళల్లో బలంగా ఉందన్నారు. చదవండి: నాకు, మోదీకి భార్యల సమస్య లేదు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్బాధ కలిగించింది: హేమమాలిని మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడం తనకెంతో బాధ కలిగించిందని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. బిల్లు ఆమోదం కోసం తాము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విపక్షాలు అడ్డుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ తీరుకు నిరసగా దేశవ్యప్తంగా మహిళలు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. కాగా, ఢిల్లీలో బీజేపీ మహిళా కార్యకర్తలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హేమమాలిని పాల్గొన్నారు. -
నితీశ్, ఏక్నాథ్ పరిస్థితే చంద్రబాబుకు..: రేవంత్
ఢిల్లీ: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ, చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా ఇలా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. నితీశ్ కుమార్, ఏక్నాథ్ షిండే పరిస్థితే చంద్రబాబు నాయుడికి కూడా వస్తుందని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారని అన్నారు.ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని తీసి పక్కన పడేస్తారని తెలిపారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని చెప్పారు.వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అని రేవంత్ రెడ్డి అన్నారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని తెలిపారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తానుగా రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా? అని ప్రశ్నించారు. డిక్టేటర్షిప్ను ఎవరూ ఒప్పుకోబోరని తెలిపారు. -
జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలను “దోషులు” అని ప్రధాని మోదీ అన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం వైఖరిని ఆయన తప్పు అని పేర్కొని, భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.కాగా, లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు 230 మంది విపక్ష సభ్యులు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. విపక్షాలు మాత్రం బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని అంటున్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ శనివారం బీజేపీ మహిళా నేతలు నిరసనలు తెలుపుతునున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అవకాశం ఉంది. -
దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్ప్రెస్వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జితేంద్ర శెల్కే అశోక్కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్ నిర్వహించిన ట్రస్ట్కు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్ చర్చకు దారి తీసింది. మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్ ఖరాత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది. పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ నడిచింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలురాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్ స్కాండల్కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్మెయిల్, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈడీ సోదాలుగడిచిన కొన్నేళ్లలో అశోక్ ఖరాత్ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్ (PMLA) కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 13వ తేదీన నాసిక్లో అశోక్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. కోపర్గావ్ పోలీస్ స్టేషన్లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో క్రాష్ అనాలిసిస్ చేయనున్నట్లు అహిల్యా నగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘార్గే తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. -
విపక్షాలు శిక్ష అనుభవించక తప్పదు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయి. కోట్ల మంది మహిళలకు విపక్షాలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు శిక్ష అనుభవించక తప్పదు’’ అని అన్నారు. పండుగ చేసుకుంటున్నారా?: కిరణ్ రిజిజుమహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ఘోరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్తో పలుమార్లు సంప్రదింపులు జరిపాం. అయినా అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం దుర్మార్గం. ఈ బిల్లు ఎలా అప్రజాస్వామికమో రాహుల్ గాంధీ చెప్పాలి అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ సంబంధిత మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ సవరణ-131పై లోక్సభలో ఓటింగ్ జరగ్గా మెజారిటీ చేరుకోలేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని.. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయానికి దిగిందని.. డీలిమిటేషన్ అంశాన్ని ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టడంతోనే ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. అయితే డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని.. మహిళా రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరించామని ఇటు కేంద్రం అంటోంది. -
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో విపక్షంపై బురద జల్లే కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి దెబ్బ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది.. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK— ANI (@ANI) April 18, 2026భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రభుత్వ కార్యాలయ మీటింగ్లో జరిగిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో ఒక అనుకోని అతిథి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత విషయం తెలిసి అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటన బాఘ్పత్లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందీ అంటే..బాఘ్పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ రాయ్ రైతుల సమస్యలను వింటున్నారు. ఈ సమయంలో కోతి ఆడిటోరియంలోకి ప్రవేశించి, నేరుగా డీఎం టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న పత్రాలను లాగడం చూసి అధికారులు భయాందోళనకు గురయ్యారు. కోతి ఆకస్మిక చర్యలతో అవాక్కైన కొంతమంది ఆఫీసర్లు సీట్లు వదిలి పారిపోయారు. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్ ఇంతకీ ఈ కోతి ఎవరో తెలుసా? జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ పెంపుడు కోతి. దీని పేరు 'మాత్రు'. మాతృను చూడగానే జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తన కుర్చీలోంచి లేచారు. అధికారులు, రైతుల ముందు ప్రశాంతంగా ,అస్మితా లాల్ చిరునవ్వు నవ్వి, మాతృను తన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించారు. అది పోయి అక్కడ పొందికగా కూర్చంది. ఆ తర్వాత అధికారులు మాతృని మెల్లగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో వాతావరణం సద్దు మణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
స్మార్ట్ఫోన్ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్స్టాలేషన్పై అప్డేట్
స్మార్ట్ఫోన్ వినియోగదారుల ప్రయోజనాలు, టెక్ కంపెనీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విక్రయించే యాపిల్, శామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ (ప్రీ-ఇన్స్టాలేషన్) చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది.పరిశ్రమ వర్గాల వ్యతిరేకతే కారణమా?రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్ఫోన్ల్లో ఆధార్ యాప్ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్సంగ్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది.ఏమిటీ ‘ప్రీ-ఇన్స్టాలేషన్’ వివాదం?సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్ల మాదిరిగానే ఆధార్ యాప్ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.సంచార్ సాథీ అనుభవంతో వెనక్కి..గతంలో సంచార్ సాథీ (మోసాలను నివేదించే యాప్)ను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ స్మార్ట్ఫోన్ తయారీదారుల గ్లోబల్ పాలసీలు, వినియోగదారుల డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
టీచర్ ఇంట దొంగలు పడ్డారు
చెన్నై: వల్లియూర్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఒక ఉపాధ్యాయురాలి ఇంట దొంగలు పడ్డారు. 21 సవర్ల విలువైన నగలు చోరీ చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా, వల్లియూర్, రామలక్ష్మి నగర్కు చెందిన రోసారియో భార్య సహాయుజిన్ శాంతి (58) ఏర్వాడి ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా పనిచేసే ఉపాధ్యాయులకు గురువారం వల్లియూర్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహాయుజిన్ శాంతి వెళ్లారు. అలాగే తన పోస్టల్ బ్యాలెట్కు కూడా అక్కడ నమోదు చేసుకున్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి ఆమె వచ్చా రు. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరచి ఉండటం, అందులో ఉన్న వాటిని చెల్లాచెదురుగా చేసి పడేసి ఉండటంతో ఆందోళన చెందారు. బీరువాను పరిశీలించి చూడగా అందులో ఉన్న 50 సవర్ల నగల్లో దాదాపు 21 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 21 లక్షలు. దీనిపై తన భర్తకు ఆమె సమాచారం ఇవ్వడంతో అతను ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు. తామేమీ చోరీ చేయలేదని వారు పేర్కొనడంతో చివరకు వల్లియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఇంటిలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ ఇంట్లో పనిచేస్తున్న కొంతమంది మహిళల బంధువులు ఇద్దరు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసు కుని విచారణ చేస్తున్నారు. -
తల్లే నరరూప రాక్షసి.. 95 ఏళ్ల జైలు విధించిన కోర్టు
అన్నానగర్: మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన ముగ్గురికి జైలు శిక్ష, దీనికి సహకరించిన బాలిక తల్లికి 95 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శివగంగై పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు ప్రాంతానికి చెందిన అక్బర్ అలీ అంబలం (71), డ్రైవర్. అరియలూరుకు చెందిన శరవణన్ (41) కూలీ. పుదుక్కోట్టై జిల్లా అళగియనాయకిపురం గ్రామానికి చెందిన మురుగేషన్ (55). ముగ్గురూ కలిసి 2021లో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి కూడా దీనికి సహకరించడం గమనార్హం! తిరుపత్తూరు అఖిల మహిళా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ, శరవణన్, మురుగేశన్, బాలిక తల్లి మరో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. శివగంగైలోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు శుక్రవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గోకుల్ మురుగన్, నిందితుడు అక్బర్ అలీ అంబలానికి 50 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా, శరవణకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, మురుగేషన్కు 25 ఏళ్లు జైలు, రూ.11 వేలు జరిమానా, బాలిక తల్లికి 95 ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరు మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
సింగ్రౌలీ: మధ్యప్రదేశ్లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్ 17) సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. -
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఛండీగఢ్: హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.BJP ka Nayab HaryanaPolice ke besh main Gunde.....@PMOIndia @NayabSainiBJP pic.twitter.com/uVCBOFyyVf— Dushyant Chautala (@Dchautala) April 17, 2026దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.जब रक्षक ही भक्षक बन जाए, तो व्यवस्था पर सवाल उठना तय है। pic.twitter.com/UGvYm7qEJx— Dushyant Chautala (@Dchautala) April 17, 2026 -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఏం జరగనుంది?
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడంతో పాటు సమావేశంలో పలు ‘కీలక నిర్ణయాలు’ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలు జాతీయ ఛానళ్లు, వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి.దాంతో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు ఉండొచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు వంటి పలు కీలక నిర్ణయాలను మోదీ సర్కారు ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లోనే తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాటి భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సమావేశ ఎజెండాను కేంద్రం వెల్లడించలేదు.ఎన్డీయే నేతల సమీక్ష: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోవడానికి దారితీసిన కారణాలపై అధికార ఎన్డీయే కూటమి సమీక్ష చేపట్టింది. శుక్రవారం రాత్రి లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్రాం మేఘ్వాల్తో పాటు లలన్సింగ్ (జేడీ–యూ), జయంత్ చౌదరి (ఆరెల్పీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేజీ–ఆర్వీ), కింజరాపు రామ్మోహన్నాయుడు (టీడీపీ) తదితరులు వారిలో ఉన్నారు. -
గంజాయితో పట్టుబడిన భారతీయ పైలట్
న్యూఢిల్లీ: తాను నడపాల్సిన విమానం అమెరికాలో ఉండటంతో అక్కడికి వేరే విమానంలో ప్రయాణికుడిలా చేరుకున్న ఒక భారతీయ పైలట్ను అమెరికా ప్రభుత్వం బలవంతంగా వెనక్కి తిప్పిపంపింది. ప్రయాణసమయంలో అతని వద్ద నిషేధిత గంజాయిని పట్టుకున్నామని, నిబంధనల మేరకు అతడిని స్వదేశానికి పంపేశామని అమెరికా వెల్లడించింది. తమ పైలట్ను వెనక్కిపంపిన విషయాన్ని ఎయిర్ఇండియా విమానయాన సంస్థ సైతం దృవీకరించింది. ‘‘ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు ఏప్రిల్ 14వ తేదీన మా కోపైలట్ ఒకరు వెళ్లారు. అక్కడికి వెళ్లాక అతను విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నిషేధిత(గంజాయి) పదార్థం అతని వెంట ఉందని నిర్ధారణ కావడంతో అమెరికా అతడిని వెనక్కి పంపేసింది’’అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు, అంతర్గత దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. సంస్థ కఠిన నిబంధనావళిని అనుసరిస్తూ అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అతని పేరు, స్వస్థలం, గతంలో ఎక్కడ పనిచేశా వంటి తదితర వివరాలు ఏవీ తెలియరాలేదు. -
మాటిమాటికీ రసగుల్లా తిన్నాడని..తందూరీ పొయ్యిలో పడేశాడు
బస్తీ(యూపీ): వివాహ శుభకార్యంలో అతిథుల కోసం సిద్ధంచేసి రసగుల్లాలను మాటిమాటికీ తినేస్తున్నాడన్న కోపంతో ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ 11 ఏళ్ల పిల్లాడిని తందూరీ పొయ్యిలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో పిల్లాడికి ఛాతీ నుంచి ముఖందాకా తీవ్రస్థాయిలో కాలినగాయాలయ్యాయి. వెంటనే బంధువులు పిల్లాడిని అయోధ్య వైద్య బోధనాస్పత్రిలో చేరి్పంచారు. బస్తీ జిల్లాలోని ఛవానీ పోలీస్స్టేషన్ పరిధిలోని మలౌలీ గోసాయ్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 11 ఏళ్ల పిల్లాడు ఛమన్ అలియాస్ అమర్ స్వస్థలం గోంఢా పరిధిలోని దుర్జాన్పూర్. కానీ తన అమ్మ సొంతూరు బఘానాలాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కావడంతో అమ్మమ్మతో కలిసి మలౌలీకి వచ్చాడు. పెళ్లి వేడుకలో బంధువుల కోసం కౌంటర్ వద్ద రసగుల్లా సిద్ధంచేశారు. రసగుల్లాలను పదేపదే పిల్లాడు తీసుకోవడం చూసి అక్కడి క్యాటరింగ్ సర్వీస్ కాంట్రాక్టర్ పిల్లాడిని కోప్పడ్డాడు. అయినాసరే పిల్లాడు మరో రసగుల్లా తీసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో పిల్లాడిని కాంట్రాక్టర్ వెంటనే మండుతున్న తందూరీ పొయ్యి మీద కూర్చోబెట్టాడు. తీవ్రమైన వేడిమికి తాళలేక పిల్లాడు పట్టుతప్పి లోపల పడిపోయాడు. కాలినగాయాలతో కేకలువేయడంతో బంధువులు వచ్చి బయటకుతీసి వెంటనే అయోధ్య ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం లక్నో బోధనాస్పత్రిలో చేర్పించారు. మేనమామ దేవిదీన్ నిషద్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సెక్షన్ 109(1)(హత్యా ప్రయత్నం) నేరం కింద పలువురిపై కేసు నమోదుచేశారు. పారిపోయిన కాంట్రాక్టర్ కోసం వేటమొదలెట్టామని సర్కిల్ ఆఫీసర్ హరయా స్వనిమా సింగ్ చెప్పారు. -
జెన్జీ రూటు ఎటో!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెన్జీ(జనరేషన్ జెడ్) నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. యువతరం తమిళ రాజకీయాల్లో పెద్దమార్పునకు పునాది కాబోతుంది. 1.18 కోట్ల మంది యువ ఓటర్లు ఉండడంతో రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. తమిళనాడులోని మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతం అంటే 1.18 కోట్ల మంది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్జీ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లు గెలుపోటములను శాసించడంలో కీలక భూమిక పోషించనున్నాయి. జెన్ జెడ్ను ఆకర్షించేలా రాజకీయ పార్టీల వ్యూహాలు జెన్–జెడ్ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలకు తమిళ రాజకీయ పార్టీలు పదునుపెట్టాయి. డీఎంకే ఆధునిక డిజిటల్ ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం కొనసాగింపు, అభివృద్ధి నినాదం ఇందులో కీలకంగా ఉంది. యువఓటర్లను ఆకర్షించే విధంగా ఉచిత ల్యాప్ టాప్లు, వైఫై సేవలు, ఉద్యోగకల్పన, ఉన్నతచదువుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా ఉచిత వృత్తి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణే కాకుండా, పుదుమైపెన్, తమిళ్పుదల్వన్ పథకాల పేరిట నెలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అన్నాడీఎంకే విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లను 7.5% నుంచి 10%కి పెంచుతామని, ఆర్థిక సంక్షేమ పథకాల భరోసాను కీలకంగా చేసుకుంది. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంతో యువత, అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకే విజయ్ ఈ తరం కోసం ఏఐ టెక్నాలజీ, ఫీజులమాఫీ అంటూ ముందుకు సాగుతున్నారు. నామ్ తమిళర్ కట్చి కన్వినర్ సీమాన్ అయితే తమిళ దేశం నిర్మాణం తదితర భావోద్వేగ అంశాలతో జెన్జీ ఓటర్ల కోసం కీలక ప్రకటనలు చేశారు. మునుపటి తరాల మాదిరిగా ఒక పార్టీకి వంశపారంపర్య విధేయులుగా ఉండకుండా, జెన్–జీ ఓటరు తాజాగా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సమస్యల ఆధారిత ఓటింగ్ పార్టీల కంటే సమస్యలకే జెన్జీ ఓటర్లు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తాజా అంచనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు, సమాచార మూలాల విశ్లేషణకు జెన్జీ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియా ద్వారా రాజకీయ అవగాహన పెంచుకుంటున్నారు. ఈ దృష్ట్యా యువ ఓటర్లు ఏకపక్షంగా ఉండకుండా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే కాదు. రాబోయే 20 ఏళ్ల తమిళనాడు రాజకీయ గమనాన్ని నిర్ణయించే కొత్త తరం గళం కాబోతోంది. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్లను వదిలి వెళ్లడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్ కుటుంబ సభ్యులు.తిరుగు ప్రయాణంలో దుర్ఘటనఅమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్లలు అద్విక, శ్రీనిధిని అటుగా వెళ్లేవారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
అస్సాంలో అటవీ కార్యాలయంలో స్థానికుల విధ్వంసం
గువాహటి: అస్సాం రాష్ట్రం చిరంగ్ జిల్లా రునిఖాటా అటవీ రేంజ్ కార్యాలయంపై మూకదాడి జరిగింది. స్థానికులు కార్యాలయంలో ఫర్నీచర్ను, ఆవరణలోని వాహనాలను తగులబెట్టడంతోపాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. రిజర్వు ఫారెస్ట్ ఆక్రమణదారులను అదుపులోకి తీసుకోవడమే వారి ఆగ్రహానికి కారణం. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకుని లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భూటాన్ సరిహద్దులకు అతి సమీపంలో రిపు చిరంగ్ రిజర్వు ఫారెస్ట్లోని చెట్లను నరికి, ఆక్రమణకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అటవీ అధికారులు గురువారం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వదిలేశారు. అయితే, తమ వారిని కొట్టారంటూ శుక్రవారం ఉదయం రాళ్లు విసురుతూ, కర్రలు చేబూని ఒక గుంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడున్న ఫర్నీచర్ను విరగ్గొట్టి, నిప్పుపెట్టారు. ఆ పక్కనే ఉన్న ఉద్యోగుల నివాసాల్లోనూ విధ్వంసం సృష్టించారు. ఆవరణలోని వాహనాలను తగులబెట్టారు. అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, అదనపు పోలీసు బలగాలను అధికారులు రప్పించారు. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన వారిని లాఠీచార్జితో చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు, అటవీ అధికారులతోపాటు నిరసనకారులు గాయపడ్డారు. మూకదాడితో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ కార్యాలయంలోని ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందంటూ వచ్చిన వార్తలపై విచారణ చేపట్టామన్నారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పాత్రికేయుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయింది. అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన.. మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఉన్నత రాజ్యాంగ పదవికి హరివంశ్ మూడోసారి ఎన్నిక కావడం అరుదైన ఘనతని రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ అభివర్ణించారు. రాజ్యసభకు అధ్యక్షత వహించడం అంత సులభమైన పని కాదని, హరివంశ్ తన బాధ్యతను అద్భుతమైన సంయమనం, సహనం, నిష్పాక్షికతతో నిర్వర్తించారని రాధాకృష్ణన్ కొనియాడారు. పార్లమెంటరీ కార్యకలాపాలను, సంప్రదాయాలు, బాధ్యతలను అర్థం చేసుకోవడంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు హరివంశ్ ఒక మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉంటారని చైర్మన్ అన్నారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సభ చూపిన సమష్ఠి వివేకాన్ని చైర్మన్ ప్రశంసించారు. డిప్యూటీ చైర్మన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని, హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తిమంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. సభ గౌరవాన్ని నిలబెట్టడానికి, సభ్యుల హక్కులను పరిరక్షించడానికి, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి అన్ని విధాలా కృషి చేస్తానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హామీ ఇచ్చారు. సభ్యుల సన్మానం అనంతరం మాట్లాడిన హరివంశ్, ‘పార్లమెంటరీ నియమా లు, సంప్రదాయాలు, రాజ్యాంగ పరిధిలోనే ఉంటూ, సభ గౌరవాన్ని నిలబెట్టడానికి, సభ్యుల హక్కులను పరిరక్షించడానికి, సభ సజావుగా సాగేలా చూడటానికి నేను అన్ని విధాలా ప్రయత్నిస్తానని సభకు హామీ ఇస్తున్నాను’అని అన్నారు. పార్లమెంటులో ఆరోగ్యకరమైన సైద్ధాంతిక చర్చకు ఆస్కారం ఉందని, ప్రజాస్వామ్యంలో ఎలాంటి విద్వేషాలకు తావులేదని ఆయన అన్నారు. సన్మానం అనంతరం, సభా కార్యకలాపాలకు అధ్యక్షత వహించిన ఆయన.. ఇదే తన మొదటి కర్తవ్యమంటూ సభను నేటికి వాయిదా వేశారు. -
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
మతాచారాలపైనా న్యాయ సమీక్ష
న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా, విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్ లాయర్ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు. ‘ఆర్టికల్ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్ ట్రస్ట్ తరఫున లాయర్ ఎంఆర్ వెంకటేశన్..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది. -
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లో టీఎంపీ హవా
అగర్తలా: త్రిపురలో గిరిజన ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కల్పించే ‘త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంపాలిత జిల్లా మండలి (టీటీఏఏడీసీ)’ఎన్నికల్లో ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మ సారథ్యంలోని తిప్రా మోథా పార్టీ(టీఎంపీ) ఘన విజయం సాధించింది. మండలిలో 28 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 24 చోట్ల గెలిచి టీఎంపీ తన సత్తా చాటింది. మిగతా నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. గిరిజనులను మెప్పించడంలో విఫలమై సీపీ(ఐ), కాంగ్రెస్లు ఒట్టిచేతులతో మిగిలిపోయాయి. గ్రేటర్ తిప్రాల్యాండ్ ఏర్పాటు నినాదంతో ఆరేళ్ల క్రితం రాజకుటుంబీకుడు ప్రద్యోత్ సారథ్యంలో ఆవిర్భవించిన టీఎంపీ అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక రాజకీయశక్తిగా ఎదిగింది. మండలిలో 28 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మరో రెండు స్థానాలకు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. -
30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ సేకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వివరించారు.ఢిల్లీలో జోషిని ఆయన నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్రం సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి సీఎం, మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. బకాయిలు విడుదల చేయండి 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి రేవంత్, ఉత్తమ్ విన్నవించారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గానూ పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ల పరిధిలో పంపిణీ చేసేవారని... ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునఃప్రారంభించాలని సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలం: ఉత్తమ్ ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 30లక్షల బాయిల్డ్ రైస్, 5లక్షల మెట్రిక టన్నుల రారైస్ సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. భేటీ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో 1.48కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, ఇందులో 90లక్షల మెట్రిక టన్నుల మేర కొనుగోలు చేయనున్నట్లు వివరించామన్నారు. కాగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. -
మీ విధులు ఔట్సోర్సింగ్కు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కొన్ని నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్(ఏఓఆర్) బృందం అప్రమత్తంగా వ్యవహరించాలని, న్యాయపరమైన పనులను కృత్రిమ మేధ(ఏఐ) లేదా ఇతర బాహ్య సంస్థలకు ఔట్సోర్సింగ్కు అప్పగించవద్దని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం.. అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్గా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరఫున వాదించగలరు. న్యాయవాదులను ఏఓఆర్లుగా నియమించే ముందు సుప్రీంకోర్టు వారికి పరీక్ష నిర్వహిస్తుంది. శుక్రవారం ఏఓఆర్ల పదవీ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ఏఓఆర్లు కేవలం బార్ సభ్యులు మాత్రమే కాదని.. అధికారిక కోర్టు అధికారులు అని గుర్తుచేశారు. ఏఓఆర్ల వృత్తి నిబద్ధత, అంకితభావంపైనే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. వారిపై ఉంచిన విశ్వాసమే వారు తమ ప్రతిష్టను నిర్మించుకోవడానికి పునాదిగా తోడ్పడుతుందన్నారు. న్యాయపరమైన విధులను ఏఓఆర్లే వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. కేసుల ఫైలింగ్ను ఒక సాధారణ ప్రక్రియగా భావించవద్దని అన్నారు. -
ఇది ట్రైలర్ మాత్రమే: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. లోక్సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్. ఇదిట్రైలర్ మా త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్.ఇక తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.ఇదీ చదవండి:ఓడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు -
‘ మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’
న్యూఢిల్లీ: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు. ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్నారు. మరొకవైపు హైదరాబాద్లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్ను రాహుల్ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్సభ వేధికగా జరిగిన ఓటింగ్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. -
ఓడిన మహిళా రిజర్వేషన్ బిల్లు
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్సభ వేధికగా జరిగిన ఓటింగ్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దాంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. బిల్లులివే..రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026: మహిళా రిజర్వే షన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం.కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026: అసెంబ్లీల్లో 33శాతం మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం.డీలిమిటేషన్ బిల్లు-2026: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం.బిల్లులు ప్రవేశఫెట్టేముందు కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్ ముందుంటుంది. చరణ్ సింగ్,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. ఓబీసీల కోసం కాకాసింగ్ కాలేకర్ చేసిన సూచనలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్ ఆమోదించలేదు. వీపీ సింగ్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్టుకు మోక్షం దక్కింది. రాజీవ్ గాంధీ తన జీవితాంతం మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ వచ్చారు. 15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్కు ఓబీసీలు గుర్తుకొచ్చారు. బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది. మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే. మొత్తం క్యాబినెట్లో ఓబీసీల శాతం 40. 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్ తన సొంత మనిషిగా భావించలేదు. 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.కాంగ్రెస్ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది.ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర తిప్పికొట్టాం: రాహుల్
మహిళా బిల్లు వీగిపోవడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కానేకాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని 2023కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్తో మహిళా బిల్లుకు ముడిపెడితే కుదరదన్నారు.అమిత్షా ఏమన్నారంటే?కాగా అంతకుముందు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఛాలెంజ్ విసిరారు.. కాంగ్రెస్ నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు. డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాఫ్లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అంతకుముందు రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు. నిన్న జరిగిన సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. వీగిపోయిన మహిళా బిల్లుకాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్లో మెుత్తం 528 మంది ఓటింగ్లో పాల్గొనగా అనకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. దీంతో సరైన సంఖ్యా బలం లేక బిల్లు వీగిపోయింది. -
రాహుల్ వ్యాఖ్యలపై కంగన ఫైర్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ నాయకులు తప్పుబట్టారు. మోదీ మెజీషియన్ అంటూ రాహుల్ వ్యాఖ్యనించడంతో లోక్సభలో శుక్రవారం మధ్యాహ్నం గందరగోళం రేగింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని అధికార సభ్యులు డిమాండ్ చేయడంతో సభ దద్దరిల్లింది. సభ వెలుపల పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తీరును తప్పుబట్టారు.లోక్సభలో రాహుల్ గాంధీ న్యూసెన్స్ చేశారని ఫైర్ అయ్యారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం తలనొప్పి తెప్పించిందని, ఆయన మాటలు ఇబ్బందికరంగా అనిపించాయన్నారు. సభాపతి కూడా ఆయన్ను ఆపమన్నారని తెలిపారు. పార్లమెంట్ ప్రతిష్టను రాహుల్ అపహాస్యం చేశారని కంగన ఫైర్ అయ్యారు.రాహుల్ హద్దులు దాటారు: చిరాగ్రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హద్దులు దాటారని.. ఆయన ప్రసంగం తనకు నిరాశ కలిగించిందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ పనికిరారని అన్నారు. "రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హద్దులు దాటారు. మీ పార్టీలో తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి మీరెలాంటి ఉదాహరణ ఇస్తున్నారు? సొంత ఎంపీల ముందే తనను తాను నవ్వులపాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకుడు తనను తాను అపహాస్యం చేసుకోవాలనుకుంటే, కేవలం హాస్య ప్రసంగాలు చేయాలనుకుంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడని నేను అనుకోను అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.కరెక్ట్ కాదు: హేమమాలిని ప్రధానమంత్రిని ఇంద్రజాలికుడు అని పిలవడం సరికాదని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అందులో నిర్దిష్టమైన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు స్పందిస్తూ.. మెజీషియన్ అనే పదం అనుచితమైంది కాదని స్పష్టం చేశారు.చదవండి: నాకు, మోదీకి భార్యల సమస్య లేదు.. రాహుల్ సరదా కామెంట్స్ -
ఘోర ప్రమాదం.. పదిమంది మృతి
కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్పారైలో వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 10మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొనికేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. -
పార్లమెంటులో .."33 కాదు 50 శాతం రిజర్వేషన్"
పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలతో వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఛాలెంజ్ విసిరారు.. కాంగ్రెస్ నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు.అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు.డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రాఫ్లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రతి సంస్కరణకు అడ్డు తలిగిందన్నారు త్రిపుల్ తలాక్ను అడ్డుకుందని రామమందిరం నిర్మాణానికి ఆటంకం కలిగించిందని అన్నారు. దళిత మహిళను రాష్ట్రపతి చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకుంటే వీగిపోతుందని వీరిని దేశంలోని మహిళలంతా గమనిస్తున్నారని అమిత్షా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు లోక్సభలో గొడవ చేసి బతికిపోవచ్చుగానీ ప్రజాక్షేత్రంలో మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని అన్నారు. -
డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టమా?
డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టమా? పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై లోక్సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ డీలిమిటేషన్తో రాష్ట్రాలకు నష్టమా? రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతాయా? దీనిపై పాలిటీ విశ్లేషకుడు, యూపీఎస్సీ సివిల్స్, పోటీ పరీక్షల మెంటార్ మెన్నేని సంతోష్రావు వివరణ లైవ్లో మీకోసం.. -
'నాకు, మోదీకి ఆ బాధ లేదు.. హమ్మయ్య! అమిత్ షా నవ్వారు'
ఢిల్లీ: లోక్సభలో మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నవ్వులు పూయించారు. తనకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భార్యల సమస్య లేదని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. 131 రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర గురించి గొప్పగా చెప్పారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మహిళల నుంచే నేర్చుకుంటారని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోనూ మహిళల సహకారం అవసరం ఉంటుందని వివరించారు. “మన జాతీయ భావన, దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర, చోదక శక్తి. మనమందరం, ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని తల్లులు, సోదరీమణులు, భార్యలైన మహిళల నుంచి ఎంతో ప్రభావితమయ్యాం, స్ఫూర్తి పొందాం, నేర్చుకున్నాం“ అంటూ మహిళలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన ఓ వ్యాఖ్యకు రాహుల్ గాంధీ కూడా సరదాగానే సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లాగా తాను తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. "నిజానికి నాకు, ప్రధానమంత్రికి భార్యల సమస్య లేదు. కాబట్టి మాకు అలాంటి సలహాలు అందవు. కానీ మాకు మా అమ్మలు, సోదరీమణులు ఉన్నారు" అని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.నేను చేయలేని పని ప్రియాంక చేసిందిగురువారం లోక్సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. "నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో సాధించడం చూశాను. అదే అమిత్ షా గారిని నవ్వించడం" అని రాహుల్ అనగానే సభికులందరూ పగలబడి నవ్వారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ ప్రతిపక్షాలకేరాహుల్ వ్యాఖ్యలతో కలకలంకాగా, ఆపరేషన్ సిందూర్, బాలకోట్ వంటి అంశాలపై ప్రధాని మోదీ మ్యాజిక్ చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళం రేగింది. ప్రధానమంత్రిని అవమానించిన రాహుల్ క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీని సభ నుంచి బహిష్కరించాలని పట్టుబట్టారు. -
‘నోటి మాటగా కాదు.. చట్టంలో పెట్టాల్సిందే’
న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు తాము మద్దతిస్తామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) డీలిమిటిషన్, మహిళా రిజర్వేసన్ బిల్లులపై లోక్సభలో చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘ డీలిమిటేషన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మేం మద్దతిస్తాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి. డీలిమిటేషన్ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో చెప్పిన మాటలు అమలు కాలేదు’ అని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. -
రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. ఈ విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించగా, ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కర్ణాటక నివాసి అయిన పిటిషనర్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టం, విదేశీయుల చట్టం, పాస్పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద ఆరోపణలు చేస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫిర్యాదును మొదట రాయ్బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 17న, హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టివేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యంఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతం
రాంచీ: కాల్పుల మోతతో జార్ఘాండ్ అరణ్యాలు దద్దరిల్లాయి. హజారీబాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ముట్టడి అనంతరం భద్రతా బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఖపియా అడవి ప్రాంతంలో 209 కోబ్రా బెటాలియన్ బృందాలు యాంటీ-నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. చీతా రాజేష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, చీతా అభిషేక్ యాదవ్తో కలిసి ఉన్న బృందం మావో యిస్టు గ్రూప్ను ఎదుర్కొంది. నక్సలైట్ బృందానికి సహదేవ్ మహతో నేతృత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్గౌడ గౌడర్ను ధార్వాడ్లోని ఆయన జిమ్లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మతమార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యంగా ఫోటోతనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ అత్తార్ను మరింత విచారించగా, అప్పటికే మత మార్పిడికి గురైన, టీసీఎస్కు చెందిన సహోద్యోగి గోపాల్ (పేరు మార్పు) అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును 'గుల్షన్'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితుడు దుస్తులు మార్చుకుని, మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.బాధితుడు చెప్పిన సంచలన విషయాలుపోలీసులు సదరు బాధితుడిని విచారించగా, అతన్ని ఎలా ప్రలోభపెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు. 2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండవాడు. తోటి ఉద్యోగులు అతని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలు పెట్టారు. బాధితుడి సొంత మతం సరైనది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరుతాయని నమ్మబలికారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితుడు వ్యతిరేకించినా, బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫోటో బాధితుడి వాంగ్మూలం ద్వారా, వర్క్ప్లేస్లో ఉద్యోగులను ఎలా టార్గెట్ చేస్తున్నారు, క్రమ పద్ధతిలో మత మార్పిడికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
‘విద్యార్థినులు షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ కావొద్దు’
సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్ ధరించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వైస్ ఛాన్సలర్ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్ చాన్సలర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల డీన్లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో కదిలిస్తోంది. తోటి స్నేహితులు ఆడుతుంటే చూసి మురిసిపోయిన ఓ దివ్యాంగ చిన్నారి నెటిజన్ల మనసు గెలుచుకుంది. హృదయాలను తాకిన ఈ దృశ్యానికి ఎమోషనల్గా కనెక్టయిపోతున్నారు. పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి సంబంధించిన ఈ సంఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. మనం స్వయంగా ఆటల్లో పాల్గొనకపోయినా.. ఇతరుల ఆనందాన్ని చూస్తూ కూడా సంతోషాన్ని పొందవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ఒక దివ్యాంగ చిన్నారి తన స్నేహితులు ఆడుకుంటుంటే చూసి.. వారితో పాటు నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంది. ఆమె శారీరక స్థితి వల్ల వారితో కలిసి పరిగెత్తలేకపోయినా.. ఆమె ముఖంలోని చిరునవ్వు నెటిజన్లను ఒకేసారి భావోద్వేగానికి, ఆనందానికి గురిచేసింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి మెట్ల వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు తరుముకుంటూ.. కుస్తీ పడుతూ ఆడుకుంటున్నారు. వారు అటు ఇటు పరిగెడుతూ నవ్వుతుంటే.. ఆ చిన్నారి అక్కడే కూర్చుని వారిని గమనిస్తూ.. వారితో పాటు కేరింతలు కొడుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.ఈ వీడియో నిడివి తక్కువైనా.. అది పంచిన భావోద్వేగం మాత్రం చాలా పెద్దది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారి తన బాధను మర్చిపోయి.. కేవలం తన స్నేహితుల ఆటను చూస్తూ వారితో కలిసి నవ్వుతోందని ఆ వీడియో వివరించింది. ఇది ఆ దృశ్యానికి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె చిరునవ్వు చూస్తుంటే ఒక పక్కన మనసు నిండిపోతోంది. మరోపక్క కళ్లు చెమర్చుతున్నాయి. చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి’’ అంటూ నెటిజన్లు దీవెనలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by diva choudhary (@deeva_2024) -
సొంత పార్టీ నేతలపై రాఘవ్ చద్దా సెటైర్లు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై చర్చ కొనసాగుతోంది.అయితే, ఈ కీలక బిల్లలుపై చర్చ జరిగే సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు.రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు. అయినా సరే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై చర్చ జరుగుతుంటే సభకు నేను హాజరయ్యాను. మరి వాళ్లద్దరేరి అంటూ ఆప్ పార్టీ ప్రతినిధి, పార్టీ నూతన రాజ్య సభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నా పార్టీకి చెందిన నాయకుడు, నా స్థానంలో కొత్త నియమితులైన ఉప నాయకుడు కూడా సభలో లేరు. ఆప్ ఇటీవల తొలగించబడిన ఉప నాయకుడిని నేను. నేను సభలోనే ఉన్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి చద్దాను ఇటీవల తొలగించడంతో పాటు, సభలో ఆయన మాట్లాడే సమయాన్ని కూడా పార్టీ తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు ఈ పరిణామం ఆజ్యం పోసింది. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్ కట్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మైక్ కట్ చేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు. -
దేశంలో తొలిసారి ఇంటింటి ఆదాయ సర్వే..
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యంగణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.సర్వే ఎలా చేస్తారంటే.. నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రపంచ దేశాల సరసన భారత్ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!NSO, MoSPI is undertaking India’s first National Household Income Survey (NHIS) from April 2026 to March 2027, capturing income to strengthen evidence-based policy formulation.Visit MoSPI’s official website for related updates and official information: https://t.co/V2xm331pY2… pic.twitter.com/1mmaukq88v— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 17, 2026 -
ఈ బిల్లు అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం: రాహుల్
ఢిల్లీ: నారిశక్తి వందన్ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు.కులగణనను బైపాస్ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
వంట గ్యాస్ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్
ఇరాన్ వార్ నేపథ్యంలో నెలకొన్న వంట గ్యాస్ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్లైన్ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటేచెర్లపల్లి – నాగ్పూర్ పైప్లైన్శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్లైన్పారాదీప్ – రాయ్పూర్ పైప్లైన్ఝాన్సీ – సీతార్గంజ్ పైప్లైన్ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్వర్క్లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనాఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ
ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఓటింగ్కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్కు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్ తప్పదా?
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది(ఏప్రిల్ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్ 15న). అదే సమయంలో..గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్ యాంటీసిపేటరీ బెయిల్పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్నా? లేక ఉగ్రవాదినా? అని పవన్ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్ ఖేరాను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.లొంగిపోతే మంచిదిసుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు.


