National
-
పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!
వడోదరా: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వడోదరాకు చెందిన భావిక్ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్ నుంచి భారత్కు వచ్చిన భావిక్.. జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్లో పని చేస్తున్న భావిక్,.. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది. తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్ వెళ్లాక ఫోన్ చేస్తానన్నాడు. టేకాఫ్ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు. -
Plane Crash: ఉద్యోగులకు టాటా గ్రూప్ చైర్మన్ లేఖ
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ అనేది టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్.. తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన. ‘నిన్న(గురువారం, జూన్ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. #AirIndiaFlightCrash | Tata Group Head Natarajan Chandrasekaran writes to his colleagues, "What occurred yesterday was inexplicable, and we are in shock and mourning. To lose a single person we know is a tragedy, but for so many deaths to occur at once is incomprehensible. This… pic.twitter.com/XboB94W6DG— ANI (@ANI) June 13, 2025 కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు. -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలుఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్పోర్ట్కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్తో నా కూతురు ఎయిర్పోర్ట్కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు. -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
భారత వాయుసేన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వారంలో రెండోసారి..
ఛండీగఢ్: భారత వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. పంజాబ్లోని పఠాన్కోట్ (Pathankot)లో భారత వాయుసేన అపాచీ హెలికాప్టర్-M17 అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. JK: Air Force #Apache helicopter #M17 makes emergency landing in Pathankot....... pic.twitter.com/dQSNmP6NYa— Devesh , वनवासी (@Devesh81403955) June 13, 2025అయితే, వారం రోజుల వ్యవధిలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. -
రోహిణి, రూపా బదిలీ
బొమ్మనహళ్లి: ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి.రూపాతో పాటు పలువురు ఉన్నతాధికారులను సర్కారు బదిలీ చేసింది. ఇందులో రోహిణి, రూపా ఇద్దరు తగవులు పడుతూ కేసులు పెట్టుకోవడం తెలిసిందే.కర్ణాటకలో పలువురు అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంటు బోర్డు ఎండీగా ఉన్న రూపాను బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ఫోర్స్ అదనపు డిజీపీగా బదిలీ చేశారు. రోహిణిని వ్యవసాయ శాఖ, ఆహార సంస్కరణల విభాగం కార్యదర్శి స్థానం నుంచి కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎస్బీ శెట్టణ్నవర్ను బెళగావి స్థానిక కమిషనర్గా, అక్రం పాషాను ఆర్టీసీ ఎండీగా నియమించారు.వీరి మధ్య వివాదం ఇలా.. ఇదిలా ఉండగా.. ఒక మహిళా ఐఏఎస్.. ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వీరి వ్యవహారంపై కేసు కూడా నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్రపరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.ఐపీఎస్ రూపా విచారణకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.రాజీ కుదరలేదు..!వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా అంటున్నారు. -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
పైలట్ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్ సుమీత్కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్ తన తండ్రికి ఫోన్ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.కాగా, అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్ క్లైవ్కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది. -
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు."కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్పోర్ట్ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు. -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
‘ఇజ్రాయెల్ దాడులు’.. ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్ భయానక దాడులు చేస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. ట్విట్టర్ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అడ్వైజరీలో పేర్కొంది.The Embassy of India in Iran posts an advisory for Indian nationals living in Iran."In view of the current situation in Iran, all Indian nationals & persons of Indian origin in Iran are requested to remain vigilant, avoid all unnecessary movements, follow the Embassy’s Social… pic.twitter.com/nxgvL0AtDZ— ANI (@ANI) June 13, 2025మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ విమాన రాకపోకలపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశాలకు, ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎయిర్ లైన్స్ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు సూచించారు. -
విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ పనిచేశారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు ఛైర్మన్గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్కోట్ వెస్ట్లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
ఘోర విషాదాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. → 2020 ఆగస్టు 7: కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వేపై ఎయిర్ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. → 2010 మే 22: కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737–800 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్టాప్ రన్వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్ తడబడినట్లు గుర్తించారు. → 2000 జూలై 17: బిహార్ రాజధాని పాటా్నలో అలయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు. → 1996 నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. → 1990 ఫిబ్రవరి 14: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు. → 1988 అక్టోబర్ 19: గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. → 1978 జనవరి 1: ముంబై నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. → 1973 మే 31: ఢిల్లీ పాలమ్ ఎయిర్ఫోర్టులో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 440 ల్యాండింగ్ కంటే ముందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. -
పక్షి ఢీకొట్టిందా?
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787–7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్తో సహా ఏడుగురు చనిపోయారు. రన్వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్వేపై 700సార్లు! పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షిల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని పక్షులూ ముప్పుకాదు 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులే కారణం. -
మట్టి నిండిన భోజనం!
అహ్మదాబాద్: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్ టేబుల్స్పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్ టేబుల్స్.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్ భవనంలో రెసిడెంట్ వైద్యులు నివాసం ఉంటారు. నేరుగా భవనంపైనే కూలిన విమానం.. సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. విమాన ఫ్యూజ్లేజ్లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. -
Air India flight crash: ఆశలు బుగ్గిపాలు
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఆరేళ్లుగా లండన్లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమీ వ్యాస్ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్ భారత్కు వచ్చి కుటుంబంతో సహా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులనీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్పోర్ట్కు బయల్దేరారు. లండన్కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం.. -
హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ
మాస్కో/లండన్/వాషింగ్టన్/పారిస్/బ్రస్సెల్స్: మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలుఅంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదలు మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. ‘‘ ఎంతో మంది బ్రిటిష్ జాతీయులతో లండన్కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్మార్మర్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి చేపట్టిన డీఎస్సీ–2025 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ పోసిన ఆనంద్సాయికి సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ కోటాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన ఆనంద్ సాయి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డీఎస్సీలో 5.72 లక్షల మంది అభ్యర్థులు వివిధ షిఫ్టులలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష రాస్తారని, అనంతరం మార్కులు ‘నార్మలైజేషన్‘ పద్ధతిలో ఇవ్వడం అవాస్తవంగా, అన్యాయంగా ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషనర్ తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ డా. చారు మాథూర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పారు. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆనంద్సాయిని ధర్మాసనం ఆదేశించింది. -
కలియుగ శ్రవణ కుమారుడు
రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్ అయింది. బిహార్లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది. పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్ బై ఇండియా!
ఆయనొక యోగా ఔత్సాహికుడు.. భారత్లో యోగా ప్రోగ్రామ్లు నిమిత్తం అహ్మదాబాద్కు వచ్చారు. కొన్ని రోజుల పాటు అహ్మదాబాద్లోని ద హౌస్ ఆఫ్ ఎంజీలో బస చేశారు. ఇక ఇక్కడ ప్రోగ్రామ్లు పూర్తి కావడంతో భారత్ గురించి, అహ్మదాబాద్లోని తాను బస చేసిన హోటల్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా బ్రిటన్లో ఉన్న భార్యకు షేర్ చేశాడు. అహ్మదాబాద్లోని ద హౌస్ ఆఫ్ ఎంజీపై ప్రశంసలు కురిపించారు. నిజంగానే ఒక హెరిటేజ్ హోటల్ అని, భారత్లోని తన అనుభవాలు అద్భుతమని ఇలా ఒక్కో స్టోరీని పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి(బుధవారం, జూన్ 11) ఇదే ఇక్కడ చివరి రాత్రి అంటూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఇప్పుడు అదే వైరల్గా మారింది. దాంతో పాటు విమానం ఎక్కేముందు ‘గుడ్ బై ఇండియా’ అని బ్రిటన్కు చెందిన జమీ మీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాసేపటికి ఆయన విమానం ప్రమాదంలో మృతి చెందడం జరిగిపోయాయి. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! కాగా, గురువారం(జూన్ 12) అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా టేకాఫ్ తీసుకున్న తర్వాత జనవాసాలపై కూలిపోయింది. బీజే మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు. అయితే విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్రరు బ్రతికిబయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన టాటా గ్రూప్
ఢిల్లీ,సాక్షి: ఎయిరిండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి అందిస్తున్నట్లు తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. అదనంగా, ఎయిరిండియా విమానం కూలిన బీజే మెడికల్ హాస్టల్ను పుననిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ను విడుదల చేశారు. Tata Group will provide Rs 1 crore to the families of each person who has lost their life in this tragedy. We will also cover the medical expenses of those injured and ensure that they receive all necessary care and support. Additionally, we will provide support in the building… pic.twitter.com/jBPxfmo4at— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025 -
మృత్యుంజయుడు రమేశ్
అహ్మదాబాద్: రమేశ్ విశ్వాస్ కుమార్ బుచార్వాడ.. అత్యంత అదృష్టవంతుడంటే ఇతడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడు. 38 ఏళ్ల రమేశ్ బ్రిటీష్ జాతీయుడు. తన సోదరుడితో కలిసి లండన్కు పయనమయ్యాడు. ఏఐ171 విమానంలో 11ఏ సీట్లో కూర్చున్నాడు. అత్యవసర ద్వారానికి వెనుకే ఈ సీటు ఉంది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకున్న తర్వాత రమేశ్ గాయాలతో బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు వ్యక్తుల సాయంతో అంబులెన్స్ వద్దకు చేరుకున్నాడు. విమానంలోని ఇతర ప్రయాణికుల గురించి జనం అతడిని ఆరా తీశారు. చాలామంది రమేశ్ చుట్టూ గుమికూడారు. ప్రయాణికులంతా అక్కడే(ఘటనా స్థలంలో) ఉన్నారు అంటూ బలహీన స్వరంతో బదులిచ్చాడు. విమానం ఒక్కసారిగా పేలిపోయిందని, తన చుట్టూ శకలాలే కనిపించాయని చెప్పాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జి.ఎస్.మాలిక్ తెలిపారు. (రమేష్ విశ్వకుమార్ కుమార్ ఎయిరిండియా విమానం టికెట్)ప్రయాణం వాయిదాతో బతికాడుఇదే విమానంలో వెళ్లాల్సిన శావ్జీభాయి తింబాడియా చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం అతడి పాలిట వరంగా మారింది. లండన్లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లడానికి ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. కుమారుడే విమానం టికెట్ బుక్ చేశాడు. విమానంలో సీటు కూడా తింబాడియాకు కేటాయించారు. కానీ, తింబాడియా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. తన ప్రయాణాన్ని నాలుగు రోజులపాటు వాయిదా వేసుకున్నాడు. అదే ఆయన ప్రాణాన్ని కాపాడింది. గురువారం జరిగిన ప్రమాదం గురించి తెలిసి తింబాడియా దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. తాను నమ్మే దైవమైన స్వామి నారాయణ్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.Miracle amidst tragedy!!!Ramesh Vishwashkumar, seated on 11A, is the sole survivor of the Air India crash in Ahmedabad. He jumped out and walked away injured. He’s currently undergoing treatment at the hospital.#AhmedabadPlaneCrash #Ahmedabad pic.twitter.com/pWIHUD7kG5— Shivangi Thakur (@thakur_shivangi) June 12, 2025 -
మేడే.. మేడే.. మేడే!
న్యూఢిల్లీ: విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? దీనిని ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?105 ఏళ్ల క్రితం మాట..సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే ఏం జరుగుతుంది?ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. -
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం ప్రయాణికులు దుర్మరణం చెందినట్ల తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు.విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..ఈ ప్రమాదం కూలిన వెంటనే దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి.. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడారు. ‘ నేను విమానం కూలినప్పుడు నేను ఇంటిలోనే ఉన్నా. ఒక్కసారిగా బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందని బయటకి వచ్చి చూశాను. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించి ఉంది. అక్కడకు వెళ్లి చూశాను. విమానం కూలిపోయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అక్కడంతా భయానకంగా కనిపించింది’ అని పేర్కొన్నారు. VIDEO | Ahmedabad plane crash: Here's what an eyewitness said:"I was at home when we heard a massive sound. When we went out to see what had happened, there was a layer of thick smoke in the air. When we came here, dead bodies and debris from the crashed aircraft were scattered… pic.twitter.com/Km0xCm9yde— Press Trust of India (@PTI_News) June 12, 2025 -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది. -
హాస్టల్పై కూలిన విమానం.. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి!
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad.#AirIndiaflight#ahmedabad#gujarat pic.twitter.com/mBAC7Psoys— RajawardhanReddy.Mule (@RajawardhanRed2) June 12, 2025 ⚡ As per initial reports the Air India plane crashed directly on the BJ Medical College UG hostel mess in Meghani Nagar, Ahmedabad. More details awaited pic.twitter.com/duJTCL1YTn— OSINT Updates (@OsintUpdates) June 12, 2025 #WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou— ANI (@ANI) June 12, 2025 -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్లైనర్తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు,ఒకకెనడియన్, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది ప్రాణాలున్నారు అనేది సందేహమే.#WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్)బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్గా అఖిల్ అర్థాంగి2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్బ్లోయర్ సామ్ సలేహ్పూర్ డ్రీమ్లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్లైనర్ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట. -
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
వింత కేసు: బైక్, డబ్బు సరిపోదు, కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటలా ఉంటున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా క్రేజ్ వంటి రకరకాల కారణాలతో వైవాహిక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరకట్నం దంపతుల పాలిట శాపంగా మారి బాంధవ్యాన్ని ముక్కలు చేస్తోంది. ఎన్నో వరకట్నం కేసుల్లో నగదు లేదా బంగారం వంటి అత్తింటి డిమాండ్లు గురించి విని ఉంటాం. కానీ ఇలాంటి డిమాండ్లతో కూడిన వరకట్నం కేసు మాత్రం ఇదే మొదటిది. వివరాల్లోకెళ్తే..బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళకు 2021లో అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైన రెండు నెలల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ.. బైక్, మరికొంత నగదు ఇవ్వాల్సిందే అంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు అత్తింటివారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడూ మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడి కోసం కిడ్నీ కూడా దానం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీప్తి భర్త పెళ్లికి ముందు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నడు. కానీ దీప్తికి ఆ విషయం పెళ్లైన తర్వాతే తెలిసింది. మొదట్లో అత్తంటి వారి డిమాండ్లు ప్రతీఇంట్లో ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంది. అది రాను రాను మితిమీరి..ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేంత వరకు దారితీశాయి. ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే కుటుంబంలో మరింత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో పోలీసులను సంప్రదించింది దీప్తి. ఆ నేపథ్యంలో అధికారులు ఇరువురి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా..అది కూడా విఫలమైంది. అదీగాక అత్తింటి వేధింపులతో విసిగిపోయిన దీప్తి భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించి, విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు భర్త మాత్రం ససేమిరా అంటున్నాడు. అలాగే పోలీసులు దీప్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు మరో ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఎక్కడైనా వరకట్నం కేసులో..అధిక డబ్బు లేదా బంగారం కోసం డిమాండ్ చేయడం వంటివి ఉంటాయి ఏకంగా ఓ వ్యక్తి అవయవాన్ని సైతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన వింత కేసు ఇదేనని చెబుతున్నారు అధికారులు.(చదవండి: చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్ విషయాలు..) -
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
👉అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా పర్యటనవిమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతివిమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదుబాధిత కుటుంబాలకు అండగా ఉంటాండీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాంగుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశానుమృతదేహాల వెలికితీత పూర్తైంది👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..
భోపాల్: మనం ఎన్నో రైల్వే వంతెనలను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే రైల్వే వంతెనను ఎక్కడా చూసి ఉండం. ఆ వంతెన మన ఊహకు అందని రీతిలో నిర్మితమయ్యింది. ఈ వింత రైల్వే వంతెన గురించి తెలుసుకున్న వారంతా దానిని చూసేందుకు పరుగులు తీస్తున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఈ రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్ఓబీ)అధికారికంగా ప్రారంభించకముందే, చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెన అత్యంత విచిత్రంగా 90 డిగ్రీల మలుపును కలిగి ఉండటాన్ని అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు స్థానికులు వంతెన ఇలావుంటే ప్రమాదాలు జరుగుతాయేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఎదురుకావడం సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటంతో వంతెను ఈ విధంగా నిర్మించక తప్పలేదని వంతెను నిర్మించిన అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన మహామై కా బాగ్, పుష్పా నగర్,స్టేషన్ ప్రాంతం నుండి న్యూ భోపాల్కు ప్రజల రాకపోకలను సులభతరం చేయనుంది. 2023, మార్చిలో దీని నిర్మాణానికి ముందు.. ఇది పూర్తయ్యాక ఐష్బాగ్ ప్రాంత ప్రజలు రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండాల్సిన పని లేదని అధికారులు చెప్పారు. మూడు లక్షల మంది ఈ వంతెన కారణంగా ప్రయోజనం పొందుతారని కూడా తెలిపారు.రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఓవర్బ్రిడ్జి 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు కలిగివుంది. అయితే ఈ వంతెనలో ఉన్న 90 డిగ్రీల మలుపు కారణంగా పలువురు ప్రమాద భయం ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియా యూజర్స్, స్థానికులు ఈ వంతెన డిజైన్పై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ రకమైన మలుపు ప్రమాదాలకు దారితీయవచ్చని, వాహనాలకు ఈ మలుపును గమనించడం కష్టంగా మారవచ్చని అంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (బ్రిడ్జి డిపార్ట్మెంట్) చీఫ్ ఇంజనీర్ వి డి వర్మ మీడియాతో మాట్లాడుతూ మెట్రో స్టేషన్ కారణంగా, ఈ ప్రాంతంలో పరిమితమైన భూమి లభ్యత ఉంది. అందుకే వంతెనను ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఓవర్బ్రిడ్జిపై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయని, భారీ వాహనాలను అనుమతించబోమని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు -
కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు
భఠిండా: పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పార్క్ చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్ అయిన కారు అని సమాచారం. కౌర్కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలున్నాయి.ప్రాథమికంగా దీనిని హత్యకేసుగా పరిగణిస్తున్నామని బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే.. -
హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే..
న్యూఢిల్లీ: మేఘాలయ ‘హనీమూన్’ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేయించిదని వెల్లడయ్యింది. సోనమ్తో పాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఇండోర్ నుంచి మేఘాలయకు తీసుకువచ్చారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వారిని షిల్లాంగ్లో విచారించనుంది.సోనమ్ (25),రాజా (29)లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగింది. వారు హనీమూన్ కోసం మే 20న అస్సాంలోని గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో అదృశ్యమయ్యారు. జూన్ 2న వీసావ్డాంగ్ జలపాతం సమీపంలోని ఒక లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జూన్ 9న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లో సోనమ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తరువాత ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజాను హత్య చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వివాహానికి ముందే రాజాను చంపడానికి సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో సోనమ్ తాను, తన ప్రియుడు రాజ్తో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు సోనమ్ అంగీకరించింది. భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సోనమ్ను విచారించేందుకు ‘సిట్’ 20 ప్రశ్నల జాబితాను సిద్ధం చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రశ్నలివే..1. మేఘాలయలో మీరు, రాజా హనీమూన్ను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు?2. రిటర్న్ టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకోలేదు? అది కూడా ప్రణాళికలో భాగమేనా?3. వివాహానికి ముందు మీకు రాజ్ కుష్వాహా తెలుసా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.4. యాప్ చాట్లో హనీమూన్ సమయంలో మీరు రాజ్ కుష్వాహాతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. మీరిద్దరూ దేని గురించి చర్చించుకున్నారు?5. నిందితునికి మీ లైవ్ లొకేషన్ను ఎందుకు పంపించారు?6. మే 23న మీరు ముగ్గురు వ్యక్తులతో మావ్లింగ్ఖైట్లో కనిపించారు. వారి గురించి మాకు ఏమి చెబుతారు?7. మే 22న స్థానిక గైడ్ ఆల్బర్ట్ సర్వీస్ను ఎందుకుతిరస్కరించారు? 8. రాజా హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను గైడ్ ఆల్బర్ట్ గుర్తించాడు. వారిని మీరు, రాజ్ కుష్వాహా నియమించుకున్నారా?9. రాజా రఘువంశీని హత్య చేయడానికి హంతకులను ఎవరు సంప్రదించారు?10. రాజా రఘువంశీ హత్య కోసం హంతకులకు ఎంత డబ్బు చెల్లించారు? దానిని ఎవరు చెల్లించారు? అది నగదు రూపంలో లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా చెల్లించారా?11. రాజా హత్యకు మేఘాలయను మీరు, రాజ్ కుష్వాహా ఎందుకు ఎంచుకున్నారు? మరెక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ మీకు ఉందా? 12. హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగితే, రాజ్ కుష్వాహా మీతో మేఘాలయకు ఎందుకు రాలేదు?13. హత్య తర్వాత మీరు 17 రోజులు ఎక్కడికి వెళ్లారు? పోలీసుల నుంచి దాక్కునేందుకు మీకు ఎవరు సహాయం చేసారు?14. రాజా రఘువంశీ హత్య తర్వాత పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఏమి ప్లాన్ చేశారు?15. రాజాకు చెందిన స్మార్ట్ వాచ్, ఫోనును పోలీసులు కనుగొన్నారు. అయితే రాజాకు చెందిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది. దీని గురించి మీరేమి చెబుతారు?16 రాజాను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని మీరు ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారు?17 రాజా తల్లి మీరు మేఘాలయకు వెళ్లడానికి ఇష్టపడలేదని, మీ పట్టుదల కారణంగానే అంగీకరించారని చెబుతున్నారు. మీరు రాజాను బలవంతంగా తీసుకువెళ్లారా?18. వివాహ వేడుకల సమయంలో సంతోషంగా లేనట్లు వీడియోలలో కనిపిస్తోంది. కారణమేమిటి?19 మీరు రాజా రఘువంశీని వివాహం చేసుకోకూడదనుకుంటే, ముందుగా మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?20. రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు మీరు ప్లాన్ చేశారా?ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
‘స్కార్పియో’ బీభత్సం.. మహిళా కానిస్టేబుల్ మృతి.. ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు
పట్నా: బీహార్లోని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ పురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై బుధవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం గస్తీలో ఉన్న పోలీసులను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోని ఒక మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.శ్రీకృష్ణ పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది అటల్ పాత్ వెంట వెళుతున్న సాధారణ వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఫలితంగా ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.పట్నా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ తెలిపిన ప్రకారం గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతిచెందగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..
న్యూఢిల్లీ: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనమ్లు బస చేసిన హోమ్స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనమ్ స్టేహోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళ సూత్రాన్ని అక్కడే వదిలివెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఎన్ఆర్ మారక్ మీడియాకు తెలిపారు.అనుమానాలు రేకెత్తించిన మంగళసూత్రంరఘువంశీ, సోనమ్లు బసచేసిన హోమ్స్టే గదిలో లభ్యమైన ఒక సూట్కేసులో సోనమ్ మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళుతుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనమ్ భర్త రాజా రఘువంశీని ఆమెతో పాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనమ్ ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు.ఫోటోలు తీసుకునే నెపంతో..మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ, కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీసు అధికారి మారక్ మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తరువాత సోనమ్ ఒక నిందితుని స్కూటీపై కూర్చుని వెళ్లిందని, మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసు అధికారి పేర్కొన్నారు. మృతదేహాన్ని విసిరేయడంతో సోనియా సహాయంతరువాత వారంతా రాజా మృతదేహాన్ని మౌలాఖియాత్ అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్పారు. రాజా మృతదేహాన్ని లోయలోకి విసిరివేయడంలో సోనమ్ కూడా తమకు సహాయం చేసిందని నిందితులు చెప్పారని పోలీసు అధికారి మారక్ తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని అన్నారు. మే 11న ఇండోర్లో రాజా, సోనమ్లకు వివాహం జరిగింది. తరువాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
ఆ రోజు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఈ నెలారంభంలో ఆర్సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేడియం అంటే భయం మోనీశ్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్ నోటీస్ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్సీబీ మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. -
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్టీ శ్రీనివాస్కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. -
మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం..
గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్లో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో దాచిన ట్రాలీ బ్యాగ్లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు, ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్ను సౌత్ ఇంద్రానగర్ కబర్ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.మర్నాటి ఉదయం దిబాకర్తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
కుటుంబ వ్యాపారం.. నా దారి నేను చూసుకుంటా..
సాక్షి, స్పెషల్ డెస్క్: తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు.హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ప్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్లో ఆన్లైన్లో నిర్వహించారు.మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్కాంగ్లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు.వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం.ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘హురున్’ గణాంకాల ప్రకారం 2024 నాటికి దేశంలో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. అంత క్రితం ఏడాదిలో ఈ సంఖ్య 259. పదేళ్ల క్రితం 109 మాత్రమే. వీరిలో 70% మంది రూ.1,28,25,000 కోట్ల సంపదను వారసత్వంగా అందుకోనున్నారు. -
11 ఏళ్లలో 33 తప్పులు
కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్ను నియమించాలి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు. -
ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ఆవిర్భావం సహజమే
న్యూఢిల్లీ: కరోనా వైరస్లలో కొత్తగా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ పుట్టడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సార్స్–కోవ్–2 వేరియంట్లో సహజ ఉత్ప్రరివర్తనమని భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. భారత్లో వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో 200 కేసులు ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కారణంగా సోకాయని నిర్దారణ కావడంతో ఈ అంశంపై భార్గవ స్పందించారు. ‘‘ సార్స్–కోవ్–2 తరచూ సహజంగా పరివర్తనం చెందుతోంది. దాని ఉత్పరివర్తనమే ఎక్స్ఎఫ్జీ. ఇది సహజ ఆవిర్భావమే’’ అని ఆయన అన్నారు. జూన్ 11వ తేదీనాటికి దేశవ్యాప్తంగా కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 7,000 మార్కును దాటింది. గత 24 గంటల్లోనే 300 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్ కారణంగా కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సార్స్–కోవ్–2 జన్యువిశ్లేషణ కన్సార్షియం(ఇన్సాకాగ్) తాజా గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా 206 దాకా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ కేసులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎక్స్ఎఫ్జీ కేసులున్నాయి. వాటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 89, పశ్చిమబెంగాల్ నుంచి 49, కేరళలో 15, తమిళనాడులో 16, గుజరాత్లో 11, మధ్యప్రదేశ్లో 6, ఆంధ్రప్రదేశ్లో ఆరు, ఒడిశాలో మూడు, తెలంగాణ ఒక కేసు నమోదయ్యాయి. ‘‘మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఎక్స్ఎఫ్జీ వేరియంట్ ఏమార్చగలదని తొలుత వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో వ్యాధి ముదురుతుందనే బలమైన ఆధారాలు లేవు’’ అని భార్గవ అన్నారు. -
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్కు చెందిన యువ పాప్సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్నైట్ మెసేజ్లు బిష్ణోయ్కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్బిహా గ్యాంగ్కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
జననాల తగ్గుదల వరమా.. శాపమా?
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.ఇదీ పరిస్థితి!1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.ఆందోళన అక్కర్లేదు!జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు. ‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు. ‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు. ‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్పర్ట్లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2025 ఫలితాలు విడుదల
సాక్షి,ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలు బుధవారం (జూన్11)న యూపీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు యూపీఎస్సీ ఫారెస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. -
Lalu: అట్లుంటది మరి లాలూతోని!
పాట్నా: తాను చేసే ఏ పనిలోనైనా వైవిధ్యం వెతుక్కునే వ్యక్తి ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనకు తగ్గట్లే ఆయన అభిమాన గణం ఉంటుంది కూడా!. ఇవాళ 78వ పుట్టిరోజు. కార్యకర్తల కోలాహలం.. లాలూ యాదవ్ జిందాబాద్ నినాదాల నడుమ తన నివాసంలో 78 కేజీల లడ్డూను తల్వార్తో కోశారాయన.లాలూ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమది రాజకీయేతర సంబంధం కూడా అని పేర్కొన్నారు. Video | RJD chief Lalu Prasad Yadav celebrates 78th birthday at his residence in Patna by cutting a 78-kg laddu cake with a sword. Large number of party workers gathered to extend wishes. pic.twitter.com/1ZIhrQuv9g— NDTV (@ndtv) June 11, 2025VIDEO Source: NDTVమరోవైపు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలియజేశారు. లాలూ చిత్రాన్ని కౌగిలించుకుని ‘‘రాత్రి చిమ్మచీకట్లు అలుముకున్నాయంటే.. కాసేపట్లో తెల్లవారబోతోందని అర్థం’’ అంటూ ఓ సందేశం ఉంచారు. “अंधेरा जितना गहरा होगा, सुबह उतनी ही नजदीक होगी।” #TejPratapYadav #Bihar #India pic.twitter.com/gAdlvZFtlb— Tej Pratap Yadav (@TejYadav14) June 9, 2025తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఓ యువతితో ఉన్న ఓ పోస్ట్ చేసి పెను దుమారం రేపారు. పార్టీ ఆయనపై క్రమశిక్షణా చర్యల కింద ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ఆయన ఇచ్చుకున్న వివరణలను లాలూ పరిగణనలోకి తీసుకోలేదు. -
ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
న్యూఢిల్లీ: మేఘాలయలో అదృశ్యమైన కొత్త జంట ఉదంతం లెక్కలేన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ చెబుతున్న విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోనమ్ తన భర్తను ఈశాన్య రాష్ట్రానికి తీసుకువెళ్లి అంతమొందించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలంటూ..సోనమ్ ముందుగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు వెళదామని రాజా రఘువంశీని ఒప్పించిదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. రాజాను తొలుత గౌహతికి, తరువాత మేఘాలయకు తీకువెళ్లాలని సోనమ్ ప్లాన్ చేసింది. వివాహం తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత మే 15న సోనమ్ తన పుట్టింటికి వచ్చింది. అక్కడ తన ప్రియుడు రాజ్కు పోన్ చేసి, ‘ప్రణాళిక’ను సిద్ధం చేసిందని పోలీసులు తెలిపారు. ఇండోర్లో మేఘాలయ పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించినప్పుడు ఈ ఉదంతంలో సోనమ్ ప్రమేయం ఏ మేరకు ఉందనేది వెల్లడయ్యింది.‘అందరినీ ఉరి తీయాలి’నిందితులు విశాల్, ఆనంద్, ఆకాష్లు రాజా రఘువంశీని చంపడంలో విఫలమైతే, తానే ఫోటో తీయాలనే నెపంతో, భర్తను కొండ అంచునకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అతనిని తోసేస్తానని సోనమ్ తన ప్రియునితో చెప్పినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమయ్యింది. ఒకవేళ నేరం బయటపడితే సోనమ్, రాజాలు నేపాల్కు పారిపోయేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా రాజా రఘువంశీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుని హత్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉరితీయాలన్నారు. వారిలో సోనమ్ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలోని వారు కూడా ఉన్నారన్నారు. సోనమ్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని కూడా ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా.. -
‘హనీమూన్’ కేసు: సోనమ్ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్ల ‘హనీమూన్ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్లు సోనమ్కు సహకరించారని, ఇందుకు ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
ఏసీ కూలింగ్ ఇకపై 20 డిగ్రీలే!
న్యూఢిల్లీ: ఏసీ లేనిదే నిద్రపట్టని వారు ఎందరో! కూలింగ్ను మాగ్జిమం పెట్టుకుని పడుకుంటే గానీ చాలామందికి రాత్రి తెల్లారదు. అలాంటి వారికి ఇది చేదువార్తే. ఏసీ కూలింగ్కు పరిమితి విధించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. దానిప్రకారం కూలింగ్ను 20 డిగ్రీల కంటే తగ్గించడం, గరిష్టంగా 28 డిగ్రీల కంటే ఎక్కువ పెట్టుకోవడం కుదరదు. ఈ మేరకు ఏసీ ‘టెంపరేచర్ రేంజ్’ త్వరలో అమల్లోకి రానుంది. ప్రయోగాత్మకంగా ఈ చర్య చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మంగళవారం ప్రకటించారు. తద్వారా మితిమీరిన కరెంటు వాడకానికి అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ నిబంధన ఇళ్లు, ఆఫీసులతో పాటు కార్లకు కూడా వర్తించనుంది. భారత్లో ప్రస్తుతం ఏసీల చల్లదనాన్ని 16 నుంచి 30 డిగ్రీల దాకా నియంత్రించుకోవచ్చు. -
విద్యార్థుల సమస్యలపై రాహుల్ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ
ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్ కోరారు.దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల బీహార్లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియాంకకు హైకోర్టు సమన్లు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. 2024 నవంబర్లో కేరళలోని వయనాడ్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ, బీజేపీ మహిళా నేత నవ్య హరిదాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు సమన్లు జారీ చేసింది.గత వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ, నాటి పోల్ రద్దు కోరుతూ నవ్య హరిదాస్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల అఫిడవిట్లో తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం చెల్లదని ప్రకటించాలని నవ్య కోరారు.న్యాయవాది అయిన నవ్య హరిదాస్ సమర్పించిన పిటిషన్పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి కె బాబు విచారించారు. ప్రియాంక రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన పెట్టుబడులు, చరాస్తుల వివరాలను దాచిపెట్టారని నవ్య ఆరోపించారు. వయనాడ్ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో 2024, నవంబర్ 13న వయనాడ్కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె తన సమీ ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మోకేరిని ఓడించారు. నాడు వయనాడ్లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖపోరు జరిగింది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా.. -
భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్లు హనీమూన్కు వెళ్లి, అదృశ్యమయ్యాక ఈ ఉదంతం పలు మలుపులు తిరుగుతూ, సినిమా కథను తలపిస్తోంది. ఈ ఘటనలో రాజా రఘువంశీ మే 23న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం జూన్ 2న లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఎక్కడుందో తెలియలేదు. భర్త హత్య దరిమిలా సోనమ్పై కూడా దాడి జరిగివుంటుందని, లేదా కిడ్నాప్ చేసివుంటారనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. అయితే ఉత్తరప్రదేశ్లో సోనమ్ జాడ కనుగొన్నాక మేఘాలయ పోలీసులు.. భర్తను హత్య చేసిన సోనమ్ ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించిందనే వివరాలు సేకరించారు.ప్రియునితో జతకట్టి..సోనమ్, రఘువంశీలకు మే 11న వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లేందుకు మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. ఆ తర్వాత వారు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లారు. అయితే సోనమ్ తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారంలో ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాను ప్రేమిస్తోంది. తల్లిదండ్రుల ఒత్తిడితో రాజా రఘువంశీని వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక ప్రియుని సాయంతో భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నేపధ్యంలో ప్రియుడు రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడు. సోనమ్ వారికి రూ. 20 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు.కొత్త జంటను అనుసరించిన నిందితులుమే 23న, సోనమ్, రాజా రఘువంశీలు మావ్లాఖియాత్లోని ఒక కొండ పైకి చేరుకుని, జలపాతాన్ని చూడాలనే ఆలోచనతో ట్రెక్కింగ్కు వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు వారిని వెంబడించారు. ఈ దంపతులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే, రాజా రఘువంశీని అంతమొందించాలని సోనమ్ ఆ ముగ్గురు నిందితులను కోరిందని, ఆ తరువాత భర్త మృతదేహాన్ని లోయలో విసిరేయాలని వారికి చెప్పిందని పోలీసులు చెబుతున్నారు. భర్త హత్య తర్వాత సోనమ్.. మావ్కాడోక్ నుండి షిల్లాంగ్కు టాక్సీలో వెళ్లింది. అనంతరం ఆమె టూరిస్ట్ టాక్సీలో గౌహతికి చేరుకుందని, అక్కడి నుంచి రైలులో ప్రయాణించిందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.హత్య జరిగిన రోజు..ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గౌహతి నుంచి రైలులో ఇండోర్కు చేరుకుంది. రాజ్ కుష్వాహా కుష్వాహా స్నేహితులైన ముగ్గురు నిందితులు సోహ్రా నుండి గౌహతికి టాక్సీలో వచ్చారు. ఆ తరువాత వారు రైలులో ఇండోర్కు వచ్చారు. రాజా రఘువంశీ హత్య తరువాత సోనమ్తో పాటు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పలు ప్రణాళికలు వేసుకున్నారని కేసు దర్యాప్తు చేస్తున్నమేఘాలయ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. హత్య జరిగిన రోజు ఆమె రాజ్ కుష్వాహాతో టచ్లో ఉందని, అతను ఆ ముగ్గురు నిందితులతో సంభాషించాడని పోలీసులు నిర్ధారించారని ఎస్పీ వివేక్ సయీమ్ పేర్కొన్నారు. అయితే సోనమ్, రఘువంశీలు ఇంతకు ముందు మేఘాలయకు వెళ్లి, హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్థారించలేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత దర్యాప్తు కోసం పోలీసు రిమాండ్కు తీసుకువెళతామని ఎస్పీ తెలిపారు.ఇది కూడా చదవండి: శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా -
భారత విద్యార్థిపై అమెరికా అరాచకం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: భారత విద్యార్థిని నేలపై పడేసి, పెడరెక్కలు వెనక్కు విరిచి కట్టి బేడీలు వేయడాన్ని అమెరికా సమర్థించుకుంది. ‘‘అతనిపై అలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను, వీసా ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు’’ అని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాకపోతే బాధిత విద్యార్థి ఎటువంటి వీసా ఉల్లంఘనకు పాల్పడిందీ వివరించలేదు.శనివారం రాత్రి భారత్కు తిప్పి పంపించే క్రమంలో సదరు విద్యార్థి పట్ల నెవార్క్ విమానాశ్రయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అత్యంత అనుమాషంగా వ్యవహరించడం తెలిసిందే. తాను నేరగాన్ని కాదని బాధితుడు అరుస్తున్నా పట్టించుకోలేదు. కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు దీన్నంతటినీ వీడియో తీసి ఎక్స్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిస్సహాయుడైన ఒక అమాయకున్ని కరడుగట్టిన నేరస్తునిలా చూశారంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అమెరికా మాత్రం సమర్థించుకోవడం గమనార్హం.I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025‘‘చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతాం. కానీ ఎవరికైనా సరే, మా దేశంలోకి ప్రవేశం ఒక హక్కు కాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ దౌత్య కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఉదంతంపై న్యూయార్క్లోని భారత కాన్సులేట్ స్పందించింది. ‘‘దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను చూశాం. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాం’’ అని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పేర్కొన్నారు. భారతీయుల సంక్షేమానికి కాన్సులేట్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ సర్కారు కొన్నాళ్లుగా కొరడా ఝళిపిస్తుండటం తెలిసిందే. ట్రాఫిక్ ఉ ల్లంఘనల వంటి చిన్నాచితకా కారణాలకు కూడా కనీసం ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపించేస్తోంది. వీటిపై అక్కడి కోర్టులో న్యాయ పోరాటాలు కూడా సాగుతున్నాయి.Yes, I offered to help pacify the situation, but unfortunately, they called more police and humiliated that poor guy. pic.twitter.com/kHBGoAG8fk— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ట్రంప్తో మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత విద్యార్థులపై అమెరికాలో నిర్బంధం నానాటికీ పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై భారత్, భారతీయుల గౌరవ మర్యాదలను కాపాడటంతో మోదీ ప్రభుత్వం వరుసగా విఫలమవుతూ వస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి. తక్షణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి వీటికి ఫుల్స్టాప్ పెట్టించాలి’’ అని డిమాండ్ చేశారు. -
‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్సభ నుంచి పదహారవ లోక్సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. -
అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి. -
‘జాతీయ భద్రతా సలహా మండలి’సభ్యుడిగా సతీశ్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు సతీశ్రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్ రెడ్డి 1986లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో అనంతపురం జేఎన్టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవి యానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.2018 ఆగస్టు లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ ఆర్గనై జేషన్ (డీఆర్ డీవో) 13వ చైర్మన్గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్ జనరల్గా ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్ఎస్ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికిల్ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్డీవో చైర్మన్గా సేవలందించారు. -
అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్కళ్యాణ్మార్గ్లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్చేస్తున్న కృషిని, భారత్పై పాక్ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు.రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా(బీజేపీ), శశిథరూర్(కాంగ్రెస్), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్ శిందే(శివసేన), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్ యూనియన్లో పర్యటించడం తెల్సిందే. భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్ అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఎందుకు ఉగ్ర, పాక్ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్ అన్నారు.‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది. -
పిల్లలా... వద్దులే!
ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేశాయి. జనాభా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిన రోజులవి. జనాభా వృద్ధి నానాటికీ నేలచూపులు చూస్తుండటం నేటికాలపు చేదు నిజం. భారత్ అనే కాదు, జనాభా వృద్ధిలో ప్రపంచమంతటా కనీవినీ ఎరగని రీతిలో భారీ తగ్గుదల నమోదవుతోంది! దాంతో వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. కానీ ఫలితం మాత్రం పెద్దగా కన్పించడం లేదు. నానాటికీ చుక్కలనంటున్న జీవనవ్యయమే దీనికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) సర్వే తేల్చింది.పునరు త్పాదనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు ఈ ఐరాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాల్లో 14 వేల జంటలపై అధ్యయనం జరిపింది. ‘‘అత్యధికులకు ఎక్కువమందిని కనాలని ఉన్నా ఆకాశాన్నంటున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారమవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు’’ అని తేల్చింది. తమ శాంపిల్ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్నా సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 దేశాల్లో సర్వే జరపాలని యూఎన్ఎఫ్పీఏ నిర్ణయించింది.ఇలా చేశారు⇒ సర్వేలో సమాజంలోని అన్ని వర్గాల అభి ప్రాయాలూ సముచితంగా ప్రతిఫలించేలా యూఎన్ఎఫ్పీఏ జాగ్రత్తలు తీసుకుంది.⇒ భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణకొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకూ సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూసింది. ప్రపంచ జనాభాలో మూడో వంతు ఈ దేశాల్లోనే ఉండటం విశేషం!⇒ పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది. జననాల రేటు అత్యల్పంగా, అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కవరయ్యేలా జాగ్రత్త పడింది.⇒ అల్పాదాయ, మధ్యతరగతి, సంపన్న జంటలు; యువ, మధ్యవయసు, 50 ఏళ్ల పైచిలుకు వారిని తగిన నిష్పత్తిలో ఎంపిక చేసుకున్నారు.ఇదీ తేలింది⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు.⇒ సంతాన లేమికి వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొన్నది 12 శాతం మంది మాత్రమే!⇒ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని, లేదా రెండో సంతానానికి వెళ్లలే దని 39% మంది వాపోయారు. ఇలాంటివా రి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా (58 %), స్వీడన్లో అత్యల్పంగా (19%) ఉంది.⇒ ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు 50 ఏళ్ల పై చిలుకు వారిలో సగం మందికి పైగా అంగీకరించారు.⇒ థాయ్లాండ్లో 19 శాతం మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపారు. తర్వాతి స్థానాల్లో అమెరికా (16 శాతం), దక్షిణాఫ్రికా (15 శాతం), నైజీరియా (14 శాతం), భారత్ (13 శాతం) ఉన్నాయి.⇒ ఆఫీసుకు వెళ్లి రావడానికే రోజుకు సగటున మూడు గంటలు పోతోందంటూ చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదని వాపోయాయి.40 ఏళ్ల కింద చాలా దేశాలు అధిక జనాభాతో సతమతమయ్యాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభమిది. దీనికి తోడు చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారుతోంది – డాక్టర్ నటాలియా కనెం, యూఎన్ఎఫ్పీఏ సారథిభారత్లో కూడా..!భారత్లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు యూఎన్ఎఫ్పీఏ నివేదిక వెల్లడించింది. అయితే అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికీ తగ్గిపోతోందని పేర్కొంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1 ఉండాలి. కానీ భారత్లో అది 1.9కి తగ్గినట్టు నివేదిక తెలిపింది.నివేదిక విశేషాలు...⇒ ప్రపంచ దేశాలన్నింట్లోనూ అత్యధిక యువతతో భారత్ కళకళలాడుతోంది. జనాభాలో 24 శాతం 0–14 ఏళ్ల వయసు వారున్నారు. 10–19 ఏళ్లు 17 శాతం కాగా 24 శాతం మంది 10–24 ఏళ్ల వయసువారు. ⇒ జనాభాలో ఏకంగా 68 శాతం పనిచేసే వయసులో (15–64) ఉన్నారు. ⇒ 65 ఏళ్లు, ఆపైబడ్డ వృద్ధులు 7 శాతం. ⇒ మహిళల్లో సగటు ఆయుప్రమాణం 74 ఏళ్లు కాగా పురుషుల్లో 71 ఏళ్లు. ⇒ భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడినుంచి తగ్గుముఖం పడుతుంది. -
నా దారి నేను చూసుకుంటా..!
తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట. – సాక్షి, స్పెషల్ డెస్క్హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. సర్వేలో 1,798 మంది..హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్లో ఆన్ లైన్ లో నిర్వహించారు. వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం. మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్కాంగ్లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు. -
50 ఏళ్ల పగ!!
ఒక మనిషిని బతికించేంది గాలి, నీరు,నిద్ర, అన్నం, ఆకలేకాదు.. పగ పగ కూడా బతికిస్తుంది అంటూ ఓ పవర్ఫుల్ తెలుగు సినిమా డైలాగ్ ఉంది. అలాంటి పగతోనే ఏకంగా 50 ఏళ్లు రగిలిపోయిన ఓ వ్యక్తి.. తన తోటి స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.కేరళ కాసర్గాడ్లో 62 ఏళ్ల ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లు చెప్పిన విషయం విని షాక్ తిన్నారు. ఎందుకంటే.. అది 50 ఏళ్ల కిందటి గొడవ ఫలితం అని.నాలుగో తరగతి చదువుతున్నప్పుడు వీజే బాబు, బాలకృష్ణన్-మాథ్యూ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే టీచర్ల జోక్యంతో ఆ వివాదం అప్పుడే సమసిపోయింది. కానీ, బాలకృష్ణన్ అది మనసులో పెట్టుకుని యాభై ఏళ్లు గడిపారు. తాజాగా.. ఆ స్కూల్ విద్యార్థుల రీయూనియన్ జరిగింది. ఈ సందర్భంగా.. ఇద్దరూ కలుసుకున్నారు. అయితే బాలకృష్ణన్ పాత గొడవను మనసులో పెట్టుకుని మాథ్యూ సాయంతో వీజే బాబుపై దాడికి పాల్పడ్డాడు.బాలకృష్ణన్ కాలర్ పట్టుకుంటే.. మాథ్యూ వీజే బాబు ముఖంపై పిడిగుద్దులు గుప్పించి, రాళ్లతో దాడికి పాల్పడ్డాడట. ప్రస్తుతం బాబు కన్నూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీజే బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చేస్తున్నాయి. వధువు సోనమే ఓ పథకం ప్రకారం తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించిందన్న విషయం ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇందుకుగానూ కిరాయి హంతకులకు ఆమె తొలుత చెప్పిన కంటే రెట్టింపు సొమ్ము ఆఫర్ చేసిందని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అదే సమయంలో..తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో శారీరకంగా కలవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ ప్రియుడు రాజ్ కుష్వాహాతో జరిపిన చాటింగ్ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ‘‘రాజా అంటే నాకు ఇష్టం లేదు. అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగానే ఉంటున్నా. పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా’’ అంటూ ఆమె రాజ్తో చాటింగ్ చేసినట్లు అందులో ఉంది. ఇక.. 👉భర్తను కిరాతకంగా హత్య చేయించి.. ఆ మృతదేహాన్నిలోయలో పడేయించిన ఆమె ఆపై కొత్త డ్రామా ఆడింది. రాజా ఫోన్ నుంచి ఏడు జన్మలోనూ నువ్వే నా తోడుగా.. అంటూ క్యాప్షన్ వాట్సాప్ స్టేటస్గా ఉంచింది. మే 23వ తేదీన రాజా హత్య జరగ్గా.. కొన్ని గంటల తర్వాత ఆమె ఆ స్టేటస్ ఉంచింది. తద్వారా రాజా బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది.👉పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనమ్ రూ.4లక్షలు ఇవ్వజూపింది. కానీ, తర్వాత ఆ మొత్తాన్ని రూ.20లక్షలకు పెంచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు ఆమె సహకరించిందని పేర్కొన్నాయి. 👉మే 11న రాజా రఘువంశీతో సోనమ్కి వివాహం జరగ్గా.. 20న హనీమూన్ (Honeymoon) కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి వారు ఉంటున్న బస నుంచి ఓ స్కూటీపై బయటకు వెళ్లి.. ఆచూకీ లేకుండా పోయారు. ఆ బండి ఓ గ్రామ శివారులో లభ్యమైంది. అయితే.. అదృశ్యమైన 11 రోజుల తర్వాత(జూన్ 2వ తేదీన) రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. సోనమ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంతా కంగారు పడ్డారు. ఈలోపు ఆమె కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో గాలింపును ముమ్మరం చేసి.. మరోవైపు కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. 👉అంతా సోనమ్, కుశ్వాహా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు చేసింది. రఘువంశీ హత్య కేసు విచారణ సమయంలో సోనమ్ బ్రతికే ఉందని గుర్తించాం. దీంతో ఆమె ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా.. ఇలాంటి ఆయుధాన్ని మేఘాలయలో ఉపయోగించరు. దాంతో బయటివ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది. తర్వాత మేం కాల్ రికార్డులను పరిశీలించాం. అందులో రాజ్ కుష్వాహతో ఆమె రెగ్యులర్గా టచ్లో ఉంది. సోనమ్ చివరిసారిగా రాజా తల్లితో మాట్లాడిన మాటలు మాకు అనుమానం కలిగించాయి. అలాగే ఆమె ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలేవీ స్టేటస్లు పెట్టకపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి’’ అని పోలీసు అధికారి వెల్లడించారు.👉ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వాహ మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్లో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందౌర్కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు రాజ్ కుష్వాహ నడిపాడని వారు వివరించారు. సోనమ్ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్వాహా అలా నటించినట్లు తెలుస్తోంది.👉తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహతో సోనమ్ ప్రేమలో ఉంది. అయితే పెద్దలకు ఆ విషయం చెప్పే ధైర్యం లేక రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. సోనమ్, కుశ్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు. దాన్ని అమలుచేసేందుకు సోనమ్, కుశ్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటుచేసుకొన్నారు. ఈ క్రమంలోనే కుశ్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనమ్తో ఫోన్లో టచ్లో ఉండి.. తమ ప్రణాళిక అమలయ్యేలా చేశాడు. పథకం ప్రకారం రఘువంశీని సోనమ్ చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకెళ్లింది. అక్కడ కిరాయి రౌడీలు అతడిని హతమార్చారు. అనంతరం సోనమ్తో సహా ముగ్గురు నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు విడిపోయారు. అయితే పోలీసుల వద్దకు రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో అపహరించారని సోనమ్ చెప్పడం గమనార్హం. కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహాతో సోనమ్కు సాన్నిహిత్యం ఉందని వెల్లడైంది. అతడే ఈ హత్య ప్లాన్ను నడిపించాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇండోర్కు చెందిన విశాల్సింగ్ చౌహాన్ (22), రాజ్సింగ్ కుశ్వాహా (21), ఉత్తర్ప్రదేశ్లోని లలిత్పుర్కు చెందిన ఆకాశ్ రాజ్పూత్ (19)ను ఈ కేసులో అరెస్టు చేశారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులందరినీ పోలీసులు మేఘాలయాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆమెను విమానంలో తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
మళ్లీ కులగణన.. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని భావిస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం సూచన ప్రాయంగా ప్రకటించారు. అయితే కుల గణన అంశంపై సమీక్ష జరిపేందుకు ఎల్లుండి (జూన్ 12న) కర్ణాటక కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇదిలా ఉంటే. . కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్ కాంతారాజ్ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు. అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేబినెట్ ముందుకు ఆ నివేదిక వచ్చింది. అప్పటి నుంచి దఫ దఫాలుగా కేబినెట్ భేటీ అవుతూ.. కర్ణాటక సోషియో ఎకనమిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేపై చర్చలు జరుపుతోంది. అయితే ఆ నివేదికలోని ఓబీసీ రిజర్వేషన్లను 51 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదేసమయంలో లింగాయత్, వక్కలింగ కులాలు ఈ నివేదికను తోసిపుచ్చుతున్నాయి.మరోవైపు .. మళ్లీ కుల గణన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు మేధో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీచర్లను సర్వేలో భాగం చేయడం వల్ల అకడమిక్ ఇయర్కు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జన గణనతో పాటే కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కుల గణన జరపాలని అనుకుంటుండడం విశేషం. కేబినెట్ సబ్కమిటీ లేదంటే లెజిస్లేటివ్ కమిటీ ద్వారా కుల గణన సర్వేపై తుది నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
పిక్నిక్లో ఘోర విషాదం.. 8 మంది దుర్మరణం
విహారయాత్ర పెను విషాదం నింపింది. మంగళవారం రాజస్తాన్ బనాస్ నదిలో నీట మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లంతా స్నేహితులు కాగా.. 25-30 ఏళ్ల మధ్య వయస్కులు కావడం గమనార్హం. బక్రీదు తర్వాత జైపూర్ ఘాట్గేట్, హసన్పుర ప్రాంతానికి చెందిన కొంత మంది స్నేహితులు టోంక్ జిల్లా బనాస్ నది వద్దకు విహార యాత్రకు వచ్చారు. వీళ్లలో ముగ్గురు నది ఒడ్డునే ఉండి వంటలు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తమతో వచ్చిన వాళ్లు నీట మునిగిపోతూ కేకలు వేయసాగారు. దీంతో ఒడ్డున ఉన్న వాళ్లు స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికులు వారినే కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆ 8 మంది ఊపిరి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చామని, వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని టోంక ఎస్పీ వికాస్ సంగ్వాన్ పీటీఐకి తెలిపారు. అయితే.. ఒకేసారి అందరూ ఒకేసారి ఎలా నీట మునిగారనే దానిపై స్పష్టత లేదని అన్నారాయన. లోతు అంచనా వేయకుండా దిగి ఉంటారని, బహుశా ఒకరినొకరు రక్షించుకునే సమయంలోనే నీట మునిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన ఎంతో బాధించిందని అన్నారాయన. राजस्थान: बनास नदी में नहाने के लिए गया 11 दोस्तों का ग्रुप, डूबने से 8 की हुई मौत#Tonk #Banasriver #NewsUpdate #Tonk #banas pic.twitter.com/9kYVZAKry7— Jan Aayam News (@AayamJan) June 10, 2025 -
సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 5న ఎం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ అభిమానుల తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తొక్కిసలాట మరణాలపై జవాబుదారీతనం, ఈ సంఘటనను ప్రభుత్వం నిర్వహించిన తీరు, దాని పర్యవసానాల గురించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.ఐపీఎల్-18లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇందులో భాగంగా జూన్ 5న ఆర్సీబీ టీం విజయోత్సవ వేడుకలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. అయితే, ఈ వేడుకలు విషాదానికి దారితీశాయి. తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు పరిమితి మించి పబ్లిక్ రావడం, తగు చర్యలు తీసుకోకపోవడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో మరోసారి ఈ తరహా విషాదాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 10న కేసు విచారణ చేపట్టింది.ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్(ఏజీ)ను పలు ప్రశ్నలు సంధించింది. తొక్కిసలాట ఘటనపై విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నుంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి బదిలీ చేసింది. సీసీబీ ఇప్పటికే నిందితుణ్ని అరెస్ట్ చేసింది.కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు తొమ్మిది ప్రశ్నలు 1.ఆర్సీబీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ఎప్పుడు? ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు? 2.ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?3.పబ్లిక్ని,క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?4.ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు స్టేడియం దగ్గర మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు?5.వేడుక జరిగే సమయంలో ఎంతమంది ఉండవచ్చు అనే దానిపై ముందస్తుగా ఏదైనా అంచనా వేశారా? 6.గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించారా? లేకపోతే ఎందుకు?7. గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది?8.ఈ తరహా వేడుకలు నిర్వహణ సమయంలో 50వేలు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా ఎలాంటి విధానాన్ని అవలబించారు? రూపొందించబడిందా?9. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తన సమాధానాలను సీల్డ్ కవర్లో అందించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం తరుఫున ఏజే కోర్టులో తన వాదనల్ని వినిపించారు. నిందితులు తమ అరెస్టుల చట్టబద్ధతను సవాలు చేయడానికి, ఉపశమనం పొందడానికి దర్యాప్తు, అరెస్టు సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఉదహరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తొక్కిసలాటపై బహిరంగ కోర్టులో మరిన్ని వివరాలను వెల్లడించలేమని అన్నారు.సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధి నిఖిల్ సోసలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వహించిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురు ప్రముఖుల్ని కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది. వాటికి స్పందించేందుకు ఏజే సమయం కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. Shocking visuals from RCB event — people carried off after stampede, organisers failed miserably. pic.twitter.com/6RqfONWjDJ— South Asian Digest (@SADigestOnline) June 4, 2025 -
టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!
గుజరాత్లోని ‘పాలిటానా’ నగరం ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరంగా నిలిచింది. ఈ నగరంలో, మాంసాహార ఆహార పదార్థాల వినియోగం, అమ్మకం, కలిగి ఉండటం కూడా పూర్తిగా నిషేధం. పర్యాటకులకు కూడా మాంసాహారం తీసుకురావడానికి, తినడానికి అనుమతి లేదు. అసలేంటీ నగరం ప్రత్యేకత. ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తెలుసుకుందామా..!గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉంది పాలిటానా నగరం. రాజధాని నగరం అహ్మదాబాద్ సమీపంలో సౌకర్యవంతంగా ఉంది. జైనులకు ఎంతో పవ్రితమైన ప్రదేశంగా, "జైన్ టెంపుల్ టౌన్" గా పాలిటానా ప్రసిద్ది చెందిది. ఈ ప్రత్యేకతను మరింత నిలుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖాహార నగరంగా ప్రకటించింది. 900 కి పైగా జైన దేవాలయాలు ఒక్కడ కొలువు దీరి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఏడాది పొడవునా జైన భక్తులు ఇక్కడికి క్యూ కడతారు.జైనమతం బోధించే వాటిల్లో ప్రధాన సూత్రం అహింస లేదా అనువ్రతం. ఏ జీవికి హాని కలిగించకూడదని విశ్వసిస్తుంది. 2014లో, జైన సన్యాసుల అభ్యర్థనలను అనుసరించి, గుజరాత్ ప్రభుత్వం పాలిటానాను "మాంసం లేని నగరం"గా ప్రకటించింది. దీని ప్రకారం మాంసం, చేపలు ,గుడ్ల అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది. పూర్తిగా శాఖాహార నగరంగా ప్రకటించిన పాలిటానాలో ఎటువంటి కబేళాలులేదా మాంసాహార రెస్టారెంట్లు ఉండటానికి వీల్లేదు. పర్యాటకులు నగరంలోకి మాంసాహార ఆహారాన్ని తీసుకు రావడం కూడా చట్ట రీత్యా నిషేధం. శ్వేతాంబర జైన సమాజానికి ప్రాథమిక తీర్థయాత్ర స్థలంగా, "సిద్ధక్షేత్రం" లేదా మోక్షాన్ని పొందే ప్రదేశంగా పరిగణించబడే పాలిటానాలో సుమారు 900 దేవాలయాలు ఉన్నాయి. జైన విశ్వాసాల ప్రకారం, అనేక మంది తీర్థంకరులు ఈ కొండపై మోక్షాన్ని పొందారు, దీని ఫలితంగా 2014లో జైన సన్యాసులు మతపరమైన ఉపవాసం ఆచరించారు. శత్రుంజయ దేవాలయాలు 11వ , 20వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన వాటి సంక్లిష్టమైన చెక్కబడిన వాస్తుశిల్పం, అద్భుతమైన పాలరాయి పనికి ప్రసిద్ధి చెందాయి. శత్రుంజయ కొండపై ఉన్న ఈ దేవాలయాలను చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశం జైన మతం మరియు గోహిల్ రాజ్పుత్ల వంటి ప్రాంతీయ పాలకులకు ప్రాముఖ్యతను కలిగి ఉంది. చదవండి: భారత్- భూటాన్ ఛిల్.. లాంగ్.. టూర్పాలిటానా జనాభా సుమారు 65,000, అధిక అక్షరాస్యత రేటు 85%. జనాభాలో 60% జైనులు, 35% హిందూ మరియు 5% ముస్లిం మరియు ఇతర వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా, పాలిటానాలో నివసించే ముస్లింలు కూడా మాంసాహార నిషేధాన్ని పాటిస్తారు. నగర ఆర్థిక వ్యవస్థ మతపరమైన పర్యాటకంపై వృద్ధి చెందుతుంది, ఏటా లక్షలాది మంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఆలయ నిర్వహణ కార్యకలాపాలు, హోటళ్ళు, ధర్మశాలల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్లు మేఘాలయలో అదృశ్యమైన తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఈ ఘటనలో రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం సోనమ్ తన ప్రేమికునితోపాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించిందని తెలియవచ్చింది. పోలీసుల విచారణలో ఈ నిందితులు సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా స్నేహితులని వెల్లడయ్యింది.ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రేమికుడు కుష్వాహా అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను ఆనంద్ కుమ్రీ, ఆకాష్ రాజ్పుత్ విక్కీ ఠాకూర్గా పోలీసులు గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్కు చెందినవారని అధికారులు తెలిపారు.ఉత్తరప్రదేశ్లోని బినా జిల్లాలో ఆనంద్ కుమ్రీ (23ని అరెస్టు చేయగా, లలిత్పూర్ జిల్లాలో ఆకాష్ రాజ్పుత్ (19)ను అరెస్టు చేశారు. విక్కీ ఠాకూర్ (22)ను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టు చేశారు. రాజా , సోనమ్లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగిన తర్వాత వారు మే 20న మేఘాలయకు బయలుదేరారు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళుతుండగా అదృశ్యమయ్యారు.మే 16న రాజ్ కుష్వాహా.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తన చిన్ననాటి స్నేహితులను ఇండోర్లోని ఒక కేఫ్లో కలిశాడని పోలీసు అధికారులు తెలిపారు. మే 20న సోనమ్, ఆమె భర్త హనీమూన్కు వెళ్లగా, రాజ్ తన ముగ్గురు స్నేహితులను మేఘాలయకు పంపాడు. హత్య జరిగిన రోజున సోనమ్ తన భర్తను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ ముగ్గురు నిందితులు రాజా రఘువంశీపై దాడి చేశారు. పది రోజుల తర్వాత, పోలీసులకు ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమయ్యింది. ఆ సమయంలో ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో అతనిపై రెండుసార్లు దాడి జరిగిందని తేలింది. అదే సమయంలో సోనమ్ కనిపించకుండా తప్పించుకుంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి ఘాజీపూర్లోని ఒక ధాబాలో సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసుల విచారణలో ఈ కేసులోని పూర్వాపరాలన్నీ బయటపడ్డాయి. ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య.. బెంగళూరు తొక్కిసలాటపై చర్చ?
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేడు (మంగళవారం) న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలవనున్నారు. జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారని సమాచారం. ఈ తొక్కిసలాట ఘటన దరిమిలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపిస్తూ, వారు రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలుసుకోనున్న సిద్ధరామయ్య, డీకేఎస్లు ఆర్సీబీ విజయోత్సవ ఘటన తొక్కిసలాట పూర్వాపరాలపై సమగ్రంగా చర్చించనున్నారు.‘సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వారికి వివరిస్తారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) అధికారులతోపాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన డిప్యూటీ సీఎం నేడు తిరిగి ఢిల్లీకి వెళుతున్నారు. జూన్ నాలుగున సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు.ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నాటి తొక్కిసలాట ఘటనలో 56 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తన నుండి సమాచారం కోరిందనే వార్తలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాగా నేటి అధిష్టానం భేటీలో గవర్నర్ ఎంపిక నామినేషన్ల కోసం సిఫార్సు చేసిన నాలుగు పేర్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్ పైఅంతస్తును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తు నుంచి ఇద్దరు చిన్నారులతో సహా వారి తండ్రి కిందకు దూకేసి, తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కొద్దిసేపటి తరువాత వారి తండ్రి కూడా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. दिल्ली के द्वारका इलाके में एक अपार्टमेंट में लगी भीषण, द्वारका के सेक्टर 13 स्थित Shabd अपार्टमेंट की घटना, तीन लोग ऊपर से कूदे हैं, तीनों की हालत काफी गंभीर है। pic.twitter.com/Rjt3FteA8b— NBT Hindi News (@NavbharatTimes) June 10, 2025ఢిల్లీలో ప్రస్తుతం తీవ్రమైన తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయ. ద్వారకలోని శబ్ధ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న దరమిలా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం నుంచి ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా దూకేశాడు. వారు తీవ్ర గాయాటలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషిచేశారు.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: మేఘాలయలో ఒక హనీమూన్ జంట అదృశ్యం కావడం.. ఆ తరువాత ఈ ఉదంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయకు వెళ్లి, కనిపించకుండా పోయారు. కొద్ది రోజులకు రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. ఈ నేపధ్యంలో అతనిని సోనమ్ హత్య చేయించిందని ఆరోపిస్తూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.అదృశ్యంతో మొదలై.. హత్య కేసుగా మారి..మే 23న అదృశ్యమైన ఈ జంటను గాలించే దిశగా మొదలైన దర్యాప్తు.. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైన దరిమిలా హత్యకేసుగా మారింది. అనంతరం పోలీసులు సోనమ్ కోసం వెదికారు. వారం తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని పోలీసుల ఎదుట లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి. యూపీ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. తనను నిందితురాలిగా చూపించేందుకు పోలీసులు తనకు మత్తుమందు ఇచ్చి ఘాజీపూర్కు తీసుకువచ్చాని సోనమ్ ఆరోపిస్తున్నదని ఆయన తెలిపారు.ధాబాలో దాక్కున్న సోనమ్పోలీసులు తన కోసం గాలిస్తారని తెలుసుకున్న సోనమ్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ఒక ధాబాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోనులో చెప్పింది. వెంటనే వారు మధ్యప్రదేశ్ పోలీసులకు విషయం తెలియజేశారు. అక్కడి పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోనమ్ అరెస్టు చేశారు. తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం వన్-స్టాప్ సెంటర్కు తరలించారు. ఇప్పుడు మేఘాలయ పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగంలోకి దిగారు.ప్రియుడితో కలసి..మే 23 నుండి రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తు ఆమెను ఘాజీపూర్లో పట్టుకోవడంతో మరోమలుపు తిరిగింది. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని మేఘాలయ పోలీసులు భావిస్తున్నారు. ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హత్య చేసిందని, ఆ తరువాత పోలీసులకు లొంగిపోయిందని అంటున్నారు. ఈ కేసులో సోనమ్తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన అనుమానితురాలు ఘాజీపూర్కు ఒంటరిగా వచ్చిందని, ఆమె నుంచి లభ్యమైన ఆధారాలను పరిశీలిస్తున్నామని, నిజం త్వరలో బయటపడుతుందని యూపీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.హతుని సోదరుని అనుమానం ఇదే..ఈ ఘటనపై రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ రాజ్ కుష్వాహా .. సోనమ్కు తోటి ఉద్యోగని, వారు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటారని సోనమ్ కుటుంబం తనకు చెప్పిందన్నారు. తాను రాజ్ కుష్వాహాను ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడే తెలుసుకున్నానని అన్నారు. తన సోదరుని హత్యలో అతని ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా రాజా రఘువంశీ, సోనమ్లకు మే 11న వివాహం జరిగింది. వారు మే 20న తమ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. ఒక రోజు తర్వాత ఈ జంట అదృశ్యమయ్యింది.ఇది కూడా చదవండి: ప్రసూతివార్డునూ వదలని రష్యా డ్రోన్లు -
ఓయో రూంలో వివాహిత హత్య
బెంగళూరు: బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది. ఓ టెక్కీ.. వివాహితను కత్తితో పొడిచి హత్య చేశాడు. సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిణి (35) హత్యకు గురైన మహిళ కాగా, యశస్ (25) అనే ఐటీ ఇంజినీరు నిందితుడు. ఇద్దరు కూడా కెంగేరి నివాసులు కాగా, పూర్ణ ప్రజ్ఞా లేఔట్లో ఓయో రూమ్లో ఘటన జరిగింది.గత శుక్రవారం ఇద్దరూ రూంని తీసుకున్నారు. గొడవ జరిగి యశస్ కత్తితో ఆమెను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హరిణికి పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు అవివాహితుడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడాది నుంచి అనైతిక బంధానికి దారి తీసిందని సమాచారం. తాను ఈ బంధాన్ని కొనసాగించలేనని హరిణి చెప్పగా, నిందితుడు కోపంతో ప్రాణాలు తీశాడని అనుమానాలున్నాయి. హరిణి మృతదేహంపై 17కు పైగా కత్తిపోట్లు ఉన్నాయి. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన యువ ఐఏఎస్ అధికారి
భవానీపట్నా/భువనేశ్వర్: త్రిపురలోని గ్రామీణ నేపథ్యమున్న ధీమన్ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల్లో మెరుగైన ర్యాంక్లు సాధించి శెభాష్ అనిపించుకుని ప్రస్తుతం సబ్–కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఛక్మాను విజిలెన్స్ అధికారులు రెడ్హ్యాండెడ్గా లంచం కేసులో అరెస్ట్చేశారు. ఒడిశాలోని ధర్మగఢ్ సబ్–కలెక్టర్గా ఉంటూ ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సోమవారం ఆయనను స్థానిక కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం కలహండీ జిల్లాలోని ఛక్మా నివాసంలో విజిలెన్సు అధికారులు రూ.47 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు. తనకు రూ.20 లక్షలు లంచం ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని స్థానిక వ్యాపారిని సబ్–కలెక్టర్ హోదాలో ఛక్మా బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి తమను ఫిర్యాదుచేశారని విజిలెన్స్ ఎస్పీ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన నగదు విషయంలో ఆయన ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో అవినీతి నిరోధక(సవరణ)చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సబ్–కలెక్టర్పై కేసు నమోదుచేసి అరెస్ట్చేశారు. ఎవరీ ఛక్మా? త్రిపురలోని కంచన్పూర్కు చెందిన ఈ యువ అధికారి 2019లోనే యూపీఎస్సీలో 722 ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో చేరారు. ఒడిశా కేడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఒడిశాలోని మయూర్భంజ్లోని బరిపదలో అదనపు చీఫ్ కన్జర్వేటర్గా పనిచేశారు. రెండేళ్లకే మళ్లీ 2021లో యూపీఎస్సీ రాసి ఈసారి 482 ర్యాంక్ సాధించారు. దీంతో ఈసారి ఐఏఎస్ హోదా సాధించారు. శిక్షణ తర్వాత ధర్మగఢ్ సబ్–కల్టెర్గా పోస్ట్ఇవ్వడంతో అప్పటి నుంచి అ క్కడే పనిచేస్తున్నారు. రెండుసార్లు అఖిల భారత సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడై అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఆదర్శంగా నిలిచి ఇప్పుడు అవినీతికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ తాజాగా సియాటెల్ యూనివర్సిటీలోని ‘రౌండ్ గ్లాస్ ఇండియా సెంటర్’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయం అంటే సిద్ధాంతం, బాధ్యత న్యాయమూర్తులు అంటే అపరిమిత అధికారం కలిగినవారు కాదని... వారు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని న్యాయమూర్తులకు సూచించారు. కోర్టులు అధికారాన్ని ప్రదర్శించే వ్యవస్థలుగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రయాణంలో భాగస్వాములై ఉండాలని పేర్కొన్నారు. న్యాయం అనేది తాత్కాలికంగా పంపిణీ చేయాల్సిన ఉత్పత్తి కాదని.. అది ఒక సిద్ధాంతం, ఒక బాధ్యత అని తేలి్చచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన అనేవి అనుకోకుండా వచ్చినవి కాదని, ఇవన్నీ సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా సమాజానికి లభించాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తరువాత జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్లో భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
కేరళ సమీపంలో నౌకలో అగ్నిప్రమాదం
కొచ్చి: సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన విదేశీ కంటైనర్ సరకు రవాణా నౌక కేరళ సమీప సముద్రజలాల్లో అగ్నిప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవీ వాన్ హాయ్503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతయింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెల్సిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది. -
అమెరికాలో భారత విద్యార్థులు 11.8% పెరిగారు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్యలో 2024లో 11.8 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో 4,22,335 మంది భారత విద్యార్థులున్నట్టు యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 27 శాతం. ఈ విషయంలో భారత్ గత 15 ఏళ్లలో తొలిసారిగా చైనా (20 శాతం)ను దాటేసి అగ్రస్థానంలో నిలవడం విశేషం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ మెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో అత్యధికంగా 48 శాతం మంది భారత విద్యార్థులే. 20.4 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చైనా విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 0.25 శాతం తగ్గడం విశేషం.ఆసియా దేశాల హవా..అమెరికాలో చదువుతున్న విదేశీయుల్లో ఆసియా దేశాల హవా కొనసాగుతోంది. మొత్తం 15.8 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 71.7 శాతం, అంటే 11,34,953 మంది ఆ దేశాలవారేనని నివేదిక తెలిపింది. -
11 ఏళ్లుగా ‘ప్రగతిశీల భారత్’
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించడం, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తమ మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలే ఉన్నారని గుర్తుచేశారు. మంత్రిమండలిలో ఆయా వర్గాలకు ఈస్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యం దక్కడం ఇదే మొదటిసారి అని స్పష్టంచేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తికావడంతోపాటు మూడోసారి ప్రధానిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నేడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై బలమైన గొంతుకగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మనం గళం వినిపిస్తున్నాయని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు, వారి సమ్మిళిత భాగస్వామ్యంతో విభిన్న రంగాల్లో వేగవంతమైన మార్పునకు భారత్ సాక్షిగా నిలుస్తోందని హర్షం వ్యక్తంచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ స్ఫూర్తితో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైందని వివరించారు. ‘ప్రజలే కేంద్రంగా ప్రగతి’ అనే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆర్థికాభివృద్ధితో సామాజిక మార్పునకు బాటలు వేస్తున్నామని స్పష్టంచేశారు. మన ఉమ్మడి విజయాలు మనందరికీ గర్వకారణమని, అదే సమయంలో ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి మనమంతా నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆశ, ఆత్మవిశ్వాసం, నూతన సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. వేర్వేరు రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ ‘లెవెన్ ఇయర్స్ ఆఫ్ సేవ’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వ పథకాలు, లబి్ధదారుల వివరాలు ఇందులో పొందుపర్చారు. -
ప్రచారం తప్ప పారదర్శకత లేదు
న్యూఢిల్లీ: కేంద్రంలో 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ప్రచారం తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ సర్కారు వర్తమానం గురించి మాట్లాడడం మానేసి, 2047కు సంబంధించిన కలల్లో విహరిస్తోందని తప్పుపట్టారు. ప్రజలను భ్రమల్లో ముంచేస్తూ కాలం గడుపుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం 11వ వార్షికోత్సవాలు చేసుకుంటున్న సమయంలోనే మరోవైపు ముంబైలో ఘోర ప్రమా దం జరిగిందని పేర్కొన్నారు. రైలు నుంచి కిందపడి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యం కోట్లాది మంది ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రైల్వేశాఖ నేడు అభద్రత, గందరగోళం, విపరీతమైన రద్దీకి మారుపేరుగా మారిందని ఆక్షేపించారు. దేశంలో వాస్తవిక పరిస్థితికి ఈ ఘటన అద్దంపడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో వచ్చిన మార్పేమీ లేదని విమర్శించారు. 2047 నాటి కలలు విక్రయించడం ఆపేసి, 2025 గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే మూడో టర్మ్లో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ 11 ఏళ్లు ప్రజాసేవలో స్వర్ణయుగం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివరి్ణంచారు.మోదీ నాయకత్వంలో నవ భారతదేశం సంస్కరణల శక్తి, మార్పుతో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా ప్రతి రంగంలో మన దేశాన్ని నంబర్ వన్గా నిలపాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తోందని వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టంచేశారు. 11 ఏళ్ల ఈ చరిత్రాత్మక ప్రయాణం సేవా ప్రయాణమని వివరించారు. ఈ మేరకు అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నాయకత్వం శక్తివంతంగా, సంకల్పం బలంగా, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే ప్రజాసేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని తెలియజేశారు. మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అచేతనావస్థలో ఉందని, ఎటు చూసినా కుంభకోణాలు తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక 11 ఏళ్లలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రధాని మోదీ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారతే మోదీ సర్కారు ధ్యేయమని తేలి్చచెప్పారు. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి మోదీ సర్కారు బలమైన రక్షణ కవచంగా మారిందన్నారు. దృఢమైన, గర్వకారణమైన ఐక్య భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా చేరిందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బడుగ బలహీన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూరుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. ప్రపంచ వేదికపై సమున్నత భారత్: గడ్కరీ నరేంద్ర మోదీ దార్శనికత పాలనలో దేశంలో చరిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. సుపరిపాలన, సమగ్రాభివృద్ధిని కళ్లారా చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. దేశం ఎవరూ అందుకోలేనంత వేగంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. బలమైన నాయకత్వం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న పాలనతో ప్రపంచ వేదికపై సగర్వంగా, సమున్నతంగా నిలుస్తోందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, సాంస్కృతిక వైభవం, జాతీయ భద్రత విషయంలో మోదీ పాలన నూతన శకమని కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ అగ్రనేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.సువర్ణాక్షరాలతో లిఖించాలి: నడ్డాదేశంలో గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సువర్ణాక్షరాలతో లిఖించదగనవని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. -
టీపీసీసీ జంబో కార్యవర్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కొత్తగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఇందులో 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.సోమవారం ఢిల్లీకి వచి్చన సీఎం ఎ.రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం కార్యవర్గ జాబితాను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన జాబితాను సోమవారం రాత్రి పార్టీ విడుదల చేసింది. నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పరి్ణకారెడ్డి, డా.మట్ట రాగమయిలకు అవకాశం ఇచ్చారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చోప చర్చలు మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు మంత్రులు అధికారం చేపట్టడంతో వారికి కేటాయించాల్సిన శాఖలపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవం దృష్టా వీరికి ఏయే శాఖలు కేటాయించాలన్న అంశంపై చర్చించారు. సీఎం వద్దే హోం, న్యాయ, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు ఉన్నందున వాటిని కొత్త మంత్రులకు కేటాయించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఖాళీగా ఉన్న మరో మూడు స్థానాల్లో మంత్రులుగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై చర్చించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డిలతో పాటు ఇద్దరు మైనార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటే చీఫ్ విప్, రెండు విప్ల పదవుల భర్తీపైన చర్చ జరిగింది. చీఫ్ విప్ పదవిని రెడ్డి లేదా వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలిసింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు 1) టి.కుమార్ రావు 2) కె.రఘువీర్ రెడ్డి, ఎంపీ 3) నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే 4) డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే 5) బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ 6) బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ 7) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి 8) బండి రమేశ్ 9) కొండ్రు పుష్పలీల 10) కోట నీలిమ 11) బి. కైలాష్ కుమార్ 12) నమిండ్ల శ్రీనివాస్ 13) ఆత్రం సుగుణ 14) గాలి అనిల్ కుమార్ 15) చిట్ల సత్యనారాయణ 16) లకావత్ ధన్వంతి 17) ఎం. వేణుగౌడ్ 18) కోటంరెడ్డి వినయ్ రెడ్డి 19) కొండేటి మల్లయ్య 20) ఎం.ఏ.ఫహీమ్ (సంగారెడ్డి) 21) ఎస్. సురేష్ కుమార్ 22) బొంతు రామ్మోహన్ 23) అఫ్సర్ యూసుఫ్ జాహీ 24) ఎస్. జగదీశ్వర్ రావు 25) నవాబ్ ముజాహిద్ ఆలంఖాన్ 26) గుమ్ముల మోహన్ రెడ్డి 27) చిన్నపటాల సంగమేశ్వర్ పీసీసీ ప్రధాన కార్యదర్శులు 1) వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే 2) సీహెచ్ పరి్ణకా రెడ్డి, ఎమ్మెల్యే 3) డా.మట్ట రాగమయి, ఎమ్మెల్యే 4) సీహెచ్.రాంభూపాల్ 5) ఏ. సంజీవ్ ముదిరాజ్ 6) బొజ్జా సంధ్యా రెడ్డి 7) మల్లాది రాంరెడ్డి 8) అబ్దేశి సదాలక్ష్మి 9) ఎం. బేబి స్వర్ణ కుమారి 10) దారాసింగ్, తాండూరు 11) జి. శశికళా యాదవ రెడ్డి 12) ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి 13) ముహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ 14) సంతోష్ కుమార్ రుద్ర 15) దుర్గం భాస్కర్ 16) ముహమ్మద్ ఖాజా ఫఖ్రుద్దీన్ 17) వి.జగదీశ్వర్ గౌడ్ 18) నరేశ్ జాదవ్ 19) అల్లం భాస్కర్ 20) డా. గిరిజ షెట్కార్ 21) కొప్పుల ప్రవీణ్ కుమార్ 22) ఏ. జంగా రెడ్డి 23) కస్బా శ్రీనివాస్ రావు 24) దుడ్డిల్ల శ్రీనివాస్ 25) బద్దం ఇంద్రకరణ్ రెడ్డి 26) చరగాని దయాకర్ 27) పీసారి మహిపాల్ రెడ్డి 28) గజ్జెల కాంతం 29) ఏడుపుగంటి సుబ్బా రావు 30) చకిలం రాజేశ్వర్రావు 31) ఎర్ల కొమరయ్య 32)డా.ఏ.రవిబాబు 33) నాగ సీతారాములు 34) సనెం శ్రీనివాస్ గౌడ్ 35) పృథ్వి చౌదరి వేణుల 36) అంబడి రాజేశ్వర్ 37) డి.డి.వెంకట్ రాజ్ 38) బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 39) పల్లె శ్రీనివాస్ గౌడ్ 40) మొహమ్మద్ సబీర్ అలీ 41) కట్ల రంగారావు 42) పి. శ్రీనివాస్ రెడ్డి 43) మడు సత్యనారాయణ గౌడ్ 44) టోపాజీ అనంత కిషన్ 45) వి. రామారావు గౌడ్ 46) అచ్యుత్ రమేష్ బాబు 47) పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ (చిన్న) 48) ఎం. రాజీవ్ రెడ్డి 49) ఆదంరాజ్ దేకపాటి 50) షమీం ఆఘా 51) ఈ.వి.శ్రీనివాస్ రావు 52) మిథున్ రెడ్డి 53) అమొగోత్ వెంకటేశ్ పవార్ 54) రాయగిరి కల్పనా యాదవ్ 55) రాజేష్ కాశిపాక 56) రహమత్ హుస్సేన్ 57) పి. ప్రసన్న కుమార్ శర్మ 58) ముహమ్మద్ అసదుద్దీన్ 59) నందిమల్ల యాదయ్య ముదిరాజ్ 60) దైదా రవీందర్ 61) ఉప్పల శ్రీనివాస్ గుప్తా 62) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 63) జి. నాగభూషణం 64) ఉపేందర్ రెడ్డి 65) ధర్మారావు 66) నూతి సత్యనారాయణ గౌడ్ 67) దుర్గాప్రసాద్ 68) డా. సి. వేంకటగోవింద్ రావు 69) పెండ్లి శ్రీనివాసులు రెడ్డి -
తొట్టెలో ముంచి.. కూతురి హత్య
యశవంతపుర: తల్లి అంటే పిల్లలను గుండెల్లో పెట్టుకుని కాపాడుతుందని అనుకుంటారు. కొందరు తల్లుల వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. తొట్టెలో ముంచి ఆరేళ్ల కూతుర్ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా జిన్నేనహళ్లి కొప్పలు గ్రామంలో జరిగింది. తల్లి శ్వేత (36), కూతురు సాన్వి (6)ని తమ పొలంలో తొట్టెలో ముంచి ప్రాణాలు తీసింది. వివరాలు.. ఏడేళ్ల క్రితం రఘు అనే రైతుతో శ్వేతకు పెళ్లయింది. రెండేళ్లకే గొడవలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. అనేకసార్లు బంధువులు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. శ్వేత విడాకులకు కోర్టులో పిటిషన్ వేసింది.బెంగళూరు నుంచి తీసుకొచ్చిసాన్విని బెంగళూరులో రఘు తల్లిదండ్రులు చూసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి సాన్విని శ్వేత తీసుకొచ్చింది. ఆదివారం ఉదయం ఊరిబయటకు బాలికను పిలుచుకుని వెళ్లింది. అయితే పొలానికి వెళ్లి అక్కడ నీటిలో ముంచి హత్యకు యత్నించింది. బాలిక కేకలు వేయటంతో చుట్టుపక్కల రైతులు గమనించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా బాలిక చనిపోయింది. ఎందుకు ఇలా చేశామంటూ స్థానికులు ప్రశ్నించగా ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తల్లి చెప్పింది. రఘు వచ్చి హిరిసావె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం వద్ద ఇరు కుటుంబల మధ్య గొడవలు జరిగాయి. శ్వేతపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్శర్మ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Covid-19: దేశంలో 6,500కు చేరువలో కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్ 9) నాటికి కోవిడ్ కేసులు 6,500 మార్కుకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 6, 491 కేసులు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 358 కొత్త కేసులు వెలుగుచూసినట్లు సదరు శాఖ వెల్లడించింది. అయితే మరణాలు ఏవీ సంభవించలేదని స్పష్టం చేసింది. దేశంలో కేరళలో అత్యధికంగా 1,957 కేసులు ఉండగా, ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 42 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం ఆ రాష్ట్ర కోవిడ్ కేసుల సంఖ్య 728కి చేరింది. ఇదిలా ఉంచితే ఓవరాల్గా దేశంలో 624 మంది కోవిడ్ రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదుఇక పశ్చిమబెంగాల్లో వెలుగచూసిన కోవిడ్ కేసులపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడతూ.. కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్నది పాండమిక్ కాదని, ఎండ్మిక్ అని ఆమె తెలిపారు. పశ్చిమబెంగాల్ పరిస్థితి కోవిడ్ కంట్రోల్లోనే ఉందన్నారు మమతా. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ 747 కోవిడ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 కొత్త కేసులు వెలుగుచూశాయి. -
థానే లోకల్ ట్రైన్ ప్రమాదం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ప్రయాణికులకు నిత్యనరకం అనేది ఎలా ఉంటుందో.. ముంబై లోకల్ ట్రైన్ల రద్దీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా రైలు ప్లాట్ఫారమ్ మీదకు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడిపోవడం, ఫుట్బోర్డు మీద వేలాడుతూనే ప్రయాణాలు చేయడం తరచూ సోషల్ మీడియాలోనూ చూస్తుంటాం. అయితే థానేలో ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంతో(Thane Local Train Accident) రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. లోకల్ ట్రైన్స్కు కూడా ఆటోమేటిక్ తలుపులు బిగించాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. థానేలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు కొత్త రైళ్లకూ ఈ తరహా డోర్లు బిగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకూ ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు. థానేలో ఇవాళ ఉదయం కసారా వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి పది మంది కింద పడిపోయారు. ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు పరస్పరం తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు.. ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు చేస్తోందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. ఇదీ చదవండి: బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్ -
భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది. -
ఆమెకు 35.. అతడికి 25.. జాతరలో పరిచయం కాస్తా..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు 36, అతడికి 25 ఏళ్లు కాగా.. ఓయో హోటల్ రూమ్లో తన ప్రేయసిని ప్రియుడు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. బెంగళూరులోని కెంగేరికి చెందిన హరిణి(36), దాసేగౌడకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కెంగేరిలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం కెంగేరిలో జాతర జరిగింది. ఈ జాతరకు హరిణి వెళ్లింది. అక్కడే ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ యశస్ కూడా ఇదే జాతరకు వెళ్లడంతో.. అక్కడ హరిణిని చూశాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో.. వారిద్దరికి పరిచయం ఏర్పడింది. జాతరలోనే ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. తరువాత వారి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో మరింత సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం హరిణి భర్త దాసేగౌడకు కూడా తెలియడంతో ఆమెను హెచ్చరించాడు. అనంతరం, దాసేగౌడ.. ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకున్నాడు. వారి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. దీంతో, హరిణి తన తప్పును తెలుసుకుని.. భర్త వద్ద కన్నీరుపెట్టుకుని తనను క్షమించాలని కోరింది. ఆమెను నమ్మిన భర్త.. ఫోన్ ఇవ్వడంతో.. మళ్లీ హరిణితో యశస్ కంటాక్ట్లోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడాలి అని ఫోన్ చేసి బెంగళూరులోని ఓ హోటల్ గదికి పిలిచాడు. దీంతో, శుక్రవారం వీరద్దరూ పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లోని ఓయో హోటల్కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు. గదిలో ఉన్న సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.హరిణి తనతో పాటే ఉండాలని యశస్ పట్టుబట్టాడు. తాను లేకుండా జీవించలేనని.. తనతోనే ఉండాలన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆవేశానికి గురైన యశస్.. హరిణిని దారుణంగా హత్య చేశాడు. హరిణిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత యశస్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి సుబ్రహ్మణ్యపుర పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. విచారణలో భాగంగా యశస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్నేహితుడి భార్యకు అశ్లీల చిత్రాలు పంపిన యువకుడు..!
అన్నానగర్(తమిళనాడు): దిండుగల్కు చెందిన 23 ఏళ్ల యువతి పేరుతో అశ్లీల చిత్రాలను ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేశారు. ఇది చూసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. ఆ యువతి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి, దాని ద్వారా అశ్లీల చిత్రాలను విడుదల చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అశ్లీల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి విరుదునగర్ జిల్లా కరియాపట్టికి చెందిన విమల్(31) అని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా, షాకింగ్ సమాచారం బయటపడింది. విమల్ ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతను దిండుగల్ లో ఒక స్నేహితుడితో ఉంటున్నాడు. అతను తన స్నేహితుడిని సిమ్ కార్డ్ కొనమని అడిగాడు. అతని స్నేహితుడు తన పేరు మీద సిమ్ కార్డ్ కొన్నాడు. దీని ద్వారా విమల్ దిండిగల్కు చెందిన ఒక యువతి పేరుతో నకిలీ ఖాతాను ప్రారంభించి, ఇన్స్ట్రాగామ్లో వివిధ చిత్రాలను షేర్ చేశాడు. ఈ సమాచారం వెలుగులోకి రాగానే, షాక్ అయిన మహిళ అతనిని వివరాలు అడిగింది. ఈలోగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత, విమల్ తన స్వస్థలం విరుదునగర్కు వెళ్లాడు. నకిలీ ఖాతా వివరాలు వెలుగులోకి రావడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆమె తన వద్ద ఉన్న వివిధ చిత్రాలు, వీడియోలను తొలగించింది. పోలీసులు విమల్ను అరెస్టు చేసినప్పుడు, వారు అతని సెల్ఫోన్ను శోధించారు. సిమ్ కార్డు కొనుగోలు చేసిన స్నేహితుడి భార్యకు విమల్ అశ్లీల చిత్రాలను పంపినట్లు చూసి వారు షాక్ అయ్యారు. విమల్కు 2 వారాల క్రితమే వివాహం జరిగింది. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
వీడిన ‘హనీమూన్’ హత్య మిస్టరీ
షిల్లాంగ్/లక్నో/ఘాజీపూర్/ఇండోర్: పెళ్లయిన తొమ్మిది రోజులకు హనీమూన్కు వెళ్లి మేఘాలయలో శవమై తేలిన నవవరుడు రాజా రఘువంశీ హత్య కేసులో ఎట్టకేలకు భార్య సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులకు లొంగిపోయింది. ప్రియుడి ప్లాన్ ప్రకారం కొందరికి సుపారీ ఇచ్చి భర్తను ఆమెనే హత్య చేయించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అర్థరాత్రిదాటాక ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను మేఘా లయ మహిళా డీజీపీ ఇదాషీషా నోంగ్రాంగ్ సోమవారం పత్రికా సమావేశంలో చెప్పారు. ప్రియుడు కుష్వాహాతో కలిసి కుట్ర! సోనమ్తోపాటు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో 19 ఏళ్ల ఆకాశ్ రాజ్పుత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 22 ఏళ్ల విశాల్ సింగ్ చౌహాన్, 21 ఏళ్ల రాజ్సింగ్ కుష్వాహా, బినా పట్టణంలో 23 ఏళ్ల ఆనంద్ కురీ్మలను పోలీసులు అరెస్ట్చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం మేఘాలయలో అదృశ్యమైన సోనమ్ ఆదివారం అర్థరాత్రి దాటాక ఉత్తరప్రదేశ్లోని వారాణాసి–ఘాజీపూర్ రహదారి పక్కన కాశీ ధాబా వద్దకు ఒంటరిగా వచ్చి తన సోదరుడు, తన భర్త సోదరునికి ఫోన్ చేసింది. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ఆమె చాలా నీరసంగా కనిపించడంతో తొలుత సదర్ ఆస్పత్రికి తర్వాత ‘వన్ స్టాప్ సెంటర్’కు తరలించి చివరకు అరెస్ట్చేశారు. అయితే తాను నిర్దోషినని, ఎవరో తనను కిడ్నాప్చేశారని సోనమ్ చెప్పింది. అయితే పోలీసులు మాత్రం భర్త హత్యోదంతంలో సోనమ్ది కీలకపాత్ర పని చెబుతున్నారు. సోనమ్ సోదరుడు నిర్వహించే ఒక కంపెనీలో పనిచేసే రాజ్సింగ్ కుష్వాహాకు ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని, రాజ్సింగ్ ప్లాన్ ప్రకారమే మరికొందరికి సుపారీ ఇచ్చి సోనమే భర్తను చంపేయించిందని పోలీసులు చెప్పారు. కుష్వాహాతో సోనమ్ తరచూ మాట్లాడేదని రాజా రఘువంశీ సోదరుడు సైతం ఆరోపించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కుష్వాహాకు స్నేహితుల ని తేలింది. ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపా రం చేసే రాజారఘువంశీకి సోనమ్తో మే11 వ తేదీన వివాహమైంది. ఇద్దరు మే 20వ తేదీన మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. 22న మావ్లఖియాత్ గ్రామంలో ఒక స్కూటర్ను అద్దెకు తీసుకుని సజీవ చెట్ల వంతెనను చూసేందుకు వెళ్లి 23వ తేదీన అదృశ్యమయ్యారు. 10 రోజుల తర్వాత జూన్ రెండున భర్త మృతదేహాన్ని ఈస్ట్ఖాసీ హిల్స్ జిల్లాలో ని వేసాడాంగ్ జలపాతం సమీప లోయలో పోలీసులు కుళ్లిన స్థితిలో కనుగొన్నారు. అప్ప టి నుంచి సోనమ్ ఆచూకీ కోసం మేఘాల య సిట్ పోలీసులు, రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్, స్థా నిక నిఘా బృందాలు, స్థానిక యంత్రాంగం విస్తృతస్థాయిలో గాలిస్తుండటం తెల్సిందే. రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్ పుత్లను ఇండోర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను ఏడు రోజులపాటు మేఘాలయ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. రిటర్న్ టికెట్లు బుక్చేయలేదు కోడలు అరెస్ట్ వార్త తెలిసి రాజా తల్లి ఉమా రఘువంశీ మీడియాతో మాట్లాడారు. ‘‘పెళ్లయ్యాక హనీమూన్కు వెళ్లే ఉద్దేశ్యం మా అబ్బాయికి లేదు. కానీ భార్య ప్రోద్భలంతోనే అతను ట్రిప్కు వెళ్లాడు. ట్రిప్కు వెళ్లబోతున్న విషయం కోడలు మాలో ఒక్కరికి కూడా చెప్పలేదు. మేఘాలయకు వెళ్లాలనే ప్లాన్ సోనమ్దేనని మా అబ్బాయి చిట్టచివర్లో చెప్పాడు. ట్రిప్ టికెట్లు ఆమెనే బుక్చేసింది. కానీ రిటర్న్ టికెట్లు బుక్చేయలేదు. నా కుమారుడు గాయాలపాలై చనిపోతే ఈమె కు ఒక్క గాయం కాకపోవడం అనుమా నంగా ఉంది. నా కొడుకును ఆమెనే చంపి ఉంటే సోనమ్ను ఖచి్చతంగా ఉరితీయాల్సిందే’’అని ఉమ డిమాండ్ చేశారు.రాజా శరీరంపై లోతైన గాయాలు రాజా మృతదేహానికి చేపట్టిన పోస్ట్మార్టమ్ నివేదిక తాజాగా బహిర్గతమైంది. తలపై రెండు లోతైన గాయాలున్నాయి. ఒకటి ముందువైపు, మరోటి వెనుకవైపు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. శరీరంపైనా కత్తి గాయాలున్నాయి. మధ్యప్రదేశ్లో పథకరచన చేసి, మేఘాలయలో అమలుచేసి, చివరకు ఉత్తరప్రదేశ్లో నిందితులు దొరికిపోయారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తమ రాష్ట్రంలో హత్య జరగడంతో స్థానికులే ఈ హత్యచేశారని పుకార్లు రావడంతో మేఘాలయ పర్యాటకంపై ప్రభావం పడిందని, ఇప్పుడు అంతా స్పష్టతరావడంతో మా రాష్ట్రంపై పడిన మచ్చ తొలగిపోయిందని రాష్ట్ర మంత్రి అలెగ్జాండర్ ఆనందం వ్యక్తంచేశారు. ఇది కూడా చదవండి: గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత -
చీనాబ్ వంతెనపై ‘అమూల్’ కన్ను .. శభాష్ అన్న రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ సమయోచిత ప్రకటనల రూపకల్పనలో ముందుంటుందనే పేరు సంపాదించింది. కాలంతో పాటు చోటుచేసుకుంటున్న పరిస్థితులు, పరిణామాలను తన ప్రకటనల్లో ‘అమూల్’ ఎప్పటికప్పుడు జొప్పిస్తుంటుంది. తాజాగా అమూల్ ఇటీవలే ప్రధాని ప్రారంభించిన జమ్ముకశ్మీర్లోని చీనాబ్ వంతెనపై కన్నేసింది. ఇప్పుడు తన కొత్త ప్రకటనకు చీనాబ్ వంతెన బ్యాక్గ్రౌండ్ను వాడేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ వంతెన ప్రారంభోత్సవ సమయాన అమూల్ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో ‘రైల్’,‘రియలైజ్డ్’ అనే పదాలను కలిపి ‘ఎ డ్రీమ్ రైలైజ్డ్’ అనే చమత్కారమైన పదజాలాన్ని తయారు చేసింది. ప్రకటనలో ట్యాగ్లైన్గా ‘అముల్, టికెట్ టు గ్రేట్ టేస్ట్’ అని రాసింది. Thank you Amul. pic.twitter.com/jG28tPZBoJ— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 8, 2025కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటనను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. అలాగే ‘ధన్యవాదాలు అమూల్’ అని రాశారు. ఈ పోస్ట్ 408.9కేను మించిన వీక్షణలను దక్కించుకుంది. చీనాబ్ వంతెనను అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనంగా పరిగణిస్తున్నారు. దీనిని జూన్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ఉన్న 1,315 మీటర్ల పొడవైన ఈ ఉక్కు వంతెనే తీవ్ర భూకంప కార్యకలాపాలను, అధిక గాలి వేగాన్ని తట్టుకునేలా నిర్మించారు. ఇది కూడా చదవండి: గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత -
ఐఈడీ పేలి ఏఎస్పీ ఆకాష్ రావు దుర్మరణం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్లో దారుణం జరిగింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి అడిషనల్ ఎస్పీ మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఆ పార్టీ జూన్10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 11 నుంచి ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని తెలిపింది.భారత్ బంద్ పిలుపుతో మావోయిస్టులు ఎక్కువ ఉండే బస్తర్లో ఈరోజు తెల్లవారుజామున కొంటా-ఎర్రబోర్ రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు అడిషనల్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆకాష్ రావు గిరిపుంజే, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాల్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు పెట్రోలింగ్ చేసేందుకు వచ్చిన ఏఎస్పీ ఆకాష్ రావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు.ఈ ఘటనలో ఏఎస్పీతో పాటు ఇతర భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో ఏఎస్పీని ఎయిర్లిఫ్ట్లో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఏఎస్పీ మృతి చెందారు. మిగిలిన భద్రతా బలగాల ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కుప్పం నుంచి వచ్చి చోరీలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు కిలేడీలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి(35), మాధవి(40),అకిల (30), విద్య(29)ను హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళకు చెందిన బంగారు గొలుసు చోరీకి గురవ్వడంతో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ వేర్వేరు పనులు చేస్తున్నా ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ స్వంత ఊరికి వెళ్లిపోయేవారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన ఫుట్బోర్డు ప్రయాణం
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం జరిగిన ప్రమాదంలో జీఆర్పీ కానిస్టేబుల్ సహా నలుగురు రైలు ప్రయాణికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఉదయంపూట కిక్కిరిసిన రైళ్లలో నిర్లక్ష్యంగా ప్రయాణించడమే ఇందుకు కారణం. ముంబ్రా రైల్వే స్టేషన్సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు రైళ్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీపులకు భారీ బ్యాగులు తగిలించుకొని డోర్ల వద్ద ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వీటిలో ఒక రైలు కాసారా వైపు, మరొకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తోంది. ఈ రెండు రైళ్లు పక్కపక్కనున్న పట్టాలపై పరస్పరం వ్యతిరేక దిశలో వచ్చిన సమయంలో మూలమలుపు వద్ద ప్రయాణికుల బ్యాగులు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో మొత్తం 13 మంది వెంటనే కిందపడిపోయారు. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడి మృతి చెందారని రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితులను కేతన్ సరోజ్, రాహుల్ గుప్తా, మయూర్ షా, జీఆర్పీ కానిస్టేబుల్ విక్కీ ముఖ్యాద్గా గుర్తించారు. రైళ్లకు అటోమేటిక్ డోర్లు లేకపోవడం ప్రాణాంతకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ప్రయాణికులు లోపలికి వెళ్లగానే డోర్లు వాటంతట ఆవే మూసుకుపోయేలా రైలు బోగీలను డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. ముబ్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే శాఖను కోరనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm— ANI (@ANI) June 9, 2025 -
‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో(జూన్ 9) ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్ భారత్కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్ , వక్ఫ్ సంస్కరణలు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవలే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకువెళుతున్నామన్నారు. A clear focus on good governance and transformation! Powered by the blessings and collective participation of 140 crore Indians, India has witnessed rapid transformations across diverse sectors. Guided by the principle of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka… pic.twitter.com/bCC4MJP3Ii— Narendra Modi (@narendramodi) June 9, 2025140 కోట్ల భారతీయుల ఆశీస్సులతో వివిధ రంగాల్లో వేగవంతమైన మార్పు సాధించామని, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే సూత్రంతో తమ ప్రభుత్వం అద్భుతమైన మార్పులను అందించిందని, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక ఉన్నతి వరకు, ప్రజాకేంద్రీకృత, సమగ్ర, సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టి సారించామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, వాతావరణ మార్పులు , డిజిటల్ ఆవిష్కరణల వంటి కీలక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక గొంతుకగా మారిందని ప్రధాని అన్నారు. సమిష్టి విజయంపై గర్విస్తూనే, ఆశ, విశ్వాసం, సంకల్పంతో వికసిత భారత్ నిర్మాణం వైపు ముందుకు వెళతున్నామని ప్రధాని మోదీ ఆ ట్వీట్లో పునరుద్ఘాటించారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. -
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట హనీమూన్కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా, భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు.భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.దర్యాప్తు జరిగిదిలా..మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనమ్ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు గాలించాయి. సోనమ్ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఒక గెస్ట్హౌస్కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని, పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ను సంప్రదించారు. అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్కు ట్రెక్కింగ్కు చేరేందుకు మూడు గంటలు పడుతుందని, మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్ తెలుసని, గైడ్ సర్వీస్ అవసరం లేదని చెప్పారు.కాగా రాజా రఘువంశీ సోనమ్ దంపతులకు హోమ్ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని హోమ్స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది. -
వందే భారత్ స్లీపర్ కోచ్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్లను దశలవారీగా ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మరింత వేగం, సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది.రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారుసరికొత్త వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం 1,920 కొత్త కోచ్లను భారతీయ రైల్వే నిర్మించనుంది. అందుకోసం రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లను తాజాగా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్టును మూడు సంస్థలకు ఇచ్చింది. బీఈఎంఎల్, కినెట్ రైల్వే సొల్యూషన్స్, టిట్లాగఢ్ రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్–భారత్ హెవీ ఇంజినీరింగ్ లిమిటెడ్లతో కూడిన కన్సార్షియానికి టెండర్లు ఖరారు చేసింది.ఈ సంస్థలు నిర్మించే అధునాతన స్లీపర్ కోచ్లను 2027 నుంచి దశలవారీగా ప్రవేశపెట్టనుంది. కీనెట్ రైల్వే సొల్యూషన్స్ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్లోని కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ కోచ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది. త్వరలోనే అధునాతన వందేభారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. కొత్తగా నిర్మించే 1,920 కోచ్లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరో 11 వందే భారత్ ఛెయిర్ కార్ రైళ్లు..ఇదిలా ఉండగా.. మరో 11 వందే భారత్ రైళ్లు ఛెయిర్ కార్తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ప్యాక్టరీ(ఐసీఎఫ్) అధికారి ఒకరన్నారు. ఆ తర్వాత ఛెయిర్ కార్ బోగీల ఉత్పత్తులు ఆపేసి స్లీపర్ కోచ్లపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్), పెరంబూరులోని ‘ఐసీఎఫ్’లో వందేభారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ఉత్పత్తి పూర్తయిందని, ప్రొటోటైప్తో కూడిన రైలును రైల్వే బోర్డుకు త్వరలో అందించనున్నామని, రైల్వే బోర్డు 97 వందే భారత్ రైళ్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని ఐసీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో 86 రైళ్లు తయారీ పూర్తయి డెలివరీ కూడా చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మిగిలిన 11 ఛెయిర్ కార్ బోగీలను బోర్డుకి అందిస్తామని చెప్పారు. -
నీకు రెండో పెళ్లి నేను చేస్తా!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది. అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం అర్థరాత్రి దాటాక స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్ స్కేల్పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఢిల్లీలో ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. భూమి కేవలం స్వల్పస్థాయిలో కంపించడంతో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది ఢిల్లీ కేంద్రంగా భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 5.36 గంటలకు రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది. ప్రస్తుతం ఢిల్లీ నాలుగో జోన్లో ఉంది. ఇది దేశంలోని భూకంపాల ప్రభావాలకు లోనయ్యే రెండో తీవ్ర ప్రమాదజోన్. హిమాలయాల కింద పొరలు తరచూ ఢీకొనే జోన్కు ఢిల్లీ దగ్గర్లో ఉంది. అదీకాకుండా ఢిల్లీ నుంచి కేవలం 250 కిలోమీటర్ల దూరం నుంచే హిమాలయ శ్రేణి మొదలవుతుంది. ఢిల్లీ–హరిద్వార్, సోహ్నా, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫలకాలు సైతం తరచూ కదులుతూ ఢిల్లీని భూకంపాల జోన్లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఢిల్లీకి భూకంపాల ముప్పు ఎక్కువైంది. -
బెంగాల్, తమిళనాడుల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే
మదురై: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశలో అమిత్ షా మాట్లాడారు. అవినీతిమయమైన అధికార డీఎంకేకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టాస్మాక్ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు దోచేసిన సొమ్ముతో రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులు నిర్మించవచ్చన్నారు. గత పదేళ్లలో తమిళనాడుకు కేంద్రం రూ.6.8 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. -
అనుమానాలుంటే హైకోర్టుకు వెళ్లండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొట్టిపారేసింది. అందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. ‘‘ఎన్నికల ప్రక్రియపై అనుమానాలుంటే నేరుగా మాకు లేఖ రాయండి. బదులిస్తాం. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఫుటేజీని న్యాయస్థానం క్షుణ్నంగా పరిశీలిస్తుంది’’ అని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సమగ్రత, ఓటర్ల గోప్యతను ఈసీ కచ్చితంగా పరిరక్షిస్తుందని తెలిపాయి. ఓటర్ల గోప్యతపై దాడి చేయాలనుకోవడం సరైంది కాదని సూచించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15న కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టంచేశాయి.ప్రజాతీర్పు అపహాస్యం: ఫడ్నవీస్ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందీ సమీక్ష చేసుకోకుండా ప్రజాతీర్పును రాహుల్ అపహాస్యం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించడాన్ని తట్టుకోలేక నిందలు వేస్తున్నారని ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆరోపించారు. శనివారం రాహుల్ కూడా అదే పత్రికకు రాసిన వ్యాసంలో మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. ‘‘మ్రహారాష్ట్రలో భారీగా బోగస్ ఓటర్లను చేరి్పంచారని, సాయంత్రం ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరిగిందని అనడం పెద్ద జోక్. యువ ఓటర్ల సంఖ్య పెరగడం మామూలే. క్యూ నుంచున్న వారిని సమయం ముగిసినా ఓటేసేందుకు అనుమతి స్తారని తెలియదా?’’ అని ప్రశ్నించారు. -
మహిళా సాధికారతకు... 11 ఏళ్లుగా కృషి: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’కి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్స్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రస్తావించారు. వాటితో నారీమణులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్, జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలతో మన అడపడుచుల గౌరవం పెంచామని తెలిపారు. పేద గృహిణులకు ఉజ్వల యోజన కింద 10 కోట్లకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, మహిళా వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు అందజేశామని గుర్తుచేశారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరిటే ఇళ్లు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ అండతో సోదరీమణులు వారి కలలు సాకారం చేసుకుంటున్నారని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొంటున్నారని కొనియాడారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఆడ శిశువులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఇదొక ఉద్యమంగా మారిందని మోదీ వివరించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 2011–13లో ప్రతి లక్ష మందిలో 167 మంది గర్భిణులు ప్రసవాల సమయంలో మరణించేవారని, 2019–21 నాటికి అది 93కు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో దేశంలో మంచినీటి కనెక్షన్ ఉన్న ఇళ్లు 3.23 కోట్లు కాగా 2025 మే నాటికి 15.64 కోట్లకు పెరిగాయన్నారు. సమాజంలో అన్ని వర్గాల మహిళల సంపూర్ణ అభివృద్ధే తమ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు.మోదీ పాలనకు నేటితో పదకొండేళ్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సోమవారం 11 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ప్రధానిగా మూడో టర్ములో ఆయన పదవీ కాలానికి సోమవారంతో ఏడాది పూర్తవనుంది. 2024 జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తెలిసిందే. తొలి రెండు దఫాలకు భిన్నంగా మూడోసారి బీజేపీ సంపూర్ణ మెజార్టీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దాంతో జేడీ(యూ), టీడీపీ తదితర పారీ్టల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మూడో టర్మ్లో తొలి వార్షికోత్సవ వేడుకలకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇందిరా గాంధీ 11 ఏళ్ల 59 రోజులతో రెండో స్థానంలో ఉన్నారు. మరో రెండు నెలల్లో ఆమె రికార్డును మోదీ అధిగమించనున్నారు. -
స్పేష్ మిషన్లో భాగస్వామ్యంనా అదృష్టం: శుభాన్షు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్జియం–4 స్పేష్ మిషన్లో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (39) చెప్పారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు ఫాల్కన్–9 రాకెట్ ద్వారా వారి ప్రయాణం ప్రారంభం కానుంది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుందని భావిస్తున్నట్లు శుభాన్షు చెప్పారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో గ్రూప్ కెపె్టన్ అయిన శుక్లా రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్లకు అంతరిక్షంలోకి చేరుకోబోతున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. ఆగ్జియం మిషన్ నిమిత్తం అమెరికాలో కొద్ది నెలలుగా ప్రత్యేక శిక్షణ పొందారు. రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్కు చెందిన సోయజ్ స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులుండి తిరిగొచ్చారు. ఆయనను శుభాన్షు తన స్ఫూర్తిప్రదాతగా భావిస్తుంటారు. శుక్లాతోపాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషనల్ స్పెషలిస్టులు టిబోర్ కపూ, స్లావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవెస్కీ స్పేస్ఎక్స్ మిషన్లో భాగంగా డ్రాగన్ క్యాప్సూల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. డ్రాగన్ క్యాప్సూల్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. -
40 ఏళ్లలో కరువుల తీవ్రతశాతం పెరిగింది
కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో కరువు కాటకాలు తప్పడం లేదు. కరువుల బెడద మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత ఏకంగా 40 శాతం పెరిగినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు తేలింది. వర్షపాతం స్థిరంగా ఉన్నచోట కూడా కరువుల తీవ్ర పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ అది తేమను ఒడిసిపట్టుకొనే సామర్థ్యం సైతం పెరుగుతోంది. దాంతో కరువులు తీవ్రత సైతం పైపైకి ఎగబాకుతోందని సైంటిస్టులు వెల్లడించారు. వాతావరణం వేడెక్కడానికి, కరువులు తీవ్రంగా మారడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన క్లైమేట్ హజార్డ్స్ సెంరట్ డైరెక్టర్ క్రిస్ ఫాంక్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి, విశ్లేíÙంచారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్(ఏఈడీ) పెరుగుతుండడంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40 శాతం పెరిగినట్లు స్పష్టమయ్యింది. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటుంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. మరో విషయం ఏమిటంటే.. 1981–2017 నాటి సగటుతో పోలిస్తే గత ఐదేళ్లలో కరువు పరిస్థితి 74 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు 58 శాతం ఏఈడీనే కారణం. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30 శాతం భూభాగం కరువునకు గురయ్యింది. దీనికి 40 శాతం ఏఈడీనే కావడం గమనార్హం. – న్యూఢిల్లీ -
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 టైటిల్ను గెలిచిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా ఆ ఈవెంట్కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్ టైటిల్ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు. -
6,133కు కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మరణించినట్లు తెలియజేసింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా కరోనా వల్ల 65 మందికిపైగా మంది మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. -
రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(2024)మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్ ఆర్టికల్కు కౌంటర్గా మరో పత్రికలో వ్యాసం రాశారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవిచూసిందని పేర్కొంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధానాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దీనిపై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో వ్యాసం రాశారు.దీనికి కౌంటర్గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన వ్యాసం నేడు(ఆదివారం)ఒక మరాఠీ దినపత్రికలో ప్రచురితమయ్యింది. దానిలో ఫడ్నవీస్ కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారని, అందుకే వారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని నేత అని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అంటూ ఫడ్నవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 46 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పటి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీల మహాయుతి కూటమి 235 సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లను గెలుచుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలిచింది.ఇది కూడా చదవండి: భగ్గుమన్న మణిపూర్.. ఏటీ నేత అరెస్టుతో ఉద్రిక్తత -
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మొయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో హోరెత్తించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దాంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు. దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్లో కొందరు ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరోవైపు మణిపూర్ గవర్నర్ అజయ్కుమార్ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్లో గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మొయితీ వర్గానికి చెందిన అరంబాయ్ తెంగోల్ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్ సింగ్ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్కు ట్రంప్ వార్నింగ్ -
రూ.20 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్లోని మధుర–బృందావన్లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.అలీగఢ్కు చెందిన అభిషేక్ అగర్వాల్ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్ అగర్వాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు. -
ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నూతన దంపతులు రఘువంశీ, సోనమ్లు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారు. 11 రోజుల తరువాత రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడిని ఎవరో హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియోం తెలిపారు. అయితే సోనమ్ ఏమైందనేది ఇంతవరకూ తెలియరాలేదు.మేఘాలయ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదల చేశారు. అదృశ్యమైన సోనమ్ కోసం గాలిస్తున్నారు. ఈ జంట హనీమూన్లో భాగంగా సందర్శించిన ప్రదేశాలను, సమయాలను పోలీసులు తెలిపారు.మే 21, సాయంత్రం 6 గంటలకు: షిల్లాంగ్రఘువంశీ, సోనమ్లు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని బాలాజీ గెస్ట్ హౌస్కు చేరుకుని, చెక్ ఇన్ చేశారు.మే 22, ఉదయం: షిల్లాంగ్రఘువంశీ, సోనమ్లు కీటింగ్ రోడ్లో స్కూటీని అద్దెకు తీసుకుని, బాలాజీ గెస్ట్ హౌస్కు తిరిగి వచ్చారు. వారు అల్పాహారం తీసుకోకుండానే చెక్ అవుట్ చేశారు. మే 25కు తిరిగి వస్తామని, గది అవసరమైతే ఫోన్ చేస్తామని మేనేజర్కు చెప్పారు. షిల్లాంగ్ నుండి వారు స్కూటీపై ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరపుంజి)కి రెండు లగేజీలను తీసుకుని బయలుదేరారు.మే 22, సాయంత్రం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాఈ జంట తూర్పు ఖాసీ హిల్స్లోని మౌలాఖియాట్ గ్రామానికి చేరుకుంది. పర్యాటకుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలంలో స్కూటీని నిలిపారు. అదే జిల్లాలోని నోంగ్రియాట్ గ్రామంలోని షిపారా హోమ్స్టేకు ట్రెక్కింగ్ చేసేందుకు వారు స్థానిక గైడ్ను ఏర్పాటు చేసుకున్నారు.మే 23, ఉదయం: మౌలాఖియాట్, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లారఘువంశీ, సోనమ్లు షిపారా హోమ్స్టే నుండి చెక్ అవుట్ చేసి, గైడ్ లేకుండానే మావ్లాఖియాట్ గ్రామానికి వెళ్లారు. అదే రోజు వారు మావ్లాఖియాట్ నుండి బయలుదేరి, ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు. ఆ జంట తామే ట్రెక్కింగ్కు వెళతామని తెలియజేసినట్లు గైడ్ పోలీసులకు చెప్పాడు. తన సేవలను తీసుకోలేదని గైడ్ పోలీసులకు తెలిపాడు.మే 24: సోహ్రారిమ్తూర్పు ఖాసీ హిల్స్లోని సోహ్రారిమ్ గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక స్కూటీని చూసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మే 25: సోహ్రారిమ్పోలీసులు ఆ స్కూటీ యజమానిని గుర్తించారు. అతను సోహ్రా పోలీస్ స్టేషన్కు వచ్చి, మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రఘువంశీ, సోనమ్లు తన ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు నిర్ధారించాడు.మే 26: సోహ్రారిమ్రఘువంశీ, సోనమ్లు తిరిగిన ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.జూన్ 2: వీ సావ్డాంగ్ జలపాతంపోలీసు డ్రోన్ వీ సావ్డాంగ్ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించింది. పాక్షికంగా కుళ్ళిపోయిన ఆ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది రాజా రఘువంశీ మృతదేహమేనని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చూడండి: అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చైత్ర..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నగా అది బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఈఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మూడేళ్లుగా చైత్ర పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించి భోజనంలో విషం కలిపింది. చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైత్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఒక రన్వే మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్ రన్వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్ లను క్యాన్సల్చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్ చేయనున్నారు. జూన్ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్ 15వ తేదీదాకా రన్వే పై ల్యాండింగ్, టేకాఫ్లను నిలిపివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) శుక్రవారం ప్రకటించింది. కేటగిరీ(క్యాట్)3బీ ప్రమాణాలకు అనుగుణంగా రన్వేపై ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నారు. గాల్లోంచి కిందకు దిగుతూ 15 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక కూడా విమాన పైలెట్కు మంచు, వర్షం వంటి పరిస్థితుల్లో రన్వే స్పష్టంగా కనబడకపోతే ల్యాండింగ్ చేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ల్యాండింగ్ సాధ్యమయ్యేలా రన్వే వెంట అప్రోచ్, టచ్డౌన్ లైట్లు, అధునాతన సిగ్నల్, వాయిస్ ప్రాప్ట్ల వ్యవస్థలను ఏర్పాటుచేస్తారు. నెలల తరబడి ఏకధాటిగా ఒకే ప్రాంతంలో వందల విమానాల ల్యాండింగ్ కారణంగా దెబ్బతిన్న రన్వే ప్రాంతాన్ని పునరుద్ధరించనున్నారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన శ్లోక్ త్రిపాఠి అలియాస్ శ్లోక్ తివారీ(30) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడు మద్యం మత్తులో బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి, ఘజియాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్లోక్ త్రిపాఠి ఎల్ఎల్బీ చదివాడు. యూపీలోని ఘజియాబాద్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్గా పని చేస్తున్నాడు. 2020లో పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది భార్య అతడిని వదిలేసి, ఢిల్లీకి వెళ్లిపోయింది. భర్త తాగుడు వ్యసనం భరించలేక దూరంగా ఉంటోంది. మళ్లీ ఎలాగైనా భార్యతో కలిసి జీవించాలని శ్లోక్ త్రిపాఠి నిర్ణయించుకున్నాడు. ఆమె వినకపోవడంతో పోలీసుల సాయం తీసుకోవాలని భావించాడు. గురువారం, శుక్రవారం రాత్రిపూట చిత్తుగా మద్యం సేవించి, 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్కు పదేపదే ఫోన్ చేశాడు. తన భార్యను తనతో కలపాలని పోలీసులను కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిని రేఖా గుప్తాను చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో ఘజియాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం ఉమ్మడిగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘజియాబాద్లో అరెస్టు చేశారు. మరోవైపు సీఎం రేఖా గుప్తా భద్రతను మరింత పెంచారు. -
పైలట్ పంతంతో నిలిచిన ప్రాణం
థానే: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఆసక్తికర మైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే షెడ్యూల్ కంటే ముందే జల్గావ్ ఎయిర్పోర్టుకు చేరుకోవడం, విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడం.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యాయి. జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్నగర్లో సంత్ ముక్తి పల్లకి యాత్రలో పాల్గొనేందుకు ఏక్నాథ్ షిండే శుక్రవారం తన చార్టెర్డ్ విమానంలో ముంబై నుంచి జల్గావ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు రావాల్సి ఉండగా, దాదాపు మూడు గంటలు ఆలస్యంగా 6.15 గంటలకు విమానం ఎయిర్పోర్టులో ల్యాండైంది. ఏక్నాథ్ షిండే ఎయిర్పోర్టు నుంచి ముక్తాయ్నగర్ వెళ్లి పల్లకి యాత్రలో పాల్గొని ఎయిర్పోర్టుకు రాత్రి 9.15 గంటలకు తిరిగివచ్చారు. అయితే, గంట ముందే రావడంలో విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించాడు. షెడ్యూల్ ప్రకారమే వెళ్లాలని తేల్చిచెప్పాడు. మహారాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్రావు పాటిల్తోపాటు జిల్లా అధికారులు దాదాపు 45 నిమిషాలపాటు ఎయిర్పోర్టులో చర్చలు జరిపారు. పైలట్ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు అతడు అంగీకరించాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ఏం జరిగింది? జల్గావ్కు చెందిన శీతల్ పాటిల్కు ముంబైలో అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచి కిత్స జరగాల్సి ఉంది. జల్గావ్ నుంచి విమానంలో వెళ్లాల్సి ఉండగా, ఎయిర్పోర్టుకు చేరుకొనేసరికే విమానం వెళ్లిపోయింది. అదే సమయంలో ఏక్నాథ్ షిండే అదే ఎయిర్పోర్టులో తన విమానం కోసం వేచి చూస్తున్నారు. పైలట్తో చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో శీతల్ పాటిల్ గురించి స్థానిక నాయకులు ఏక్నాథ్ షిండే దృష్టికి తీసుకెళ్లారు. పైలట్ టేకాఫ్కు అంగీకరించడం, విమానం సిద్ధం కావడం జరిగిపోయాయి. దాంతో ఆయన శీతల్ పాటిల్ను, ఆమె భర్తను తనతోపాటు చార్టెర్డ్ విమానంలో ముంబైకి తీసు కెళ్లారు. ముందే సమాచారం ఇచ్చి ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే శీతల్ బోర్డేను ప్రత్యేక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి అనుకున్న సమయానికే శీతల్ బోర్డే ఆసుపత్రికి చేరుకున్నారు. ఏక్నాథ్ షిండే విమానాన్ని టేకాఫ్ చేయడానికి పైలట్ మొండికేయడం ఆమె ప్రాణాలను కాపాడిందని స్థాని కులు పేర్కొన్నారు. సామాన్య ప్రజల బాగు కో సం ఏక్నాథ్ షిండే తపన పడుతుంటారని, వారి సేవ కోసం ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. -
సోనియా గాందీకి అస్వస్థత
సిమ్లా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(78) అస్వస్థతకు గురయ్యారు. కుమార్తె ప్రియాంక గాందీతో కలిసి గత సోమవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు వ్యక్తిగత పర్యటన కోసం వచి్చన సోనియా శనివారం ఒక్కసారిగా అధిక రక్తపోటుకు గురయ్యారు. దాంతో ఆమెను చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు నరేశ్ చౌహాన్ చెప్పారు. కొన్ని పరీక్షల అనంతరం సోనియా గాంధీ డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. ప్రియాంక గాం«దీకి సిమ్లా శివారులోని చరబ్రలో సొంత ఇల్లు ఉంది. తల్లికుమార్తెలు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. -
గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన 1970వ దశకంలో ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థను యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(యూడీసీటీ)గా పిలిచేవారు. ముకేశ్ అంబానీ శుక్రవారం ఐసీటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తమ ప్రొఫెసర్ శర్మ బోధించిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ప్రొఫెసర్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన దేశం అన్ని రకాల సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీడర్గా ఎదగాలని తన తండ్రి ధీరూబాయ్ అంబానీ తరహాలోనే ప్రొఫెసర్ శర్మ కూడా ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్ శర్మ కృషి వల్లే ఐసీటీ అత్యున్నత విద్యాసంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్ శర్మను ‘భారత్ గురు’గా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేరి్పన ఐసీటీకి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు. -
విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: విపత్తులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని స్పష్టంచేశారు. ‘డిజాస్టర్ రీసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్–2025’అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ శనివారం వీడియో సందేశం ఇచ్చారు. విపత్తుల నివారణ విషయంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ విధానాలు పరస్పరం పంచుకోవడానికి గ్లోబల్ డిజిటల్ వేదిక, నిధుల సేకరణ అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థతోపాటు దేశాల మధ్య సహకారం కచి్చతంగా అవసరమని అన్నారు. ఇండియా ఏర్పాటు చేసిన సునామీ వార్నింగ్ సిస్టమ్తో 29 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని గుర్తుచేశారు. కాలుష్యం, వాతావరణ మార్పులతోపాటు ప్రకృతి విపత్తుల సముద్ర తీర ప్రాంతాలు, దీవులకు పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. -
‘తీవ్రమైన పేదరికం’ తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారతదేశంలో ‘తీవ్రమైన పేదరికం’రేటు క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. 2011–12లో పేదరికం రేటు 16.2 శాతం ఉండగా, పదేళ్ల తర్వాత 2022–23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. రోజుకు 3 డాలర్లు (రూ.257) సంపాదిస్తే పేదలు కానట్లేనని ప్రపంచ బ్యాంకు గతంలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రోజుకు 2.15 డాలర్లు సంపాదిస్తే పేదలు కాదనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో 3 డాలర్లకు పెంచారు. ఇండియాలో 2011–12లో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) 34 కోట్ల మంది ఉండగా, 2022–23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది. → 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన 3 డాలర్ల కంటే తక్కువే ఉంది. ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు 5.44 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. → ఉచితం లేదా రాయితీతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తుండడం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతోంది. → అలాగే పేదరికం విషయంలో పల్లెలు–పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతుండడం మరో కీలక పరిణామం. → అత్యంత పేదల్లో 54 శాతం మంది ఐదు అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు. → 2011–12 నుంచి 2022–23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. → ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. పల్లెలు–పట్టణాల మధ్య అంతరం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది. -
బిహార్లో చెరో సగం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల సంఖ్యపై ఎన్డీఏ కూటమి పార్టీలు సీట్ల పంపకంపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూలో సమాన స్థాయిలో సీట్లు తీసుకోవాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 243 స్థానాలకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాలు పోటీ చేసేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్లోని ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) , జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామీ మోర్చా (హెచ్ఏ ఎం), ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్మంచ్ (ఆర్ఎల్ఎం) ఉన్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 5, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం ఒక్కొక్క స్థానంలో పోటీ చేశాయి. పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానంలో అధికంగా పోటీ చేసినప్పటికీ ఈసారి సమానంగా సీట్ల పంపకాలు ఉంటాయని తెలుస్తోంది. 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 102–103 సీట్లలో, బీజేపీ 101–102 సీట్లలో పోటీ చేయవచ్చని సమాచారం. మిగిలిన 40 సీట్లు కూటమిలోని మిగతా పార్టీలకు వదిలేస్తారని భావిస్తు న్నారు. పార్లమెంట్లో ఐదుగురు సభ్యుల ప్రాతినిధ్యం దృష్ట్యా ఎల్జేïపీ దాదాపు 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. హెచ్ఏఎంకు 7 సీట్లు, ఆర్ఎల్ఎంకు 4–5 సీట్లు కేటాయించవచ్చని అంటున్నారు. కొద్ది నెలల కిందట అసెంబ్లీ నియోజక వర్గాలన్నింటిలో నిర్వహించిన అంతర్గత బీజేపీ సర్వేల ఆధారంగా సీట్ల పంపిణీపై ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతోపాటు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సర్వే చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించేలా రెండు పార్టీల ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్ఫ్లోర్లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూరు.. ఒక్కో తీరు
పర్యాటకుల ఆసక్తులు మారాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సో బెటరూ అంటున్నారు. కొందరు సోషల్ మీడియా వీడియోలూ, వెబ్ సిరీస్లూ, సినిమాలూ చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరు సపరివార సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంకొందరు క్రికెట్ మ్యాచ్లను బట్టి తమ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.. యుద్ధభూముల్లో స్ఫూర్తి పొందుతున్నారు.. నిశీధిలో నింగిలోని చుక్కలను లెక్కపెట్టేస్తున్నారు.. ఇది నయా పర్యాటక ముఖచిత్రం.‘‘పాతాళ్లోక్ సీజన్ 2’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్. ఈశాన్య భారతంలోని నాగాలాండ్లో ఎక్కువ భాగం షూట్ చేశారు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఇంత స్థాయిలో అక్కడ షూట్ జరగడం ఇదే మొదటిసారి. అక్కడి పచ్చని కొండ ప్రాంతాలు, ఇళ్లు, దట్టమైన వెదురు అడవులు.. అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. అది చూశాక నాకు నాగాలాండ్ వెళ్లాలనిపించింది.స్నేహితులతో వెళ్లి వచ్చేశా’’ అంటాడు హైదరాబాద్కి చెందిన కె.ఉమావెంకట్. ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు వారాంతాల్లో కూడా స్నేహితులతో వరంగల్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సరదాగా వెళ్లి వచ్చేస్తుంటాడు. ‘ఉద్యోగంలో చేరిన తరవాత కొత్త స్నేహితులు వచ్చారు. వీళ్లే నాకు సహచరులు, స్నేహితులు’ అంటాడు. ఇలాంటి వాళ్లనే ఇప్పుడు ఫ్రొలీగ్స్ అని పిలుస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయిన కొలీగ్స్ అన్నమాట. ఇలా సహచర ఉద్యోగ స్నేహితులతో షికార్లకు వెళ్లడం ఇటీవలికాలంలో పెరిగింది.దేశభక్తి.. ప్రకృతి సౌందర్యం..యుద్ధభూమి అంటే వీరత్వానికి ప్రతీక. సైనికుల ధైర్యసాహసాలకు వేదిక. అలాంటి రణభూమికి కూడా పర్యటనలకు వెళ్లేందుకు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రణభూమి దర్శన్’ పేరిట ప ర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్, లఢాక్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అరు ణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో 77 ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత సాయుధ దళాల త్యా గాలను ఇవి గుర్తుచేసి, సందర్శకులను రోమాంఛితం చేస్తాయి. ఇవి దేశభక్తి, ప్రకృతి సౌందర్యాల కలబోతలు.తారాలోకం చూస్తూ..రాత్రిపూట ఖగోళ రహస్యాలను, చందమామ, నక్షత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తోందని వారు చెబుతున్నారు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ‘ స్కైస్కానర్’ నిర్వహించిన సర్వేలో.. రాత్రిపూట ఆకాశాన్ని ఫొటోలు తీసేందుకు ఇష్టపడి పర్యటనలకు వెళ్లినవారు 56% మంది. రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు ఉండగా కొండప్రాంతాల్లో నిద్రించేందుకు వెళ్లినవారు 53% మంది.సినిమాలు, వెబ్సిరీస్లు చూసి..సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు సామాన్యులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనేక ప్రదేశాల గురించి చెబుతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, సోనీ లివ్ వంటి వేదికల్లో వస్తున్న వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా పర్యటనలు చేయాలను కునేవారిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు థామస్ కుక్, ఎస్ఓటీసీ వి డుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్ 2025’ సర్వేలో.. ఇలాంటి ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నామని 60 శాతం మంది చెప్పడం విశేషం. ఇలా వెళ్లేవారిలో యువతే∙అధికం.సపరివార సమేతంగా..యువతరం తమ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ / నాన్నమ్మలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం, 5–6 అంకెల జీతం.. వీరిని ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు గతంలో ఎక్కువ పర్యటనలు చేయకపోవడం కూడా యువతను ఈ నిర్ణ యానికి ప్రేరేపిస్తోంది. దీంతో సపరివార సమే తంగా విహారయాత్రలు చేస్తున్నారు. ‘ఇండి యా హాలిడే రిపోర్ట్ 2025’ ప్రకారం దాదాపు 65% ఇలా పర్యటనలకు వెళ్తున్నారు.క్రికెట్ ప్రేమికులూ..క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ ప్రకా రం టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. టీ20, వన్డే వంటి మ్యాచ్లు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రకరకాల స్థానిక రుచులను ఆస్వాదిస్తు న్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మ్యాచ్లను ఇలా చాలామంది చూశారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ ‘పిచ్ పర్ఫెక్ట్ జర్నీస్’ ప్రకారం.. 48% మంది మ్యాచ్కి కనీసం 2 నెలల ముందే ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. వీరిలో స్నేహితులతో వెళ్లినవారు 74% కాగా, కుటుంబంతో వెళ్లినవారు 59%. భార్య లేదా ప్రియురాలు / సహజీ వనం చేస్తున్నవారితో వెళ్లినవారు 46 శాతం.మిమూనింగ్.. సోలో పర్యటనహనీమూన్ వినే ఉంటారు. అంటే జీవిత భాగస్వామితో వివాహానంతరం చేసే విహార యాత్ర. మి మూనింగ్ అంటే.. ఒక్కరే వెళ్లడం. ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు ‘తనలో తామే రమించడం’. ఒక్కరే ఆ అనుభూతిని ఆస్వాదించడం. ట్రెకింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి సాహస యాత్రలు చేయడం. ఎలాంటి బాదరబందీ లేకుండా ఒక్కరే.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవడం, ఎంజాయ్ చేయడం. ఇలా వెళ్లి స్థానికతను ఆస్వాదిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో స్థానిక పండుగలూ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక రుచులను టేస్ట్ చేస్తున్నారు. భారత్ సహా 7 దేశాల్లో నిర్వహించిన ‘అమెరికన్ ఎక్స్ప్రెస్ 2024 గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్’ రిపోర్ట్ ప్రకారం.. 84 శాతం మంది మిమూనింగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ సగటు 66 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. భారత్ సహా 13 దేశాల్లోని 13 వేల మందిని 2024 జూన్లో సర్వే చేసిన రిపోర్టు ‘హిల్టన్ 2025 ట్రెండ్స్’. దీని ప్రకారం సోలో పర్యటనలు చేస్తున్నవారు 47 శాతం మంది. వీరిలో మిలీనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు) 51 శాతం కాగా, జనరేషన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) 55 శాతం కావడం విశేషం. -
డ్రోన్.. స్టార్టప్లు పెరిగెన్
డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను డ్రోన్స్ స్టార్టప్స్ అందిపుచ్చుకుంటున్నాయి. మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్ కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్ అవకాశాలను అంచనా వేయొచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్ తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోని టాప్–100 స్టార్టప్స్లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్ స్టార్టప్లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.బెంగళూరు టాప్..డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్ కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 14 మంది, బిట్స్ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్ స్టార్టప్స్ను అందించిన టాప్ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.వెన్నుతడుతున్న ప్రభుత్వం..ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.నిధులు వెల్లువెత్తాయి..దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్ కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. 2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్ ఊపు మీద ఉంది. 2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్ 4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్ కంపెనీలు అందుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి. -
చాట్ జీపీటీ వాడకంలో.. భారత్ నంబర్ 1
వాడకం అంటే మనవాళ్లదే. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ‘చాట్జీపీటీ’ భారతీయులకు అత్యంత ఇష్టమైన యాప్గా అవతరించింది. చాట్జీపీటీ వినియోగంలో ప్రపంచంలో 13.5% మంది యూజర్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాను కూడా వెనక్కి నెట్టి ఔరా అనిపించింది. చాట్జీపీటీ వినియోగదారుల సంఖ్య భారత్లో 10.8 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి భారతీయుల జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మమేకం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్టెక్నాలజీ వాడకంలో మనవాళ్లను కొట్టేవారే లేరని మరోసారి నిరూపితమైంది. చాట్జీపీటీ యూజర్లలో భారతీయులు నంబర్వన్గా నిలిచారు. అమెరికా కూడా మన తరవాతే ఉంది. యూఎస్ వాటా 8.9% మాత్రమే. ఇండోనేసియా 5.7, బ్రెజిల్ 5.4, ఈజిప్ట్ 3.9, మెక్సికో 3.5, పాకిస్తాన్ 3, జర్మనీ 3, ఫ్రాన్స్ 2.9, వియత్నాం 2.6% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏఐ ఆధారిత ఈ చాట్బాట్ సాంకేతిక నిపుణులకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్కు తోడు సామాన్యులూ మన దేశంలో తెగ వాడేస్తున్నారు. హోంవర్క్లో సహాయం, మనసుకి నచ్చిన వారికి సందేశం, కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కంటెంట్ క్రియేషన్ .. అవసరం ఏదైనా అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ చాట్బాట్ వేగంగా భారత్లో విస్తరిస్తోందని క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్గా ప్రసిద్ధి చెందిన విశ్లేషకురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ తన ‘2025 ఏఐ ట్రెండ్స్’ నివేదికలో తెలిపారు. అంతేగాక చైనా తయారీ ఏఐ చాట్బాట్ ‘డీప్సీక్’ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వినియోగదారుల్లో 6.9 శాతం మంది మనదేశం నుంచే ఉన్నారు. 33.9% వాటాతో చైనా, 9.2%తో రష్యా టాప్–2లో ఉన్నాయి. డీప్సీక్ మొత్తం వినియోగదార్ల సంఖ్య 5.4 కోట్లు.తెలుగులోనూ వినియోగం..ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం, బలమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమ, డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వ మద్దతు, ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టడం వంటి వివిధ అంశాలు ఏఐ వినియోగంలో ఈ పెరుగుదలకు కారణమని నివేదిక వెల్లడించింది. చాట్జీపీటీ తెలుగు, హిందీ, మలయాళం, తమిళం వంటి అనేక భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుగులోనూ అందిస్తుందన్నమాట. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభించడం, ఇంటర్నెట్ వేగం దూసుకెళ్లడం కూడా చాట్జీపీటీ వాడకం అధికం కావడానికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. రోజుకు 100 కోట్లకుపైగా..చాట్జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్ నమోదవుతున్నాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. వార్షిక సర్చెస్ 36,500 కోట్లకు చేరుకోవడానికి గూగుల్కు 11 ఏళ్ల సమయం పడితే.. చాట్జీపీటీ ఈ మైలురాయిని 5.5 రెట్లు వేగంగా రెండేళ్లలోనే అందుకుంది. 2022 నవంబర్ 30న రంగ ప్రవేశం చేసిన చాట్జీపీటీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినోదం, ఆటల కోసం కాకుండా నేర్చుకోవడానికి, రాయడానికి, కోడింగ్ కోసం, కంటెంట్ క్రియేట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నందున ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. చాట్జీపీటీకి అంతర్జాతీయంగా 80 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారు. 21 నెలల క్రితంతో పోలిస్తే చాట్జీపీటీ యాప్లో మూడు రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు వెచ్చిస్తున్నారు. చెల్లించేందుకూ సిద్ధం..ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాట్జీపీటీ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 2 కోట్లు దాటింది. ఈ సంఖ్య సంవత్సరానికి 153 శాతం చొప్పున దూసుకెళుతోంది. ఈ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐకి పెద్ద మొత్తంలో ఆదాయ వనరుగా అవతరించింది. ఏడాదిలోనే ఈ మొత్తం పది రెట్లు పెరిగింది. చాట్బాట్ ఒక్కటే కంపెనీకి ఏటా రూ.31,709 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఎక్కువ మంది యూజర్లు మెరుగైన ఫీచర్ల కోసం చెల్లించేందుకు వెనుకాడడం లేదు. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం..ఏఐ జోరులో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఈ ధోరణి కారణంగా దేశం నుంచి మరిన్ని ఏఐ స్టార్టప్లు ఉద్భవించడానికి దారితీసే అవకాశం ఉంది. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం 92.2% భారతీయ కార్యాలయాలు తమ రోజువారీ కార్యకలాపాలలో చాట్జీపీటీ వినియోగాన్ని అనుమతించాయి. చాట్జీపీటీని స్వీకరించడంలో అమెరికా కంటే భారత్ చాలా ముందుంది. యూఎస్ కార్యాలయాలలో 72.2% మాత్రమే చాట్జీపీటీని ఉపయోగిస్తున్నాయి. -
10 శాతం చికెన్ తెలంగాణదే
దేశంలో కోడి మాంసం (చికెన్) ఉత్పత్తిలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50.19 లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయ్యింది. అందులోతెలంగాణలో 10 శాతం.. అంటే 5.10 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 7.56 లక్షల టన్నులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 6.75 లక్షల టన్నులు, హరియాణాలో 6.36 లక్షల టన్నులు, తమిళనాడులో 5.58 లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి అయ్యింది. కాగా, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో చికెన్ వినియోగం అతి తక్కువగా ఉంది. ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్వీ స్టాట్స్ ఇండియా–2025 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. – సాక్షి, న్యూఢిల్లీఏడాదిలో కోటి టన్నుల మాంసం దేశవ్యాప్తంగా 2023–24 సంవత్సరంలో అన్నిరకాల మాంసాలు కలిసి 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది. అందులో అత్యధికంగా చికెన్ ఉత్పత్తి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10.67 లక్షల టన్నులు, తెలంగాణలో 11.12 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 1.84 కోట్ల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా, 51.58 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2015–16లో ఏపీలో చేపల ఉత్పత్తి 23.52 లక్షల టన్నులు మాత్రమే. అదే సమయంలో తెలంగాణలో 4.56 లక్షల టన్నులు చేపలు ఉత్పత్తి అయ్యాయి. స్వల్పంగా పెరిగిన సాగుభూమి దేశంలో 2019–20 సంవత్సరంలో మొత్తం 21.13 కోట్ల హెక్టార్లలో పంటలు పండగా, 2022–23 నాటికి స్వల్పంగా పెరిగి 21.93 కోట్ల హెక్టార్లకు పెరిగాయి. దేశంలో 2022–23లో సాగుయోగ్యం కాని భూమి 4.43 కోట్ల హెక్టార్లు ఉంది. 1996–97లో దేశంలో 7.60 కోట్ల హెక్టార్ల స్థూల నీటిపారుదల ప్రాంతం ఉండగా... 2022–23 నాటికి 12.22 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో సాగుచేసిన మొత్తం భూమిలో 25,876 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం ఉండగా, 37,801 హెక్టార్లు కన్వర్టెడ్ ప్రాంతం ఉంది. తెలంగాణలో మొత్తం సాగు చేసిన భూమిలో కేవలం 5,399 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం, 79,465 హెక్టార్లు కన్వర్టెడ్ ప్రాంతం ఉందని సర్వేలో తేలింది. సర్వేలోని మరికొన్ని అంశాలు.. » 1950–51లో దేశంలో 10.11 కోట్ల హెక్టార్లలో ఆహార పంటలు సాగు చేయగా... 2023–24 నాటికి 13.21 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 10.43 కోట్ల హెక్టార్లలో తృణధాన్యాలు, చిరుధాన్యాల సా గు ఉంది. ఆ తర్వాత స్థానంలో 4.78 కోట్ల హెక్టార్లలో వరి సాగైంది. 137.8 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. » దేశ భూభాగంలో 21.76% విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉన్నా యి. 2015లో 7,64,566 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండగా.. 2023 నాటికి 7,75,377 చ.కి.మీలకు పెరిగింది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 94,689 చ.కి.మీ. అటవీ ప్రాంతం ఉంది. » 2015 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్లో 37,258 చ.కి.మీ.మేర మొత్తం అటవీ ప్రాంతం ఉండగా.. దట్టమైన అడవుల విస్తీర్ణం 26,006 చ.కి.మీ. నుంచి 30,084 చ.కి.మీ.లకు పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో మొత్తం అటవీ ప్రాంతం 26,904 చ.కి.మీ. నుంచి 27,688 చ.కి.మీ.కు అటవీ ప్రాంతం పెరిగింది. దట్టమైన అటవీ విస్తీర్ణం 19,854 చ.కి.మీ. నుంచి 21,179 చ.కి.మీ.లకు విస్తరించింది. » దేశవ్యాప్తంగా హైడ్రో, థర్మల్, న్యూక్లియర్, పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా 1947లో 4,073 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి 17,34,375 గిగావాట్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 13,26,549 గిగావాట్లు థర్మల్ విద్యుత్ ఉంది. -
‘రాహుల్ జీ.. నేనూ మీలాగే పెళ్లి చేసుకోను’
పాట్నా: రాహుల్జీ రాజకీయాల్లో మీరే మాకు స్పూర్తి. నేను మీలాగే వివాహం చేసుకోకూడదనుకుంటున్నా. సమాజసేవ చేస్తా’ అంటూ ఓ యువతి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ల మధ్య జరిగిన సంభాషణ వైరల్గా మారిందిఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం బీహార్ రాష్ట్రం గయాలో పర్యటించారు. పర్యటనలో మహిళలు సైతం రాజకీయాల్లో ప్రవేశించేలా కాంగ్రెస్ మహిళా సంవాద్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. మహిళలతో రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీహార్లో పాడ్ గర్ల్గా సుపరిచితురాలైన ‘రియా పాశ్వాన్’ రాహుల్తో మాట్లాడారు. ప్రత్యేకంగా మహిళలు విద్యా రంగం తరహాలో ఇతర రంగాల్లోకి ప్రవేశించడం లేదు. మహిళల రక్షణ కోసం కాంగ్రెస్ చేపట్టిన శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేం బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్య పరిష్కారం కోసం మా వద్దకు వచ్చేలా తీర్చిదిద్దాం అని తెలిపారు. आज गया में Shakti Samvad कार्यक्रम के मंच से मैंने अपनी आवाज़ उठाई – महिलाओं के मुद्दे, मोहल्ले की समस्याएं, और जनता की सच्चाई को Rahul Gandhi ji के सामने रखा।मैं Riya Paswan हूं, और मैं हर ग़लत के खिलाफ खड़ी हूं। pic.twitter.com/7ymZftN8W0— Riya Kumari (@kumarir6529) June 7, 2025 అయితే, ఆమె ప్రసంగం ఆకట్టుకోవడంపై రాహుల్ స్పందించారు. మీ ప్రసంగం బాగుంది అంటూ రియా పాశ్వాన్పై ప్రశంసలు కురిపించారు. అందుకు రియా పాశ్వాన్ స్పందించింది. మీలా నేనూ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. ప్రజా సేవ చేయాలని చెప్పడంతో సభలో నవ్వులు కురిశాయి. నాయకురాలిగా మారాలని, ప్రజల కోసం పని చేయాలని ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఉంది. శక్తి అభియాన్లో భాగమయ్యాక రాజకీయాలు అంటే ఏమిటో నాకు అర్థమైంది’ అని వ్యాఖ్యానించారు.పాడ్ గర్ల్ రియా పాశ్వాన్ దీంతో ఆ బీహార్ పాడ్ గర్ల్ రియా పాశ్వాన్ ఎవరనేది చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే? ఈ పాడ్ గర్ల్ 2022లో ఓ సెన్సేషన్. 2022లో బీహార్ (Bihar) రాజధాని పాట్నాలో విద్యార్ధిని రియా పాశ్వాన్ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాల మధ్య జరిగిన సంభాషణ నాడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రియా పాశ్వాన్ వర్సెస్ కలెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రాబీహార్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఆ సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని రియా పాశ్వాన్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30?IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too.🔊Girl - Govt comes to us for votes.IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc— Samarg (@aaummh) September 28, 2022నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు.ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. -
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
ఛత్తీస్గఢ్: బీజాపూర్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెలుగు నేతలే టార్గెట్గా ఆపరేషన్ కొనసాగుతుంది. మూడో రోజు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటన స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మూడు రోజులుగా మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రత బలగాల హిట్ లిస్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు బండి ప్రకాష్, దామోదర్, మల్లోజుల వేణుగోపాల్, రామన్న, వాసుదేవరావు ఉన్నారు. మరోవైపు మావో కీలక నేతలు బండి ప్రకాష్ , దిలీప్లకు ప్రాణహాని ఉందని పౌర హక్కుల సంఘాల నేతలు అంటున్నారు.ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే ప్రమాదం ఉందని పౌర హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు నంబాల కేశవరావు, సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయారు.ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెర్చింగ్ జరుగుతుంది. పాము కాటు, తేనెటీగల దాడిలో కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్తో మరి కొందరు జవాన్లకు అస్వస్థతకు గురయ్యారు. బలగాల ఆపరేషన్ ముగిసిన తర్వాత సమగ్ర సమాచారం తెలియ చేస్తామని బీజాపూర్ ఎస్పీ పేర్కొన్నారు. -
కారుపై పడ్డ హెలికాఫ్టర్.. ఉత్తరాఖండ్లో తప్పిన పెను ప్రమాదం
ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం తప్పింది. అత్యవసరంగా రోడ్డుపై హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం కారుపై పడింది. హెలికాఫ్టర్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్, కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం సాంకేతిక లోపం కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త్ కాశిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని.. అదృష్టవశాత్తూ, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఏడీజీ వి.మురుగేషన్ తెలిపారు.క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడిపే హెలికాప్టర్ సిర్సి నుండి కేదార్నాథ్ వైపు ప్రయాణీకులతో వెళ్తుండగా.. సాంకేతిక సమస్య ఏర్పడటంతో ముందుగానే అప్రమత్తమైన పైలట్.. హెలిప్యాడ్కు చేరుకోకుండా.. సమీపంలోని రహదారిపై ల్యాండ్ చేశారు.#WATCH | Uttarakhand | A private helicopter en route to Kedarnath Dham made an emergency landing in Guptkashi of Rudraprayag district due to a technical fault. All the people on board the helicopter are safe: Uttarakhand ADG Law and Order Dr V MurugeshanCEO of UCADA has… pic.twitter.com/Zj1SLluZ7N— ANI (@ANI) June 7, 2025ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్నాథ్కు షటిల్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతంలోని ఇతర హెలికాప్టర్ సేవలకు ఎటువంటి అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు.