breaking news
National
-
‘ఇంటర్నేషనల్’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!
రాయ్పూర్: మనోడు చదివేది చత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు. బిలాస్పూర్కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
డెయిరీ ఫామ్లో ‘అలియా భట్’ను కలుసుకున్న ప్రియాంక
తిరువంబడి: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒక ఆసక్తికర ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేరళలోని తిరువంబడిలో గల ఒక డెయిరీ ఫామ్కు వెళ్లినప్పటి సందర్భాన్ని ఆమె షేర్ చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్లో ఆమె.. తాను డెయిరీ ఫామ్లో ‘అలియా భట్’ను కలుసుకున్నానని తెలిపారు. అయితే ఇక్కడ ఆలియా భట్ అంటే బాలీవుడ్ స్టార్ కాదు.. అదే పేరు కలిగిన అందమైన ఆవు. Met a group of dairy farmers at a dairy farm run by the loveliest family (and even encountered a cow named Alia Bhatt!!, due apologies to Ms.Bhatt @aliaa08, but she was really a cutie pie!).Unfortunately dairy farmers are struggling with multiple difficulties and many are… pic.twitter.com/p36oeAZTbF— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 7, 2025‘డెయిరీ ఫామ్లో పాడి రైతుల బృందాన్ని కలుసుకున్నాను. అక్కడే అలియా భట్ అనే ఆవును కూడా కలుసుకున్నాను. అయితే అలియా భట్కు క్షమాపణలు’ అని ప్రియాంక ఆ పోస్టులో రాశారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రియాంకా గాంధీ దృష్టి సారించారు. పెరుగుతున్న పశువైద్య ఖర్చులు, తగినంత బీమా కవరేజ్ లేకపోవడం, నాణ్యమైన పశువుల దాణా అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని ఆమె పేర్కొన్నారు. -
Bihar Elections: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ?
పట్నా: బీహార్లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
నేను జోహో ఈ-మెయిల్కు స్విచ్ అయ్యా: అమిత్ షా
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా కోసం పదే పదే పిలుపునిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ-మెయిల్ అడ్రస్ మారింది. ఇక నుంచి అమిత్ షా ఈ-మెయిల్ ఐడి ‘జోహో మెయిల్’. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్’ ఖాతాలో స్సష్టం చేశారు. తాను జోహో మెయిల్కు స్విచ్ అయినట్లు విషయాన్నిఅమిత్ షా పేర్కొన్నారు. ఇక నుంచి తన మెయిల్ ఐడీ amitshah.bjp @ http://zohomail.in అని ఆయన తెలిపారు.Hello everyone,I have switched to Zoho Mail. Kindly note the change in my email address.My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.Thank you for your kind attention to this matter.— Amit Shah (@AmitShah) October 8, 2025 Zoho Mail అనేది జోహో కార్సోరేషన్ అందించే ఒక ప్రొఫెషనల్ ఇమెయిల్ సేవ. ఇది వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది, ముఖ్యంగా అధిక భద్రత, ప్రైవసీ, మరియు వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. జోహో కార్సోరేషన్ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ, ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉంది. -
సీనియర్ల వేధింపుల వల్లే.. ఆత్మహత్య: ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ నోట్
గుర్గావ్: సీనియర్ అధికారుల వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న హర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో బహిర్గతమైంది. ఈ మేరకు పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశారు. నిన్న(మంగళవారం, అక్టోబర్ 7) పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడగా, తాజాగా సదరు అధికారి రాసిన సుదీర్ఘ సూసైడ్ నోట్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.పూరన్ కుమార్ సన్నిహితుడైన సుశీల్ కుమార్ అనే వ్యక్తి సదరు ఆఫీసర్ పేరు మీద లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదురై రోహతక్ పోలీసులు.. సోమవారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలువురు పైస్థాయి అధికారులు మానసిక వేధింపుల కారణంగానే పూరన్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. పూరన్ కుమార్ సకుమార్ సహాయకుడు డ తన పేరు మీద రూ. 2.5 లక్షలు లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రోహ్తక్ పోలీసులు సోమవారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు.అయితే ఈ క్రమంలోనే సుశీల్ను అరెస్ట్ చేయగా, పూరన్ కుమార్ పేరు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆపీసర్ పూరన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఇది సీనియర్ అధికారుల తనను వేధింపులకు గురి చేయడంలో భాగంగానే జరిగిందని, తన ప్రొఫెషనల్ కెరీర్ను నాశనం చేయడానికి ఇలా చేశారని సూసైడ్ నోట్ రాసిన పూరన్ కుమార్ ఆపై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు పేర్లు రాసి పెట్టాడు పూరన్ కుమార్.కాగా, హర్యానా కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్కు పయనమయ్యారు. ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఇది ఉగ్రవాదుల పనేనా? -
Kashmir: ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఉగ్రవాదులు అపహరించారా?
కోకెర్నాగ్: దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కోకెర్నాగ్-గాడోల్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. పారా కమాండోస్ యూనిట్కు చెందిన ఈ సైనికులు సోమవారం (అక్టోబర్ 6) ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ బృందంలో సభ్యులని తెలిపారు.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి నిఘా సమాచారం అందిన దరిమిలా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది తమ యూనిట్తో సంబంధాలు కోల్పోయారని, అప్పటి నుండి వారి జాడ కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో అదృశ్యమైన సైనికులను వెదికేందుకు సైన్యంతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.దోడా- కిష్త్వార్ జిల్లాల సరిహద్దుల్లోనిపిర్ పంజాల్ పర్వత శ్రేణి వెంబడి ఉన్న ప్రాంతంలో ఈ ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. ఈ ప్రాంతం దట్టమైన అడవితో కూడి ఉంటుంది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో కురుస్తున్న మంచు, భారీ వర్షాలు సెర్చ్ అపరేషన్కు సవాలుగా మారాయి. తప్పిపోయిన సిబ్బందిని ఉగ్రవాదులు అపహరించారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. -
‘అమెరికా’ ఒత్తిళ్లకు తలొగ్గామని మీరే అన్నారు కదా? ప్రధాని మోదీ ధ్వజం
నవీ ముంబై: 2008 ముంబైలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని విరమించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్పై యుద్ధాన్ని విరమించుకున్నది మీరు కాదా? అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి బుదవారం(అక్టోబర్ 8) హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తేకుండానే కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. ‘ 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగితే కాంగ్రెస్ ఏం చేసింది?. వారి బలహీనతను నిరూపించుకుంది. టెర్రరిజం ముందు మోకరిల్లింది’ ఇదే విషయాన్ని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే చెప్పారు’ అంటూ విమర్శలు గుప్పించారు, ‘26/11 అనేది దేశంపై జరిగిన అత్యంత జుగుప్సాకరమైన ఉగ్రదాడి. ఈ దాడి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని చెప్పారు. మన దేశానికి మరొక దేశం యుద్ధం వద్దని హితబోధ చేయడంతో పాక్తో యుద్ధానికి బలగాల్ని పంపలేదంట. ఇది కదా వేరే దేశ ఒత్తిడికి లొంగడమంటే?’ అని మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో చిదంబరం మాట్లాడుతూ.. 2008లో అంతటి ఉగ్రదాడి జరిగిన దానికి కారణమైన పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కారణంగానే దేశంలో అంతటి విధ్వంసాన్ని ఉగ్రవాదులు సృష్టించినా పాక్పై యుద్ధాన్ని వద్దనుకున్నామన్నారు ఓ కాంగ్రెస్ నేత. ఇది ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలను సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ ఎండగడుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించదనేది చిదంబరం వ్యాఖ్యలతో నిరూపితమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మూడు నెలల క్రితం చిదంబరం వ్యాఖ్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ వైఖరిపై ధ్వజమెత్తారు. ఇదీ చదవండి:నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే.. -
Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్గీర్లో ఉంటున్న దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్(28) కాలిన గాయాలతో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే.. మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె తలుపులు తెరిచింది. దినేష్ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ నూతన ఎయిర్పోర్టును పరిశీలించారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ భారీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్లో దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. సీఎస్ఎంఐఏలో ఏర్పడే రద్దీని తగ్గిస్తుంది.ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల్లో ముంబైకి ప్రత్యేక స్థానం దక్కింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానయాన సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏడాదికి తొమ్మిది కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభ దశలో ఏడాదికి రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది.నవీ ముంబైలోని కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతపు సామర్థ్య పరిమితులను అధిగమిస్తుందని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ)పేర్కొంది. కాగా విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) గత సెప్టెంబర్ 30న విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ను మంజూరు చేసింది. టెర్మినల్లో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి.ఈ విమానాశ్రయ కార్యకలాపాలు సాంకేతికంగా అధునాతనంగా ఉంటాయి. 5జీ నెట్వర్క్లు, పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్లు, మెరుగైన సౌలభ్యం కోసం డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్గో సౌకర్యం పూర్తి ఆటోమేషన్తో పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్మెంట్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీలు, మందులు , పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక నియంత్రిత విభాగాలు అందుబాటులో ఉంటాయి. -
Coldrif syrup: ఆ విషయంపై క్లారిటీ ఇవ్వండి: డబ్ల్యూహెచ్వో
మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తాజాగా, మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్పూర్లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. -
Bihar Election: బెదిరింపులకు దిగిన మాజీ సీఎం.. 15 సీట్ల కోసం మంకుపట్టు
పట్నా: బీహార్ ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏలో అసంతృప్తి మొదలయ్యింది. మిత్రపక్షం హిందూస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) నేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే, అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరింపులకు దిగారు. అయితే తాము ఎన్డీఏ శిబిరంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ అంశంలో జోక్యం చేసుకుని మాంఝీని, శాంతింపజేసే ప్రయత్నం చేశారని సమాచారం.‘ప్రాధాన్యత కలిగిన పార్టీగా గుర్తింపు పొందేందుకు మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు అవసరం. ప్రతిపాదిత సంఖ్యలో సీట్లు మాకు లభించకపోతే, మేము ఎన్నికల్లో పోటీ చేయబోము. అయితే మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాం. కానీ ఎన్నికల్లో పోటీకి దిగం. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను’ అని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.ఇంకా తేలని సీట్ల భాగస్వామ్య సూత్రంనవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇంకా తమ సీట్ల భాగస్వామ్య సూత్రాన్ని ప్రకటించలేదు. అయితే మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం జేడీయూ, బీజేపీలు దాదాపు 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జేపీ(రామ్ విలాస్) 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. కాగా ఈ తరహా సీట్ల కేటాయింపుపై మాంఝీతో పాటు, చిరాగ్ పాశ్వాన్ కూడా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వారిద్దరూ కనీసం 40 సీట్ల కోసం ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే..దేశంలోని అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలుఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్లలో 100 శాతం వెబ్కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.ప్రతి రెండు గంటలకు కౌంటింగ్ అప్డేట్పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్ను అప్డేట్ చేస్తారు. -
బీహార్ ఎలక్షన్స్: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. బీహార్లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు. ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు! -
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ కూలి నలుగురి మృతి
సక్తి: ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి నలుగురు కూలీలు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. దబ్రా ప్రాంతం పరిధిలోని ఉచ్చపిండా గ్రామంలో ఆర్కేఎం పవన్జెన్ ప్లాంట్లో ఈ ఘటన జరిగిది.10 మంది కార్మికులు తమ షిఫ్ట్ ముగించుకుని లిఫ్ట్లో దిగుతున్న సమయంలో లిప్ట్ అకస్మాత్తుగా కింద పడిపోయిందని ఎస్పీ అంకితా శర్మ వెల్లడించారు. గాయపడినవారిని రాయ్గఢ్లోని జిందాల్ ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారని తెలిపారు. ఆరుగురికి వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
Bihar Election: ఎన్డీయేకు కొత్త తలనొప్పి?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి(Bihar Assembly Election 2025). అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ అవగాహన కుదిరింది. చెరో 100–102 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే.. 243 స్థానాల్లో 204–205 సీట్లలో ఈ రెండు పార్టీలే పోటీ చేయనుండగా.. మిగతా సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి(NDA Bihar Seat Sharing). బిహార్ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్ తావ్డేలు బుధవారం లోక్జనశక్తి పార్టీ(LJP రామ్ విలాస్) నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(chirag paswan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు.. లోక్జనశక్తి పార్టీ(LJP)కి 25 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే.. చిరాగ్ ఆ ఆఫర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్జేపీకి 40 స్థానాలు డిమాండ్ చేస్తూ.. ఆయన అంతకు మించి ఒక్క సీటు తగ్గినా ఊరుకునేది లేదని చెప్పినట్లు సమాచారం. తాము కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన ఎన్డీయే పెద్దలకు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విజయంతో.. తన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందనే భావనలో చిరాగ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పైగా బీహార్లో గౌరవప్రదమైన సీట్లు.. కేంద్ర కేబినెట్ పదవికి మించినవని భావిస్తున్నారు. ఈ తరుణంలో.. ఎన్డీఏలో ప్రాధాన్యం లేని తరుణంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీతో పొత్తు కోసం చిరాగ్ ప్రయత్నిస్తున్నారన్న కథనాలు.. బీహార్లో రాజకీయ కలకలం సృష్టించాయి. అయితే.. చిరాగ్ పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌద్రి మాత్రం పరోక్షంగా ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎన్డీయే కూటమి తిరిగి బీహార్లో అధికారంలో చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో బ్లాక్మెయిల్ ద్వారా సీట్లు సాధించుకోవాలని చిరాగ్ చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. చిరాగ్ నేతృత్వంలోని LJP (RV)కి బీహార్లో దళిత ఓటు బ్యాంక్ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు 2020 ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన చిరాగ్ ఎల్జేపీ.. జేడీయూకి నష్టం కలిగించింది. అంటే.. చిరాగ్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఎన్డీయేపై ప్రభావం చూపెడుతుందన్నమాట. దీంతో బీజేపీ ఈ విషయాన్నింటిని పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయనతో చర్చలు జరుపుతోంది. మిగతా పార్టీలోని జితన్ రామ్ మాంజీ హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 7, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)కి 6 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే ఆ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్ సీట్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై మరో మూడు, నాలుగు రోజుల పాటు వరుసగా చర్చలు కొనసాగనున్నాయి. మిత్రపక్షాలకు సీట్లు తగ్గితే రాజ్యసభ, శాసనమండలి సీట్ల ఆఫర్లతో వాటిని భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నా.. అందుకు వాటిని ఒప్పించడం బీజేపీపై కత్తి మీద సాములాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇదీ చదవండి: ప్చ్.. నితీశ్కు మెట్రో కలిసొచ్చేనా? -
హైవేపై ట్రక్కులు ఢీ.. సిలిండర్లు పేలుళ్ల ధాటికి మంటలు..
జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో హైవేపై భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జైపూర్-అజ్మేర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఎల్పీజీ సిలిండర్లను తీసుకువెళ్తున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కారణంగా సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు ఎగిసిపడుతుండంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.Huge Fire on Jaipur-Ajmer Highway! 🚨Gas tanker overturns near Sawarada Puliya, Dudu, causing a massive blaze. 😱 Praying for safety & recovery. 🙏 Stay safe, everyone! 💪 #JaipurAjmerHighway #Emergency🔥 RT to spread the word! 🔔 pic.twitter.com/y9cnSEqvjG— Pramod Kumar Saxena (@PramodKuma79446) October 7, 2025మరోవైపు.. ఈ ప్రమాద ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వాను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. VIDEO | A truck carrying LPG cylinders caught fire following a collision with a tanker on the Jaipur-Ajmer highway on Tuesday night. Deputy CM Premchand Bairwa (@DrPremBairwa) said, "A truck hit a stationary vehicle. The situation is under control now. One casualty has been… pic.twitter.com/nHzKbyK7OM— Press Trust of India (@PTI_News) October 8, 2025 Big Breaking 🚨🚨 on the Jaipur-Ajmer highway a massive fire broke out near the Sawarda culvert in the Mauzamabad area, after a vehicle allegedly hit a truck loaded with gas cylinders.Watch video 📷 pic.twitter.com/7P35AI3B2j— Globally Pop (@GloballyPop) October 7, 2025 -
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
బాబోయే ఇదేం ట్రాఫిక్!
బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం సహజమే. కానీ, జాతీయ రహదారిల్లో.. అదీ నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?(Massive Traffic Jam). ఇదేదో సమ్మెలో భాగం జరిగిందనుకుంటే మీరు పొరపడినట్లే!!. బీహార్లోని ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఢిల్లీ-కోల్కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) గత నాలుగు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బంపర్-టు-బంపర్గా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం గత శుక్రవారం రోహ్తాస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు. భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లు నీటితో మునిగిపోయాయి. అధికార యంత్రాగం సమన్వయం లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. స్థానిక పరిపాలన, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI), రహదారి నిర్మాణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అక్కడ ఆగిపోయిన డ్రైవర్లు చెబుతున్నారు. ‘‘30 గంటల్లో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగాం. టోల్, రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాం కదా. అయినా ఎవరూ సహాయం చేయరా?’’అని ప్రవీణ్ సింగ్ అనే ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో డ్రైవర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “రెండు రోజులుగా ట్రాఫిక్లోనే ఉన్నాం. ఆకలితో, దాహంతో బాధపడుతున్నాం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల సమయం పడుతోంది” వాపోయాడు.ఇదిలా ఉంటే.. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకెళ్తున్న డ్రైవర్లు అవి పాడైపోతాయని చెబుతున్నారు. ఇంకోవైపు.. అంబులెన్సులు, అత్యవసర సేవలు, పర్యాటక వాహనాలు ఈ ట్రాఫిక్తో ప్రభావితం అయ్యాయి. NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ రంజిత్ వర్మ ఈ ట్రాఫిక్ సమస్యపై స్పందించేందుకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రపంచంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా?(World Worst Traffic Jam Incident).. అధికారిక గణాంకాలేవీ లేకపోయినా.. 2010లో చైనా దేశంలోని బీజింగ్-టిబెట్ ఎక్స్ప్రెస్వే (National Highway 110) పై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా గుర్తించబడింది. మంగోలియా ప్రాంతం నుండి బీజింగ్కు బొగ్గు తీసుకెళ్తున్న వేలాది ట్రక్కులు రహదారిపై నిలిచిపోవడంతో.. బీజింగ్, హెబీ ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 26 వరకు 12 రోజుల పాటు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి.. ప్రజలు అవస్థలు పడ్డారు.ఇదీ చదవండి: సౌర తుపానుతో మనిషికి ముప్పేనా? -
నా భార్య నాగిని!
సీతాపూర్ (యూపీ): అక్టోబర్ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభి షేక్ ఆనంద్ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్ తహ సీల్లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్ కూడా కలెక్టర్ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్... స్... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు.పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు. -
దేశంలో తొలి డ్యూయల్ చాంబర్ పేస్మేకర్ ఇంప్లాంట్
న్యూఢిల్లీ: గుండె పనితీరును క్రమబద్ధం చేసేందుకు అమర్చే పేస్మేకర్ సర్జరీల్లో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త చరిత్ర లిఖించింది. దేశంలో తొలిసారి ఓ రోగికి ‘డ్యూయల్ చాంబర్ పేస్మేకర్’(డీసీఎల్పీ)ను విజయవంతంగా అమర్చినట్లు మంగళవారం ప్రకటించింది. సాధారణ పేస్మేకర్లు అమర్చేందుకు రోగికి ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పైగా దానికి వైర్లతో బయటి యంత్రానికి అనుసంధానం చేసి గుండె స్పందనలను క్రమబద్ధం చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ చాంబర్ లీడ్లెస్ పేస్మేకర్లతో ఆ అవసరం ఉండదు.ఇవి చిన్న క్యాప్సూల్ మాదిరిగా ఉంటాయి. వాటిని గుండె పై కర్ణికలో ఒకటి, కింది దమనికలో ఒకదానిని అమరుస్తారు. ఇందుకోసం పొట్టలోకి కృత్రిమంగా ఆహారాన్ని పంపే ఓ గొట్టంలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సతో పని ఉండదు. ఈ క్యాప్సూల్స్కు వైర్లు ఉండవు. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఈ పరికరాలు రెండు వాటంతట అవే సమాచార మారి్పడి చేసుకుంటాయి. గుండె సాధారణంకంటే వేగంగా కొట్టుకోవటం ప్రారంభించగానే ఇవి పనిచేయటం మొదలుపెట్టి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే గుండె వేగం సాధారణంకంటే తగ్గితే వెంటనే కృత్రిమంగా వేగాన్ని పెంచుతాయి. 83 ఏళ్ల వ్యక్తికి...మ్యాక్స్ హాస్పిటల్లో 83 ఏళ్ల ఓ రోగికి వీటిని అమర్చారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ బల్బీర్సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ అరుదైన చికిత్స నిర్వహించింది. ఆ రోగికి గుండెలో కర్ణిక, దమనికల మధ్య సమన్వయం లోపించటంతో గుండె వేగం సాధారణంకంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు కారణాల రీత్యా సాధారణ పేస్మేకర్ చికిత్స సరికాదని గుర్తించి డ్యూయల్ చాంబర్ పేస్మేకర్ అమర్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించాయి. -
నేడు ఢిల్లీకి యూకే ప్రధాని స్టార్మర్
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మొదటిసారిగా బుధవారం భారత్ పర్యటనకు రానున్నారు. మంగళవారం రాత్రి ఆయన తన ప్రతినిధి బృందంతో కలిసి హీత్రూ ఎయిర్పోర్టులో విమానమెక్కారు. ప్రధాని మోదీ ఆహ్వనం మేరకు భారత్ వస్తున్న స్టార్మర్ రెండు రోజులపాటు పర్యటిస్తారు. భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది.ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఇద్దరు నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు. రెండు దేశాల మధ్య జూలైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది.దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. -
హిమాచల్లో ఘోర ప్రమాదం
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. బిలాస్పూర్ జిల్లా ఝన్దత్త నియోజకవర్గంలోని భలుఘాట్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుపై సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపెద్ద కొండరాళ్లు, బురద మట్టి కింద బస్సు మొత్తం కూరుకుపోయి నుజ్జయ్యింది. మరోతన్–కలౌల్ మధ్య తిరిగే ఈ బస్సులో ప్రమాదం సమయంలో 30–35 మంది ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు ప్రయాణికులను కాపాడినట్టు బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్కుమార్ తెలిపారు. శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీసినట్టు ఝన్దత్త ఎమ్మెల్యే జేఆర్ కత్వాల్ చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయచర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రి సమయం కావటంతో సెల్ఫోన్లు, టార్చిలైట్ల వెలుగులో సహాయక చర్యలు చేపట్టారు. ఒక జేసీబీతో శిథిలాలను తొలగిస్తుండగా, సహాయక సిబ్బంది మరోవైపు పారలతో మట్టిని తవ్వి బస్సులోనివారి కోసం వెదుకుతున్న వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు బిలాస్పూర్ ప్రమాదంపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుక్కు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్స్లో తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సకల వనరులు ఉపయోగించి సహాయక చర్యలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రయాణికుల మరణంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పన ఆర్థికసాయం ప్రకటించారు. సుఖ్విందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పూర్తి వివరాలను తమకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఎస్ఐఆర్ తర్వాత సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు ఇవ్వాలని కోరింది.ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విచారణకు హాజరయ్యారు. తొలగించిన పేర్లలో చాలావరకు కొత్తగా ఓటు నమోదుచేసుకున్నవారేనని తెలిపారు. వారిలో ఎవరి నుంచీ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయినప్పటికీ తొలగించినవారి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలక్టోరల్ ముసాయిదాతోపాటు తుదిజాబితాను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గందరగోళాన్ని తొలగించేందుకే.. తమ ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల జాబితాపై గందరగోళాన్ని తొలగించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ‘ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉండేందుకు మీరు (ఈసీ) మా నిర్ణయంతో ఏకీభవించాలి. మీరు ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల పేర్లు తొలగించారు. చనిపోయినవారు, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించటం సబబే. కానీ, మీరు ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలంటే కచి్చతంగా రూల్ 21ను పాటించాలి. ప్రజలకు కూడా ఒక విన్నపం. ఎవరి పేర్లయితే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందో.. వారు తమ వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో అందజేయండి’అని సూచించారు. -
ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓటమి ఎరుగని ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘నా తోటి భారతీయులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు స్థిర చిత్తంతో గట్టి ప్రయత్నం చేశాను. ఈ గొప్ప దేశ ప్రగతికి నా వంతు కృషి చేశాను’అని పేర్కొన్నారు.నిరాశ నుంచి గొప్ప స్థాయికి పయనం తాను 2014లో దేశ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశంలో అవినీతి, ప్రజల్లో నిరాశ, నిస్పృహ నెలకొని ఉన్నాయని.. తన 11 ఏళ్ల పదవీ కాలంలో దేశం ఆ పరిస్థితి నుంచి బయటపడి.. ఎంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల కోసం 2013లో నన్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొనే నాటికి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటిలతత్వం, విధాన వైఫల్యాలకు పర్యాయపదంగా ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంబంధాలు కలిగి ఉంది. కానీ, విజు్ఞలైన భారతీయులు మా కూటమికి, మా పారీ్టకి ఎన్నికల్లో అద్భుత మెజారిటీ ఇచ్చారు.గత 11 ఏళ్లలో మనమంతా కలిసి ఎంతో మార్పు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన మహిళా శక్తి, యువశక్తి, అన్నదాతలు ఎంతో స్వయంసమృద్ధి సాధించారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ అద్భుత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది’అని ప్రధాని పేర్కొన్నారు.సవాళ్లే నన్ను బలంగా మార్చాయి ప్రభుత్వాధినేతగా మొదట్లో తాను ఎదుర్కొన్న సవాళ్లే తనను శక్తిమంతంగా మార్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదట అధికారం చేపట్టేనాటికి భారీ భూకంపం, తీవ్రమైన తుఫాన్, వరుస కరువులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. బలమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకు, గుజరాత్ను పునరి్నరి్మంచేందుకు ఆ సవాళ్లు నన్ను శక్తిమంతుడిని చేశాయి. నాడు గుజరాత్ను ఇక బాగు చేయలేం అన్నారు. కానీ, అందరం కలిసికట్టుగా కష్టపడి సుపరిపాలనకు గుజరాత్ను పవర్హౌస్గా మార్చాం’అని చెప్పారు.తన తల్లి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసే సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు. నీ పని ఏమిటో నాకు సరిగా తెలియదు కానీ.. రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి.. నువ్వు ఎప్పుడూ పేదల బాగు కోసమే పనిచేయాలి. రెండు.. లంచం తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. -
ఏఐతో..గుత్తాధిపత్యం
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ) సాంకేతికత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. అదేసమయంలో పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. ఏఐ, దాని ప్రభావంపై మార్కెట్ అధ్యయనం నిర్వహించిన సీసీఐ, గత నెలలో ఇందుకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఏఐ మార్కెట్లో కొన్ని బడా టెక్నాలజీ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో గుత్తాధిపత్యానికి దారితీసి, ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తుందని ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్గారిథమ్ల ద్వారా రహస్య కుమ్మక్కు, ధరల వివక్ష, స్టార్టప్లకు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ 2020లో 93.24 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 186.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఏఐ మార్కెట్ పరిమాణం 2020లో 3.20 బిలియన్ డాలర్లుండగా 2024 నాటికి 6.05 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2031 నాటికి ఇది 31.94 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలు ఏఐ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.బడా కంపెనీలదే పెత్తనం సీసీఐ నివేదిక ప్రకారం, ఏఐ పర్యావరణ వ్యవస్థను (ఏఐ ఎకో సిస్టం) కొన్ని పొరలుగా (ఏఐ స్టాక్) విభజించారు. ఇందులో డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (క్లౌడ్ కంప్యూటింగ్, చిప్స్), డెవలప్మెంట్ (అల్గారిథమ్స్, ఫౌండేషన్ మోడల్స్) వంటి కీలకమైన ప్రాథమిక (అప్స్ట్రీమ్) పొరలు ఉన్నాయి. ఈ కీలకమైన రంగాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలదే పూర్తి ఆధిపత్యం. మనదేశంలోని దాదాపు 67% స్టార్టప్లు కేవలం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే (డౌన్స్ట్రీమ్) స్థాయిలోనే పనిచేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాల కోసం పూర్తిగా ఈ బడా సంస్థల క్లౌడ్ సేవలు, టెక్నాలజీలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మార్కెట్లో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మార్కెట్ను శాసించే అల్గారిథమ్స్ ఏఐ రాకతో మార్కెట్లో పోటీతత్వం స్వరూపమే మారిపోతోంది. ముఖ్యంగా, ధరలను నిర్ణయించే అల్గారిథమ్ల వాడకం పెరగడం పెను సవాలుగా మారింది. సీసీఐ నివేదిక ప్రకారం, అల్గారిథమ్ల ద్వారా కంపెనీలు రహస్యంగా కుమ్మక్కయ్యే (అల్గారిథమ్ కొల్యూషన్) ప్రమాదం పొంచి ఉంది. మనుషుల ప్రమేయం లేకుండానే, అల్గారిథమ్లు ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటూ ధరలను కృత్రిమంగా పెంచే అవకాశం ఉంది. ఈ నివేదిక కోసం సర్వే చేసిన స్టార్టప్లలో 37% మంది అల్గారిథమిక్ కుమ్మక్కుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ‘టాప్కిన్స్’కేసు, యూకేలో ‘ట్రాడ్/జీబీ ఐ’కేసు వంటివి ఇందుకు నిదర్శనాలని నివేదిక ఉదహరించింది. అంతేకాకుండా, వినియోగదారుడి కొనుగోలు శక్తి, ప్రవర్తనను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో ధరను చూపే ‘ధరల వివక్ష’కూడా పెరిగిపోతోందని, దీనిపై 32% స్టార్టప్లు ఆందోళన చెందాయని సర్వేలో తేలింది.ప్రవేశానికి అడ్డంకులు.. స్టార్టప్లకు సవాళ్లుఏఐ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే స్టార్టప్లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని సీసీఐ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్లు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్లో 68% మంది డేటా లభ్యత అతిపెద్ద అడ్డంకిగా పేర్కొన్నారు. అత్యుత్తమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీ మొత్తంలో నాణ్యమైన డేటా అవసరం, కానీ అది బడా సంస్థల వద్దే పోగుపడి ఉంది. 61% మంది క్లౌడ్ సేవలు అత్యంత ఖరీదైనవిగా మారాయని తెలపడం ఇందుకు ఉదాహరణ. 61% మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు. 66% మంది నిపుణులు సులభంగా అందుబాటులో లేరని అభిప్రాయపడ్డారు. 59% మంది కంప్యూటింగ్ సౌకర్యాల ఖర్చు అడ్డంకిగా భావించారు. 56% మంది స్టార్టప్లు నిధులు సమీకరించడం పెద్ద సవాలుగా ఉందని తెలిపారు. సర్వే ప్రకారం, 83% స్టార్టప్లు సొంత నిధులతోనే నడుస్తున్నాయి. తదుపరి దశ నిధులు పొందడం చాలా కష్టంగా ఉందని 50% మంది పేర్కొన్నారు. ఈ అడ్డంకుల వల్ల ఆవిష్కరణలు తగ్గి, మార్కెట్లో పోటీతత్వం నీరుగారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు సీసీఐ తన నివేదికలో పలు కీలక సూచనలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. అందులోని అంశాలివీ... స్వీయ–తనిఖీ : ఏఐ వ్యవస్థలను వినియోగించే సంస్థలు, తమ అల్గారిథమ్లు పోటీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయకుండా చూసేందుకు స్వీయ–తనిఖీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ఒక మార్గదర్శక పత్రాన్ని సీసీఐ జతచేసింది. పారదర్శకత: ఏఐ ఆధారిత నిర్ణయాల విషయంలో కంపెనీలు పారదర్శకతను పాటించాలి. ఏఐని ఏ ఉద్దేశంతోవాడుతున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఏఐ, పోటీ చట్టాలపై వాటాదారులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, వర్క్షాపులు నిర్వహిస్తుంది. అడ్డంకుల తొలగింపు: స్టార్టప్లకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం: ఏఐకి సంబంధించిన అంశాలు బహుళ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తున్నందున, వాటి మధ్య సమన్వయం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీసీఐ భావిస్తోంది. అంతర్జాతీయ సహకారం: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకాంపిటీషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ద్వారాఅంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తమ్మీద ఏఐ సాంకేతికతను ప్రోత్సహిస్తూనే, మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణులను అరికట్టి, చిన్న సంస్థలు, స్టార్టప్లు కూడా రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించేలా పటిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరముందని సీసీఐ స్పష్టం చేసింది. -
డాల్ఫిన్ పేరెంటింగ్..పిల్లల పెంపకంలో'కింగ్'!
తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు...తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు..ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోప్పడటానికే భయపడిపోయే తల్లిదండ్రులు ఇంకొందరు.తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు.. పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకునేవాళ్లు..పిల్లలు చదువులో రాణించాలని వారిపై తమ ఇష్టాయిష్టాలు రుద్దేవారు..ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్టుగానే అనిపిస్తుంది. మరి, వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్? ఏది బెస్ట్ పేరెంటింగ్?ఈ రోజుల్లో పేరెంటింగ్.. అత్యంత కష్టమైన పని. కృత్రిమ మేధనైనా సృష్టించవచ్చు, నియంత్రించవచ్చుగానీ పిల్లల పెంపకం మాత్రం సులభంగా చేయలేం.– ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెబుతున్న మాటలివి. నిజమే. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు. ఇన్ని ప్రభావాలూ లేవు.తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా ఒకప్పటిలా లేదు. రకరకాల తల్లిదండ్రులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు. మూడు ప్రధానమైన పేరెంటింగ్ విధానాల్లో ‘డాల్ఫిన్ పేరెంటింగ్’ మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.హెలికాప్టర్ పేరెంటింగ్..: చెప్పాలంటే బొమ్మరిల్లులోని ప్రకాష్ రాజ్ లాంటి తండ్రి లేదా తల్లి. తమ పిల్లలు కాలు కింద పెట్టకుండా.. ఎండ కన్నెరుగకుండా.. వారికి ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకునేవారు. వారి గురించి అతిగా ఆలోచిస్తూ.. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ.. వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవాళ్లు. ఈ విషయాన్ని తమ బంధుమిత్రులకు గొప్పగా చెప్పుకోడానికి కూడా ఇష్టపడతారు. పిల్లలపై ప్రభావం..: ఇలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు స్వతంత్రంగా ఆలోచించలేరు, నిర్ణయాలు తీసుకోలేరు, సమస్యలను పరిష్కరించలేరు, భావోద్వేగాల నియంత్రణ ఉండదు. ఇది పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వదు. ఇలాంటి తల్లిదండ్రులంటే పిల్లలకు భయం ఉండదు కానీ.. వారిని తప్పించుకు తిరగాలన్న మనస్తత్వం ఉంటుంది. టైగర్ పేరెంటింగ్వీళ్లు చండశాసనులు. చాలా స్ట్రిక్టుగా ఉంటారు. తమ పిల్లలు చదువులోనూ, సంగీతం వంటి ఇతర అంశాల్లోనూ కచ్చితంగా రాణించాలని, పేరు ప్రతిష్ఠలు (తమకూ వస్తాయన్న స్వార్థం కూడా అంతర్లీనంగా ఉంటుంది) సంపాదించాలని వారిపై ఒత్తిడి తెస్తుంటారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యాల పేరిట పిల్లలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పిల్లలను ఆధిపత్య ధోరణితో పెంచుతారు. వారిలో తమ పట్ల భయం ఉందన్న విషయాన్ని తమ చుట్టుపక్కల వారికి తెలియాలని అనుకుంటారు. పిల్లలపై ప్రభావంఇలాంటి పేరెంట్స్ అంటే పిల్లలు భయపడతారు.. వీలైనంతవరకు తప్పించుకు తిరగాలని చూస్తారు. పిల్లలపై నిత్యం ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ విఫలమవుతామోనన్న భయం వెంటాడుతుంటుంది. తమ తల్లిదండ్రులు ఉన్నంత వరకు క్రమశిక్షణతో ఉన్నట్టు కనపడే ఈ పిల్లలు.. వాళ్లు లేరని లేదా తమ గమనించడం లేదని తెలిస్తే మాత్రం కట్టుబాట్లన్నీ పక్కనపెట్టేస్తారు. డాల్ఫిన్ పేరెంటింగ్వీళ్లు పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. పిల్లలతో మరీ కఠినంగానూ ఉండరు, అలాగని పూర్తిగా వదిలేయరు. అన్ని విషయాల్లోనూ సమతూకం పాటిస్తారు. అతిగా షరతులు పెట్టరు. అలాగని క్రమశిక్షణకూ విలువిస్తారు. పిల్లలను స్వతంత్రంగా ఆలోచించనిస్తారు. వారికి మరీ కష్టంగా ఉన్నప్పుడు లేదా ఇక వారికి సాధ్యం కాదు అనుకున్నప్పుడు చేయూతనిస్తారు. వారితో ఆత్మవిశ్వాసం నింపుతారు. దీన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా మాటల్లో చెప్పాలంటే.. కొన్ని విషయాల్లో స్పష్టమైన నిబంధనలు పెడతారు. ఉదాహరణకు.. రాత్రిపూట పడుకునేముందు ఫోన్లు ఉండకూడదు. ఒక వయసు వచ్చే వరకూ సోషల్ మీడియాను ఎంకరేజ్ చేయరు. ప్రతిరోజూ స్క్రీన్ టైమ్ విషయంలో కచ్చితంగా ఉంటారు. అయితే ఈ విషయాలను ఆధిపత్య ధోరణితో కాకుండా.. వారికి అర్థమయ్యేలా చెప్తారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన కెనడాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ షిమి కాంగ్ దీనిపై ‘ద డాల్ఫిన్ పేరెంట్ ః ఎ గైడ్ టు రెయిజింగ్ హెల్తీ, హ్యాపీ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్స్’ పుస్తకం కూడా రచించారు.పిల్లలపై ప్రభావంపిల్లలకు తమ హద్దులేంటో తెలుస్తాయి. అందువల్ల అలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉన్నా దాన్ని శిక్షలా కాకుండా.. తమ మంచి కోసమే అని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటారు. వాళ్లంటే భయపడకుండా.. వారితో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.వివాద నేపథ్యం ఇదీ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 15 మంది మృతి
బిలాస్పూర్: హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.బల్లూ బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసినట్లు బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉందని అధికారులు పేర్కొన్నారు. బస్సు.. హర్యానాలోని రోహ్తక్ నుంచి బిలాస్పూర్ సమీపంలోని ఘుమార్విన్ వైపు వెళ్తుండగా, ఝండూత అసెంబ్లీ నియోజకవర్గంలోని భలుఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.#BreakingNews | Bus buried under debris after landslide in Himachal Pradesh's BilaspurSeveral passengers are feared trapped. Rescue operation underway.#HimachalPradesh #Bilaspur #BilaspurAccident pic.twitter.com/Xm5CMSIFfy— DD News (@DDNewslive) October 7, 2025 -
10 వేల కోట్ల వ్యాపారవేత్తకు.. ఆప్ ఎంపీ టికెట్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓ బిలియనీర్కు రాజ్యసభ సీటు ఇచ్చింది. పంజాబ్లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాజిందర్ గుప్తాను పార్లమెంట్ ఎగువ సభకు పంపించాలని నిర్ణయించింది. అక్టోబర్ 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటనలో ఆప్ వెల్లడించింది.ఎంపీ సంజీవ్ అరోరా(Sanjeev Arora) రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరోరా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎంపీ పదవిని వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం 2028, ఏప్రిల్ 9 వరకు ఉంది. ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభకు రాజిందర్ గుప్తా పోటీ చేస్తారని ముందు నుంచే స్థానిక మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్థిక విధానం, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష పదవితో పాటు కాళీ దేవి ఆలయ సలహా కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.రాజిందర్ గుప్తా ఎవరు?ట్రైడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడైన 66 ఏళ్ల రాజిందర్ గుప్తా (Rajinder Gupta) పంజాబ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ధనవంతుల్లో ఒకరు. 2025లో (ఫోర్బ్స్ జాబితా) ఆయన ఆస్తుల నికర విలువ $1.2 బిలియన్లు, అంటే దాదాపు ₹10,000 కోట్లు. బటిండాలో పత్తి వ్యాపారి నోహర్ చంద్ దంపతులకు గుప్తా జన్మించారు. సాధారణ జీవితం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ట్రైడెంట్ లిమిటెడ్ పేరుతో లూథియానాలో కంపెనీ పెట్టి వివిధ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. టెక్స్టైల్, పేపర్, కెమికల్ తయారీ రంగాల్లో ట్రైడెంట్ ప్రముఖ కంపెనీగా ఎదిగింది. ఆరోగ్య కారణాలతో ట్రైడెంట్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి 2022లో వైదొలిగారు. వాణిజ్యం, పరిశ్రమ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2007లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీతో పురస్కారం అందుకున్నారు.కాంగ్రెస్, అకాలీదళ్ హయాంలోనూ..రాజిందర్ గుప్తా అనేక ప్రభుత్వ విభాగాలలో కీలక పదవులలో పని చేయడం ద్వారా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2022లో ఆప్ అధికారంలోకి వచ్చాక.. పంజాబ్ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్-చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో కాళీ దేవి ఆలయ సలహా కమిటీ ఛైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. గతంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వ హయాల్లోనూ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్- చైర్మన్గా పనిచేశారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్లకు FICCI సలహా మండలి చైర్పర్సన్గా గతంలో వ్యవహరించారు. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల గవర్నర్ల బోర్డు ఛైర్మన్గా పనిచేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.ఎన్నిక లాంఛనమేపంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) మెజారిటీ సభ్యులు ఉండడంతో రాజిందర్ గుప్తా రాజ్యసభకు ఎన్నిక కావడం లాంఛనమే. 117 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 93 ఎమ్మెల్యేలు ఉన్నారు.24న పోలింగ్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 16. పోలింగ్ 24న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.చదవండి: ఫస్ట్ టైమ్ కొన్న లాటరీ టికెట్తోనే 25 కోట్ల జాక్పాట్! -
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు, భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. -
షాకింగ్ వీడియో.. మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి
జాజ్పూర్: ఒడిశాలోని జాబ్పూర్ జిల్లా కాంతియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఖరస్రోత నదిలో ఓ మొసలి.. మహిళను లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న సౌదామిని (57)ని ఒక ముసలి లాక్కెళ్లడంతో గ్రామంలో కలకలం రేగింది. మహిళను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారు. గల్లంతైన మహిళ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సోమవారం( అక్టోబర్ 6) సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె బట్టలు ఉతికేందుకు ఖరస్రోత నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట స్నానం చేస్తుండగా ఓ మొసలి ఆమెను ఒక్కసారిగా నదిలోకి లాక్కెళ్లింది. అయితే ఓ వంతెనపై వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్రామస్తులు ఆ మొసలిని వెంబడించి ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమెను కాపాడలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025 -
తుపాకీతో కాల్చుకుని.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య
గుర్గావ్: హర్యానా రాజధాని చండీగఢ్లో విషాదం జరిగింది. హర్యానా కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) సెక్టార్ 11లో ఉన్న తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పురాణ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీతో పాటు జపాన్ పర్యటనకు వెళ్లారు. భర్త మరణించిన విషయం తెలుసుకున్న ఆమె వెంటనే భారత్కు తిరుగు పయనమయ్యారు. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు ప్రారంభించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. -
రూ.24,634 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రూ.24,634 కోట్ల విలువైన నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్లోని 18 జిల్లాలను అనుసంధానం చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు ప్రస్తుత భారతీయ రైల్వే నెట్వర్క్ను సుమారు 894 కి.మీ. మేరకు విస్తరించనున్నాయి.నాలుగు ప్రాజెక్టులు ఇవే..వార్ధా - భూసావల్ - 3వ, 4వ లైన్ - 314 కి.మీ (మహారాష్ట్ర)గోండియా - డోంగర్గఢ్ - 4వ లైన్ - 84 కి.మీ (మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్)వడోదర - రత్లం - 3వ, 4వ లైన్ - 259 కి.మీ (గుజరాత్, మధ్యప్రదేశ్)ఇటార్సి - భోపాల్ - బినా 4వ లైన్ - 237 కి.మీ. (మధ్యప్రదేశ్)కేబినెట్ ఆమోదం పొందిన ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 3,633 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతుంది. ఇది దాదాపు 85.84 లక్షల జనాభాకు ప్రయోజనం కలిగించనుంది. పెరిగిన ఈ రైల్వే లైన్ సామర్థ్యం భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణను అందిస్తుంది. ఈ ప్రాజెక్టులు ప్రయాణికులు, వస్తు సేవలకు సమర్థవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి.ఈ నూతన ప్రాజెక్టు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కాలోని రాక్ షెల్టర్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ మొదలైన ప్రముఖ గమ్యస్థానాలకు రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఇది పర్యాటకులకు అనువైన రవాణా మార్గాన్ని అందించనుంది. బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యాలు, ఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టు ఉపకరించనుంది. రైల్వే లైన్ సామర్థ్యం పెంపుదల కారణంగా ఫలితంగా 78 ఎంటీపీఏ(సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరుకు రవాణా జరగనుంది. -
కరూర్ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్లో పర్యటిస్తానని తెలిపారు."నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. -
Bihar Election: ‘మెట్రో’ సెంటిమెంట్.. 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ప్రభావం..
పట్నా: బీహార్ ఎన్నికల్లో విజయానికి బీజేపీ ‘మెట్రో’ సెంటిమెంట్ను ప్రయోగిస్తోంది. గత 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు వివిధ పార్టీల ప్రభుత్వాలు ‘మెట్రో’ను ప్రారంభించాయి. ఈ మెట్రో సెంటిమెంట్ నాలుగు రాష్ట్రాల్లో విజయానికి దారి తీసింది. మొన్న అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు బీహార్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అయితే దీనికి ఐదు గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా మెట్రోకు పచ్చజెండా ఊపారు. ఎన్నికలకు ముందు మెట్రోలు..2013, రాజస్థాన్: ఎన్నికలకు మూడు నెలల ముందు జైపూర్ మెట్రో ట్రయల్ రన్. దీనిని నాటి కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఫలితం: 200 సీట్లు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 21 సీట్లకు పడిపోయింది. బీజేపీ 163 సీట్లతో మెజారిటీని సాధించింది. వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. మెట్రో ప్రారంభించిన జైపూర్ జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది.2017, ఉత్తరప్రదేశ్: 2016, అక్టోబర్ 4న నాటి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్పూర్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 1న లక్నో మెట్రోను ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ 47 మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 312 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాన్పూర్లోని 10 సీట్లలో ఎస్పీ రెండు, లక్నోలో ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.2022, ఉత్తరప్రదేశ్: కాన్పూర్ మెట్రో మొదటి దశ ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించారు. తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లలో 255 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాన్పూర్లోని 10 స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు.2023, మధ్యప్రదేశ్: ఎన్నికలకు 45 రోజుల ముందు భోపాల్ మెట్రో ట్రయల్ రన్ను నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ 230 సీట్లలో 163 గెలుచుకుంది. భోపాల్ జిల్లాలో 7 సీట్లలో 6 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో డాక్టర్ మోహన్ యాదవ్ సీఎంగా నియమితులయ్యారు.2024, మహారాష్ట్ర: ఎన్నికలకు కొన్ని నెలల ముందు పూణే, ముంబై మెట్రో ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ముంబై మెట్రోను ప్రారంభించారు. 2024, సెప్టెంబర్ 29న పూణే మెట్రోను ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల మహాయుతి (మహాయుతి) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఫలితం: నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, మహాయుతి 288 సీట్లలో 230 గెలుచుకుంది. ముంబైలోని 36 సీట్లలో 22, పూణేలోని 21 సీట్లలో 18 వారి సొంతమయ్యాయి. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్నాథ్ షిండే స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.2025, ఢిల్లీ: ఎన్నికలకు ఒక నెల ముందు ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఫలితం: నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు.మెట్రో ప్రారంభం.. ఎన్నికలపై ప్రభావంఆరు రాష్ట్రాల ఎన్నికల విశ్లేషణలో మెట్రో ప్రారంభం ఎన్నికలపై ప్రభావం చూపిందని వెల్లడయ్యింది. ఆరు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో మెట్రోను ప్రారంభించిన పార్టీ ప్రయోజనం పొందింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 42 శాతం మంది పట్టణ ప్రజలు. వారు పట్టణీకరణను అభివృద్ధిగా భావిస్తారు. అందుకే పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం కోసం మెట్రో కార్డును ఉపయోగిస్తున్నాయి. -
Delhi: భారీ ఎన్కౌంటర్: రూ. లక్ష రివార్డు గ్యాంగ్స్టర్ హతం
న్యూఢిల్లీ: పలు ఘోరమైన నేరాలకు పాల్పడుతూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నేపాలీ గ్యాంగ్స్టర్ ఎట్టకేలకు హతమయ్యాడు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు సోమవారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో జరిగిన ఎన్కౌంటర్లో భీమ్ మహాబహదూర్ జోరా (30) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.గత రాత్రి నెహ్రూ ప్లేస్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్లో జోరా తన అనుచరుడితో కలిసి ఉన్నాడన్న పక్కా సమాచారంతో గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసుల స్పెషల్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పోలీసులను గమనించిన జోరా, వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర శర్మ బుల్లెట్ప్రూఫ్ జాకెట్కు తగలడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.లొంగిపోవాలని పోలీసులు పదేపదే హెచ్చరించినా జోరా వినకుండా కాల్పులు కొనసాగించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ గందరగోళంలో జోరా అనుచరుడు చీకట్లో తప్పించుకున్నాడు.వైద్యుడి హత్య కేసులో ప్రధాన నిందితుడుజోరా అనేక హత్యలు, దోపిడీలు, దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2024 మే నెలలో ఢిల్లీలోని జంగ్పురాలో డాక్టర్ యోగేష్ చంద్ర పాల్ (63) హత్య కేసులో ఇతనే ప్రధాన సూత్రధారి. ఆ దోపిడీ యత్నంలో డాక్టర్ను దారుణంగా హత్య చేసి 17 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఇటీవల గురుగ్రామ్లో ఓ బీజేపీ నేత ఇంట్లో జరిగిన రూ. 20 లక్షల దొంగతనం కేసులో కూడా జోరా ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు.పనివాళ్ల రూపంలో దోపిడీలుజోరా నేపాల్ కేంద్రంగా ఓ పెద్ద అంతర్జాతీయ దొంగల ముఠాను నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా సభ్యులు నకిలీ ఆధార్ కార్డులతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లోని సంపన్నుల ఇళ్లలో పనివాళ్లుగా చేరతారు. యజమానుల నమ్మకం చూరగొన్న తర్వాత, వారికి మత్తుమందు ఇచ్చి లేదా బంధించి ఇళ్లలోని నగదు, బంగారం, విలువైన వస్తువులతో నేపాల్కు పారిపోవడం వీరి పద్ధతి. ఘటనా స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ పిస్టల్, బుల్లెట్లు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసుల మధ్య బలమైన సమన్వయం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఉన్నతాధికారులు తెలిపారు. -
Sabarimala gold theft: స్ట్రాంగ్ రూమ్ తనిఖీ.. అత్యవసర సమావేశం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం మాయమైన ఉదంతంలో దర్యాప్తు చేపట్టేందుకు అధికారులు మంగళవారం శబరిమల చేరుకున్నారు. దేవస్వం విజిలెన్స్ పర్యవేక్షణలో, ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరిచి తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు దేవస్వం బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.శబరిమల ఆలయంలో బంగారు పూత, ద్వారపాలక విగ్రహాల పీఠం అదృశ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేరళ మంత్రి వీఎన్ వాసవన్ స్పష్టం చేశారు. “శబరిమల అభివృద్ధిని నిర్ధారించడం, భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలోనే ప్రభుత్వం పాత్ర ఉంటుందన్నారు. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఈ వివాదంలో ఇరికించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని’ ఆయన ఆరోపించారు.గతంలో సువర్ణ దాత ఉన్నికృష్ణన్ పొట్టి.. కనిపించకుండా పోయిందని పేర్కొన్న ద్వారపాలక శిలాపీఠం అతని సోదరి ఇంట్లో దొరికిందని తెలుస్తోంది. దీంతో పొట్టి ఫిర్యాదు వెనుక కుట్ర ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ బంగారు వస్తువు 2019లో కనిపించకుండా పోయింది. ఇటీవలే దేవస్వం విజిలెన్స్ బృందం దానిని స్వాధీనం చేసుకుంది. అయితే ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించి, ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.ప్రతిపక్ష సభ్యులు గతంలో దాదాపు నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని తొలగించారని అసెంబ్లీలో ఆరోపించారు. కాగా 1998లో విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ప్రజా పనుల శాఖ అధికారులు తూకం వేసి, డాక్యుమెంట్ చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. కోర్టు ఆదేశం మేరకు దేవస్వం అధికారులు ఆ పనిని చేపట్టారు. ఈ నేపధ్యంలో 1998 నుండి జరిగిన అన్ని కార్యకలాపాలను దర్యాప్తులో చేర్చాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. -
లక్ లక్కలా అతుక్కుంది.. 25 కోట్ల లాటరీ!
లక్ అంటే అతడిదే. ఎంతో మందికి ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా దక్కని అదృష్టం.. అతడిని మాత్రం వెంటనే వరించింది. ఫస్ట్ టైమ్ కొన్న లాటరీ టికెట్తోనే ఓవర్నైట్ కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయల బంఫర్ లాటరీ కొట్టాడు. 'నువ్వు చాలా లక్కీ బ్రో' అంటూ నెటిజనులు అతడికి విషెస్ చెబుతున్నారు. ఇంతకీ ఎవరతను?అలప్పుజ (కేరళ): అలప్పుజ జిల్లా తైకట్టుస్సేరీ నివాసి శరత్ నాయర్.. తిరువోణం బంపర్ లాటరీలో (Thiruvonam Bumper lottery) రూ.25 కోట్ల బహుమతిని గెలుచుకున్నారు. ఈ మేరకు నాయర్ సోమవారం తన లాటరీ టికెట్ను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా తురవూర్ శాఖ కార్యాలయానికి అందజేశారు. ‘టీహెచ్ 577825’నంబరు గల ఈ టికెట్ను ఆయన ఏజెంట్ లతీష్కుకు చెందిన లాటరీ రిటైల్ అవుట్లెట్లో కొనుగోలు చేశారు. ‘అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ విజేత టికెట్ నా దగ్గరే ఉందని నమ్మలేకపోయాను. తరువాత, ఇంటికి వెళ్లి టికెట్ను పరిశీలించి నిర్ధారించుకున్నాను’.. అని నాయర్ తెలిపారు.‘నేను బంపర్ టికెట్ కొనడం ఇదే మొదటిసారి. చిన్న లాటరీ టిక్కెట్లు ఎప్పుడో కానీ కొనను’.. అని శరత్ నాయర్ (Sarath Nair) స్పష్టం చేశారు. రూ.25 కోట్ల మొత్తంతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. తానింకా ఏం నిర్ణయించుకోలేదన్నారు. తనకున్న అప్పులు తీర్చాక.. కుటుంబంతో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తానని పేర్కొన్నారు. పెయింట్ షాప్లో ఇంకా పనిచేస్తారా? అని ప్రశ్నించగా.. 12 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నానని, అక్కడే కొనసాగుతానని సమాధానమిచ్చారు. కేరళ రాష్ట్ర లాటరీల విభాగం నిర్వహించే లాటరీలన్నిటిలోనూ.. అత్యధిక మొత్తం మొదటి బహుమతి తిరువోణం బంపర్దే కావడం విశేషం.చదవండి: దివాళా తీశాడని భార్య వదిలేసింది.. కట్ చేస్తే.. -
Pakistan: జాఫర్ ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు.. పలువురు సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. సింధ్-బలూచిస్థాన్ సమీపంలోని సుల్తాన్కోట్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై ఐఈడీ బాంబులు అమర్చి.. పట్టాలను పేల్చివేసింది. ఆ సమయంలో క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.బాధ్యత వహించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీపాక్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్ల బృందమైన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాద సమయంలో పాక్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నారని సమాచారం. పేలుడు దాటికి పలువురు సైనికులు మృతిచెందినట్లు, చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్కు స్వాతంత్య్రం ఇచ్చేంత వరకూ ఇలాంటి దాడులను కొనసాగిస్తామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. #BREAKING: Pakistan’s Jaffar Express train attacked yet again by Baloch rebels. Several people injured in an explosion on railway track near Sultankot (Sindh) when Jaffar Express was on way from Peshawar (KPK) to Quetta (Balochistan). Rescue ops underway. Five bogies derailed. pic.twitter.com/piJw0IiD25— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 7, 2025కొనసాగుతున్న సహాయక చర్యలుఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనలో ఎందరు ప్రాణాలు కోల్పోయారన్న దానిపై వివరాలు ఇంకా వెల్లడికాలేదు.తరచూ ఇదే ఎక్స్ప్రెస్పై దాడిజాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి. గత మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ను వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ సైనికులను హతమార్చారు. ఆ తరువాత పాక్ ఆర్మీ రంగంలోకి దిగి, బందీలను విడిపించింది. ఇదేవిధంగా జూన్లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని, బలోచ్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్ గ్రూప్ తరచూ దాడులకు పాల్పడుతుండటం గమనార్హం. -
ఆ బూటు విసిరింది నేను కాదు.. : రాజేష్ కిషోర్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు. ‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. సీజేఐ గవాయ్పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్ను విచారించి వదిలేశారు. అయితే.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే.. -
Bihar Elections : 40 ఏళ్ల తర్వాత రెండు దశలు.. మరిన్ని ఆసక్తికర సంగతులు
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్లలో 100 శాతం వెబ్కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్ను అప్డేట్ చేస్తారు.ఎవరి సంగతి ఏమిటి?నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.చిరాగ్ పాస్వాన్.. బీహార్లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.నితీష్కు నిజమైన పరీక్షఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.లాలూ కుటుంబంలో అంతర్గత పోరులాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మహిళల చేతుల్లో ఫలితాలు?బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి. -
Bihar Elections-2025: ‘ఎవరికెన్ని?’.. మొదలైన లెక్కల నినాదాలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పార్టీలలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6,11 తేదీలలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడికానున్నాయి. ఎన్నికల తేదీల ప్రకటన దరిమిలా అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), ప్రతిపక్ష మహా కూటమి మధ్య ‘ఎవరికెన్ని?’ నినాదాల యుద్ధం ఊపందుకుంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ‘25 నుంచి 30.. మా ఇద్దరు సోదరులు.. నరేంద్ర మోదీ, నితీష్లకు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, మహా కూటమి (ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగి, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ఖాతాలో ‘ఆరు- పదకొండు, ఎన్డీఏకి ‘నౌ దో గ్యారహ్’ అని పేర్కొన్నారు. (ఈ హిందీ సామెతకు ఓటమి అని అర్థం). విజయ్ కుమార్ సిన్హా -లాలూ యాదవ్ మధ్య నినాద యుద్ధానికి ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ‘25 నుండి 30.. మళ్లీ నితీష్’ అనే నినాదాన్ని వినిపించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ సీఎం అవుతారనే సందేశాన్ని జేడీయూ ఇంతకుముందే వినిపించింది. छह और ग्यारह NDA नौ दो ग्यारह!— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 7, 2025ఎన్నికల కమిషన్ బృందంతో జరిగిన సమావేశంలో జేడీయూ, బీజేపీలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఛత్ పూజ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించాయి. సూర్య ఆరాధన ఉత్పవంగా పేరొందిన ఛత్ వ్రతం అక్టోబర్ 25 నుండి 28 వరకు జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్ నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. किसानों को रुलाने वाली 20 सालों की निर्दयी एनडीए सरकार को बदलने का वक्त आ गया है। #LaluYadav #Bihar #RJD #बिहार pic.twitter.com/LPTH7MUiIc— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 26, 2025 -
‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్?’
తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)ఇదిలా ఉంటే.. కరూర్ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్ను ఉద్దేశించినవేనన్న కామెంట్(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. ఇదీ చదవండి: విజయ్కు సపోర్ట్గా బీజేపీ, ఆ పార్టీ కూడా! -
వామ్మో దగ్గు మందు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది. చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!. ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్లో గ్యాస్ స్టవ్లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు.. స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట. అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్లలో కలిపారు.SR-13 డేంజర్ బ్యాచ్.. కోల్డ్రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది. ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్ఫర్ చేసింది. సిరప్ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సిరప్తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది? -
కశ్మీర్ మహిళల ప్రస్తావన.. పాక్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూయార్క్: దాయాది పాకిస్తాన్పై భారత్ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృష్టిస్తూ ప్రపంచాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశాల్లో పాక్ అధికారిణి సౌమా సలీమ్ మాట్లాడుతూ.. భారత్, కశ్మీర్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరించారు, ఆక్రమణలో ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాక్ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను హరీష్ తీవ్రంగా ఖండించారు.అనంతరం, హరీష్ మాట్లాడుతూ.. కశ్మీర్ మహిళల గురించి పాకిస్తాన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది. తన సొంత ప్రజలపై బాంబులు వేసుకునే దేశం పాకిస్తాన్. ప్రతిసారి భారత్పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రత అజెండాల్లో మా మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ, సొంత ప్రజలపై బాంబులు వేసి పాక్ మారణహోమానికి పాల్పడుతుందన్నారు. అలాంటి దేశం ప్రపంచదృష్టిని మరల్చేందుకు మాపై నిందలు మోపుతుందన్నారు. పాక్ తప్పుడు వాదనలను ప్రపంచం చూస్తోందన్నారు.భారత్, జమ్ముకశ్మీర్పై ప్రతీసారి పాకిస్తాన్ విమర్శలు చేస్తూనే ఉంది. భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. భారత్పై విషం చిమ్మడం పాకిస్తాన్కు అలవాటే. 1971లో ఆపరేషన్ సెర్చ్లైట్ నిర్వహించిన దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో ఆ దేశ సొంత సైన్యం ద్వారా 4,00,000 మంది మహిళా పౌరులపై జాతి విధ్వంసం, సామూహిక అత్యాచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. తమ దేశ చర్యలకు మరిచిపోయి.. భారత్పై అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the UNSC Open Debate on Women Peace and Security marking 25 years of Resolution 1325. Quoting EAM @DrSJaishankar, he described women peacekeepers as “messengers of peace” and outlined India’s rich and pioneering… pic.twitter.com/SesXRFRJbU— India at UN, NY (@IndiaUNNewYork) October 6, 2025 -
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి(Senthil Balaji) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.మంత్రి పదవి(DMK Minister Post) గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా(Tamil Nadu) మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది. -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్! -
వాంగ్చుక్ అరెస్ట్పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: లద్దాఖ్కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాంగ్చుక్ అరెస్ట్కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్చుక్కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ను కోరింది. అదే సమయంలో, వాంగ్చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్లోని జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. -
దొంగనుకుని దళితుడ్ని చావబాదారు
రాయ్బరేలీ: రాత్రి వేళ చోరీలు జరక్కుండా గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు..తామడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో, దొంగగా అనుమానించి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. తీవ్రమైన గాయాలు, రక్తస్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఉంఛాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత బుధవారం చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగు చూ సింది. డ్రోన్లతో సర్వే చేసి మరీ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి సంచరిస్తోందంటూ కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పుకార్లు వస్తున్నాయి. దీంతో, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి ఏరి యాలో వారే గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. బుధ వారం రాత్రి జమునాపూర్ క్రాసింగ్ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు నిలదీశారు. తమ ప్రశ్నలకు అతడిచ్చిన సమాధా నాలతో సంతృప్తి చెందని గ్రామస్తుల గుంపు అతడిపై దాడికి పాల్పడింది. విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఈశ్వర్దాస్పూర్ రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లి వదిలేశారు. గురువారం ఉదయం పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫతేహ్పూర్కు చెందిన హరిఓం(40)అనే దళితుడిగా అతడిని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఘటనపై సమాచారం అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ కుమార్ సిన్హా వెల్లడించారు. దారుణంలో పాలుపంచుకున్న మరికొందరిని సైతం గుర్తించి, అరెస్ట్ చేసే పనిలో ఉన్నామన్నారు. -
ముందు హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును కాదని నేరుగా తమ వద్దకు రావడాన్ని తప్పుబట్టింది. సరైన న్యాయ ప్రక్రియను పాటించాల్సిందేనంటూ, ముందు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై వంగా గోపాల్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. కాగా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అత్యవసరంగా విచారించాలని అభ్యరి్థంచారు. ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళకముందే, జస్టిస్ విక్రమ్నాథ్ ఆయన్ను అడ్డుకున్నారు. ‘ముందు మీరు ఆర్టీకల్ 32 కింద ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి?’అని సూటిగా ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన ధర్మాసనాన్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయతి్నంచారు. తమ క్లయింట్ను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం పని దినాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు కీలకమైన సర్క్యులర్ జారీ చేసిందంటూ వాదించారు. తాము అత్యవసర విచారణ కోసం సాయంత్రం 6 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నివాసానికి కూడా వెళ్లా మని, కానీ అక్కడ ఉపశమనం లభించలేదని నివేదించారు. ఇక 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీంతో జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకున్నారు. తొలుత ఆ అడ్డంకిని దాటండి ‘ముందు మీరు ఆ అడ్డంకిని దాటండి, ఆ తర్వాతే కేసు యోగ్యతపై (మెరిట్స్) మేము వాదనలు వింటాం’అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. హైకోర్టులో అనుకూలమైన ఉత్తర్వులు రానంత మాత్రాన, సుప్రీంకోర్టును ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చూడటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయవాదిని ఉద్దేశించి.. ’మీ క్లయింట్లకు మీరు సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది..’అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టును ఆశ్రయి ంచేందుకు స్వేచ్ఛ ఇచ్చారు.ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆ అవసరం లేకుండా పోయింది. కాగా సుప్రీం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టయ్యింది. సుప్రీంకోర్టులో పిటిషన్ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో, స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించడంతో ఇక ఈ నెల 8వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ, తీర్పు కీలకంగా మారనుంది. -
కొండ చరియలు.. విరిగిపడుతున్నాయ్!
కొండచరియలు విరిగిపడి పలువురి మృతి.. నిలిచిపోయిన రాకపోకలు.. యాత్రికుల అష్టకష్టాలు.. ఇలాంటి వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరుగుతోంది. అందుకే దేశవ్యాప్తంగా ముప్పు ఉండే ప్రాంతాలను గుర్తించడంతోపాటు నష్ట నివారణ చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ పశ్చిమ బెంగాల్లోని మిరిక్, డార్జిలింగ్ హిల్స్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి అక్టోబరు 5న 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి.⇒ ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వైష్ణోదేవీ ఆలయ సమీపంలో కొండ చరియలు విరిగిపడి సుమారు 30 మంది మరణించారు. ⇒ జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమా చల్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే కొండచరియలు విరిగి పడటం చాలాసహజం. ఆ సమయాల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. ⇒ 2024 జూలైలో కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు కూలిన ఘటనల్లో ఏకంగా 260కిపైగా చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.మ్యాపింగ్ చేసిన జీఎస్ఐకొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ఎతై ్తన కొండ ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) దేశవ్యాప్తంగా మ్యాపింగ్ చేసింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముప్పు ప్రాంతాలు విస్తరించాయి.ముప్పును బట్టి..కొండచరియలు విరిగిపడే ముప్పు తీవ్రతను బట్టి తక్కువ, మధ్య, అధిక ప్రాంతాలుగా జీఎస్ఐ విభజించింది. ఇందులో 63 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అధిక ప్రమాద జోన్లో ఉందని తేలింది. అలాగే 1,26,000 చ.కి.మీ. మధ్యస్థంగా, 2,45,000 చ.కి.మీ. తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతంగా వెల్లడించింది. హిమాచల్ ప్ర దేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్.. అధిక ప్ర మాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా ప్రకటించింది.అధిక స్పష్టతతో..రిమోట్ సెన్సింగ్, క్షేత్రస్థాయి సిబ్బంది ఆధారంగా కొండచరియలు విరిగిపడ్డ 91,000 సంఘటనల సమాచారాన్ని జీఎస్ఐ సేకరించింది. 33,904 ఘటనలను ధ్రువీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి గుర్తించిన 200 కీలక ప్రాంతాల్లో మరింత అధునాతన మీసో–స్కేల్ మ్యాపింగ్కు శ్రీకారం చుట్టింది. వీటిలో ఈ ఏడాది మార్చి నాటికి 160 ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది. 2028లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. పెళుసైన కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, జోనింగ్ నిబంధనలు, కమ్యూనిటీ భద్రతకు ఈ అధిక స్పష్టత కలిగిన మ్యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి.ముందస్తు హెచ్చరికలుప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొండచరియల ముప్పు అంచనా సామర్థ్యాలను పెంచుతోంది. వాతావరణ శాఖ, ఇతర సంస్థల సహకారంతో జీఎస్ఐ అభివృద్ధి చేసిన ‘ప్రాంతీయ కొండచరియల అంచనా వ్యవస్థ (ఆర్ఎల్ ఎఫ్ఎస్)’.. వర్షపాతం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ముందస్తు హెచ్చరికలను అందిస్తోంది. జీఎస్ఐ ఈ సంవత్సరం రుతుపవనాలు ప్రారంభం కాగానే ఎనిమిది రాష్ట్రాల్లోని 21 జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ఉన్నాయి.దేశంలో కొండచరియల ముప్పు తీవ్రతను బట్టి విస్తీర్ణ శాతంతక్కువ 56మధ్యస్థం 29అధికం 15 -
వదిలేసిన ఆహారం విషమవుతోంది!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం. ప్రపంచ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!చైనా.. భారత్.. పాకిస్తాన్..ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే. నిల్వ వసతులు లేమిఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్. సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.మనం ఏమి చేయగలం? అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..! -
రెండు దశల్లో బిహార్ ఎన్నికలు
న్యూఢిల్లీ: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 243 స్థానాలకు గాను.. మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. నవంబర్ 16 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో బిహార్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వచి్చంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్కు అక్టోబర్ 17న, రెండో దశ పోలింగ్కు అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితా శుద్ధీకరణగా జ్ఞానేశ్ కుమార్ అభివరి్ణంచారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 69 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే, భారత పౌరసత్వం లేనికారణంగా ఎన్ని పేర్లు తొలగించారో ఆయన బయటపెట్టలేదు. మరణాలు, పౌరసత్వం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాలతో పేర్లు తొలగించినట్లు స్పష్టంచేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 11న ఉప ఎన్నికలు తెలంగాణ, రాజస్తాన్, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బిహార్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో 17 సంస్కరణలు చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ ఎన్నికల చరిత్రలో బిహార్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ఒకటిగా రికార్డుకెక్కబోతున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణ విషయంలో మొత్తం దేశానికి బిహార్ ఒక మార్గం చూపిందని అన్నారు. రాజకీయ పారీ్టల విజ్ఞప్తి మేరకు.. బిహార్లో ఈవీఎంల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేస్తామని వివరించారు. మహిళలు ఓటు వేసే సమయంలో బుర్ఖా లేదా తలపై ముసుగు ధరించవచ్చా? అని ప్రశ్నించగా, ఓటర్ల గుర్తింపును నిర్ధారించే విషయంలో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ బదులిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో ఉంటారని, మహిళా ఓటర్ల గుర్తింపును వారు తనిఖీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 250 పోలింగ్ బూత్ల పరిధిలో పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. 197 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పడవలపై అక్కడికి చేరుకుంటారని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడం దగ్గర్నుంచి, ఓట్ల లెక్కింపు దాకా.. మొత్తం 17 సంస్కరణలు చేపట్టబోతున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ వీటిని అమలు చేస్తామన్నారు. తొలిసారిగా ‘ఈసీఐ నెట్’ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బిహార్ ఎన్నికల్లో ‘ఈసీఐ నెట్’ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కిపైగా యాప్లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈసీఐ నెట్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ యాప్స్’ అని చెబుతున్నారు. బూత్ లెవెల్ అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు సహా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది దీన్ని వినియోగించుకుంటారు. ఓటర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ తదితర పనులు దీనిద్వారా నిర్వహిస్తారు. ఫలితంగా వారిమధ్య సమన్వయం పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ సులభంగా మారుతుంది. ఓటర్లు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. పోలింగ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. కౌంటింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. తొలుత బిహార్లో.. అనంతరం దేశమంతటా ఈసీఐ నెట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్6న) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice…— Narendra Modi (@narendramodi) October 6, 2025 -
సుప్రీంకోర్టులో సీజేఐపై దాడి యత్నం కేసులో కీలక పరిణామం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ లాయర్ దాడికి ప్రయత్నించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన లాయర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. రాకేష్ కిషోర్ను విధుల నుంచి బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన లాయర్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోమవవారం (అక్టోబర్6న) సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే సమయంలో లాయర్ రాకేష్ కిషోర్ జస్టిస్ బీఆర్ గవాయ్పై ‘షూ’ విసిరేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తోటి లాయర్లు అప్రమత్తం కావడంతో కోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్.. న్యాయవాదిగా ప్రవర్తించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినందుకు రాకేష్ కిషోర్ను తక్షణమే సస్పెండ్ చేసింది.‘ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్య. ఇటువంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించం’ అని బార్ కౌన్సిల్ ప్రకటనలో పేర్కొంది.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అవసరమైతే శాశ్వతంగా లాయర్గా ప్రాక్టీస్ చేసే హక్కును రద్దు చేయొచ్చని బార్ కౌన్సిల్ సూచించింది. మరోవైపు, ఢిల్లీ పోలీస్ శాఖ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
మోదీ ఒడిలో తేజస్వి ఓటర్లు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల నేపధ్యంలో ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ యాక్టివ్గా మారారు. సోమవారం మధుబని జిల్లాలోని జీరో మైల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తేజస్వీ యాదవ్పై మాటల దాడి చేశారు. వీరి వలనే బీజేపీ గెలుస్తుందని ఆరోపించారు. తేజస్వి ఓటర్లు మోదీ ఒడిలో కూర్చుని టీ తాగుతున్నందున బీజేపీనే గెలుస్తుందని ఆయన అన్నారు. వారు తమ ఓటర్లను ఒప్పించలేక, అందుకు బదులుగా ఒవైసీని నిందిస్తున్నారన్నారు. తేజస్విని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీరు ఇలాగే అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే, బీహార్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు.ముస్లిం సమాజం తమ సొంత నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే వరకు, వారి సమస్యలను పరిష్కరించలేమని ఎంపీ వ్యాఖ్యానించారు. బీహార్ జనాభాలో ముస్లింలు 19 శాతం ఉన్నారని, వీరు లేకుండా ఏ ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయలేమని, ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేమని ఒవైసీ అన్నారు. ఏఐఎంఐఎం చేస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు చాలా అవసరమన్నారు. బీహార్లో నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. బీహార్లో 60 శాతం జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారేననని, ఓటర్లు ఓటు వేసేముందు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.తాము కాంగ్రెస్కు, లాలూ యాదవ్లకు లేఖ రాశామని, తమతో పొత్తు పెట్టుకుని తమకు ఆరు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని ఒవైసీ తెలిపారు. మీరు అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యేలను మంత్రులను చేయనవసరం లేదని, బీజేపీ మతతత్వాన్ని ఎదుర్కోవాలనేదే తమ డిమాండ్ అని అన్నారు. వారు తమ వినతిని అంగీకరించలేదన్నారు. ఎన్నికల ఫలితం భిన్నంగా ఉంటే, మోదీ.. బీహార్కు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు. -
బరిలో ప్రముఖ సింగర్.. బీజేపీ నేతలతో భేటీ
న్యూఢిల్లీ: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. పార్టీలలో ఉత్సాహం పెరిగింది. టిక్కెట్ల ఆశావహులు వివిధ పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్లను కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్భంగా నుండి బీజేపీ టికెట్పై పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.వినోద్ తావ్డే తన ‘ఎక్స్’ హ్యాండిల్లో మైథిలి ఠాకూర్తో సమావేశం అయిన ఫొటోలను షేర్ చేశారు. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో బీహార్ను విడిచిపెట్టిన మైథిలి ఠాకూర్ కుటుంబం రాష్ట్ర పురోగతిని చూసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు తావ్డే ఆ పోస్ట్లో తెలిపారు. కాగా మైథిలి ఠాకూర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘బీహార్ అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.जो लोग बिहार के लिए बड़े सपने देखते हैं, उनके साथ हर बातचीत मुझे दूरदृष्टि और सेवा की शक्ति की याद दिलाती है। हृदय से सम्मानित और आभारी हूँ। 🙏✨श्री नित्यानंद राय जी एवं श्री विनोद श्रीधर तावड़े जी 🙏 https://t.co/o6PBAVJaEJ— Maithili Thakur (@maithilithakur) October 5, 2025మైథిలి ఠాకూర్ బీహార్లోని మధుబనిలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె, బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ను అందుకున్నారు. ఆమె తన ఇద్దరు సోదరులతో పాటు, తాత, తండ్రి నుండి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. రాబోయే ఎన్నికలు ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ మధ్య పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. -
బీహార్ ఎన్నికల్లో ‘ఆప్’.. తొలి జాబితా ప్రకటించిన కేజ్రీవాల్
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం నాడు బీహార్ ఎన్నికల్లో పోటీచేసే 11 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ‘ఆప్’ గత జూలైలో ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఆప్’ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా బీహార్ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ధృవీకరించారు. బీహార్ ఎన్నికల్లో పోటీచేయబోయే 11 మంది అభ్యర్థుల జాబితా..డాక్టర్ మీరా సింగ్ - బెగుసరాయ్ (బెగుసరాయ్) యోగి చౌపాల్ - కుశేశ్వరస్థాన్ (దర్భంగా) అమిత్ కుమార్ సింగ్ - తారయ్య (సరణ్) భాను భారతీయ - కస్బా (పూర్ణియ) శుభదా యాదవ్ – బేనిపట్టి (మధుబని) అరుణ్ కుమార్ రజక్ - ఫుల్వారీ షరీఫ్ (పట్నా) డాక్టర్ పంకజ్ కుమార్ - బంకీపూర్ (పట్నా) అష్రఫ్ ఆలం - కిషన్గంజ్ (కిషన్గంజ్) అఖిలేష్ నారాయణ్ ఠాకూర్ - పరిహార్ (సీతామర్హి) అశోక్ కుమార్ సింగ్ - గోవింద్గంజ్ (మోతిహారి) మాజీ కెప్టెన్ ధరమ్రాజ్ సింగ్ - బక్సర్ (బక్సర్)2020 బీహార్ ఎన్నికల ఫలితాలు ఇలా..మునుపటి(2020) బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. మొదటి దశ అక్టోబర్ 28, రెండవ దశ నవంబర్ 3, మూడవ దశ నవంబర్ 7. ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించారు. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, 2020 బీహార్ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం 57.05గా ఉంది. మొదటి దశలో 55.68 శాతం, రెండవ దశలో 55.70 శాతం మూడవ దశలో 59.94 శాతం నమోదయ్యాయి. నాటి బీహార్ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డీఏ) 125 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహా కూటమి 110 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. -
వరదలకు మానవ నిర్మిత విపత్తే కారణం: మమతా బెనర్జీ
కోల్కతా: రాష్ట్రంలో సంభవించిన వరదలకు, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో తలెత్తిన దుర్భర పరిస్థితులకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (వీడీవీసీ) కారణమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదలను ఆమె మానవ నిర్మిత విపత్తుగా అభివర్ణించారు.దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎటువంటి సమన్వయం లేకుండా రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడమే ఈ పరిస్థితికి కారణమని మమతా ఆరోపించారు. శనివారం నుంచి నమోదవుతున్న రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న డార్జిలింగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో డీవీసీ చేపట్టిన చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ. ఐదు లక్షల పరిహారం, ఒకరికి హోమ్గార్డ్ ఉద్యోగం ప్రకటించారు. డబ్బుతో ప్రాణ నష్టాన్ని పూడ్చలేమని, అయితే ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాగ్డోగ్రాకు బయలుదేరే ముందు కోల్కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ డీవీసీపై పలు ఆరోపణలు చేశారు. జార్ఖండ్ను వరదల నుంచి రక్షించేందుకు డీవీసీ మైథాన్,పాంచెట్ రిజర్వాయర్ల నుంచి ఇష్టం వచ్చినట్లుగా నీటిని విడుదల చేసిందని, ఇది దిగువ ప్రాంతమైన బెంగాల్లో పరిస్థితిని మరింత దారుణంగా మార్చిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేవలం 12 గంటల్లో 300 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని. దీని కారణంగా హైవేలు, వంతెనలు, ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. VIDEO | North Bengal floods: West Bengal CM Mamata Banerjee says, "All tourists have been rescued, except for one missing at Diamond Harbour. Today, 500 tourists are being brought in, while many were brought by buses yesterday. 250 tourists will be accommodated in Siliguri."… pic.twitter.com/dp00WJ6pzd— Press Trust of India (@PTI_News) October 6, 2025కాగా డార్జిలింగ్లోని మిరిక్, సుఖియాపోఖ్రి, జోరెబంగ్లో, అలాగే జల్పాయ్గురి జిల్లాలోని నాగర్కట వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ఇప్పటివరకు ఉత్తర బెంగాల్ వరదలలో 23 మంది మృతి చెందారని మమత తెలిపారు. డార్జిలింగ్, మిరిక్, కాలింపాంగ్లలో 18 మంది, నాగర్కటలో ఐదుగురు మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. కాగా వరద ప్రభావిత జిల్లాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 45 బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 500 మంది పర్యాటకులను తరలించామని, మరో 250 మందికి సిలిగురిలో వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. డైమండ్ హార్బర్ నుండి తప్పిపోయిన ఒక వ్యక్తి మినహా మిగిలిన పర్యాటకులందరినీ రక్షించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చిక్కుకుపోయిన పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని, గదులు ఖాళీ చేయమని ఒత్తిడి చేయవద్దని హోటళ్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఖర్చులను తామే భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. -
బిహార్లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
బీజేపీ నేతలపై మూక దాడి
నగరాకాటా: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యట నకు వెళ్లిన సమయంలో జరిగిన మూకదాడిలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా నగరాకాటా వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుఆర్ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అందుతున్న సాయాన్ని పరిశీలించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన బృందంలో ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ఉన్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్తున్న ఆ నేతల కాన్వాయ్ని బమన్దాంగా వద్ద ఓ గుంపు చుట్టు ముట్టింది. ‘దీదీ, దీ దీ..’అని నినాదాలు చేస్తూ వాహనాలపై వారు రాళ్లు రువ్వారు. వాహనాల కిటికీల అ ద్దాలు పగిలిపోయా యి. ముర్ము తలకు గాయమై రక్తం కారింది. భయంతో ఘోష్ వణికిపోయారు. ఇందుకు సంబంధించిన లైవ్ వీడియో ఫేస్బుక్లో ఉంది. దుండగులు తమను దూషిస్తూ వెనుక నుంచి రాళ్ల దాడికి దిగారని శంకర్ ఘోష్ చెప్పారు. ఖగేన్కు రాళ్లు తగలడంతో భయపడి సీటు వెనుక దాక్కున్నట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంపీ ఖగేన్ను సిలిగురిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన టీఎంసీ ఆటవిక పాలనకు మరో నిదర్శనమంటూ బీజేపీ మండిపడింది. ఈ ప్రాంతంలో ప్రజల్లో రాజుకుంటున్న అసమ్మతిని అణచివేసేందుకే సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి చేయిస్తు న్నారని ఆరోపించింది. పోలీసుల సమక్షంలోనే తమ నేతల బృందంపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించింది. ఒక వైపు ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంటే కోల్కతాలో సీఎం మమత మాత్రం ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొంది. ఇలా ఉండగా, సిలిగురిలోని వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు వెళ్లిన తమకు టీఎంసీ శ్రేణులు పదేపదే అడ్డు తగిలారని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆరోపించారు. తమ బృందంలో ఎంపీలు రాజు బిస్తా, జయంత రాయ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK— Sandipan Mitra (@SMitra_) October 6, 2025 -
శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ఏర్పాటు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడంలో బంగారం బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది.సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను బయటికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడికి పంపిన ఒక ఈ మెయిల్ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల బంగారు పనులు పూర్తయిన తర్వాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ ఈ మెయిల్ చూస్తుంటే పొట్టి వద్ద మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది. -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్ను ఢిల్లీ మయూర్ విహార్కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
Valmiki Jayanti: రేపు విద్యాసంస్థలకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
న్యూఢిల్లీ: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీ (మంగళవారం)న దేశంలోని పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వాల్మీకి జయంతి నాడు ఉత్తరప్రదేశ్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లతో సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నట్లు ప్రకటించింది.ఢిల్లీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాజధాని అంతటా పలు కార్యక్రమాలు, ఊరేగింపులు, నివాళి సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొననున్నారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 7న మూసివేయనున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అంతటా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7న రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో రామాయణ పారాయణం జరుగుతుందని సీఎం తెలిపారు.ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమినాడు మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి వాల్మీకి మహర్షి కశ్యపుడు, అదితి దంపతుల తొమ్మిదవ కుమారుడు. మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక పురాణగాథ ఉంది. వాల్మీకి తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయినప్పుడు, చెదపురుగులు అతని శరీరం చుట్టూ చేరి, పుట్టలను కట్టాయి. సంస్కృతంలో చెదపురుగుల పుట్టలను వాల్మీకి అని పిలుస్తారు. అందుకే నాటి నుంచి ఆ మహర్షి పేరు వాల్మీకి అయ్యింది. రామాయణ గాథ ప్రకారం శ్రీరాముడు.. సీతామాతను విడిచిపెట్టిన తర్వాత, ఆమె మహర్షి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. శ్రీరాముని కుమారులైన లవ కుశులకు విద్యను అందించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుంది. -
చెన్నై జూలో సింహం మిస్సింగ్ కలకలం!
చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్క్లోజర్లోకి చేరుకోగా.. శేర్యార్ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్ డ్రోన్ల, ట్రాప్ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదేళ్ల వయసున్న శేర్యార్ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్ మిస్సింగ్ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం -
Kerala: అసెంబ్లీకి ‘స్వర్ణ తాపడం’ వివాదం.. గందరగోళం మధ్య సభ వాయిదా
తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. -
Jaipur Hospital tragedy: తల్లిని కోల్పోయి.. సోదరుడు దూరమై.. బావ బూడిదగా మారి..
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో గల సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి, ఎనిమిది మంది రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో అయినవారిని కోల్పోయిన పలువురు రోదిస్తున్న తీరు చూపరులను కంటతటి పెట్టిస్తోంది. #WATCH | SMS Hospital fire, Jaipur | "... The ICU caught fire. There was no equipment to extinguish it. There were no cylinders or even water to douse the fire. There were no facilities. My mother passed away...," says a person who lost a family member in the fire at Jaipur's… pic.twitter.com/BCV2Sa9jMT— ANI (@ANI) October 6, 2025భోజనం చేస్తున్నంతలో..ఈ ఘటనలో నరేంద్ర సింగ్ అనే వ్యక్తి తన తల్లిని కోల్పోయాడు. అతను ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రి కింది అంతస్తులో భోజనం చేస్తున్నాడు. అతని తల్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ, అగ్నికి ఆహుతైపోయింది. ‘ఐసీయూలో మంటలు చెలరేగాయన్న సంగతి నాకు వెంటనే తెలియలేదు. ఆ సమయంలో నేను భోజనం చేయడానికి కిందికి వచ్చాను. ఆస్పత్రిలో మంటలను ఆర్పడానికి ఎటువంటి పరికరాలు గానీ, సౌకర్యాలు గానీ అందుబాటులో లేవు’ అంటూ తల్లిని కోల్పోయిన నరేంద్ర సింగ్ మీడియా ముందు రోదిస్తూ చెప్పాడు.రోడ్డుపై బాధితులు విలవిలరాజస్థాన్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 11 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పక్కనే ఉన్న సెమీ ఐసీయూలో 13 మంది రోగులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది రోగులను బయటకు తరలించారు. అయితే వారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా రోడ్డుపై కూర్చోవలసి వచ్చింది. రోగులను రక్షించడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్నయ్య సాహసం చేసి..‘షార్ట్ సర్క్యూట్ను గుర్తించిన వెంటనే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో మంటలు మరింతగా చెలరేగాయి. మా అన్నదమ్ములిద్దరినీ ఐసీయూ లోపలికి వెళ్లి రోగులను కాపాడేందుకు సిబ్బంది అనుమతించలేదు. అయితే మా అన్నయ్య ఎలాగోలా మా అమ్మను కాపాడేందుకు లోనికి వెళ్లాడు వెళ్ళాడు’ అని జోగీందర్ సింగ్ ఎన్డీటీవీకి చెప్పాడు. ‘వైరు నుంచి ఒక స్పార్క్ వచ్చిన సమయంలో ఆ పక్కనే ఒక సిలిండర్ ఉంది. పొగ ఐసీయూ అంతటా వ్యాపించింది. దీంతో అక్కడున్న అందరూ భయంతో పారిపోయారు. కొంతమంది మాత్రం తమ వారిని కాపాడుకోగలిగారు. ఇంతలో గ్యాస్ మరింతగా వ్యాపించడంతో, సిబ్బంది ఆస్పత్రి గేట్లను మూసివేశారు’ అని జోగీందర్ తెలిపాడు.#WATCH | SMS Hospital fire, Jaipur | "... It was my aunt's son. He was 25 years old and named Pintu... When smoke came out at 11.20 pm, we had informed the doctors that the patients might have problems. Then gradually the smoke increased. As the smoke increased, the doctors and… pic.twitter.com/sR3OuQ79Ku— ANI (@ANI) October 6, 2025రెండు రోజుల్లో డిశ్చార్జ్.. ఇంతలోనే..25 ఏళ్ల ఓం ప్రకాష్ తన బంధువు(బావ) ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో అతనికి సాయంగా ఆస్పత్రిలో ఉన్నాడు. రాత్రి 11:20 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది అక్కడి రోగులను రోగులకు, వైద్యులను హెచ్చరించారని ఓం ప్రకాష్ తెలిపారు. ‘పొగ తీవ్రమవుతుండటాన్ని గమనించి అక్కడి వైద్యులు, కాంపౌండర్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే నలుగురైదుగురు రోగులను మాత్రం కొందరు బయటకు తరలించారు. నా అత్త కుమారుడు పింటూ అగ్నికి ఆహుతైపోయాడు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కావలసినవాడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడని ఓం ప్రకాష్ రోదించాడు.ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే..రంజిత్ సింగ్ రాథోడ్ది మరో విషాదగాథ. అతని సోదరుడు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రంజిత్ సింగ్ రాథోడ్కు రాత్రి 11:30 గంటలకు ఆస్పత్రిని నుంచి ప్రమాద వివరాలు చెబుతూ కాల్ వచ్చింది. ‘నేను సాయంత్రమే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాను. ఫోన్ రాగానే ఆస్పత్రికి పరిగెత్తాను. నన్ను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. కొంత సమయం తర్వాత, నేను లోపలికి వెళ్లగలిగాను. అక్కడ నా సోదరుడు చనిపోయివుండటాన్ని చూశాను’ అని రంజిత్ సింగ్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు.‘బాధితుల వాదనల్లో నిజం లేదు’ఎస్ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్ ఇన్ చార్జ్ అనురాగ్ ధకాడ్ బాధితుల వాదనలను తోసిపుచ్చారు. ప్రమాద సమయంలో పొగ, విష వాయువులు త్వరగా వ్యాపించాయని,దీంతో ట్రామా సెంటర్లోకి ప్రవేశించి, రోగులను రక్షించడం కష్టమయ్యిందన్నారు. అగ్నిమాపక దళానికి ఫోన్ చేశామని, ప్రమాదంలో ఎనిమిది మంది ఊపిరాడక మరణించారన్నారు. అయితే పోస్ట్మార్టం తర్వాత మాకు మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.जयपुर के सवाई मानसिंह अस्पताल के ट्रॉमा सेंटर में आग लगने की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है।अस्पताल पहुंचकर चिकित्सकों एवं अधिकारियों से जानकारी ली और त्वरित राहत कार्य सुनिश्चित करने के निर्देश दिए। मरीजों की सुरक्षा, इलाज और प्रभावित लोगों की देखभाल के लिए हर संभव कदम उठाए जा…— Bhajanlal Sharma (@BhajanlalBjp) October 6, 2025ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సమీక్షరాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తాను ఆస్పత్రికి చేరుకున్నంతనే వైద్యులు, అధికారుల నుండి సమాచారాన్ని సేకరించి, త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశానని సీఎం తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సీఎం శర్మ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. -
ఈసీ ప్రెస్మీట్.. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Election) షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. బీహార్(Bihar Election) అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్(దేశంలో మరో నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు) విడుదలయ్యే అవకాశం ఉంది. Delhi | Election Commission of India to hold a press conference at 4 PM today to announce the schedule for the upcoming Bihar Assembly Elections pic.twitter.com/YFTiaVTkk0— ANI (@ANI) October 6, 2025కాగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బీహార్లో పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ముమ్మర సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. బీహార్ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. కాగా, ప్రస్తుతం బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహాగఠ్బంధన్లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
దగ్గు మందు డేంజర్ బెల్స్! అసలేం జరిగిందంటే..
దగ్గు సిరప్ తాగి చిన్నారులు (Cough Syrup Deaths) చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కథనాల నేపథ్యంతో పిల్లలకు దగ్గు మందు వాడే విషయంలో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. శని, ఆదివారాల్లో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్కు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. అలాగే మరణాలకు కారణంగా భావిస్తున్న సిరప్ ఉత్పత్తిదారుపైనా కేసు నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పలువురు చిన్నారులు కోల్డ్రిఫ్ (ColdriF) అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా చనిపోయారు. ఇటు రాజస్థాన్లోనూ మూడు మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో పేరెంట్స్కు ఈ సిరప్ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఇక్కడే ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగన్నరేళ్లు, ఒకరు రెండున్నరేళ్లు) సిరప్ కారణంగానే మరణించినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ ప్రవీణ్ వద్దే వైద్యం తీసుకోవడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ మరణాల సంఖ్య 14కి చేరినట్లయ్యింది. సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి.. మూత్రపిండాలు(కిడ్నీ) ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో ఎనిమిది మంది చిన్నారులు నాగ్పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నారుల ‘సిరప్’ మరణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT)ను ఏర్పాటు చేసింది.వరుస మరణాల నేపథ్యంలో.. చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, 'కోల్డ్రిఫ్' అనే దగ్గు సిరప్లో(బాచ్ నంబర్ SR-13) డైఇథైలిన్ గ్లైకాల్ (DEG-48.6%) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో కోల్డ్రిఫ్ (ColdriF) సిరప్పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నివేదిక తర్వాత.. మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ColdriF స్టాక్లను నిషేధించి స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్లో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్పత్తిని ఆపేయించింది.ఇక.. తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సిఫార్సు చేసింది. అంతేకాకుండా, సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన డాక్టర్ ప్రవీణ్ సోనీతో పాటు తయారుదారీ కంపెనీ స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యకు సమానమైన నిర్లక్ష్యంతో మృతికి కారణం), సెక్షన్ 276 (మందుల కల్తీ), మరియు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులు జీవిత ఖైదు శిక్షకు దారి తీసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని పేరెంట్స్కు, అలాగే ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ 'ఎం' నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.మరోవైపు.. డాక్టర్ ప్రవీణ్ సోనీని తక్షణమే విడుదల చేసి.. ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని, లేకంఉటే నిరవధిక సమ్మె చేపడతామని చింద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఆరోగ్య సంక్షోభ వేళ సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి అస్సాంకు జాలీగా ట్రిప్కు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. దగ్గుమందులు, యాంటీబయటిక్స్ ‘కల్తీ’ విషయంలో సీడీఎస్సీవో సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు తమిళనాడు, యూపీ, కేరళ, మహారాష్ట్రలోనూ 19 ఔషధ తయారీ సంస్థలపై తనిఖీలు ప్రారంభించింది. -
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. ఒడిశాలో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
భువనేశ్వర్: ఒడిశాలో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కటక్లో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.వివరాల ప్రకారం.. మత సామరస్యం విషయంలో వెయ్యి సంవత్సరాల ప్రశాంత చరిత్ర కలిగిన ఒడిశాలోని కటక్లో హింస చెలరేగింది. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య తొలిసారిగా హింస చెలరేగింది. దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్న దుర్గా మాత నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, పైకప్పుల నుంచి రాళ్లు, గాజు సీసాలు పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులని తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.କଟକ ରେ ଦୁର୍ଗା ମା ଙ୍କ ଭସାଣି ରେ ଡିସିପି ଙ୍କୁ ପଥର ମାଢ଼❗ ମାନ୍ୟବର @odisha_police ଙ୍କୁ ଅନୁରୋଧ ଏ ସିସିଟିଭି ଫୁଟେଜ କୁ ଯାଞ୍ଚ କରି ଅସାମାଜିକ ଯୁବକ ଙ୍କୁ ତୁରନ୍ତ ଗିରଫ କରି ଆଇନ ଅନୁଯାଇ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରନ୍ତୁ |@dcp_cuttack @CuttackDM @CMO_Odisha @homeodisha @PrithivirajBJP @IPR_Odisha pic.twitter.com/crxfy4iudA— Nrusingha Behera 🇮🇳 (@NrusinghaOdisha) October 5, 2025 వీహెచ్పీ ర్యాలీతో మళ్లీ ఉద్రిక్తతలు..కటక్లో ఆంక్షలు ఉన్నప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం 12 గంటల బంద్కు వీహెచ్పీ పిలుపునిచ్చింది. ఘర్షణకు అధికారం యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆరోపించింది.Results of communal violence in Cuttack. #Cuttack #DurgaPuja pic.twitter.com/pOpbwkOL23— Suraj Sureka (@surajsureka9) October 5, 2025ఇంటర్నెట్ నిలిపివేత..కటక్లో హింస, ఉద్రిక్తతలు పెరగడంతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కటక్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే 42 మౌజా పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దర్గా బజార్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచారు. స్థానిక పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని కూడా మోహరించారు. -
రాజస్థాన్: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్లోని సవాయ మాన్సింగ్(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ਸਵਾਈ ਮਾਨ ਸਿੰਘ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਦੇ ICU 'ਚ ਲੱਗੀ ਅੱ+ਗਝੁਲ.ਸ ਗਏ ਕਿੰਨੇ ਹੀ ਮਰੀਜ਼ ! ਦੇਖੋ ਰਾਜਸਥਾਨ ਦੇ ਸਰਕਾਰੀ ਹਸਤਪਾਲ ਦੀਆਂ ਤਸਵੀਰਾਂ #jaipur #rajasthan #accident #LatestNews #Bignews #PunjabiNews #DailypostTV pic.twitter.com/kvlIRlBb4I— DailyPost TV (@DailyPostPhh) October 6, 2025 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది. #WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ— ANI (@ANI) October 5, 2025ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025సిబ్బందిపై ఆరోపణలుఅయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.ప్రధాని దిగ్భ్రాంతిజైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi— PMO India (@PMOIndia) October 6, 2025 #WATCH | Jaipur, Rajasthan | SMS Hospital Trauma centre Incharge Anurag Dhakad says, "Our trauma centre has two ICUs on the second floor: a trauma ICU and a semi-ICU. We had 24 patients there; 11 in the trauma ICU and 13 in the semi-ICU. A short circuit occurred in the trauma… pic.twitter.com/cjMwutRCl3— ANI (@ANI) October 5, 2025 -
200 మంది ప్రయాణికులు, 75 వాహనాలతో సముద్రంలోనే నిలిచిపోయిన ఫెర్రీ
పాల్ఘార్: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సఫాలె–విరార్ల మధ్య రాకపోకలు సాగించే రో–రో ఫెర్రీ ఆదివారం సాయంత్రం సముద్రం మధ్యలోనే మొరాయించింది. ఆ సమయంలో ఫెర్రీలో 200 మంది ప్రయాణికుల, 75 వరకు వాహనాలున్నాయి. సామర్థ్యానికి మించి లోడు వేయడంతో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ ర్యాంప్ నిలిచిపోవడంతో ఎంహరంబల్పడ వద్ద సముద్రంలో కదలకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తక్కువ ఎత్తులో అలలు కూడా మరో కారణమని వివరించారు. దీంతో, కొన్ని గంటలపాటు ప్రయాణికులు ఫెర్రీపైనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు, మెరైన్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను సరిచేశారు. -
బస్తర్లో 10 వేల రేడియో సెట్ల పంపిణీ
న్యూఢిల్లీ/బిజాపూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు 10 వేలకు పైగా రేడియో సెట్లను ప్రజలకు పంపిణీ చేసింది. జాతీయ స్థాయి పరిణామాలను వారికి అందజేయడం, మావోయిస్టుల సైద్ధాంతిక ప్రభావం నుంచి స్థానికులను దూరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో వీటిని అందజేశామని సీఆర్పీఎఫ్ తెలిపింది. గడిచిన నాలుగు నెలల కాలంలో దట్టమైన బస్తర్ అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో వందలాది చిన్నాపెద్దా సమావేశాలను పూర్తి చేసినట్లు వివరించింది. ఇందుకోసం బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల కోసం హోంశాఖ రూ. 1.62 కోట్లు కేటాయించిందని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సుమారు రూ.1,500 ఖరీదు చేసే ఈ రేడియోలు బ్యాటరీలతోపాటు కరెంట్ సాయంతోనూ పనిచేస్తాయన్నారు. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో 180 కంపెనీల బలగాల సాయంతో మొత్తం 10,800 రేడియో సెట్లను అందజేశామన్నారు. కుటుంబానికి ఒకరు చొప్పున కనీసం 54 వేల మందిని మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడేయటమే తమ లక్ష్యమని చెప్పారు. 2026 మార్చికల్లా మావోయిస్టులను పూర్తిగా ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సంక్షేమ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’సహా రేడియోలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలను గురించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని వారికి వివరిస్తున్నామని తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో మరిన్ని రేడియో టవర్లను ఏర్పాటు చేసి, స్థానికులకు రేడియో ప్రసారాలను అందుబాటులోకి తేవాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
‘పహల్గాం’ ముష్కరులకు సాయమందించిన వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్: ఏప్రిల్ 22వ తేదీన కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడ్డ ముష్కరులకు సాయం అందించాడనే ఆరోపణలపై పోలీసులు మహ్మ ద్ యూసుఫ్ కటారి(26) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ)గా పనిచేస్తున్న ఇతడు ఆ ఉగ్ర వాదులను నాలుగుసార్లు కలిశాడని, వారికి ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్ను అందించాడని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆధారం దొరకడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రిసార్టు పట్టణం పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముష్కరులను సులేమాల్ అలియాస్ ఆసి ఫ్, జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గు ర్తించారు. వీరిని శ్రీనగర్ వెలుపల ఉన్న జబర్వాన్ కొండల్లో మూడు, నాలుగు పర్యాయాలు కలుసుకు న్నట్లు ఇతడు విచారణలో వెల్ల డించాడన్నారు. విషాదం చోటుచేసుకున్న ప్రాంతంలో లభించిన వివిధ వస్తువుల్లో సగం ధ్వంసమైన ఛార్జెర్ కూడా ఉంది. దీన్ని ఎవరు, ఎవరికి విక్ర యించారనే విషయంపై జరిపిన దర్యాప్తులో కటారి విషయం వెలుగు చూసిందన్నారు. అక్కడి కొండ ప్రాంతాలపై గట్టి పట్టున్న కటారి విద్యార్థులకు గైడ్ గా వ్యవహరిస్తుంటాడు. అదే సమయంలో, ఇతడు ఉగ్రవాదులకు సైతం మార్గదర్శిగా ఉంటూ, వారికి అవసరమైన సెల్ ఛార్జెర్ వంటి వాటిని సమకూ ర్చాడు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు మద్దతిచ్చే నెట్వర్క్ను నిర్వీర్యం చేయడంలో కటారి అరెస్ట్ ముఖ్యమైన ముందడుగుగా పోలీసులు భావిస్తు న్నారు. కాగా, బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహ దేవ్ సమయంలో పహల్గాం ముష్కరులు ముగ్గు రూ హతమవడం తెల్సిందే. పహల్గాం ఉగ్ర ఘటన వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసే లక్ష్యంతో విచారణ సాగిస్తున్న జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) ఇప్పటికే ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చా రన్న ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసింది. -
అసోం బోడోల్యాండ్ కౌన్సిల్ చీఫ్గా మొహిలరీ
కొక్రాఝర్: అసోం రాష్ట్రంలోని బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్(సీఈఎం)గా హగ్రమ మొహిలరీ ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఈఎంగా మాజీ మంత్రి రిహొన్ డైమరీ కూడా ప్రమాణం చేశారు. కొక్రాఝర్లోని బోడోల్యాండ్ సెక్రటేరియట్ ఫీల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటా ప్రమాణం చేయించారు. గవర్నర్ ఎల్పీ ఆచార్య, సీఎం హిమంత బిశ్వ శర్మ, పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మొహిలరీ ఈ పదవీ బాధ్యతలను చేపట్టడం ఇది నాలుగోసారి. సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 40 సీట్లకుగాను 28 సీట్లను సొంతం చేసుకుంది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్) బీజేపీలు కలిసి ఏడింటిని, ఇతరులు ఐదు సీట్లను గెలుచుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్తగా ఎన్నికైన బీపీఎఫ్ సభ్యులు డోట్మాలోని బోడో నేత బొడొఫా ఉపేందన్రాథ్ బ్రహ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 2020 జనవరి 27వ తేదీన ఢిల్లీలో జరిగిన తాజా బోడో ఒప్పందం అనంతరం జరిగిన రెండో ఎన్నికలివి. మొదటి దఫా ఎన్నికల్లో బీపీఎఫ్ 17 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, గణ సురక్ష పరిషత్, బీజేపీ, యూపీపీఎల్ కలిసి బోడో కౌన్సిల్ ఏర్పాటు చేశాయి. కాగా, అసోం బోడోల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ చీఫ్గా ప్రమాణం చేసిన హగ్రమ మొహిలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రం, అసోం ప్రభుత్వం బీటీసీ కౌన్సిల్కు పూర్తి మద్దతు కొనసాగిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. బీటీసీ ఏం చేస్తుందంటే..కొక్రాఝర్, చిరంగ్, బక్సా, ఉదల్గిరి, తముల్పూర్ జిల్లాలను కలిపి ఏర్పాటైందే బీటీసీ. సుమారు 9 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించిన ఉన్న బోడోలు మెజారిటీగా కలిగిన ఈ ప్రాంతంపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను బీటీసీ కలిగి ఉంటుంది. 1993లో జరిగిన ఒప్పందం ప్రకారం, బోడోలాండ్ భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన పరిపాలనా విభాగం. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు
లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్ధాఖ్ ప్రజలకు సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారటంతో నలుగురు వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసి రాజస్తాన్లోని జో«ద్పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్చుక్ సోదరుడు క సెతన్ దోర్జీ లేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్ధాఖ్ ప్రజలకు వాంగ్చుక్ సందేశం పంపారు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకోసం ప్రారి్థంచినవారందరికీ ధన్యవాదాలు. లేహ్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అరెస్టయినవారు ధైర్యంగా ఉండాలని ప్రారి్థస్తున్నాను. గత నెల 24న జరిగిన ఘర్షణపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా. అలా విచారణ జరగని పక్షంలో నేను జైల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా. లద్దాఖ్కు రాష్ట్రహోదా ఇచ్చి ఆరో షెడ్యూల్ చేర్చాలన్న లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. డిమాండ్ల సాధన కోసం ప్రజలంతా శాంతియుతంగా, ఐకమత్యంతో సంపూర్ణంగా గాంధీ మార్గంలో పోరాటం చేయండి’అని వాంగ్చుక్ ఇచ్చిన సందేశాన్ని ముస్తఫా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేహ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిరసనకారులను సోమవారం చర్చలకు ఆహా్వనించింది. అయితే, వాంగ్చుక్తోపాటు పోలీసులు అరెస్టు చేసినవారందరినీ విడుదల చేసి, లేహ్ ఘటనపై జ్యుడీíÙయల్ విచారణకు ఆదేశించేంతవరకు చర్చల్లో పాల్గొనబోమని ఎల్ఏబీ, కేడీఏ తేల్చి చెప్పాయి. -
అమెరికాకు.. స్టెమ్ భారతీయులే!
హెచ్ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ( స్టెమ్) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.అనుభవం.. అవకాశాలు!చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు.. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.‘స్టెమ్’ మీద దెబ్బఅమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే. ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్నవారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం. -
పారదర్శకత కోసం 17 మార్పులు
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషీతో కలిసి జ్ఞానేశ్కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజి్స్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)ను సంబంధిత ఓటర్కు అందజేయడానికి ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. మార్పుల్లో కీలకమైనవి..→ బిహార్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల జనం బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తక్కువ మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డుకెక్కనుంది. → ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల బిహార్లో అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొత్తం కేంద్రాల సంఖ్య 90,712కి చేరుకోనుంది. → ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) బ్యాలె ట్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి కలర్ ఫోటోలు ముద్రించబోతున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపెంచేలా పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం ఈవీఎంలపై నలుపు తెలుపు రంగు ఫొటోలే ఉంటున్నాయి. దీనివల్ల అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిహార్లో ఈ కష్టాలకు తెరపడినట్లే. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచి్చంది. దేశంలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు ముద్రించిన మొట్టమొదటి ఎన్నికలుగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కబోతున్నాయి. → ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్–లెవెల్ అధికారులకు అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. తద్వారా ఓటర్లు వారిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. → బిహార్ ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కవరేజీని తప్పనిసరి చేశారు. అనుమానాలకు తావులేకుండా ప్రతి అంశాన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు. → పోలింగ్ కేంద్రాల వల్ల మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు. → పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17సీని అందజేస్తారు. ఫామ్ 17సీలోని వివరాలకు, ఈవీఎం కౌంటింగ్ యూనిట్లలోని ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైతే దానికి సంబంధించిన వీవీప్యాట్లను రీకౌంటింగ్ చేస్తారు. → ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 22వ తేదీలోగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలు ఉండగా, వీటిలో 38 ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కోసం బూత్–లెవెల్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామన్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 243 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులను(ఈఆర్ఓ) నియమించామని తెలిపారు. ఎస్ఐఆర్ను జూన్ 24న ప్రారంభించామని, ఈఆర్ఓతోపాటు బూత్–లెవెల్ అధికారుల సాయంతో గడువులోగా విజయవంతంగా పూర్తిచేశామని వివరించారు. ఎస్ఐఆర్ విజయవంతం అయినందుకు ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో చురుగ్గా భాగస్వాములు కావాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఛత్ వేడుకలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల పండుగలో పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. బిహార్లో 90,217 మంది బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ నిర్వహించారని, అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేశ్ కుమార్ ప్రశంసించారు. ఓటర్ల జాబితా శుద్ధీ్ధకరణ విషయంలో మొత్తం దేశానికే వారు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. బిహార్లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు. -
సంపన్న దేశాల.. ఆహార విధ్వంసం
ప్రపంచంలోని సంపన్న దేశాల ఆహారపుటలవాట్లు మారితే.. చాలావరకు కాలుష్యం తగ్గిపోతుంది! చెప్పాలంటే 30 శాతం సంపన్నుల వల్ల.. 70 శాతం ఆహార సంబంధ పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి!! ప్రపంచ ప్రసిద్ధ ‘ఈఏటీ – లాన్సెట్ కమిషన్’ వెల్లడించిన వాస్తవమిది. ఇటీవలి కాలంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆహార తయారీలో వాడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్స్, పురుగుమందులు.. ఇవన్నీ పెనుముప్పును తెచ్చిపెట్టనున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార వ్యవస్థలు మారకపోతే భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం కలగా మారిపోతుందని హెచ్చరించింది.ఈఏటీ – లాన్సెట్ కమిషన్లో.. 6 ఖండాల్లో ఉన్న అనేక దేశాల్లోని పోషకాహార, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక శాస్త్రాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు సభ్యులు. ‘ఆహార ఉత్పత్తి, వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారాలు.. శిలాజ ఇంధనాల కంటే ప్రమాదకరమైనవి’ – వీళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేసినా.. ప్రస్తుత ఆహార వ్యవస్థలు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పెంచగలవని వీరు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యవస్థల వల్ల ఏటా 16 – 17.7 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇవి మొత్తం భౌగోళిక ఉద్గారాల్లో 30 శాతం!5 లక్షల కోట్ల డాలర్లు!ఇప్పుడున్న ఆహార వ్యవస్థలు ఇలాగే కొనసాగితే.. ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని.. అనేక దేశాల శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ‘ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్’ అంచనా వేసింది. అదే, ఈ ఆహార వ్యవస్థలకు కొత్త రూపు ఇస్తే ఆరోగ్యకరమైన సమాజం, పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవం వంటి పరిణామాల వల్ల ఏటా 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని చెబుతోంది. ఈ మార్పులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ వంటివి 33 శాతం తగ్గాలని తెలిపింది. పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి 63 శాతానికి పెరగాలని సూచించింది. ఇందుకోసం కమిషన్ మరో 8 పరిష్కార మార్గాలనూ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఇవన్నీ అమలు జరిగితేనే.. 2050 నాటికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భూమిపై ఉండే 960 కోట్ల జనాభాకూ ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపింది.అష్ట పరిష్కారాలు⇒ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచడం⇒ సంప్రదాయ వంటకాలు / ఆహారాలను పరిరక్షించడం⇒ సుస్థిర ఉత్పత్తి పద్ధతులు అమలు చేయడం⇒అడవుల వంటి చెక్కుచెదరని పర్యావరణ వ్యవస్థలను కాపాడటం⇒ ఆహార వృథాను అరికట్టడం⇒ గౌరవప్రదమైన వృత్తి లేదా పని, తద్వారా గౌరవప్రదమైన సంపాదన⇒ అణగారిన వర్గాలపై వివక్ష చూపకుండా ఉండటం⇒ అణగారిన వర్గాల వారికి అన్ని అవకాశాలూ కల్పించడంపీహెచ్డీ ఆహారంప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సమస్యలకు పరిష్కారంగా ‘ప్లానెటరీ హెల్త్ డైట్ (పీహెచ్డీ)’ ఆహారాన్ని ఈఏటీ – లాన్సెట్ కమిషన్ సూచించింది. ఇందులో మొక్కల నుంచి వచ్చే ఆహారం పాళ్లు ఎక్కువగా, జంతువుల నుంచి వచ్చే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ఉప్పు చాలా మితంగా ఉంటాయి. పీహెచ్డీ ఆహారం వల్ల టైప్ 2 మధుమేహం, హృద్రోగాలు, కేన్సర్ల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచిదని రుజువైంది. ఆహార వ్యవస్థల వల్ల వచ్చే ఉద్గారాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే..⇒ మూడో వంతు వ్యవసాయం నుంచి⇒ మూడో వంతు భూ వినియోగ మార్పిడి ద్వారా⇒ మూడో వంతు ప్రాసెసింగ్, రవాణా, రిటైల్ వంటి సరఫరా వ్యవస్థల వల్ల -
‘ఇలాంటి వ్యక్తా ప్రభుత్వాన్ని నడిపేది’.. సీఎం నితిష్ కుమార్ వీడియో వైరల్
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సీఎం నితీశ్ కుమార్ తీరు మరోసారి చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభంలో ఓ కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. దీంతో నితీశ్ పరిపాలనపై ప్రశ్నలు తలెత్తాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో నితీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ అబ్బే ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరంటూ’ ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థిరంగా మాట్లాడలేకపోతే ఎలా?’అని ప్రశ్నించారు. అలాగే, ఆయన పాలనలో బిహార్ పూర్తిగా గందరగోళంగా మారిందని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. నితీశ్పై తేజస్వీ చేసిన విమర్శల్ని జేడీయూ నేతలు ఖండిస్తున్నారు. నితీశ్ కుమార్ అనుభవజ్ఞుడు. ఆయనపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బిహార్ రాజకీయాల్లో ఈ ఘటన మరో మలుపు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వానికి పారదర్శకత అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Nitish Kumar theek toh hai na ? Ye jo kar rahe hai ye bilkul achha nahi lagta hai dekhne mein !pic.twitter.com/Etev7K8tKG— Surbhi (@SurrbhiM) October 5, 2025 -
నేపాల్లో ప్రకృతి విలయం
కఠ్మాండు/న్యూఢిల్లీ: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నేపాల్లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి జాడ తెలియాల్సి ఉందని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారన్నారు. నేపాల్లోని ఏడు ప్రావిన్స్లకు గాను ఐదు ప్రావిన్స్ల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వం సోమవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. కోషి ప్రావిన్స్లోని ఇలమ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలో 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్లో కొండచరియ విరిగి ఓ నివాసంపై పడటంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఆరుగురు చనిపోయారని అధికారులు వివరించారు. ఖొటంగ్, రౌటహట్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు బలయ్యారు. Heavy rainfall across the Kathmandu Valley today has caused the Bagmati River to swell significantly, leading to elevated water levels and localized flooding risks. 📍Sanepa Bridge🎥Trending Nepal pic.twitter.com/WN0xTR733e— Naveen Reddy (@navin_ankampali) October 5, 2025పంచ్తర్ జిల్లాలో కుంభవృష్టి కారణంగా రోడ్లు దెబ్బతినడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. లంగంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. రసువా జిల్లాలో నలుగురు, ఇలమ్, బారా, కఠ్మాండుల్లో ఒక్కొక్కరు చొప్పున వరదల్లో కొట్టుకుపోయారని అధికారులు వివరించారు. ఆదివారం మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగవడంతో రాజధాని కఠ్మాండులోకి ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను అనుమతించారు. అయితే, వర్షాల తీవ్రతకు అక్కడక్కడా రోడ్లు కొట్టుకుపోయి దెబ్బతినడంతో వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, నేపాల్ ప్రజలు జరుపుకునే అతిపెద్దదైన దుషైన్ పండుగ ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి కఠ్మాండుకు తిరిగి వచ్చే వారితో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాత్రి వేళ వాహనదారులు ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లు కొట్టుకుపో యాయని, కొండచరియల ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్ని రహదారులను ముందుజాగ్రత్తగా మూసివేశామన్నారు. ఆగకుండా కురుస్తున్న వానలు, దృగ్గోచరత తక్కువగా ఉండటంతో కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శనివారం విమానాల రాకపోకలను నిలిపివేశారు.ఆదుకుంటాం: మోదీనేపాల్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మిత్ర దేశం నేపాల్కు ఎలాంటి అవసరము న్నా ముందుగా స్పందించి ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
Birmingham: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
బర్మింగ్హామ్: ఎయిర్ ఇండియా విమానానికి కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పిన ఉదంతం చోటుచేసుకుంది. భారత్లోని అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానంలో గాలిలో ఉన్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ కోసం విమానం కిందకు దిగుతున్న సమయంలో దానిలోని అత్యవసర పవర్ యూనిట్ ‘ర్యామ్ ఎయిర్ టర్బైన్’ (ఆర్ఏటీ) ఊహించని రీతిలో తెరుచుకుంది. అయితే, పైలట్లు అప్రమత్తమై ఎంతో చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. Air India spokesperson says, "The operating crew of flight AI117 from Amritsar to Birmingham on 04 October 2025 detected deployment of the Ram Air Turbine (RAT) of the aircraft during its final approach. All electrical and hydraulic parameters were found normal, and the aircraft…— ANI (@ANI) October 5, 2025ఏఐ117 విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బర్మింగ్హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్కు ఉపక్రమిస్తున్న తరుణంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులుగానీ, సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్కు వెళుతున్న ఏఐ117 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. అయితే ఆ సమయంలో విమానంలోని ఇతర వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని పేర్కొంది.ల్యాండింగ్ అనంతరం విమానంలో నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ అంతరాయం కారణంగా బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. సంస్థకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని ఎయిర్ ఇండియా మరోమారు స్పష్టం చేసింది. -
శబరిమల టీడీబీ కేసు.. అది బంగారం కాదు రాగి: ఉన్నికృష్ణన్
తిరువనంతపురం: శబరిమల బంగారు పూత వివాదంలో విజిలెన్స్ ముందు ఆరోపణలను ఉన్నికృష్ణన్ పొట్టి ఖండించారు. అంతకుముందు చెప్పినట్టే తన ప్రకటనను పునరావృతం చేస్తూ తనకు అందినవి రాగి పలకలని చెప్పాడు. ఉన్నికృష్ణన్ పొట్టి ప్రకారం.. అధికారుల పొరపాటు వల్ల ఈ సంఘటన జరిగింది. పత్రాలలో నమోదు చేయబడినట్లుగా అధికారులు రాగి పలకలను అందజేశారని, అధికారిక తప్పిదానికి తనను ఎందుకు నిందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.ఈ సందర్భంగా దేవస్థానం మాన్యువల్ గురించి తనకు తర్వాతే తెలిసిందని పొట్టి అన్నారు. దేవస్థానం విజిలెన్స్ నిన్న ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఉన్నికృష్ణన్ పొట్టిని దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరించానని , విచారణ బృందం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని ఆయన మీడియాకు తెలిపారు. ఎస్పీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఈ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.అయితే , పొట్టి ప్రకటనలు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డును క్లిష్ట పరిస్థితిలో ఉంచాయి. ఆలయం నుండి అప్పగించబడిన రాగి షీట్లు అని ఆయన ప్రధాన వాదనగా ఉంది. ఇది.. 1999లో UB గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా బంగారు పూత పూసినట్లు నిర్ధారించబడిన రికార్డులకు విరుద్ధంగా ఉంది. ద్వారపాలక శిల్పాల నుండి వచ్చిన అసలు బంగారు పూత పూసిన ప్యానెల్కు ఏం జరిగిందో బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. ఇంతలో ఈ కేసుపై ప్రాథమిక విచారణ నిర్వహించడంపై పోలీసులు న్యాయ సలహా కోరుతున్నారు. అనుమతి లభించిన తర్వాత పతనంతిట్ట పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమవుతుంది. ‘బంగారం’పై హైకోర్టుకెళ్తాం.. బోర్డు ప్రకటనశబరిమలలో బంగారం దుర్వినియోగంపై కేరళలోని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఈ అంశంపై సంపూర్ణ దర్యాప్తునకు ఆదేశించాలని హైకోర్టుకు వెళ్లనున్నట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ శనివారం ప్రకటించారు. శబరిమల ఆలయానికి బంగారు తాపడం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ప్రశాంత్ స్పందిస్తూ.. బోర్డును రాజకీయాల్లోకి లాగటానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 1998లో ఆలయానికి బంగారు తాపడం ప్రాజెక్టుకు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పాన్సరర్గా వ్యవహరించారని, అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో ఏం జరిగిందో పూర్తిగా దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరనున్నట్లు వెల్లడించారు. ఆలయ ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం పలకలను మార్చేందుకు చెన్నైకి పంపటంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని స్పష్టంచేశారు. -
Cough Syrup Row: ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యదర్శులు, డ్రగ్ కంట్రోలర్లు పాల్గొనే ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణంగా సిఫార్సు చేసే దగ్గు మందులపై విశ్లేషణ చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.కోల్డ్రిఫ్ సిరప్కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. ఈ నివేదిక అనంతరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడులోని సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కు చెందిన ఇతర ఔషధ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం ప్రకటించింది. దగ్గు మందు కారణంగా చిన్నారులు మరణించిన ఉదంతంలోచింద్వారాకు చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేశారు.రాజస్థాన్లో..రాజస్థాన్లోని భరత్పూర్, సికార్లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ తెలిపారు. సిరప్ తీసుకున్న తర్వాత బాధితులు వాంతులు, తల తిరగడం, మూర్ఛపోవడం లాంటి సమస్యలకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ వెంటనే ఈ ఔషధాలను నిషేధించి, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలకు నమూనాలను పంపిందని మంత్రి తెలిపారు. కాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తన తాజా సూచనలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ను రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదని, ఐదేళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే సూచించాలని తెలిపింది.తమిళనాడులో..మధ్యప్రదేశ్లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ అమ్మకాలను తమిళనాడు అంతటా నిషేధించినట్లు ఆహార భద్రత- ఔషధ పరిపాలన శాఖ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ టీపీటీఐ తెలిపింది. కాంచీపురం జిల్లాలోని సుంగువర్చత్రంలోని ఈ ఔషధ సంస్థ తయారీ కేంద్రంలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించారు. నమూనాలను సేకరించి, సంబంధిత ల్యాబ్కు పంపారు. ఈ కంపెనీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరికి మందులను సరఫరా చేసిందని సమాచారం.ఉత్తరాఖండ్లో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్ల కారణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్లు, హోల్సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. ఉత్తరాఖండ్ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ఆర్ రాజేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఔషధ దుకాణాల నుండి దగ్గు సిరప్ల నమూనాలను సేకరించి, వాటిని ప్రయోగశాలకు పంపాలని ఆదేశించారు. -
తమిళనాట ట్విస్ట్.. కరూర్ ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడులోని(Tamil Nadu) కరూర్(Karur Stampede) ఘటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని టీవీకే మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే నేతల ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తూ.. బీజేపీ(BJP Party) నాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్(Khusbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.కరూర్ తొక్కిసలాట ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారు. కానీ, ఈ ప్రమాదం ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్(TVK Vijay) ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదు. విజయ్ ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసు. అయినా కూడా ఇలా ర్యాలీకి తగిన స్థలం కేటాయించలేదు.VIDEO | Chennai: “Tamil Nadu CM MK Stalin should switch from mute mode, speak on Karur stampede”, says actor and BJP leader Khushbu Sundar (@khushsundar) raising questions on various viral videos of Karur tragedy.#KarurStampede (Full video available on PTI Videos -… pic.twitter.com/Fm587TeDvf— Press Trust of India (@PTI_News) October 4, 2025తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.విజయ్కు బీజేపీ అగ్రనేత ఫోన్.. మరోవైపు.. కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా టీవీకే విజయ్తో బీజేపీ అగ్రనేత ఒక్కరు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!. -
ప్రియురాలిని లాడ్జికి పిలుచుకెళ్లిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్ర: వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన ప్రియుడు మోసగించాడని మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. యశోద ఆత్మహత్య చేసుకొన్న మహిళ. మృతురాలు యశోదకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క వీధిలో ఉన్న ఆడిటర్ విశ్వనాథ్ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే కొంతకాలం క్రితం యశోద తన స్నేహితురాలిని ప్రియుడు విశ్వనాథ్కి పరిచయం చేసింది. దీంతో ప్రియుడు యశోద స్నేహతురాలితో చనువు పెంచుకొని ఆమెను ప్రేమ వలలో పడేశాడు. అంతేకాకుండా ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ విషయం యశోద చెవిలో పడింది. ప్రియుడితో కలిసి స్నేహితురాలు ఉన్న లాడ్జికి వెళ్లి గొడవ పడింది. ప్రియుడు సరిగా స్పందించకపోవటంతో మనోవేదనతో అక్కడే పక్క గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మాగడి రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
Darjeeling: కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం.. శిథిలాల కింద మరింత మంది..
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిరిక్- కుర్సియాంగ్ పర్యాటక ప్రదేశాలను కలిపే దుడియా ఐరన్ వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండచరియలు విరిగిపడ్దాయి.ఉత్తర బెంగాల్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమయ్యింది. డార్జిలింగ్లోని మిరిక్, సుఖియా పోఖారిలలో కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పశ్చిమ బెంగాల్ - సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్- సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్పైగురి, సిలిగురి, కూచ్బెహార్లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చిత్రే, సెల్ఫీ దారా తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.సోమవారం ఉదయం వరకు పశ్చిమ బెంగాల్లోని ఉప-హిమాలయ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి, అలీపుర్దువార్ జిల్లాలలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర బెంగాల్లోని పొరుగు జిల్లా అలీపుర్దువార్లో సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన బులెటిన్లో పేర్కొంది.పశ్చిమ జార్ఖండ్, దక్షిణ బీహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్ల మీదుగా ఆవరించిన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా బీహార్ వైపు కదిలి, క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముర్షిదాబాద్, బిర్భూమ్, నదియా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని, బంకురాలో అత్యధికంగా 65.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఐదుకి మించి చలాన్లు ఉన్నాయా?.. వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ల(Traffic Challans) చెల్లింపు విషయంలో కేంద్రం కీలక సవరణలను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. 45 రోజుల్లోగా చలాన్లు కట్టాలి.. వాహనాలపై ఐదుకు మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు కావచ్చు. ఇకపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.వివరాల ప్రకారం.. సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో(Motor Vehicles Act) కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ క్రమంలో చలాన్లపై చర్యల విషయమై కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.కొత్త రూల్స్ ప్రకారం.. 👉ఎంవీ(మోటారు వెహికిల్) యాక్టు ప్రకారం.. ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్ చేసే అధికారం ఉంది.👉అంతేకాకుండా లైసెన్స్ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు కూడా అలాగే కొనసాగుతాయి.👉కొత్త నిబంధనల ప్రకారం.. చలాన్ చెల్లింపు గడువును 45 రోజుల్లో కట్టాల్సిందే. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ చెల్లించాలి.👉చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.👉ఒకవేళ చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే.. సదరు వాహనంపై రవాణాశాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు.👉ఈ కారణంగా వాహనం అమ్మకం, కొనుగోలు వంటి జరగలేవు. లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతోపాటు రెన్యువల్ కూడా కుదరదు.👉ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి.👉కొత్త రూల్ ప్రకారం.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడు అవుతారు.అభ్యంతరాల స్వీకరణ..కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చని సూచించింది. -
Bihar Election: ఎన్నికల బరిలో సనాతన అభ్యర్థులు: అవిముక్తేశ్వరానంద సరస్వతి
పట్నా: ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్తో పాటు, వివిధ పార్టీలు సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. తాజాగా జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సనాతనుల సత్తాను చాటేందుకు రాబోయే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.బీహార్లోని బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో సనాతన లక్ష్యాలకు కట్టుబడిన అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు వారంతా చురుకుగా పాల్గొంటారని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో సామాజిక సమస్యల పరిష్కార లక్ష్యం కలిగి, గో రక్షణతో పాటు సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్న తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని శంకరాచార్య ఓటర్లను కోరారు.పట్నాలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన స్వామి అవిముక్తేశ్వరానంద.. గో రక్షణ కేవలం మత విశ్వాసానికి సంబంధించినది మాత్రమే కాదని, సమాజం, సంస్కృతికి పునాది అని స్పష్టం చేశారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే డిమాండ్తో తాను ఢిల్లీలోని జాతీయ పార్టీలను సంప్రదించానని, కానీ దీనిపై స్పష్టమైన స్పందన రాలేదని అన్నారు. బీహార్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తర్వాత అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. అయితే ఏదైనా పార్టీ అభ్యర్థి గో సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆ నియోజకవర్గాల్లో, తాము తమ అభ్యర్థిని నిలబెట్టబోమని తెలిపారు.ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని బ్రహ్మన్పూర్ గ్రామంలో 1969, ఆగస్టు 15న జన్మించిన ఉమాశంకర్ ఉపాధ్యాయ, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రి, ఆచార్య డిగ్రీలను పూర్తి చేశారు. 2003, ఏప్రిల్ 15న దండ్ సన్యాసం తీసుకున్నాక ఆయన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిగా మారారు. 2022,సెప్టెంబర్లో ఆయన జ్యోతిష్య పీఠానికి శంకరాచార్యగా నియమితులయ్యారు.ఆయన గో రక్షణ, సనాతన సంప్రదాయాల పునరుద్ధరణ తదితర అంశాలపై చాలాకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో అవిముక్తేశ్వరానంద సరస్వతి ‘గంగ’ను జాతీయ నదిగా ప్రకటించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. -
Cough Syrup Row: వైద్యుడు అరెస్ట్.. కంపెనీపై కేసు నమోదు
భోపాల్: మధ్యప్రదేశ్లోని చింద్వారాలో పిల్లలకు ప్రమాదకర దగ్గు సిరప్ను సూచించిన వైద్యుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ సోని సూచించిన దగ్గు సిరప్ తీసుకున్న 11 మంది చిన్నారులు మరణించిన ఉదంతం వివాదాస్పదంగా మారింది. పరాసియాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని తన క్లినిక్లో పలువురు చిన్నారులకు చికిత్స అందించిన దరిమిలా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ సిరప్ను తయారు చేసిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై కేసు నమోదు చేసింది.ప్రభుత్వం ఇప్పటికే కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ ఔషధ నమూనాలలో 48.6శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉంది. ఇది అత్యంత విషపూరితమైన పదార్థమని అధికారులు తెలిపారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలో ప్రభుత్వ ఔషధ విశ్లేషకులు ఈ సిరప్ నమూనాను పరీక్షించిన దరిమిలా తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ‘కోల్డ్రిఫ్’ప్రామాణిక నాణ్యత లేనిదని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వం మరొక దగ్గు సిరప్ ‘నెక్స్ట్రో-డిఎస్’ అమ్మకాలను కూడా నిషేధించింది. కోల్డ్రిఫ్ పరీక్ష రిపోర్టు శనివారమే బయటకు రాగా, నెక్స్ట్రో-డిఎస్ నివేదిక రావాల్సివుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారి చిన్నారులు తొలుత జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. ఈ సమయంలో వైద్యులు వారికి దగ్గు సిరప్తో సహా సాధారణ మందులు సూచించారు. ఆ తర్వాత వారు కోలుకున్నట్లు కనిపించినా, తిరిగి అవే అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మూత్ర విసర్జనలో తేడా కూడా కనిపించింది. పరిస్థితి మరింతగా దిగజారి అది, కిడ్నీ ఇన్ఫెక్షన్గా మారింది. ఆ తరువాత వారు మృతిచెందారు. మృతుల కిడ్నీ బయాప్సీలో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ పదార్థం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ మరణాలు చాలా విషాదకరమైనవని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధించారని, సిరప్ తయారీ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించనున్నామని ఆయన తెలిపారు. -
తమిళనాడులో మరో ట్విస్ట్.. గవర్నర్కు వ్యతిరేకంగా ‘సుప్రీం’లో పిటిషన్
సాక్షి, చెన్నై: గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్(RN Ravi) ఎడతెగని జాప్యం చేస్తూ చివరకు రాష్ట్రపతికి పంపించినట్లు ఆరోపించింది.వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం(MK Stalin) మధ్య వివిధ అంశాలపై నెలకొన్న వివాదాలు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘సుప్రీం’ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీల వ్యవహారాలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించుకుంది. ఈ పరిస్థితుల్లో కుంభకోణంలో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్ణయించింది.అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ ముసాయిదా రాజ్భవన్కు చేరింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు రాజ్భవన్ నుంచి ఆమోదం రాలేదు. తాజాగా.. ఈ ముసాయిదాను రాష్ట్రపతికి పంపించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ వర్సిటీ సాధన కోసం డీఎంకే ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా చదవండి: మీరేం ఒంటరి కాదు.. విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు! -
సన్ రైజ్ సెక్టార్గా మత్స్య రంగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, ’సన్రైజ్ సెక్టార్’గా మత్స్య రంగం శరవేగంగా అభివద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తూ, ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ఫలితంగా ఈ రంగంలోకి రూ. 38,572 కోట్ల పెట్టుబడులు రాగా, 2023– 24లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.60,524 కోట్లకు చేరాయి. ఏటా 8.74% వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఈ రంగంలో సుస్థిర అభివద్ధిని సాధించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో మత్స్యకారులు, రైతులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర మత్స్యశాఖ ఒక బహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి నేతృత్వంలో 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 15,000 మందికి పైగా మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను, సవాళ్లను నేరుగా ప్రభుత్వానికి నివేదించారు.క్షేత్రస్థాయిలో అందిన కీలక సూచనలుసమావేశాల్లో మత్స్యకారులు తమ కు అవసరమైన మద్దతుపై స్పష్టమైన సూచనలు చేశారు. నాణ్యమైన చేప పిల్లలు, తక్కువ ధరకే మేత, కోల్డ్ స్టోరే జీలు, రవాణా సౌకర్యాలు మెరుగుపర చాలని కోరారు. డ్రోన్లు, శాటిలైట్ టెక్నా లజీ వంటి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం ఉచి తంగా అందించిన ట్రాన్స్పాండర్లు తమ భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని, సముద్రపు నాచు, అలంకార చేపల పెంపకం వంటి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించాలని కోరారు.రైతు కేంద్రంగానే మా విధానాలు: డాక్టర్ అభిలక్ష్ లిఖిఈ సందర్భంగా డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడుతూ, ’మత్స్యకారులు, విధాన రూపకర్తల మధ్య ఈ సమావేశాలు బలమైన వారధిని నిర్మించాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన ఈ సూచనలు ’వికసిత భారత్ 2047’లక్ష్యానికి అనుగుణంగా మా భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా నిలుస్తాయి. ఈ రంగంలో వృద్ధి సమ్మిళితంగా, రైతు కేంద్రంగా ఉండేలా చూస్తాం’అని తెలిపారు. మొత్తంగా, భారీ పెట్టుబడులతో పాటు క్షేత్రస్థాయి భాగస్వామ్యంతో మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
8న బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ రాక
న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 9న ముంబైలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. విజన్–2035 రోడ్మ్యాప్లో భాగంగా భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టిన చర్యల పురోగతిని వారు సమీక్షిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారు. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో స్టార్మర్ ప్రసంగిస్తారు. స్టార్మర్ గత ఏడాది జూలైలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. -
జుబీన్ గార్గ్పై విషప్రయోగం
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామకాను మహంత.. గార్గ్కు విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పీటీఐకి అందిన అత్యంత కీలక పత్రం ప్రకారం.. గార్గ్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ జరిగిందని కూడా గోస్వామి పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. మహంత, అతని సంస్థ నిర్వహించిన 4వ ఈశాన్య భారతదేశ ఉత్సవంలో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ ఆగ్నేయాసియా దేశానికి వెళ్లారు. ‘గార్గ్ మునిగిపోతూ.. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న విపత్కర సమయంలో ’జబో దే, జబో దే’ (వదిలెయ్, వదిలెయ్) అని శర్మ అరిచాడని, గార్గ్ నిపుణుడైన ఈతగాడని, అతనే తనకీ, నిందితుడికీ ఈత నేర్పించాడు కాబట్టి మునిగిపోయే అవకాశం లేదని.. సాక్షి గోస్వామి స్పష్టం చేసినట్లు రిమాండ్ నోట్ పేర్కొంది. ‘శర్మ, మహంత.. జుబీన్కు విషం ఇచ్చారని, తమ కుట్రను దాచడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ వేదికను ఎంచుకున్నారని గోస్వామి ఆరోపించారు. -
ప్రిలిమినరీ తర్వాత తాత్కాలిక జవాబు కీ
న్యూఢిల్లీ: ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని నిర్ణయించినట్లు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత నెలలో అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లో.. తుది ఫలితాల ప్రకటన తర్వాతే తుది జవాబు కీని ప్రచురిస్తామని కమిషన్ తెలిపింది. ఈ అఫిడవిట్ను సివిల్ సరీ్వసెస్ పరీక్షకు సంబంధించి.. పెండింగ్లో ఉన్న పిటిషన్లో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సూచనతో సహా వివిధ అంశాలపై తాము చర్చించామని యూపీఎస్సీ పేర్కొంది. ‘సమగ్ర చర్చల అనంతరం.. బాగా ఆలోచించాక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని కమిషన్ నిర్ణయించింది.. అని అడ్వకేట్ వర్ధమాన్ కౌశిక్ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు లేదా ప్రాతినిధ్యాలు కోరతామని అందులో వివరించింది. అభ్యర్థులు తెలిపే ప్రతి అభ్యంతరం లేదా ప్రాతినిధ్యానికి మూడు ప్రామాణిక ఆధారాలను జత చేయాలని, అలా జత చేయని అభ్యంతరాలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని అఫిడవిట్లో తెలిపారు. ‘అయితే, సమర్పించిన ఆధారాలు ప్రామాణికమైనవా? కాదా? అనేది కమిషనే నిర్ణయిస్తుంది’.. అని కూడా అందులో స్పష్టం చేశారు. -
అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.టూ వీలర్లే అత్యధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.అతివేగం అనర్థదాయకంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం (1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.రాత్రిపూటే అధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి. -
అందరూ కాలేరు జన నాయక్లు
న్యూఢిల్లీ: విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోందని అన్నారు. శనివారం రూ.62,000 కోట్లకుపైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ.60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం చుట్టారు. బిహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్గా అభివృద్ధి చేయబోతున్నారు. బిహార్లో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు. బిహార్లో రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ దిగజారిందని, వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ కార్యకర్తలు ‘జన నాయక్’ అని పిలుస్తుండడాన్ని ప్రధానమంత్రి తప్పుపట్టారు. ఓబీసీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మాత్రమే ‘జన నాయక్’ అని తేల్చిచెప్పారు. ఆ గౌరవాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ జన నాయకులు కాలేరని రాహుల్ను ఎద్దేవా చేశారు. ఐటీఐలపై ప్రత్యేక దృష్టి ‘‘పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పారిశ్రామిక విద్యకు అత్యంత కీలకం. ఇవి ఆత్మనిర్భర్ భారత్కు వర్క్షాప్లుగా పని చేస్తున్నాయి. ఐటీఐల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 2014 వరకు దేశంలో 10,000 ఐటీఐలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు చేరుకుంది. పారిశ్రామిక నైపుణ్య అవసరాలను తీర్చేలా, రాబోయే పదేళ్లలో డిమాండ్ను తట్టుకొనేలా ఐటీఐ నెట్వర్క్ ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల ‘‘బిహార్ పురోభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. యువతకు గత 20 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదేళ్లలో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వేర్లకు చెదలు పట్టి ఎండిపోయిన చెట్టును బతికించడం కష్టం. ఇతర పార్టీల పాలనలో బిహార్ పరిస్థితి ఇలాగే ఉండేది. నితీశ్ కుమార్ పట్ల బిహార్ ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం బిహార్ను మళ్లీ దారిలో పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితంలో బిహార్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియదు. తమ బిడ్డలు స్థానికంగానే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, విపక్షాల పాలనలో లక్షలాది మంది బిహార్ను విడిచిపెట్టి బనారస్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. వలసలకు అప్పడే బీజం పడింది. ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత బిహార్ ప్రజలు సొంత రాష్ట్రానికి తిరిగి రావడం ఆరంభమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
మనకు నచ్చకపోతే వినేదే లేదు
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.చిన్న పిల్లల్లోనూ..షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.తప్పించుకునే ధోరణిఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.అన్ని వేళలా మంచిది కాదు‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.ఎందుకు తప్పించుకుంటారు?⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం -
‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రీంకోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించడమేనని వంగ గోపాల్రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 29న పిటిషన్ దాఖలు చేశారు.అంతేగాక స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను గోపాల్రెడ్డి సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ వర్గానికి కేటాయించే రిజర్వేషన్లు అయినా మొత్తం 50 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను అతిక్రమిస్తోందని పిటిషన్లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
లైవ్లో అమ్మేస్తున్నారు!
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్కు వీలవుతుంది.తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలుతాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.దశాబ్దాల నుంచి..వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్తో షాపింగ్ ఎక్స్పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్ప్రెస్ చెబుతోంది.వాయిదాలకు ఫుల్స్టాప్ఈ–కామర్స్ వెబ్సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్కే పరిమితం అవుతాయి. అదే లైవ్లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.ప్రత్యక్షంగా వీక్షించి..ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు. -
Cow Cess: ఇదేందయ్యా ఇది.. ఇది మేం చూడలే!
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లే అందుకు నిదర్శనం. అయితే బార్లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు. రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే.. ఆ తాగుబోతు రాజస్థాన్కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు. సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్ఛార్జ్గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
యూపీలో ఘోరం.. కుప్పకూలిన కోచింగ్ సెంటర్
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్పూర్ మండి రోడ్లోని ఒక భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఈ పేలుడు తీవ్రతకు భవనం పైకప్పుతో సహా ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. పేలుడు గ్యాస్ సిలిండర్ కారణామా? షార్ట్ సర్క్యూటా? లేదా పేలుడు పదార్థం వల్ల ఈ ఘటన జరిగిందా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో వైరల్: కుర్కురే కొనివ్వలేదా..? పోలీసులకు ఫోన్ చేయండి!
సింగ్రౌలి: కుర్కురే (Kurkure) కొని ఇవ్వలేదని ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని ఖుతార్ అవుట్ పోస్ట్ పరిధి ‘చితర్వాయి కలా’ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుర్కురే కొనివ్వమని 20 రూపాయలు అడిగినందుకు తన తల్లి, సోదరి తాడుతో కట్టి మరి కొట్టారంటూ పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కి ఫోన్ చేసి మరి ఆ కుర్రాడు ఫిర్యాదు చేశాడు.బాలుడు, పోలీసులు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ కుర్రాడు ఏడవడం మొదలుపెట్టాడు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది త్వరలోనే తాము వస్తామంటూ ఆ బాలుడిని ప్రేమతో ఓదార్చడమే కాకుండా.. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లారు. కుర్రాడిని, అతని తల్లిని పిలిచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కొట్టొదని తల్లికి చెబుతూ ఆ పిల్లాడికి కుర్కురే ప్యాకెట్లు కూడా కొని తెచ్చివడం విశేషం. ఈ వీడియో సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చివరికి ఆ కుర్రవాడి డిమాండ్ నెరవేరిందంటూ పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.बच्चे ने कुरकुरे की माँग की तो माँ ने कूट दिया। शिकायत पुलिस के पास पहुँची और माँग पूरी हो गई। वायरल वीडियो मध्य प्रदेश के सिंगरौली का है। pic.twitter.com/MqIcRKBB0w— SANJAY TRIPATHI (@sanjayjourno) October 4, 2025 -
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు: అమిత్షా
బస్తర్: మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలిస్తామని.. వారితో చర్చల ప్రసక్తే లేదంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మావోయిస్టులతో ఇక చర్చల ప్రసక్తే లేదన్న అమిత్ షా.. లొంగిపోవాల్సిందేనన్నారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని.. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామంటూ అమిత్ షా పేర్కొన్నారు. శనివారం ఆయన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం లేదని స్పష్టం చేశారు.మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్గఢ్ అభివృద్ధికి రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్ షా పిలుపునిచ్చారు. -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట -
బతికుండగానే హెడ్మాస్టర్కు కన్నీటి అంజలి.. అంతలోనే..!
తమిళనాడు: కళ్లకురిచి జిల్లాలోని ఊలుందూరుపేట సమీపంలోని కూంతలూరు గ్రామానికి చెందిన రామదాస్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేసి, రిటైర్డ్ అయ్యారు. తమిళనాడు టీచర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రామదాస్ గత 30వ తేదీన ద్విచక్ర వాహనంపై ఊలుందూరుపేట నుంచి తిరుచ్చి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. గాయపడ్డ రామదాస్ను పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు. ఈ పరిస్థితిలో గురువారం ఉదయం రామదాస్ మరణించినట్లు అక్కడి నుంచి సమాచారం అందింది. దీంతో బంధువులు, స్నేహితులు,సహ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటోలు పెట్టి కన్నీటి అంజలి ఘటించారు. బ్యానర్లు ఏర్పాటు చేసి ఆటోల్లో మృతి చెందిన విషయాన్ని ప్రచారం చేశారు. ఈస్థితిలో గురువారం రామదాస్ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో సజీవంగా అతని స్వగ్రామం కూంతలూరుకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. దీంతో బంధువులు, స్నేహి తులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. ఈక్రమంలో నిన్న మళ్లీ విలుప్పురం ముండియం పాక్కం ప్రభుత్వాస్పత్రిలో చేరిన రామదాస్ గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
Delhi: విదేశీ కోచ్లపై వీధి కుక్కల వీరంగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా, జపాన్ కోచ్లపై వీధి కుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలిపై కుక్క కరవడంతో అతనిని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడి బారినపడ్డారు. ఈ ఘటన దరిమిలా స్టేడియం భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో వీధికుక్కలను పట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది.వివరాల్లోకి వెళితే టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా కోచ్ను స్టేడియం ప్రాంగణంలోకి చొరబడిన వీధి కుక్క కరిచింది. దీనిపై అథ్లెట్లు, సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో వార్మప్ ట్రాక్పై అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కుక్క దాడికి గురయ్యారు. స్టార్టింగ్ బ్లాక్స్ను సరిచేస్తుండగా, వీధికుక్క అతని వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలిపై కరిచింది. అక్కడే ఉన్న మెడికల్ టీమ్ ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. తరువాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. డెన్నిస్ మరాగియాకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. 🚨 Stray dogs bites Kenyan & Japanese coaches at the JLN Stadium in New Delhi during the World Para Athletics C'ship 2025! Pretty scary & embarassing as host nation 🤦 pic.twitter.com/S3S4OkcP9q— The Khel India (@TheKhelIndia) October 3, 2025కెన్యా కోచ్పై జరిగిన దాడి తరువాత జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కుక్క దాడి చేసింది. దీంతో ఆమె ఎడమ కాలిపై తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలన్నీ స్టేడియం ట్రాక్లోనే జరిగాయి. ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియంలోనికి వీధికుక్కలు రాకుండా చూడాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు విజ్ఞప్తి చేసింది. స్టేడియం సమీపంలోనివారు ఇక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో అవి లోనికి ప్రవేశిస్తున్నాయని కమిటీ తెలిపింది. -
నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం.. అప్పగింతకు గ్రీన్ సిగ్నల్!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు యూకే సిద్ధమైంది. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని.. వచ్చే నెల 23వ తేదీన భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశం ఉంది. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. నీరవ్ మోదీకి భారత్లో అన్ని వసతులు కల్పిస్తామని, అత్యంత కట్టుదిట్టమైన ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఉంచుతామని భారత్ హామీ ఇవ్వడంతో బ్రిటన్ కోర్టు అందుకు అంగీకరించింది. దాంతో నీరవ్ మోదీని భారత్కు రప్పించాలని ప్రయత్నానికి మార్గం సుగుమం అయ్యింది. కాగా, ఈ ఏడాది జూలై నెలలో నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు నేహల్పై ఆరోపణలు ఉన్నాయి మనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
Gaza Issue: డొనాల్డ్ ట్రంప్పై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు.. ఫ్రెండ్స్కు వీడియోలు పంపిన భర్త
కర్ణాటక: ఓ వికృత భర్త నిజ స్వరూపాన్ని చూసి భార్య నిశ్చేష్టురాలైంది. పడక గదిలో రహస్యంగా కెమెరాలను అమర్చి భార్యతో సన్నిహితంగా వీడియోలను తీసుకున్న భర్త వాటిని స్నేహితులకు పం పించి పైశాచికానందం పొందాడు. సభ్య సమాజాన్ని విస్తుగొలిపే ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో శుక్రవారం వెలుగుచూసింది. బాధితురాలు, పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం..బెంగళూరుకు చెందిన సయ్యద్ ఇనాముల్ గతంలో పెళ్లయిం ది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి గతసెప్టెంబర్ బాధిత యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారం చేస్తానని, ఆస్తిపరుడిని అని చెప్పుకున్నాడు. 350 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన బైకు కట్నంగా తీసుకున్నాడు. తొలిరోజు నుంచే భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు 19మంది మహిళలతో సంబంధాలున్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. బెడ్ రూంలో కెమెరాలను ఏర్పాటు చేసి భార్యతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలను దుబాయ్లోని తన స్నేహితులకు పంపేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త సహకరించేవారు, వారూ వేధించేవారు. బయట సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కూడా సయ్యద్ భార్యను అవమానించేవాడు. దీంతో విసిగివేసారిన బాధితురాలు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో సయ్యద్ భార్య ఆరోపణలు నిజమేనని అంగీకరించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్, కంప్యూటర్ సీజ్ చేశారు. -
వాంగ్చుక్ నిర్బంధం అక్రమం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్చుక్ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్లోని జోథ్పూర్ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్ లాయర్ వివేక్ తన్ఖా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ చేపట్టి, వాంగ్చుక్ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్ యంత్రాంగం, లేహ్ డిప్యూటీ కమిషనర్, జోథ్పూర్ జైలు సూపరిటెండెంట్లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్చుక్, లద్దాఖ్లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్చుక్ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. వాంగ్చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్ (హెచ్ఐఏఎల్) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్చుక్కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్చుక్కు వెంటనే డాక్టర్తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు. -
జుబీన్ మృతిపై జ్యుడీషియల్ కమిటీ
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా సారథ్యంలో కమిషన్ ఏర్పాటవుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఈ మేరకు గౌహతి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారన్నారు. జుబీన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులు, కారణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఈ కమిషన్కు అందివ్వవచ్చని సీఎం అన్నారు. జుబీన్ వెంట ఉన్న అసోం అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ సభ్యులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19వ తేదీన జుబీన్ చనిపోవడం తెల్సిందే. ఆయన అక్కడ జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతా, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆ కార్యక్రమ బ్యాండ్ సభ్యులైన శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్ప్రభ మహంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఈత కొడుతుండగా జుబీన్కు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పడవలో వీరిద్దరూ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. జుబీన్ హత్యపై 10 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లయింది. జుబీన్ గార్గ్ మృతిపై నమోదైన 60కి పైగా కేసులను సీఐడీ విచారిస్తోంది. సింగపూర్ ఆస్పత్రిలో చేపట్టిన జుబీన్ గార్గ్ పోస్టుమార్టం నివేదికను ఆయన భార్య గరిమాకు అందించామని, గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి చేపట్టిన పోస్టుమార్టం నివేదిక శనివారం అందాక ఆమెకే ఇస్తామని, వాటిని బహిర్గతం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు. శ్యాంకను మహంతా కుంభకోణంపై ఈడీ, ఐడీ దృష్టిసారించాయి. మహంతా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, బినామీ పేర్లను ఆస్తులను కూడబెట్టారంటూ వచి్చన ఆరోపణలను ఈడీ, ఐడీ పరిశీలిస్తున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి కారణంగా ఆరోపణలున్న మహంతాను ఇప్పటికే అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసులు శ్యాంకను మహంతా గత 20 ఏళ్లుగా పాల్పడుతున్న ఆర్థిక అవకతవకలను గుర్తించారు. వీటి వివరాలను ఐడీ, ఈడీ అధికారులు ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వెళ్లి తెల్సుకున్నారు. -
కాంగ్రెస్ ఖాదీని మర్చిపోయింది
రొహ్తక్: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఖాదీ విషయమే మర్చిపోయిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఖాదీని ప్రోత్సహించేందుకు ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఖాదీ అంటే కేవలం డ్రస్ మాత్రమే కాదు, మన స్వదేశీ, ఆత్మనిర్భరతకు చిహా్నలని మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హరియాణాలోని రొహ్తక్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు. ‘స్వాతంత్య్రం వచ్చాక చేసిన దానికంటే ఖాదీ అభివృద్ధికి గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. అప్పట్లోనే ఖాదీకి ప్రోత్సాహం ఇచి్చనట్లయితే మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేదే కాదని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో మహాత్మాగాంధీ పేదరికాన్ని పారదోలేందుకు, దేశం స్వయం సమృద్ధం సాధించేందుకు, స్వదేశీ భావనను పెంచేందుకు ఖాదీని ఆయుధంగా వాడుకున్నారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచి్చన ప్రోత్సాహంతో దేశంలో లక్షలాదిమంది నేతగాళ్ల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని, అదేసమయంలో ఆయన ఆధ్వర్యంలో ఉద్యమం బలోపేతమైందని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ మర్చిపోయిన ఖాదీకి తిరిగి వైభవం సాధించేందుకు గుజరాత్కు సీఎంగా ఉన్న సమయం నుంచే నరేంద్ర మోదీ కృషి మొదలైందన్నారు. ఫలితంగా 2014–15లో రూ.33 వేల కోట్లుగా ఉన్న ఖాదీ, గ్రామ పరిశ్రమ కమిషన్ (కేవీఐసీ)ల టర్నోవర్ నేడు రూ.1.70 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. 11 ఏళ్లలో 70 శాతం పురోగతి డైరీ రంగం గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ పాలనలో 70 శాతం మేర పురోగతి సాధించిందని అమిత్ షా వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా నిలిచిందని చెప్పారు. పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 6.60 కోట్ల లీటర్ల నుంచి 2028–29 నాటి 10 కోట్ల లీటర్లకు పెంచాలని ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా, 2029 కల్లా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలోనూ సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాదిలోనే 33 వేల సహకార సంఘాలు కొత్తగా నమోదయ్యాయని తెలిపారు. -
నేడు బిహార్కు సీఈసీ బృందం
న్యూఢిల్లీ: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు శనివారం పట్నాకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తారు. 243 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. అక్టోబర్ నెలాఖరులో పోలింగ్ ప్రారంభమై వచ్చే నెలలో పలు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులోభాగంగా ఈసీ రాజకీయ పారీ్టల ప్రతినిధులు, పాలనా సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా చట్టాలు, నియమాలతో పూర్తి అవగాహనతో ఉండి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ సమాయత్తం చేస్తుంది. కేంద్ర పరిశీలకులు బరిలో నిలిచే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా నిర్ధారించుకుంటారు. రాజకీయ పారీ్టలు, అభ్యర్థులు, ఓటర్ల సమస్యలను తీర్చేందుకు పరిశీలకులు అందుబాటులో ఉండాల ని చెప్పారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొ చ్చిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసేందుకు పరిశీలకులు పోలింగ్ బూత్ల ను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. గత సెపె్టంబర్ 30న ప్రచురితమైన ఓటర్ల తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. -
ఉత్తమ లక్షణాలతో.. దీర్ఘాయుష్మాన్భవ!
మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు మంచివారు అనిపించుకోవడమే కాదు.. దీర్ఘాయుష్మంతులు అని పిలిపించుకునే అదృష్టం కూడా దక్కుతుందట. చురుగ్గా ఉండటం, నలుగురికీ సాయపడే మనస్తత్వం, సమయపాలన, ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం, కష్టపడే వ్యక్తిత్వం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకునేవారు..ఈ లక్షణాలు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం, అసంతృప్తిగా ఉండటం వల్ల జీవితకాలం తగ్గిపోతుందట.ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవి..మంచి పోషకాహారం, వ్యాయామాలే. ఇవే దీర్ఘాయుష్షుకు చిట్కాలు అనుకుంటాం. కానీ, కొన్ని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయని, మరణ భయాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరపకురా చెడేవు.మంచి లక్షణాలతో..సాధారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటి ఆధారంగా వ్యాధులు లేదా రోగాలను అంచనా వేస్తారు. వ్యక్తుల ఆలోచనల తీరు, అనుభూతి చెందుతున్న విధానం, వారి ప్రవ ర్తన వంటివి.. భవిష్యత్తులో రాబోయే రోగా లు లేదా వ్యాధులను అంచనా వేయడానికి వైద్యులు సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని ప్రముఖ మనస్తత్వవేత్త రెనే మోటస్ తెలిపారు. మనుషులు తమ వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ కాలం బతికేందుకు అవకా శం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తు న్నాయని ఆయన అన్నారు. ఈ నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలకు, మరణానికి సంబంధం ఉందని వెల్లడించారు. ‘ఆందోళన, నిరాశ, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను తరచుగా, తీవ్రంగా అనుభవించే ధోరణిని కలిగి ఉండడ మే న్యూరోటిసిజం. ఈ లక్షణాలను మార్చడం కష్టం. దీనికంటే వ్యక్తిత్వ లక్షణాలు మార్చడం సులభం. తద్వారా న్యూరోటిసిజం కూడా నయమవుతుంది’ అని ఆయన అన్నారు.అవి వద్దు.. ఇవి ముద్దుఆందోళనకర మానసిక స్థితి, ప్రశాంతత లేనివారి ఆయుష్షు రోజురోజుకీ క్షీణి స్తుంటుంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు, ధూమపానం చేసేవా రికి సైతం ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితో పోలిస్తే మనస్సాక్షి ని నమ్మి, దానికి అనుగుణంగా పనిచేసేవారిలో.. మెరుగైన ఆరోగ్య నిర్వహణ, అధిక స్వీయ–క్రమశిక్షణ, బాధ్యత, ఉల్లాసభరితమైన జీవితం వంటి ఆరోగ్యకర మైన అలవాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. విశాల దృక్పథం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, ఎప్పుడూ ఉల్లాసంగా, చురుగ్గా ఉండటం వంటి లక్షణాలు జీవితకాలాన్ని పెంచుతాయని పేర్కొంది.వ్యక్తిత్వమూ కీలకమే‘ఆయుష్షు విషయంలో వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనలో తేలింది. కానీ వైద్యరంగం, ప్రపంచం.. ఆరోగ్యం విషయంలో దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని ఐర్లాండ్లోని లిమెరిక్ విశ్వవిద్యాలయంలో మన స్తత్వశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, నివేదిక సహ రచయిత పారిక్ ఓ సూలివా¯Œ వ్యాఖ్యానించారు. ‘సమయపాలన పాటించేవారు, ఏ పనినైనా పద్ధతిగా చేసేవారు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. సమయాన్ని అనవసర విషయాలకు వ్యర్థం చేయడం వీరికి నచ్చదు. అందువల్ల ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ వీరు మిగతావారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు మిగతావారికంటే ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని అన్నారు.28 ఏళ్లపాటు అధ్యయనం⇒ పరిశోధనలో 22,000 మంది పాలుపంచుకున్నారు. 6 నుంచి 28 ఏళ్లపాటు వీరిపై అధ్యయనం చేశారు. వ్యక్తిత్వ లక్షణాలను మరణానికి అనుసంధానించిన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించి వీరి మరణ కాలాలను అంచనా వేశారు.⇒ మనస్సాక్షికి విలువ ఇచ్చి, అందుకు అనుగుణమైన విశి ష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు.. ఈ లక్షణాలు లేనివారి తో పోలిస్తే వేగంగా చనిపోయే అవకాశాలు 15శాతం తక్కువ.⇒ సమయపాలన పాటిస్తూ, ఏ పనినైనా ఒక పద్ధతిగా చేసే లక్షణాలున్న వారు.. తొందరగా మరణించే అవకాశం 14 శాతం తక్కువ.⇒ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులూ ఎక్కువ కాలం బతుకుతారు. బాధ్యతారాహిత్యంతో ఉండేవారితో పోలిస్తే వీరు వేగంగా మరణించే అవకాశాలు 12 శాతం తక్కువ.⇒ కష్టపడి పనిచేసే మనస్తత్వం లేదా లక్షణాలు ఉన్నవారిలో మరణ అవకాశాలు 15 శాతం తక్కువ. -
యువశక్తికి రూ.62,000 కోట్ల బూస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యువత విద్య, నైపుణ్యా భివృద్ధి, వ్యవస్థాపకతకు ఊతం ఇచ్చే దిశగా రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పలు యువత– కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. శనివారం ఉద యం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’లో ఆయన పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ) నుంచి ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచిన 46 మందిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు.ఈ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐలు’ (పీఎం–సేతు). కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన దీనికోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ‘హబ్ అండ్ స్పోక్’ నమూనాలో ఆధునీకరించనున్నారు. ఇందులో 200 ఐటీఐలు ‘హబ్’లుగా, 800 ఐటీఐలు ‘స్పోక్’లుగా పనిచేస్తాయి. ప్రతి హబ్కు సగటున నాలుగు స్పోక్లు అనుసంధానమై ఉంటాయి. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాల యాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వృత్తి నైపుణ్య ల్యాబ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు సైతం ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి 12 కీలక రంగాల్లో ప్రత్యక్ష శిక్షణ అందించడమే ఈ ల్యాబ్స్ లక్ష్యం. జాతీయ విద్యా విధానం–2020కి అనుగు ణంగా 1,200 మంది వృత్తి విద్యా ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు. బిహార్కు సంబంధించిన పలు పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. -
భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే.. బుల్డోజర్ పాలన కాదు
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే తప్ప, బుల్డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో ‘చట్ట పాలన’పరిణతి చెందుతూ వస్తోందన్నారు. చట్ట పాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, నైతిక చట్టం ఇది విభిన్న, సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్రమని ఆయన అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను కూల్చడం చట్ట పరమైన ప్రక్రియలను మరుగు పర్చడం, నియమాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ యూపీ ప్రభుత్వంపై కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ పేర్కొనడం తెల్సిందే. వివిధ కేసుల్లో చారిత్రక తీర్పులను ఈ ప్రసంగం సందర్భంగా జస్టిస్ గవాయ్ ఉదహరించారు. ‘రూల్ ఆఫ్ లా ఇన్ ది లార్జెస్ట్ డెమోక్రసీ’అంశంపై మారిషస్లో జరిగిన వార్షిక సర్ మౌరిస్ రౌల్ట్ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మారిషస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా 1978–82 సంవత్సరాల్లో జస్టిస్ రౌల్ట్ పనిచేశారు. -
రష్యా నుంచి అదనంగా ఎస్–400 సిస్టమ్స్
న్యూఢిల్లీ: రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ కీలకపాత్ర పోషించాయి. వీటి పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది డిసెంబర్లో భారత్లో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఎస్–400ల కొనుగోలు గురించి పుతిన్తో మోదీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు ఎస్–400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. ఇందులో మూడు ఎస్–400లను భారత్కు రష్యా అప్పగించింది. మిగిలిన రెండు త్వరలో రానున్నాయి. ఇవి కాకుండా అదనపు వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధమైంది. -
13 పాక్ జెట్లు కూల్చేశాం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్తో ప్రత్యర్థి దేశం పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలిందని, భారీగా నష్టపోయిందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 12 నుంచి 13 ఫైటర్ జెట్లు కూల్చివేశామని, ఇందులో అమెరికాలో తయారైన ఎఫ్–16 యుద్ధ విమానాలు, చైనాలో తయారైన జేఎఫ్–17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారత యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చివేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ ‘మనోహరమైన కథలు’ అంటూ కొట్టిపారేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్లకుపైగా చొచ్చుకెళ్లి మరీ దాడి చేశామని, మన వైమానిక దళం ఇప్పటిదాకా సాధించిన వాటిలో ఇది ‘లాంగెస్ట్ కిల్’ అని పేర్కొన్నారు. దూరంగా ఉన్న శత్రువును దెబ్బకొట్టామని, ఇది ఈ సంవత్సరానికే ‘హైలైట్’ అని అభివరి్ణంచారు. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు వాటిల్లిన నష్టంపై భారత వైమానిక దళం అధినేత స్పష్టమైన వివరాలు బయటపెట్టడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలంలో కొన్ని, భూభాగంపై మరికొన్ని ఫైటర్జెట్లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. వీటిలో ఎఫ్–16లు, జేఎఫ్–17లతోపాటు ఒక నిఘా విమానం కూడా ఉందని వెల్లడించారు. పాక్ రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లపై అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు చేశామన్నారు. నాలుగు ప్రాంతాల్లో పాక్ రాడార్లు, రెండుచోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, మూడు హ్యాంగర్లు, రెండు రన్వేలు, ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ధ్యంసమయ్యాయని వివరించారు. మే 10వ తేదీన పాకిస్తాన్కు ఊహించని నష్టం జరిగిందన్నారు. దాంతో దిక్కుతోచని పాక్ సైన్యం కాల్పుల విరమణ కోసం భారత్ను వేడుకుందని పేర్కొన్నారు. కాల్పులు తక్షణమే ఆపాలంటూ మనల్ని అభ్యరి్థంచే స్థాయికి పాకిస్తాన్ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెషబాజ్ షరీఫ్ కొన్నిరోజుల క్రితం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్కు చెందిన ఏడు యుద్ధ విమానాలు కూల్చివేశామని చెప్పుకొచ్చారు. కానీ, దానిపై ఎలాంటి సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేకపోయారు. దీనిపై అమర్ప్రీత్ సింగ్ స్పందించారు. 15 భారత యుద్ధ విమానాలు కూల్చామని కూడా పాక్ చెప్పుకోవచ్చని.. వారు అలాగే భావిస్తూ సంతోషపడనివ్వండి అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘సుదర్శన్ చక్ర’తో పటిష్ట రక్షణ ఆపరేషన్ సిందూర్తో మన వైమానిక దళం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచి్చందని అమర్ప్రీత్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ‘సుదర్శన్ చక్ర’ పేరిట శత్రుదుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 2035 నాటికి ఈ నూతన భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ‘సుదర్శన్ చక్ర’ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని వివరించారు. దీనితో మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు పటిష్టమైన రక్షణ లభిస్తుందన్నారు. మరోసారి భారత్వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ను హెచ్చరించారు. -
ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఆన్లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ రంగాన్ని నియంత్రించేందుకు ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్–2025’పేరుతో అత్యంత కఠినమైన నిబంధనలతో ముసాయిదాను విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం, డబ్బుతో పందెం ఆటలను (ఆన్లైన్ మనీ గేమ్స్) నిర్వహించే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనల అమలు కోసం సివిల్ కోర్టు అధికారాలతో ‘ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని అధికారాలతో అథారిటీకొత్తగా ఏర్పాటయ్యే ఆన్లైన్ గేమింగ్ అథారిటీకి విస్తృత అధికారాలు కట్టబెట్టారు. అథారిటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆర్థిక సేవల శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ అథారిటీకి సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి. ఏ గేమ్ను ‘ఆన్లైన్ మనీ గేమ్’గా వర్గీకరించాలనే తుది నిర్ణయం అథారిటీకే ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రిజి్రస్టేషన్లను రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడంతో పాటు, చట్టవిరుద్ధమైన వేదికలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఇతర సరీ్వస్ ప్రొవైడర్లను ఆదేశించగలదు. భారీ జరిమానాలు, కఠిన శిక్షలుముసాయిదాలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ నిర్వహిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అథారిటీ ఆదేశాలను పాటించకపోవడం వంటి ఇతర ఉల్లంఘనలకు మూడేళ్ల వరకు జైలు, రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. ఈ–స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్లను అందించే ప్రతి సంస్థ తప్పనిసరిగా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలి. ఈ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్ ఐదేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన మూడంచెల యంత్రాంగాన్ని ప్రతిపాదించారు. మొదటిది గేమింగ్ కంపెనీ గ్రీవెన్స్ ఆఫీసర్, రెండోది స్వీయ–నియంత్రణ సంస్థ, మూడోది ప్రభుత్వం ఏర్పాటు చేసే అప్పిలేట్ బాడీ. దీని ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు స్పష్టమైన, సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ–స్పోర్ట్స్ను క్రీడల శాఖ, ఆన్లైన్ సోషల్ గేమ్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంటాయి. -
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్ వద్దు!
న్యూఢిల్లీ: రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఈ మేరకు శుక్రవారం స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది. ‘పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పనిలేకుండానే చాలావరకు తగ్గిపోతాయి. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చు’అని అది పేర్కొంది. అదే సమయంలో, సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు, ఆస్ప త్రులకు సూచించింది. ప్రభుత్వ వైద్యసంస్థలతో ్చపాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ అడ్వైజరీని పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.సిరప్లలో కల్తీ సత్యదూరందగ్గు మందు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9కి చేరిందని డీజీహెచ్ఎస్ తెలిపింది. అదేవిధంగా, పొరుగు నున్న రాజస్తాన్లో సికార్లో సంభవించిన ఓ మరణం దగ్గు మందు తాగడంతో అవయవాలు ఫెయిలై సంభవించినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన 9 మంది చిన్నారుల్లో కనీసం ఐదుగురు కోల్డ్రెఫ్, ఒకరు నెక్స్ట్రో సిరప్ తాగినట్లు తేల్చారు. వైరల్ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కేసులను తీసుకోవద్దని, గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని కోరింది. అదేవిధంగా, డెక్స్ట్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్లతో తీవ్ర అనారోగ్యం బారినపడుతున్న ఘటనల నేపథ్యంలో రాజస్తాన్లో ఈ సిరప్ వాడినట్లుగా గుర్తించిన 1,420 చిన్నారులను పరిశీలనలో ఉంచామంది. అయితే, చిన్నారుల మరణాలకు దగ్గు మందు కల్తీయే కారణమన్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కిడ్నీలు ఫెయిలయ్యేందుకు అవకాశమున్న డైఇథలీన్ గ్లైకాల్(డీఈజీ) లేదా ఇథిలీన్ గ్లైకాల్(ఈజీ) రసాయనాలు ఈ దగ్గు సిరప్లలో లేవని శాంపిళ్ల పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది. సిరప్లలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు నిరాధారాలంటూ కొట్టిపారేసింది. ప్రజలకు సూచనలుచిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి.OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.ఇదీ చదవండి: అమెరికా-పాక్లు! నాకు నువ్వు.. నీకు నేను! -
దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డ్: ఆరు నెలల్లో..
దక్షిణ మధ్య రైల్వే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10143 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సుమారు 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి.. దీని ద్వారా రూ.6635 కోట్ల ఆదాయాన్ని పొందింది. ప్రయాణీకుల ద్వారా రూ.2991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సరుకు రవాణా, ప్రయాణీకుల విభాగాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. జోన్ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10143 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2024 - 25లో నమోదైన మునుపటి అత్యుత్తమ ఆదాయమైన రూ. 9966 కోట్ల కంటే 1.7 శాతం ఎక్కువ. ఈ కాలంలో రూ.2991 కోట్ల ప్రయాణీకుల ఆదాయం, రూ.6635 కోట్ల సరుకు రవాణా ఆదాయం దీనికి దోహదపడింది. అదేవిధంగా జోన్ మునుపెన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 71.14 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ను సాధించింది. ఇది 2024-25లో లోడ్ చేసిన 67 మిలియన్ టన్నుల మునుపటి ఉత్తమ సరుకు రవాణా లోడింగ్ కంటే 6 శాతం ఎక్కువ.దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషి, అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పని తీరును సాధించగలిగింది. జోన్లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, సరుకు రవాణా విభాగంలో నూతన పంథాలను ప్రవేశపెడుతున్నారు. ఈ దిశలో నిరంతర ప్రయత్నం ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో జోన్ 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా వస్తువులను రవాణా చేయడం ద్వారా అత్యుత్తమ సరుకు రవాణాను నమోదు చేసింది. ఇదే కాలంలో గత సంవత్సరంలోని సరుకు రవాణా కంటే ఇది 4.13 మిలియన్ టన్నులు ఎక్కువ (67 మిలియన్ టన్నులు ). ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ మొదలైన వస్తువుల లోడింగ్ పెరగడం వల్ల సరుకు రవాణాలో మెరుగుదల ప్రధానంగా ఉంది.అదే సమయంలో, వీలైనంత వరకు అవసరమైన చోట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి, నడపడానికి జోన్ ప్రయాణీకుల రవాణా ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్రవేశపెట్టిన రైళ్లు మంచి ఆదరణతో నడుస్తున్నాయి. అదనంగా, డిమాండ్, సాధ్యాసాధ్యాలు ఉన్న చోట జోన్ అదనపు కోచ్లతో రైళ్లను నడుపుతోంది, ప్రత్యేక రైళ్ల నిర్వహణకు అదనంగా దీని వలన వెయిట్లిస్ట్ లోనున్న ప్రయాణీకులకు ఉపయోగపడుతోంది. ప్రయాణీకుల ఆదాయం పరంగా, ఈ కాలంలో జోన్ రూ. 2991 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత సంవత్సరం గడించిన రూ. 2909 కోట్ల కంటే 2.8 శాతం అధికం.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అద్భుతమైన ఆదాయాలను సాధించినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు మరియు ప్రధాన కార్యాలయాల సిబ్బంది మరియు అధికారులు ఇదే స్పూర్తితో ఒకే వేగాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్ప్రెస్) రన్ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్లోని అనేక చోట్ల రైల్వే అండర్పాస్, ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సిందూర్ 2.0
జైపూర్: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్కు వ్యతిరేకంగా ఇప్పటిదాకా సాగించిన ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపాలని, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తేల్చిచెప్పారు. భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తే పాకిస్తాన్ అనే దేశం ఇకపై చరిత్రలో మాత్రమే మిగిలిపోతుందని స్పష్టంచేశారు. తమను మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభిస్తామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనం, సంయమనాన్ని ఈసారి చూపించబోమని పేర్కొన్నారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం రాజస్తాన్లోని అనూప్గఢ్లో ఆర్మీ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో స్థానాన్ని, భౌగోళిక ఉనికిని కాపాడుకోవాలా? వద్దా? అనేది పాకిస్తాన్ చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని పాకిస్తాన్కు తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే ప్రమాదంలో పడుతుందన్నారు. ఈసారి బలంగా దెబ్బకొడతామని అన్నారు. త్వరలో మరో అవకాశం రావొచ్చు ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే దీటుగా తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని భారత సైనిక దళాలకు జనరల్ ఉపేంద్ర ద్వివేది సూచించారు. ‘మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి త్వరలో మరో అవకాశం రావొచ్చు. అందుకే ఇప్పటినుంచే పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్పై మరోసారి దాడికి దిగితే ఆపరేషన్ సిందూర్ వెంటనే ప్రారంభమవుతుందని పాకిస్తాన్ను ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ ఏడాది మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, ఎయిర్బేస్లపై నాలుగు రోజులపాటు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి:ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్ -
కరూర్ తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం..‘విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు’
సాక్షి,చెన్నై: సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్పై కోర్టు విమర్శలు గుప్పించింది. శుక్రవారం (సెప్టెంబర్ 03) కరూర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ‘విజయ్ మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయేవారు కాదు.‘41 మంది చనిపోతే కోర్టు కళ్లు మూసుకోదు. ఈవెంట్ నిర్వాహకులపై సానుభూతి ఎందుకు చూపించాలి?’అని ప్రశ్నించింది. బాధితుల పట్ల కనీస పచ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని విజయ్ మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ ఐజీ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించింది.ఈ సందర్భంగా టీవీకే నేతలందరూ ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లారు?. బాధితులను ఎందుకు పట్టించుకోలేదు?. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? అని మండిపడింది. అనంతరం, టీవీకే నేతల ముందస్తు బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని టీవీకే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
విషాదం: తల్లీ కూతుళ్ల అనుమానాస్పద మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల క్వార్టర్స్లో జరిగింది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న శ్రుతి(38) తన కూతురు పూర్విక(12)ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శృతి భర్త రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి రాగా, తలుపు లోపల గడియ పెట్టి ఉంది.దీంతో అతను పొరుగువారి సాయంతో తలుపును పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆరో తరగతి చదువుతున్న కూతురు పూర్విక తలకు గాయాలతో పడి ఉంది. పూర్విక మృతదేహం పక్కనే శృతి ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శృతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
భారత రక్షణ రంగంలో సరికొత్త పాఠాలు
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు మరో కీలక అడుగు పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ సంఘం (SIDM) సంయుక్తంగా డిఫెన్స్ టెక్నాలజీలో మైనర్ డిగ్రీ కోసం మోడల్ కరికులమ్ను విడుదల చేశాయి. ఈ కొత్త విద్యా కార్యక్రమం ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు విమానయాన, నావికా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, అధునాతన పదార్థాలు వంటి రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి నేతృత్వంలో ఈ కరికులమ్ తయారైంది. ఈ కరికులమ్ ప్రకారం.. ఉన్నత రక్షణ సాంకేతికతలపై ప్రత్యేక మాడ్యూల్స్, అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. తద్వారా విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు
ప్రపంచంలోనే చైనాను వెనక్కినెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. 2023 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా చైనాను అధిగమించినట్లు కొన్ని నివేదికలు ధ్రువీకరించాయి. ఈ పరిణామం భారతదేశానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని సృష్టిస్తుంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధికి భారంగా కనిపించినప్పటికీ సరైన వ్యూహాలతో వ్యవహరిస్తే దేశ ఆర్థిక వృద్ధికి, వస్తు వినియోగానికి (Consumption), వాణిజ్య విస్తరణకు అనుకూలంగా దీన్ని మలచుకోవచ్చు.భారతదేశంలోని దాదాపు 145 కోట్ల జనాభాలో అధిక శాతం యువ జనాభా (సుమారు 47% మంది 25 ఏళ్ల లోపు వారు) ఉండటం దేశానికి అతిపెద్ద బలం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత వినియోగదారుల మార్కెట్ (Domestic Consumer Market)ను అందిస్తుంది. అనేక అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాల కోసం ఇప్పటికే భారత్పై ఆధారపడుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో వస్తువులకు డిమాండ్ నిరంతరాయంగా ఉంటుంది. ఈ భారీ డిమాండ్ అంతర్జాతీయ వాణిజ్యపరమైన ఆటుపోట్లను తట్టుకోవడానికి దేశానికి ఒక స్థిరమైన ఆధారాన్ని ఇస్తుంది.జనాభా అధికంగా ఉన్న మరో దేశం చైనా ప్రారంభంలో తయారీ రంగంపై దృష్టి సారించి ప్రపంచ మార్కెట్ను ఆకర్షించింది. అయితే భారత్ మాత్రం మొదట్లో సేవల రంగం (Services Sector)పై ఆసక్తి చూపింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ-బీపీఎం రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సేవల రంగం వాటా 55% కంటే ఎక్కువగా ఉంది. ఈ సేవల రంగం సాధించిన ప్రగతిని ఇప్పుడు తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధికి అనుసంధానించడం తక్షణావసరంగా తోస్తుంది.తయారీ రంగం బలోపేతానికి చర్యలుఅధిక జనాభాను వస్తు వినియోగానికి తోడ్పడేలా, దీని ద్వారా వాణిజ్య పరంగా దేశం అభివృద్ధి చెందేందుకు భారతదేశం వ్యూహాత్మక చర్యలను చేపట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’పై పెట్టుబడులు పెంచాలి. అంతర్గత మార్కెట్తో పాటు, చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలి. దీనికి ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (Production Linked Incentive - PLI Schemes)’ను మరింత విస్తృతం చేయాలి.గ్లోబల్ సరఫరా చెయిన్లో (Global Supply Chain) వైవిధ్యం కోరుకునే ప్రపంచ కంపెనీలను ఆకర్షించేలా స్థిరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి అధిక విలువ కలిగిన రంగాలపై దృష్టి సారించాలి.భారత్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ స్థాయి నాణ్యత (Global Quality Standards) కలిగి ఉండేలా కఠినమైన ప్రమాణాలను అమలు చేయాలి.వినియోగం నుంచి ఉత్పత్తి వైపు..భారతదేశంలోని అధిక జనాభా కేవలం వినియోగదారులుగా కాకుండా, అత్యంత సమర్థవంతమైన ఉత్పాదక శక్తి (Productive Force)గా మారాలి. తయారీ రంగం అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం, సాంకేతిక విద్య (Vocational Training)పై ఎక్కువ పెట్టుబడి పెట్టడం అవసరం. యువ జనాభా వరం కావాలంటే, వారికి ఉపాధి కల్పన (Employment Generation) జరగాలి. తక్కువ రవాణా ఖర్చులు, వేగవంతమైన వస్తు రవాణా కోసం మెరుగైన రోడ్లు, పోర్టులు, లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇది తయారీ రంగ ఖర్చులను తగ్గించి గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేందుకు వీలు కల్పిస్తుంది.వాణిజ్యపరమైన సవాళ్లను ఎదుర్కోవడంయూఎస్ వంటి దేశాలు భారత్పై సుంకాలు విధించినప్పటికీ అధిక జనాభా ఉన్న చైనాపై ఆ చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో భారత్ ఎదుర్కొంటున్న సంక్లిష్టతను సూచిస్తుంది. ప్రపంచ ఆర్థిక శక్తులతో (యూఎస్, యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (Free Trade Agreements - FTAs) చర్చించి వాణిజ్య అవరోధాలను తగ్గించుకోవాలి. ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న ‘చైనా ప్లస్ వన్’ వ్యూహాన్ని భారత్ అనుకూలంగా మలచుకోవాలి. రాజకీయంగా స్థిరమైన, ఆర్థికంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారత్ తనను తాను నిరూపించుకోవాలి.గ్రామీణ వినియోగాన్ని పెంచడంభారతదేశ జనాభాలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. గ్రామీణ ఆదాయం పెరిగితే, అంతర్గత వస్తు వినియోగం అమాంతం పెరుగుతుంది. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ డిమాండ్ ఊపందుకునేలా చేయాలి. ఇది తయారీ రంగ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ను అందిస్తుంది.భారతదేశానికి అధిక జనాభా అనేది ఒక భారీ సామర్థ్యం ఉన్న వనరుగా గుర్తుంచుకోవాలి. ఈ జనాభా శక్తిని కేవలం వినియోగంగానే కాకుండా ఉత్పాదకత, వాణిజ్య శక్తిగా మార్చగలగాలి. తయారీ రంగంపై దృష్టి సారించి, యువతకు సరైన నైపుణ్యాలు అందించి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. చైనా తయారీ రంగాన్ని ఎంచుకున్నట్లుగా భారత్ కూడా తన సేవల రంగాన్ని బలంగా ఉంచుతూనే తయారీ రంగానికి కొత్త ఊపిరి పోయడం ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధి సాధిస్తుంది.ఇదీ చదవండి: టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే.. -
ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఐఏఎఫ్ చీఫ్
ఢిల్లీ: చర్రితలో నిలిచిపోయేలా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని ఎయిర్ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. 300 కి.మీ దూరంలోని లక్ష్యాలు ఛేదించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్పై ఆసక్తికర విషయాలు బయపెట్టిన ఐఏఎఫ్ చీఫ్.. భారత యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్న పాకిస్తాన్ ఆర్మీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చరిత్రాత్మకమని.. ఆపరేషన్ సిందూర్ భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.‘‘ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్ను చావు దెబ్బ తీశాం. పాకిస్తాన్కు చెందిన 5 పైటర్ జెట్స్ను ధ్వంసం చేశాం. దెబ్బతిన్న పాక్ ఫైటర్ జెట్స్లో ఎఫ్-16 ఉన్నాయి. మన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ గేమ్ ఛేంజర్లే. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాక్కు చెందిన అవాక్ విమానాన్ని ధ్వంసం చేశాం...మే 10న యుద్ధ విరామానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కాదు.. పాకిస్తానే భారత్ను శాంతికి అభ్యర్థించిందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్, ఆ దేశ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది’ అని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు. -
కరూర్ ఘటన: విజయ్ టీవీకేపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు. అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. -
లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే..
లద్ధాఖ్లో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి లద్ధాఖ్ను వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా (Union Territory - UT) ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు, ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలోని అసంతృప్తి తీవ్రతను సూచిస్తున్నాయి.ఇటీవల పరిణామాలులద్ధాఖ్లోని లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) వంటి పౌర సమాజ సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నాయకత్వంలో కూడా నిరసనలు ఉధృతమయ్యాయి.నిరసనలకు కారణాలేమిటి?లద్ధాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth Schedule) కింద రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు మరణించారు. ఆందోళనకారులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు (సోనమ్ వాంగ్చుక్ వంటి వారిని అరెస్ట్ చేయడం వంటివి) లద్ధాఖ్లో ఉద్రిక్తతను పెంచాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత శాసనసభ (Legislature) లేకపోవడం, స్థానిక పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ (LG) ఆధ్వర్యంలోని అధికారుల నియంత్రణ పెరగడం పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.రాజ్యాంగ రక్షణ లేదనే వాదనలులద్ధాఖ్ జనాభాలో 97% పైగా గిరిజనులే (Tribal Population). ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇక్కడ భూమిని కొనుగోలు చేస్తారనే భయం స్థానికుల్లో ఉంది. లద్ధాఖ్ను ఆరో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది వారికి భూమి వినియోగం, వనరుల నిర్వహణ, సాంప్రదాయ చట్టాలపై నియంత్రణను ఇచ్చేందుకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కు (Autonomous District Councils - ADCs) అధికారం కల్పిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించవచ్చు.ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా సోలార్ పార్కులు, సొరంగాల నిర్మాణం (tunnels), విస్తృతమైన రహదారులు వంటి పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల లద్ధాఖ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు, మంచు పర్వతాలకు నష్టం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.శాసనసభ లేకపోవడం వల్ల స్థానిక రాజకీయ శక్తి తగ్గిపోయిందని, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, చట్టాలను రూపొందించుకోవడానికి రాష్ట్ర హోదా అవసరమని డిమాండ్ చేస్తున్నారు.యువతలో నిరుద్యోగం (Unemployment) అధికంగా ఉంది. స్థానిక ఉద్యోగాల్లో డొమిసైల్ (Domicile) ఆధారంగా పూర్తిస్థాయి రక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన నియామక విధానాలు రూపొందించకపోవడం అసంతృప్తికి దారితీసింది.కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత లేహ్, కార్గిల్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ (LAHDCs) అధికారాలు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారులు స్థానిక పాలనలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఎలాంటి చర్యలు చేపట్టాలి?లద్ధాఖ్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడానికి కేంద్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని కొందరు భావిస్తున్నారు.ఆరో షెడ్యూల్ అమలులద్ధాఖ్ డిమాండ్ చేసిన విధంగా ఆరో షెడ్యూల్ను అమలు చేయడం లేదా దానికి సమానమైన ప్రత్యేక రాజ్యాంగ రక్షణను (ఉదాహరణకు, ఆర్టికల్ 371 తరహాలో) రూపొందించడం. ఇది భూమి, వనరులు, సాంస్కృతిక అంశాలపై స్థానిక కౌన్సిల్స్కు చట్టబద్ధమైన అధికారాన్నిస్తుంది. రాష్ట్ర హోదా డిమాండ్పై పారదర్శకమైన చర్చలు ప్రారంభించాలని కొందరు చెబుతున్నారు.స్థానిక సాధికారతఅటానమస్ హిల్ కౌన్సిల్స్కు శాసనపరమైన, ఆర్థికపరమైన అధికారాలను పెంచాలి. తద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరిగి అభివృద్ధి నిర్ణయాలు వారి అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. స్థానికుల కోసం ఉద్యోగాలను రిజర్వ్ చేయడంతోపాటు, లద్ధాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి.సుస్థిర అభివృద్ధిభారీ ప్రాజెక్టులను చేపట్టే ముందు పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment)ను పారదర్శకంగా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలి. పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగంలో పరిమితులను విధించడం, స్థానికులను ప్రోత్సహించే పర్యావరణ పర్యాటక (Ecotourism) విధానాలను అమలు చేయాలి.వాణిజ్యం పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి?రంగంవాణిజ్య అవకాశాలుపర్యాటకంసాహస పర్యాటకంలో భాగంగా ట్రెక్కింగ్, పర్వతారోహణ కీలకంగా ఉంది. బౌద్ధ ఆశ్రమాలు, సాంప్రదాయ ఉత్సవాలు ఉన్నాయి. దాంతో పర్యావరణ అనుకూల గెస్ట్హౌజ్లు వ్యాపారం సాగుతోంది.పునరుత్పాదక శక్తిలద్దాఖ్లో అధిక సూర్యరశ్మి ఉంటుంది. కాబట్టి భారీ సోలార్ పార్కులు, సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమలకు అపారమైన అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పవన విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది.వ్యవసాయం, ఉద్యానవనంపండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు (జామ్లు, జ్యూస్లు, నూనెలు)కు అవకాశం. బెర్రీల ప్రాసెసింగ్ ద్వారా జ్యూస్లు, నూనెలు తయారు చేయడం.చేనేత, హస్తకళలుప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యమైన పష్మినా ఉన్ని లద్దాఖ్ నుంచి లభిస్తుంది. పష్మినా ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతికి అవకాశం. బుద్ధ విగ్రహాలు, థాంకా పెయింటింగ్లు వంటి సాంప్రదాయ హస్తకళల మార్కెటింగ్ ప్రధానంగా ఉంది. చివరగా..లద్ధాఖ్ సమస్యల పరిష్కారం కేవలం పాలనాపరమైన చర్యలతోనే సాధ్యం కాదు. స్థానిక ప్రజల అభీష్టాన్ని గౌరవించి, వారి ప్రత్యేక సంస్కృతిని, సున్నితమైన పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుస్థిర అభివృద్ధి నమూనాను (Sustainable Development Model) రూపొందించడం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి, పురోగతి సాధ్యమవుతాయి.ఇదీ చదవండి: అప్పు చేసి పప్పుకూడు! -
పాము కడుపులో ప్లాస్టిక్ బాటిల్.. ఎలా బయటకు వచ్చిందో చూశారా?
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. 2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే.. చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్ను తొలగించింది. అది ఒక సన్స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ! -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్, గవర్నర్, త్రిషా సహా..
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Tamil Nadu CM MK Stalin and TN Governor gets bomb threat.@PramodMadhav6 with more details.#TamilNadu #FirstUp | @AishPaliwal pic.twitter.com/526VQAqbIT— IndiaToday (@IndiaToday) October 3, 2025 -
జుబీన్ గార్గ్ సతీమణి సంచలన ఆరోపణలు.. మరో ఇద్దరు అరెస్ట్
ఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తు మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ సతీమణి గరిమా సైకియా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. లైఫ్ జాకెట్ లేకుండా తన భర్తను నీటిలోకి ఎందుకు దింపారని ప్రశ్నించారు. అతను నీరసంగా ఉన్న సమయంలో నీటి వద్దకు ఎందుకు తీసుకెళ్లారని పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. జుబీన్ కేసులో మరో ఇద్దరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. జుబీన్ సతీమణి గరిమా తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జుబీన్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను బట్టి ఆరోజు ఆయన చాలా అలసిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. జుబీన్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందకు పలుమార్లు మూర్ఛ కూడా వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. వైద్యులు అతన్ని నీటి దగ్గరకు వెళ్లవద్దని సూచించారు. అతన్ని ఎప్పుడూ డ్రైవ్ చేయడానికి కూడా అనుమతించలేదు. అయినప్పటికీ, అతన్ని బోటులో జరుగుతున్న పార్టీకి ఎందుకు తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టడానికి ఎలా అనుమతించారు. ఎవరూ అతన్ని ఎందుకు సరిగ్గా చూసుకోలేదు?. వైద్య సహాయం లేదా భద్రతా సహాయం ఎందుకు లేదు? అతను నా భర్త మాత్రమే కాదు. అస్సాం హృదయ స్పందన. ఆయన విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం క్షమించరానిది. జుబీన్తో నేను చివరిసారిగా సెప్టెంబర్ 18న మాట్లాడాను. బోటులో పార్టీ గురించి ఆయన నాతో ఏమీ చెప్పలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.Zubeen was not just my husband—he was a legendary artist, the heartbeat of millions. He was lovingly called the heartthrob of Assam, and even of North East India: Garima Saikia Garg, Zubeen Garg's wife#ZubeenDaForever #ZubeenGarg #NewsTrack | @MaryaShakil pic.twitter.com/UMfVWryrxV— IndiaToday (@IndiaToday) October 2, 2025మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్టు చేశారు. గార్గ్కు అత్యంత సన్నిహితులైన వీరు ఆయన మరణ సమయంలో సింగపూర్లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకొన్నామని, విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో పేర్కొన్నారు. అంతకు ముందు.. నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. -
ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు. ఇటీవల టియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి. -
వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
రాయ్పూర్: వివిధ కేడర్లకు చెందిన 100కు పైగా మావోయిస్టులు.. పోలీసులకు లొంగిపోయారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు తమకు సరెండర్ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గురువారం( అక్టోబర్ 1వ తేదీ) తాము లొంగిపోతున్నట్లు తెలిపిన మావోయిస్టులు.. పారామిలటరీ అధికారులు, సీనియర్ పోలీసులు సమక్షంలో వీరు లొంగిపోయారు. ఆ మేరకు ఆయేధాలను విడిచిపట్టి సాధారణ సంఘ జీవితంలో కలిసి బ్రతకడానికి సిద్ధమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారే ఉన్నారని, వారు చేపట్టిన ఉద్యమాన్ని వదిలి సంఘ జీవితంలో కలిసే బ్రతుకుతామంటూ లొంగిపోయినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గమ్మను నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవం విషాదంగా మారింది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 నుంచి 25 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025 (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus— Press Trust of India (@PTI_News) October 2, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన ఖండ్వా జిల్లా అర్దాలా గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం చెరువుపై తాత్కాలిక వంతెనపై ఆపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో అందులో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. గురువారం సాయంత్రం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:00 గంటల సమయానికి 11 మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను పంధానా ఆసుపత్రికి తరలించడానికి సంఘటనా స్థలంలో పది అంబులెన్స్లను మోహరించారు. జిల్లా కలెక్టర్ రిషబ్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలను చికిత్స కోసం ఖాండ్వా ఆసుపత్రికి తరలించారు. -
అది భారత్కు అతిపెద్ద ముప్పు.. విదేశీ గడ్డపై రాహుల్
బొగోటా: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలోని భారత్లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్శిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. దీనిలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు. ‘ ప్రజాస్వామ్యం అనేది ప్రతీ ఒక్కరికీ చోటును కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరగుతున్నాయి. భారత దేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థలా ఏకరీతిలో ఉంది. భారత్ వికేంద్రీకృతమై ఉంది. సంస్కృతులు, సంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. చైనా చాలా కేంద్రీకృతమై, ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ వద్ద ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత భారత్ ఒకే లైన్లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి’ అంటూ విమర్శించారు.రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రచార ఆర్భాట నాయకుడే తప్ప ఏమీ లేదంటూ కౌంటరిచ్చింది. విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమే ఇందుకు నిదర్శమనమంటూ ధ్వజమెత్తింది. భారత్లో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ప్రపంచ పటంలో భారత్ గణనీయ అభివృద్ధి రాహుల్కు కనబడటం లేనట్లుంది అంటూ ఎద్దేవా చేసింది. -
‘సర్ క్రీక్ను టచ్ చేస్తే చుక్కలే’.. పాక్కు రాజ్నాథ్ తీవ్ర హెచ్చరిక
భుజ్: నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకస్తాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే, తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు స్పష్టం చేశారు.‘పాక్తో యుద్ధం భారత్ లక్క్ష్యం కాదు’గుజరాత్లోని భుజ్ సమీపంలోగల సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటంపాకిస్తాన్లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, భారత సరిహద్దులను కాపాడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు.సర్ క్రీక్ వివాదం ఏమిటి?ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ మీదుగా భారత్లోకి ప్రవేశించేందుకు విఫల ప్రయత్నం చేసిందని, అయితే ప్రతీకార చర్యలో భాగంగా భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలని రక్షణ మంత్రి అభివర్ణించారు. కాగా సర్ క్రీక్ అనేది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్- పాకిస్తాన్ మధ్య 96 కి.మీ పొడవైన టైడల్ నదీముఖద్వారం. సముద్ర సరిహద్దు రేఖలపై ఇరు దేశాలు వేర్వేరు వివరణలు ఇవ్వడం కారణంగా దీనిని వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తున్నారు. -
కసాయి తల్లిదండ్రులు: అప్పుడే పుట్టిన శిశువుకు అడవిలో నరకం
చింద్వారా: అప్పుడే పుట్టిన ఆ శిశువు దట్టమైన అడవిలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటరిగా విలవిలలాడిపోయింది. భూమిపై పడిన కొద్ది గంటలకే చీమలకు బలయ్యింది. ఇది మధ్యప్రదేశ్లోని చింద్వారాలో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఉదంతం. తల్లిదండ్రులే అత్యంత కర్కశంగా ఆ చిన్నారిని అడవిలో ఒక రాయి పక్కన వదిలివేశారు. ఆ శిశువు రాత్రంతా తీవ్రమైన చలిలో చీమలు, కీటకాల దాడితో తల్లడిల్లిపోయింది. అయితే తెల్లవారుజామున శిశువు ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు శిశువును సజీవంగా కాపాడి, వైద్య సంరక్షణ అందించారు.మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ఉన్న నిబంధనలకు భయపడి ఆ శిశువు తల్లిదండ్రులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బబ్లు దండోలియా తనకు నాల్గవ సంతానం కలిగిన దరిమిలా, ప్రభుత్వ ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. దీంతో తన భార్య రాజకుమారి దండోలియా సాయంతో తమ ముక్కుపచ్చలారని బిడ్డను అడవిలో వదిలేసి వచ్చారు. రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఉపాధిని పరిమితం చేసే ప్రభుత్వ నిబంధన అమలులో ఉంది. దీంతో వారు ఉద్యోగం కోల్పోతామని భయపడి, రాజకుమారి దండోలియా గర్భధారణను రహస్యంగా ఉంచారు. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.సెప్టెంబర్ 23 తెల్లవారుజామున రాజకుమారి తమ ఇంట్లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వెంటనే ఆ దంపతులు ఆ శిశువును అడవికి తీసుకెళ్లి, ఒక రాయి పక్కన వదిలేసి వచ్చారు. మర్నాటి ఉదయం నందన్వాడి గ్రామస్తులు ఆ శిశువు ఆర్తనాదాలను విన్నారు. వెంటనే శిశువును చింద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ నవజాత శిశువు వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కేసును ఛేదించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)సెక్షన్ 93 కింద ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. పోలీసు అధికారిణి కళ్యాణి బర్కడే మాట్లాడుతూ, ఈ ఉదంతంలో తాము సీనియర్ అధికారులను సంప్రదిస్తున్నామని, చట్టపరమైన సమీక్ష తర్వాత హత్యాయత్నంతో సహా మరిన్ని సెక్షన్లను జోడిస్తామని తెలిపారు. -
రేపు భారత్ బంద్ లేదు.. ఏఐఎంపీఎల్బీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అక్టోబర్ మూడున భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అయితే తాజాగా ఈ బంద్ను విరమిస్తున్నట్లు బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఫజ్లుర్ రహీమ్ ముజాద్దిది, ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ పండుగల కారణంగా బంద్ వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.బంద్ విషయమై ఏఐఎంపీఎల్బీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. అక్టోబర్ మూడున పలు ప్రాంతాలలో హిందూ సోదరుల మతపరమైన పండుగలు జరగనున్నందున, తాము బంద్ను వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ప్రతినిధి ఇలియాస్ తెలిపారు. ప్రస్తుతానికి బంద్ విరమించినప్పటికీ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఏఐఎంపీఎల్బీ తెలిపింది.గతంలో ఏఐఎంపీఎల్బీ అక్టోబర్ మూడున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్కు పిలుపునిచ్చింది. ఆ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని కోరింది. అవసరమైన వైద్య సేవలు, ఆసుపత్రులు, ఫార్మసీలకు బంద్ నుండి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బంద్ను వాయిదా వేస్తున్నట్లు ఏఐఎంపీఎల్బీ తాజాగా ప్రకటించింది. బంద్కు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.